Academic Calendar
-
డ్రాప్ అవుట్.. నో చాన్స్!
సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు. -
ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లల్లో తొలిసారి పరీక్షలు
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8, 9 తరగతుల విద్యార్థులు పీరియాడిక్ రాత పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది 1,000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే దాదాపు విద్యా సంవత్సరం పూర్తవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు స్టేట్ బోర్డు పరీక్షలైన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లకే హాజరయ్యారు. కాగా, ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే పీడబ్ల్యూటీ, టర్మ్ పరీక్షలు రాయనున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠశాలల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు 2023–24 నుంచి సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల తరహాలో పీరియాడిక్ పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ జరగనున్నాయి. విషయ పరిజ్ఞానం పెంచేలా.. విద్యా సంవత్సరంలో పీడబ్ల్యూటీలు నాలుగు, టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్–1 నవంబర్లో, టర్మ్–2 (వార్షిక) పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, రెండు భాషా పేపర్లు (మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు) రాయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు నిర్వహించే పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్ థియరీ పరీక్ష ఉంటుంది. 100 మార్కుల టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్ థియరీ) ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ల్యాబ్ టెస్టులు కూడా ఉంటాయి. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా విద్యార్థులతో పోటీపడేలా పరీక్షల్లో విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఇందులో పెన్ పేపర్ టెస్ట్ (5 మార్కులు), మల్టిపుల్ అసెస్మెంట్ (5), ఫోర్ట్పోలియో (5), సబ్జెక్టుపై విద్యార్థికున్న అవగాహనకు 5 మార్కులు మొత్తం 20 మార్కులు కేటాయించారు. భాషా పరీక్షలో వ్యూహాత్మకంగా పరిష్కరించే పజిల్స్, క్లాస్వర్క్, ఇంగ్లిష్ మాట్లాడడం, విని అర్థం చేసుకునే సామర్థ్యంపైన ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 85,353 మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీరికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి సిలబస్ను బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 10వ తరగతిలో ‘స్కిల్’ సబ్జెక్టు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2024–25)లో 10వ తరగతిలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరో సబ్జెక్టుగా ‘స్కిల్ టెస్ట్’ను ప్రవేశపెట్టారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ పరీక్షలో తప్పిన విద్యార్థులు స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుని పాస్ చేస్తారు. ఆరో సబ్జెక్టుగా విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. పదో తరగతి విద్యార్థులు ఈ రెండింటిలో ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. జాగ్రత్త పాటించండి సీబీఎస్ఈ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. వచ్చే మార్చి 31 నాటికి 9వ తరగతి పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి బోధన చేపట్టాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థుల బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల వివరాల నమోదులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పేరు, ఆధార్, తల్లిదండ్రుల వివరాలు పుట్టిన తేదీ ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త వహించాలి. – ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, సీబీఎస్ఈ స్కూల్స్. -
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే
సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు ►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు ►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు ►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు ►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు ►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు ►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే ►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ -
Telanagna: 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. క్యాలెండర్ను పరిశీలిస్తే.. ►ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ►ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు ►వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు ►ప్రైమరీ స్కూల్స్: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు ►ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు ►ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు ►సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు) ►జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు) -
Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్ను రూపొందించారు. ఫౌండేషన్ పాఠశాలల నుంచి హైస్కూల్ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్ క్యాలెండర్లోని లెసన్ ప్లాన్ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది. జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్లో 20/25, అక్టోబర్లో 19, నవంబర్లో 25, డిసెంబర్లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. స్క్లూళ్ల సమయాలివీ.. ఫౌండేషన్ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతులకోసం ఆప్షనల్ పీరియడ్ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు, 6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్ బెల్ ఉంటుంది. సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్ లవ్ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్సు, మాస్ డ్రిల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్, స్కూల్ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు. (క్లిక్: ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి) -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్ను బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది. -
క్యాలెండర్ విడుదల: తెలంగాణలో బడులు ఎన్ని రోజులంటే..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్ విడుదలైంది. విద్యా శాఖ అధికారులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఈయర్ విడుదల చేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినమని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల పని దినాలు 213, 47 రోజులు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని వివరించారు. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ క్యాలెండర్ ఇలా.. FA1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి SA1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 8 డిసెంబర్ వరకు FA2 పరీక్షలు పదో తరగతి జనవరి 31 నుంచి FA2 పరీక్షలు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుంచి SA2 పరీక్షలు 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి18 వరకు పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు మార్చి లేదా ఏప్రిల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు దసరా సెలవులు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 16 వరకు -
ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత (2021–22) విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 188 పనిదినాలు ఉండగా సెలవులు 70 రోజులు ఉన్నాయి. ఇక బేస్లైన్ పరీక్షలతోపాటు ఫార్మేటివ్ (నిర్మాణాత్మక) పరీక్షలు 4, సమ్మేటివ్ (సంగ్రహణాత్మక) పరీక్షలు 2తో పాటు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ స్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ అకడమిక్ క్యాలెండర్ను, పాఠ్యప్రణాళికను ఎస్సీఈఆర్టీ తీర్చిదిద్దింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి సారథ్యంలో వివిధ విభాగాల నిపుణులు 35 మంది దీని రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పాలన ప్రణాళిక, యాజమాన్యాల వారీగా రాష్ట్రంలోని పాఠశాలలు, జిల్లా ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు, ఉపాధ్యాయుల వివరాలను ఈసారి కొత్తగా చేర్చారు. విద్యాహక్కు చట్టం, బాలలహక్కుల చట్టం నియమ నిబంధనలతో పాటు కేంద్రం నూతన విద్యావిధానంలో సూచించిన విధంగా సమ్మిళిత విద్యాంశాలను ఈ విద్యాప్రణాళికలో పొందుపరిచారు. 6 రకాల స్కూళ్ల గురించి.. పాఠశాలల భద్రత, విపత్తు నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమాలు, సమగ్రశిక్ష, వయోజన విద్య, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలు మెరుగుపర్చడం, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, కెరీర్ గైడెన్స్, యూడైస్ చైల్డ్ ఇన్ఫో, దీక్ష వంటి అంశాలను విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలలో అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్తగా రూపొందించిన వివిధ యాప్లు, పాఠ్యప్రణాళికా సంస్కరణలు, గ్రంథాలయాలు, చదవడంపై ఆసక్తి వంటి అంశాలను వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యావిధానంలోని 6 రకాల స్కూళ్లు, నాడు–నేడు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, రంగోత్సవం, కళాఉత్సవ్, ద ఇండియా టాయ్ ఫెయిర్ ఏకభారత్ శ్రేష్ఠభారత్, మాసాంతపు వేడుక, కరోనా కాలంలో, కరోనా అనంతరం విద్యాకార్యక్రమాలు, ఆటల పోటీలు, సైన్సు ఫెయిర్లు, క్విజ్, వక్తృత్వపోటీలు, క్షేత్ర పర్యటనలు, ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలిపారు. 1, 3వ శనివారాలు నోబ్యాగ్ డే ప్రతి స్కూలులో పాఠ్యబోధనతో స్వీయ పఠనం, పర్యవేక్షక పఠనం, పోటీ పరీక్షలకు సన్నద్ధతతోపాటు నీటిగంట, ఆటలు, పునశ్చరణ, సవరణాత్మక బోధన, గ్రంథాలయ కృత్యాలు నిర్వహించేలా ఈ విద్యాప్రణాళికను రూపొందించారు. ఒకటి, 3వ శనివారాలను నోబ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వారానికి ఒకసారి కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల ఐచ్ఛికం ప్రకారం జరగాలని నిర్దేశించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడడంతోపాటు వాటిపై వారికి అవగాహన కలిగించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూళ్లపై మరింత శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషన్ స్కూళ్ల నిర్వహణలో మరింత శ్రద్ధ తీసుకొనేలా విద్యాక్యాలెండర్లో అంశాలను పొందుపరిచారు. దీని ప్రకారం.. ఉదయాన్నే గ్రీట్ అండ్ మీట్ కింద ఉపాధ్యాయుడు పిల్లలకు స్వాగతం చెప్పాలి. ప్రతి పిల్లవాడిని పేరుతో పలకరిస్తూ కథలు చెప్పాలి. సామూహిక కృత్యాలు నిర్వహించాలి. తరగతి గదిలోనే బుక్ ఏరియా, డాల్స్ ఏరియా, డిస్కవరీ ఏరియా, బ్లాక్ బిల్డింగ్ ఏరియా, మ్యూజిక్ అండ్ మూవ్మెంటు ఏరియాలుగా చేసి పిల్లలు వారికి నచ్చిన ఏరియాలో ఆడుకునేలా చేసి వారి అభీష్టాలను గమనించాలి. వస్తువులను లెక్కించేలా, గుర్తించేలా చేయాలి. వస్తువులను చూడడం, తాకడం, శబ్దాలను వినడం, పదార్థాల వాసన, రుచి చూసి చెప్పడం వంటివి చేయించాలి. భోజన సమయంలో చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం నేర్పాలి. భాషా నైపుణ్యాలను అలవర్చాలి. చివరిగా పాఠశాలను వదిలిన సమయంలో పునశ్చరణ, గుడ్బై చెప్పడం వంటివి చేయించాలి. -
మే 17 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ను ఖరారు చేసింది. కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించ నుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభు త్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్ షెడ్యూల్ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్లైన్/ డిజిటల్ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం 204 పనిదినాలు మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్/డిజిటల్ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి బడి పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటుంది. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 70 శాతం సిలబస్నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్లైన్/డిజిటల్ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం సిలబస్ ప్రాజెక్టు వర్క్స్, అసైన్మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్హెల్డ్లో పెట్టడానికి వీల్లేదు. విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక – పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్ జాగ్రత్తలు, రోగనిరోధకత పెంపు, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – విద్యార్థులకు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్ రూమ్లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి. ఇవీ అకడమిక్ క్యాలండర్లోని ప్రధాన అంశాలు ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం మే 26 : చివరి పని దినం మే 27 – జూన్ 13 : వేసవి సెలవులు పరీక్షల షెడ్యూల్ మార్చి 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్ష ఏప్రిల్ 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్ష మే 7 – మే 13 : 9వ తరగతికి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు. (మార్చి/ఏప్రిల్లో సైన్స్ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్గానే నిర్వహించాలి) -
మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్ కేలండర్ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్ రూపకల్పనపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తోంది. మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. ఆ పరీక్షలను 70% సిలబస్తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగిం చే 30% సిలబస్పై కూడా విద్యార్థులతో అసైన్మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్మెంటల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంసెట్పైనా ఆలోచన మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్కు కేంద్ర ప్రభుత్వం సిలబస్ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తీసుకొని, ఉన్నత విద్యా మండలితో సమావేశం కావా లని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. మండలితో నిర్వహించే సమావేశంలో యూనివర్సిటీలు పాల్గొంటాయి కనుక అందులో ఎంసెట్ సిలబస్ ఎంత ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. చదవండి: (హెడ్మాస్టర్ స్థాయి వరకే పదోన్నతులు!) ప్రాక్టికల్స్ ఉంటాయ్.. కరోనా కారణంగా విద్యా బోధన దెబ్బతిన్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్/టీవీ ద్వారా విద్యా బోధనను బోర్డు నిర్వహించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్ విద్యాబోధనను కొనసాగించనుంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను సైతం నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అందుకు అనుగుణంగానే అకడమిక్ కేలండర్, పరీక్షల షెడ్యూల్ను సిద్ధం చేస్తోంది. వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందిస్తోంది. ఫస్టియర్లో ఫెయిల్ అయిన వారూ పాస్! గతేడాది మార్చిలో (2020) జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన ఫస్టియర్ విద్యార్థులను పాస్ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇచ్చి పాస్ చేసింది. కానీ ఫస్టియర్లో ఫెయిల్ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది. నేడో రేపో పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ ఒకటీ రెండురోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే కేలండర్ను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. -
10 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల పదో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పనిదినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంవత్సరంలో పనిదినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది. ఈనెల 13 నుంచి మూడు రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటుఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 10వ తేదీ ఆదివారం సెలవు. అయితే, 11న సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేగా ఉంటుంది. హాఫ్ డే సెలవు ఉంటుంది. తర్వాత 17వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉంటాయి. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలు వాయిదా ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి ప్రకటించారు. సిలబస్ పూర్తికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. -
ఒత్తిడి లేకుండా బోధన.. పరీక్షల కుదింపు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది బోధనాభ్యసన కార్యక్రమాలు, పరీక్షల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియెట్లోనూ విద్యార్థులపై భారం లేకుండా అకడమిక్ క్యాలెండర్ను రూపొందించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఏ మేరకు అభ్యసనం సాగించాలి, వారి సామర్థ్యాలను ఏ మేరకు పరిశీలన చేసి ఉత్తీర్ణతను నిర్ణయించాలి అనే వాటిపైనా ముందుగానే ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో అవుట్ కమ్ బేస్డ్ (అభ్యసన ఫలితాల ఆధారిత) సిలబస్ను రూపొందించినందున దానికి అనుగుణంగానే తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకొనే అంశాలు, ఇంటి దగ్గర అభ్యసనం చేయగలిగే అంశాలను వేరు చేసింది. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలను దీని ఆధారంగానే రూపొందించాలని ఎస్సెస్సీ బోర్డుకు సూచించింది. ‘ఇంటి దగ్గర విద్యార్థులు తమంతట తాము అభ్యసించగలిగే అంశాలు కేవలం వారి సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి మాత్రమే. తరగతి గదిలోని బోధనాంశాలపై మాత్రమే వారికి పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి’ అని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు) 180 పని దినాలు... 143 బోధనా దినాలు రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమై ఏప్రిల్ 30తో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ను రూపొందించింది. మొత్తం 180 రోజుల పని దినాల్లో 143 రోజులు పాఠశాల బోధనా దినాలుగా, 37 రోజులు ఇంటివద్ద నేర్చుకునే పని దినాలుగా నిర్ణయించింది. పాఠశాలలు దాదాపు ఏడు నెలలపాటు మూతపడినందున 2020-21 విద్యా సంవత్సరానికి పని దినాల సర్దుబాటులో భాగంగా పలు సెలవులను కుదించారు. సంక్రాంతి సెలవులు, వేసవి సెలవుల్లో కొన్ని రోజులను పాఠశాల, ఇంటి పని దినాలుగా నిర్ణయించారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ సెలవుల్లో మినహాయించి తక్కిన సెలవు రోజుల్లో పాఠ్యబోధన కొనసాగనుంది. టీచర్ల సెలవుల విషయంలోనూ నియంత్రణ పెట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు) పరీక్షల కుదింపు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది. ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు. నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా.. నెల మొత్తం పని దినాలు పాఠశాల పని దినాలు ఇంటివద్ద పని దినాలు నవంబర్ 29 25 4 డిసెంబర్ 31 25 6 జనవరి 31 23 8 ఫిబ్రవరి 28 24 4 మార్చి 31 25 6 ఏప్రిల్ 30 21 9 మొత్తం 180 143 37 -
రేపటి నుంచి తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి: డిగ్రీ, పీజీ తదితర కోర్సుల కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి సరి, బేసి సంఖ్యల రోజుల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలిచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఫస్టియర్ తరగతులను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ► వారంలో ఆరు రోజులు పనిదినాలుంటాయి. ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవాల్సి వస్తే రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో (నేషనల్ హాలిడేలు, ముఖ్యమైన పండుగ దినాలు మినహా) భర్తీ చేయాలి. ► ఫస్టియర్ పీజీ ప్రోగ్రాంల షెడ్యూల్ను వేరుగా విడుదల చేస్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి కాలేజీలను నిర్వహించాల్సి ఉంటుంది. -
టెన్త్కు రెగ్యులర్ తరగతులు!
సాక్షి, అమరావతి: కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్పై ప్రతిపాదనలు అందించనున్నారు. రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు. -
నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్లో అనుమతించనున్నారు. వర్సిటీల వారీగా తనిఖీలు ఏఐసీటీఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కమిటీల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ ప్రస్తుతం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. గతంలో ఇదంతా తూతూమంత్రంగా సాగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత కాలేజీల్లో నిర్ణీత నియమాల ప్రకారం అన్ని సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్లు, భవనాలు, ఇతరత్రా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీలు చేయిస్తోంది. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం ఇప్పటికే ఏర్పాటైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కాలేజీలు సమర్పించిన పత్రాలను అనుసరించి ఫీజులను నిర్ణయిస్తోంది. కొన్ని కాలేజీలను కమిషన్ తనిఖీలు చేయించింది. పలు కాలేజీలు సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, కొన్నిచోట్ల సరైన సంఖ్యలో అడ్మిషన్లు లేకున్నా కాలేజీలు నడుపుతుండటాన్ని గుర్తించింది. సదుపాయాలు లేకుంటే అనుమతి నిల్ సరైన సదుపాయాలు లేని కాలేజీలను కౌన్సెలింగ్లో అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే సంబంధిత పరిశీలన కమిటీలపై చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయో లేవోననే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392 రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది. ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది. గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది. ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు. గడచిన నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా, భర్తీ అయిన, మిగులు సీట్ల వివరాలు సంవత్సరం కాలేజీల సంఖ్య మొత్తం సీట్లు కన్వీనర్ కోటా భర్తీ అయిన సీట్లు మిగిలిన సీట్లు 2017 467 1,40,358 98,251 66,073 32,178 2018 460 1,36,224 96,857 56,609 37,248 2019 445 1,29,882 1,06,203 60,315 45,888 2020 392 1,53,978 - - - -
సెప్టెంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్తో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న షురూ కానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్ను జారీ చేసింది. ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. -
యూనివర్సిటీలు, కాలేజీలకు త్వరలో యూజీసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన పరీక్షలు, ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్పై చర్చించేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైంది. విద్యా సంవత్సరంలో కోత, ఆన్లైన్ ఎడ్యుకేషన్పై ఏర్పాటు చేసిన ప్యానెళ్లు ఇచ్చిన నివేదికలపై చర్చించారు. త్వరలో యూనివర్సిటీలు, కాలేజీలకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని యూజీసీ సెక్రెటరీ రజనీష్ జైన్ చెప్పారు. -
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వులో తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
పాఠాలు చూడొచ్చు.. వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు పుస్తకాలను అభివృద్ధి చేసి, వాటిల్లో క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ పొందుపరిచేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చర్యలుచేపట్టింది. ప్రతి పాఠానికి సంబం ధించిన వివిధ అంశాలపై వీటిని అభివృద్ధి చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు వాటిని సమీక్షించి పుస్తకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచే క్యూఆర్ కోడ్ ఆధారంగా విద్యార్థులు ఆ కోడ్ను ఎలక్ట్రానిక్ పరికరం లేదా మొబైల్ సహాయంతో రీడ్ చేస్తే ఆ పాఠ్యాంశానికి ఆడియో, వీడియోతో మొబైల్లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. మొదట ప్రయోగాత్మకంగా 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులో వీటిని పొందుపరచాలని నిర్ణయించామని, దీనిని 2019–20 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెస్తామని ఆమె వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే అన్ని తరగతుల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. -
భిన్నత్వంతో విభేదాలు రాకూడదు
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు. భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు. అధికారంతో సంబంధం లేదు ‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు. -
నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి
పుణే: విద్యాసంస్థలు నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కునే బదులు తమ పూర్వ విద్యార్థులను ఆశ్రయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవడేకర్ సూచించారు. శుక్రవారం ఇక్కడి జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల నుంచి వర్సిటీల వరకు ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు కాదు.. అక్కడ చదువుకుని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులే’అని ఆయన పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు సాయం కోసం విరామం లేకుండా ప్రభుత్వాన్ని అడుక్కుంటాయని, కానీ నిజమైన సాయం వారి వద్దే ఉందని చెప్పారు. తాము చదుకున్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం ఓ బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు. -
శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు కొత్త వీసాలు
లండన్ : భారత్తో పాటు విదేశీ శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలను సరళతరం చేసింది. వీరి కోసం కొత్త రకం వీసాలను ప్రవేశపెట్టింది. ఆ దేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త రకం వీసాలను తీసుకొచ్చినట్టు యూకే పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైర్ 5 వీసా రూట్కి కొత్త యూకేఆర్ఐ సెన్స్, రీసెర్చ్, అకాడమియా స్కీమ్ను జతచేర్చుతున్నట్టు తెలిపింది. దీన్ని యూరోపియన్ యూనియన్ వెలుపల నుంచి యూకేకు రెండేళ్ల వరకు వచ్చే విద్యావేత్తలకు, శాస్త్రవేత్తలకు జూలై 6 నుంచి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొంది. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు యూకే ప్రపంచ లీడర్గా ఉందని, యూకేలో పనిచేయడానికి, శిక్షణ తీసుకోవడానికి అంతర్జాతీయ పరిశోధకులకు ఈ వీసాలు ఎంతో ఉపయోగపడనున్నాయని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కారోలైన్ నోక్స్ తెలిపారు. ఈ వీసాలు యూకే వీసా నిబంధనలను సరళతరం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతిభను ఆకట్టుకోవడానికి తప్పనిసరిగా మెరుగైన ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ను తాము కలిగి ఉండాలని పేర్కొన్నారు. వారి నైపుణ్యం నుంచి తాము ప్రయోజనం పొందనున్నామని చెప్పారు. యూకే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, శాస్త్రవేత్తల, విద్యావేత్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, పరిశోధన ప్రతిభను ఆకట్టుకుంటూ... యూకేను ప్రపంచంలో అగ్రగామిగా ఉంచుతామన్నారు. ఈ స్కీమ్ను యూకే పరిశోధన, నూతనావిష్కరణ సంస్థ(యూకేఆర్ఐ) నిర్వహిస్తుంది. ఇది దేశీయంగా ఉన్న ఏడు రీసెర్చ్ కౌన్సిల్స్ను ఒక్క తాటిపైకి చేరుస్తుంది. యూకేఆర్ఐ, దాంతో పాటు 12 ఆమోదిత పరిశోధన సంస్థలు ఇక నుంచి ప్రత్యక్షంగా అత్యంత నిపుణులైన ప్రజలకు స్పాన్సర్ చేయడానికి వీలవుతుంది. వారికి యూకేలో శిక్షణ ఇచ్చేందుకు, పని చేసేందుకు ఈ కొత్త వీసాలు ఎంతో సహకరించనున్నాయని యూకేఆర్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ మార్క్ వాల్పోర్ట్ చెప్పారు. స్పాన్సర్ ఆర్గనైజేషన్లను కూడా యూకేఆర్ఐనే నిర్వహిస్తోంది. -
109 కాలేజీలకు అనుమతులివ్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఇంటర్ కాలేజీకీ హాస్టల్ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల అనుమతులపై మంగళవారం సాక్షిలో ‘ఇంటర్ బోర్డు అధికారుల గుర్తింపు దందా’శీర్షికతో వచ్చిన వార్తపై బోర్డు కార్యదర్శి స్పందించారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్ 20 వరకు పెంచినట్లు చెప్పారు. వెబ్సైట్లో కాలేజీల వివరాలు.. గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్ 21 నాటికి వెబ్సైట్లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. -
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ఎచ్చెర్ల క్యాంపస్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తామ ని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం వైస్చాన్సల ర్ కూన రామ్జీ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాల యం సిబ్బందితో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆయన మట్లాడుతూ పూర్తిస్థాయి సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన బయోమెట్రిక్ యంత్రాలు విని యోగిస్తామన్నారు. హాజరు, ముగింపు సమయం తప్పనిసరి అని తెలిపారు. లేనిపక్షంలో జీతంలో కొత తప్పదని స్పష్టం చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పక్కాగా పనిచేయాలని, పనిచేసిన రోజులకు సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందికి ఉన్న పరిజ్ఞా నం ఆధారంగా ఏ,బీ,సీ గ్రేడులుగా విభజించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పాలన సక్రమంగా ముందుకు సాగేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని వివరిం చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబాబు, అసిస్టెంట్ రిజస్ట్రార్ రామారావు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై నేడు అఖిలపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన కేజీ టు పీజీ విద్యా సంస్థల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 21న మధాహ్నం 1.30కు అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణా రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, సతీశ్ తెలిపారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. 17 వేల విద్యా సంస్థల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ట్యూషన్ ఫీజు పెంపు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. -
ఉంటుందా.. ఊడుతుందా..!
►త్రిశంకుస్వర్గంలో మైనార్టీ గురుకుల సిబ్బంది ►విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు ►ఇంకా అందని నియామక ఉత్తర్వులు ►ఆందోళనలో అభ్యర్థులు జగిత్యాల: ‘నేను విద్యాసంవత్సరం ప్రారంభానికి ఐదారురోజుల ముందే మైనార్టీ గురుకులంలో నాన్టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన. ఇప్పటికీ రెండు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు నాకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందలేదు. గురుకులాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయని తెలిసింది. ఉద్యోగం ఉంటుందో..? ఊడుతుందోనని నాకూ భయమేస్తోంది. నియామక ఉత్తర్వులు ఇస్తే టెన్షన్ ఉండదు.’ – జిల్లాలో ఓ మైనార్టీ గురుకుల సిబ్బంది ఆవేదన . కేవలం ఇతడిదొక్కడిదే కాదూ.. జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరిదీ ఇదే ఆందోళన. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు ఉద్యోగ నియామక పత్రాలు అందకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క ఇప్పటికీ జరుగుతున్న మార్పులు, చేర్పులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.నియామకపత్రాలు చేతికందే వరకు ఉద్యోగాలు ఉంటాయో..? ఊడుతాయో..? అనే ఉత్కంఠ నెలకొంది. నియామక ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఉద్యోగం పోతుందనే భయంతో ఈ సాహసం చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం వీరికి నియామక ఉత్తర్వుల బాధ్యత తమది కాదని, ఆయా జిల్లాల కలెక్టర్లు.. ఏజెన్సీలదేనని స్పష్టం చేయడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. నిరుపేద మైనార్టీ విద్యార్థుల చదువుపై దృష్టిసారించిన రాష్ట్రప్రభుత్వం వారికి ఆంగ్లమాధ్యమంతోపాటు ఉర్దూ, దీనియాత్, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరం జగిత్యాల, మెట్పల్లి పట్టణాల్లో బాలురు, ధర్మపురి మండలం దొంతాపూర్లో బాలికలు మైనార్టీ గురుకులాలు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరం జగిత్యాలలో బాలికలు, కోరుట్లలో బాలుర గురుకులాలు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాలకే అప్పగించింది. బోధన సిబ్బందిలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, పీఈటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టాఫ్నర్సు మొత్తం పదిమందిని తీసుకోవాలని సూచించింది. బోధనేతర సిబ్బంది కింద వార్డెన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, హౌజ్ కీపింగ్ (3), సెక్యూరిటీ గార్డు (2), ఫ్లంబర్, ఎలక్ట్రిషీయన్ మొత్తం తొమ్మిది మందిని పొరుగు సేవల పద్ధతిలో తీసుకోవాలని సూచించింది. దీంతో కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు మెట్పల్లి సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి గంటా నరేందర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. వారి విద్యార్హత, ఇంటర్వ్యూల ఆధారంగా ఒక్కో గురుకులంలో పది మంది చొప్పున 30 మంది బోధన సిబ్బందిని ఎంపిక చేశారు. 27 మంది బోధనేతర సిబ్బంది నియామకాల బాద్యతను జిల్లాయేతర ఏజెన్సీకి అప్పగించారు. ఆ జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంతవరకు ఎంపిక చేసిన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి నియామకఉత్తర్వులు అందలేదు. దీంతో గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇటు అధికారులపై, అటు ఏజెన్సీలపై ఫిర్యాదు చేయలేక ఆందోళనతో విధులు నిర్వరిస్తున్నారు. -
ప్రణాళిక లేని చదువులు..
► బడులు ప్రారంభమై నెల దాటినా విడుదల కాని అకాడమిక్ క్యాలెండర్ ► యూనిట్ టెస్టుల నిర్వహణపై సందిగ్ధం ► ప్రభుత్వానికి ప్రతిపాదించామంటున్న విద్యాశాఖ అధికారులు ► సమయం, పరీక్షల నిర్వహణపై గందరగోళం ఏ పనికైనా ప్రణాళిక అవసరం.. ప్రణాళిక లేనిదే ఏ పని కూడా ఆచరణకు నోచుకోదంటే అతిశయోక్తి కాదు. కానీ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయక ఆలస్యం చేస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ, సమయపాలన, పాఠ్యాంశాల బోధనపై గందరగోళం నెలకొంది. కరీంనగర్ఎడ్యుకేషన్: ఏ పనికైనా ప్రణాళిక ప్రధానం.. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం ప్రణాళికలు లేకుండానే బడులను కొనసాగిస్తోంది. విద్యా సంవత్సరానికి ప్రారంభం ముందే రావాల్సిన అకాడమిక్ క్యాలెండర్ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో పరీక్షల నిర్వహణ, సమయపాలన, పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అయితే.. ప్రభుత్వం కావాలనే అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాలలు సంపూర్ణంగా కొనసాగేందుకు ఏటా పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేస్తోంది. వారంలో ఏ పాఠశాల (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల) ఎన్ని గంటలకు ప్రారంభించాలి.. ఎప్పుడు ముగించాలి.. ఏ సబ్జెక్టు ఎన్ని గంటలు బోధించాలి.. ఏయే పరీక్షలు ఏ నెలలో నిర్వహించాలి.. ఏ పండుగకు ఎన్నిరోజుల సెలవులు.. పాఠశాలల్లో క్రీడా పోటీలు ఎప్పుడు నిర్వహించాలి.. ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి కొనసాగించాలి.. బడులకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వాలి.. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలి.. తదితర అంశాలన్నీ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచి ఉంటాయి. దీని ప్రకారమే పాఠశాల నిర్వహణ కొనసాగుతుంది. కానీ.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక విడుదల కాలేదు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా ప్రభుత్వం గాని, విద్యాశాఖ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధానోపాధ్యాయుల ఆందోళన.. జిల్లాలో 425 ప్రాథమిక, 75 ప్రాథమికోన్నత, 149 ఉన్నత పాఠశాలలు కలుపుకోని మొత్తం 649 పాఠశాలలున్నాయి. కేజీబీవీలు 11, ఆద ర్శ పాఠశాలలు 11 మొత్తం 22 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తం గా 45,990 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3,006 మంది ఉపాధ్యాయులు, 81 మంది విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల కాకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏ నెలలో ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జూలైలోనే యూనిట్ టెస్టు నిర్వహిం చాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో యూనిట్ టెస్టు నిర్వహణపై తర్జనభర్జన పడుతున్నారు. విద్యాప్రణాళి క క్యాలెండర్పై ప్రధానోపాధ్యాయులు డీఈవోలను అడిగితే పాత అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠాలు చెప్పాలని మౌఖిక ఆదేశాలు ఇస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. తేలని గణితం, ఫిజిక్స్ టీచర్ల పంచాయితీ.. కొంత కాలంగా జరుగుతున్న గణితం, ఫిజిక్స్ టీచర్ల పంచాయితీ ఎటూ తేలడం లేదు. 6,7 తరగతులకు సంబంధించిన గణితం సబ్జెక్టు ఎవరు చెప్పాలనే దానిపై స్పష్టత కరువైంది. విద్యాశాఖ అధికారులు గతేడాది ఉత్తర్వులు ఒకరకంగా ఇచ్చి ఇప్పుడు పాత పద్ధతిలోనే అమలు చేయమనడంతో పాలుపోలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా అమలు చేయాలని చెబుతున్న దానికి ఉత్తర్వులు మాత్రం ఇంతవరకు రాలే దు. దీంతో ఆ సబ్జెక్టు టీచర్ల మధ్య పాఠశాలల్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీకి పరిష్కారం అకాడమిక్ క్యాలెం డర్ విడుదల మాత్రమేనని ప్రధానోపాధ్యాయులు భావిస్తున్నారు. కావాలనే కాలయాపన..: అకాడమిక్ క్యాలెండర్ను ఈ విద్యా సం వత్సరానికి విడుదల చేయకపోవడానికి కారణం ప్రభుత్వ ఆలసత్వమేనని పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. అకాడమిక్ క్యాలెండ ర్ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం రెండు నెలల క్రితమే పాఠశాల విద్యాశాఖ అధికారులు పంపించారు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దాని ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదు. దీన్ని బట్టి ప్రభుత్వమే అకాడమిక్ క్యాలెండర్ విడుదలపై కాలయాపన చేస్తోందని భావించవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జూన్ 1కి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ముగింపు తేదీలు మారే అవకాశం ఉంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరిస్తామని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతూ వస్తున్నా.. అమలుకు నోచలేదు. -
‘విద్యా వలంటీర్’కు భారీ డిమాండ్
10,887పోస్టులకు 1.33లక్షల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: విద్యా వలంటీర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పోస్టు కు సరాసరిన 12మందికి పైగా పోటీపడు తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 10,887పోస్టులకు 1,33,903 మంది దరఖా స్తులు పంపారు. అయితే పాఠశాల యూనిట్ గా ఆ గ్రామంలోని వారికే ప్రథమ ప్రాధాన్య మిస్తారు. ఆ తరువాత ఆ మండలానికి చెందిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో స్థానికులకే ఆ పోస్టులను కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఎవరూ లేకపోతే తమకు అవకాశం వస్తుందన్న ఆశతో అనేక మంది ఇతర మండలాలకు చెందిన వారు కూడా విద్యా వలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ పోటీ ఎక్కువ... వరంగల్ అర్బన్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యా వలంటీర్ పోస్టులకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఒక్కో పోస్టుకు 29 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ అదే పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం ఒక్కో పోస్టుకు 9 మందే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డిలో ఒక్కో పోస్టుకు 8 మంది వరకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభిం చబోతున్న 84 కేజీబీవీల్లో 600 వరకు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ), స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో) పోస్టులకు 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
నగదు రూపంలో ఫీజులు వద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. విద్యార్థుల ఫీజుతో పాటు పరీక్ష ఫీజులు, ఉద్యోగులకు జీతాలతో పాటు వ్యాపారులకు చెల్లింపుల్ని డిజిటల్ రూపంలోనే చేయాలని తెలిపింది. ఇందుకోసం ఓ నోడల్ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ నివేదికలు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
కొత్త విద్యా సంవత్సరంపై పునరాలోచన
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరాన్ని మార్చి 21న ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడింది. జూన్ నుంచే దీన్ని కొనసాగించాలని యాజమాన్యాల నుంచి డిమాండ్లు వస్తుం డగా, కొంత మంది జిల్లా కలెక్టర్లు కూడా ముందస్తు ప్రారంభం వల్ల ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 3న ప్రారంభించిన బడిబాట కార్యక్రమంపై గురువారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్షిక పరీక్షలు ముగిసినం దున చాలా మంది పిల్లలు స్కూళ్లకు రావట్లేదని, టీచర్లు కూడా ఏప్రిల్ 3 నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులకు వెళ్లారని పలువురు కలెక్టర్లు పేర్కొన్నారు. మిగతా టీచర్లు బడిబాటలో పాల్గొం టున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులకు బోధన జరగట్లేదని చెప్పారు. దీనిపై రంజీవ్ ఆర్ ఆచార్య స్పందిస్తూ దీనిపై సమీక్షిస్తామన్నారు. ఈసారి ప్రయోగాత్మకం గా మార్చి 21 నుంచే సీబీఎస్ఈ తరహాలో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పుస్తకాలు, యూనిఫారాలు కూడా ఇచ్చామన్నారు. ఈనెల 23 తర్వాత పాఠశాలకు వేసవి సెలవులిస్తే జూన్ వరకు అంగన్వాడీ విద్యార్థులకు భోజనం ఎవరు పెట్టాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్లు కోరారు. ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నందున ఐదో తరగతి పూర్తయిన వారు ఆరో తరగతిలో చేరేందుకు సరిపడ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు లేవని, వారి పరిస్థితి ఏంటని వారు వివరణ కోరారు. దీంతో 6వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రంజీవ్ ఆర్ ఆచార్య వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, సర్వ శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు. -
ముందే మేల్కొన్నారు..
• జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు • అవసరమైన పాఠ్యపుస్తకాలు 2,92,491 • నేటి వరకు చేరుకున్నవి 1,35,719 • రావాల్సినవి 1,56,772 కరీంనగర్ఎడ్యుకేషన్ : విద్యాశాఖ ముందే మేల్కొంది. ఏటా విద్యాసంవత్సరం ఆరంభమై నెలలు గడిచిన పుస్తకాలు స్కూళ్లకు చేరకపోవడం వంటివి చూశాం. అయితే ఈసారి ఇప్పటికే యాబై శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభమయ్యే మార్చి 21 వరకు విద్యార్థులకు పుస్తకాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్వశిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా కసరత్తు ప్రారంభించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సగం వరకు పుస్తకాలు చేరుకున్నాయి. మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం 2017–18 సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ను విడుదల చేసింది. గత విద్యాసంవత్సరంలో ముందస్తుగానే మొదలుపెట్టాలని ఆలోచించినప్పటికీ సాధ్యంకాలేదు. ఈసారి ఎలాంటి ఆటంకాలు రానీయకుండా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గతంలో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పునర్ప్రారంభమై నెలల గడిచినా పుస్తకాలు చేరకపోయేవి. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. మార్కెట్లో డబ్బు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం రోజునే అంటే మార్చి 21నే పుస్తకాలు, దుస్తులు అందించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. చేరిన పుస్తకాలు జిల్లాలోని 16 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాలల్లో 27,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియంకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు 2,92,491 అవసరమని జిల్లా విద్యాశాఖాధికారులు రాష్ట్ర అధికారులకు ఇండెంట్ పంపించారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాకు గురువారం నాటికి 1,35,719 పాఠ్య పుస్తకాలు చేరాయి. మిగతా 1,55,772 పాఠ్యపుస్తకాలు పది రోజుల్లోగా చేరుకోనున్నాయి. మార్చి మొదటి వారం నుంచి కరీంనగర్ కేంద్రంలోని గోదాం నుంచి పాఠ్యపుస్తకాలను ఆయా మండలాల ఎమ్మార్సీ కేంద్రాలకు అక్కడి నుంచి సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు మార్చి 20లోగా పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేపట్టారు. ప్రారంభం రోజునే పుస్తకాలు పాఠశాల ప్రారంభమయ్యే మార్చి 21న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తాం. జిల్లాకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు మార్చి 10లోగా పూర్తిస్థాయిలో చేరుతాయి. మరో పది రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడంతోవిద్యార్థులు వేసవి సెలవుల్లోనూ చదువుకునే అవకాశం ఉంది. – పి.రాజీవ్, డీఈవో -
ఇదేం విధానం?
ఏప్రిల్ 23తో ముగిసే విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగియనుంది... జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21 నుంచే ఆరంభం పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు అందిచగలరా..? ఏ పుస్తకం లేకుండానే తరగతులు నిర్వహించాలా...? ఇదేం నిర్ణయమంటూ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు రామచంద్రపురం రూరల్ : ప్రతి ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగిసే విద్యా సంవత్సరం ఈసారి మార్చి 20తో ముగియనుంది. అలాగే జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచే మొదలు కానుంది. ఏటా ఏప్రిల్ 23 వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించి 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది పద్ధతి మార్చారు. సెలవుల్లో మార్పు ఉండదు కానీ వార్షిక పరీక్షలు మాత్రం ముందుగానే నిర్వహిస్తారు. అవి ముగియగానే వెంటనే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత నెల రోజులకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1– 9వ తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–3) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆ ప్రకారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మార్చి 6న ప్రారంభమై 20న ముగుస్తాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మార్చి 15న ప్రారంభమై 18న ముగుస్తాయి. ఆ మేరకు షెడ్యూలు, టైంటేబుల్ జిల్లా విద్యాశాఖకు చేరింది. ఇక్కడి నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చేరవేశారు. ఈ నిర్ణయంపై తలలు పట్టుకుంటున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ముందస్తు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్ సంగతేంటి... 6–10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఈ విధానం ఉపాధ్యాయులకు అర్థమయ్యేందుకే బాగా సమయం పట్టింది. విద్యార్థులు ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు పనులకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త ముందున్నారు. వారు ఇప్పటికే అన్ని తరగతులకు దాదాపు సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు సిలబస్ ఇంకా 30 శాతంపైనే పెండింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు నెల రోజుల ముందు పరీక్షలు పెట్టడం తమకు ఇబ్బందికరమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేసి ఉంటే బాగుండేదంటున్నారు. పుస్తకాలు ఎలా? మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎలా అందుతాయన్న సందేహం తలెత్తుతోంది. పోనీ పుస్తకాలు లేకుండా కేవలం తరగతులతో ఎలాగోలా కాలక్షేపం చేద్దామంటే విద్యార్థులు తీవ్ర ఎండల్లో ఏ మేరకు పాఠశాలలకు వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇక రోజూ డిజిటల్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజూ డిజిటల్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కేలండర్లో నిబంధనలు పొందుపర్చింది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతికి ఉదయం, మరో తరగతికి మధ్యాహ్నం డిజిటల్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే ఒక్కో తరగతికి ఒక రోజు చొప్పున పూర్తిగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. 6–10వ తరగతి విద్యార్థులకు వారంలో కనిష్టంగా 30 తరగతులు ఇలా బోధన జరగాల్సిందిగా 2017–18 విద్యా కేలండర్లో రూపొందించింది. మార్చి 21న విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో బోధన పక్కాగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. -
మాంటిస్సోరీ కోటేశ్వరమ్మ
పురస్కారం తొమ్మిది పదులు నిండిన పసిపాప... అందరినీ ఆప్యాయంగా నోరారా ‘పాపా’ అని పిలిచే మాతృమూర్తి డాక్టర్ వి. కోటేశ్వరమ్మ. స్త్రీవిద్య కోసం పాటు పడ్డారు. విజయవాడలో మాంటిస్సోరీ విద్యాసంస్థలను స్థాపించారు. అతి తక్కువ ఫీజులకే విద్య అందించారు. మగవారు మాత్రమే సంస్థలు నడపగలరు అనుకునే రోజుల్లో... స్త్రీశక్తిని నిరూపించారు. ఆమె అందించిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీమతి వి. కోటేశ్వరమ్మతో సాక్షి సంభాషించింది. విద్యాసంస్థలు స్థాపించాలనే ఆలోచన ఎలా కలిగింది? మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. మా అమ్మగారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే టీచర్గా పనిచేశారు. ఆమె నా రెండవ ఏటే మరణించారు. ఆవిడతో నాకు సాన్నిహిత్యం లేకపోయినా, నాన్నగారు ఆవిడ గురించి తరచు చెబుతుండటంతో, ఆవిడకి ఉన్న పేరుప్రఖ్యాతులు అర్థం చేసుకున్నాను. ఆవిడ పేరు నిలబెట్టి, ఆవిడ పట్ల నా గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నాను. అలా మొదటగా ప్లే స్కూల్ ప్రారంభించాను. మాంటిస్సోరీ విద్యావిధానంలో పాఠశాల ప్రారంభించాను. మా స్కూల్ పేరు మాంటిస్సోరీ చిల్డ్రన్స్ హైస్కూల్. ఆ తరువాత నేను స్థాపించిన అన్ని సంస్థలకు అదే పేరు పెట్టాను. ఇన్ని విద్యాసంస్థలు స్థాపించడం వెనుక ప్రేరణ? భావిభారత పౌరులంతా పైకి రావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. ఆ కోరికతోనే ఇన్ని విద్యాసంస్థలు స్థాపించాను. మీరు ఇంత డైనమిక్గా పెరగడానికి స్ఫూర్తి ఎవరిది? ఏదో ఒకటి చేయాలనే కోరిక నా మనసులో బలంగా ఉండేది. ఏదైనా పనిచేస్తే, ఆ పని అందరికంటె బాగా చేయాలని, పైకి ఎదగాలనే పట్టుదల, దీక్ష నాలో చిన్నతనం నుంచే ఉండేవి. ఆ దీక్షతోనే అన్ని పనులూ చేశాను. టీచింగ్ మీద ఉండే ప్రేమ, ఫలితం చూడాలనే ఆతురత, ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన. వీటి వల్లే నేను ఏదైనా సాధించలిగాను. తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు ఎలా నడపగలిగారు? నేను ఒక ఇల్లాలిని. నా ఆలోచనలు కూడా ఇల్లాలి ఆలోచనలలాగే ఉండేవి. ఏ ఇంట్లో అయినా భార్య తన భర్త ఆదాయాన్ని ఆధారం చేసుకుని ఇంటిని ఏ విధంగా నడుపుతుందో, నేను కూడా అదేవిధంగా.. వచ్చిన ఆదాయంతో మా సంస్థలను ప్రణాళికా బద్ధంగా నడిపాను. బడిని కూడా ఒక ఇంటిలాగే నడిపాను. అంతేకాదు, నేను చదువుకునే రోజుల్లో స్కూలు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఏ విద్యార్థీ అటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాను. అందుకే తక్కువ ఫీజులకు ఉత్తమ విద్య అందించాను. మరో కారణం... మా టీచర్లకు ప్రభుత్వమే జీతాలిచ్చేది. అందువల్ల విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకునేవాళ్లం. మీ దగ్గర చదువుకున్న కొందరు ప్రముఖుల గురించి... ప్రముఖ కార్డియాలజిస్టు డా.పి.రమేష్బాబు, ఫోర్స్బ్ జాబితాలో చోటు దక్కించుకున్న సిస్కో సిఈవో పద్మశ్రీ వారియర్ మా స్కూల్లో చదివినవారే. వీరు కొందరు మాత్రమే. ఇంకా చాలామంది అమెరికాలో సెటిల్ అయినవారు ఉన్నారు. విద్యార్థుల అభివృద్ధి చూస్తే మీకు ఎలా ఉండేది? ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తే, మిగిలిన విద్యార్థులకి కూడా రావాలని ఆశించేదాన్ని. ఒకరు ఉన్నతస్థాయిలోకి వస్తే, మిగిలినవారు కూడా వస్తే బాగుంటుందనిపించేది. మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు? గుంటూరు ఏకెసి కళాశాల ప్రిన్సిపాల్గా డా. సైప్స్ పనిచేసేవారు. ఆ కళాశాలలో అమెరికన్ విద్యా విధానం అమలులో ఉండేది. అక్కడ చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఆ విద్యా విధానంలో ఒక కళాశాల ప్రారంభించాలనే కోరిక బయలుదేరింది. నేను బి.ఎస్సి. చదివాను. ఆ తరవాత ఉద్యోగం చేస్తూ ఎంఏ తెలుగు ప్రయివేట్గా చదివాను. ఆ వెంటనే పి.హెచ్డి చేశాను. ఆ తరువాత నేను కలగన్న విద్యా సంస్థలను ప్రారంభించాను. ప్రత్యేకంగా మహిళల కోసం మాంటిస్సోరీ మహిళా కళాశాల పేరుతో, విద్యాసంస్థ ఏర్పాటు చేశారు కదా! స్త్రీ విద్యకై పాటుపడాలని, వారిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మహిళా కళాశాల ప్రారంభించాను. అక్కడితో ఆగకుండా మరిన్ని సంస్థలు పెట్టాలనే కోరిక పెరుగుతూ ఉండేది. మా కళాశాలలో కొన్ని వేల మంది ఆడపిల్లలు చదువుకున్నారు. స్త్రీవిద్య గురించి కొందరు ప్రముఖులు ఉత్తరాదిన చేస్తున్న సేవ గురించి చదివినప్పుడు, నేను కూడా ఎంతో కొంత స్త్రీల కోసం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. ఆడపిల్లలు బాగా వెనుకబడి ఉంటున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం గురించి... అవార్డుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. అవార్డు వచ్చిందని పొంగిపోను. బెటర్ లేట్ దేన్ నెవర్. విద్యా సేవ పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతను ఒక్కరే ఎలా నిర్వర్తించారు? మా వారు నన్ను బాగా ప్రోత్సహించారు. సహకరించారు. నా దగ్గర పనిచేసేవారంతా నాకు సహకరించారు. అది నా అదృష్టం. రాజకీయాలలోకి రావాలనుకోలేదా? చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ యూనియన్లో పనిచేశాను. పెద్దయ్యాక రాజకీయాలలోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. మంచి టీచర్ అనిపించుకోవాలనుకున్నాను. సాధించాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాను. కాలేజ్ ఈజ్ మై హోమ్ ఏబిసిడీలతో మాంటిస్సోరీ విద్యాసంస్థలు ప్రారంభించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. కాలేజ్ ఈజ్ మై హోమ్. జీవితమంతా విద్యతోనే గడిపాను. ఇప్పుడు నా వయసు 92 సంవత్సరాలు. నెలరోజుల క్రితం వరకు నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. అంతకంటె ఏం కావాలి ఎవరికైనా. వజ్రోత్సవ వీక్షణం 1955లో మాటిస్సోరీ మొదలైంది. వజ్రోత్సవాలు కూడా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది వారి స్థాపించిన సంస్థ వజ్రోత్సవాలను కళ్లారా చూసుకోలేరు. నేను చూడగలిగాను, అది నా అదృష్టం. నేను ఏం సాధించాలనుకున్నానో అవన్నీ సాధించాను. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ -
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలో కొత్త విధానం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా మొత్తం సిలబస్ను చదవాల్సి ఉంటుంది. రాత పరీక్షతోపాటు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో చెరో 33శాతం మార్కులు సాధించాలి. 2017–18 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. బోర్డు ఎగ్జామ్ నుంచి 80 మార్కులను, ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి 20మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. గతంలో ఈ వెయిటేజీ 60: 40శాతంగా ఉండేది. ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా గతంలో ఉండే 4 అసెస్మెంట్లకు బదులుగా కొత్తగా 3 పరీక్షలు రాయాలి. -
రాష్ట్రంలో ప్రీ స్కూల్ విద్యా కోర్సు
ఎన్సీటీఈకి విద్యాశాఖ ప్రతిపాదన వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా కోర్సును ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభిం చింది. వచ్చే విద్యా ఏడాది (2017–18) నుంచి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) అనే రెండేళ్ల కోర్సును ప్రారంభించేందుకు అనుమతివ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో డీఎడ్ ఉపాధ్యాయ విద్యా శిక్షణను ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) డీపీఎస్ఈ కోర్సు నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 డైట్లలో 10 డీపీఎస్ఈ కోర్సును ప్రారంభిస్తామని, ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణను చేపడతామని పేర్కొంది. జిల్లాల పునర్విభజన అనంతరం మొత్తం 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లోనూ డైట్ కాలేజీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎన్సీటీఈ నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ వల్లే... డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్సులు అమల్లో ఉండగా డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ) కోర్సును ఎన్సీటీఈ 2014లో అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం దాన్ని డీపీఎస్ఈగా మార్చింది. ఈ కోర్సును ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు ఎన్సీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రీ ప్రైమరీ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఆంగ్ల మాధ్యమంతో కూడిన ప్రీ ప్రైమరీ విద్య ఉండాల్సిందేనని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానం అమలవుతున్నా దానిపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రభుత్వ రంగంలోనూ ప్రీ ప్రైమరీకి డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యపై నియంత్రణకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టడంతోపాటు సంబంధిత కోర్సులో శిక్షణ పొందిన వారితో బోధన చేయించేలా చర్యలు చేపట్టాలని నిశ్చయించింది. -
అద్దె కేంద్రాలు
ఇబ్బందుల్లో అంగవాడీ కేంద్రాలు చిన్నారులకు తప్పని తిప్పలు ప్రతి నెలా అద్దె రాక అంగన్వాడీల అవస్థలు జిల్లాలో 969కి 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే సొంత భవనాల్లో కొనసాగుతున్నవి 220 మాత్రమే పిల్లలు తక్కువుంటే వచ్చే విద్యా సంవత్సరంలో సమీప కేంద్రాల్లో విలీనం! మంచిర్యాల టౌన్ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటిస్తోంది. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాల్లో నిర్వహించాల్సి వస్తోంది. ఇరుకు గదుల్లో ఇబ్బందుల మధ్య చిన్నారులు చదువు సాగించాల్సి వస్తోంది. అరకొర వసతులతో అద్దె భవనాలు సాగుతున్నాయి. పలు కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం మాటేమోగానీ ఎంతకాలం కొనసాగుతాయనే ప్రశ్న తలెత్తక మానదు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 896 ప్రధానమైనవి కాగా, 73 మినీ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో 220 కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 250 వరకు ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 499 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సగానికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం ఐసీడీఎస్ దుస్థితిని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చే ప్రక్రియ మొదలు కావడం అనుమానమే. జిల్లాలో ఐదు ప్రాజెక్టులు గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖగా ఉన్న శాఖను జిల్లాల పునర్విభజన తరువాత వికలాంగ, వృద్ధుల సక్షేమ శాఖతో కలిపి విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం ఇది స్త్రీ, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖగా పేరు మార్చి సేవలు అందిస్తోంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఐదు ప్రాజెక్టులున్నాయి. మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలో 243, చెన్నూరులో 248, లక్సెట్టిపేట్లో 200, బెల్లంపల్లిలో 165, తాండూరులో 107 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, వన్డే ఫుల్మీల్, పూర్వ ప్రాథమిక విద్యాబోధన, వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ, ఆరోగ్య పరీక్షలు మొదలైన సేవలందిస్తారు. బాల్య వివాహాలు అరికట్టడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వికలాంగులు సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు వారికి న్యాయపరమైన సహకారం అందించడం అంగన్వాడీ కార్యకర్తల విధి. ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 5,080 మంది, బాలింతలు 5,869, ఆరేళ్లలోపు చిన్నారులు 29,715 మంది ఉన్నారు. వీరికి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడం, పిల్లలకు చదువుపై ఆసక్తిని కలిగించడం, ఆటవస్తువులతో ఆడించడం అంగన్వాడీలకు కష్టంగా మారింది. అద్దె భవనాలతో అవస్థలు... జిల్లాలోని 969 అంగన్వాడీ కేంద్రాల్లో 499 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 220 స్వంత భవనాల్లో కొనసాగగా, అద్దె భవనాల్లోని కేంద్రాలకు ప్రతి నెలా అద్దెను చెల్లించడం లేదు. దీంతో అంగన్వా డీ కార్యకర్తలు అద్దె కోసం ఇంటి యజమానుల నుంచి ప్రతి నెలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఈజీఎస్ నుం చి నిధులను మంజూరు చేసినా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. రెండు మూడు నెలలకు ఒకసారి అద్దెను ప్రభుత్వం అందించడంతో అంగన్వాడీ కార్యకర్తలు వారి వేతనాల్లోంచి అద్దె చెల్లిం చి, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఐసీడీఎస్ ద్వారా అందె అద్దె సైతం తక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఎక్కువగా ఉండడంతో, తక్కువ అద్దెకు లభిస్తున్న ఇరుకైన చిన్న గదులు, శిథిలావస్థలో ఉన్న వాటిలోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ప్రతిరోజూ పోషకాహారంతోపాటు ఆటపాటలతో కూడిన పూర్వప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఇరుకైన అద్దె భవనాల్లో అందించడం కష్టంగా మారింది. ఆటలకు చిన్నారులు దూరం అంగన్వాడీ కేంద్రాల్లో గది లోపల, ఆరుబయట ఆటలను ఆడించాల్సి ఉంటుంది. ఇందుకు గాను చిన్నారుల కోసం ప్రతి ఏడాది అన్ని కేంద్రాలకు క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. గదిలోపల ప్లకార్డులు, చెక్కబొమ్మలు, పుష్పాలు, కథల పుస్తకాలు, వస్తువులు, రంగులను గుర్తించడం, అట్టముక్కలతో వాటిని తయారు చేయడం వంటివి పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఇక చిన్నారులకు శారీరక ఉల్లాసానికి ఆరుబయట ఆటలు ఆడేందుకు జారుడు బిల్ల, ఊయల, చెక్కబల్లలపై కూర్చుని ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అద్దె భవనాలు ఇరుకుగా ఉండి, ఆరుబయట సరైన స్థలం లేక చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. -
మోడల్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
మోడల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం వచ్చేనెల 26న ప్రవేశ పరీక్ష కథలాపూర్ (వేములవాడ): రాష్ట్రంలోని మోడల్స్కూళ్లలో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాలో 13 మోడల్స్కూళ్లు ఉన్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతిలో ఒక్కో స్కూల్లో 100 సీట్ల చొప్పున 1,300 సీట్లును భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఈనెల 17 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారని కథలాపూర్ మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ నరేశ్ పేర్కొన్నారు. 7,8,9,10 తరగతుల్లో ఖాళీల వివరాలు ఆయా స్కూళ్ల నోటీస్బోర్డుపై అంటిస్తారు. విద్యార్థులకు హాల్టికెట్లు సైతం ఆన్లైన్లోనే జారీచేస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 26న ప్రవేశపరీక్ష ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడం ఇలా... ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి. కలర్ పాస్పోర్టు సైజు ఫొటో, ఆధార్కార్డు, కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు జిరాక్స్ కాపీని పరీక్ష రాయబోయే స్కూల్లో సమర్పించాలి. ఈనెల 17 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరోతరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. మార్చి నెల 9న మెరిట్ లిస్టు, 10న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. -
తెలుగు సహా 8 భాషల్లో నీట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వైద్య విద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–అండర్ గ్రాడ్యుయేషన్)ను 2017–18 విద్యా సంవత్సరం నుంచి తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో నిర్వహించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలి, గుజరాతీ, మరాఠీ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల పరీక్షల విధానాలు, పలు అంశాలపై అధ్యయనం చేశాక రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో 18 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన పలు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించినట్టు కేంద్ర వైద్య విద్య శాఖ సంయుక్త కార్యదర్శి ఏకే. సింఘాల్ తెలిపారు. -
7నుంచి ఏపీ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు!
అకడమిక్ క్యాలెండర్కు స్వల్ప మార్పు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం 2016–17 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్కు స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 2017 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో దీనిపై పాఠశాల విద్యాశాఖ అకడమిక్ వింగ్ కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి 7 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖవర్గాలు తెలిపాయి. -
జాబ్ @ సర్టిఫికేషన్స్
సర్టిఫికేషన్స్.. ఉద్యోగాన్వేషణలో అకడమిక్ డిగ్రీలతోపాటు ఉపయోగపడే ముఖ్య సాధనాలు. వీటి ద్వారా ఆయా రంగాల్లో కంపెనీల అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వ్యవధిలో ఉండే ఈ సర్టిఫికేషన్స్ జాబ్ మార్కెట్లో అభ్యర్థులను ముందు నిలుపుతాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్లో సర్టిఫికేషన్స్ వివరాలు.. సీఎస్ఈ శాప్ రోబోటిక్స్ టెస్టింగ్ ఒరాకిల్, ఎస్క్యూఎల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లైనక్స్ మెయిన్ ఫ్రేమ్స్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ సీ, సీ++, జావా, హెచ్టీఎంఎల్, డాట్నెట్ రెడ్ హ్యాట్ ఈసీఈ సిస్కో సీసీఎన్ఏ, సీసీటీపీ వీఎల్ఎస్ఐ టెక్నాలజీ పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్) క్యాడ్, క్యామ్, మైక్రోవేవ్ ఆటో క్యాడ్ టెక్నికల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ బిల్డింగ్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైనింగ్ 3డీ ప్రింటింగ్ జియో ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ ఈఈఈ సర్క్యూట్ అనాలసిస్ పవర్ సిస్టమ్ అనాలసిస్ లీనియర్ సిస్టమ్ అనాలసిస్ పీఎల్సీ టెక్నీషియన్ డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ -
అత్తెసరు చదువులు
ఏటా రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో చదువు అంతంతే.. - ఆశించిన స్థాయిలో పెరగని విద్యా ప్రమాణాలు - ప్రాథమిక స్కూళ్లలో తెలుగులో చదవగలిగేవారు సగమే - రాయగలిగినవారు 42 శాతమే - గణితంలో వెనుకంజ.. భాగహారం చేసేవారు 26 శాతమే - ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే తీరు - ప్రైవేటు స్కూళ్ల పరిస్థితీ ఇంతే - విద్యాశాఖ క్షేత్ర స్థాయి తనిఖీల్లో వెల్లడైన వాస్తవాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కోసం ఏటా వెచ్చిస్తున్న బడ్జెట్ దాదాపు రూ. 10 వేల కోట్లు! నిధులు దండిగానే ఉన్నా పిల్లలకు చదువులు మాత్రం రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సుశిక్షితులైన టీచర్లు ఉన్నా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించలేకపోతున్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగులో చదవగలిగిన వారు 52 శాతమే ఉన్నారు. ఇక తెలుగులో రాయగలిగిన వారు 42 శాతమే ఉన్నారు. ఇంగ్లిష్లో పదాలు చదవగలిగిన వారు 40 శాతం, రాయగలిగిన వారు 30 శాతం ఉన్నారు. గణితంలో కూడికలు చేయగలిగినవారు 62 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 53 శాతం, గుణకారం చేయగలిగినవారు 38 శాతం, భాగహారం చేయగలిగిన వారు మరీ దారుణంగా 26 శాతమే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లది దాదాపుగా ఇదే పరిస్థితి. వాటిల్లో తెలుగులో చదవగలిగిన వారు 60 శాతం, రాయగలిగిన వారు 56 శాతం ఉన్నారు. ఇంగ్లిష్ పదాలు చదవగలిగిన వారు 65 శాతం, రాయగలిన వారు 61 శాతం ఉన్నారు. గణితంలో కూడికలు చేయగలిగిన వారు 75 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 69 శాతం, గుణకారం చేయగలిగిన వారు 57 శాతం, భాగహారం చేయగలిగిన వారు 49 శాతం ఉన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో చేసిన తనిఖీల్లో కఠోరమైన ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. గతనెల 22 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 394 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత పాఠశాలలు, 401 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 109 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, 57 మోడల్ స్కూళ్లు, 56 గురుకుల పాఠశాలలు, 116 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, 119 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తంగా 1,368 స్కూళ్లలో అధ్యయనం చేశారు. ఆ నివేదికలను హైదరాబాద్లో జరుగుతున్న డీఈవోల సదస్సుల్లో కొత్తగా నియమితులైన డీఈవోలకు విద్యాశాఖ అందజేసింది. విద్యాప్రమాణాల పెంపునకు పక్కా కార్యాచరణ రూపొందించుకొని సర్కారు బడిని బాగు చేయాలని సూచించింది. ఇదేకాదు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో చేసిన స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వేలోనూ (స్లాష్) ఇలాంటి వాస్తవాలే బయటపడ్డాయి. క్షేత్రస్థాయిలో వెల్లడైన వాస్తవాలివీ.. ► ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగులో చదవడం, రాయడంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ఇంగ్లిష్ చదవడం, రాయడంలో రాష్ట్ర సగటు 48 శాతం, 38 శాతం ఉండగా.. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇంతకన్నా తక్కువగా ఉంది. ► రాష్ట్రంలో సగటున ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడికలు చేయగలిగిన వారు 45 శాతం, తీసివేతలు చేయగలిగిన వారు 59 శాతం, గుణకారం చేయగలిగిన వారు 45 శాతం, భాగహారం చేయగలిగినవారు 35 శాతం ఉన్నారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇంతకన్నా తక్కువగా ప్రగతి ఉంది. గణితంలో రాష్ట్ర సగటు కంటే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పిల్లలు బాగా చేయగలుగుతున్నారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో దాదాపు 50 శాతం మంది కనీస సామర్థ్యాలు లేకుండా 6వ తరగతిలో చేరారు అమలుకు నోచుకోని ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో చదవలేని, రాయలేని, స్పందించలేని (3ఆర్) విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికలను పాఠశాలలకు పంపించింది. కానీ ఆ ప్రణాళికలేవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం సగానికి సగం పాఠశాలల్లోనూ ఇవి అందుబాటులో లేవు. ప్రైమరీ స్కూళ్లలో ఉదయం రెగ్యులర్ సబ్జెక్టులు బోధించి, మధ్యాహ్నం 3ఆర్ కార్యక్రమం అమలు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా పట్టించుకోవడం లేదు. 90 శాతం ఉన్నత పాఠశాలల్లో కూడా ఇది అమలు కావడం లేదు. హైస్కూళ్లలో ఎనిమిది పీరియడ్లలో ఆరు పీరియడ్లు సబ్జెక్టు బోధించి, రెండు పీరియడ్లు వీటిని బోధించాల్సి ఉంది. 90 శాతం స్కూళ్లలో 3 ఆర్లు నేర్పించే బాధ్యత గణితం, తెలుగు, ఇంగ్లిష్ ఉపాధ్యాయు లదేనని భావిస్తున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
దీన్దయాళ్ చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలి
సూర్యాపేట : పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జీవిత చరిత్రను పాఠ్యంశాల్లోకి చేర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి అన్నారు. ఆదివారం దీన్దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని టీపీయూఎస్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన ప్రముఖ మేధావి, కార్యశూరుడు, రాజకీయ వేత్త, ఆర్థికవేత్త, విలువలతో కూడిన జీవన విధానం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. వీరి జీవిత విశేషాలను ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని తరగతుల పాఠ్యాంశాల్లో చేర్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థినీ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల శ్రీనివాస్, యామా రమేష్, గుజ్జె జయప్రకాష్, బ్రహ్మచారి, నరసింహ, పూల్సింగ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
సృజన వెలికి తీసేందుకే పోటీలు
‘గురుకుల’రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్ను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి లేపాక్షి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికే రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యో తిరావు పూలే బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. బుధవా రం ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్ 2016–17 పోటీలను ఆయన ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు లేపాక్షిలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. లేపాక్షి దేవాలయ చరిత్ర దేశస్థాయిలో పేరుగాంచినదని ఇలాంటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి 32 పాఠ శాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృ త్వపు, పె యింటింగ్స్, క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి లేపాక్షి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా టేకులోడు, నసనకోట, పేరూరు, ప్రిన్సిపాళ్లు ప్రసాద్, సంగీతకుమారి, సంజీవరావు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెరుగైన విద్యను అందిస్తాం అనంతరం ఎంజేపీఏపీ బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ విలేకరులతో మాట్లాడారు. రాష్టం లోని మహాత్మా జ్యోతిరావుపూలే ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 2015–16 సంవత్సరానికి 32 పాఠశాలలకు గానూ 17 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు సాధించగా 15 పాఠశా లల్లో 97 శాతం ఫలితాలు సాధించామన్నారు. జి ల్లాలో నసనకోట, గుడిబండ, గుండుమల, రాయదుర్గం ప్రాంతాల్లో ఎంజేపీఏపీ విద్యాలయాలు మంజూరు అ య్యాయని, నసనకోట మినహా మిగిలిన మూడింటికి సిబ్బంది కొరతతో పనిచేయలేదన్నారు. -
ఇకపై ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్లు
♦ 8వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు ♦ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఆదేశాలు ♦ ‘క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు’ నిర్వహణ ♦ చదువు, ఆరోగ్యం స్థితిగతులన్నింటిపైనా సమాచారం సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థికి ఒక రికార్డు... అది చూస్తే విద్యార్థి చదువు, పరీక్ష ఫలితాలు, వ్యాధులు, చేయించాల్సిన చికి త్సలు.. అన్నీ ఇట్టే తెలిసిపోతాయి. క్యుములేటివ్, కాంప్రెహెన్సివ్ ప్రోగ్రెస్ రికార్డు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచే అమలు చేసేందుకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రూపొందించిన రికార్డులను ఆయా పాఠశాలలకు పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి రెండు రికార్డులను నిర్వహించనుంది. ఐదో తరగతి వరకు ఒకటి.. ఆరు నుంచి పదో తరగతి వరకు మరొకటి ఉంటుంది. అవి పాఠశాలల్లోనే ఉంటాయి. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థి సామర్థ్యాలు, పరీక్ష ఫలితాలు అన్నింటిని ఇందులో రికార్డు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అదే రికార్డులో నమోదు చేయాలి. అంతేకాదు.. విద్యార్థి 8వ తరగతి పూర్తయ్యాక.. ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువపత్రాన్ని ఇస్తుంది. వీటిని వెంటనే అమలు చేయాలని, త్రైమాసిక పరీక్షల (సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు) ఫలితాలను, విద్యార్థి సామర్థ్యాలను, వెనుకబడిన సబ్జెక్టులు, అందించాల్సిన ప్రత్యామ్నాయ బోధన అంశాలను అందులో పొందుపరచాలని విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నుంచే ప్రత్యామ్నాయ బోధనను ప్రారంభించాలని ఆదేశించింది. ‘ప్రోగ్రెస్ రికార్డు’లో నమోదు చేసే అంశాలు ⇒ విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, అడ్మిషన్ నంబరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, మతం, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీ, బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు వివరాలు పొందుపరచాలి. ⇒ నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి పని తీరును అన్ని సబ్జెక్టుల్లో విశ్లేషిస్తూ.. వారి భాగస్వామ్యం, ప్రతి స్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు, మార్కులు గ్రేడ్ ఇవ్వాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు. ⇒ విద్యార్థుల అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నమోదు చేయాలి. ⇒ ప్రతి రోజు, నెల వారీగా విద్యార్థులు వేసుకోవాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మెరుగైన చికిత్స అవసరమైతే రెఫర్ చేసే ఆసుపత్రి వివరాలు, చేసిన చికిత్సలు అన్నింటిని వైద్యాధికారి నమోదు చేయాలి. -
పనితీరు మదింపులకు అకడమిక్ ఆడిట్ సెల్
పనితీరు మదింపులకు అకడమిక్ ఆడిట్ సెల్ ఏయూ, అకడమిక్ ఆడిట్ సెల్ au,academic,auditcell ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, పరీక్షల నిర్వహణ పనితీరును నిరంతరం మదింపు చేస్తూ, పటిష్టం చేసే దిశగా అకడమిక ఆడిట్ సెల్ను ఏర్పాటు చేస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం సాయంత్రం ఏయూ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ అనుబంధ కళాశాలలకు సైతం దీనిని విస్తరించడం జరుగుతుందన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలతో బోధన, పరిశోధన సంబంధ అంశాలపై సంయుక్తంగా పనిచేయడానికి ఏయూ త్వరలో అవగాహన ఒప్పందం చేసుకుంటుందన్నారు. హెరిటేజ్ వర్సిటీగా ఏయూ: ఏయూను వారసత్వ విశ్వవిద్యాలయం (హెరిటేజ్ వర్సిటీ)గా తీర్చిదిద్దుతామని వీసీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, ఏయూకు వాససత్వ సంపదగా నిలచే విశ్వవిద్యాలయంగా హోదా కల్పించాలని కోరుతామన్నారు. ప్రస్తుతం వర్సిటీలోని చారిత్రక, పురాతన భవనాల నిర్వహణకు, పూర్వవైభవం అందించడానికి రూ.100 కోట్లు అవసరమవుతుందన్నారు. వీటిపై సమగ్రంగా కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. వర్సిటీలో బోధనను ఆసక్తిదాయకంగా చేయడానికి ఇ–క్లాస్రూమ్లను తీర్చిదిద్దాలని, ప్రతీ ప్రయోగశాలను ఆధునీకరించాలని సూచించారు. విభాగాలు తమకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కోరితే అవసరమైన నిధులు అందిస్తామన్నారు. దశల వారీగా ప్రతీ విభాగాన్ని పూర్తిస్థాయిలో అభివద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్, డీన్స్, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. పూర్వవిద్యార్థుల సమావేశం ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల విస్తత సమావేశాన్ని అక్టోబర్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. ప్రతీ విభాగం తమ పూర్వవిద్యార్థులకు సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలని సూచించారు. -
సైక్లింగ్ అకాడమీకి ఎంపిక
హుస్నాబాద్రూరల్: హైదరాబాద్లోని సైక్లింగ్ అకాడమీకి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు సంజీవ్కుమార్, జంగపెల్లి వెంకటనర్సయ్య తెలిపారు. గత నెలలో హైదరాబాద్లో జరిగిన శారీరకదారుఢ్య పరీక్షలో నెగ్గి అకాడమీకి ఎంపికయ్యారని చెప్పారు. హుస్నాబాద్ మండలానికి చెందిన సాయితరుణ్(గౌరవెల్లి), కట్టమీది జీవన్, టి.నవీన్(రామవరం), సూర్యతేజ(జెయింట్ జోసఫ్), కె.దీపక్తేజ, అభిరామ్ (కరీంనగర్)కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వారి ఎంపికపై మారంపెల్లి అర్జున్, రంగానాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆది నుంచీ గందరగోళం!
అయోమయంలో అకడమిక్ కోఆర్డినేటర్ పోస్టులు ఇంటర్వూలు ముగిసినా వెలువడని ఫలితాలు రాయవరం : విద్యాశాఖలో పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ పోస్టులను సృష్టిం చింది. మండలానికి మూడు పోస్టులు వంతున ఎంపిక చేసేందుకు విద్యాశా ఖ చర్యలు చేపట్టింది. అందులో భా గంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఇం టర్వూలు కూడా చేసింది. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితా లు మాత్రం ప్రకటించలేదు. మండలానికి మూడు పోస్టులు ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్కు ఒక్కొక్క మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ పోస్టులకు ప్రతి మండలంలో ఉ పాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. తొలుత అర్హత వయస్సు 40 ఏళ్ల లోపు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం నిబంధనలు సడలించి స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎస్జీటీ క్యాడర్ వారిని, 45 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వూలు జిల్లాలో 64 మండలాలకు ఒక్కొక్క మండలానికి ముగ్గురు వంతున 192 మందిని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 320 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. అయితే ఒక్కో మండలానికి మూడు పోస్టులు అవసరం.కొన్ని మండలాల్లో కేవలం ఒక్కరే దరఖాస్తు చేయగా, మరి కొన్ని మండలాల్లో 10 మంది వరకు దరఖాస్తు చేశారు. గత నెల 26న రాజమండ్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు 75 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు డివిజన్ల వారీగా ఉపాధ్యాయులకు ఇంటర్వూ్యలు నిర్వహిం చారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలోఇంటర్వూ్యలు చేశారు. నెలరోజులు గడుస్తున్నా... ఇంటర్వూ్య అనంతరం రెండు రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తార ని ఆశించారు. అయితే నేటి వరకు ఫలితాలు ప్రకటించక పోవడంతో అసలు మండల అకడమిక్ ఫెర్మార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టులు ఎంపిక ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఇప్పుడు విద్యాశాఖ మిన్నకుండి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్పై నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశించడంతో 60 మంది వరకు ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. దీంతో ఎంఈపీఎస్లుగా ఉపాధ్యాయులను నియమిస్తే ఎటువంటి అభ్యంతరాలు వస్తాయోనన్న ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. మండల అకడమిక్ కోఆర్డినేటర్లుగా ఉపాధ్యాయుల నియామకంపై సరైన విధివిధానాలు రూపొందించిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారం వినపడుతోంది. ఆదేశాలురావాలి మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టుల ఎంపికపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆదేశాలు వచ్చిన వెంటనే ఫలితాలు ప్రకటించి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఆర్.నరసింహారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
విద్యార్థి ప్రతిభను డీఎన్ఏ టెస్టుతో కొలవచ్చు!
లండన్: పిల్లలలో ప్రతిభాపాటవాలను ముందుగానే గుర్తించి వారిలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఏర్పడింది. లండన్ లోని కింగ్స్ కాలేజికి చెందిన శాస్త్రవేత్తలు పిల్లల డీఎన్ఏపై పరిశోధనలు చేసి అకడమిక్స్ లో వారు రాణించే స్థాయిని ముందుగానే గుర్తించే టెక్నిక్ ను కనుగొన్నారు. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 20వేల మంది విద్యార్థులపై శాస్త్రజ్ఞుల బృందం ప్రత్యేక డీఎన్ఏ పరీక్షలు జరిపింది. 16 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థుల డీఎన్ఏల్లో మార్పులున్నట్లు వాటి ఫలితాల్లో గుర్తించింది. విద్యార్థులపై ఈ పరీక్షలు చేయడం ద్వారా నేర్చుకోవడంలో వెనుకబడుతున్న వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. కవలలపై పరిశోధనల వల్ల జన్యుపరమైన వివరాలు పూర్తిగా తెలుస్తాయని అన్నారు. వీరిలోని పాలీజెనిక్ స్కోర్ డీఎన్ఏ టెస్టులో అంతరాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఏ వ్యక్తిదైనా పాలీజెనిక్ స్కోర్ ను లెక్కించాలంటే జెనోమేవైడ్ అసోసియేషన్ స్టడీ(జీడబ్ల్యూఏఎస్) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కూడా పిల్లల్లో అకడమిక్ విజయాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. జన్యుపరమైన మార్పుల్లో ఒకటైన న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజమ్(ఎస్ఎన్ పీ) ద్వారా విద్యార్థుల్లోని చురుకుదనాన్ని సులువుగా గుర్తించవచ్చని చెప్పారు. ఎస్ఎన్ పీలు వ్యక్తిలోని ధృఢస్థిరాత్వాన్ని తెలియజేస్తాయని వీటిని ఎక్కువపాళ్లలో కలిగివున్న వారు మంచి విద్యావంతులవుతారని వివరించారు. -
శృతి తప్పుతోంది!
అధ్యయన కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల హవా అంతా ఉమామహేశ్వర ప్రసాదం విలువైన కాలాన్ని నష్టపోతున్న విద్యార్థులు మంటగలుస్తున్న కళాశాల ప్రతిష్ట విజయవాడ కల్చరల్ : సంగీత కళాశాల శృతి తప్పుతోంది. మృదంగ ధ్వని తడబడుతోంది. వీణా తంత్రులు అపస్వరాలు పలుకుతున్నాయి. శ్రద్ధగా సంగీత పాఠాలు నేర్చుకుందామనుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు సంగీత కళాశాలలో వేళాపాళా లేకుండా నిర్వహించే రాజకీయ సభల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పాఠాలు శ్రద్ధగా నేర్చుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలపై రాజకీయ నాయకుల ప్రభావంతో విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడు ఏ రాజకీయ సభ జరుగుతుందో, ఎప్పుడు కుల సంఘాల వేడుకలు జరుగుతాయో తెలియని పరిస్థితి. కార్యక్రమాలు జరిగే ప్రతిసారీ విద్యార్థులు సంగీత పాఠాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారు. పరీక్షల సమయంలో కూడా ప్రజాప్రతినిధుల నిర్వాకం వల్ల కళాశాల ప్రతిష్ట మంటగలుస్తోంది. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు తమ ప్రాపకం కోసం కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి సిఫార్సులు చేస్తున్నారు. మరోపక్క నిర్వహణ కోసం సంగీత కళాశాలకు చెల్లించాల్సిన కనీస మొత్తం కూడా చెల్లించకుండా భారీ స్థాయిలో పంగనామాలు పెడుతున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటం ప్రజాప్రతినిధులకు తోడు స్థానిక కార్పరేటర్ల భర్తలు కూడా సంగీత కళాశాలపై ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు కూడా తమను పిలవాలని ఒత్తిడి తెస్తున్నారని సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ డివిజన్కు సంబంధించిన ప్రతినిధులను పిలవటం రివాజు. అయితే ఇక్కడ ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సంగీత కళాశాలలో పాగా వెయ్యటానికి ప్రజాప్రతినిధులు కొందరు కళాశాల గేటు వద్ద క్యాంటీన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనిపై విద్యార్థినీ విద్యార్థులు జిల్లా కలెక్టర్కు మొర పెట్టుకోవటంతో ఆ ప్రయత్నానికి ఆదిలోనే గండి పడింది. శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోతావ్... తమ మాట వినటం లేదని, తాను చెప్పినవారికి కళాశాల అద్దెకు ఇవ్వలేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ సంగీత విద్వాంసుడు, కళాశాల నిర్వాహకుడిని పత్రికల్లో రాయటానికి వీలులేని భాషలో దూషించినట్లు సమాచారం. మాట వినకపోతే శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోతావని బెదిరించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి శ్రీకాకుళంలో సంగీత కళాశాల లేదని ఆ ప్రజాప్రతినిధికి తెలియపోవటం విచారకరం. వినాయక సేవా సమితి భారీ బకాయిలు రాష్ట్రంలోనే అతి పెద్ద వినాయకుని విగ్రహాన్ని నిర్మించి మూడు నెలల పాటు సంగీత కళాశాలను అద్దెకు తీసుకొని రూ.4 లక్షలకు పైగా అద్దె బకాయి పడ్డారు. రాజకీయ నాయకుల ఆధిపత్య పోరులో కొందరు బుద్ధిపూర్వకంగానే తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకొని సొమ్ము చెల్లించకుండా జారుకున్నారు. నిర్వాహకులపై కేసు పెట్టాలని కలెక్టర్ ఆదేశించినా చిరునామా సరిగా లేకపోవటం వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా మారుపేరుతో సేవా సమితి అద్దెకు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ గోవిందరాజన్ వద్ద ప్రస్తావించగా, ఆ విషయం వాస్తవమేనని, రూ.3 లక్షలకు పైగా సంగీత కళాశాలకు బాకీ పడ్డారని వివరించారు. మంత్రి మాటలు బేఖాతరు భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గతంలో సంగీత కళాశాలలో సంగీత, సాహిత్య, సంప్రదాయ కళలు మాత్రమే ప్రదర్శించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రజాప్రతినిధులు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ తమకు నచ్చిన కార్యక్రమాలనే ప్రదర్శించుకుంటున్నారు. గతంలో భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేవారు. ఇప్పుడు సంగీత కళాశాలలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. సంచాలకులు డాక్టర్ విజయ భాస్కర్ స్థానికంగానే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల నిర్వహణ, కార్యక్రమాల పర్యవేక్షణ స్వయంగా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
బంగారు బడులే..
నాణ్యమైన విద్యే ధ్యేయం ♦ సర్కారు పాఠశాలల్లో మెరుగైన వసతులు ♦ గత పాలకుల వల్లే వ్యవస్థ చిన్నాభిన్నం ♦ జిల్లాకు 30 గురుకుల పాఠశాలలు మంజూరు ♦ విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి కడియం ♦ ‘భోజనం’లో తేడా రావొద్దు: మంత్రి హరీశ్రావు సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాక, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, సాంకేతిక విద్య, ప్రాథమిక జిల్లా పరిషత్ విద్య పై విద్యాశాఖ, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గానికి రూ. 5 కోట్లు ఎమ్మెల్యే నిధుల ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే మరో రూ. 5 కోట్లు ఇతర పద్దుల కింద మంజూరుచేసి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు సమకూరుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రాలేకపోతున్నారని, ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలే ప్రధాన కారణమని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి గత ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన మాదిరిగా నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహించినట్లయితే విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు కొంతమేరకైనా పరిష్కారమవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను పటిష్టపరిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన క్రీడా మైదానాలు, తరగతి గదులు ఉన్నా విద్యార్థులు పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడం వెనక గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిధులు వెచ్చించాల్సి ఉందని, వాటికి తోడుగా ప్రభుత్వం తరఫున కూడా 50 శాతం నిధులు మంజూరు చేస్తుందన్నారు. జిల్లాకు 11 మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు 8, ఎస్టీలకు 8, మూడు డిగ్రీ కళాశాలలతో పాటు ఎస్సీ బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల కళాశాలలను మంజూరు చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 30 గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. నాణ్యమైన ‘భోజనం’ అందిస్తాం సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో లోపాలను సవరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు గాను వారంలో మూడు రోజులు మండల విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడమేకాక, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. దీని ద్వారా నాణ్యమైన భోజనం అందుతుందో లేదో తెలుసుకోవచ్చన్నారు. పాఠశాలలకు పాత సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడైనా లోపాలు జరిగితే ఎంఈఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే నాసిరకపు బియ్యాన్ని సరఫరా చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ఆర్ఎంఎస్ఏ ద్వారా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, ఇతర భవనాల నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయని, అధికారులకు ఇచ్చే నివేదికల్లో ఆ శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆ శాఖ ఏఈ అనిల్ కుమార్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు రావడం లేదని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్రావు డీఈఓ నజీమోద్దీన్ను ఆదేశించారు. విద్యా వలంటీర్ల నియామకంలో జాప్యం జరగకుండా ఈ నెల 30 లోగా నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల పరిస్థితిపై ఆర్ఐఓ కిషన్ ఇచ్చిన వివరణపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
శ్రీకాకుళం: కొత్త నిబంధనలు, విధి విధానాలతో కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాస్త కొత్తగా ఉండే పరిస్థితి ఉంది. డీఎస్సీ 2014 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 13 నుంచి పాఠశాలలో పాఠాలు చెప్పనున్నారు. కొన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు, మరికొన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు మారడం వల్ల పాత ఉపాధ్యాయులు కూడా బోధనకు కొత్తగా ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి డ్రెస్ కోడ్ పేరిట కొత్త నిబంధనను విధించింది. ఉపాధ్యాయులు టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు, ఎక్కువ జేబులు ఉన్న ప్యాంట్లు ధరించకూడదు. మహిళలు కూడా సంప్రదాయబద్ధంగా వస్త్రాలను ధరించాలి. పాఠశాలలకు ప్రార్థనా సమయానికి ఖచ్చితంగా ఉపాధ్యాయులు హాజరవ్వాలి. ప్రధానోపాధ్యాయులు రోజూ ఒక తరగతి చొప్పున వారంలో ఏడు తరగతులను ఖచ్చితంగా బోధించాలి. ఉపాధ్యాయులకు ఇటువంటి నిబంధన ఉంటే విద్యార్థులు కూడా కొన్ని కొత్త విధానాలను ఆచరించాల్సి ఉంటుంది. ప్రతిరోజు గంటపాటు వ్యాయామం గాని, యోగా కాని బోధించాలి. ఇందుకోసం పీఈటీలు, పీడీలకు యోగాపై ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. -
708 పాఠశాలల్లో బయోమెట్రిక్
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు సర్వశిక్షా అభియూన్ ద్వారా నిధులు {పతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేయబోతున్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతూనే ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి నాణ్యమైన విద్య అందించాలనే అభిప్రాయం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, తండాల్లోని పాఠశాలల్లో వంతులవారీగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలున్నా యి. అలాగే, కొందరు తాము పనిచేసేచోట కా కుండా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచి రైళ్లు, బస్సుల్లో వంద కిలోమీటర్లకు పైగా రాకపోకలు సాగిస్తుండడంతో సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం సడలిందనే అభిప్రాయం ఉంది. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో 86 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. వందలాది పాఠశాలల్లో 20నుంచి 30మందిలోపే విద్యార్థు లు ఉండడం గమనార్హం. ప్రభుత్వ ఆమోదం.. ఈ విద్యా సంవత్సరంలో రాష్ర్ట్రంలో 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్లతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయంపై చర్చించారు. నిధులపై జిల్లా కలెక్టర్ల ప్రతిపాదన ల మేరకు బయోమోట్రిక్ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఈ వి ద్యాసంవత్సరం సుమారు 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని వి ద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అం దుకు సంబంధించిన పరికరాలు జూన్ నెలాఖ రుకల్లా ఎంపిక చేసిన పాఠశాలల్లో అమర్చనున్నారని తెలుస్తోంది. అందుకు నిధులు సర్వశిక్షాఅభియాన్ నుంచి కలెక్టర్లకు విడుదల చేయబోతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాలో ప్రా థమిక పాఠశాలలు 2049 ఉండగా. యూపీఎస్ లు 360, హైస్కూళ్లు 510 ఉన్నాయి. మొత్తంగా 13,896 ఉపాధ్యాయ పోస్టులుండగా ప్రస్తుతం 12,068మంది పనిచేస్తున్నారు. ఇక.. జిల్లాలో 2015-2016 విద్యాసంవత్సరంలో 1నుంచి 5వ తరగతి వరకు లక్షా 26వేల 878 మంది విద్యార్థులు, 6నుంచి 8తరగతుల్లో 86,765 మంది వి ద్యార్థులు ఉన్నారని, 9, 10 తరగతుల్లో 59,637 మంది విద్యార్థులు ఉన్నట్లు డైస్ లెక్కల్లో ఉంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేశారు. ప్రవేశాల సమయంలో ఆ ధార్ నంబర్ నమోదు చేస్తారు. గత ఏడాది పా ఠశాలల్లో చేరిన పిల్లలకు ఆధార్తో అనుసంధానం చేసే చైల్డ్ ఇన్ఫో ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎందరు విద్యార్థులు ఉన్నారనేది తేటతెల్లం కా బోతుంది. డైస్ లెక్కల ప్రకారం చూపిన విద్యార్థుల సంఖ్యలో ఆధార్ అనుసంధానంతో 60వేలకు పైగా విద్యార్థులు త గ్గారనేది ప్రాథమిక అంచనా. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశముం ది. ఈ విద్యా సంవత్సరం బడి బాట కార్యక్ర మం కూడా కొనసాగుతుండగా.. ప్రతీ పాఠశాల లో కనీసం ఐదు శాతం అధికంగా సంఖ్య పెం చాలని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ రోవైపు ఈ విద్యాసంవత్సరం 476 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతంపెరిగి తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్న అభిప్రాయం ఉంది. అంతేగాకుండా బయోమెట్రిక్ ద్వారా ప్రతీరోజు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం ఎంద రికి ఉపయోగపడుతుందనే కూడా తెలిసిపో తుంది. అయితే బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారని తెలిసి ఉపాధ్యాయుల్లో మాత్రం అది ‘భయో’మెట్రిక్ అనే చర్చ జరుగుతోంది. -
బడి శిథిలం సమస్యలు పదిలం
♦ కొత్త విద్యాసంవత్సరంలోనూ మారని దుస్థితి ♦ గదులు లేక చెట్ల కిందే తరగతులు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బడులు.. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్కారు బడుల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న వేళ పాఠశాలలను ఓసారి పరిశీలిస్తే దయనీయంగా ఉన్నాయి. కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి ఉన్న జిల్లా కేంద్రంలోనే.. ప్రభుత్వ బాలుర పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు చాలాచోట్ల తరగతిగదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అదనపు తరగతి గదులు లేక చెట్లకిందే తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 759 ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవు. 267 స్కూలు భవనాలు అసంపూర్తి దశలోనే ఉండగా, 167 స్కూళ్ల భవనాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 1,260 పాఠశాలల్లో నీటి సౌకర్యం సైతం లేదు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - సాక్షి, సంగారెడ్డి కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు 167 క్రీడా మైదానాలు లేని పాఠశాలలు 759 అసంపూర్తి దశలో నిర్మాణాలు 267 నీటి సౌకర్యం లేని బడులు 1,260 నారాయణఖేడ్లో సగంపైగా ఖాళీలు నారాయణఖేడ్: మండలంలో 104 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన్సుర్పూర్ పాఠశాల గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. 16 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరు. 56 పాఠశాలలకు తాగునీటి సదుపాయాలు లేవు. మనూరు మండలంలో 91 పాఠశాలకు 310 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 200 మంది పనిచేస్తున్నారు. కల్హేర్ మండలంలో 60, కంగ్టి మండలంలో 162 ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంగ్టి మండలంలో 49 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు. వర్షం పడితే ‘ఆందోలు’నే! జోగిపేట: నియోజకవర్గం పరిధిలో చాలా పాఠశాలల్లో ఒక్కో గదిలో రెండు లేక మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. మరికొన్నింట్లో వరండాల్లో బోధన కొనసాగిస్తున్నారు. జోగిపేటలో ఒకే కాంపౌండ్లో ఐదు పాఠశాలలు నడుస్తున్నాయి. రాయికోడ్ మండలంలో 24 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి రెండు మినహా ఎక్కడా తాగునీటి వసతి లేదు. దాదాపు 80 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. అల్లాదుర్గం మండలంలో ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గడిపెద్దాపూర్ జిల్లాపరిషత్ పాఠశాలను 50 ఏళ్ల క్రితం నిర్మించారు. పైరేకులు పగిలిపోవడంతో వర్షం వస్తే గదులన్నీ నీళ్లే!రేగోడ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 156 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. దుబ్బాకలో ప్రహరీలు కరువు దుబ్బాక: దుబ్బాక మండల పరిధి అనేక పాఠశాలలకు ప్రహరీలు కరువయ్యాయి. దౌల్తాబాద్ మండలంలో 60 ప్రభుత్వ పాఠశాలల్లో ఆరువేల మంది విద్యార్థులు చదువుతుండగా 282 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 60 పాఠశాలలకు 32 చోట్ల మాత్రమే ప్రహరీలున్నాయి. తాగునీటి సౌకర్యం 13 పాఠశాలలకు లేదు. బాలికలకు 48, బాలురకు 51 చోట్ల టాయ్లెట్లు ఉన్నా నీటి వసతి లేదు. 14 పాఠశాలలకు వంటగదులు లేవు. చేగుంట మండలంలో ప్రాథమిక పాఠశాలకు 42, ప్రాథకోన్నత పాఠశాలలకు 20, ఉన ్నత పాఠశాలలకు 22 అదనపు తరగతి గదుల అవసరం ఉంది. సిద్దిపేట.. శిథిలావస్థ సిద్దిపేట జోన్: నియోజకవర్గంలోని అత్యధిక పాఠశాలలకు ప్రహరీలు, వంటగదులు, క్రీడామైదానాలు లేవు. కొన్ని స్కూళ్లకు నూతన భవనాలు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాలేదు. సిద్దిపేట మండలంలో తడ్కపల్లి, మిట్టపల్లి, పుల్లూర్ జెడ్పీహెచ్ఎస్లు శిథిలస్థితికి చేరాయి. చిన్నగుండావెల్లి, ఎన్సాన్పల్లి, రావురూకుల గ్రామాల్లో వంటగదుల సమస్య ప్రధానంగా ఉంది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, మందపల్లి ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారాయి. పెద్దకోడూరు, రామంచ, చెర్లఅంకిరెడ్డిపల్లి, గోపులపూర్, రామునిపట్ల, అల్లీపూర్, మాచాపూర్లో ప్రహరీలు, వంటగదులు, మైదానాల సమస్యతో పాటు మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి. నంగునూరు మండల పరిధిలో ఓబులాపూర్, నాగారాజుపల్లి పాఠశాలలు శిథిలస్థితికి చేరాయి. మెదక్లో నిద్రావస్థ మెదక్: నియోజకవర్గంలో మొత్తం 304 పాఠశాలలుండగా సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 43 పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. 182 స్కూళ్లలో ఒక్కో గతి గదుల్లో రెండు, మూడు తరగతులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సుమారు 200 పైచిలుకు పాఠశాలలకు తాగునీటి సౌకర్యం సరిగాలేదు. చిన్నశంకరంపేట జెడ్పీహెచ్ఎస్లో 600 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఒక్క టాయిలెట్ మాత్రమే ఉంది. వీరిలో 300 పైగా బాలికలే ఉన్నారు. అంతేకాకుండా మండలంలోని మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో ఉపాధ్యాయులు వంతులవారీగా విధులకు హాజరవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గజ్వేల్లో ప్రమాదఘంటికలు గజ్వేల్: 113 మంది చిన్నారులున్న మండలంలోని రిమ్మనగూడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమైంది. దీంతో పక్కనున్న రెండు గదుల్లో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలోని అనేక పాఠశాలలకు ప్రహరీలు, వంటగదులు లేవు. ములుగు మండలంలోని స్కూళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. జగదేవ్పూర్ మండలంలో 8 ఉన్నత పాఠశాలలకు వంటగదులు లేవు. ఏళ్ల కిందట నిర్మించిన కొండపాక బాలికల హైస్కూల్లో ఇంకా బోధన జరుగుతోంది. సమస్యల సంగారెడ్డి సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నెలవుగా మారాయి. సంగారెడ్డితో పాటు సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో వసతులు కరువయ్యాయి. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా తరగతి గదులు లేవు. క్రీడామైదానాలు కూడా లేవు. సంగారెడ్డి మండలంలో 65 ప్రాథమిక, 38 ప్రాథమికోన్నత, 16 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో కనీసం 50 శాతం కూడా వసతులు లేవు. కల్పగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేవలం రెండు గదులు మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఉన్నాయి. చింతల్పల్లి, ఇరిగిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో పాత భవనాలు కూల్చి.. కొత్తవాటిని నిర్మించలేదు. అంగడిపేట, నాగాపూర్, మహ్మద్షాపూర్ తండా, ఫసల్వాది, కొత్లాపూర్, ఉత్తర్పల్లి తదితర గ్రామాల్లో తరగతి గదులన్నీ పురాతనమైపోయాయి. సదాశివపేట బాలుర ఉన్నత పాఠశాల కూలేందుకు సిద్ధంగా ఉంది. కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, మల్కాపూర్, కుతుబ్షాహీపేట్, కిష్టయ్యగూడెం, తొగర్పల్లి, అనంతసాగర్, గొల్లపల్లి, ఎదురుగూడెం, మారెపల్లి గ్రామాల్లో సరపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుత్బ్షాహీపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొండాపూర్లో జూనియర్ కాలేజీ, పాఠశాలలు ఒకే భవనంలో కొనసాగుతుండటంతో బోధన అస్తవ్యస్తంగా మారింది. పటాన్చెరులో అరకొర వసతులు పటాన్చెరు: పారిశ్రామికవాడల్లో పాఠశాల భవనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఎంపీ దత్తత తీసుకున్నలక్డారంలో ప్రాథమిక పాఠశాల శిథిలస్థితికి చేరింది. పటాన్చెరు మండల పరిధిలోని అనేక గ్రామాల్లోని పాఠశాలలకు నూతన భవనాల అవసరం ఉంది. పట్టణంలోని బాలిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని ఓ గదిలో రేకుల కుప్పలు పోశారు. ప్రాథమిక పాఠశాలలోనే డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. జిన్నారం మండలంలో లక్ష్మాపూర్, దూబగుంట, వావిలాల, వీరారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. -
స్కూళ్ల అకడమిక్ కేలండర్ ఇదే!
మార్చి మొదటివారంలోనే టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం షురూ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల తర్వాత ఈ నెల 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, సెలవులకు సంబంధించిన సమగ్ర వివరాలతో విద్యాశాఖ బుధవారం అకడమిక్ కేలండర్ను ప్రకటించింది. పాఠశాలల్లో ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలలో చేపట్టాల్సిన కార్యాచరణను పంపించింది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లలో పాఠాలను బోధించాలి. పదోతరగతికి మాత్రం ఈ నెల 13న పాఠ్యాంశాల బోధన చేపట్టి వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలి. స్కూళ్ల పని వేళలు ఇలా.. ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు(7 గంటల 15 నిమిషాలు) పని చేయాలి ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు(ఏడు గంటలు) పని చేయాలి పరీక్షల షెడ్యూలు ఇదీ.. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1: పని దినాలు 39 రోజులు. జూలై 30వరకు బోధించి, పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యాలను రిజిస్టర్ చేయాలి ఫార్మేటివ్-2: 41 రోజుల పనిదినాలు. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు పని చేయాలి. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించి, సామర్థ్యాలను రికార్డు చేయాలి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 (త్రైమాసిక పరీక్షలు): అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను ఇవ్వాలి. ఫలితాలను నవంబర్ 7న ప్రకటించాలి. ఫలితాలను నవంబర్ 10 వరకు రికార్డు చేయాలి. 11న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి. ఎఫ్ఏ-3: అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు. 57 పని దినాలు. డిసెంబర్ 9లోగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేయాలి ఎఫ్ఏ-4: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వారికి 2017 ఫిబ్రవరి 20 వరకు. పదో తరగతి వారికి ఫిబ్రవరి 4 వరకు మొత్తంగా 52 రోజులు పని చేయాలి. విద్యార్థుల సామర్థ్యాలు రిజిస్టర్ చేయాలి. ఎస్ఏ-2: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు ఒకటి నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు. మార్చి 19న విద్యార్థులకు జవాబు పత్రాలు ఇవ్వాలి. ఫలితాలను రికార్డు చేయాలి. 20న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. - 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు: పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు. క్రీడలు.. ఆగస్టు 5లోగా పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండల/డివిజన్ స్థాయిలో, సెప్టెంబర్ 8 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులను సెప్టెంబర్/అక్టోబర్లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు పంపించాలి. -
ఇంగ్లిష్ నేర్పిస్తాం!
♦ జిల్లాలో 317 స్కూళ్లు ఆంగ్ల మాధ్యమానికి అంగీకారం ♦ ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 స్కూళ్లలో అమలు ♦ హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు ♦ తీర్మానాలు చేసి విద్యాశాఖకు పంపిన ♦ గ్రామాల్లోని మూడు కమిటీలు పుస్తకాల పంపిణీ ♦ ఇతర సౌకర్యాలపై ప్రభుత్వం నుంచి లేని స్పష్టత ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంగ్లిష్లో విద్యాబోధన చేసేందుకు పలు స్కూళ్ల ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారు. మేం నేర్పిస్తామంటూ స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్న పాఠశాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 317 స్కూళ్లు ఆంగ్ల మాధ్యమానికి అంగీకరిస్తూ తీర్మానం చేశాయి. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఇంగ్లిష్ బోధనకు అంగీకరించారు. అయితే అందుకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. పరిగి: ఈ విద్యాసంవత్సరం నుంచే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం నుంచి తప్పనిసరి నిబంధన లేకున్నా.. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా చొరవ తీసుకుని ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలంటే ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ, గ్రామ పంచాయతీలు వేర్వేరుగా మూ డు తీర్మానాలు చేసి విద్యా శాఖకు పంపాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 317 పాఠశాలలకు సంబంధించిన తీర్మానాలు విద్యాశాఖకు అందాయి. అయితే ఈ ఏడాది 1వ తరగతితో ఇంగ్లిష్లో విద్యాబోధన ప్రారంభం కానుంది. వీరు పై తరగతులుకు వెళ్తున్నాకొద్ది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకుంటూ వెళ్తుంటారు. ఇలా ప్రాథమిక పాఠశాల ఐదేళ్లలో పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్గా తయారవుతుంది. ఈ సారికి స్వచ్ఛందంగానే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఇప్పటికే ‘సక్సెస్’ పేరుతో ఆంగ్లంలో బోధన కొనసాగుతోంది. ఐదేళ్లలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా అన్ని తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొస్తే.. ఇక ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారనున్నాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుత ఆంగ్ల బోధన అధికారికంగా మాత్రం కాదు. కేవలం ఆ పాఠశాల, ఆ పాఠశాల పరిధి గ్రామస్తులు, ఎస్ఎంసీ కమిటీల కోరిక మేరకే స్వచ్ఛందంగా మొదటి తరగతిలో ఈ ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. గతంలో అధికారికంగా ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన సక్సెస్ స్కూళ్లు అంతగా సక్సెస్ కాలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో పూర్తిస్థాయి అధికారిక ఆంగ్లమాధ్యమానికి ప్రభుత్వం వెనకాడుతోందన్న అనుమానాలున్నాయి. స్వచ్ఛంద ఆంగ్ల బోధన ఫలితాలనిస్తే.. వచ్చే ఏడాది నుంచి అధికారిక అమలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరి పుస్తకాలు..? జిల్లాలో 317 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు ఆయా పాఠశాలలు ముందుకు వచ్చినప్పటికీ ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు విద్యా శాఖ పంపిణీపై స్పష్టత లేదు. ఇప్పటికైతే పుస్తకాలు లేవు.. వీలును బట్టి సరఫరా చేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ప్రాథమిక పాఠశాలల్లోని మొదటి తరగతిలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ఈ సారి పరిచయం చేస్తున్నారు. ఒకటో తరగతికి ఉండేది తెలుగు, ఆంగ్లం. మొత్తం రెండు పుస్తకాలు మాత్రమే. తెలుగు ఎలాగూ తెలుగులోనే కాబట్టి ఒక్క గణితం పుస్తకం మాత్రమే ఆంగ్లంలో ఉంటే సరిపోతుంది. ఈ నేఫథ్యంలో ఈ సిలబస్నే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకుని ఈ సంవత్సరానికి కానివ్వాలని విద్యాశాఖ పేర్కొంటోంది. ఏదిఏమైనా ఆంగ్ల మాధ్యమం లేనందునే విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడంలేదని ఉపాధ్యాయులు చేస్తున్న వాదనను వారు సమర్థించుకోవాలంటే ఈ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను సక్సెస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిగి నియోజకవర్గంలోనే అధికం.. పరిగి నియోజకవర్గంలో 54 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి ప్రవేశించనున్నాయి. మొదటి తరగతిలో చేరే వారికే ఈ ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉండనుంది. ఆ తరగతిలో చేరే విద్యార్థులు అప్గ్రేడ్ అవుతూ పోతే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ పాఠశాలలన్నీ పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమ స్కూళ్లుగా అవతరిస్తాయి. ఇవి సక్సెస్ అయితేనే.. ఈ సారి పరిగి నియోజకవర్గంలో 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇందులో పరిగి మండలంలో 11, దోమలో 11, కుల్కచర్లలో 11, గ ండేడ్లో 10, పూడూరులో 11 పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ పాఠశాలలు సమాజానికి, తల్లిదండ్రులకు నమ్మకం కల్గించగలిగితే వీటికి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మరో మారు నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ప్రత్యేక చొరవ తీసుకుని సక్సెస్ చేయాలి. తల్లిదండ్రులు, జీపీలు, ఎస్ఎంసీ కమిటీల భాగస్వామ్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ అవసరం. - హరిశ్చందర్, డిప్యూటీ ఈఓ -
ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..
టాప్ స్టోరీ ఒత్తిడి.. మూడు అక్షరాల పదం! ప్రభావం మాత్రం.. కొండంత!! నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులే! అకడమిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించాలని ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కలల కొలువులు సొంతం చేసుకోవాలని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగార్థులు.. 24్ఠ7 పని వాతావరణం; డెడ్లైన్స్; డెసిషన్ మేకింగ్; ఉన్నత స్థానాలు అందుకోవాలనే తపనతో ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు.. ఇలా... ఇప్పుడు క్లాస్ రూం, నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఒత్తిడి అనే మాట సర్వ సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు.. ఆత్మవిశ్వాసం ఆలంబనగా ఒత్తిడిని జయించే క్రమంలో ఇటు విద్యార్థులైనా, అటు ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా.. ముందుగా పెంపొందించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ఒత్తిడికి గురవడం అనే సమస్య.. సాధారణంగా సహచరులతో పోల్చుకోవడం వల్ల, పోటీ గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎదురవుతుంది. తమపై తాము నమ్మకం పెంచుకుంటే ఒత్తిడిని సగం జయించినట్లే! మెండైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు తోటివారితో పోల్చుకోవడం, పోటీ గురించి అదేపనిగా ఆలోచించడం మానేయడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు అధిగమించొచ్చు. సానుకూల జీవన శైలి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరించే మరో అంశం.. వ్యక్తిగత జీవన శైలి సరళంగా, మానవ సంబంధాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం మేలు. కొన్ని సందర్భాల్లో అత్యంత సాధారణంగా ఉండే అంశాలు కూడా సమయాన్ని వృథా చేసి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాల గురించి పదేపదే ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, మిత్రులతో వీలైనంత గడపడం మంచిది. అలసటగా అనిపించినా.. ఆందోళనకు గురవుతున్నా కొత్త ప్రాంతాలను సందర్శించడం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాధాన్యతలను గుర్తిస్తూ చాలామంది తాము చేయాల్సిన పనులు పూర్తి చేయలేదనే భయంతోనో లేదా వాటిని పూర్తి చేయకపోతే కలిగే ప్రభావాన్ని తలచుకొని చివరి నిమిషంలో ఎక్కువగా ఒత్తిడికి గురువుతుంటారు. ఇలాంటి వారికి ఒత్తిడిని జయించే క్రమంలో ఉపయోగపడే మంచి సాధనం.. ముందస్తు ప్రణాళిక. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా ఒక వారం లేదా ఒక రోజుకు సంబంధించి తాము చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్లోనో నోట్ చేసుకోవాలి. ఒకరోజు చదవాల్సిన అంశాల్లో ప్రాధాన్యతను గుర్తిస్తూ ముందుకు సాగాలి. తద్వారా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడికి గురిచేసే వారికి దూరంగా ఒత్తిడిని దూరం పెట్టడంలో ఉపయోగపడే మరో చిట్కా. ‘ఒత్తిడి’కి గురిచేసే వారిని లేదా ‘నిరాశావాదు’లకు దూరంగా ఉండటం. కొంతమంది అదే పనిగా వచ్చి.. ఒక పరీక్షకు సంబంధించి ప్రతికూల అంశాలే చెబుతుంటారు. ‘ఇంత పోటీలో ఎంత చదివినా ఉపయోగం ఏంటి? నేను కూడా గతంలో ఎంతో కృషి చేశాను. కానీ ఫలితం లేదు’ అనే మాటలతో నిరుత్సాహానికి గురిచేస్తారు. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్ తాము చేయాల్సిన పనులు లేదా చదవాల్సిన అంశాలను వాటి క్లిష్టత స్థాయి ఆధారంగా ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్గా వర్గీకరించుకోవాలి. ముందుగా ‘ఈజీ’తో మొదలుపెట్టాలి. ఇవి పూర్తయ్యాక మోడరేట్, డిఫికల్ట్ అంశాలనుఎదుర్కొనేందుకు ముందస్తు మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. ఇష్టం లేకున్నా కష్టమైన అంశాలతో మొదలుపెడితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని సందర్భాల్లో ఎంత వద్దనుకున్నా.. ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నా.. ఆందోళన పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో చదువుతున్న పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టి మానసిక విశ్రాంతి కోసం టెక్నిక్స్ పాటించాలి. అంటే.. ఇష్టమైన సంగీతం వినడం, గార్డెనింగ్, లేదా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడటం లాంటివి చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్.. మరికొన్ని టిప్స్ * దినచర్యను ఇష్టమైన పనితో ప్రారంభించాలి. * ప్రతిరోజూ కొద్దిసేపు నడక, యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. * ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి. * ఇష్టమైన ప్రదేశాలు చూడాలి. అయితే వీటికోసం రోజుల తరబడి వృథా చేయకూడదు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్తుండాలి. * విసుగు, కోపం, ఆవేదనకు దూరంగా ఉండాలి. * ఇతరుల విజయాల పట్ల సానుకూల దృక్పథం అవసరం. * ఉద్యోగులు డెడ్లైన్స్, లాస్ట్ మినిట్ వరకు వేచి చూడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. * ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అందరికీ ఒత్తిడి.. అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒత్తిడి అనే మాట వినిపించని రంగం, ఆ మాట తలవని వ్యక్తులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని అధిగమిస్తేనే విజయం. ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానసిక ఉపశమన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడి ఎదురైనప్పుడు కొద్దిసేపు దానికి విరామమిచ్చి సహచరులతో బృందచర్చల్లో పాల్పంచుకోవడం, అది వీలు కాకపోతే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇక.. విజయం పరంగా పోటీ గురించి ఆలోచించకుండా కృషిచేస్తే ఒత్తిడి అనే మాట దరిచేరదు. - డాక్టర్. ఎం.ఎస్.రెడ్డి,సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్ తల్లిదండ్రులదీ కీలక పాత్ర 17 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ వయసులో పిల్లలు సహచర విద్యార్థులతో పోల్చుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వారికి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులను తల్లిదండ్రులే గుర్తించి వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ సహచర విద్యార్థులతో పోల్చి మరింత ఒత్తిడికి గురి చేయడం సరికాదు. పోటీల్లో జయాపజయాలు సహజం. దీన్ని గుర్తించి ఫలితం ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధత పొందాలి. - డాక్టర్. జి.కృష్ణ, క్లినికల్ సైకాలజిస్ట్, ఎన్ఐఎంహెచ్ - సికింద్రాబాద్ -
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు
♦ ప్రచార రథాన్ని ప్రారంభించిన ఇన్చార్జి కలెక్టర్ ♦ జిల్లాకు కొత్తగా 9 పాఠశాలలు మంజూరు ♦ జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన తొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ రజత్కుమార్ సైనీ చెప్పారు. ఇందులో బాలుర పాఠశాలలను కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు రాజేంద్రనగర్, ఉప్పల్, తాండూరు, మల్కాజ్గిరిలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016-17 విద్యాసంవత్సరంలో 5,6,7 తరగతులను ప్రారంభిస్తున్నామని, ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఆన్లైన్ పద్ధతిలో జూన్13 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలున్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. -
అన్ని కాదు.. కొన్నింట్లోనే !
మండలానికి ఆరు పీఎస్ల్లోనే ఇంగ్లిష్ మీడియం ఎస్ఎంసీ తీర్మానాల లేఖలు ఇవ్వాలని ఆదేశాలు తప్పు పడుతున్న ఉపాధ్యాయ సంఘాలు విద్యారణ్యపురి : జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరం(2016-2017)లో అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(పీఎస్)ల్లో కాకుండా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లోనే ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. మండలానికి ఆరు చొప్పున పాఠశాలల ఎంపిక చేసి ఆయా పాఠశాలల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే తీర్మానం లేఖలను అందజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ మూడురోజుల క్రితం ఎంఈవోలను ఆదేశించారు. మండలానికి ఆరు చొప్పున అంటే జిల్లాలోని 50 మండలాల్లో కలిపి 300 పాఠశాలల్లోనే ఒకటో తరగతి నుంచి అధికారికంగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. విద్యాశాఖ మంత్రి ప్రకటన.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించారు. దీంతో అన్ని పీఎస్ల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతారని భావించారు. కానీ ఆ తర్వాత జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని 2,234 ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల నుంచి 200 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కడియం సూచించినట్లు సమాచారం. ఇక్కడ వచ్చే ఫలితాలతో జిల్లాలోని అన్ని పాఠశాలలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయూలనేది ఆయన భావనగా తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్వాకాటి కరుణ ఆదేశాలతో డీఈఓ పి.రాజీవ్ మూడు రోజులక్రితం హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓల సమావేశం ఏర్పాటుచేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు మండలానికి ఆరు చొప్పున పీఎస్లను ఎంపిక చేయూలని సూచించారు. అరుుతే, ఇంత తక్కువ సంఖ్యలో పాఠశాలలను ఎంపిక చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుం దని ఎంఈఓలు పేర్కొనగా... తన చేతిలో ఏమీ లేదని డీఈఓ చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు ఈనెల 15వ తేదీలోగా ఆయా పాఠశాలల వివరాలను ఎస్ఎంసీల తీర్మానాల కాపీలతో డీఈఓకు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో.. జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. స్థానికంగా తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచుకోగలిగారు. ఇలా జిల్లాలో 459వరకు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉందని అంచనా. తాజా నిర్ణయం ప్రకారం అధికారికంగా మండలానికి ఆరు చొప్పున పీఎస్లను ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ఎంపిక చేయూల్సి ఉంటుంది. అరుుతే, ఆరు చొప్పున కాకుండా.. తల్లిదండ్రుల డిమాండ్, ఎన్ని ఎస్ఎంసీలు ముందకొస్తే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయూలనే సూచనలు వస్తున్నారుు. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న మంత్రి శ్రీహరి సూచనలతో కలెక్టర్ వాకాటి కరుణ.. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియం బోధనపై శిక్షణ ఇప్పిస్తున్నారు. తొలుత 60మందికి మాస్టర్ ట్రెరుునర్లుగా శిక్షణ ఇప్పించి.. వారితో మరో 1500 మందికి శిక్షణ ఇప్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇంతలో 300 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుండగా.. మిగతా పాఠశాలల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది. ‘ప్రైవేట్’కు లేని నిబంధనలా? ప్రభుత్వ విద్యారంగం పరిరక్షించబడాలంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటుచేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారుు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు రాగానే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్పిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండితేనే ప్రవేశానికి అనుమతి ఉంది. తద్వారా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. రేషన్లైజేషన్ ద్వారా పాఠశాలలు మూత పడే పరిస్థితి నెలకొంది. అరుునప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఇంగ్లిషు మీడియంలో బోధనకు అనుమతించని ప్రభుత్వం... ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం అనుమతిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైనా ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఇన్ని షరతులు విధించకుండా... ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక తరగతులు ప్రవేశపెట్టి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయూలని పలువురు కోరుతున్నారు. -
ఇంటర్ సిలబస్లో మార్పులు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు బోర్డు సన్నాహాలు ♦ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిష్లో మార్పుచేర్పులు ♦ ద్వితీయ సంవత్సర తెలుగు, మోడర్న్ లాంగ్వేజీలో మార్పులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సిలబస్లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్, తెలుగు, మోడర్న్ లాంగ్వేజ్ సబ్జెక్టుల సిలబస్ను మారుస్తోంది. ఈ విద్యా సంవత్సరం (వచ్చే జూన్) నుంచే ఈ మార్పులను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మార్పుల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది. తెలంగాణ కవులకు పెద్దపీట తెలుగులో తెలంగాణ కవులు, సాహితీవేత్తలు, రచయితల రచనలకు ప్రత్యేక స్థానం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం సగం వరకు ఉన్న ఆంధ్ర కవులు, రచయితల పాఠాలను తొలగించి తెలంగాణ కవులు, రచయితల రచనలు వెలుగులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాండలికాల ప్రత్యేకతలను వీటిల్లో వివరించనుంది. తెలంగాణలోని పద్య కవులు, గద్య కవులు, జానపద కవులు, రచయితలకు సంబంధించి ప్రత్యేక పాఠాలను పొందుపరచనుంది. తెలంగాణ ఉద్యమం, దళిత సాహిత్యం తీరుతె న్నులకు సంబంధించిన పాఠాలు పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు చేసిన మార్పుల్లో కవర్ కాని తెలంగాణ కవులు, రచయితల రచనలకు స్థానం కల్పించనుంది. అయితే తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి ఆద్యులైన ప్రాచీన కవులైన నన్నయ వంటి వారి రచనలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర చిహ్నాలు పొందుపరుచనుంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారికి సంబంధించిన పాఠ్యాంశాలను పొందుపరుచనుంది. సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులపై పాఠ్యాంశాలను రూపొందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్లో యాక్టివిటీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణకు సంబంధించిన అంశాలపై పేరాలు ఇచ్చి, వాటిల్లోని అంశాలపై ప్రశ్నలకు జవాబులు రాబట్టే విధానాన్ని పెట్టేందుకు చర్యలు చేపట్టింది. జూన్ 1 నాటికి ఇచ్చేలా చర్యలు.. సిలబస్ మార్పు చేసిన పుస్తకాలతోపాటు ఇతర అన్ని పుస్తకాలను జూన్ 1 కల్లా ప్రభుత్వ కాలేజీలు, మార్కెట్లో అందుబాటులో ఉంచేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1న కాలేజీలు ప్రారంభం కాగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రథమ సవంత్సర విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో చేరిన రెండోరోజే ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సిలబస్లో మార్పులు తెస్తున్న పుస్తకాలల్లో పాఠ్యాంశాల రచనతోపాటు, అన్ని పుస్తకాల ముద్రణపైనా తెలుగు అకాడమీతో ఇంటర్ బోర్డు చర్చలు జరుపుతోంది. గతేడాదే చే యాల్సి ఉన్నా.. ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ సిలబస్లో గత ఏడాదే మార్పులు చేయాలని భావించింది. కానీ, ఆలస్యం కావడంతో అప్పట్లో మార్పులు చేయలేదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్తోపాటు ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్లో మార్పులు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ మార్పులను ఖరారు చేయనుంది. ఇంగ్లిష్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవి యథాతథంగా అమలు చేస్తే సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని, అందుకే మార్పులు చేయాల్సిందేనని బోర్డు నిర్ణయించింది. ప్రథమ సంవత్సర తెలుగు సిలబస్ను గత ఏడాదే మార్పు చేసిన ఇంటర్ బోర్డు ఈసారి ద్వితీయ సంవత్సర తెలుగు సిలబస్తోపాటు మోడర్న్ లాంగ్వేజ్ సిలబస్లో మార్పులు చేస్తోంది. -
గందరగోళం
♦ ‘కొత్త విద్యాసంవత్సరం’ అస్తవ్యస్తం ♦ పాఠశాలల్లో విఫలమైన ‘ముందస్తు ప్రణాళిక’ ♦ ఈ నెల 21నుంచి నూతన తరగతులన్న విద్యాశాఖ ♦ ఆదేశాల్లో మాత్రం కొరవడిన స్పష్టత ♦ బడిలో దిక్కులు చూస్తున్న ఉపాధ్యాయులు ♦ భారీగా పతనమైన విద్యార్థుల హాజరు... సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీబీఎస్ఈ తరహాల్లో ముందస్తుగా కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలనుకున్న విద్యాశాఖ ఆలోచన బెడిసికొట్టింది. సరైన కార్యాచరణ లేకుండానే పలురకాల ఉత్తర్వులు ఇస్తూ పాఠశాల యాజమాన్యాలను అయోమయానికి గురిచేయడంతో అటు విద్యార్థులు.. ఇటు ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు. సాధారణంగా ఏప్రిల్ 24తో ముగిసి.. జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమయ్యేది. కానీ ఈసారి మార్పులు చేపట్టిన విద్యాశాఖ.. మార్చి 15నాటికి 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు పూర్తి చేసి.. మార్చి 21 నుంచి నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే ప్రణాళిక ప్రకారం పుస్తకాల ముద్రణ, యూనిఫాం పంపిణీ గాడి తప్పడంతో అంతా అయోమయంలో పడింది. జిల్లాలో మొత్తం 5,447 పాఠశాలలున్నాయి. ఇందులో 2,289 ప్రభుత్వ పాఠశాలలు, 3158 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 10,45,878 మంది విద్యార్ధులున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 3,26,743 మంది ఉన్నారు. తాజాగా ఈ నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ వీరికి కొత్త తరగతికి సంబంధించి పాఠ్యాంశ బోధనకు పుస్తకాలు అందలేదు. పాత విద్యార్థుల నుంచి పుస్తకాలు సేకరించి కొత్తగా వచ్చిన వారికి ఇవ్వాలని విద్యాశాఖ సంచాలకులు సూచించినా మెజారిటీ విద్యార్థులు పుస్తకాలు సమర్పించలేదు. దీంతో కొత్త తరగతికి సంబంధించిన బోధనకు ఆదిలోనే అడ్డుకట్టపడింది. మరోవైపు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాటశాలల్లో 5,7, విద్యార్థులు బడి మారాల్సిన పరిస్థితి రావడం.. 10తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగియకపోవడంతో ఆయా తరగతుల విద్యార్థులు పుస్తకాలు వెనక్కు ఇవ్వలేదు. ఇలా అన్ని తరగతుల్లోనూ ఇదే తీరు నెలకొనడంతో ఎక్కడా బోధన సవ్యంగా సాగడం లేదు. ఈ క్రమంలో 3ఆర్(చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు) కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా విద్యాశాఖకు డీఎస్ఈ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని ప్రధానోపాధ్యాయులకు డీఈఓ చేరవేశారు. అయితే ఈ ప్రక్రియ ఒకటి నుంచి మూడోతరగతి విద్యార్థుల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియ బోధనపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో టీచర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. హాజరులో పతనం.. పరీక్షలు ముగిసిన వెంటనే సెలవులు రావడం విద్యార్థులకు అలవాటుగా మారింది. ఈ క్రమంలో కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం.. బోధన మాత్రం నిలిపివేయడంతో విద్యార్థులు సైతం బడికి రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాఠశాలల్లో హాజరుశాతం గణనీయంగా పడిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం దాదాపు 45శాతం తగ్గినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. సరూర్నగర్, వికారాబాద్ డివిజన్లలో విద్యార్థుల గైర్హాజరు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతుండడం గమనార్హం. -
తడ‘బడి’..!
♦ నిలకడలేని విద్యాశాఖ నిర్ణయాలు ♦ పూటకోమాట.. రోజుకో బాట ♦ నీరుగారుతున్న చదువులు ♦ కొత్త విద్యాసంవత్సరంపై అస్పష్టత ♦ గందరగోళంలో విద్యార్థులు పాపన్నపేట: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై సర్కార్ తడబడుతోంది. నిలకడలేని నిర్ణయాలతో చదువులను నీరుగారుస్తోంది. పూటకోమాట.. రోజుకోబాట అన్నట్టుంది విద్యాశాఖ తీరు. ఈనెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒంటిపూట బడుల రద్దు, పదోతరగతి పరీక్షల్లో సీసీ కెమెరాల వినియోగం తదితర నిర్ణయాలు తీసుకోవడం.. ఆ వెంటనే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో.. ఏది అమలవుతుందో.. తెలియని గందరగోళ పరిస్థితిని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన విద్యను అందిస్తూ సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ వెంటనే వాటిని అమలు చేయడానికి తడబడుతోంది. కొత్త నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ అబాసుపాలవుతోంది. సీబీఎస్ఈ తరహాలో ఈసారి మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా మార్చి 8 నుంచి 15 వరకు 6 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు నిర్వహించింది. 20వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసి, వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు చూపి, ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తరువాత విద్యార్థులను పై తరగతికి పంపి మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు పైతరగతి పాఠ్యంశాలు బోధించాలని నిర్ణయించింది. ఇంత తక్కువ సమయంలో మొత్తం పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యే అవకాశం లేనందున పైతరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను సేకరించి కింది తరగతుల వారికి అందించాలని సూచించింది. ఈ క్రమంలో అంగన్వాడీ పిల్లలను ప్రాథమిక పాఠశాలలో, ఐదోతరగతి పిల్లలను ఆరోతరగతిలో, ఏడోతరగతి వారిని ఎనిమిదో తరగతిలో చేర్పించాలని ఆదేశించింది. ఈ సమయంలో ఏప్రిల్ 23 వరకు బడులు రెండు పూటలా నడపాలని కార్యాచరణలో పేర్కొంది. కొండెక్కిన సరికొత్త ఆలోచన... ఈ సారికి కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచేనని తాజాగా ఆదేశాలు జారీ కావడంతో అంతా గందరగోళం నెలకొంది. జిల్లాలో సుమారు 2,800 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొత్త నిర్ణయంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రైవేటు పాఠశాలల పుస్తకాలు ముద్రణ కాకపోవడం వల్లే, వారి కోసం విద్యాసంవత్సరాన్ని పాత పద్ధతినే అనుసరిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎండలు బాగా ఉన్నందున రెండు పూటలా బడులు నడపొద్దని, జూన్ 12 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని మరి కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు కొన్ని వచ్చినందున ఈ పుస్తకాలు చెప్పాలని, విద్యార్థులకు కనీస బేసిక్స్ నేర్పాలా? అనే విషయమై అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడ లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. మొత్తమ్మీద ఏప్రిల్ 23 వరకు ఉన ్న పని దినాలను వినియోగించి, విద్యార్థులకు ఉపయోగపడేలా మలుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. -
ఈ నెల 21నుంచే విద్యాసంవత్సరం ఆరంభం
ఏప్రిల్ 23 వరకు నడవనున్న పాఠశాలలు విద్యారణ్యపురి :జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 21వ తేదీ నుంచే 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈమేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు (సమ్మిటివ్-2) వార్షికపరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఉపాధ్యాయులు ఈనెల 17, 18 తేదీల్లో ఆ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాలు ప్రకటించి వారికి ప్రోగ్రెస్కార్డులు కూడా అందజేయాలి. బుధవారం పరీక్షలు ముగిసినా గురువారం యధావిధిగా పాఠశాలలు నడపాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడించాక విద్యార్థులను పైతరగతుల్లోకి తీసుకొంటారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూటబడులే కొనసాగుతాయి. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 13నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు వస్తున్నా యి. బుధవారం వరకు జిల్లా కేంద్రంలోని గోదాంలోకి 35 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 15,22,811 పాఠ్యపుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 5,20,800 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. మొత్తం 81 టైటిల్స్లో 30 టైటిల్స్ చేరుకున్నాయి. కాగా, పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సరఫరా చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకురాలేదు. దీంతో గతంలో మాదిరిగా ఎం ఈఓలే పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈఓ బుధవారం ఆదేశించారు. -
మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా?
ఉపాధ్యాయ సంఘాల భేటీలో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాబోయే విద్యావార్షిక క్యాలెండర్పై చర్చించేందుకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ డెరైక్టర్ కిషన్ ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో పాల్గొన్న కొన్ని సంఘాలు విద్యాశాఖ రూపొందించిన నూతన క్యాలెండర్ను స్వాగతిస్తున్నామని చెప్పగా, మరికొన్ని సంఘాలు ఈ క్యాలెండర్ అమలును వచ్చే ఏడాది జూన్కు వాయిదా వేయాలని పట్టుబట్టాయి. సమావేశపు ఎజెండాలోని పలు అంశాలపై కొన్ని సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ తమ అభ్యంతరాలను ప్రకటించారు. అభిప్రాయాలు చెప్పేందుకు ప్రతి సంఘానికి ఎంతసేపైనా సమయమిస్తానని డెరైక్టర్ ప్రకటించినా, కొందరు ప్రతినిధులు పదేపదే లేచి నిలబడి వాదులాడుకోవడం పట్ల డెరైక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మనమేమైనా అసెంబ్లీలో ఉన్నామా.. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇక్కడ కెమెరాలు కూడా లేవే’..అన్నారు. వార్షిక కేలండర్పై ఎవరేమన్నారంటే.. రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యావిధానాన్ని అవలంభిస్తే ఇబ్బంది లేదుకానీ, సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ను అమలు చేస్తే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్రెడ్డి అన్నారు. సీబీఎస్ఈ క్యాలండర్ ప్రకారం మార్చి 21నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని, ఆ సమయంలో ఎంతోమంది ఉపాధ్యాయులు టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ ఆపై మూల్యంకన విధులకు వెళతారని చెప్పారు. ఈ దృష్ట్యా నూతన విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి భుజంగరావు మాట్లాడుతూ..ప్రస్తుత ఏడాది షెడ్యూల్ ముందుగానే ఖరారైనందున, కొత్త క్యాలండర్ను వచ్చే ఏడాది జూన్కు వాయిదా వేయాలని కోరారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మధుసూదనరావు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. నూతన క్యాలండర్ను తాము స్వాగతిస్తున్నామన్నారు. మార్చి 21 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ప్రభుత్వం రూపొందించిన విద్యావార్షిక క్యాలండర్ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. -
మగాళ్లమైతే బాగుండేది..
బీజింగ్: చైనాలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము మగాళ్లుగా పుడితే తమ అకడమిక్ కెరీర్ చాలా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజింగ్ యూనివర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం.. చైనాలోని ప్రొఫెసర్లలో లింగవివక్షతపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1600 మంది ప్రొఫెసర్ల అభిప్రాయాలను సేకరించగా.. వారిలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్ష పట్ల తీవ్ర నిరాశలో ఉన్నట్లు వెల్లడైంది. పురుష ప్రొఫెసర్లతో పోలిస్తే మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని 67 శాతం మంది అంగీకరించారు. అయితే సర్వేలో పాల్గొన్న పురుష ప్రొఫెసర్లలో కూడా 33 శాతం మంది ఒకవేళ మహిళలమై ఉంటే తమ అకడమిక్ కెరీర్ తక్కువ స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేయడం అక్కడున్న లింగవివక్షతకు అద్దం పడుతోంది. -
పుస్తకాలు లేవు.. పంతుళ్లూ లేరు
చదువు సాగేదెట్లా.. పూర్తిగా అందని పాఠ్యపుస్తకాలు వేధిస్తున్న సబ్జెక్టు టీచర్ల కొరత రెగ్యులర్ ఎంఈఓలు లేక కొరవడిన పర్యవేక్షణమూడు నెలల్లో పదోతరగతి పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన విద్యారణ్యపురి మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తికానుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థారుులో అందలేదు. జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పుస్తకాలు సరఫరా కాలేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నారుు. అంటే మధ్యలో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఉంది. దీంతో ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఎలా రాయూలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యాసంవత్సరాని(2015-2016)కి జిల్లాలోని 3,260పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం అన్ని రకాల టైటిల్స్ కలిపి 21లక్షల 50వేల పాఠ్యపుస్తకాలు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, 2014 సెప్టెంబర్ డైస్ లెక్కల ప్రకారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ 180 టైటిల్స్కు చెందిన 15,95,545 పుస్తకాలనే పంపించారు. అరుుతే, గతంలో ఉన్న లెక్కలతో పోలిస్తే.. ఈసారి కొన్ని పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరగగా, మరికొన్నింట్లో తగ్గింది. అలాగే, పలు పాఠశాలల్లో ప్రాథమిక స్థారుు నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగిన కారణంగా.. పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రెండో దశలో 5.94 లక్షల పాఠశాల పుస్తకాల కోసం.. మొదటి దశలో పంపించిన పాఠ్యపుస్తకాలు సరిపోని కారణంగా అన్ని టైటిళ్లు కలిపి 5,93,530 పాఠ్యపుస్తకాలు రెండో దశలో అందజేయూలని ఈ ఏడాది ఆగస్టులో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్కు ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అరుుతే, ప్రతిపాదనలు పంపించిన ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాలు అందలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ఇలా పాఠ్యపుస్తకాలు లేకుండానే సమ్మిటివ్-1 పరీక్షలు రాసేశారు. కాగా, ఎస్సె స్సీ విద్యార్థులకు మార్చి 1నుంచి 10వ తరగతి వరకు ప్రీ ఫైనల్, 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠ్యపుస్తకాలు అందని కారణంగా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర మూ ల్యాంకన విధానంలో పరీక్షలు నిర్వహించనున్నందున పాఠ్యపుస్తకాలు కాకుండా టెస్ట్ పేప ర్లు, గైడ్లు చదివి పరీక్షలు రాసే పరిస్థితి లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్, ఎరుుడెడ్, రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీల పాఠశాలల్లో కలిపి 52,075మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 40శాతం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులుగా అనుకున్నా, మిగతా వారందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వీరిలో ఎక్కువ మందికి పాఠ్యపుస్తకాలు అందనందున వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్నది అధికారులకే తెలియాలి. సబ్జెక్టు టీచర్ల కొరత.. వర్క్ అడ్జస్ట్మెంట్ ఆదేశాలు బేఖాతర్ జిల్లాలోని 530వరకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. ఇందులోని కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యాబోధన సాగడం లేదు. అరుుతే, కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఎక్కువగా ఉండగా... వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఏ మండల పరిధి ఎస్జీటీలను అదే మండలంలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను కేటారుుస్తూ కలెక్టర్ అనుమతితో డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇలా 499మంది పీఎస్లు, యూపీఎస్ల్లోని ఎస్జీటీలను హైస్కూళ్లకు కేటారుుంచగా.. ఇందులో 50నుంచి 60శాతం మందే విధుల్లో చేరారు. మిగతా వారందరూ హైస్కూళ్లకు వెళ్లకుండా అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు సమాచారం. పాలకుర్తి మండలం మల్లంపెల్లి హైస్కూల్, కొండపర్తి హైస్కూళ్లకు కేటారుుంచిన ఇద్దరేసి ఎస్జీటీలు ఇప్పటి వరకు విధుల్లో చేరకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అరుుతే, వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా కేటారుుంచిన ఉపాధ్యాయులు ఎందరు విధుల్లో చేరారన్న సరైన సమాచారం డీఈఓ కార్యాలయూనికి అందకపోవడం గమనార్హం. పాఠ్యపుస్తకాల కోసం డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లా ఈ విద్యాసంవత్సరంలో వచ్చిన పాఠ్యపస్తకాలు విద్యార్థులందరికీ సరిపోలేదు. రెండో దశలో మరికొన్ని పుస్తకాలు కావాలని ప్రతిపాదించగా ఇంత వరకూ రాలేదు. ఈ విషయూన్ని వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. అరుునా, మరోసారి మాట్లాడుతాను. ఇక ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు ఇటీవలే వర్క్ అడ్జస్ట్మెంట్ కింద 499మంది ఎస్జీటీలను పంపిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా 60 నుంచి 70శాతమే విధుల్లో చేరారు. మిగతా వారు కూడా విధులకు హాజరయ్యేలా చూస్తాం. అలాగే, ఎస్సెస్సీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. - పి.రాజీవ్, డీఈఓ ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓలు జిల్లాలో 51మండలాలు ఉండగా హన్మకొండ, నల్లబెల్లి మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా 49 మండలాల్లో సీనియర్ పీజీ హెచ్ఎంలే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తుండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. తరచూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ తదితర పనుల్లో ఎంఈఓలు నిమగ్నమవుతున్న కారణంగా స్కూళ్లను పరిశీలించడం సాధ్యం కావడం లేదు. పీజీ హెచ్ఎంలు తమ పాఠశాలలను కూడా చూసుకోవాల్సి ఉండడం దీనికి మరో కారణమని చెప్పొచ్చు. -
వీధుల్లో టీచర్లు.. గాల్లో చదువులు!
పరీక్షల ముందు అదనపు బాధ్యతలు ఆందోళనలో విద్యార్థులు అరకొరగా జనాభా లెక్కలు విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది విద్యార్థుల పరిస్థితి. తలాతోకా లేని నిర్ణయాలతో పిల్లల చదువులు గాలికొదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. పరీక్షలు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం టీచర్లను జనాభా లెక్కల సేకరణ బాధ్యతలను అప్పగించింది. గతంలో వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులతో జనాభా లెక్కల సేకరణ జరిపించేది. దానివల్ల చదువులకు ఆటంకం ఏర్పడేది కాదు. కానీ మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి విద్యా సంవత్సరం మధ్యలో ఆ పనిని అంటగట్టింది. దీంతో దాదాపు నెల రోజుల నుంచి సగం మందికి పైగా టీచర్లు జనాభా సేకరణలో పడ్డారు. తొలుత డిసెంబర్ 15 వరకు ఈ బాధ్యతలు నిర్వహించాలని చెప్పింది. కానీ నాలుగో వంతు కూడా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం పూట చదువులు చెప్పడానికి, మధ్యాహ్నం నుంచి జనాభా లెక్కల సేకరణకు వెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతించారు. పదో తరగతికి బోధించే టీచర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ప్రభుత్వం మెమో న ంబరు 88140/21-11-15 ప్రకారం టెన్త్ సబ్జక్టులు బోధించే టీచర్లకు జనాభా సేకరణ నుంచి మినహాయింపునిచ్చింది. కానీ జీవీఎంసీ పరిధిలో మాత్రం వీరికి మినహాయింపు ఇవ్వలేదు. దీంతో పలువురు ఎలిమెంటరీతోపాటు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జనాభా సేకరణ నిమిత్తం వీధుల్లోకి వెళ్లి ఇంటింటా తిరుగుతున్నారు. దీంతో ముఖ్యంగా పదో తరగతి పిల్లలు నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. మూడు నెలలు టీచర్ల బదిలీల ప్రహసనం కొనసాగడంతో అరకొరగానే చదువులు సాగాయి. మళ్లీ ఇప్పుడు జనాభా లెక్కల బెడద వచ్చిపడింది. -
17న జేఈఈ మెయిన్ నోటిఫికేషన్?
♦ కసరత్తు చేస్తున్న సీబీఎస్ఈ ♦ ఈసారి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే! ♦ ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దుపై త్వరలోనే స్పష్టత సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు క్రమంగా తెరపడుతోంది. వాటిల్లో ప్రవేశాల కోసం ఒకే పరీక్ష నిర్వహిస్తారా? పాత విధానంలోనే వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న గందరగోళం తొలగిపోనుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై పరీక్షల నిర్వహణ సం స్థలు వేర్వేరుగా చర్యలు దిగాయి. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో వేర్వేరు పరీక్షలే జరుగుతాయన్నది స్పష్టం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, 18 ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే మరో 18 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఈనెల 17న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం సీబీఎస్ఈ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన టెండర్ నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ వెల్లడించింది. ఆన్లైన్ద్వారా అందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఇప్పటికే గౌహతి ఐఐటీ ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించింది. అంతేకాకుండా మే 22 లేదా 24వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తామంటూ తేదీని కూడా ఐఐటీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ చర్యల నేపథ్యంలో ఈసారి ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే ఉంటాయని స్పష్టమవుతోంది. ఒకే పరీక్షకు జేఏబీ ప్రతిపాదన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చేపడుతోంది. ఇందుకోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ స్కోర్కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ స్కోర్కు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేస్తోంది. ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏటా ఏదో ఒక ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇక అన్ని ఐఐటీలు, సీబీఎస్ఈలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రవేశాలు చేపడుతోంది. అయితే జేఈఈ మెయిన్లో అత్యధిక మార్కులు సాధించిన 1.5 లక్షల మందిని మాత్రమే ఐఐటీ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇలా వేర్వేరు పరీక్షల విధానం వల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని, సీట్లు మిగిలిపోతున్నాయన్న వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సెలింగ్ విధానం అమల్లోకి తేవాలని జేఏబీ ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన అక్టోబర్ 1న వరంగల్ నిట్లో, 6వ తేదీన ముంబై ఐఐటీలో జరిగిన సమావేశాల్లో వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీల నివేదికలు ఇంకా రాలేదు. ఒకే పరీక్షతోపాటు ఎన్ఐటీ ప్రవేశాల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీని కూడా రద్దు చేయాలన్న ఆంశంపై అధ్యయనం చే యాలని స్పష్టం చేశారు. అయితే ఆ కమిటీల నివేదికల పరిస్థితి ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని పక్కనబెట్టి పాత పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహణ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇంటర్ మార్కుల వెయిటేజీ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఫీజుల ఖరారుకు త్వరలో నోటిఫికేషన్
♦ వృత్తి విద్యా కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచి వసూలుకు ఏర్పాట్లు ♦ ఒకట్రెండు రోజుల్లో అధికారిక నిర్ణయం ♦ సీఎం వద్ద ఏఎఫ్ఆర్సీ సభ్యుల నియామకం ఫైలు ♦ {పస్తుత కమిటీ నేతృత్వంలోనే నోటిఫికేషన్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2016-17) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వం రెండు నెలల క్రితం జస్టిస్ స్వరూప్రెడ్డి చైర్మన్గా ప్రత్యేక ఫీజులు, నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులతో పాటు ఇంజనీరింగ్, వైద్య తదితర విద్యా విభాగాలకు చెందిన అధికారులు, కాలేజీ ప్రతినిధులు, యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. జస్టిస్ స్వరూప్రెడ్డి కమిటీ సభ్యుల కోసం ఒక్కో కేటగిరీలో ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. ఒక్కో కేటగిరిలో ఒక్కొక్కరి పేరును కమిటీ సభ్యులుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే, ఆ ఫైలు ప్రస్తుతం కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉండడంతో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడేసరికి ఆలసమయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో కాలేజీ వారీగా, కోర్సు వారీగా ఫీజులను ఖరారు చేయడం కష్టమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న కమిటీ నేతృత్వంలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏడాదికేనా? మూడేళ్లకా! ఉమ్మడి రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఖరారు కోసం 2012లో ప్రభుత్వం ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేసింది. కాలేజీ ఆదాయ వ్యయాలను బట్టి 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో ఆయా కాలేజీలు వసూలు చేయాల్సిన ఫీజులను కమిటీ ఖరారు చేసింది. ఆ గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగుస్తోంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఒక్క విద్యా సంవత్సరం కోసమే ఫీజులను ఖరారు చేస్తారా? వచ్చే మూడేళ్ల కోసం ఖరారు చేస్తారా? అన్న విషయాన్ని నోటిఫికేషన్లోనే స్పష్టం చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీతగాళ్లు కావాలంటే దొరకని పరిస్థితి రావాలని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్య వంటి వాటిలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్య, ఉపాధి రంగాల్లో హామీలు- నిర్లక్ష్యం’ అంశంపై శనివారమిక్కడి గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్యర్యంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, భాగ్య నాయక్, రమేశ్ రెడ్డి, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, కె.నాగేశ్వర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చేశారు. కాషాయీకరణకు బీజేపీ కుట్ర: కంచె ఐలయ్య కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి పేదలకు విద్యను దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. విద్యను కాషాయీకరణ చేసే దురాలోచనలో ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 వేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ప్రజలంతా ఇంగ్లిష్ విద్యను చదువుకుంటే కేసీఆర్కు, దొరలకు జీతగాళ్లు దొరకరనే భయం ఉంది. చరిత్రను వక్రీకరిస్తున్నారు: ప్రొ. భాగ్య నాయక్ చరిత్రను కేంద్రం వక్రీకరిస్తోంది. పుష్కరాలకోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం టీచర్లను నియమించలేకపోతోంది. నిర్బంధ విద్య అమలు చేయాలి: విశ్వేశ్వరరావు ప్రతీ వ్యక్తికి ఉచితంగా నిర్బంధ విద్యను అమలుచేయాలి. రాష్ట్రంలో విద్యావిధానం వల్ల పేదలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. 22 వేల పాఠశాలల్లో మంచినీటి సౌకర్యంలేదు.. 12వేల బడుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది. విద్య, ఉద్యోగాలపై శ్వేతపత్రం: కె.నాగేశ్వర్ విద్య, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలున్నా వాటిని భర్తీచేయడం లేదు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి. సమావేశంలో చేసిన తీర్మానాలు.. ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. ⇒ రీయింబర్సుమెంటు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. ⇒ జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావాలి. ⇒ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఆపాలి. -
ఈ ఏడాది డీఎస్సీ లేదు
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు చాలా జిల్లాల్లో అవసరానికి మించి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్పంగా అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అవసరమైతే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు లేదా విద్యా వలంటీర్లను నియమిస్తామని వివరించారు. బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష అనంతరం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియంపై పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు అనుగుణంగా టీచర్లు ఆంగ్ల మాధ్యమంలో చెప్పగలిగేలా మెథడాలజీలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. అందుకే ఈ విద్యా సంవత్సరం డీఎస్సీ నిర్వహించబోమని చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిపై సాధారణ పరిపాలన శాఖ (జే ఏడీ), న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల అవసరం ఉందా అన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చిస్తామన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సమస్యలపై బుధవారం ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఇతర సమస్యలను కడియంకు తెలియజేశారు. నెలాఖరులోగా హాస్టళ్లలో ప్రవేశాలు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన 102 బాలికల హాస్టళ్లలో ఈ నెలాఖరులోగా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1 నుంచి బాలికలు హాస్టళ్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ‘‘ఒక్కో హాస్టల్లో 25 గదులు నిర్మించాం. ఒక్కో గదిలో నలుగురు బాలికలకు వసతి కల్పిస్తాం. ఇలా 102 హాస్టళ్లలో 10,200 మంది బాలికలకు హాస్టల్ సదుపాయం కల్పిస్తాం. వీటిని ప్రభుత్వం ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభిస్తాం. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రూ.247 కోట్లతో ఈ హాస్టళ్లను నిర్మించాం. వీటి నిర్వహణ బాధ్యతను సీనియర్ టీచర్లకు అప్పగించాలా? ఔట్సోర్సింగ్పై ఇతరులకు అప్పగించాలా? అన్నది ఆలోచిస్తున్నాం. బాలికల హాస్టళ్లు కాబట్టి భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. రాష్ట్రానికి మొదటి విడతలో మంజూరైన 192 మోడల్ స్కూళ్లలో 177 స్కూళ్లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ ఏడాది శంకర్పల్లి, షాబాద్, మంచిర్యాల, నర్నూర్, కొడిమ్యాలలో ప్రవేశాలు చేపట్టామన్నారు. స్కూళ్లల్లో రికార్డు స్థాయిలో 18,820 మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులో 30 శాతం మరుగుదొడ్లలో నీటి సదుపాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
వలంటీర్ల నియామకం ఎండమావే !
మోడల్ స్కూళ్లలో పరిస్థితి పట్టించుకోని యంత్రాంగం కంచిలి:ఏపీ మోడల్ స్కూళ్లలో అకడమిక్ వలంవటీర్ల నియామకం ఎండమావిగా మారింది. ఈ ప్రక్రియను ఇంతవరకూ చేపట్టలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్పప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేసిన చేసిన వారికి సైతం నియామకపత్రాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువులు సక్రమంగా సాగే పరిస్థితి కనిపించటం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మోడల్ స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్లో సుమారు 500 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్నారు. ఒక్కో స్కూల్లో 13 నుంచి 15 మంది వరకు రెగ్యులర్ అభ్యసనా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నియామక ప్రక్రియలు చేపట్టలేదు. తాత్కాలికంగా సబ్జెక్టు టీచర్ల కొరత నుంచి గట్టెక్కటానికి నియమించాల్సిన అకడమిక్ వటంటీర్లను కూడా ఇంతవరకు నియమించకపోవంతో పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తవ్వగల వనే సందేహంఉపాధ్యాయ సిబ్బందిలో సైతం నెలకొంది. మోడల్ స్కూళ్ల వ్యవస్థ ఏర్పడి మూడో విద్యాసంవత్సరం మొదలైనప్పటికీ బాలారిష్టాల సమస్యలు ఇంతవరకు పరిష్కరించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే భావనే వ్యక్తమవుతోంది. కార్పోరేట్ విద్యాసంస్థల స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాల్లో అధ్యాపక సిబ్బందినే ఇంతవరకు పూర్తిస్థాయిలో నియమించలేదు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వీటి ఏర్పాటు లక్ష్యం ఎంతవరకూ ఫలిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రారంభానికి నోచుకోని వసతి గృహ సముదాయాలు ఒకవైపు అకడమిక్ వటంటీర్ల సమస్యతో మోడల్ స్కూల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నిర్మాణం పూర్తిచేసుకొన్న వసతి గృహాలను ప్రారంభించకపోవటంతో విద్యార్థులు హాస్టల్ వసతికి నోచుకోవటం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీటి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేపట్టలేదు. ఫలితంగా వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో మఠంసరియాపల్లి, రాజపురం, సోంపేట, ఇచ్ఛాపురం, కరవంజ, ఈదులవలస పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చిన్నపాటి పనులు పూర్తి చేయకపోవటంతో ఈ విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులు వసతికి నోచుకుంటారో లేదో అనే అనుమానం తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం కూడా మోడల్ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై సీరియస్గా స్పందించకపోటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యింది. -
కరిక్యులంలో ‘సామాజిక సేవ’కే పెద్దపీట!
మెడికల్ కాలేజీలో సీటు కోసం విపరీతమైన డిమాండ్... లక్షలు వెచ్చించేందుకైనా వెనుకాడని పరిస్థితి. దీంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కమర్షియల్గా మారుతోందనే సర్వత్రా విమర్శలు. మరో వైపు ఆధునిక అవసరాలకు తగ్గట్లు సిలబస్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఎంసీఐ 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్లో కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాశ్ మిశ్రాతో గెస్ట్కాలం... ప్రపంచంలో ఎక్కువ మంది వైద్య నిపుణులను అందిస్తున్న దేశంగా మనకు గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా 400 వైద్య కళాశాలల్లో 56 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కానీ వైద్య విద్యా విధానంలో నాణ్యత ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంబీబీఎస్ కొత్త కరిక్యులం నాణ్యతా ప్రమాణాలను పెంచే విధంగా ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ విధానాల్లో మార్పులు ఉంటాయి. వైద్య వృత్తి ప్రధాన ఉద్దేశమైన సమాజ సేవ భావనను పెంపొందించేలా సిలబస్ ఉంటుంది. సిలబస్లోని అంశాలు అభ్యసనం, నాణ్యత, సామాజిక కోణాలు.. కొత్త సిలబస్లో ప్రధానాంశాలుగా ఉంటాయి. వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీని రూపకల్పన జరిగింది. అవసరాలకు తగ్గట్లు కరిక్యులంను నిరంతరం సమీక్షిస్తుంటేనే నాణ్యత సాధ్యమౌతుంది. కొత్త కరిక్యులం నమూనాకు ఎంసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంసీఐ జనరల్ బాడీలు ఆమోదం తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి వస్తుంది. కనీస ప్రమాణాలు తప్పనిసరి కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఎంసీఐ నిబంధనలు సరళం చేయాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంసీఐ యాక్ట్ - 1956లో 33వ సెక్షన్లో కొన్ని కనీస ప్రమాణాలను సూచించింది. ఈ సదుపాయాలు ఉంటేనే ఇటు విద్యార్థులు, అటు రోగుల కోసం టీచింగ్ హాస్పిటల్స్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరుతుంది. అలా లేకుంటే ప్రజలను రోగాల నుంచి కాపాడాల్సిన వైద్య వృత్తి నాణ్యత విషయంలో రాజీ పడినట్లవుతుంది. ‘నకిలీ’ వాస్తవమే మౌలిక సదుపాయాలు, బోధన పరంగా ఎన్నో నిబంధనలు విధించాం. అయినా ఎంసీఐ పర్యవేక్షణ కమిటీల తనిఖీ సమయంలో నకిలీ ఫ్యాకల్టీ, మెటీరియల్, సదుపాయాలు వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఐ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఏదైనా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ లోపాలును గుర్తించినప్పుడు సదరు కమిటీ ఎంసీఐ ఎథిక్స్ కమిటీకి నివేదిక అందిస్తుంది. దీని ఆధారంగా ఎంసీఐ సంబంధిత మెడికల్ ఇన్స్టిట్యూట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. శాస్త్రీయంగా ఫీజుల పెంపు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజుల పెంపు అధికారం రాష్ట్రాలకు కల్పించారు. ఆయా రాష్ట్రాల మధ్య ఎంబీబీఎస్ ఫీజుల వ్యత్యాసాలకు కారణం ఇదే. మెడికల్ సీటు ఫీజుల పెంపు శాస్త్రీయంగా ఉండాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమించాలి. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి అధ్యక్షులుగా, విద్యావేత్త, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉండాలి. ఆయా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు అందించే ప్రతిపాదనలు, వాస్తవాలను పరిశీలించిన తర్వాత కమిటీ ఫీజులపై సిఫార్సులు చేస్తుంది. ఆ రాష్ట్రాలు ఫీజులును నిర్ణయించాలి. ఇంటర్న్షిప్ వ్యతిరేకత ఇందుకే మెడికల్ గ్రాడ్యుయేట్లకు తప్పనిసరి చేసిన రూరల్ ఇంటర్న్షిప్పై విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది. రూరల్ హెల్త్ సెంటర్స్లో మౌలిక సదుపాయాల లేమి ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్న్షిప్ వల్ల విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరగడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్న్షిప్ ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే విద్యార్థుల్లో ఇంటర్న్షిప్ పట్ల ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. సేవాభావం పెంచుకోవాలి వైద్య విద్య, వృత్తులను పవిత్రమైనవిగా భావించాలి. తమ వల్ల సమాజానికి మేలు జరగాలి అనే సేవా భావం పెంచుకోవాలి. అప్పుడే ఈ కోర్సు ఉద్దేశం నెరవేరుతుంది. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత మెడికల్ విద్యా విభాగంలో వస్తున్న మార్పులపై అప్డేట్ అవుతూ ముందుకు సాగాలి. -
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
-
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలవుతున్న పరీక్షల విధానానికి బదులుగా సెమిస్టర్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఉన్నత విద్యను పటిష్టపర్చడంలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. యూజీ కోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంస్కరణలకు సంబంధించి సిలబస్లో మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పన వంటి అంశాల్లో ఉన్నత విద్యామండలి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నిటిలోనూ ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి ♦ అన్ని కాలేజీలు సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలి. ♦ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పాట్రన్ను అనుసరించాలి. ♦ అన్ని కాలేజీలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. ♦ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేందుకు మొదటి సెమిస్టర్లోనే కార్యాచ రణ ప్రణాళికను తప్పనిసరిగా అమలుపరచాలి. ♦ సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను మెరుగుపర్చడంతో పాటు బోర్డ్ ఆఫ్ స్టడీస్నుంచి అనుమతులు పొందాలి. -
చదువుల సీజన్లో పుస్తకాల అడ్డా..
కేజీ టు పీజీ.. కేరాఫ్ కోఠి సెకండ్హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేక సెల్లార్ సుల్తాన్బజార్: విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులకు పుస్తకాల కోసం ఒకటే టెన్షన్. ఏ షాప్కు వెళ్లినా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరికొన్ని ఉండవు. ఎక్కడికెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. సమయానికి పుస్తకాలు దొరక్క తల్ల్లిదండ్రులు సైతం హైరానా పడతారు. కానీ ఏ పుస్తకం కావాలన్నా.. అందరూ చూపించే దారి కేరాఫ్ ‘కోఠి’. కేజీ నుంచి పీజీ వరకు.. ఏ పుస్తకం కావాలన్నా ఆ ప్రాంతం పేరే చెబుతారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పైతరగతులకు కావాల్సిన పుస్తకాల అన్వేషణ మొదలైంది. కొత్త టెక్ట్స్, నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠిలోని పుస్తకాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. కోఠి, సుల్తాన్బజార్, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్న పుస్తకాల దుకాణాల్లో దొరకని స్టేషనరీ అంటూ ఉండదు. పోటీ పరీక్షల పుస్తకాలు సైతం.. కోఠిలోని పుస్తకాల దుకాణాలలో కేజీ నుంచి పీజీ వరకు టెక్ట్స్ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతేగాక ఎంసెట్, లాసెట్, డైట్సెట్, ఎడ్సెట్, ఏఐఈఈఈ.. ఇతర అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేసవి తర్వాత వర్షకాలంలో ఇక్కడ ‘పుస్తకాల సీజన్’గా పిలుస్తూ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తూ వ్యాపారులు విద్యార్థులను, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. కిలోల్లో నోటు పుస్తకాలు.. చిత్తు కాగితాలు కిలోలుగా అమ్మే ఈ రోజుల్లో నోటు పుస్తకాలు సైతం కిలోల్లో కొనవచ్చంటే అశ్చర్యపోతారు. కానీ కోఠిలో ఏ షాప్కు వెళ్లినా నోటు పుస్తకాలను కిలో లెక్కన అమ్ముతారు. చాలామందికి ఇది తెలియకపోయినా ఇక్కడ సీజనల్ వ్యాపారంలో భాగంగా వ్యాపారులు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక్క నోటు పుస్తకం కనీస ధర రూ.30 ఉంటే.. ఈ మొత్తానికి మూడు పుస్తకాలు సొంతం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ‘కిలో’ పుస్తకాలంటే ఆస్తకి చూపుతున్నారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా.. అందరూ కొత్త టెక్ట్స్ పుస్తకాలు కొనలేరు.. ఇలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను సగం ధరలో కూడా ఇక్కడ దొరుకుతాయి. పేరుకు సెకండ్ హ్యాండే గాని.. చాలావరకు కొత్త పుస్తకాలే ఉంటాయి. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా కిందనున్న సెల్లార్లో ఇలాంటి దుకాణాలే ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల పుస్తకాలు సగం ధరలో విక్రయిస్తున్నారు. రూ. 1200 ఉన్న పుస్తకం ఇక్కడ కేవలం రూ.400కు పొందవచ్చు. -
బడిబాట ఆలస్యం
మన్యంలో డ్రాపౌట్స్ సంఖ్య 6,200 వారిని బడిలో చేర్పించాలని పీవో ఆదేశం.. కొయ్యూరు : బడి గంట మోగేందుకు సమయం ఆసన్నమైంది. మూడు రోజుల్లో పాఠశాలలు తెరవనున్నారు. ప్రతి ఏటా అధికారులు, ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించి, తల్లిదండ్రులను అవగాహన పరిచి చిన్నారులను పాఠశాలలో చేర్పిస్తుంటారు. గత ఏడాది డ్రాపౌట్స్గా ఉన్న వారిని గుర్తించి వారిని మరలా పాఠశాలలో చేర్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది బడిబాట ఇంతవరకు ప్రారంభం కాలేదు. మన్యంలో అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది పాఠశాలకు ఎక్కువ రోజులు రాకుండా ఇంటి వద్దనే ఉండిపోయిన విద్యార్థుల సంఖ్య 6,200. పాఠశాలలు తెరిచే నాటికి వీరందరిని తిరిగి చేర్పించాలని ఐటీడీఏ పీవో హరినారాయన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతను ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలకు అప్పగించారు. ఉన్న తక్కువ సమయంలో అంత మంది విద్యార్థులకు పాఠశాలల్లో చేర్పించడం సాధ్యమేనా..? ప్రతి ఏడాది ప్రభుత్వం పాఠశాల ప్రారంభానికి ముందే బడిబాట నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది ఆలస్యంగా 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. గత విద్యాసంవత్సరంలో డ్రాపౌట్స్ను తిరిగి బడిలోని చేర్పించడం, కొత్త అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు గ్రామ బాట పడతారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. డ్రాపౌట్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మరలా బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. అయినా డ్రాపౌట్స్ సంఖ్య తగ్గడం లేదు. బడికి రాకుండా ఇంటి వద్దనే ఉన్న విద్యార్థులు 6,200 అని అధికారులు లెక్కగట్టారు. వీరిని మూడు రోజుల్లో బడిలో చేర్చడం సాధ్యం కాదని ఇటు ఉపాధ్యాయులు అంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని తీసుకురావడం ఇబ్బందిగానే ఉంటుంది. మన్యంలో అక్షరాస్యత పెరగాలంటే ముందుగా చిన్నారుల త ల్లిదండ్రులల్లో అవగాహన రావాలి. వారితో పనులు చేయించకుండా బడికి పంపించాలి.. అప్పుడే కొంత వరకు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది. -
రేపటి నుంచే బడులు
♦ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచే ♦ ఉన్నత పాఠశాలలు 9:30 నుంచి సాయంత్రం 5 వరకు ♦ తెలుగు, సాంఘిక సబ్జెక్టుల్లో మార్పులు ♦ త్రైమాసిక పరీక్షలకు చెల్లు చీటీ ♦ అకడమిక్ కేలండర్ జారీ చేసిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం (12వ తేదీ) నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈసారి నుంచి పలు సంస్కరణలు అమలుకానున్నాయి. పాఠశాలల పనివేళలతో పాటు పీరియడ్ల సంఖ్య, పరీక్షల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న త్రైమాసిక పరీక్షలను తొలగించింది. దీంతో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలే ఉంటాయి. ఇక మార్చి 20 నాటికి పరీక్షలు, ఫలితాల వెల్లడిని పూర్తిచేసి.. వేసవి సెలవుల ప్రారంభంలోగా అంటే ఏప్రిల్ 23 వరకు పైతరగతికి సంబంధించిన పాఠ్యాంశాల బోధన చేపట్టేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి నుంచి ఏప్రిల్ 23 వరకు ఉన్న ఒంటిపూట బడుల విధానాన్ని తొలగించింది. మొత్తంగా పీరియడ్ల సంఖ్యతోపాటు ఒక రోజులో ఉండే పీరియడ్లను 9 నుంచి 8కి తగ్గించింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ముందుగానే నిర్వహించి, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశాకే టీచర్లంతా పదో తరగతి పరీక్షల పనులకు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పదో తరగతి ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లను తీసుకోవాలని, వాల్యుయేషన్కు ప్రభుత్వ టీచర్లను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలతో విద్యా వార్షిక కేలండర్ను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు విడుదల చేశారు. కేలండర్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పాఠశాలలు కొనసాగేలా పక్కా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలను ఆదేశించారు. పరీక్షలు.. ఫలితాలు.. ఇంటర్నల్స్: ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 జూలై 31న. ఎఫ్ఏ-2 ఆగస్టు 31న, ఎఫ్ఏ-3 నవంబర్ 30న. ఎఫ్ఏ-4 ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28న, పదో తరగతి వారికి జనవరి 31న నిర్వహించాలి. రాతపరీక్షలు: అర్ధవార్షిక పరీక్షలు.. (ఎస్ఏ-1) దసరా సెలవులకు ముందు అక్టోబర్ 3 నుంచి 9 వరకు; వార్షిక పరీక్షలు.. ఒకటి నుంచి 9వ తరగతి వరకు మార్చి 7నుంచి 14 వరకు. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. * ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కలు వచ్చేలా ప్రధానోపాధ్యాలంతా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అక్టోబర్ 30 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. * ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల ఫలితాలను మార్చి 20న ప్రకటించాలి. తల్లిదండ్రులతో చర్చించాలి. అదేరోజున ఫలితాలపై సమీక్షించాలి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు పైతరగతుల (వచ్చే విద్యా సంవత్సరపు) బోధన చేపట్టాలి. * ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు. వచ్చే ఏడాది జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం. కేలండర్లోని ప్రధాన అంశాలు * ప్రాథమిక పాఠశాలలను 7 గంటల పాటు కొనసాగించాలి (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు). * ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటల పాటు నడవాలి. ప్రాథమికోన్నత స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పాత వేళలు కొనసాగుతాయి. * సబ్జెక్టుల వారీగా మొత్తం పీరియడ్ల సంఖ్య 54 నుంచి 48కి తగ్గింది. లైబ్రరీ పీరియడ్లు రెండింటిని తొలగించారు. ఫిజికల్ సైన్స్ పీరియడ్లను 4 నుంచి 5కు పెంచారు. వర్క్, కంప్యూటర్ విద్య, విలువల విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్లకు మొత్తంగా 9 పీరియడ్లు ఉంటే వాటిని ఐదుకు తగ్గించారు. సాంఘిక అంశాలపై పీరియడ్ను తొలగించారు. ప్రభుత్వం ప్రకటించన సెలవుల వివరాలు ⇒ అక్టోబర్ 10 నుంచి 25 వరకు దసరా సెలవులు ⇒ 2016 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ⇒ మైనారిటీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్మస్ సెలవులు -
14న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను 6వ తర గతిలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14న ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రత్యేక కేటగిరీ పాఠశాలలుగా గుర్తించడంతో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. గతంలో లాటరీ ద్వారా ప్రవేశాలు చేపట్టడం వల్ల ప్రతిభావంతులకు సీట్లు రావడం లేదన్న వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 177 మోడల్ స్కూళ్లలో 14,160 సీట్ల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50లు ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. ఫీజు చెల్లించాక జ్ట్టిఞ://్ట్ఛ్చజ్చ్చఝట.ఛి జజ.జౌఠి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు ఈ నెల 2 నుంచి: ఫీజులు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ 8వ తేదీ వరకు: ఫీజు చెల్లింపునకు చివరి గడువు 9వ తేదీ: దరఖాస్తులు సబ్మిషన్ చివరి గడువు 14వ తేదీ: ప్రవేశ పరీక్ష.(ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆయా మోడల్ స్కూల్స్/మండల కేంద్రాల్లో). పూర్తి వివరాలతో హాజరు