Ajay Devgn
-
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్బస్టర్ సిరీస్లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్గా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్లో పోలీసు బ్యాక్డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
అజయ్ దేవ్గణ్ ‘ఆజాద్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఒకప్పుడు క్షమించేవాళ్లు.. ఇప్పుడలా కాదు!: బాలీవుడ్ హీరో
ప్రేక్షకులు మారిపోయారంటున్నాడు హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn). ఒకప్పుడు తమ తప్పుల్ని జనాలు చూసీచూడనట్లు వదిలేసేవారని, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తున్నారంటున్నాడు. ప్రస్తుతం అజయ్ ఆజాద్ (Azaad Movie) అనే సినిమా చేస్తున్నాడు.మా తప్పుల్ని క్షమించేవాళ్లుఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము పని చేస్తున్న ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకునేవాళ్లం. అప్పుడు నేర్చుకోగలిగేంత సమయం, స్వేచ్ఛ ఉండేవి. అప్పటి ప్రేక్షకులు మా తప్పుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు వారి కంటపడ్డా క్షమించేవాళ్లు. కానీ ఇప్పుడున్నవాళ్లు ప్రతిదాన్ని పట్టిపట్టి చూస్తున్నారు. ఏమాత్రం తప్పులు కనిపించినా అస్సలు క్షమించట్లేదు. భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వారి అంచనాల్ని అందుకునేందుకు నటీనటులు మరింత సిద్ధంగా ఉండాలి. అయినా ఈ జనరేషన్ యాక్టర్స్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అజయ్.. గతంలో అనేక సినిమాల్లో గుర్రపు సార్వీ చేశాడు. అలాగే తన లేటెస్ట్ మూవీ ఆజాద్ చిత్రంలోనూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడట! ఈ చిత్రంతో అజయ్ బంధువు ఆమన్ దేవ్గణ్, రవీనా టండన్ కూతురు రాషా తడానీ వెండితెరకు పరిచయం కానున్నారు. డయానా పెంటనీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రగ్యా కపూర్, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 17న విడుదల కానుంది.అజయ్ దేవ్గణ్ అసలు పేరు?అజయ్ అసలు పేరు విశాల్. ఇండస్ట్రీలో చాలామంది విశాల్ పేరుతో ఉండటంతో అతడు పేరు మార్చుకున్నాడు. 1991లో ఫూల్ ఔర్ కాంటే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మార్కులు కొట్టేసి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. అతడు హీరోగా నటించిన రెండో సినిమా జిగార్. ఇందులో మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాడు. కరిష్మా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.(చదవండి: Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా)హీరోగా, విలన్గా..నాజయజ్, జకమ్, హమహ దిల్ దే చుకే సనమ్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అండ్ కంపెనీ, కంపెనీ, గంగాజల్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సింగం, తాన్హాజీ, దృశ్యం.. ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. దీవాంగే, ఖాకీ, కాల్ వంటి చిత్రాల్లో విలన్గానూ యాక్ట్ చేశాడు. ఇటీవలే సింగం అగైన్, నామ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నిర్మాతగా..హిందుస్తాన్ కీ కసమ్, దిల్ క్యా కరే, రాజు చాచా, యు మి ఔర్ హమ్, సన్ ఆఫ్ సర్దార్, సింగం రిటర్న్స్, తాన్హాజీ, భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, రన్వే 34, సింగం అగైన్ వంటి పలు చిత్రాలను నిర్మించాడు. బాలీవుడ్లో సొంత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి హీరో కూడా ఈయనే! ఈయన తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR Movie).చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ! -
ఓటీటీలో రూ.350 కోట్ల యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
ఈ ఏడాది వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీస్లో సింగం అగైన్ ముందు వరుసలో ఉంటుంది. ఇది సింగం మూవీ బ్లాక్బస్టర్ సిరీస్లో మూడో భాగం. అజయ్ దేవ్గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్ -
మా ప్రాంక్ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో
యూట్యూబ్లో ప్రాంకులు బోలెడు కనిపిస్తాయి. సినిమావాళ్లు కూడా తమ ప్రాజెక్టు ప్రమోషన్స్ కోసం ఈ ప్రాంకుల్ని వాడుకున్నారు. అయితే సెట్లోనూ మేము ఫన్ కోసం ప్రాంక్ చేసేవాళ్లమంటున్నారు హీరో అజయ్ దేవ్గణ్, దర్శకుడు రోహిత్ శెట్టి. సింగం అగైన్ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాంతో సరదాఈ సందర్భంగా వీళ్లిద్దరూ సెట్లోని ఓ వ్యక్తి షర్ట్పై ఇంక్ పోసిన ప్రాంక్ వీడియోను ప్లే చేశారు. అది చూసిన రోహిత్ శెట్టి.. ఇది మేము చేసినవాటిలో చాలా చిన్న ప్రాంక్. ఒకసారైతే మా ప్రొడక్షన్ టీమ్ మెంబర్ ఇంటికి ఓ మహిళను, బాబును పంపించాం. అతడి మొదటి భార్యను నేనే అంటూ ఆమెతో నాటకం ఆడించాము. ఆ రేంజ్ వరకు వెళ్లాము అని చెప్పుకొచ్చాడు.మావల్ల విడాకులు కూడా..ఇంతలో అజయ్ దేవ్గణ్ మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రాంక్స్టర్స్ ఏదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మేమైతే పెద్దగా ఆలోచించకుండానే ప్రాంక్ చేసేవాళ్లం. మావల్ల ఒకటీరెండు విడాకులు కూడా జరిగాయి అని తెలిపాడు. సినిమాఇకపోతే అజయ్, రోహిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సింగం అగైన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది.చదవండి: ఆలియా భట్తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే? -
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్లిమిటెడ్గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
చింపాంజీ దాడి.. ఆ హీరోనే రక్షించాడు: ఆమిర్ ఖాన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్గా యాక్ట్ చేశారు.చింపాంజీ దాడితాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు. పారిపోండి అంటూ ఒకటే పరుగుఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.చదవండి: బిగ్బాస్ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు -
10 ఏళ్ల తర్వాత రిలీజవుతోన్న స్టార్ హీరో మూవీ
షూటింగ్ పూర్తయినా రిలీజ్కు నోచుకోని సినిమాలు కొన్నుంటాయి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ హీరోగా నటించిన 'నామ్' మూవీ కూడా పై జాబితాలోకే వస్తుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు.. ఏకంగా దశాబ్ధం క్రితం నాటిది! అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూంగ్ట ఎంటర్టైన్మెంట్, స్నిగ్ధ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట నిర్మించాడు.దశాబ్దం తర్వాత రిలీజ్భూమిక చావ్లా, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 22న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అజయ్-అజ్మీర్ డైరెక్షన్లో ఇది నాలుగో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్లో హల్చల్, ప్యార్ తో హోనా హై, దీవాంగె (2002) సినిమాలు వచ్చాయి.ఇద్దరివి మూడు సినిమాలు!నామ్ మూవీ షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. ఇన్నాళ్లకు చిక్కుముడులన్నీ విడిపోవడంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నామ్ చిత్రయూనిట్ పేర్కొంది. ఇకపోతే అజయ్ 'సింగం అగైన్', బజ్మీ 'భూల్ భులయ్యా 3' సినిమాలు నవంబర్ 1న రిలీజ్ కానుండటం గమనార్హం.చదవండి: ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి -
ఓటీటీలో భారీ డిజాస్టర్ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?
అజయ్ దేవగన్, టబు నటించిన బాలీవుడ్ సినిమా ' ఔరో మే కహా దమ్ థా' ఓటీటీలో విడుదలైంది. ఆగష్టు 2న విడుదలైన ఈ మూవీ భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. రొమాంటిక్ థ్రిల్లర్గా నీరజ్ పాండే తెరకెక్కించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్, సంగీతా అహిర్, కుమార్ మంగత్ సంయుక్తంగా నిర్మించారు. పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసింది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాతలు నష్టాలను మిగిల్చింది.ఇదీ చదవండి: ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్'ఔరో మే కహా దమ్ థా' సినిమాను ఎలాంటి ప్రకటన లేకుండానే సెప్టెంబర్ 13న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాను చూడాలంటే భారీ మొత్తంలో రెంట్ చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్లో భారీ డిజాస్టర్గా నిలిచిన ఈ చిత్రానికి అధిక మొత్తంలో రెంట్ పెట్టడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.అగష్టు 2న విడుదలైన తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. కనీసం రూ.2 కోట్ల కూడా ఓపెనింగ్స్ రాలేదు. బాలీవుడ్లో ఈ ఏడాది భారీ డిజాస్టర్ చిత్రాల లిస్ట్లో ' ఔరో మే కహా దమ్ థా' ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వాణిజ్య పరంగా నిర్మాతలు,పంపిణీదారులకు సుమారు రూ. 150 కోట్ల వరకు నష్టం మిగిల్చిందని ప్రచారం ఉంది. ఫైనల్గా ఈ చిత్రం రూ. 12.91 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే, ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. -
'హీరోను పలకరించలేదని సినిమా నుంచి తీసేశారు!'
'సన్ ఆఫ్ సర్దార్'.. 2012లో వచ్చిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇది తెలుగులో వచ్చిన మర్యాద రామన్న మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే! పుష్కరకాలం తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో అజయ్ దేవ్గణ్ హీరోగా నటించనున్నాడు.ప్రవర్తన బాగోలేదనే..ఈ సీక్వెల్లో నటుడు విజయ్ రాజ్ను కూడా సెలక్ట్ చేశారు. తర్వాత అర్ధాంతరంగా అతడిని సినిమా నుంచి తొలగించారు. అతడి ప్రవర్తన బాగోలేదనే మూవీలో నుంచి తీసేశామని చిత్ర సహ నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, మా సినిమా నుంచి విజయ్ రాజ్ను తీసేశాం. అది సరిపోదట!అతడికి విశాలవంతమైన గదులు కావాలట.. పెద్ద వానిటీ వ్యాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా అతడి కిందపనిచేసేవారికి రోజుకు రూ.20,000 ఇవ్వాలంటున్నాడు. పెద్ద పెద్ద నటులు కూడా అంత డబ్బు తీసుకోరు. యూకేలో అందరికీ మంచి గదులు తీసుకున్నాం. ఒక్క రోజుకు ఒక్క గది అద్దె.. రూ.45,000. అది తనకు సరిపోదట! ఇంకా పెద్ద లగ్జరీ రూమ్ కావాలన్నాడు.నేనేమీ అడుక్కోలేదుఅంతే కాకుండా.. ఈ సినిమాలో యాక్ట్ చేయమని మీరు నన్ను సంప్రదించారు. ఛాన్సివ్వమని నేనేమీ మిమ్మల్ని అడుక్కోలేదు అంటూ రూడ్గా మాట్లాడాడు' అని చెప్పుకొచ్చాడు. మరోవైపు సెట్లో అజయ్ దేవ్గణ్ను పలకరించలేదనే తనను తప్పించారని విజయ్ ఆరోపించాడు. -
ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్
రెండు వారాల క్రితం రిలీజైన 'కల్కి'.. ఇంకా థియేటర్లలో రచ్చ లేపుతూనే ఉంది. రూ.1000 కోట్ల మార్క్కి చేరువలో ఉంది. మరోవైపు ఈ వారం 'భారతీయుడు 2' లాంటి పాన్ ఇండియా థియేటర్లలోకి వస్తోంది. వీటి గురించి పక్కనబెడితే ఓటీటీలోనూ పలు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాంటిది సడన్గా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. తెగ పొగిడేశాడు)బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేసిన 'మైదాన్'.. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిందీ వెర్షన్ మాత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నెల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చినప్పటికీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి తెచ్చారు.స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. హైదరాబాద్కి చెందిన సయ్యద్ అబ్దుల రహీం అనే వ్యక్తి జీవిత కథే ఈ సినిమా. 1952లో హెల్సింకీ ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోరమైన ప్రదర్శన చేస్తుంది. దీంతో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) జట్టుకి అండగా నిలబడతాడు. ఓటమికి పొరపాట్లు తెలుసుకుని జట్టుని తిరిగి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?) -
'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ ఇప్పటివరకు 100కు పైనే సినిమాలు చేశాడు. ఇన్నేళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అయినా సరే.. తనకు నటన రాదు, ఫేస్లో ఓ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు అని కొందరు నెటిజన్లు తనను విమర్శిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీలు ఎవరున్నారని..? అలా ఆర్ఆర్ఆర్ నటుడు అజయ్ దేవ్గణ్ సైతం ఈ ట్రోలింగ్ బాధితుడే! అందుకే నో స్టార్డమ్తాజాగా ఓ వ్యక్తి ఈ హీరోపై ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఈ జెనరేషన్లో చెత్త నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది అజయ్ దేవ్గణ్. సరిగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేడు.. అందుకే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లా స్టార్డమ్ అందుకోలేకపోయాడు. ఆఖరికి అక్షయ్ కుమార్ అంత పాపులారిటీ కూడా తెచ్చుకోలేకపోయాడు అంటూ అజయ్ నటించిన కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ జత చేశాడు.నాలుగు జాతీయ అవార్డులుఇది చూసిన అభిమానులు తమ హీరో గొప్పవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తను చాలా బాగా నటిస్తాడు. సింగం, దృశ్యం, షైతాన్ సినిమాల్లో తన యాక్టింగ్ అయితే ఇంకా బాగుంటుంది, నాలుగుసార్లు జాతీయ అవార్డు వచ్చిందంటేనే అర్థమవుతోంది తను యాక్టింగ్లో అందరికంటే గొప్పవాడని.. ఏదో కొన్ని పాత్రలు సేమ్ ఉన్నప్పుడు తన యాక్టింగ్లో పెద్ద తేడా కనిపించలేదంతే!అందుకేనేమో..అజయ్ గొప్ప నటుడు.. కానీ ఈ కాలం పిల్లలకు ఇది అస్సలు అర్థమవట్లేదు, చాలామంది మగవాళ్లు నిజజీవితంలో తమ భావాలను బయటకు కనిపించనీయరు. అందుకే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చీఇవ్వనట్లున్నారు అని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా అజయ్ దేవ్గణ్ 1991లో ఫూల్ ఔర్ కంటే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. సినిమాలు..కచ్చే ఢాగె, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, ఓంకార, గోల్మాల్, సింగమ్, మైదాన్.. ఇలా అనేక చిత్రాలతో అలరించాడు. జకం, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా తానాజీ చిత్రానికి(నటుడిగా, నిర్మాతగా) రెండు జాతీయ పురస్కారాలు గెలుచుకున్నాడు. Ajay devgn got to be the worst actor from his generation with no aura thats why he didn't reach real stardom like the khans or even akshay kumar pic.twitter.com/fOkrIGHBRY— cali. (@mastanified) July 7, 2024 చదవండి: ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ -
నా పెళ్లికి తప్పకుండా రావాలి.. హీరోల ఇంటికి వెళ్లిన అనంత్ అంబానీ
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుండగా ఈ శుభాకార్యానికి రావాలంటూ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే పెళ్లి పత్రికను పొందుపరిచారు.తాజాగా అనంత్ అంబానీ.. తమ పెళ్లికి రావాలంటూ ఇద్దరు హీరోల ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అక్షయ్కు స్వయంగా కార్డు ఇచ్చి కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అలాగే అక్షయ్ దేవ్గణ్ను సైతం కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..? -
'సింగం అగైన్' విడుదల తేదీలో మార్పు
బాలీవుడ్లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్గా బాలీవుడ్లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది. -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్
మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటివరకు రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మాత్రం పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. గత నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ మూవీ 'మైదాన్'. హైదరాబాద్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. దాదాపు నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కొన్నిరోజుల క్రితం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) -
సీక్వెల్ స్టార్ట్
కొత్త సినిమా సెట్స్లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్లో నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీంతో ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ‘దే దే ప్యార్ దే 2’ను సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని అజయ్ దేవగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.ఈ సీక్వెల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫేవరెట్ సినిమా ‘దే దే ప్యార్ దే 2’ సెట్స్లో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు రకుల్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మాధవన్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్లోనూ నటిస్తారా? ఆమె స్థానంలో మరో నటి ఎవరైనా జాయిన్ అవుతారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ హీరో నటించిన ఈ సినిమాని ఏళ్ల పాటు తీశారు. పడుతూ లేస్తూ షూటింగ్ పూర్తి చేసిన ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకొచ్చారు. బయోపిక్స్ బోర్ కొట్టడం వల్లనో ఏమో గానీ మూవీ బాగున్నా సరే వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సడన్గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చేసిన స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'. హైదరాబాద్కి ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా దీన్ని తీశారు. చాలా ఏళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ మూవీని ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఓ మాదిరిగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేశారు. కాకపోతే రెంట్ (అద్దె) విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.'మైదాన్' కథ విషయానికొస్తే.. 1952లో జరిగిన హెల్సింకీ ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టు సరైన సదుపాయలు లేకపోవడంతో ఘోర ప్రదర్శన చేస్తుంది. దీంతో జట్టుకి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) అండగా నిలబడతాడు. ఓటమి నుంచి తప్పులు తెలుసుకుని టీమ్ని మళ్లీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో మన జట్టు ఎలాంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సయ్యద్, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటనేదే సినిమా.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?) -
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్హిట్గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నారు. -
బరిలోకి దిగిన అజయ్ దేవగణ్.. 'మైదాన్' ట్రైలర్ వచ్చేసింది
బాలివుడ్ నటుడు అజయ్ దేవగణ్ పుట్టినరోజు (ఏప్రిల్ 2) సందర్భంగా తను నటించిన కొత్త చిత్రం 'మైదాన్' ట్రైలర్ విడుదల చేశారు. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫుట్బాల్ కోచ్గా ఆయన నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు కావచ్చు.. ఒక్కసారి ఆట బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ వ్యూహం.. ఒకేలా ఉండాలి. అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. భారత ప్రముఖ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మైదాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. అబ్దుల్ రహీమ్ సతీమణిగా ప్రియమణి కనిపించారు. జీ స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మనసుని హత్తుకునేలా అమిత్ శర్మ దీనిని తీర్చిదిద్దారన్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు
కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ 61 ఏళ్ల వయసులో కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ప్రభుదేవాతో 'కరటక దమనక' చిత్రంతో హిట్ కొట్టిన శివన్న.. మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. శివ రాజ్కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. ఈ చిత్రం గురించి చిత్ర బృందం అభిమానులకు శుభవార్త అందించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15, 2024న విడుదల చేయనున్నట్లు శివరాజ్కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈమేరకు పోస్టర్ను కూడా వదలడం జరిగింది. అందులో శివన్న రగ్గడ్ లుక్లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్గా రానుంది. ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్కుమార్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' కూడా విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్' కూడా రానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్ కుమార్ సినిమా ఉంటే.. బాలీవుడ్లో భారీ స్టార్స్తో వస్తున్న సింగం ఎగైన్ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలను తట్టుకుని పుష్ప గాడు ఎంతమేరకు అక్కడ నిలబడుతాడో వేచి చూడాలి. Justice Arrives This Independence Day#BhairathiRanagal IN CINEMAS 15th August 2024 @NimmaShivanna @GeethaPictures #Narthan @RahulBose1 @RaviBasrur #Naveen #chethandsouza @dhilipaction @kaanistudio @The_BigLittle #Geethapictures #BhairathiRanagalAug15 #Mufthi pic.twitter.com/ekOhYdqIHR — DrShivaRajkumar (@NimmaShivanna) March 10, 2024 -
'షైతాన్'ట్రైలర్తో మెప్పించిన అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'షైతాన్'. హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో ట్రైలర్ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్ (అజయ్) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ. ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాధవన్ విలన్గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' (Vash) సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. -
చార్ జోర్
ఈ ఏడాది అజయ్ దేవగన్ ఫుల్ రైజింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ‘సింగమ్ ఎగైన్’, ‘రైడ్ 2’, ‘సైతాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘సైతాన్’ మార్చి 8న, ‘సింగమ్ ఎగైన్’ ఆగస్టు 15న, ‘రైడ్ 2’ నవంబరు 15న రిలీజ్ కానున్నాయి. అలాగే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అజయ్ దేవగన్ ‘మైదాన్’ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇండియన్ మాజీ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాను 2022లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ‘మైదాన్’ను ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది అజయ్ దేవగన్ చిత్రాలు 4 వెండితెరకు వస్తాయి. అంటే.. చార్ (నాలుగు) సినిమాలతో అజయ్ దేవగన్ ఈ ఏడాది ఫుల్ జోర్ అన్నమాట. -
సూర్యవన్షీ సాహసం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్ ’. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ , రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్కుమార్ c చేసి, వీర్ సూర్యవన్షీ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’ (2021) చిత్రం విడుదలై ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో, ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలోని అక్షయ్ లుక్ను విడుదల చేసినట్లుగా రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఇందులో అక్షయ్ లుక్ చూస్తుంటే పోలీసాఫీసర్గా మరోసారి ఆయన సహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సింగమ్ ఎగైన్ ’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల
'రోజా' సినిమా హీరోయిన్ మధుబాల ఇప్పటి జనరేషన్కు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 9-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. సడన్గా నటించడం మానేసి పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో అసలు మధుబాల ఎందుకలా చేసిందా అని ఫ్యాన్స్ బుర్ర పీక్కున్నారు. కానీ ఇన్నేళ్లపాటు ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది. మధుబాల ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె నటించిన 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రమోషన్లోనే మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అమ్మ పాత్రకు నో 1991లో మధుబాల హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'పూల్ ఔర్ కాంఠే' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'జెంటిల్మేన్' లాంటి సినిమాలతో అటు హిందీ ఇటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఈమెకు బాలీవుడ్ లో ఓ సినిమాలో అమ్మ రోల్ ఆఫర్ చేశారు. అది కూడా హీరో అజయ్ దేవగణ్కు. దీంతో సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్లకు నటన, ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) బాలీవుడ్లో అప్పట్లో దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన దాని గురించి తాజాగా ఓ ఈవెంట్ లో మధుబాల బయటపెట్టింది. 'నాకు అజయ్ దేవగణ్ తల్లిగా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇద్దరిదీ ఒకటే వయసు. అయినాసరే నాకు ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. నాకు నచ్చలేదు. బాలీవుడ్ లో 90వ దశకంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్లకు మాత్రం డ్యాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఉండేవి. నాకేమో డ్యాన్స్ చేయాలని ఉండేది. 'రోజా' తర్వాత అలాంటి పాత్రలు రాలేదు' ఇండస్ట్రీని వదిలేశా 'అయితే 9-10 ఏళ్లపాటు సినిమాల్లో నటించిన చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేయాలనిపించింది. కారణం కోసం వెతికితే పెళ్లి కనిపించింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లకు లెటర్స్ రాశాను. ఇకపై సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే.. పిల్లతనంతో చేసిన పనిలా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కాస్త మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆనందంగా ఉంది' అని మధుబాల చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' డైరెక్టర్ని ఓ విషయంలో పక్కా మెచ్చుకోవాలి!) -
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
కాజోల్ భర్త లేనప్పుడు ఆమెతో ఫ్రెంచ్ కిస్: నటుడు
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ త్రిభంగ సినిమాతో డిజిటల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అలాగే ద గుడ్ వైఫ్ అనే ఇంగ్లీష్ సిరీస్ హిందీ రీమేక్లోనూ నటిస్తోంది. ఇందులో బ్రిటీష్-పాక్ నటుడు అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్లో అలీ, కాజోల్ ప్రేయసిగా నటిస్తున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో అలీ కాజోల్కు తాను అభిమాని అన్న విషయాన్ని బయటపెట్టాడు. 'చిన్నతనంలో నేను కాజోల్కు అభిమానిని. మూడు దశాబ్దాలుగా ఆమెను వెండితెరపై చూస్తూనే ఉన్నా. ఇన్నాళ్లకు ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆమెకు ప్రియుడిగా యాక్ట్ చేశా.. ఓ సీన్లో మేమిద్దరం ఫ్రెంచ్ కిస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూయింగ్ గమ్ నమిలాను. అజయ్ దేవ్గణ్ బ్యానర్లోనే ఈ సిరీస్ నిర్మితమవుతోంది. ఆరోజు అజయ్ రాలేదు. ముంబైలోని లగ్జరీ హోటల్లో షూటింగ్.. ఒక్క సెకండ్లో మేమిద్దరం దాన్ని ప్రొఫెషనల్గా పూర్తి చేశాం. కానీ దానికంటే ముందు మూడునాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఈ సీన్ ఇంత త్వరగా పూర్తి చేయడంతో కాజోల్ థాంక్యూ డార్లింగ్ అని మెచ్చుకుంది' అని చెప్పుకొచ్చాడు అలీ. ద ఫ్యామిలీ మ్యాన్ సుపర్న్ వర్మ ఈ సిరీస్ను డైరెక్ట్ చేస్తున్నాడు. చదవండి: సౌందర్య సినిమా ఇంకెన్నిసార్లు వేస్తారు? ప్రేక్షకుడు ఫైర్ బుల్లితెర నటి వైష్ణవి సీమంతం -
అజయ్ దేవగన్ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్గా టబు! ఫస్ట్లుక్ రిలీజ్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘భోలా’. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, టీ–సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్ని అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఏక్ ఖాకీ.. సౌ సైతాన్స్’(ఒక పోలీసు.. వంద మంది దెయ్యాలు) అంటూ రాసుకొచ్చారు. పోలీస్ డ్రెస్, చేతిలో గన్తో టబు పవర్ఫుల్గా, స్టైలిష్గా కనిపించారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్గా ‘భోలా’ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ — Ajay Devgn (@ajaydevgn) January 17, 2023 -
ఓటీటీలో అజయ్ దేవ్గణ్ బ్లాక్బస్టర్ 'దృశ్యం 2', కానీ ఓ ట్విస్ట్
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్, హీరోయిన్ శ్రియ జంటగా నటించిన చిత్రం దృశ్యం 2. మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించారు. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా తాజాగా ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయంపై అజయ్ దేవ్గణ్ మాట్లాడుతూ.. 'మా సినిమాను థియేటర్లలో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకుడైనా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. కాగా దృశ్యం చిత్రాన్ని దివంగత డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించగా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన ఏడేళ్లకు సీక్వెల్ రాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లదాకా కలెక్షన్లు రాబట్టింది. unfold the mystery 🌀#Drishyam2OnPrime, watch now!https://t.co/w8sKUEdkHg pic.twitter.com/8NYDcXvTau — prime video IN (@PrimeVideoIN) January 13, 2023 చదవండి: ఇడియట్, వెళ్లు.. అంటూ నా భార్య ముందే నాన్న కోప్పడ్డారు: రామ్చరణ్ నటుడితో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
బాలీవుడ్కి స్పెషల్గా...
కథానాయిక అయిన పదేళ్లకు అమలా పాల్ ఇప్పుడు హిందీ తెరకు పరిచయం కానున్నారు. అది కూడా స్పెషల్గా... అంటే స్పెషల్ రోల్లో అన్నమాట. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘భోలా’లోనే ఆమె ప్రత్యేక పాత్ర చేయనున్నారు. కార్తీ హీరోగా నటించిన హిట్ తమిళ మూవీ ‘ఖైదీ’కి ‘భోలా’ హిందీ రీమేక్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను టబు చేస్తున్నారు. తాజాగా అమలా పాల్ని ఎంపిక చేసిన విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్లో ఆరంభం కానున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అమలా పాల్ పాల్గొంటారు. -
కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్
Ajay Devgn Special Post On Kajol Completes 30 Years In Bollywood: కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు, స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అజయ్ దేవగణ్-కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమాలోని ఓ పిక్ను షేర్ చేస్తూ 'ఈ 3 దశబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశావు. ఎన్నో మైలురాళ్లు దాటావు. ఈ ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యాయి. కానీ, నిజానికి.. నువ్ ఇప్పుడే అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావు' అంటూ రాసుకొచ్చాడు అజయ్ దేవగణ్. అలాగే తన సినీ కెరీర్కు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్ను షేర్ చేసింది కాజోల్. చదవండి: షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) కాగా 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అజయ్ దేవగణ్ను వివాహం చేసుకోగా, వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
మరోసారి మెగాఫోన్ పట్టిన బాలీవుడ్ స్టార్ హీరో
కెరీర్లో నాలుగోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ ఫిల్మ్ ‘ఖైదీ’ (2019) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు ధర్మేంద్ర శర్మను దర్శకుడిగా అనుకున్నారు. షూటింగ్ కూడా ఆరంభించారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్లో అదరగొట్టేసిన చిరంజీవి) అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బోళ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఇక ‘యు మీ ఔర్ హమ్’ (2008), ‘శివాయ్’ (2016), ‘రన్ వే 34’ (2022) చిత్రాల తర్వాత అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘బోళ’యే కావడం విశేషం. -
పాన్ మసాలా ఎఫెక్ట్, బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు
సెలబ్రిటీలను అభిమానులు నీడలా వెంటాడుతుంటారు. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన లైకులు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. కానీ అభిమాన తారలు అనవసరమైన వాటిలో దూరినా, ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తుల ప్రకటనల్లో కనిపించినా అస్సలు ఊరుకోరు. సమాజానికి ఏం సందేశమిద్దామనుకుంటున్నారని ఫైర్ అవుతారు. ఇటీవలే పాన్ మసాలా యాడ్లో నటించినందుకు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే! దీంతో అక్షయ్ వెనకడుగు వేసి ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ యాడ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన సామాజికవేత్త తమన్నా హష్మీ ఈ హీరోలపై ఫిర్యాదు చేశాడు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పై నలుగురు హీరోలపై సెక్షన్ 467, 468, 439, 120 బి కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది. చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్లో బొమ్మ పడాల్సిందేనట! రెండో పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి -
ఇలాగే హృదయాలను గెల్చుకో.. ఎన్టీఆర్కు బర్త్డే విషెస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈరోజు (మే 20) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నిన్నటి నుంచే హడావుడి మొదలు పెట్టారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్తో దేశవ్యాప్తంగా బెస్ట్ యాక్టర్ అని పిలిపించుకుంటున్న తారక్కు నీరాజనాలు పలుకుతూ పలు ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ సైతం తన 30, 31వ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. పలువురు సెలబ్రిటీలు తారక్తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాగే జనాల హృదయాలను గెల్చుకోవాలని ఆకాంక్షించారు. Happy Birthday @tarak9999. It was a pleasure interacting with you during #RRR. I wish you happiness, health and peace. Just keep winning hearts, the way you have always done❤️ Ajay pic.twitter.com/2XzZDOKrjc — Ajay Devgn (@ajaydevgn) May 20, 2022 Wishing you a very happy birthday Tarak @tarak9999 🤗🤗 May this birthday be filled with abundance of Love, Joy and success.#HappyBirthdayNTR pic.twitter.com/Fnt89eAjYB — Sai Dharam Tej (@IamSaiDharamTej) May 20, 2022 Happy birthday to this powerhouse! Tarak, I pray you have good health and great success! Kill it this year 🔥@tarak9999 — Nivetha Thomas (@i_nivethathomas) May 20, 2022 Wish you a Happy birthday @tarak9999 , more success, peace and strength to you❤️❤️❤️❤️ pic.twitter.com/bBA2s4xMMw — Radikaa Sarathkumar (@realradikaa) May 20, 2022 Many many more returns dear anna @tarak9999 ❤️ #HBDManOfMassesNTR 🔥 pic.twitter.com/HpPE69mHpH — thaman S (@MusicThaman) May 19, 2022 Wishing our @tarak9999 a very Happy Birthday. May God bless you with strength, prosperity, and successful endeavors ahead. - @BvsnP (BVSN Prasad)#HappyBirthdayNTR pic.twitter.com/zhPTr5yAtC — SVCC (@SVCCofficial) May 20, 2022 Wishing a Happy Happy Birthday to our dearest Man Of Masses🤩🤩🔥🔥..Many Many Happy Returns of the Day @tarak9999 Sir😇😇🙏🏽🙏🏽#HappyBirthdayNTR 🔥 pic.twitter.com/P4KcswIY11 — vennela kishore (@vennelakishore) May 20, 2022 Birthday Wishes to Dearest @tarak9999 Anna🤗 Wishing you loads of success & happiness anna❤️#HappyBirthdayNTR pic.twitter.com/BJDBdFqbcl — Naga Shaurya (@IamNagashaurya) May 20, 2022 From then to now, you’ve been incredible and a true gem of Telugu cinema. You’re a favourite anna!! May you keep growing from strength to strength. Lots of love and happiness, always 🤍@tarak9999 #HappyBirthdayNTR pic.twitter.com/Q5GmRJixry — Teja Sajja (@tejasajja123) May 20, 2022 “Wishing you a day filled with happiness and a year filled with joy. Happy birthday @tarak9999 #HappyBirthdayNTR 🌟💥 — Payal Ghoshॐ (@iampayalghosh) May 20, 2022 ECLECTIC and ELECTRIC!⚡⚡ Here’s wishing a powerhouse of talent in all its forms, @tarak9999 a superb year ahead 🔥#HBDManOfMassesNTR #HappyBirthdayNTR #JrNTR pic.twitter.com/BzcX7ZvglZ — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 19, 2022 Wishing you a Very Happy Birthday Tarak🎉@tarak9999 Have a Blockbuster Year Ahead!! . . . . . . .#jrntr #hbdjrntr #rajeevkanakala #ntr #ntr30 #rrrmovie pic.twitter.com/o8t7PxR3VZ — Rajeev kanakala (@RajeevCo) May 20, 2022 Happpy happppy bdayyyy you powerhouse @tarak9999 !! Wish you the most happiest , healthiest year and may you keep growing from strength to strength!! Keep killing it 😁😁🤗 — Rakul Singh (@Rakulpreet) May 20, 2022 My best birthday wishes to the one of the most powerful actors of Indian cinema @tarak9999 garu .May god bless him a wonderful year ahead. #HappyBirthdayNTR #HBDNTR #HBDManOfMassesNTR pic.twitter.com/ezjZjWYzBO — Hemantmadhukar (@hemantmadhukar) May 19, 2022 BLOCKBUSTER vibes already! 🔥 Happy Birthday TIGER @tarak9999 ! Kill it my brother! 🤗 Love..#RAPO https://t.co/KFeW7VDvL1 — RAm POthineni (@ramsayz) May 20, 2022 Happy Birthday Ever Energetic Dear @tarak9999 wishing Happy Health & success throughout 😇#NTR30 is looking furious 🔥 waiting to witness the Volcanic performance — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 20, 2022 Wishing you a very Happy Birthday @tarak9999 🤗🎉Have a glorious one.#HappyBirthdayNTR https://t.co/wGjxEuxHVW — Eesha Rebba (@YoursEesha) May 20, 2022 Wishing our BHEEM @tarak9999 a very Happy Birthday. 🤩🤩 #HBDManOfMassesNTR pic.twitter.com/jHTuRyw83E — RRR Movie (@RRRMovie) May 19, 2022 Birthday wishes to the Power house of talent our 'Young Tiger' @tarak9999 Gaaru 🎊 🎉 #NTR30 announcement is a spot on 🙌, wishing you to continue the winning streak for many more years, love you ❤️ #HBDManOfMassesNTR pic.twitter.com/xrJ2nNzaqm — Bobby (@dirbobby) May 19, 2022 Wishing Our Young Tiger @tarak9999 garu a Fabulous Birthday! 🎉 All the very best for your upcoming projects #NTR30 & #NTR31 ✨#HappyBirthdayNTR — Anil Ravipudi (@AnilRavipudi) May 20, 2022 Wishing the 'Young Tiger' @tarak9999 gaaru, an amazing birthday! 🎉✨ Fury of #NTR30 is Awesome and waiting for your #NTR31 also! 🔥 Have a fantastic year ahead 😊👍🏻#HappyBirthdayNTR — Gopichandh Malineni (@megopichand) May 19, 2022 Happy Birthday Tigerrrrrrrr @tarak9999 …..I love you and I still owe you 🤗🤗🤗 pic.twitter.com/40YFVg7kkx — Harish Shankar .S (@harish2you) May 19, 2022 చదవండి 👇 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? ప్రముఖ నటుడు కన్నుమూత -
అక్షయ్, అజయ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా 'అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించిన అలాగే గొప్పగా ఫీల్ అవుతా.' అని తెలిపింది కంగనా రనౌత్. ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయడంపై కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఇతరుల సినిమాలను సపోర్ట్ చేసినట్లుగానే నా సినిమాలు ఇతరులు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్ ఫైల్స్, షేర్షా వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను. నేను సిద్ధార్థ మల్హోత్రా గురించి, కరణ్ జోహార్ చిత్రాలను కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా.' అని తెలిపింది. -
అజయ్ దేవగణ్, సుదీప్ల ట్విటర్ వార్పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ ఏమన్నాడంటే 'భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్టైన్మెంట్. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచగలిగితే చాలు వారు నిన్ను ఆదరిస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అదే విధంగా దక్షిణాది చిత్రాల ప్రభావం మాత్రం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఉంటుందన్నాడు. అలానే 'ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్ను కోరుకుంటున్నారు. ఓ యావరేజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదు' అంటూ సోనూసూద్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. -
హీరోల మధ్య ట్వీట్ల వార్, బాలీవుడ్ స్టార్స్పై వర్మ సంచలన కామెంట్స్
హిందీ భాషపై కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమల్లో హాట్టాపిక్గా నిలిచాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అజయ్, సుదీప్ల మధ్య బుధవారం ట్వీట్ల వార్ నెలకొంది. ఈ వార్పై తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ మేరకు సుదీప్కు మద్దతు ఇస్తూ ఉత్తరాది హీరోలు దక్షిణాది హీరోలను చూసి అసూయ పడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ Nothing can drive the point better than ur question on ,what if you answer in Kannada to a Hindi tweet from @ajaydevgn .. Kudos to you and I hope everyone realises there’s no north and south and india is 1 https://t.co/g0IOvon8nV — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 ‘సౌత్, నార్త్ అనేది ముఖ్యం కాదు. భారతదేశం అంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి’ అని తొలుత హితవు పలికాడు వర్మ. అనంతరం తన వ్యాఖ్యలకు అర్థం అది కాదని, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్ చేసిన ట్వీట్కు ఆర్జీవి రీట్వీట్ చేశాడు. ‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు సుదీప్ సర్. కానీ మీరు ఈ కామెంట్స్ చేసినందుకు సంతోషం. ఎందుకంటే బాలీ(నార్త్)వుడ్, శాండల్(సౌత్)వుడ్ మధ్య ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండటం సరికాదు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. ‘అసలు నిజం ఏంటంటే... బాలీవుడ్లో కేజీయఫ్ 2 రూ. 50 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్తో రికార్డు క్రియేట్ చేయడంతో బాలీవుడ్ స్టార్స్, సౌత్ స్టార్స్ను చూసి అసూయతో ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. ఇకపై బాలీవుడ్ చిత్రాల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాం. బాలీవుడ్లో బంగారం ఉందా?, కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్వే 34’ ఓపెనింగ్ కలెక్షన్స్తో అర్థమైపోతుంది’ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వర్మ కామెంట్స్పై బాలీవుడ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో Whether u intended or not am glad u made this statement ,because unless there’s a strong stir , there cannot be a calm especially at a time when there seems to be a war like situation between Bolly(north)wood and Sandal(South) wood https://t.co/SXPqvrU8OV — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 కాగా కేజీయఫ్ 2 సక్సెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ.. ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారని, ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందంటూ ‘హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు’ అన్నాడు. అలాగే బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మించి తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారంటూ కామెంట్ చేశాడు. దీనికి అజయ్ దేవగన్ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్కు కౌంటర్ ఇచ్చాడు. -
కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్స్టార్ సుదీప్కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్కు అండగా నిలిచారు. బాలీవుడ్, కన్నడ సూపర్ స్టార్ల మధ్య హిందీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుదీప్.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. 🥂 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్లేషన్ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్’ అంటూ రీట్వీట్ చేశారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. -
వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పేరొందిన ఈ హీరో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
RRR Movie Review: బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలుగొట్టిన ఆర్ఆర్ఆర్
-
అజయ్దేవగన్కు మాలధారణ చేసిన తెలుగు వ్యక్తి
గుంటూరు ఈస్ట్: బాలివుడ్ హీరో అజయ్దేవగన్కు ఇటీవల ముంబైలో అయ్యప్ప మాలధారణ చేసినట్లు గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన గురుస్వామి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి ఆదివారం చెప్పారు. ప్రముఖ తెలుగు ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి ద్వారా మాలధారణ ఉపదేశం ఇచ్చే అవకాశం తనకి లభించినట్లు తెలిపారు. అజయ్దేవగన్ అయ్యప్ప స్వామి పరమ భక్తుడని, నిష్టతో దీక్ష చేయాలనే లక్ష్యంతో మాలధారణ స్వీకరించారన్నారు. అజయ్దేవగన్తో పాటు మరో ఐదుగురికి మాలధారణతో ఉపదేశం ఇచ్చినట్లు వెంకటరెడ్డి వివరించారు. -
RRR Movie HD Images: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫోటోలు
-
ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు
Tabu And Ajay Devgan Relationship: హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తోంది. వయసు పైబడిపోతున్నా ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండటానికి కారణమెవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్. అవును, ఈ మాట అంటోంది మరెవరో కాదు టబునే.. ఆమె గతంలో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. అజయ్ దేవ్గణ్ తనకు సహనటుడు మాత్రమే కాదని, చిన్నప్పటి నుంచే తెలుసని చెప్పింది. 13 -14 ఏళ్ల వయసులోనే ఒకరికొకరం తెలుసంది. అజయ్ తన సోదరుడి స్నేహితుడేనని, తామంతా జుహులోనే కలిసి పెరిగామని పేర్కొంది. తనెక్కడికి వెళ్లినా అజయ్ తనను ఫాలో అయేవాడని చెప్పుకొచ్చింది. నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే అజయ్ అస్సలు సహించేవాడు కాదని, వాళ్లను కొట్టడానికైనా సిద్ధపడేవాడని తెలిపింది టబు. అంతేకాకుండా తనను ఓ కంట కనిపెడుతూ ఎప్పుడు? ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకుని వెనకాలే వచ్చేవాడంది. అతడి వల్లే తానిప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి బాధ్యుడైనందుకు సదరు హీరో పశ్చాత్తాపపడాలని చెప్పుకొచ్చింది. కాగా అజయ్, టబు ఇద్దరూ కలిసి 'దృశ్యం', 'గోల్మాల్ అగెయిన్', 'విజయ్పథ్', 'హకీకత్' సినిమాల్లో నటించారు. చివరిసారిగా 'దేదే ప్యార్ దే' చిత్రంలో వీళ్లిద్దరూ నటించారు. -
రాంగ్ స్టెప్ వేశారో.. మీ ఫ్యూచర్కు దెబ్బే.. అక్షయ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్ను పలకరించనున్న బాలీవుడ్ మూవీ సూర్యవంశీ టీమ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. రణవీర్తో కలిసి స్పెప్పులతో ఇరగదీసిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. సూర్యవంశీ మూవీలోని లేటెస్ట్ ట్రాక్ ‘ఐలారే అల్లా’ పాటకు రణవీర్తో కలిసి స్టెప్పులేశాడు అక్షయ్. ఈ క్రేజీ డాన్స్కు మీరు అడుగులు రోపండి అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. జాగ్రత్త.. ఎక్కడైనా పొరపాటు జరిగిందో, మీ ఫ్యూచర్కు దెబ్బే అంటే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఐలారే పాటను గురువారం ట్విటర్లో షేర్ చేశారు.(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్డే) రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్యవంశీ. అజయ్ దేవగన్ని ‘సింగం’గా, రణ్వీర్ని ‘సింబా’గా చూపించిన రోహిత్ తాజాగా అక్షయ్ని ‘సూర్యవంశీ’ గా చూపించబోతున్నాడు. అంటే సింగిల్ ఫ్రేమ్లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ అన్నమాట. వీరితోపాటు కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. (Freida Pinto: అవును..నా డ్రీమ్ మ్యాన్ను పెళ్లి చేసుకున్నా!) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న దీపావళికి విడుదల కానుంది. తమ సినిమాను బిగ్ స్క్రీన్పై చూసి ఆదరించాలంటూ దర్శకుడు రోహిత్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లో ప్రస్తుతం అంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. ఓటీటీలో కంటే థియేటర్లో రిలీజ్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్న కొన్ని సినిమాలలో సూర్యవంశీ కూడా ఒకటి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) The celebrations have begun & here is your party starter pack!!#AilaReAillaa song out now - https://t.co/mLu67F7jTr#Sooryavanshi releases this Diwali, 5th November in cinemas. #BackToCinemas pic.twitter.com/R3HJwOzFT4 — Karan Johar (@karanjohar) October 21, 2021 -
భుజ్ ట్రైలర్: నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను
Bhuj: The Pride Of India Trailer: 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ దుధయ్యా దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'మరాఠాలకు చావడం లేదా చంపడం.. ఈ రెండే తెలుసు', 'చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటాం', 'నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను' వంటి డైలాగులు ట్రైలర్లో తూటాల్లా పేలాయి. చంటిపాపను ఎత్తుకున్న సోనాక్షి ఒంటిచేత్తో చిరుతపులిని హతమార్చడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. కాగా యుద్ధం సమయంలో గుజరాత్లోని భుజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమవగా అప్పటి ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్పోర్ట్ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి సిన్హా నటించింది. ఈ సినిమా ఆగస్టు 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో భుజ్ విడుదల కానుంది. ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
అజయ్ కొత్త బంగ్లా: ఖరీదు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ ఓ ఇల్లు కొన్నాడట. ముంబైలోని జుహులో ఓ విలాసవంతమైన ఇంటిని అతడు తన సొంతం చేసుకున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం అతడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉందట. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా కోసం అజయ్ రూ.60 కోట్లు వెచ్చించాడట. ఇక ఇదే ప్రాంతంలో బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రసాద్, అక్షయ్ కుమార్ కూడా నివాసముంటున్న విషయం తెలిసిందే. నిజానికి అజయ్ దేవ్గణ్ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని గత ఏడాది నుంచే ప్లాన్లో ఉన్నాడు. అందులో భాగంగా కపోలే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీతో డిసెంబర్లో మంచి డీల్ కూడా కుదుర్చుకున్నాడు. మే 7న బంగ్లాను తన పేరు మీద రాయించుకున్నాడు. ఇదిలా వుంటే అర్జున్ కపూర్ కూడా ముంబైలోని బాంద్రాలో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్స్టోరీ -
రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్స్టోరీ
• మొహబ్బతే ‘ఫ్యామిలీ మెన్’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్’ ట్యాగ్ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్ దేవ్గన్ ఒకడు. ఆశ్చర్యపోనవసరం లేదు.. అతని లవ్ లిస్ట్లో కాజోల్ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్ ఉన్నారు. అజయ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్ లవ్ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్ సోదరి నీలం దేవగన్ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి. ఆ ప్రేమ ‘దిల్వాలే’ సినిమా సెట్స్ మీద మొదలైంది. ‘ఏక్ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్గా లేడు ఆ రిలేషన్ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. ఆ సమయంలోనే.. అజయ్కి కరిష్మా కపూర్ ఫ్రెండ్ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్’లో నటించారు. ఆ సినిమా షూటింగ్లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్కి ఫోన్ చేసేది (అప్పుడు సెల్ ఫోన్లు లేవు.. ల్యాండ్ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్ ఫోన్ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్లో కరిష్మా, అజయ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది. అజయ్ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా’లో నటించినా అజయ్ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని, ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్ కాజోల్ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు. చిరాకు, చిటపటలతోనే.. కాజోల్, అజయ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘హల్చల్’. ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్ దేవ్గన్కు గలగలా మాట్లాడే కాజోల్ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం. అవును.. అజయ్ కరిష్మాతో.. కాజోల్ కార్తిక్ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు. వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది.. కార్తిక్ మెహతాతో తన రిలేషన్కు సంబంధించి అజయ్ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్కు ప్రేమ భావనను పంచింది. ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే ‘పెళ్లి’ మంత్రంగా మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ! అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్ప్రెస్ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది. ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం. లెటర్స్ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు లెటర్స్ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్ హాస్పిటల్లో చేరితే మంచిదనీ కామెంట్ చేశాడు. ఈ ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కూడా ఇగిరిపోయింది. - ఎస్సార్ చదవండి: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్పై దాడి? -
అజయ్ దేవగణ్ బర్త్డే: ఆసక్తికర విషయం చెప్పిన కాజోల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నేటితో 52వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు (ఏప్రీల్ 2) ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు దేవగన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయన భార్య, నటి కాజోల్ బర్త్డే విషెష్ మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. అజయ్ తనదైన శైలిలో చమత్కిరిస్తు శుభాకాంక్షలు తెలిపిన కాజోల్ తీరు నెటిజన్లను, అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అజయ్ కెమెరాతో ఉన్న ఓ ఫొటోలను షేర్ చేశారు. అంతేగాక అజయ్ అంత్యంత సంతోష పెట్టె విషయం ఏంటో కూడా వెల్లడించారు.‘సెల్ఫీ తీయాలని చూశాను. కానీ ఈ సెల్ఫీలో కేవలం ఆ కెమెరాతో ఆయనను మాత్రమే సెల్ఫ్ చేయగలిగాను. రోల్ కెమెరా.. ఏం చేస్తున్నారో అదే ఆయనను సంతోష పెట్టే విషయం. హ్యాపీ బర్త్డే ఇప్పటికి.. ఎప్పటికి’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేశారు కాజోల్. దీని అజయ్ ‘త్వరలోనే మనం ఇద్దరం కలిసి లాంగ్ ఓవర్ డ్యూ సెల్ఫీ తీసుకుందాం’ అంటూ చమత్కరించాడు. కాగా హీరో అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి, నటి మాధురి దీక్షిత్లు కూడా అజయ్ దేవగణ్కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేగాక ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లోని అజయ్ ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీర్, రాంచరణ్లు హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. Tried getting a selfie but the only “selfie” I could manage was his “self” with another camera 🎥 🙄.. doing what makes him happiest! Happy Birthday... today and always❤️ @ajaydevgn pic.twitter.com/PKNs8YeEY6 — Kajol (@itsKajolD) April 2, 2021 చదవండి: అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ రిలీజ్ -
పబ్ బయట అజయ్ దేవ్గణ్పై దాడి? నిజమేనా?
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ మీద దాడి చేసినట్లు ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మేరకు కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి కొట్టినట్లు ఓ వీడియో కూడా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోని ఏరోసిటీ పబ్ బయట ఓ వ్యక్తితో కొందరు ఘర్షణకు దిగడమే కాక అతడిని చితకబాదారు. అందులోని బాధితుడు అజయ్ దేవ్గణ్ అని భ్రమపడిన అభిమానులు తమ హీరోకు ఏమైందో? ఎలా ఉందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్గణ్ టీమ్ స్పందిస్తూ ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. "గతేడాది జనవరిలో జరిగిన తానాజీ: ద అన్సంగ్ వారియర్ ప్రమోషన్స్ తర్వాత ఇప్పటివరకు అజయ్ ఢిల్లీకి వెళ్లనేలేదు. కాబట్టి ఢిల్లీలోని పబ్ బయట అజయ్ మీద దాడి జరిగిందన్న వార్తలు పూర్తిగా నిరాధారం, అసత్యమైనవి. ఆయన 'మైదాన్', 'గంగూబాయ్ కథియావాడి', 'మేడే' చిత్రాల షూటింగ్ కోసం కొన్ని నెలలుగా ముంబైలోనే ఉంటున్నారు. అతడు ఢిల్లీకి వెళ్లి దాదాపు 14 నెలలవుతోంది. కాబట్టి దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి' అని అజయ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఢిల్లీలోని పబ్ బయట రెండు వాహనాలు ఒకదానికొకటి తగలడంతో రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ గొడవ కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చదవండి: 'అజయ్ దేవ్గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?' -
'అజయ్ దేవ్గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?'
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నాడు ముంబైలోని గోరేగావ్లో అతడు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. రైతులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశాడు. హీరో కారును ముందుకు వెళ్లనీయకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంత సేపటి వరకు నానా హంగామా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్దీప్ రమేశ్ సింగ్గా గుర్తించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతుదారుడిగా భావిస్తున్నారు. అజయ్ దేవ్గణ్ బాడీగార్డుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్దీప్ను అరెస్ట్ చేశారు. తాజాగా నిందితుడు అజయ్ కారును ముట్టడించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. "పంజాబ్కు వ్యతిరేకంగా ఉన్న ఇతడు వాళ్లు పండించిన ఆహారాన్ని ఎలా తినగలుగుతున్నాడు? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? సినిమాల్లో సగర్వంగా తలపాగా కడతావే.. నీకేమీ సిగ్గుగా లేదా? నన్ను దాటుకుని వెళ్లగలననుకుంటున్నావా? ఎందుకు కారు దిగి మాట్లాడట్లేదు?" అంటూ నిలదీశాడు. కాగా రైతు ఉద్యమానికి మద్దతిస్తూ ఆ మధ్య అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు ఇండియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే భారత అంతర్గత విషయంలో వారి జోక్యాన్ని క్రీడా, సినీ రంగ ప్రముఖులు ఖండించారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్తో పాటు అజయ్ దేవ్గణ్ సైతం కేంద్రానికి మద్దతూ తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే ఇన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సపోర్ట్ చేస్తూ ఒక్క మాటైనా మాట్లాడనందుకే ఇలా అతడి కారును అడ్డుకొని ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రైతు దీక్షలు: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు
‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్తో ఈ సినిమా రీమేక్ అధికారికంగా అనౌన్స్ అయ్యింది. మలయాళ ఒరిజినల్ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. ‘దృశ్యం’ హిందీ వెర్షన్లో అజయ్ దేవ్గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్ అవడంతోటే హిందీలో కూడా రీమేక్ పనులు మొదలయ్యాయి. అజయ్ దీనికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తారు. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామంత్ గత సంవత్సరం సిరోసిస్తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్కు జీతూ జోసఫ్నే అజయ్ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్కు వెళ్లొచ్చు. కనుక మలయాళంలో మోహన్లాల్ శిక్ష తప్పించుకున్నట్టే తెలుగులో వెంకటేశ్ తప్పించుకోనున్నాడు. అజయ్ కూడా తప్పించుకోనున్నాడు. చూడాలి... ఈ రీమేక్స్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. చదవండి: దృశ్యం 2: కుటుంబం గెలిచింది చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి -
మైదాన్లో కాలు మోపనున్న అజయ్ దేవ్గణ్
బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ ఫుట్బాల్ కోచ్గా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నుంచి ఫుట్బాల్ కోచ్గా అజయ్ మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ వరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. చదవండి: ‘థ్యాంక్ గాడ్’ అంటున్న అజయ్, రకుల్ -
రైతు ఉద్యమం: కేంద్రానికి బాలీవుడ్ స్టార్ల సపోర్ట్!
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నిర్విరామంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు ఈ ఉద్యమం ఉద్రిక్తతగా మారగా రైతులు, పోలీసులు గాయపడ్డారు. ఇదిలా వుంటే ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతుండగా కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేంద్రానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. (చదవండి: అగ్రి సెస్తో రాష్ట్రాలకు నష్టం) Farmers constitute an extremely important part of our country. And the efforts being undertaken to resolve their issues are evident. Let’s support an amicable resolution, rather than paying attention to anyone creating differences. 🙏🏻#IndiaTogether #IndiaAgainstPropaganda https://t.co/LgAn6tIwWp — Akshay Kumar (@akshaykumar) February 3, 2021 "దేశ నిర్మాణంలో రైతులకు ముఖ్యమైన స్థానం ఉంది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఏవేవో మాట్లాడి వారి మధ్య విభేదాలు సృష్టించి హైలెట్ అవాలని చూడటానికి బదులు ఇద్దరి మధ్య స్నేహపూర్వక తీర్మానాలు జరగాలని ఆశిద్దాం" అని అక్షయ్ పేర్కొన్నారు. దీనికి #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్ట్యాగ్లను జత చేశారు. అలాగే మరో ప్రముఖ హీరో అజయ్ దేవ్గణ్ సైతం భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకండని సూచించారు. ఇది మనందరం కలిసి కట్టుగా నిలబడాల్సిన సమయమని పేర్కొన్నారు. Don’t fall for any false propaganda against India or Indian policies. Its important to stand united at this hour w/o any infighting 🙏🏼#IndiaTogether #IndiaAgainstPropaganda — Ajay Devgn (@ajaydevgn) February 3, 2021 కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా సైతం సోషల్ మీడియా వేదికగా రైతులకు సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడి విషయాల గురించి పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ దానిపై స్పందించి వార్తల్లో నిలవాలని చూస్తున్న ఫారిన్ సెలబ్రిటీలకు ధీటుగా బాలీవుడ్ నటులు రిప్లైలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫారినర్ల కామెంట్లపై అటు కేంద్రం కూడా ధీటుగానే స్పందించింది. సమస్యపై అవగాహన లేకుండా స్పందించకండి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే రైతు ఆందోళనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, అందులో భాగంగానే జనవరి 26న హింసాత్మక ఘటనలు ఆవిష్కృతమయ్యాయని పేర్కొంది. (చదవండి: రైతులకు మద్దతుగా రిహన్నా, గ్రెటా థన్బర్గ్) -
‘థ్యాంక్ గాడ్’ అంటున్న అజయ్, రకుల్
ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకుంటే ‘థ్యాంక్ గాడ్’ అంటుంటాం. ఇప్పుడు అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రాలు కూడా ధన్యవాదాలు దేవుడా అంటున్నారు. మరి వీరు ఏ విపత్తు నుంచి తప్పించుకున్నారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. అజయ్ దేవగణ్, రకుల్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ చిత్రం ‘థ్యాంక్ గాడ్’. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఈ నెల 21న సెట్స్ మీదకు వెళ్లనుంది. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్స్లోకి తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. -
టేకాఫ్కి రెడీ
టేకాఫ్కి సిద్ధమయ్యారు రకుల్ ప్రీత్సింగ్. కో పైలట్గా తన డ్యూటీని సరిగ్గా చేయడానికి రెడీ అయ్యారు. అజయ్ దేవగణ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘మే డే’. ఇందులో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. అమితాబ్ పైలట్, రకుల్ కో పైలట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బారినపడ్డారు రకుల్. అందులోంచి బయటపడి, షూటింగ్స్కి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారామె. ‘‘పనిలో ఉంటేనే సంతోషంగా ఉంటాను’’ అంటూ సెట్లో మేకప్ చేసుకుంటున్న ఫొటో షేర్ చేశారు రకుల్. -
నేను చాలా లక్కీ
‘‘నా కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది. ఇది నిజమేనా? అన్నంత ఉద్వేగంగా ఉంది’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ఈ బ్యూటీ ఇంతగా ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ‘మే డే’ సినిమాలో అవకాశం దక్కడమే. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ దేవగణే దర్శకుడు. ఇందులో అజయ్ భార్య పాత్రలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘అమితాబ్ సార్, అజయ్ సార్ కాంబినేషన్ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. పైగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ముహూర్తపు సన్నివేశంలో నేను ఉండటం చాలా లక్కీ. నాది చాలా కీలక పాత్ర’’ అన్నారు. ‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఆకాంక్షా సింగ్ ఆ తర్వాత నాగార్జున సరసన ‘దేవదాస్’లో నటించారు. -
అజయ్ దర్శకత్వంలో అమితాబ్
అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ కలసి పలు సినిమాలు చేశారు. ఈ చిత్రాల్లో వాళ్ల ఈక్వేషన్ కేవలం యాక్టర్–యాక్టర్గా.. అంతే. ‘మేజర్ సాబ్, ఖాకీ, సత్యాగ్రహ (2013)’ సినిమాలు చేశారు అమితాబ్, అజయ్. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారు. కానీ ఈసారి యాక్టర్–డైరెక్టర్ ఈక్వేషన్లో. అజయ్ దేవగన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘మే డే’ టైటిల్తో తెరకెక్కే ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలెట్ పాత్రలో నటించనున్నారు. థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను అజయ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవగన్ ఫిల్మ్స్పై నిర్మించనున్నారు. గతంలో ‘యూ మీ ఔర్ హమ్, శివాయ’ సినిమాలకు దర్శకత్వం వహించారు అజయ్. -
అజయ్ దేవగన్ డైరెక్షన్లో అమితాబ్ ‘మేడే’
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్, నిర్మాత అజయ్ దేవగన్ కలయికతో వచ్చిన మేజర్ సాబ్, ఖాఖీ, సత్యాగ్రహ సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వెండితెరపై ఈ ఇద్దరి కలయిక కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే సత్యాగ్రహ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం వస్తుందని ఆశించిన సినీ ప్రేమికులకు నిరాశే మిగిలింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ అగ్ర హీరోలిద్దరు మరో కేజ్రీ ప్రాజెక్టు చేయబోతున్నారు. అయితే సినిమాలో మరో స్పెషల్ కూడా ఉంది. ఈ మూవీలో అజయ్ దేవగన్ అమితాబ్తో కలిసి నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. (చదవండి : హనీమూన్కు వెళుతున్న కొత్త జంట) ఈ మూవీ టైటిల్ మేడేగా నిర్ణయిచారు. ఈ మూవీ డిసెంబర్ సెట్స్పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో అజయ్ పైలట్గా కనిపించనున్నాడు. ఇక అమితాబ్ పాత్ర ఏంటో ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రస్తుతం అజయ్ ఆర్ఆర్ఆర్తో పాటు మరో ఏడు సినిమాల్లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఆయన హీరోగా నటిస్తున్న ‘భుజ్’, మైదాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అమితాబ్ సినిమా షూటింగ్తో పాటు కౌన్ బనేగా కరోడ్పతి షో షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. -
ఖైదీకి జోడి
ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. -
అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్
ముంబై : బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటి స్టార్ హీరోయిన్గా కీర్తి ప్రతిష్టలు పొందారు కాజోల్. 21 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ని ప్రేమించి పెళ్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కుటుంబమంతా కలిసి ముంబైలోని తమ ఇంట్లో హాయిగా గడుపుతున్నారు. కాజోల్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆమె 46వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా భర్త అజయ్ భార్యకు బర్త్డే విషెస్ తెలిపారు. ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. అలాగే ప్రముఖులు, అభిమానులు కాజోల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి వరకు సాగిన ప్రేమ ప్రయాణం, భర్త అజయ్ దేవగన్ను గురించి కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘ఆ సంఘటన నా కెరీర్ను నాశనం చేసింది’) Happy returns of the day, forever & always 🌹@itsKajolD pic.twitter.com/B6Z1PqJscp — Ajay Devgn (@ajaydevgn) August 5, 2020 1995లో తను మొదట అజయ్ను కలిసినప్పుడు అతనిపై కోపంతో మండిపడినట్లు కాజోల్ చెప్పుకొచ్చారు. ‘మేము 25 ఏళ్ల క్రితం హల్చుల్ సెట్లో కలుసుకున్నాం. నేను షాట్ కోసం సిద్ధంగా ఉండగా, నా హీరో ఎక్కడ అని అడిగాను. అతను ఓ మూలన కూర్చొని ఉన్నాడు. అతడిని కలవడానికి 10 నిమిషాల ముందు ఓ విషయంపై గొడవ పడ్డాను. అనంతరం మేము సెట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత నుంచి స్నేహితులు అయ్యాము. అప్పటి నుంచి మా రిలేషన్ ముందుకు సాగింది. ఇద్దరం కలిసి విందులు, లాంగ్ డ్రైవ్లకు వెళ్లాం. మా బంధంలో సగం సమయం కారులోనే గడిచింది. నా ప్రేమ గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు నన్ను హెచ్చరించారు. అజయ్ అప్పటికే హీరోగా మంచి పేరు ఉందని అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ నాకు తెలుసు అజయ్ ఎలాంటి వాడో. తను నాతో స్నేహంగా ఉండేవాడు’ అని కాజోల్ తెలిపారు. (సామాజిక కార్యకర్త) ‘నాలుగేళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత మేము వివాహం చేసుకోవాలనుకున్నాం. ఈ విషయం మా నాన్నకు చెబితే ఆయన నాతో నాలుగు రోజులు మాట్లాడలేదు. ముందు కెరీర్పై దృష్టి పెట్టాలని సూచించారు. అయినప్పటికీ పట్టు సడలని దీక్షతో మా తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాను’ అని తెలిపారు. అయితే కాజోల్, అజయ్ కలిసే సమయానికే ఇద్దరు వేరే వ్యక్తులతో రిలేషన్లో ఉన్నారు. కానీ ఆ రిలేషన్ల నుంచి విడిపోయారు. క్రమంగా వీరిద్దరి మధ్య బంధం బలపడటంతో ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారు. చివరికి ఫిబ్రవరి 24,1999న కాజోల్-అజయ్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి నైసా అనే కుమార్తె, యుగ్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో ఉంటున్నారు. (‘నాకు లాక్డౌన్ మొదలై 20 ఏళ్లు’) స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్డే స్పెషల్ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి -
సామాజిక కార్యకర్త
1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్లోని భూజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్పోర్ట్ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్బెన్ జెతా మదర్పార్య. ఈ సుందర్బెన్ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అభిషేక్ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
ప్రతి భారతీయుడు గర్వపడతాడు
‘‘ఆధునిక భారతీయ ఫుట్బాల్కి ఆద్యుడు సయ్యద్ అబ్దుల్ రహీం గొప్పతనం గురించి మా ‘మైదాన్’ సినిమాలో చూపించబోతున్నాం. ఫుట్బాల్ కోచ్గా 1950లో ఆయన ప్రస్థానం ప్రారంభమయింది. అప్పటినుండి 1963లో చనిపోయేంత వరకు ఆయన ఫుట్బాల్ కోచ్గా వ్యవహరించారు’’ అన్నారు అజయ్ దేవగన్. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’లో అజయ్ దేవగన్ సయ్యద్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ– ‘‘వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ వారాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక రియల్ హీరో స్టోరీని భారతీయులందరూ గర్వపడేలా తీస్తున్నాం. ఆగస్టు 13న ‘మైదాన్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించటానికి 16 ఎకరాల విస్తీర్ణంలో ఓ సెట్ను మేలో నిర్మించారు. కరోనా కారణంగా షూటింగ్కి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలకి ఈ సెట్ పాడయిపోయింది. మళ్లీ ఆ సెట్ను నిర్మించాలంటే రెండు నెలలు పడుతుంది. ఆ సెట్ పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘బదాయి హో’ ఫేం రవీంద్రనా«థ్ శర్మ దర్శకుడు. ఫ్రెష్లైమ్ ఫిల్మ్ సహకారంతో బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ్ సేన్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. -
‘ఆ సంఘటన నా కెరీర్ను నాశనం చేసింది’
బాలీవుడ్ నటి మహిమా చౌదరి తన జీవితంలో జరిగిన భయానక ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. బతకడం కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహిమా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నేను కాజోల్, అజయ్ దేవగణ్ల సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘దిల్ క్యా కరే’ చిత్రం కోసం పని చేస్తున్నాను. బెంగళూరులో షూటింగ్ జరుగుతుంది. స్టూడియోకు కార్లో వెళ్తుండగా నాకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఓ ట్రక్కు నా కారును ఢీకొట్టింది. గ్లాస్ మొత్తం నా ముఖం లోపలకు వెళ్లినట్లు అనిపించింది. నేను చనిపోతున్నానని అనుకున్నాను. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఎవరూ నాకు సహాయం చేయలేదు. నేను ఆసుపత్రికి చేరుకున్న చాలా సేపటి తరువాత నా తల్లి, అజయ్ వచ్చారు. నేను లేచి అద్దంలో నా ముఖం చూసుకుని భయపడ్డాను. డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి 67 గాజు ముక్కలను తీశారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ సంఘటన యొక్క జ్ఞాపకాలు మహిమా చౌదరిని ఉద్వేగానికి గురిచేశాయి. ‘ఆ ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు దుఖం వస్తుంది. ఆపరేషన్ తర్వాత నా ముఖం మీద కుట్లు ఉన్నాయి. నేను ఇంట్లోనే ఉండాలి.. సూర్యరశ్మి తగలకూడదు. నా గది పూర్తిగా చీకటిగా ఉంటుంది. అద్దం లేదు. యూవీ కిరణాల కాంతిని వెదజల్లే లైట్లు ఉండవు’ అని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం ఆమె కెరీర్ను పూర్తిగా దెబ్బ తీసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ సమయంలో నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని నేను వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నాకు మద్దతుగా నిలవలేదు. వారు ‘ఆమె ముఖం నాశనం అయ్యింది.. ఆమెను తీసేసి మరొకరిని తీసుకుందాం’ అని భావించారు. దాంతో నేను ఆ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అన్నారు. -
అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ
‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా నటించారు శ్రియ. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాలోనూ హీరోయిన్గా నటించారు. ఆ సినిమాలు విడుదలై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు శ్రియ స్వయంగా తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆమె చేయబోతున్న సినిమా ఇదే. లాక్డౌన్ కారణంగా భర్త ఆండ్రీతో కలసి స్పెయిన్లో ఉంటున్న శ్రియ అభిమానులతో చిట్చాట్ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్ల వివరాలు చెప్పుకొచ్చారు. తెలుగులో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపానని, వాటిలో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటనీ అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లలో అజయ్ దేవగన్తో కలసి నటించబోతున్నట్లు పేర్కొన్నారీ బ్యూటీ. అంటే... ఈ సినిమాలో అజయ్ దేవగన్కి జోడీగా ఆమె కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే సృజన దర్శకత్వం వహిస్తున్న ‘లిటిల్ బర్డ్’ అనే తెలుగు సినిమాలోనూ నటించనున్నారు శ్రియ. మహిళా దర్శకురాలితో పని చేయలేదనే లోటు ఈ సినిమాతో తీరనుంది అన్నారామె. అంతేకాదు.. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా అంగీకరించాననీ, లాక్డౌన్ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చాక ఆయా చిత్రాల షూటింగ్లో పాల్గొంటానని శ్రియ అన్నారు. -
‘నాకు లాక్డౌన్ మొదలై 20 ఏళ్లు’
సాక్షి, ముంబై: లాక్డైన్ వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంతమంది తమలో ఉన్న కళలను మెరుగు పరుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను, పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిసున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ దేవగన్ ఓ త్రోబ్యాక్(పాత ఫొటో)ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఇది అజయ్ దేవగన్, తన భర్య హీరోయిన్ కాజోల్ ఓ సినిమా షూటింగ్ సమయంలో దిగారు. ‘నాకు లాక్డౌన్ ప్రారంభమైన 20 ఏళ్లు అయినట్టు అనిపిస్తుంది’ అని అజయ్ దేవగన్ సరదాగా కామెంట్ జతచేసి కాజోల్ను ట్యాగ్ చేశారు. (అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్) ‘హల్చుల్’ సినిమా చిత్రీకరణలో కలుసుకున్న కాజోల్, అజయ్ 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరూ గుండరాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజు చాచా, ప్యార్తో హోనా హి థా పలు సినిమాల్లో నటించారు. ఈ జంటకి 2003లో కుమార్తె నైసా, 2010లో కుమారుడు యుగ్ జన్మించారు. View this post on Instagram Feels like it’s been twenty two years since the lockdown began. #FridayFlashback @kajol A post shared by Ajay Devgn (@ajaydevgn) on May 8, 2020 at 6:19am PDT ది బిగ్ బుల్, మైదాన్, సూర్యవంశీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు మరో రెండు చిత్రాల్లో ఆజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పలు చిత్రాల షూటింగ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదేవిధంగా చివరగా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాలో అజయ్ దేవ్గన్ కనిపించారు. కాజోల్ చివరగా ప్రియాంక బెనర్జీ షార్టుఫిల్మ్ ‘దేవి’లో కనిపించారు. అదేవిధంగా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాలో సావిత్రిబాయి మలుసారే పాత్రలో కాజోల్ అజయ్దేవగన్కి భార్యగా నటించిన విషయం తెలిసిందే. -
రెండో రైడ్కు రెడీ
అజయ్ దేవగన్ హీరోగా రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రైడ్’ (2018) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘రైడ్ 2’ను సెట్స్పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ‘రైడ్’ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్కుమార్ తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘రైడ్ 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తొలి పార్ట్ సక్సెస్ సాధించింది. దీంతో సీక్వెల్పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు భూషణ్కుమార్. -
గుంగూబాయ్కి దీపిక స్పెషల్
మాఫియా క్వీన్ గంగూబాయ్ కోసం దీపికా పదుకోన్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని బాలీవుడ్ తాజా వార్త . సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గుంగూబాయ్ కతియావాడి’. ఈ చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ గుంగూబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కి స్కోప్ ఉందట. ఈ పాట కోసం దీపికా పదుకోన్ను సంప్రదించారట. ఈ సినిమాకు ముందు దీపికా పదుకోన్కు ‘పద్మావత్’ రూపంలో మంచి హిట్ ఇచ్చారు భన్సాలీ. అందుకని ‘గుంగూబాయ్’లో ప్రత్యేక పాట చేయడానికి దీపిక సై అంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆ వార్తలు నిజం కాదు
‘‘కాజోల్, నైసా గురించి అడుగుతున్న అందరికీ ధన్యవాదాలు. వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు’’ అన్నారు అజయ్ దేవగన్. అసలు విషయం ఏంటంటే.. అజయ్–కాజోల్ల కుమార్తె నైసా సింగపూర్లో చదువుకుంటోంది. కుమార్తెను చూడడానికి కాజోల్ ఆ మధ్య సింగపూర్ వెళ్లారు. చదువు పూర్తి కావడంతో కుమార్తెను తీసుకుని ఇండియా వచ్చారామె. అయితే కాజోల్, నైసాకి కరోనా సోకిందనే వార్తలు మొదలయ్యాయి. ‘‘ఆ వార్తలు నిజం కాదు. మా ఫ్యామిలీలో అందరి ఆరోగ్యం బాగుంది’’ అని స్పష్టం చేశారు అజయ్ దేవగన్. -
కాజోల్, నైసా బాగున్నారు: అజయ్ దేవ్గణ్
ముంబై: తన భార్య కాజోల్, కుమార్తె నైసా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కోవిబడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలంతా ఇంట్లోనే గడుపుతూ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. (తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి) ఈ క్రమంలో కాజోల్ సైతం తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాజోల్, ఆమె కూతురు నైసా ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. సింగపూర్లో విద్యనభ్యసిస్తున్న నైసాను రిసీవ్ చేసుకోవడానికి కాజోల్ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నైసా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారని.. కాజోల్కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ రూమర్లపై స్పందించిన అజయ్.. ‘‘మీరు ఈ విషయం గురించి అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కాజోల్, నైసా బాగున్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవాలు. నిరాధారమైనవి’’అని ట్విటర్లో స్పష్టం చేశారు. కాగా హల్చల్, గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో కలిసి నటించిన కాజోల్- అజయ్.. 1999లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం. Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless🙏 — Ajay Devgn (@ajaydevgn) March 30, 2020 -
ఖైదీ దొరికాడా?
గత ఏడాది దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రం ‘ఖైదీ’. ఖైదీ పాత్రలో కార్తీ కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో యస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు నిర్మాత ప్రభు. నటీనటుల వివరాలు మాత్రం ప్రకటించలేదు. ‘ఖైదీ’ హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. -
దీన్ని సెల్ఫీ అంటారా?
బాలీవుడ్ కపుల్ అజయ్ దేవ్గన్, కాజోల్ రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ ఒకరిపై మరొకరు అవాక్కులు చవాక్కులు పేల్చుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక వీరిద్దరూ కలిసి దాదాపు పదేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. కాగా సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో కాజోల్ భర్తను సెల్ఫీ తీయమని అడిగింది. భార్య అడిగాక భర్త కాదంటాడా? ఓస్.. అదెంత పని అంటూ అజయ్ ఫోన్ చేతిలోకి తీసుకుని.. సతీమణిని మెట్లపై కూర్చోమన్నాడు.(కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం: కాజోల్) వెంటనే కాజోల్ హుషారుగా వెళ్లి మెట్లపై కూర్చుని ఫొటోకు పోజిచ్చింది. తీరా అజయ్.. భార్యను మాత్రమే క్లిక్మనిపించాడు. దీంతో బుంగమూతి పెట్టిన కాజోల్ ‘సెల్ఫీ అంటే నన్ను ఒక్కదాన్నే తీయమని కాదు.. మనమిద్దరం కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం’ అని క్లాస్ పీకింది. ఇక ఈ విషయాన్ని ఫొటోతో సహా ఇన్స్టాగ్రామ్లో రాసుకిచ్చింది. వీరి చిలిపి చేష్టలకు అభిమానులు స్పందిస్తూ ‘ఫొటోలో కనిపించకపోతేనేం.. నీ కళ్లలో కనిపిస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా అని అజయ్కు సెల్ఫీ తీయడం రాదేమోనని తేలికగా తీసిపారేయకండి. పండుగలు, పబ్బాలు, ఫ్యామిలీ ట్రిప్.. ఇలా చాలాసార్లు అతనూ సెల్ఫీలు క్లిక్మనిపించాడు. కాగా వీళ్లిద్దరూ నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం పెద్దల అంగీకారంతో 1999లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నైసా, యగ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (‘మైదాన్’ ఫస్ట్లుక్ పోస్టర్ వచ్చేసింది) -
అజయ్ ‘మైదాన్’ ఫస్ట్లుక్ అదిరింది
తాన్హాజీ అనే చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న అజయ్ దేవ్గన్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ‘మైదాన్’ అనే సినిమా చేస్తున్నారు.ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా ‘మైదాన్’ సినిమా రూపొందుతుంది. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ ఫుల్బాల్ కోచ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. ఫుట్ బాల్ కోచ్గా అజయ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్బాల్ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భారత్. ఆ సమయంలో ఆ జట్టుకి కోచ్గా సయ్యద్ అబ్ధుల్ రహీం ఉన్నారు. ఆయన జీవితాన్ని ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 27న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు ప్రపంచవాప్తంగా విడుదల కానుంది. -
ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. చారిత్రాత్మక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. కాగా మరాఠా యోధుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రియల్ లైఫ్ జంట అజయ్దేవ్గన్, కాజోల్ రీల్ లైఫ్లోనూ భార్యాభర్తలుగా నటించారు. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద ఏమాత్రం తడబడకుండా ఇప్పటికీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా రిలీజైన పదిరోజులకే దుకాణం బంద్ చేసుకుంటున్న ఈ రోజుల్లో తాన్హాజీ మూడో వారంలోనూ రూ.32.75 కోట్లు సాధించింది. దీంతో మూడోవారంలోనూ అత్యధిక కలెక్షన్లను సాధిస్తున్న చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటికే రెండు సెంచరీలు దాటిన తాన్హాజీ రూ.250 కోట్ల మార్క్కు అతి చేరువలో ఉంది. కానీ తాజాగా విడుదలైన వరుణ్ ధావన్ ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3’, కంగనా రనౌత్ ‘పంగా’ అజయ్ దేవ్గన్ సినిమాకు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజులు థియేటర్ల వద్ద స్థిరంగా నిలబడితేనే తాన్హాజీ ఆ మైలు రాయిని చేరుకుంటుందని సినీవిశ్లేషకులు అంటున్నారు. చదవండి: అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్ -
ఆర్ఆర్ఆర్: జక్కన్నతో బాలీవుడ్ స్టార్ హీరో
మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. పైగా ఇద్దరు లేదా అంతకుమించిన స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపిస్తున్నారంటే వారి అభిమానులకు పండగే. యంగ్టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గురించి ప్రేక్షకులు గతేడాది నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల ఆలస్యం కానుందనే వార్త అందరినీ నిరాశకు గురి చేసింది. కానీ వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాలోని కీలక సన్నివేశాల్ని శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవ్గన్ మంగళవారం షూటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు జక్కన్నతో కలిసి దిగిన ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేటి నుంచి అజయ్పై చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ మారిందా? -
తిరుగులేని తాన్హాజీ, మరో రికార్డు దిశగా
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ మరాఠా యోధుడిగా నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిజజీవితంలో భార్యాభర్తలైన అజయ్ దేవగన్, కాజోల్ రీల్ లైఫ్లో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ.175 కోట్లు కురిపించింది. అదే రోజు విడుదలైన ‘ఛపాక్’ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఎన్ని ప్రమోషన్లు చేసినప్పటికీ ఛపాక్.. తాన్హాజీ ధాటికి ఎదురునిలవలేకపోయింది. ఇక తాన్హాజీ చిత్రానికి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా రెండో వారంలోనూ ధీటుగా వసూళ్లు రాబడుతుండటంతో రూ.200 కోట్లను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు తేల్చి చెప్తున్నారు. తాన్హాజీ రిలీజైన మూడు రోజులకే హాఫ్ సెంచరీ, ఆరు రోజులకే సెంచరీ కొట్టగా మరిన్ని రికార్డులు బద్ధలు చేసే దిశగా వసూళ్ల కొనసాగుతున్నాయి. ఇక ఈ చారితత్రాత్మక చిత్రం అజయ్ దేవ్గన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. చదవండి: ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ! తాన్హాజీ: కలెక్షన్ల తుఫాన్ -
ఆ చిత్రంలో కీర్తి స్థానంలో ప్రియమణి
దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి లక్కీ చాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. భారత ఫుట్బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్దేవ్గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేశ్ను ఎంపిక చేశారు. జీ స్టూడియోస్, బోని కపూర్ మైదాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి కీర్తి డ్రాప్ అయ్యారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బరువుగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రంలో కీర్తి పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నిర్మాతలు ప్రియమణిని సంప్రదించగా.. ఆమె కూడా ఆసక్తి కనబరిచినట్టుగా సమాచారం. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తున్నారు. -
ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ!
మరాఠా యోధుడు తాన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ . శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటింది. నిలకడగా వసూళ్లు రాబడుతున్న తాన్హాజీ.. త్వరలోనే రూ. 150 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘తాన్హాజీ’ సినిమాను విజయవంతం చేసినందుకు హీరో అజయ్ దేవగణ్ ప్రేక్షకులకు కృతఙ్ఞలు తెలిపాడు. ఈ మేరకు సినిమా కలెక్షన్లతో కూడిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేసిన అజయ్... ‘ ఇంతటి విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రశంసలను అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా’ అని ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: కాజోల్ కాగా దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ రీల్ లైఫ్ భార్యాభర్తలుగా కనిపించారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్గణ్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. ఇక తాన్హాజీతో పాటు అదే రోజు విడుదలైన దీపికా పదుకొనే సినిమా ఛపాక్ మాత్రం వసూళ్లలో వెనకబడిపోయింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. ఆరు రోజుల్లో కేవలం రూ. 26 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. ఛపాక్ విడుదలకు ముందు దీపిక.. ఢిల్లీలోని జేఎన్యూను సందర్శించడం వసూళ్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక దీపిక సినిమాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించగా.. అజయ్ తాన్హాజీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వెసలుబాటు కల్పించింది. తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Thanks to each and everyone for making this happen! I'm humbled & grateful for all the love, support & appreciation for #TanhajiTheUnsungWarrior 🙏@itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @SharadK7 @ADFFilms @TSeries @TanhajiFilm pic.twitter.com/QmHmJ5zBaZ — Ajay Devgn (@ajaydevgn) January 16, 2020 -
తన్హాజీ.. కలెక్షన్ల తుఫాన్!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన పిరియడ్ డ్రామ ‘తన్హాజీ : ది అన్సంగ్ వారియర్’. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.7 కోట్లు వసూలు చేసింది. మరాఠా యోధుడి కథ కావడంతో మహారాష్ట్రలో అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ... ఇటు మెట్రో నగరాల్లోని మల్టిప్లెక్స్ల్లో, మాస్ థియేటర్లలో సత్తా చాటుతోంది. శుక్రవారం తొలిరోజు రూ. 15.10 కోట్లు, శనివారం రూ. 20.57 కోట్లు రాబట్టిన తన్హాజీ.. ఆదివారం మరింతగా పుంజుకొని రూ. 26.08 కోట్లు రాబట్టిందని, మొత్తంగా రూ. 61.75 కోట్లను ఈ సినిమా మూడోరోజుల్లో రాబట్టిందని ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఈ మరాఠా యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటించారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కింది.