Ameerpet
-
'ఆ థియేటర్తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్లోని ఓ ఫేమస్ థియేటర్ను గుర్తు చేసుకున్నారు. అమీర్పేట్లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరాతబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. Hyderabad looks so beautiful with light rain and the glowing city skyline. A perfect peaceful Morning! 🌧️🌃 #HyderabadRains #CitySkyline #BeautifulHyderabad #RainyVibes@HyderabadMojo@HiHyderabad @hyderabadprop @ikaranreddy pic.twitter.com/fQaWuSDSHl— HyderabadInfra (@HyderabdInfra) December 8, 2024 -
అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Ameerpet: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
అమీర్పేట: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంధ్య, నరేష్ దంపతులు ఎస్ఆర్నగర్లో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి సీసీఎస్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు నరేష్ పరారు కాగా విటులు సంతోష్దాస్, రామరాజులతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీపులు తదుపరి విచారణ నిమిత్తం ఎస్ఆర్నగర్కు బదిలీ చేశారు. -
హైదరాబాద్లో కుండపోత వర్షం.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జల్లులతో మొదలైన వర్షం.. కుండపోతగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఇక, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, మాదాపూర్, ఖైరాతాబాద్, కొండాపూర్, పంజాగుట్టా, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్ నగర్, బోరబండా, మెహదీపట్నం,బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.Sunday Music Start #HyderabadRains pic.twitter.com/qP1uje5IX3— Johnnie Walker🚁 (@Johnnie5ir) September 8, 2024 Rainy day#rains #hyderabadrains #RainyDay pic.twitter.com/gSztUEI8cZ— Best Bike (@bestbike2023) September 8, 2024 Heavy rain in Begumpet Airport @balaji25_t 🌧️🌪️#Hyderabad #HyderabadRains#WeatherUpdate pic.twitter.com/FbtcUOHHbo— పంజా (@HarishNaidu01) September 8, 2024 Rains further Covers all parts in ✅Hyderabad by 3:15 PM ✅North Hyderabad to reduce rains after 3:20 PM#HyderabadRains https://t.co/WYklIZ5jPY— Hyderabad Rainfall Alert⛈️ (@Hyderabadstorm) September 8, 2024 -
హైదరాబాద్లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్పల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, చందానగర్, మియాపూర్, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Hyderabadrains!!Now iosalted thunder storm rains for west Hyderabad City places like Kukatpally serilingampally nizampet miyapur Quthbullapur places see good rains 🌧️🌧️⚠️ pic.twitter.com/aJlZvA4rSg— Telangana state Weatherman (@tharun25_t) August 14, 2024 -
అమీర్పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్లోని అమీర్పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, మీర్పేట్, చాదర్ఘాట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్, గోషామహల్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హబీబ్నగర్, రాయదుర్గం, అప్జల్గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #HyderabadRains pic.twitter.com/IUaeFxv27c — pala hanmi reddy (@hanmireddy) November 23, 2023 @Hyderabadrains it's raining heavily at Raidurgham pic.twitter.com/druN8puIqC — Varun sam (@Varunsam007) November 23, 2023 Heavy rainfall in Hyderabad 🌧#HyderabadRains pic.twitter.com/o93Rq09eGp — Irfan Khan (@IrfanKhanhyd) November 23, 2023 -
అమీర్పేట్లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
అమీర్పేట్లో మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్పేట్లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్ను నడిపిస్తున్నాడు బన్నీ. Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8 — AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023 ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! ) the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C — AAA cinemas (@aaa_cinemas) June 15, 2023 -
AAA Cinemas Images: అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
AAA Cinemas Photos In HD: బన్నీ మల్టీప్లెక్స్లో అన్నీ ప్రత్యేకతలే.. చూస్తే వావ్ అనాల్సిందే (ఫోటోలు)
-
Hyderabad: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో రూ.6 లక్షలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.6 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్నగర్కు చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ పరిచయం ఏర్పడింది. తనకు వివాహం అయ్యిందని.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మి సదరు యువతి అతడితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని చెప్పడంతో రూ.6 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్కు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలియడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్లపై ప్రయాణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాలను పక్కన పెట్టారు. ఆర్టీసీ బస్సుల్లోనూ పయనించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. గురువారం మాత్రం సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించినట్లు అంచనా. ఉదయం 8 గంటల నుంచే మెట్రో రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు వేసవి కారణంగా సొంత వాహనాల కంటే మెట్రో రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రద్దీ గంటలుగా భావించే ఉదయం 8 నుంచి 10 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజులుగా అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండు కారిడార్లలోనే ఎక్కువ.. నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు అక్కడి నుంచి రాయదుర్గం వరకు అన్ని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రం ప్రయాణికుల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయి. మిగతా రెండు కారిడార్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటోంది. వివిధ స్టేషన్లలో కనీసం రెండు నుంచి మూడు మెట్రో రైళ్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులు ఎదురు చూస్తుండగా ఒక్క రైలు మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీంతో మెట్రో ఆక్యుపెన్సీకి మించిన ప్రయాణికులతో రైళ్లు నడుస్తున్నాయి. నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినా.. ప్రయాణికులకు పడిగాపులు తప్పడంలేదు. ట్రిప్పులు పెరిగితేనే ఊరట... ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకో రైలు చొప్పున నడుస్తున్నాయి. కానీ.. రద్దీ ఎక్కువగా ఉండే నాగోల్ –రాయదుర్గం రూట్లో 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు ఒక వెల్లువలా వచ్చేస్తున్నారు. ఎల్బీనగర్– మియాపూర్ రూట్లోనే అదే పరిస్థితి. రైళ్ల వేగాన్ని పెంచి ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండేలా నడిపితేనే మరిన్ని ట్రిప్పులు పెరిగి ప్రయాణికులకు ఈ వేసవిలో ఊరట లభించే అవకాశం ఉంది. ఆ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపడితే వేసవి తాపం నుంచి కొంత మేరకు ఉపశమనం లభించనుంది. Here a the answer. When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4 — Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023 -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
అమీర్పేట్లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. త్వరలోనే ప్రారంభం
సినిమాలతో పాటు బిజినెస్లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్తో కలిసి ఏఎంబీ మాల్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్ అమీర్పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్కు ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను కత్తితో పొడిచి హత్య) -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్మెయిల్కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
మెట్రో స్టేషన్లో యువకుడి వికృత చేష్టలు.. లిఫ్ట్ ఎక్కి.. బట్టలు విప్పి
సాక్షి, హైదరాబాద్: అమీర్పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్కు చెందిన ఓ మహిళ మంగళవారం షాపింగ్ చేసేందుకు అమీర్పేటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమీర్పేట చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది. వెనకాలే వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్లోకి ఎక్కాడు. బట్టలు విప్పి వికృత చేష్టలు చేయడాన్ని గమనించిన ఆమె భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి మెట్రో సెక్యూరిటి సిబ్బందికి తెలిపింది. సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఒడిషాకు చెందిన రాజుగా గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు టికెట్ రూ.5 -
పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్నెస్ కోసం గతేడాది కల్యాణ్నగర్లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..) -
కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు
సాక్షి, అమీర్పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్లో ఉంటున్న కర్నూల్కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా
సాక్షి, అమీర్పేట: అద్దె ఇల్లు కావాలంటూ వచ్చిన ఓ యువజంట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్లో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉదయం ఓ యువతి, యువకుడు ఇల్లు అద్దెకు కావాలని యజమాని వద్దకు వచ్చారు. లోపల ఇంటిని చూసేందుకు రెండో అంతస్తుకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారి పోయారు. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చదవండి: (భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?) -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్లో ఉన్న ఓయో రూమ్లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్లోని విద్యుత్ టవర్స్లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి
అమీర్పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్లాల్నగర్లో ఉండేవారు. తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్నగర్లో ఉండే సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్లాల్నగర్కు చెందిన చెఫ్ శ్రీశైల్ కోట్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్కు తెలియడంతో ఆమెపై ఖలీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా..
సాక్షి, అమీర్పేట: శుభకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో కలిసి ఓ మహిళ దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అసభ్యకరంగా కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసుల సమాచారం మేరకు.. వెంగళరావునగర్లో ఉండే ఓ గృహిణి భర్తతో కలిసి ఇటీవల జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైంది. అక్కడికి సమీప బంధువైన కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా రావడంతో పక్కపక్క కూర్చుని ఫొటోలు దిగారు. అయితే కొందరు వ్యక్తులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆడియోలోఅసభ్యకరమైన కామెంట్లు పెట్టి ఫేస్బుక్, యూట్యూబ్లో పోస్ట్ చేశారు. దీంతో సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. చదవండి: Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. -
అమీర్పేట: మెట్రో స్టేషన్పై నుంచి దూకిన యువతి
హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్ పై నుంచి ఒక యువతి కిందకు దూకడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మెట్రో అధికారులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగాను ఉంది. కాగా యువతి వయసు 18 సంవత్సరాలు అని తేలింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ జారిపడిందా లేక ఆత్యహత్యకు ప్రయత్నించిందా అన్నది తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..
సాక్షి, మహేశ్వరం: నిశ్చితార్థం రద్దు కావడంతో ఓ యువతి ఉరివేసుకొని తనువు చాలించింది. రెండు కుటుంబాలు పట్టింపులకు వెళ్లడంతో మనస్తాపానికి గురైంది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహేశ్వరం సీఐ మధుసూదన్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కూతురు ప్రగతి(19) డిగ్రీ వరకు చదువుకుంది. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామానికి చెందిన కార్తీక్తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబపెద్దలు పట్టింపులకు పోవడంతో ఆదివారం దానిని రద్దు చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ప్రగతి, కార్తీక్కు ఇష్టం ఉన్నా నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో చీరతో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6 గంటలకు ప్రగతిని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి ..వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రగతి ఫోన్ కాల్డేటాను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హైదరాబాద్లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..) -
అమీర్పేట్లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ
సాక్షి, హైదరాబాద్: అమీర్పేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమీర్పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ప్రోటోకాల్ విషయంలో బీజేపీ -టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్- మాజీ కార్పొరేటర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన శిలా ఫలకంమీద పోట్రోకాల్ ప్రకారం కిషన్రెడ్డి పేరు ముందు వరుసలో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్నగర్కు చెందిన వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
అమీర్పేట్లో స్కూల్ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, అమీర్పేట: ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అమీర్పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్కుమార్ కుటుంబం మధురానగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్ (26)ఓ యువతిని ప్రేమిచాడు. చదవండి: సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్ వెళ్లి విశాల్ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. సెనైడ్ ఎలా వచ్చింది? సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ సెనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే విశాల్కు సెనైడ్ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి -
అమీర్పేటలో ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభానటేష్ సందడి
అమీర్పేట: విభిన్న ఆహార రుచులకు హైదరాబద్ కేరాఫ్గా నిలుస్తోందని సినీ నటి సభా నటేష్ అన్నారు. అమీర్పేటలో నూతనంగా ఏర్పాటైన జిస్మత్ మండి అరబిక్ జైల్ థీమ్ రెస్టారెంట్ను టాలివుడ్ నటి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు జైల్ థీమ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో జిస్మత్ అరబిక్ మండీలు ఉన్నాయని, త్వరలో ఏఎస్రావునగర్, దిల్సుఖ్నగర్, ఏలూరుతో పాటు బెంగుళూరులో తమ శాఖలను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు యూట్యూబర్ గౌతమి, ధర్మా తెలిపారు. మండీలను జైలును తలపించే తరహాలో తీర్చిదిద్దామని, ఖైదీల వేషధారణలో కారాగారం డైనింగ్ సెటఫ్లో కూర్చునే ఆహార ప్రియులకు ఆహారం అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ, టీఆర్ఎస్ నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు. -
‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’
సాక్షి, అమీర్పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎల్లమ్మ తల్లీ.. నీవే మా కల్పవల్లి
అమీర్పేట: పండుటాకులు.. నిండు ముత్తైదువలు.. వేపకొమ్మలు చేబూని.. పసుపు కుంకుమలను ముఖాలకు పూసుకుని మురిసిపోయారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని తనివితీరా తలుచుకుని తన్మయత్వం పొందారు. అమ్మవారి పట్ల తమకున్న అవ్యాజమైన భక్తిని చాటుకున్నారు. పసుపు, కుంకుమలతో కలకాలం చల్లంగా ఉండాలని, నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో కనిపించిన ఈ దృశ్యం భక్తులను అమితంగా అబ్బురపరిచింది. ఉదయం 11.గంటల 11 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరిగింది. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పులకించిన ‘బల్కంపేట’ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం మంగళవాద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించి పులకించారు. వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వినయ్భాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్కుమార్, దైవజ్ఞ శర్మ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్య, కార్పొరేటర్లు సరళ, కొలను లక్ష్మీబాల్రెడ్డి, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి, కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జియోలో ఉద్యోగం.. రూ.7.48 లక్షలు మాయం
సాక్షి, హిమాయత్నగర్: సంపన్న వర్గానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాడు భారీ టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. అమీర్పేటకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం నౌకరీ డాట్ కామ్లో రెజ్యూమ్ పెట్టింది. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు జియో కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మీ రెజ్యూమ్ను జియో హెచ్ఆర్కు ఫార్వర్డ్ చేశానని, మీ చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నాడు. జియో సంస్థ కావడంతో అత్యాశకు పోయిన యువతి సైబర్ నేరగాడు అడిగిన విధంగా పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.7.48 లక్షలను పంపింది. రోజులు గడిచినా జియో సంస్థ నుంచి ఫోన్ రాకపోవడంతో పలుమార్లు ఆమెకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసి అడిగింది. వారం, పదిరోజులు అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో తాను వెసపోయినట్లు గ్రహించి బుధవారం సాయంత్రం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: అత్యాచార నిందితుడితో యువతి అరెస్ట్.. బాధతో గుండె పగిలి.. -
అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా!
సినిమాలతోపాటు ఇతర బిజినెస్లపై దృష్టిపెట్టారు మన టాలీవుడ్ హీరోలు.. కొత్త రంగాల్లో పెట్టిబడి పెడుతూ చేతికి అందినంత సంపాదించుకునేదుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేశ్బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఎంబీ(AMB) సినిమాస్ పేరుతో మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏవీడీ(AVD) సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్నగర్లో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్లోకి రావడంతో వీరిద్దరి మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ ఇమేజ్కు తగ్గట్టుగానే ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. అమీర్పేట్ పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవంతిగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాతి వరకు ఈ థియేటర్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ ఫోటోతో ఏఏఏ లోగో కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ రేంజ్ మించిపోయేలా ఏఏఏ సినిమాస్ ఉంటుదా అనేది తెలియాలంటే నిర్మాణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. చదవండి: పుష్పరాజ్ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు -
కూకట్పల్లిలో ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి...
అమీర్పేట: సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్కుడిని మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్ఆర్నగర్లోని స్వస్థిక్ ప్లాజా హిమాలయా బుక్ స్టోర్ పైఅంతస్తులో నివాసముంటున్నాడు. ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. తన పేరు సుధాకర్ అని తాను సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్ వెంట ఇద్దరు గన్మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్ కూడా ఉండేవి. కూకట్పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది నీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు. దీంతో శైలేంద్ర విడతలవారీగా 2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు. డబ్బులు అడిగితే గన్తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఆగమాగమైన అమీర్పేట ఐటీ!
అమీర్పేట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచానికి తెలిసిన పేరు.. కుప్పలుతెప్పలుగా ఉండే కోచింగ్ సెంటర్లలో గుంపులుగా యువత.. ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతం కరపత్రాలతో నిండిపోతుంది. ఆకాశాన్ని మూసేలా పోటాపోటీ బ్యానర్లు.. ఎటు చూసినా ఆఫర్లమయం.. కాస్త ఆలోచించి శిక్షణ తీసుకొని కష్టపడితే చాలు ఫ్లైట్లో విదేశాలకు ఎగిరిపోవచ్చు.. పల్లెల్లో సైకిళ్లు ఎరుగని యువకులు సైతం పెద్ద కంపెనీల్లో కొలువులు చేస్తున్నారంటే అమీర్పేట పుణ్యమే.. ఎర్రబస్సు ఎరుగని పల్లె టు అమెరికా వయా అమీర్పేట అన్నా అతిశయోక్తి కాదేమో.. దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువులకు బాటలు ఇక్కడి నుంచే మొదలయ్యేవి. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను విద్యార్థులకు పండొలచినట్లు చెప్పి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దే సెంటర్లు కోకొల్లలు. ఏడాదికి ఐదు లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్కు పునాది అమీర్పేట. కరోనా కాటుకు ఇక్కడి ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి. -సనత్నగర్ ఆ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందంటే.. ► కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్డౌన్కు ముందు ఐటీ విద్యార్థులతో అమీర్పేట అలరారింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కోచింగ్ సెంటర్లు తెరుచుకోలేదు. ► ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. అకాడమీ ఇయర్ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్వేర్ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపే అడుగులు వేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు వస్తారు. ► ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కలల జాబ్ను సంపాదించేందుకు ఇక్కడి కేంద్రాల్లో వాలిపోతుంటారు. ► ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 9 నెలలుగా విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. అప్పట్లో ఒక్క విద్యార్థి అమీర్పేట గడప తొక్కాడంటే.. అతడిని ఏదో రకంగా తమ కేంద్రంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది తొమ్మిది నెలలు పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఊహించుకోవచ్చు. ► అమీర్పేట కేంద్రంగా 400–450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్లైన్’ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. 50వేల మంది ఉపాధిపై వేటు.. ► అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసేవారు. ఆన్లైన్ శిక్షణ కొనసాగిస్తుండటంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ► టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లు, టీ స్టాల్స్.. ఇలా పదుల సంఖ్యలో చిరువ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బతికేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్ లేకుండాపోయింది. ఇక హాస్టల్స్ పరిస్థితి అగమ్యగోచరం. టాలెంట్కే పెద్దపీట.. కరోనాకు ముందు ప్రతి 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ వారికే అవకాశం కల్పిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభ సమయంలో చాలా ఐటీ కంపెనీలు కరోనా సాకుతో చాలామందిని ఇంటికి సాగనంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో టాలెంట్ కలిగిన ఫ్రెషర్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ్రెషర్స్కు తక్కువ వేతనాలు ఇచ్చినా తమకు అనుకూలంగా ఉంటారన్న భావనతో ఉన్నట్లు సమాచారం. ‘ఆన్లైన్’.. ఒక సవాలే.. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో బోధించినట్లు ఇక్కడ కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఓ ఫ్లాట్ఫాం. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాలి. ఫిజికల్ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్లైన్లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే.. అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఆన్లైన్ సిమిలేటర్స్ సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం. కీలక సమయం కోల్పోయాం.. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై మాసాలు అత్యంత కీలకం. కరోనా కారణంగా ఆ సమయాన్ని కోల్పోయాం. ఆన్లైన్ తరగతులను సీరియస్గా ఫాలో అయితే జాబ్ కొట్టొచ్చు. కరోనాతో కొంతమేర ఐటీ కంపెనీలు డీలా పడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులను పక్కకు తప్పించారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. – నరేష్, ఎండీ, నరేష్ టెక్నాలజీ 400 మందికి ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలపై కోవిడ్–19 కోలుకోని దెబ్బకొట్టింది. అమీర్పేట, కేపీహెచ్కాలనీ ప్రాంతాల్లో 80 శాతం వరకు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. విద్యార్థులకు స్కిల్స్ ఉంటే ఆన్లైన్, ఆఫ్లైన్లో ఎలా శిక్షణ పొందినా ఉద్యోగం గ్యారంటీ. తాము కోవిడ్లోనూ 400 మందికి ప్లేస్మెంట్ అందించాం. స్కిల్స్ ఉంటే ఇంటికే ల్యాప్టాప్ పంపించి పని చేయించుకుంటారు. – దండు విశ్వనాథరాజు, సీఈఓ, వెక్టార్ ఇండియా -
హైదరాబాద్: అమీర్పేట్లో రోడ్డు ప్రమాదం
-
అమీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అమీర్పేట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం తెల్లవారుజామున అతి వేగంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడి తల మెట్రో స్టేషన్ రైలింగ్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) -
అమీర్పేట్లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : అమీర్పేట్లో డ్రగ్స్ కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతో పాటు నగరానికి చెందిన రోహిత్, నవీన్రాజ్ డ్రగ్స్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన కునాల్, రఫీ పరార్ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్కు డ్రగ్స్ సరపర చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వాడిన టూ వీలర్, కార్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. -
మాఫియా డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. ఆదివారం అమీర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు రకాల నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్ ఆయిల్, 4 బ్లాట్స్ ఎల్ఎస్డీ, 250 డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కార్లు, ఒక బైక్, 7 మొబైల్ ఫోన్ల స్వాధీనంతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్కు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్కు చెందిన భరత్ తుక్రాల్(48)తోపాటు బల్కంపేట్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాణాప్రతాప్(29), షేక్ ఫిరోజ్ అహ్మద్(29)ను అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన రెండు కార్లను, ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. జేమ్స్, జెమీ, అబ్దుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నార న్నారు. కేసు తదుపరి విచారణ కోసం అమీర్ పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజి రెడ్డి తెలిపారు. కాగా, నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషే ధిత డ్రగ్స్ను సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అమీర్పేట: టైర్ల షాపులో పనిచేసే ఓ యువకుడు వేధిస్తున్నాడన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అమీర్పేట ఈస్ట్ శ్రీనివాస్నగర్ కాలనీలోని అనురాగ్ అపార్ట్మెంట్లో ఉండే ఆర్టీసీ కండక్టర్ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు చదువుకుంటానని అపార్ట్మెంట్పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్చేసి అపార్ట్మెంట్ సమీపంలోని టైర్ల షాపులో పనిచేసే నవీన్ కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నాడని, మనస్తాపంతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నా నని ఏడుస్తూ తెలిపింది. గోపాల్ వెంటనే పైకి వెళ్లి చూడగా నోట్లో నుండి నురగలు కక్కుతూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
యువతులతో పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్ భవన్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్పేట్లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (లిఫ్ట్లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం) -
అనుమానాస్పదంగా సినీ ఆర్టిస్ట్ మృతి
సాక్షి, హైదరాబాద్(అమీర్పేట): సినీ ఆర్టిస్ట్, టీవీ యాంకర్గా పని చేస్తున్న పర్తి విశ్వశాంతి (33) మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిబ్జీ రెసిడెన్సీ చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్.5లో అద్దె ఉంటున్న ఈమె గత మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. బెడ్రూంలో విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాళ్లు బెడ్పై, ముఖం నేలపై పడి ముఖం మీద గాయాలై రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. గదిలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. టీపాయ్ మీద స్నాక్స్ ఉండటంతో తీసుకోవడానికి వెళ్లి మద్యం మత్తులో అదుపుతప్ప కిందిపడి చనిపోయి ఉండవచ్చు లేదా ఎవరైనా చంపేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. మృతరాలి తల్లి ఇటీవలే సొంత ఊరికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. -
దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నకొందరు ఆకతాయిల ఉదంతం మరువకముందే.. హైదరాబాద్లో మరో పిచ్చి ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి’అని అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: కరోనా : ఈశాన్య విద్యార్థులపై జాతి వివక్ష) అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే సమాజానికి దూరంగా బతుకుతున్నామని, తామూ మనుషులమేనని గుర్తించాలని క్రుంగిపోతున్న హిజ్రాలకు ఇదో ఇబ్బందికర పరిస్థితి తెచ్చినట్టయింది. ఇదిలాఉండగా.. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో సైతం.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు. #Transphobic Posters at Ameerpet Metro Station reads: “Warning: Do not allow Kojja, Hijras near the shops. If you talk to them or have sex with them, you will be infected with #CoronaVirus. Beat & drive them away or call 100 immediately. Save people from Corona Virus Hijras". pic.twitter.com/21HP5YBDSp — Meera Sanghamitra (@meeracomposes) March 29, 2020 (చదవండి: పెళ్లి పేరుతో మోసం చేశాడు..) (చదవండి: లాక్డౌన్ను పొడిగించం: కేంద్రం) -
హైదరాబాద్లో హాస్టళ్లో ఉంటున్నవారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్లో హాస్టలర్లకు ఊరట లభించింది. అమీర్పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లను ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో యువతీ యువకులు బుధవారం ఆందోళనకు దిగారు. అమీర్పేట, పంజాగుట్టలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో చెక్పోస్ట్ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఎస్ఆర్నగర్ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్ ఓనర్ నుంచి లెటర్ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు. -
అమీర్పేట నడిరోడ్డుపై దారుణ హత్య
అమీర్పేట: అమీర్పేట పరసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్నేహితుడే కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రీన్పార్కు హోటల్ ఎదుట ఫుట్పాత్పై గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. కర్నాకట రాష్ట్రం గుల్బర్గాకు చెందిన షేక్ మోసిన్ (35) భార్య దివ్యతో కలిసి అమీర్పేట పరిసర ప్రాంతాల్లోని ఫుట్పాత్లనే ఆవాసాలుగా చేసుకుని నివాసముంటున్నారు. చిత్తు కాగితాలు ఏరుకోవడంతో పాటు అడ్డా కూలిగా కూడా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరితో పాటు బోరబండకు చెందిన అబ్బు అలియాస్ గోర చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో గ్రీన్పార్కు హోటల్ ఎదురుగా ఫుట్పాత్పై మోసిన్, అతని భార్య దివ్య, అబ్బు ముగ్గురు కలిసి మద్యం తాగారు. కాసేపటికి దివ్య పెరుగు తేచ్చేందుకు సమీపంలోని షాపునకు వెళ్లింది. ఆమె వచ్చేసరికి భర్త మోసిన్ రక్తపు మడుగులో పడికనిపించాడు. స్థానికుల సాయంతో దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 11 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దివ్య షాపుకు వెళ్లిన సమయంలో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. అబ్బు ఆవేశంతో కత్తితో గొంతు భాగంలో కోసి హత్యచేసి పారిపోయాడు. గొంతులో కత్తి లోతుగా తెగడం, తీవ్ర రక్తస్రావం జరిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మోసిన్ కత్తిపోట్లకు గురై దాదాపు అరగంట వరకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య గొడవకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మోసిన్ దివ్యను ప్రేమించి మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. గతంలో రాత్రి మద్యం సేవించి మోసిన్, దివ్య పడుకున్నాక అబ్బు దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. గమనించిన మోసిన్ అబ్బును కాలుతో తన్నాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న అబ్బు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
అమీర్పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం..
అమీర్పేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై పరుగులు తీస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 50 మందిని కరిచింది. మంగళవారం జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్ర 3.30 గంటల సమయంలో మొదటగా సోమాజిగూడలో రోడ్డుపై వెళుతున్న ఆరుగురు యువకులను పిచ్చికుక్క కరిచింది. సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా వచ్చి అమీర్పేట గ్రీన్ల్యాండ్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన ముగ్గురిని వెంటపడి మరీ కరిచింది. అక్కడి నుంచి నేరుగా ఇండో యూఎస్ ఆస్పత్రి నిల్చున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. సిస్టర్ నివేదిత స్కూల్ సమీపంలో ఇద్దరు విద్యార్థులను కరిచింది. ఇంట్లో నుంచి ట్యూషన్కు వెళుతున్న చిన్నారుల వెంటపడి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కొందరు యువకులు కుక్కను తరిమేందుకు ప్రయత్నించడంతో వారిపైకి దూకి మరీ కరిచింది. దీంతో వారు రాళ్లతో కొట్టి తరిమారు. అక్కడి నుంచి కన్యాగురుకుల్ పాఠశాల మీదుగా అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్ చౌరస్తాకు వచ్చి ఇద్దరు విద్యార్థులను కరిచింది. చిరు వ్యాపారులు కర్రలతో కొట్టి తరిమివేశారు. చల్లా నర్సింగ్ హోం వద్ద ఓ వైద్యుడితో పాటు ఇద్దరు సేల్స్మెన్లను కరిచింది. అనంతరం అమీర్పేట సత్యం థియేటర్ వద్ద మరో ఇద్దరిని కరిచింది. ఆగ్రహంతో కొందరు యువకులు రాళ్లు, కర్రలు పట్టుకుని వెంటపడి కొట్టడంతో హెచ్డీఎఫ్సి బ్యాంకు సమీపంలో పడిపోయింది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళ చెందారు. ఇటీవల కుక్కల సంఖ్య ఎక్కువైందని, వీటి భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తచేశారు. 18 మందికి చికిత్సలు.. కుక్కకాటుకు గురైన అనేక మంది ఆస్పత్రుల బాట పట్టారు. అమీర్పేట ధరం కరం రోడ్డులోని చల్లానర్సింగ్ హోంలో 18 మందికి చికిత్స అందించారు. వీరిలో నలుగురు విద్యార్థులతో పాటు ఓ వైద్యుడు ఉన్నారు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో చాలా మందిని ఇతర ఆస్పత్రులకు పంపించినట్లు వైద్యుడు విజేయ్కుమార్ తెలిపారు. యువకులతో మహిళ గొడవ.. రోడ్లపై కనిపించిన వారినందరినీ కరుస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో కొట్టి పిచ్చికుక్కను మట్టుపెట్టారు. ఈ సమయంలో అమీర్పేట సత్యంథియేటర్ వద్దకు వచ్చిన ఓ మహిళ కుక్కను కొట్టి చంపుతున్నారెందుకని ప్రశ్నించింది.అంతటితో ఆగకుండా కుక్కను కొట్టిన వారిని తన సెల్ఫోన్తో వీడియో తీసింది. దీంతో సదరు యువకులు ఆమెతో గొడవకు దిగారు. పిచ్చికుక్క మనుషులను కరిచి గాయాలపాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సదరు మహిళ వినిపించుకోకుండా తాను కమిషనర్ కూతురునని, కుక్క మృతికి కారకులైన వారిపై కేసు పెడతానంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. -
పౌరసత్వ వివరాలు సేకరించేందుకేమోనని
అమీర్పేట: పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చారన్న అనుమానంతో వంట గ్యాస్ విచారణ కోసం వచ్చిన ఓ వ్యక్తిని కొందరు యువకులు చితక్కొట్టారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డలోని ఆదిత్య (హెచ్పీ) గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత కొన్ని రోజులుగా గ్యాస్ కనెక్షన్లపై విచారణ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కనెక్షన్కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్కు చెందిన స్వామి అనే యువకుడు ఉదయం ఎర్రగడ్డ ఫాతిమానగర్కు వచ్చాడు. ఓ ఇంట్లోకి వెళ్లి గ్యాస్ను పరిశీలించాడు. ఆధార్కార్డు చూపించాలని అడగటంతో పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చాడన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఐడీ కార్డు చూపించాలని అడిగారు. స్వామి వద్ద ఉన్న కార్డును చూపించాడు. కార్డుపై ఫోటో అతికించి ఉన్నట్లు కనిపించడంతో మరింత అనుమానం వచ్చి సదరు యువకుడిని కొందరు వ్యక్తులు చితక బాదారు. వారే 100కు డయల్ చేసి అక్కడికి చేరుకున్న పోలీసులకు స్వామిని అప్పగించారు. ఈ సంఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన పోలీసులు స్వామి అనే యువకుడు గ్యాస్ కనెక్షన్ల వివరాలు సేకరించేందుకే వచ్చినట్లు నిర్థారించారు. కాగా, గ్యాస్ కనెక్షన్ల విచారణ కోసం నియమించిన వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కార్డులు లేని కారణంగా వేరే వ్యక్తుల పేర్లపై ఉన్న ఐడీ కార్డులపై స్వామి ఫొటోను అతికించినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్పు, అబేద్ అనే యువకులపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు. -
అమీర్పేట బిగ్బజార్ మాల్లో ప్రణీత సందడి
-
అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్
సాక్షి, హైదరాబాద్ : అమీర్పేట్లో మెట్రో రైల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాగోల్ నుంచి హైటెక్ సీటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. మెట్రో పిల్లర్ పైనుంచి ఓ ఇనుపరాడ్ కిందపడింది. రోడ్డుపై జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న మెట్రో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చెరుకొని మరమ్మతులు చేస్తున్నారు. రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులను కిందకు దించేశారు. మరమ్మతుల నిమిత్త అమీర్పేట్- నాగోల్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిపివేశారు. -
శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి.. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. (చదవండి : అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య) ఆ వ్యక్తితో సురేష్కు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సురేష్ కాల్డేటా, హత్యకు ముందు వాసవినగర్ కాలనీలో లభించిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సురేష్ తలకు గాయమైనట్లు ప్రైమరీ మెడికల్ హెల్త్ రిపోర్ట్లో తేలిందన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్ వస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు : ఆ వ్యక్తి ఎవరు...?
సాక్షి, హైదరాబాద్ : ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. 48 గంటలు గడిచినా.. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయారు. సురేష్ కాల్డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్ వద్దకు తరచూ ఒక్క యువకుడు వచ్చేవాడని అపార్ట్మెంట్ వాచ్మెన్ తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. పోస్ట్మార్టం పూర్తి అయ్యాక సాయంత్రం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. భార్య, కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. (చదవండి : అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య) కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉండేవాడు. -
మెట్రో స్టేషన్లలో మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: అమీర్పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్అండ్టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్అండ్టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే మరమ్మతులు.. ప్రధానంగా బాలానగర్, పరేడ్గ్రౌండ్స్, రసూల్పురా, హైటెక్సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య
అమీర్పేట: నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటి బయట తాళం వేసి పరారయ్యారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అమీర్పేట్లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. సోమవారం ఆఫీస్కు వెళ్లిన సురేష్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. సురేష్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు అతడికి కాల్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. వారు భార్య ఇందిరకు సమాచారం అందించారు. ఆమె కుమార్తెతో కలసి నగరానికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా సురేష్ విగతజీవిగా పడి కనిపించాడు. తల వెనుక, ముఖంపై లోతైన గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసి.. అనంతరం బయటి నుంచి తాళం వేసి పారిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పోలీసు జాగిలం అపార్ట్మెంట్పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది. శ్రీనివాస్ ఎవరు..? సురేష్ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సురేష్ వద్దకు గత 2 నెలల నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కలసి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. -
అమీర్పేట్లో మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన బస్సు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్పేట్లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టి... పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. అయితే, ఉదయం సమయం కావడం.. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేకపోవడం, దుకాణాలు మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 15మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అమీర్పేట్లోనే ఆదివారం మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి మౌనిక అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేపింది. చదవండి: మౌనిక మృతి: 20 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం -
మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్ అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు. అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసుల కలల మెట్రోస్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్బీ కాలనీలోని ఎస్.ఆర్.హోమ్స్లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్పేట్లో హాస్టల్ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్బీ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కి అమీర్పేట్లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో పిల్లర్పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు సందర్శించారు. నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... స్టేషన్లను సైతం ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్ కాస్టింగ్ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు. ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘వ్యక్తిత్వంతో వైఎస్సార్ విశిష్టత చాటారు’
అమీర్పేట: సంస్కారవంతమైన వ్యక్తిత్వంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ విశిష్టతను చాటారనీ, మని షిలో నిజాయతీ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని ఆయన భావించేవారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమీర్పేట ఆదిత్యపార్క్ హోటల్లో ఆదివారం జరిగిన ‘వైఎస్సార్ ఛాయలో జి.వల్లీశ్వర్’ పుస్తక ఆవిష్కరణ సభకు యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కారవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. సమర్థవంతమైన నాయకుడు వైఎస్ఆర్ వద్ద పీఆర్ఓగా పనిచేసిన వల్లీశ్వర్.. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రత్యర్థులు ఏమి ఆలోచిస్తున్నారన్నది ముందుగానే పసిగట్టి వారి కంటే వేగంగా ప్రభుత్వం స్పందించేలా చూసేవారని తెలిపారు. -
కంప్యూటర్ గణేశుడు..
అమీర్పేట: వినాయక వేడుకల్లో భాగంగా అమీర్పేటలో కంప్యూటర్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజశేఖర్ కంప్యూటర్ పరికరాలను ఉపయోగించి గణనాథుడిని తయారు చేశారు. పాస్పోర్టు కార్యాలయం సమీపంలో వెలసిన ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. -
గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్పేట
గత పదేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. క్యాంపస్ స్థాయిలోనే ప్లేస్మెంట్ దక్కితే సరి.. లేదంటే అమీర్పేటను నమ్ముకోవాల్సిందే. ఇంజినీరింగ్ చదివి బయటకు వచ్చే ఏ ఫ్రెషర్ అయినా అమీర్పేటలో కాలుమోపిన తర్వాతే మరెక్కడికైనా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ శిక్షణ సంస్థలు అందించే కోర్సుల్లో కాసింత జ్ఞానం సంపాదించుకుంటే ఉద్యోగంలో రాణించవచ్చని, ఉపాధి పొందవచ్చనే భరోసాను కల్పించడమే కారణం. అందుకేనేమో అమీర్పేటకు గేట్ వే ఆఫ్ అమెరికా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దేశంలో ఎక్కడా దొరకని టెక్నాలజీ కోర్సులు ఇక్కడ లభించడం విశేషం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోర్సులైన జావా, ఫైతాన్, లిస్ప్, ప్రోలాగ్, సీ++ తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒరాకిల్, డాట్నెట్, జావా వంటి పరిమిత బేసిక్ కోర్సులే ఒకప్పుడు ఎక్కువగా వినిపించేవి. ఆ తర్వాత ఆయా టెక్నాలజీలో వచ్చిన అధునాతన మార్పులను అందిపుచ్చుకుంటూనే ప్రస్తుతం రాజ్యమేలుతున్న క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ కోర్సుల వరకు ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలు పదునుపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ సర్వీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో అమీర్పేటలో ఆయా టెక్నాలజీ కోర్సులకు ఎక్కడా లేని ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి.. కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని లక్షల ప్యాకేజీలకు ‘సాఫ్ట్’గా విద్యార్థులు ఎగిరిపోవడమే కాదు.. ఇక్కడ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మాట అలా ఉంచితే.. వీటిని నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్భండార్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హాస్టళ్లు, సాఫ్ట్వేర్ కోర్సుల మెటీరియల్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు తదితర సంస్థల నిర్వాహకులు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 500 పైచిలుకు శిక్షణ సంస్థలు.. రెండు దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కించేంత సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలకు మాత్రమే అమీర్పేట పరిమితంగా ఉండేది. మొదట అమీర్పేటలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కార్యాలయం ఉండేది. కాలక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలు హైటెక్ సిటీకి వెళ్లిపోగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల హవా మొదలైంది. అమీర్పేట మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్ సెంటర్, సత్యం టాకీస్ రోడ్డు, గురుద్వారా రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శిక్షణ సంస్థలు ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్లైన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఖర్చు తక్కువ.. బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ‘సాఫ్ట్’ కోర్సుల్లో శిక్షణకయ్యే ఖర్చు ఇక్కడ చాలా తక్కువ. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమీర్పేట శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటుంటారు. గడిచిన రెండు దశాబ్దాల్లో అమీర్పేటలో కాలుపెట్టి అమెరికా వెళ్లినవారు అందుకే గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్పేట అన్న పేరును సార్థకం చేసుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్.. మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సయినా మొదట అమీర్పేట శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే ఆశలను నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ సంస్థలు టెక్నాలజీ కోర్సులను అప్డేట్ చేసుకుంటూనే ఉంటాయి. – ఎన్.కోటి,ఆపరేషన్స్ హెడ్, పీర్స్ టెక్నాలజీస్ భవితకు భరోసా ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్కు మంచి డిమాండ్ ఉంది. నేను ఈ కోర్సులో శిక్షణ పొందాను. ఫీజు కూడా ఎంతో రీజనబుల్గా ఉన్నాయి. అనుకున్న సమయంలో కోర్సులు పూర్తి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. – గోపీకృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్ధి -
అమీర్పేటలో బాంబు కలకలం
అమీర్పేట: అమీర్పేటలో బాంబ్ కలకలం సృష్టించింది. మైత్రీవనం సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద ఓ డబ్బా అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో బాంబు ఉండవచ్చునేనే భయంతో స్థానికులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనికీలు నిర్వహించారు. డబ్బాలో పెయింట్ ఉన్నట్లు తేలండోత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
సీరియల్ నటి లలిత అదృశ్యం
హైదరాబాద్: తెలుగు టీవీ సీరియల్స్లో నటించే లలిత (25) అనే మహిళ కనిపించకుండా పోయింది. అమీర్పేట లోని ఓ హాస్టల్లో ఉంటున్న లలిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిం దని ఆమె తల్లి వెంకటలక్ష్మి బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన లలిత (25)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఏడేళ్ల కుమార్తె ఉంది. లలిత ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. కూతురుని తల్లిదం డ్రుల వద్ద ఉంచి అమీర్పేట రాజరాజేశ్వరీ ఉమెన్స్ హాస్టల్లో చేరి తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తోంది. రోజూ రాత్రి ఫోన్ చేసి తల్లితో పాటు కుమార్తెతో మాట్లాడేది. ఈ నెల 17న ఫోన్ చేయకపోవడంతో తల్లి లలితకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఇలా వారం నుంచి లలిత ఫోన్ స్విచాఫ్ అని రావడంతో వెంకటలక్ష్మి మరో కుమార్తె రామాంజనమ్మతో కలిసి నగరానికి వచ్చి హాస్టల్లో ఆరా తీసింది. లలిత 2 నెలల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాని అనే వ్యక్తి సీరియల్లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి నగరానికి తీసుకువచ్చాడని వెంకటలక్ష్మి పోలీసులకు తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీ తెలిపారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
అమీర్పేట: ప్రముఖ హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్నగర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి నలుగురు విదేశీ యువతులతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న మంగళవారం వివరాలు వెళ్లడించారు. అమీర్పేట, ఆదిత్య పార్క్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, హోటల్ మేనేజర్ను అరెస్ట్ చేశారు. పంజగుట్టలోని పోలో లాడ్జిపై దాడి చేసి ఉజకిస్తాన్కు చెందిన నలుగురు మహిళలతో పాటు బెంగాల్కు చెందిన యువతి, నలుగురు విటులను అరెస్టు చేశారు. పోలీసుల రాకపై సమాచారం అందడంతో నిర్వాహకులు పరారైనట్లు తెలిపారు. రాహుల్, సూర్య అనే వ్యక్తులు ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఏపీసీ తెలిపారు. దాడుల్లో ఎస్ఆర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెళ్లడిస్తున్న ఏసీపీ తిరుపతన్న -
నాగోల్–హైటెక్సిటీ: మెట్రోలో 55 నిమిషాలే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసుల కలల మెట్రో రైలు ఈ నెల 20న (బుధవారం) హైటెక్ సిటీకి పరుగులు పెట్టనుంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి హైటెక్ సిటీకి మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొందరు ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ, మెట్రో ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు రైలు అందుబాటులోకి రానుంది. 18 నిమిషాల్లో అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్పోస్ట్ నుంచి సింగిల్ట్రాక్లో మెట్రోరైలు హైటెక్సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి రానుంది. దీంతో చెక్పోస్ట్ నుంచి హైటెక్సిటీ వరకు మెట్రో రైలు వేగం కాస్త తగ్గే అవకాశం ఉంది. కాగా ఇక నాగోల్–హైటెక్సిటీ మార్గంలో మెట్రోలో 55 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. అదే బస్సు లేదా కారులో అయితే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. 10కి.మీ 9 స్టేషన్లు.. అమీర్పేట్ నుంచి హైటెక్సిటీ వరకు 10 కి.మీ. దూరంలో 9 స్టేషన్లున్నాయి. ప్రధానంగా అమీర్పేట్, తరుణి–మధురానగర్, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెర్వు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. తరుణి మధురానగర్ స్టేషన్లో మహిళలు, చిన్నారుల అవసరాల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచారు. దీని కోసం ఈ స్టేషన్ ప్రాంగణంలో సుమారు 2 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించడం విశేషం. దేశంలో ఇలాంటి సౌకర్యాలున్న మెట్రోస్టేషన్ ఇదేనని అధికారులు తెలిపారు. మిగతా మెట్రో స్టేషన్లు రెండంతస్తుల్లో ఉండగా, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ మాత్రం ట్రాఫిక్ ఇబ్బందుల రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. ఈ మార్గంలో రహదారులు పలు మలుపులు తిరిగి ఉండటంతో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు, సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల చిక్కులను అధిగమించి మెట్రో మార్గాన్ని పూర్తిచేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రివర్సల్ సదుపాయం లేక రైళ్లు ఆలస్యం... జూబ్లీ చెక్పోస్ట్ నుంచి హైటెక్సిటీ వరకు (5 కి.మీ.) మార్గంలో మెట్రో మార్గం ఒకే వరుసలో (సింగిల్ ట్రాక్) ఉండటంతో మెట్రో రైళ్లు ట్విన్ సింగిల్ లైన్ మాన్యువల్ విధానంలో నడపనున్నట్లు ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. అంటే ఒక రైలు అమీర్పేట్ నుంచి బయలుదేరి హైటెక్సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్లో తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలును మాత్రమే నడపనున్నామన్నారు. హైటెక్సిటీ స్టేషన్, ట్రైడెంట్ హోటల్ వద్ద రైలు రివర్సల్ సదుపాయం కోసం ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–అమీర్పేట్ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నామన్నారు. ఈ స్టేషన్లలో కొంతకాలం రైలు ఆగదు ఈ మార్గంలో ప్రస్తుతం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడపాల్సి రావడం, మెట్రో వేగంపై పరిమితులుండటం, మలుపులు అధికంగా ఉండటంతో కొన్ని వారాల పాటు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లలో రైలు ఆపే అవకాశం ఉండదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇది తాత్కాలికమేనని త్వరలో ఈ స్టేషన్లలోనూ రైలు ఆగుతుందన్నారు. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్–అమీర్పేట్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 2 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్న విషయం విదితమే. మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు.. ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) నాగోల్–అమీర్పేట్ (17 కి.మీ.) అందుబాటులోకి రావాల్సి మార్గాలివే... అమీర్పేట–హైటెక్సిటీ (10 కి.మీ. (బుధవారం నుంచి రాకపోకలు ప్రారంభం) జేబీఎస్–ఎంజీబీఎస్ (ఈ ఏడాది జూన్ లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం) ఎంజీబీఎస్–పాతనగరం (2019 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం) -
‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ !
సాక్షి, హైదరాబాద్ : అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్పేట కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్ తాను పనిచేస్తున్న హైటెక్ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు. ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్ను అటకాయించిన యువకులు కూడా పోలీస్స్టేషన్కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్ ఫోన్ తీసుకుని అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్ పోలీస్స్టేషన్లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు. -
పార్కింగ్ లేక పరేషాన్!
సోమాజిగూడ: నగరంలోని అమీర్పేట్ మార్కెట్ పేరు తెలియని వారుండరు. అంతటి ఖ్యాతి గాంచిన మార్కెట్కు పార్కింగ్ సమస్య తలెత్తింది. అందుకు కారణం మెట్రోరైల్ నిర్మాణ పనులు తోడయ్యాయని చెప్పవచ్చు. అమీర్పేట్ చౌరస్తానుంచి పంజగుట్ట వచ్చే మార్గంలో ఎడుమ వైపు వాణిజ్య సముదాయాలు ఎక్కువ. వాటిలో ముఖ్యంగా బట్టల దుకాణాలే అధికం. షాపుల ముంగిట ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను అక్కడున్న ఫుట్పాత్పై పార్కు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయా ఫుట్పాత్లకు ఎల్అండ్ టీ అధికారులు రెయిలింగ్ ఏర్పాటు చేశారు. దీంతో షాపింగ్కు వచ్చేవారికి వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు. షాపులకు పార్కింగ్ సదుపాయం లేదు అమీర్పేటలోని వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో కార్లను కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి షాపింగ్కు రావలసి వస్తోంది. పార్కింగ్ లేమితో అమీర్పేట్లోని వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హాకర్స్తో తలనొప్పి కోట్లాది రూపాయల పెట్టుబడితో షాపులు నిర్వహిస్తున్న వారికి హాకర్స్తో మరో తలనొప్పి వస్తోంది. వస్త్రదుకాణాల ముంగిట హాకర్స్ బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు విక్రయించే వన్నీ రెడీమేడ్ దుస్తులే. దుకాణాల ముంగిట ఉన్నది ఫుట్పాత్ మాత్రమే. దీన్ని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. వేలాది రూపాయిలు అద్దెగా చెల్లిస్తూ వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుపైనే బస్సులు నిలిపివేత.. మెట్రోరైల్ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రహదారి కుంచించుకు పోయి ఇరుకుగా మారింది. అటుగా వెళ్లే బస్సులు ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు. షాపింగ్కు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కుచేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. గంటల తరబడి వాహనాలు ఎటూ వెళ్లే మార్గంలేక నానా ఇబ్బందులు తప్పడంలేదు. -
ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు
అమీర్పేట: రెండు పెళ్లిలు చేసుకోవడమేగాక ముచ్చటగా మూడో పెళ్లికి సిద్దపడ్డాడో ప్రబుద్ధుడు అందుకు అంగీకరించాలని భార్యను బాలింత అని కూడా చూడకుండా బెల్టుతో చితకబాదిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడబండ సైడ్ త్రీకి చెందిన మొహ్మద్ఖాన్ మొదట షమీనా బేగం, రెండో సారి రుక్సార్ బేగం అనే మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. బ్యాగుల వ్యాపారం చేసే ఖాన్ ముడో పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు. అందుకు అనుమతినివ్వాలని గత కొన్ని రోజులుగా రెండో భార్యను రుక్సార్ బేగంను వేధిస్తున్నాడు. ప్రసవమై 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చిన ఆమెను హింసించసాగాడు. అంగీకారపత్రంపై సంతకం చేయాలని బాలింత అని చూడకుండా బెల్టుతో చితకబాదాడు. సంతకం పెట్టక పోతే బిల్డింగ్పై నుంచి తోసేసి చంపుతానని బెదిరించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని ఇద్దరు భార్యలు షమీనా బేగం, రుక్సార్ బేగం ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయించారు. మహిళా సంఘాల నాయకులు శ్రీలత,లత వారికి మద్దతు పలికారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. -
మెట్రో స్టేషన్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: రాజధానిలోని అమీర్పేట మెట్రోరైల్ స్టేషన్ మొదటి అంతస్తు పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 7.40 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి అమీర్పేట సారథి స్టూడియో వైపు నుంచి మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి చేతులు ఊపుకుంటూ మొదటి అంతస్తుకు వెళ్లాడు. రేలింగ్ వద్ద కొద్దిసేపు నిలబడి అటూఇటూ చూస్తూ ఒక్కసారిగా దానిపైకి ఎక్కాడు. కొద్దిదూరంలో నిలబడి ఉన్న మరో వ్యక్తి గమనించి పడిపోతావు కిందకు దిగు అంటుండగానే దూకేశాడు. వ్యక్తి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు మెట్రో అధికారులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెళ్లి రాళ్లపై పడిన వ్యక్తిని చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్టేషన్ కంట్రోలర్ చక్రవర్తి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒంటిపై చొక్కా మినహా ఎలాంటి దుస్తులు లేవు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
డిసెంబర్కు డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్పేట్–హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు. ఇటీవల ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్..డిసెంబర్ నాటికి హైటెక్ సిటీ కారిడార్ను పూర్తిచేసి మెట్రో రైళ్లనుసిటీజన్లకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులకు సూచించారు. అయితే ఈ మార్గంలో మెట్రో పనుల పూ ర్తికి పలు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రివర్సల్ ట్రాక్ ఏర్పాటు పనులు ఆలస్యమౌతుండడమే దీనికి కారణమని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితితో ఈ రూట్లో మెట్రో రాకకోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు మరో ఆరునెలలపాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. రివర్సల్ట్రాక్ పనులే కీలకం... నాగోల్–హైటెక్సిటీ(28 కి.మీ)మెట్రో మార్గాన్ని ప్రభుత్వం 1.5 కి.మీ మేర పెంచి రాయదుర్గం వరకు పొడిగించిన విషయం విదితమే. రాయదుర్గం ప్రాంతంలో 15 ఎకరాల సువిశాల స్థలంలో టెర్మినల్ స్టేషన్తోపాటు మెట్రోమాల్స్, ప్రజోపయోగ స్థలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే మెట్రో మార్గాన్ని ఉన్నఫలంగా పొడిగించడం..హైటెక్సిటీ–రాయదుర్గం రూట్లో పనులు సకాలంలో మొదలుకాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు హైటెక్సిటీ నుంచి శిల్పారామం వరకు అరకిలోమీటరు మేర మెట్రో పిల్లర్లను పొడిగించి అక్కడివరకు మెట్రోట్రాక్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి రివర్సల్ట్రాక్(మెట్రో రైళ్లు మలుపుతిరిగే ట్రాక్)ఏర్పాటుచేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా మెట్రో పిల్లర్లు ఏర్పాటుచేయడం కష్టసాధ్యమని నిపుణులు స్పష్టంచేయడంతో రివర్సల్ట్రాక్ ఏ ర్పాటు పనులు మరింత ఆలస్యమయ్యాయి. దీం తో ఈ రూట్లో మెట్రో మరింత ఆలస్యమౌతోంది. రివర్సల్ ట్రాక్కు ప్రత్యామ్నాయమిదే.. హైటెక్సిటీకి సకాలంలో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. రివర్సల్ ట్రాక్ ఏర్పాటు చేస్తేనే అమీర్పేట్–హైటెక్సిటీ(10 కి.మీ)మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకోరైలును నడిపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైటెక్సిటీ నుంచి 500 మీటర్ల దూరంలోని లెమన్ట్రీ హోటల్ వరకు 7 మెట్రో పిల్లర్లను ఏర్పాటుచేసి మెట్రో ట్రాక్ను పొడిగించనున్నారు. అక్కడి నుంచి రివర్సల్ ట్రాక్ను ఏర్పాటుచేసి మెట్రో రాకపోకలకు మార్గం సుగమం చేయనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనప్పటికీ వీటిని పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం పట్టనున్నట్లు స్పష్టంచేశారు. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో ఫుల్..జోష్ ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో మెట్రోలో రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో రద్దీ 1.30 లక్షలు కాగా..సెలవురోజుల్లో రద్దీ 1.50 లక్షలనుంచి 1.60 లక్షలవరకు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక నాగోల్–అమీర్పేట్ మార్గంలో నిత్యం 50–60 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80–90 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో త్వరలో రద్దీ రెండు లక్షల మార్కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వాస్తవ సంఘటనలతో...
‘మైత్రీవనం’ అంటే హైదరాబాద్లోని అమీర్పేటలో ఉండే ఓ ఏరియా అనుకునేరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందింది. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేశ్ ఈశ్వరగారి, జెట్టి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిచరణ్ దర్శకుడు. విశ్వ, వెంకట్, వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటించారు. పీఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రదర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘యువతలో ఉన్న శక్తి అపారం. అది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఆ శక్తిని యువత గుర్తించేలా చేసే చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను. పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూనే సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవిగారు సరదాగా చెప్పిన ఓ పాయింట్ నచ్చి కథని విస్తృతం చేసి, ఈ సినిమా తీశాం. ఇప్పుడున్న చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించే చిత్రం అవుతుందని చెప్పగలను’’ అన్నారు సుఖేష్. -
సెప్టెంబర్ 1న ఎల్బీనగర్–అమీర్పేట్ మెట్రో రన్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ), హాల్క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్పేట్ సెక్షన్ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు. అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్అండ్టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్, బేగంపేట్, ప్రకాశ్నగర్, రసూల్పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. -
జూలై 26 లేదా 27న అమీర్పేట్ టు ఎల్బీనగర్
-
ఆగస్టులో అమీర్పేట్–ఎంజీబీఎస్ మెట్రో
సాక్షి,సిటీబ్యూరో : అమీర్పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్రన్కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్పేట్ రూట్లో మెట్రో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్పేట్–హైటెక్సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
ఆగస్టులో అమీర్పేట్–ఎంజీబీఎస్ మెట్రో పరుగులు!
సాక్షి,సిటీబ్యూరో : అమీర్పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్రన్కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ఆగస్టులో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్పేట్–హైటెక్సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
నాప్టోల్ ఆఫ్లైన్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్ : వినియోగదారులకు వాస్తవిక అను భూతి కలిగించేలా రాష్ట్రంలో తొలిసారి ఆఫ్లైన్ స్టోర్ను అమీర్పేటలో ప్రారంభించినట్లు హోం షాపింగ్ సంస్థ నాప్టోల్ సీఎఫ్ఓ యూసుఫ్ఖాన్ తెలిపారు. ఆదివారం బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ సెంట ర్లు ఏర్పాటు చేయడం, 26 వేలకు పైగా పిన్కోడ్ నె ంబర్లకు తమ నెట్వర్క్ విస్తరిస్తున్నామన్నారు. వ చ్చే ఏడాది లోగా దాదాపు కోటి మంది వినియోగ దారులను చేరే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బిజినెస్ హెడ్ మనీష్చౌబే, బిజినెస్ పార్టనర్ అమర్జీత్సింగ్ పాల్గొన్నారు.