B R Ambedkar
-
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్షిప్లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసి రాజ్యాంగ రచయితను ఘోరంగా అవమానించారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా జంగారెడ్డిగూడెం, లక్కవరం మండలాల్లో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాల్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని హామీ ఇచ్చారు. మేధావి, మహనీయుడు, ప్రతిభావంతుడైన అంబేడ్కర్కు ఘోర అవమానం జరిగిందని, అతని విగ్రహానికి చెప్పుల దండ వేయటం చాలా బాధాకరం ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆకాశం లాంటి వారని, ఆయన మీద ఉమ్మి వేసే ఆలోచన చేస్తే అది వారి మీదే పడుతుంది ఆయన వ్యాఖ్యనించారు. దళిత సంఘాలతో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. -
‘నేను బీజేపీ ఐటమ్ గర్ల్ని’
లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్ గర్ల్ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్లో హజ్ హౌస్ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్ మహాసభ సభ్యులు అజామ్ ఖాన్ మీద మంగళవారం (నిన్న) హజ్రత్గని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్ మండిపడ్డారు. -
రాజ్యాంగాన్ని కాపాడండి ప్లీజ్..
పార్వతీపురం విజయనగరం : ప్రజలహక్కులను కాలరాస్తూ రా జ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ నిరసన తెలియజేసింది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జో గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఆస్పత్రి కూడలిలోగల అంబేడ్కర్ వి గ్రహం వరకూ శుక్రవారం ప్రదర్శన చేపట్టి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైరెక్షన్లో దిగువస్థాయి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపైన, వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో గురువారం బురదనీరుపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన అనుచరులు సామాన్యులపై దాడికి పాల్పడడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని చెప్పారు. వారి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్నే రాజ్యంగ విలువలు కాపాడాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలియజేశారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అదే రాజ్యాంగ విలువలను కాపాడకుండా రాక్షసుల్లా ప్రవర్తించడం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, అరకు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపల గురురాజు, సీనియర్ కౌన్సిలర్లు గొల్లు వెంకటరావు, ఓ.రామారావు, ఎస్.శ్రీనివాసరావు, ఏగిరెడ్డి భాస్కరరావు, బోను ఆదినారాయణ, సర్పంచ్లు బొమ్మి రమేష్, ఏగిరెడ్డి తిరుపతిరావు, రణభేరి బంగారునాయుడు, సిగడం భాస్కరరావు, జొన్నాడ శ్రీదేవి, పొట్నూరు జయంతి, గొట్టా శివకేశ్వరరావు, జయంత్, వల్లేపు చిన్నారావు, పాతగోవింద్, పల్లెం కనకరావు, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి నల్ల ముసుగు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల ముసుగు వేశారు. దీంతో దళిత సంఘాలు ఆదివారం ఉదయం వినాయక చౌరస్తా వద్ద ధర్నా చేపట్టాయి. నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ జితేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాయి. తర్వాత దళిత సంఘాలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాయి. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై దళిత నాయకుల ఆగ్రహం
-
ఓటుకు నోటు కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు
-
‘కేసీఆర్తో లాలూచీ పడి.. పారిపోయి వచ్చారు’
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలోని శాకమూరులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మరిచారన్నారు. దళిత నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడేళ్లుగా చర్యలేవి? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో బాబు అడ్డంగా దొరకడం వల్లే ఏపీ ప్రజల హక్కులను పణంగా పెట్టి విజయవాడకు పారిపోయివచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ నీటి హక్కులను రాసిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఓటుకు నోట్లు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని సూచించారు. గత మూడేళ్లుగా ఈ కేసులో చర్యలు లేవంటే.. ఇక సామాన్యునికి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో చంద్రబాబుపై చాలా అవినీతి ఆరోపణలొచ్చాయని, కానీ ఏ ఒక్క అంశంపై విచారణ చేయించుకోలేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు. బాబుకు పరిపాలనపై పట్టు లేనందునే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలకు మహిళలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేవని పేర్కొన్నారు. -
తుళ్లూరులో ఉద్రిక్తత.. నేతల అరెస్టు..
సాక్షి, గుంటూరు : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు ఆలస్యంపై మంగళవారం వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. తుళ్లూరు మండలం శాకమూరులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ఇచ్చిన హామీని పట్టించుకోనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు మౌనదీక్షకు సిద్ధమయ్యారు. ఈ మౌనదీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మౌనదీక్షకు వెళుతున్న నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాక శాకమూరులో నాగార్జున సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత జిల్లాలోని తుళ్లూరు మండలం ఉద్దండ రాయునిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయకర్త సురేష్ను పోలీసులు అడ్డుకున్నారు. శాకమూరు స్మృతివనం వద్దకు వెళ్లకుండా హోస్ అరెస్టు చేశారు. అంతేకాక తాడికొండ సమన్వయం కర్త క్రిస్టియానాను తెనాలిలో హౌస్ అరెస్టు చేశారు. శాకమూరు స్మృతివనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ : సీఎం చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ నుంచి మహారాష్ట్రకు దళితుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్ళు నడపాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పుట్టిన గ్రామమైన మహారాష్ట్రలోని మౌహంను జయంతి సందర్భంగా వారు దర్శించుకుంటారు. అంతేకాక ప్రతి జిల్లా నుంచి కనీసం 30 బోగిలు ఉన్న రైళ్ళను ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నడపాలని ముద్రగడ అన్నారు. రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని మీ కడుపు నుంచి కాకపోయినా.. పెదాల నుంచి వచ్చినందుకు సంతోషమని ముద్రగడ అన్నారు. గత కొద్ది రోజులగా స్మృతివనం ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
కేశనకుర్రుపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ఐ.పోలవరం : గుర్తుతెలియని దుండగులు కేశనకుర్రుపాలెం సంత మార్కెట్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడినట్టు గురువారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మండలంలోని దళిత నేతలకు, ప్రజలకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పెద్ద ఎత్తులో చేరుకున్న దళిత నాయకులు రహదారులపై బైఠాయించి ధర్నా చేశారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఉన్న స్థానే నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ స్థలానికి పంచాయతీ తీర్మానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి దళిత సంఘాల నేతలతో చర్యలు జరిపారు. దోషులను త్వరిత గతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ధ్వంసమైన విగ్రహం స్థానే పంచాయతీ తీర్మానం చేసి కాంస్య విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్కుమార్, భూపతిరాజు సుదర్శనబాబు, మండల కన్వీనర్ పిన్నంరాజు వెంకటపతిరాజు తదితరులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పొన్నాడ మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా అధ్యక్షుడు రేవు అప్పలస్వామి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కాశి శ్రీహరి, కాశి పరివాజ్ కుమార్, జనిపెల్ల విప్లవ్కుమార్, మోకా రవి, దుక్కిపాటి సత్యనారాయణ, ఎం.టి.ప్రసాద్, తదితరులు ఉన్నారు. డీఎస్పీ విచారణ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ పరిశీలించి, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. జాగిలాలు కిలోమీటరు దూరంలో ఉన్న జైభీమ్ నగర్లో ఒక బావి వద్ద ఆగిపోయాయి. డీఎస్పీ మాట్లాడుతూ దోషులను తొందర్లోనే గుర్తిస్తామన్నారు. ఈయన వెంట అమలాపురం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సైలు ప్రభాకరావు, క్రాంతి కుమార్, దుర్గా శేఖర్రెడ్డి, భారీస్దాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పడంతో గురువారం మధ్యాహ్నం పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిపై సరైన స్పష్టత రాకపోవడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేస్తున్న దళిత సంఘాలతో రాత్రి ఎమ్మెల్యే బుచ్చిబాబు చర్చలు జరిపారు. తనసొంత ఖర్చులతో శుక్రవారం విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దోషులను కఠినంగా శిక్షించేందుకు హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాలు ఆందోళను తాత్కాలికంగా నిలిపివేశాయి. -
కాబోయే సీఎంను.. మీ సంగతి చూస్తా
మూసాపేట: వచ్చేది మా ప్రభుత్వమే.. కాబోయే సీఎంను.. అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్పై చిందులు తొక్కారు. దీంతో కలత చెందిన కలెక్టర్ సభలో మొహం చిన్నబుచ్చుకున్నారు. కూకట్పల్లి వైజంక్షన్లో శనివారం నిర్వహించిన అంబేడ్కర్ జయంత్యుత్సవాల సభ ఈ వివాదానికి వేదికైంది. సభ కొనసాగుంతుండగా వేదిక వద్దకు సర్వే వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ ప్రసంగిస్తుండగా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్ స్టేజీపైకి పిలవడంతో సర్వే వెళ్లి ఆసీనులయ్యారు. కలెక్టర్ ప్రసంగం ముగియడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మెట్రో ఎండీ మాట్లాడుతుండగా మధ్యలో సర్వే సత్యనారాయణ కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కలెక్టర్ స్పందిస్తూ ఇది అధికారిక కార్యక్రమం అని, ప్రొటోకాల్ ప్రకారం పిలిచినట్లు చెప్పారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రభుత్వ పథకాలు ఎందుకు చెబుతున్నావంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీ రెడ్డి ప్రతిస్పందిస్తుండగానే.. ‘నో మోర్ ఆరగ్యమెంట్.. మా ప్రభుత్వం వస్తే నేనే సీఎం’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్వేను మాట్లాడాల్సిందగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు మైక్ను అందించారు. సర్వే సత్యనారాయణ మైక్ను అందుకుంటూనే.. ‘అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇలాగే చేస్తే దళికిస్తాన్ అని ప్రత్యేక దేశం కోరుతాం.. ఖబడ్దార్ మోదీ అని హెచ్చరిస్తుండగా.. దళిత ఐక్యవేదిక అధికార ప్రతినిధి కట్టా నర్సింగరావు కల్పించుకుని ఇది పార్టీ సమావేశం కాదని, అంబేడ్కర్ గురించి చెప్పాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్పించుకుని రాజకీయాలు మాట్లాడవద్దని కలెక్టర్కు సూచించిన మీరే రాజకీయాలు మాట్లాడితే ఎలా అంటూ సర్వేను ప్రశ్నించారు. సభను తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంపై సర్వేను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు సైతం వేదికపైకి చేరడంతో సభ రసాభాసగా మారింది. తోపులాటలో కలెక్టర్కు రక్షణగా నిల్చొన్న ఆర్ఐ అశ్విన్కుమార్ ముక్కుకు గాయాలయ్యాయి. మైక్లు విరిగిపోయాయి. దీంతో డీసీపీ వెం కటేశ్వర్రావు, ఏసీపీ భుజంగరావు వేదికపైకి చేరుకున్న దళిత నాయకులను, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అదుపు చేసి వివాదం సద్దుమణిగేలా చూశారు. తనను అకారణంగా దూషించడంతో కలత చెందిన కలెక్టర్ రెండు చేతులు జోడించి సర్వేకు మొక్కి కంటతడి పెట్టుకుంటూ సభలోంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సర్వే సత్యనారాయణ నిష్క్రమించారు. అందరూ వెళ్లిపోవడంతో సభ అర్ధంతరంగా ముగిసింది. సర్వేపై కేసు నమోదు.. కేపీహెచ్బీ కాలనీ: ఈ ఘటనపై తహసీల్దార్ నాగరాజు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వడ్డే ప్రసన్నకుమార్ తెలిపారు. కూకట్పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డితో సర్వే సత్యనారాయణ వాగ్వాదానికి దిగారని, కలెక్టర్కు రక్షణగా వచ్చిన తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ అశ్విన్కుమార్లపై దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘సర్వే’పై చర్యలు తీసుకోండి: రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ కేపీహెచ్బీకాలనీ: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కూకట్పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డిపై దుర్భాషలాడటం, బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్ఐపై అకారణంగా చేయి చేసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్లకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు. -
పంజాబ్లో ఘర్షణలు
చండీగఢ్ / ఫగ్వాడా: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాబ్లో కపుర్తలా జిల్లాలోని ఫగ్వాడాలో ఘర్షణలు జరిగాయి. రెండు హిందూ సంస్థలు, ఓ దళిత సంఘానికి చెందిన సభ్యుల మధ్య శుక్రవారం జరిగిన ఈ గొడవలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం కపుర్తలా, జలంధర్, హోషియార్పూర్, ఎస్బీఎస్ నగర్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటలపాటు నిలిపివేసింది. తొలుత అంబేడ్కర్ సేనకు చెందిన సభ్యులు కొందరు ఫగ్వాడాలోని గౌల్ కూడలిలో అంబేడ్కర్ చిత్రమున్న బోర్డును ఏర్పాటుచేయడంతో పాటు ఆ కూడలి పేరును సంవిధాన్ చౌక్గా మార్చేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. దీన్ని శివసేన బాల్థాకరే, హిందూ సురక్షా సమితి నేతలు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. -
ఘర్షణ కాదు.. సామరస్యం కావాలి
న్యూఢిల్లీ/వడోదర/మహూ (ఎంపీ): దేశంలో నేడు సామరస్యం అవసరం కానీ సంఘర్షణ కాదనీ, ప్రజలు విభజనవాద శక్తులతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో ప్రజలంతా శాంతి మార్గంలో జీవించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోవింద్ శనివారం మధ్యప్రదేశ్లోని అంబేడ్కర్ జన్మస్థలం మహూ కంటోన్మెంట్లో నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి కోవిందే. మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలోనూ భారత శాశ్వత మిషన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాగా, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ చెరిపేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్లు దళిత వ్యతిరేక భావాలతో ఉంటే మరోవైపు మోదీ చిత్తశుద్ధి లేకుండా కేవలం నోటిమాటగా అంబేడ్కర్కు నివాళులర్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సెల్జా విమర్శించారు. రాజ్యాంగాన్ని రాసే మహత్తర బాధ్యతను అంబేడ్కర్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననీ ఆమె అన్నారు. మేనకా గాంధీకి చేదు అనుభవం గుజరాత్లోని వడోదరలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం మిగిలింది. బీజేపీ నేతలు అక్కడకు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేయడంతో వాతావరణం కలుషితమైందంటూ దళిత నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగారు. మేనక కన్నా మందుగా తాము వచ్చామనీ, విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ముందుగా తమనే అనుమతించాలంటూ దళిత నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
దళిత పారిశ్రామికవేత్తలకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శనివారం రవీంద్రభారతిలో జరిగిన దళిత పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆయన అవార్డులు అందించారు. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పలు డిమాండ్లను మంత్రి ముందుంచింది. గతేడాది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా రూ.100 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచామని మంత్రి చెప్పారు. డిక్కి ప్రతిపాదనలపై 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అవార్డులు అందుకున్న వారు.. తయారీరంగం: దాసరి అరుణ, మోక్ష మేరీ, కె.గోవిందరావు, ఎల్.ప్రకాశ్ సేవారంగం: కేవీ స్నేహలత, మంచాల శ్రీకాంత్, పంద సొలొమాన్ వివేక్, ఎన్.వినోద్గాంధీ మహిళా పారిశ్రామికవేత్తలు: సుశీల, భుక్యా సరోజిని -
హక్కుల కోసం నక్సల్స్లో చేరొద్దు
బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిఇచ్చారు. మీ హక్కులను కాపాడేలా భరోసానిచ్చారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు మీలో ఒకరు కాదు. ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలనుబలి చేస్తున్నారు. జంగాలా (బీజాపూర్): సమాజంలోని వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. రాజ్యాంగంలో ప్రత్యేకాంశాలను జోడించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారు తమ హక్కులను పొందటానికి అంబేడ్కరే కారణమన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం కారణంగానే తను ఈ స్థాయికి ఎదిగినట్లు మోదీ తెలిపారు. ‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఓ పేదరాలి కుమారుడు.. ప్రధాని కావటం నిజంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణంగానే సాధ్యమైంది’ అని ప్రధాని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లా జంగాలాలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అంబేడ్కర్ జయంతి సందర్భంగా మోదీ ప్రారంభించారు. ‘అంబేడ్కర్ విదేశాల్లో గొప్ప చదువు చదివారు. దీని కారణంగా ఏదో ఓ అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడి.. దర్జాగా బతికేసేందుకు అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు. స్వదేశానికి తిరిగొచ్చి.. దళితుల జీవితాలను ఉద్ధరించేందుకు తన జీవితాన్నే అంకితం చేశారు. అంబేడ్కర్ కారణంగానే.. నేడు దళితులు తమ హక్కులను పొందుతూ గౌరవంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి ఆకాంక్షలను పూర్తి చేసేందుకు పనిచేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. యువతీ, యువకులు తమ హక్కులను కాపాడుకునేందుకు నక్సలిజంలో చేరొద్దని ఆయన సూచించార. అంబేడ్కర్ చూపిన బాటలో.. మావోయిస్టుల కారణంగానే వీరి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుబడిందన్నారు. హక్కుల సాధనకు యువకులు నక్సలిజం వైపు అడుగులు వేస్తున్నారని.. అది సరైన మార్గం కాదని మోదీ తెలిపారు. ‘బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిచ్చారు. మీ హక్కులను కాపాడేలా ఆయన భరోసా ఇచ్చారు. ఈ భరోసాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు (యువతీ, యువకులు) తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు ఎక్కడినుంచో వచ్చారు. వారు మీలో ఒకరు కాదు. అడవుల్లో ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలను బలిపశువులు చేస్తున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పీహెచ్సీల దశ మారుస్తాం.. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా.. లక్షా 50వేల గ్రామాల్లోని ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయి, సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో పనిచేయనున్నారు. 2022 కల్లా పీహెచ్సీలను ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా జంగాలాలో తొలి పీహెచ్సీని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో దేశంలోని 115 వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ‘పాత మార్గాల్లో వెళ్తూ.. కొత్త లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు కొత్త అభివృద్ధి నమూనాలను సిద్ధం చేస్తోంది’ అని ప్రధాని తెలిపారు. శనివారం ప్రారంభించిన మరో పథకం ‘గ్రామ్ స్వరాజ్ యోజన’ ద్వారా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో చరణ్ పాదుకా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ గిరిజన మహిళకు చెప్పులు బహూకరించి తొడుగుతున్న మోదీ -
అంబేడ్కర్తోనే దేశం ముందడుగు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ దూరదృష్టి, దార్శనికత వల్లే ఇవాళ దేశం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం అంబే డ్కర్ జయంతి పురస్కరించుకుని సీఎం, అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, భవిష్యత్ మార్గనిర్దేశనం చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలకు, భారత్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. -
ప.గో.జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. -
యోగికి దళిత మిత్ర వద్దన్నందుకు అరెస్ట్
లక్నో : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ మహాసభ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు దళిత మిత్ర అవార్డు అందజేసింది. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న యోగికి ఈ అవార్డు ఇవ్వడమేమిటంటూ నిరసన వ్యక్తం చేసిన దళిత కార్యకర్తలు ఎస్ఆర్ దారాపురి, హరీశ్ చంద్ర, గజోదర్ ప్రసాద్, చౌరాసియాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు కూడా అంబేద్కర్ మహాసభ సభ్యులు కావడం గమనార్హం. ఏ ప్రాతిపదికన అవార్డు ఇచ్చారు..? యోగి ఆదిత్యనాథ్కు దళిత మిత్ర అవార్డు అందజేయడం వల్ల అంబేద్కర్ మహాసభ సభ్యుల మధ్య విభేదాలు చెలరేగాయి. సభ్యులందరినీ సంప్రదించకుండానే అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, మహాసభ సభ్యుడు ఎస్ఆర్ దారాపురి ఆరోపించారు. యోగి ఈ అవార్డుకు అనర్హులంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకే లాల్జీ నిర్మల్.. యోగిని ఈ అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపణలు చేశారు. 30 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు : యోగి గవర్నర్ రామ్నాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం యోగి ప్రసంగించారు. మోదీ సర్కారు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. 30 కోట్ల మంది దళితులకు బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ ఆశయాలను పాటిస్తూ ఆయన గౌరవాన్ని పెంపొందిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ మాట్లాడుతూ..దళితుల కోసం యోగి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. -
25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా..
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?’’ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తననుతాను దళితోద్ధారకుడిగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారాయన. శనివారం అమరావతిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో మాట్లాడిన సీఎం.. ఏపీకి ప్రత్యేక హోదాపైనా మరోసారి మాటమార్చారు. అప్పుడు రాజ్యాంగమే చెడ్డదవుతుంది : గడిచిన నాలుగేళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తోన్న చంద్రబాబు నాయుడు అదే రాజ్యాంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మంచిదే కావచ్చు, కానీ దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లతై అంబేద్కర్ రాజ్యాంగమే చెడ్డదవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని చేస్తామని, దళితుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. 25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లూ చేసినవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిదిపోయి.. ‘‘వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని వ్యాఖ్యానించడం ద్వారా హోదా విషయంలో బాబు మరో యూటర్న్ తీసుకున్నట్లైంది. 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మోదీ తరహాలో బాబు ఒక్కరోజు దీక్ష : విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన తరహాలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ‘‘పార్లమెంట్ జరగనీయకుండా చేసిన మోదీనే మళ్లీ దీక్ష చేశారు. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కాలేదు. కేంద్రం వైఖరికి నిరసనగా నేనూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తా. ఈ నెల 20న నా పుట్టినరోజునాడే దీక్షకు కూర్చుకుంటా. నా దీక్షకు అందరి సహకారం కావాలి’’ అని సీఎం పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
ఒంగోలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
తూ.గో.జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
వెలుగు దివిటీ
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి..
సాక్షి, అమరావతి, హైదరాబాద్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాశాయని పేర్కొంటూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించారు. చంద్రబాబు సంతలో గొర్రెల్ని, బర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని రాజ్యాంగాన్ని అవహేళన చేశారనీ, అందుకనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని భవిష్యత్తును నిర్దేశించిన మహామూర్తి అంబేద్కర్ అని కొనియాడారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పుడు నోరు మెదపని ప్రధాని మోదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మొసలి కన్నీరు కారుస్తున్నారని రాఘవులు ఎద్దేవా చేశారు. -
‘రాజకీయాల్లోనే కుల, మత జబ్బులు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రాన్ని పాటించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాబా సాహెబ్ కుల నిర్మూలన వ్యవస్థ కోసం పోరాడి.. బౌద్ధాన్ని స్వీకరించారన్నారు. అంబేద్కర్ అందరి వాడని.. ఆయనను కొందరి వాడిలా చేయడం జాతికి మంచిది కాదన్నారు. దేశంలో ప్రజల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం మన రాజ్యాంగమని తెలిపారు. కుల, మత, పేద, ధనిక అనే వివక్ష లేని సమసమజాన్ని ఏర్పరచుకోవడమే అంబేద్కర్కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. అన్నీ కులాలను, ప్రతీ పేదవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాదన్నారు. అంబేద్కర్ ఓవర్సెస్ స్కాలర్ షిప్ ద్వారా 25 లక్షల రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీసర్కార్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే వ్యక్తుల్లో కులం, మతం అనే జబ్బులొస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘కేసీఆర్కు ఆ తీరిక కూడా లేదు’
సాక్షి, నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్కు నివాళర్పించడానికి కూడా తీరిక లేదు. అన్ని రాష్ట్రాల సీఎంలు జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్లో కూర్చున్నాడు. కేసీఆర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. -
నెల్లూరులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
భీమ్ యాప్: మరోసారి క్యాష్బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్లు అందించనుంది. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ భీమ్ లావాదేవీలపై క్యాష్బ్యాక్ అఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ తేజ్, ఫ్లిప్కార్ట్ ఫోన్ పే మార్కెటింగ్ వ్యూహాలను ఫాలో అవుతూ ఇపుడు భీమ్ యాప్ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులో భీమ్ లావాదేవీలు 40.5 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్ యాప్ ద్వారా అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. సుమారు రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఫోన్పే, తేజ్, పేటీఎం నమూనాలను పరిశీలించాం. క్యాష్బ్యాక్, ప్రోత్సాహకాలు ప్రకటించినప్పుడల్లా లావాదేవీలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇదొక ప్రవర్తనా మార్పు’ అని దీనిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలపై దృష్టిపెట్టిన కేంద్రం గూగుల్ తేజ్, ఫోన్పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్ యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్లో లావాదేవీలు గణనీయంగా(సింగిల్ డిజిట్కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. క్యాష్బ్యాక్ ఆఫర్లు భీమ్ యాప్ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్ బ్యాక్ లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. కాగా భీమ్ యాప్ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను లాంచ్ చేసింది. భీమ్ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. -
శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి
-
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను ‘విశ్వ మానవుడి’గా అభివర్ణించారు. పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్ వారికి గొంతుక నిచ్చాడని మోదీ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. -
అసలు సిసలు స్త్రీవాది
‘మహిళల విముక్తే మానవ జాతి విముక్తి’ అంటారు అంబేడ్కర్. రాజకీయ, సామాజిక ఆర్థిక అసమానతలో పాటు లింగ వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తోందనీ స్త్రీపురుష సమానత్వం మాత్రమే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదనీ ఆయన మనసా వాచా నమ్మారు. అసమానతలను తరిమికొట్టేందుకు రాజ్యాంగ రచనను ఒక సమున్నతావకాశంగా అంబేడ్కర్ భావించారు. ఆర్టికల్ 14 నుంచి 16 వరకు స్త్రీపురుష సమానత్వాంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా స్త్రీల రక్షణకు ఉద్దేశించిన అనేక చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు. అందులో భాగమే.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు న్యాయ శాఖా మంత్రి హోదాలో అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్. భారత స్వతంత్య్రానంతర తొలి న్యాయ శాఖా మంత్రి అయిన అంబేడ్కర్.. వివాహం, విడాకులు, సంపద హక్కుతో పాటు సంరక్షణ హక్కులకు హామీ యిచ్చే హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఆశించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకుండా నెహ్రూ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తిరస్కరిస్తూ న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న ఘనత డాక్టర్. బిఆర్ అంబేడ్కర్కే దక్కుతుంది. మహిళా చట్టాలకు ఆద్యుడు స్త్రీజనోద్ధరణకోసం అంబేడ్కర్ అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. ఉమన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఉమన్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ వుమెన్ లేబర్ బిల్, లీవ్ బెనిఫిట్ టు పీస్ వర్కర్స్, రివిజన్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ఎంప్లాయీస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ వుమెన్ వర్కింగ్ అండర్గ్రౌండ్ మైన్స్, మెయింటెనెన్స్ అలవెన్స్ ఫ్రం హస్బెండ్స్ ఆన్ గెటింగ్ లీగల్లీ సెపరేషన్, వేతనాల్లో లింగ వివక్ష పాటించకుండా సమాన పనికి సమాన వేతనం.. ఇలాంటì చట్టాలన్నిటికీ అంబేడ్కరే ఆద్యుడు. ప్రధానంగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి అత్యంత కీలకమైంది. 1929లో ముంబై అసెంబ్లీలో దేశంలోనే తొలిసారిగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఆమోదం పొందింది. ఆ తరువాతే 1934లో మద్రాసు లెజిస్లేచర్ కౌన్సిల్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ని ఆమోదింపజేసుకుంది. 1942– 46 మధ్యన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ‘మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్స్ బిల్ ఫర్ ఉమెన్’ బిల్లుని తీసుకురావడంలో కూడా ఆయన పాత్రే కీలకం. ఈ చట్టమే గనుల్లో పనిచేసే మహిళలకు 8 వారాల పాటు జీతంతో కూడిన సెలవుని ప్రసాదించింది. అనంతరం 1961లో ‘కామన్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్’తో కేంద్రం ఈ చట్టాన్ని దేశంమొత్తానికీ వర్తింపజేసింది. సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(డి) డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్లోని నాల్గవ భాగం సమాన పనికి సమాన వేతనాన్ని ఖరారు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ధనికులకు, ఉన్నత వర్గాల వారికీ, భూస్వాములకూ, పన్నులు కట్టేవారికీ మాత్రమే ఉన్న ఓటు హక్కుని పురుషులందరితో పాటు స్త్రీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి స్త్రీల రాజకీయ హక్కుకు పునాది వేసిన స్త్రీజన పక్షపాతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. – అత్తలూరి అరుణ -
కాషాయం నుంచి నీలంలోకి..
సాక్షి, లక్నో : యూపీలోని బదౌన్లో దుండగులు కూలగొట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహంలో అంబేడ్కర్ తరచూ కనిపించే సూట్లో కాకుండా కాషాయ రంగులో ఉన్న ప్రిన్స్ సూట్లో కనిపిస్తుండటం గమనార్హం. అంబేడ్కర్ విగ్రహానికి కాషాయం పులమడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్పీ నేత హిమేంద్ర గౌతం కాషాయం రంగు మార్చి నీలం రంగు వేయించారు. వివరాల్లోకి వెళితే.. బదౌన్ ప్రాంతంలోని దగ్రాయ గ్రామంలో ఈనెల ఏడున కొందరు దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో బదౌన్ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తగా స్పందించిన అధికార యంత్రాంగం ఆగ్రా నుంచి ఆఘమేఘాలపై మరో విగ్రహాన్ని తెప్పించి అదే ప్రాంతంలో ప్రతిష్టించింది. అయితే కాషాయ రంగులో విగ్రహం రూపొందించడం పట్ల అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ స్వరూప్ పట్నాయక్ అన్నారు. ‘ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. విగ్రహంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు..కాషాయ వర్ణమైతే భారత సంస్కృతికి ప్రతీక’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చిలో సిద్ధార్ధనగర్, అలహాబాద్లో 24 గంటల వ్యవధిలోనే రెండు అంబేడ్కర్ విగ్రహాలను దుండగులు కూల్చివేశారు. ఏమైనా కొద్ది గంటల్లోనే అంబేడ్కర్ విగ్రహం నీలం నుంచి కాషాయం..కాషాయంలోంచి నీలంలోకి మారింది. -
అంబేద్కర్ కి గౌరవం.. మోదీకి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ ను గౌరవించే విషయంలో బీజేపీ అవలంభిస్తున్న విధానాలను చూడండంటూ శుక్రవారం ఆయన తన ట్విటర్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల తాలుకూ ఫోటోలవి. ‘బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలిత దేశంలో అంబేద్కర్ కు దక్కిన గౌరవాన్ని చూడండి. దేశంలోని దళితులను, అంబేద్కర్ ను బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ఎన్నటికీ గౌరవించవు. రాజ్యాంగపితను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ.. ముందు ఆయన(అంబేద్కర్) విగ్రహాలను ధ్వంసానికి గురికాకుండా చూసుకోవాలి' అని రాహుల్ హితవు పలికారు. కాగా, బుధవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశాన్నేలిన ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు సరైన గౌరవాన్ని ఇవ్వలేకపోయానని.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. मोदीजी, जिस दमनकारी विचारधारा से आप आते हैं वो दलितों और बाबासाहेब का सम्मान कभी कर ही नहीं सकती| भाजपा/RSS विचारधारा द्वारा बाबासाहेब के सम्मान के कुछ उदाहरण... pic.twitter.com/7QXCKUoGMe — Rahul Gandhi (@RahulGandhi) April 6, 2018 -
ఓయూలో అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని న్యాయ కళాశాల ఎదుట బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. దీనిపై గురువారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ, ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఏర్పాటు చేయడాన్ని అధికారులు తప్పుపట్టినట్లు తెలిపారు. దీనిపై విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు. ‘నేనే ఆవిష్కరించాను..’ ఓయూ న్యాయ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తానే ఆవిష్కరించినట్లు బషీర్బాగ్ పీజీ న్యాయ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఐదేళ్లుగా కళాశాల ఎదుట అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు న్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఓయూలో ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూను స్థాపించిన 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆయన విగ్రహాన్ని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేయాలని, అంబేడ్కర్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
యూపీలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేత
మీరట్ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ గెలుపు అనంతరం మొదలైన ధ్వంసరచన దేశమంతా విస్తరిస్తున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు విగ్రహం తలను, విరగొట్టి కిందపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన దళితులు బుధవారం ఉదయం నుంచి ఆందోళనలకు దిగారు. మవానా రహదారిపై బైఠాయించి, విద్వేషకారులకు వ్యతికేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డకునే సమయంలో కొంత ఉద్రిక్తత తలెత్తింది. గంటలపాటు రాస్తారోకో చేసిన దళితులు.. నిందితులను పట్టుకునేదాకా ఆందోళన విరమించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉపశమన చర్యగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విగ్రహం కూల్చివేతకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం మనావాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి హింసాయుత ఘటనలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు. మొన్న లెనిన్, నిన్న పెరియార్, ముఖర్జీ.. ఇప్పుడు అంబేద్కర్ : త్రిపురలో బీజేపీ వర్గీయులు లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ పార్టీకే చెందిన తమిళనాడు నేతలు ‘ఇక పెరియార్ విగ్రహాలు కూల్చుతాం’అని ప్రకటన చేశారు. ఆ మేరకు వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్ విగ్రహాలు ధ్వసమయ్యాయి. త్రిపుర ఘటకు ప్రతీకారంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలిసిందే. విగ్రహాల ధ్వంసాలు కూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. -
‘రైతు సమన్వయ’ సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా 16 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల సమన్వయ సమితులు పది వేల వరకు, రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ సిబ్బంది, కో ఆపరేటివ్ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నారు. ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సుకు హాజరు కానుండగా, ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల భవిష్యత్తు మార్చడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానమే గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు అని అన్నారు. ఎకరానికి రెండు పంటలకు ఎనిమిది వేలు ఇవ్వడం, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం దేశానికి ఆదర్శమని మంత్రి తెలిపారు. వ్యవసాయం అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని వలసలు తిరిగి వచ్చే విధంగా పంట వేసిన దగ్గర నుంచి ఆమ్మే వరకు అండగా ఉంటామని మంత్రి అన్నారు. ఈ సదస్సు ఉదయం 10.30 గంటల మొదలైన మొదట ముఖ్యమంత్రి సందేశానంతరం మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం రైతులతో నేరుగా సుదీర్ఘమైన చర్చ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయాధికారులు రైతులు గ్రీన్, పింక్ కలర్ పేపర్లు ఇచ్చిన గ్రీన్ కలర్ సలహాలు, సూచనలు, పింక్ కలర్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సుకు వచ్చి గ్రామాలకు వెళ్లే రైతులు నూతనోత్సాహంతో వ్యవసాయం చేసేందుకు తోడ్పడుతుందని మంత్రి అన్నారు. అధికారులతో సమీక్ష.. పలు సూచనలు.. ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అంబేద్కర్ స్టేడియం ఆవరణలో అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఈఈ రాఘవచారిని ఆదేశించారు. మైకులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీరును ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందునా రైతులకు మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. కరీంనగర్కు వచ్చే అన్ని దారుల్లో స్వాగత తోరణాలు కొబ్బరి మండలు, అరటి ఆకులతో తోరణాలను బ్రహ్మాండంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడూరి రవీందర్రావు, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్వో అయేషామస్రత్ఖానమ్, ఆర్డీఓ బి.రాజాగౌడ్, ఆర్అండ్బీ ఈఈ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మా ర్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు పద్మావతి, కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్(డాక్) పేరుతో జాతీయ స్థాయిలో ఒక నూతన వేదిక ఏర్పాటైంది. ఢిల్లీలో మంగళవారం డాక్ ప్రారంభసభలో డాక్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి దళిత పారిశ్రామిక వేత్తలు, ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడం ఈ చాంబర్ ఉద్దేశమని వివేక్ మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి పథకాలు అమలుచేస్తున్నా సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చాంబర్ ద్వారా ఔత్సాహిక దళిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలతో చర్చించి దళితుల అభివృద్ధికి కృషిచేయనున్నట్టు తెలిపారు. -
‘అంబేడ్కర్’పై నేడు తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అంబేడ్కర్ విగ్రహ కమిటీ తుదిరూపం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అంబేడ్కర్ విగ్రహ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం సీఎం కేసీఆర్తో సమావేశమై అంతిమ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైన్ అసోసియేట్స్ రూపొందించిన నమూనాలు, విగ్రహం నెలకొల్పనున్న ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన భవన సముదాయం, పార్క్కు ఆమోదం తెలిపింది. ఎటువంటి విగ్రహం పెట్టాలన్న నిర్ణయం మాత్రం కేసీఆర్కు వదిలి పెట్టాలని కమిటీ నిర్ణయించింది. లోక్సభ ప్రాంగణంలోని విగ్రహ నమూనాతోపాటు ట్యాంక్బండ్ వద్ద ఉన్న విగ్రహం, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన శిల్పి బోళ్ళ శ్రీనివాసరెడ్డి రూపొందించినది కలిపి మూడు విగ్రహాల ప్రతిపాదనలను కేసీఆర్ ముందు ఉంచాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్రెడ్డి, బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్డేడియంలో నవంబర్ 1 నుంచి 10వ తేదీవరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాటీ జరగనుంది. చెన్నైలోని హెడ్క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (10 పాత జిల్లాల ప్రకారం) చెందిన 4,9078 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ర్యాలీ నుంచి 5,895 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 54,973 మంది అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. కరీంనగర్ కేంద్రంలోని అంబేవడ్కర్ స్టేడియంలో నియామక ప్రక్రియ జరుగనుంది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/ ఎస్కెటీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థుల కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయనుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి సోమవారం ర్యాలీ ఏర్పాట్లను సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ ర్యాలీ నియామకాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. -
దళిత నేతల అరెస్ట్
భీమవరం : అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ విమర్శించారు. గరగపర్రు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం చలో గరగపర్రు కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరిహారం అందని 32 మందికి ఆర్థిక సహాయం అందించకపోతే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని రాజేష్ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ధిక్కరించిన నేరానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, తానేటి పుష్పరాజు, పల్లపు వేణు, దారం సురేష్, తోటే సుందరంతో సహా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు చెప్పారు. -
అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తాళ్లరేవు: రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. అర్ధరాత్రి వేళ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఉన్న విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసినట్లు స్ధానికులు గుర్తించారు. దీంతో దళిత సంఘాలు, నేతలు 216 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో యానాం-కాకినాడ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. -
దేశానికే తలమానికం
అంబేడ్కర్ విగ్రహ స్థాపనపై మంత్రి జగదీశ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దా లని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ విగ్రహ స్థాపన తెలంగాణకి ఓ రోల్ మోడల్ కావాలని ఆయన ఆకాంక్షిం చారు. శుక్రవారం సచివాలయంలో జగదీశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన విగ్రహ కమిటీ సభ్యులు డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. నమూనా లో కొన్ని మార్పులు చేయడంతో పాటు అంతిమంగా ఎలా ఉండాలి, ఎంత స్థలంలో నిర్మిం చాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లె్లపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, వేముల వీరేశం, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, జేఎన్టీయూ శిల్పి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఢిల్లీకి చెందిన డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్ట్
► సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఉదంతం పహాడీషరీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో దళిత సంఘాల నాయకులు గురువారం బాలాపూర్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్కు గత నెల 18న బడంగ్పేటకు చెందిన బ్యాండ్ బృందం అనుగొందుల రాజు(19), నాదర్గుల్కు చెందిన గోడ నవీన్(19), బైండ్ల శివ(22)లతో పాటు మరి కొంత మంది వచ్చారు. వీరు హాల్లోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అవమాన పరిచారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలాపూర్కు చెందిన కొప్పుల సురేష్ దీన్ని గమనించి బాలాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రాం శేఖర్, దళిత సంఘాల నాయకులు బాలాపూర్ ఠాణా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెంటనే మీర్పేట ఇన్స్పెక్టర్ రంగస్వామి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతిపర్చేందుకు యత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీసులు వెంటనే అనుగొందుల రాజు, గోడ నవీన్లను అరెస్ట్ చేయడంతో ఆందోళన విరమించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పెళ్లి
సెహోర్(మధ్యప్రదేశ్): వివాహానికయ్యే ఖర్చు భరించే స్థోమత లేక ఓ నిరుపేద జంట రాజ్యాంగ నిర్మాత విగ్రహం సాక్షిగా ఒక్కటయింది. పెళ్లి పేరుతో జరుగుతున్న ఆడంబరాలు, వృథా వ్యయాన్ని నివారించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంసెహోర్ పట్టణానికి చెందిన కల్లు జాతవ్, వైజయంతి రజోరియా అనే యువ జంటకు ఈనెల 3వ తేదీన పెళ్లి నిశ్చయమయింది. అయితే, ఇరు కుటుంబాల వారు నిరుపేదలు. వారికి పెళ్లి ఆడంబరంగా జరిపించే స్థోమత లేదు. దీంతో సామాజిక కార్యకర్తలను ఆశ్రయించారు. వారిచ్చిన సూచనల మేరకు స్థానిక పార్కులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నిశ్చయించిన ప్రకారమే బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన ఆ జంట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహం పక్కనే బుద్ధభగవానుని చిత్రపటం ఉంచి ఏడుసార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం కల్లు జాతవ్, వైజయంతి దండలు మార్చుకున్నారు. కలకాలం అన్యోన్యంగా, ఆదర్శంగా ఉంటామని ప్రతిన చేశారు. నిరుపేద బాలికలకు సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన’కు కూడా దరఖాస్తు చేసుకున్నామని, అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని వారు వివరించారు. అవనసర ఖర్చులను నివారించానికే తాము ఈ విధానాన్ని వధూవరులకు వివరించి, ఆచరింపజేశామని పెళ్లికి పెద్దగా వ్యవహరించిన నరేంద్ర ఖంగ్రాలే తెలిపారు. -
హృదయాలను గెలిచిన జననేత
-
హృదయాలను గెలిచిన జననేత
- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి - గరగపర్రు పర్యటనలో జగన్ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు - ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు - సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం - ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు. జగన్ హిత వచనాలపై హర్షం ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. ఇరు వర్గాలతో మమేకం గరగపర్రు దళితవాడలో జగన్ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అడుగడుగునా బ్రహ్మరథం గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రులో మీడియాతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది. ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్ జగన్
ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన -
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
-
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు. ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు. -
ఉద్రిక్తం.. ఉద్విగ్నం
► గరగపర్రులో కొనసాగుతున్న 144 సెక్షన్ ► తరలివచ్చిన అధికారగణం ► జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ ► నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశం ► నేడు గ్రామానికి వైఎస్సార్ సీపీ బృందం పాలకోడేరు మండలం గరగపర్రులో ఇంకా ఉద్విగ్నం.. ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. గ్రామం పోలీసు వలయంలో బందీ అయింది. 144 సెక్షన్ వల్ల గ్రామంలోకి బయట వ్యక్తులను ఎవరినీ రానీకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పాలకోడేరు : గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం నేపథ్యంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైనట్టు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దళిత నేతలను అరెస్ట్ చేయడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సోమవారం కూడా గ్రామం ఖాకీల వలయంలోనే ఉండాల్సి వచ్చింది. గ్రామంలోకి ఎవరినీ రానీకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రజాజీవనానికీ ఆటంకం కలిగించారు. ప్రతిఒక్కరూ తాము గ్రామస్తులమనే ఆధారం చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా నిర్బంధాల వల్ల బయట నుంచి వచ్చిన ప్రజా, దళిత సంఘాల నేతలు అతి కష్టమ్మీద దళితవాడకు చేరుకుని బాధితులకు సంఘీభావం ప్రకటించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి : రాములు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు సోమవారం గ్రామానికి వచ్చారు. ఆయనతోపాటు కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఇతర అధికారగణం తరలివచ్చారు. దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనపై రాములు బహిరంగ విచారణ చేపట్టారు. బాధితుల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పూర్వ పరిస్థితి నెలకొనే వరకూ బాధితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ముందుగానే ఈ చర్యలు తీసుకుంటే ఇప్పుడీ విపత్కర పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. దళితులు కౌలు చేస్తున్న భూములను తిరిగి ఇప్పించాలని, వెంటనే పనులు కల్పించాలని, వారికి సరుకులు ఇవ్వని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతేగాక దళితులకు దగ్గర్లో ఉండేలా దుకాణాలను ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇరువర్గాల్లో సభ్యులను ఎంపిక చేసి చర్చల ద్వారా న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు కొంత గడువు కావాలని కోరారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. తహసీల్దార్, తదితర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని, గ్రామంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూములను బడా బాబులు కబ్జా చేశారని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడతామని బదులిచ్చారు. నేతల నిర్బంధం గొల్లలకోడేరు వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్, లీగల్ సెల్ నాయకులు స్టాలిన్ రాజును పోలీసులు అడ్డుకుని రెండు గంటలపాటు నిర్బంధించారు. వీరు అతికష్టమ్మీద గ్రామానికి చేరుకుని దళితులను పరామర్శించారు. దళిత స్త్రీశక్తి జాతీయ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, ఢిల్లీ నుంచి వచ్చిన దళిత రైట్స్ జాతీయ అధ్యక్షుడు కందుకూరి ఆనందరావు గ్రామంలో పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, కోల్కతాల నుంచీ దళిత, మానవహక్కుల నేతలు గరగపర్రు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఇదిలా ఉంటే ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారాం, ఆపార్టీ జిల్లా నాయకుడు పాలా సత్తిరామరెడ్డి, ఐఏఎస్ ఫోరం కార్యదర్శి సిద్దోజిరావు, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నేతలు బాధిత దళితులను పరామర్శించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాడు తుందుర్రు.. నేడు గరగపర్రు.. భీమవరం : అధికారులు, పోలీసుల అత్యుత్సాహం వల్లే గరగపర్రు సమస్య మరింత జఠిలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోకి ప్రవేశించాలంటే గ్రామస్తులతో సహా అందరూ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి ఆక్వా మెగా ఫుడ్పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడితో సహా భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టిన సమయంలోనూ అధికారులు, పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ బాధిత గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. బాధితులను ముప్పుతిప్పలు పెట్టారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా.. లోపలకు రావాలన్నా.. ధ్రువీకరణ చూపించాలని ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. ఇప్పుడు గరగపర్రు విషయంలోనూ పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి శనివారమే కలెక్టర్ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకూ నచ్చచెప్పారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి దళితనేతలను అరెస్ట్ చేయడం, తదనంతరం 144 సెక్షన్ విధించడం బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వివాదం చినికిచినికి గాలివాన అయింది. ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతోంది. గ్రామంలో పోలీసులు లేకపోతేనే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని, ఎక్కువ మంది పోలీసులను మోహరించడం వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఇటు బాధితుల్లోనూ, ఇటు మిగిలిన గ్రామస్తుల్లోనూ పెరిగిపోతుందని, దీనివల్ల సమస్య మరింత జఠిలమవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు. వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించి అధికారులు సావధానంగా ఇరువర్గాలతో చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
గరగపర్రులో వైఎస్ఆర్సీపీ బృందం పర్యటన
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మేరుగ నాగార్జున తదితరులు దళితవాడలో బాధితులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ గరగపర్రు ఘటనపై బాధితులు మాట్లాడుతూ...‘ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్లో పెట్టాం. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదం ఉన్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అన్ని విగ్రహాలను తొలగించే సమయంలో మేం కూడా అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. గ్రామంలోని అన్ని కులాలు శివాలయంలో సమావేశం అయ్యారు. మే 5వ తేదీ లోపు విగ్రహం తొలగించాలని డెడ్లైన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు, కూరగాయలు, మందులు కూడా అందకుండా చేశారు.’ అని తమ ఆవేదన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో సామాజిక బహిష్కరణ కేసు విచారణ రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు గరగపర్రు సందర్శించి సంఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పూర్వాపరాలను విచారించారని చెప్పారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. -
గరగపర్రు వివాదంపై వైఎస్ఆర్ సీపీ కమిటీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు వివాదంపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు మంగళవారం గరగపర్రులో పర్యటించి, వాస్తవాలను తెలుసుకోనున్నారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు .....కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పలువురు దళిత సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఒకరిని రాజమండ్రిలో విడిచిపెట్టగా...మిగిలిన నాయకులను పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఈ విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిపై పోలీసులు మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. -
‘ న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం’
పాలకోడేరు: పశ్చిమగోదావరి జల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులకి న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర పాలక మండలి సభ్యులు కొయ్యే మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజులు అండగా ఉంటామన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదంలో రెండు నెలలుగా దళితులపై జరుగుతున్న పలు సంఘటనలను వారు ఖండించారు. గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణను వారు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా దళితపేటను సందర్శించి సాంఘిక బహిష్కరణపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజుల నుంచి వివిధ దళిత సంఘాలు గ్రామానికి రావడంతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. గ్రామంలో దళితులందరు ఏకమై సాంఘిక బహిష్కరణకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ధర్నా చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు సాంఘిక బహిష్కరణకు కారణమైన గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ ఇందుకురి బలరాంరాజును వెంటనే అరెస్టు చేసి గరగపర్రు దళితులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
ఒంగోలు: రాజ్యంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పులదండ వేశారు. ఇది గుర్తించిన దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు నిందితులను పట్టుకుని శిక్షిస్తామని సర్ది చెప్పడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. -
మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు..!
► శ్రుతి మించిన అధికారపార్టీ ఆగడాలు ► లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం పసుపు మయం ► బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలు ► రెండు రోజులైనా తోరణాలు, జెండాలు తొలగించని అధికారులు ► టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్న నగర ప్రజలు సాక్షి, గుంటూరు : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు. అధికార మదంతో మహనీయుల విగ్రహాలకు సైతం పసుపుజెండాలు, తోరణాలు కట్టి పైశాచికానందం పొందుతున్నారు. అధికార పార్టీ నేతల ‘పచ్చ’ పాత బుద్ధిని చూసి గుంటూరు నగరవాసులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. మహనీయుల విగ్రహాలను అవమానపరిచారంటూ అధికార పార్టీ నేతలను చీత్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మహనీయుల విగ్రహాలకు పచ్చ తోరణాలు గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం టీడీపీకి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. అంతర్గత విభేదాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గుంటూరు నగరాన్ని టీడీపీ జెండాలు, పసుపు తోరణాలతో నింపేశారు. రోడ్లు, ప్రైవేటు భవనాలు, విద్యుత్ స్తంభాలు దేన్నీ వదలకుండా పసుపు మయం చేసేశారు. వీరు మరో అడుగు ముందుకు వేసి, నగరంలోని మహనీయుల విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టేశారు. ముఖ్యంగా నగరంలోని లాడ్జిసెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు జెండాలు, తోరణాలతో ముంచేశారు. అంబేద్కర్ పార్టీ వ్యక్తి కాదని, ఆయన భారత జాతి సంపదని తెలిసి కూడా ఆయనకు రాజకీయ పార్టీ జెండాలు, తోరణాలు కట్టి అవమానించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల తీరుపై మండిపాటు.. టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగా ఉన్న దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలతో ఉరివేసినట్లుగా కట్టి పడేశారు. ఈ దృశ్యాలు చూసిన నగర వాసులు టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఇతర పార్టీ నేతలు ప్రైవేటు స్థలాల్లో ప్లెక్సీలు, జెండాలు వేస్తేనే ఊరుకోని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సాక్షాత్తూ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న జగజ్జీవన్రామ్ విగ్రహానికి పచ్చతోరణాలు కట్టినా పట్టించుకోకపోవడం శోచనీయం. రెండు రోజులు గడుస్తున్నా వాటిని తొలగించిన నాథుడే లేకుండా పోయారు. గతంలోనూ మదర్ థెరిస్సా విగ్రహానికి అడ్డుగా ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్లెక్సీని కట్టడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరోసారి మహనీయుల విగ్రహాలకు అవమానం జరుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయతలపెట్టిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మరో వర్గం వారు రాత్రికిరాత్రి తరలించడంతో దళి తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా మారి ధర్నా, రాస్తారోకోకు దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని బస్టాండ్ సెంటర్లో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం రాత్రి విగ్రహాన్ని తెచ్చి ఆ ప్రాంతంలో ఉంచారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన కొందరు పంచాయతీ కార్యదర్శి సహకారంతో విగ్రహాన్ని తరలించి పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలిసిన దళితులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ ఇంటికి వెళ్లి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ ఎస్సీ అయినా ఆందోళనకారులకు భయపడి ఇంట్లోంచి రాలే దు. అక్కడి నుంచి దళితులు గ్రామంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ భీమవరం–తాడేపలి్లగూడెం రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో సాగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, దళిత ఐక్యవేదిక, వైఎ స్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సుందర్కుమార్, జిల్లా మాలమహానాడు నాయకులు గుమ్మాపు వరప్రసాద్, మాలమహానాడు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మంతెన యోగీం ద్ర కుమార్ తదితరులు ఇక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ దశలో కొందరు ఆందోళనకారులు వాటర్ ట్యాం క్ ఎక్కి నిరసన తెలిపారు. నరసాపురం సబ్కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆందో ళనకారులతో చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం అభ్యంతరకరమైందని, వేరేచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దళితులు ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించాలని, విగ్రహం తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పెట్టాలని, లేకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటుకు సబ్కలెక్టర్ స్థలం ప్రతిపాదించడంతో ఆందోళన ముగిసింది. ఉండి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి బుట్టాయగూడెం: అంబేడ్కర్పై ప్రేమను తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం తొలగించడంపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమాధానం చెప్పాలని నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. -
‘లాల్ నీల్ జెండా’ నేటి ఎజెండా
అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బంధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు చూస్తున్నారు. మార్క్సిజాన్ని, అంబేద్కర్ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలన శక్తులు సహజంగానే దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. మహాజన యాత్ర, సమర సమ్మేళన సభల్లో వెల్లివిరిసిన ఈ నూతన చైతన్యం మరింత బలపడాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో అపూర్వమైన మహాజన పాదయాత్ర జరిగింది. దాని ముగింపుగా హైదరాబాద్లో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ పరిమాణాత్మకంగానే కాదు, గుణాత్మకంగాను ప్రశస్తమైనది. ఇంత దనుక వర్గ పోరాటమే ఏకైక పోరాట రూపం, తమ అంతిమ లక్ష్యానికి అదే సర్వే సర్వత్రా ఆచరణీయం అన్న భావనలతో ఏ ఇతర సామాజిక అణచివేతలను, ముఖ్యంగా దళిత, ఆది వాసి, గిరిజన, మైనారిటీలు, మహిళలు తదితర వెనుకబడిన కులాలపై ఆధి పత్య కులాల అహంకారపూరిత దాడులను పట్టించుకోవడం లేదనే కొంత వాస్తవిక విమర్శ ఉండేది. దానికి సీపీఎం ఆచరణాత్మకంగా చెప్పిన సరైన సమాధానం ‘లాల్ నీల్ జెండా’. మన దేశ ప్రత్యేకపరిస్థితుల్లో తమ ఎజెండా సామాజిక న్యాయంతో పాటూ సాగే వర్గపోరాటమే పార్టీ లక్ష్య సాధనకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆ సభాముఖంగా తేల్చి చెప్పింది. అదే విషయాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం చేత కూడా నిర్ద్వంద్వంగా స్పష్టం చేయించింది. ఈ వినూత్న వైఖరి సీపీఎం శ్రేణులతో పాటూ, వామపక్ష శ్రేణులు, అభిమానులందరికీ నిస్సందేహంగా ఉత్తేజం కలి గించి ఉంటుంది. ఆ సభలో సీపీఎం నేతలేగాక సీపీఐ కార్యదర్శి చాడ వెంక టరెడ్డి, ప్రజా కళాకారుడు గద్దర్, ఐలయ్య, హరగోపాల్ వంటి మేధావులు పాల్గొనడం అభినందనీయం. నూతన అధ్యాయానికి నాంది స్వాతంత్య్రోద్యమం తర్వాతి తరం వచ్చేసరికి కార్మిక వర్గ పునాదిగా, ఆ వర్గ ఐక్యతే ప్రధానంగా జరపవలసిన ఉద్యమాల ఆవశ్యకత వల్ల కష్టజీవుల మధ్య అభేద్యమైన ఐక్యత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా కొన్ని సామాజిక పోరాటాలపట్ల, వారి అస్తిత్వ ఉద్యమాల పట్ల అవి కార్మికవర్గ ఉద్యమానికి భంగకరం కాగలవేమోననే భయాందోళనలుండేవి. దీంతో ఆ ఉద్యమాల పట్ల వామపక్షాల్లో కొంత సందేహాత్మకమైన, ఊగిసలాట వైఖరిని ప్రదర్శించడం చూశాం. అయితే వర్గ ఐక్యతకు అవి భంగం కలిగిస్తాయనే అపోహా కొనసాగుతున్నా... సామాజిక న్యాయం అనే అంశం పార్టీలో చర్చనీ యాంశం కాకుండా పోలేదు. ఏది ఏమైనా ఏచూరి లాల్ నీల్ జెండా నినాదం నుంచి నాలుగువేల కిలోమీటర్లకు పైగా సాగిన సుదీర్ఘ పాదయాత్ర తదుపరి తమ్మినేని చేసిన ఉపన్యాసం వరకు ఆ సభ ఎంతో ఉత్తేజభరితంగా సాగింది. అది పార్టీ చరిత్రలో ఒక ఉత్సాహపూరిత నూతనాధ్యాయానికి నాంది అవు తుంది. ఇదే వేదికపై నుంచి గద్దర్, తాను గతంలో సీపీఐ, సీపీఎంలను విమ ర్శించినందుకు సభాముఖంగా ప్రజాసమూహం ముందే చెంపలు వేసుకు న్నారు. శ్రీశ్రీ గతంలో ఇందిరాగాం«ధీ అత్యవసర పరిస్థితిని వామపక్ష నియం తృత్వంగా పొరబడ్డారు. అయితే గద్దర్ ప్రజా కళాకారుడే కాదు, అనుభవం గల రాజకీయ మేధావి. అయినా ఆ సభ సృజించిన భావోద్వేగంతో ఇకపై పార్లమెంటరీ రంగాన కృషి చేస్తానని ప్రకటించారు. గతంలో నేను 11 మందితో కూడిన సీపీఎం కార్యదర్శి వర్గంలో సభ్యు నిగా ఉండేవాడిని. అందులో ఒక్క బీసీగానీ, దళితుడుగానీ, మైనారిటీ వ్యక్తి గానీ, మహిళగానీ లేరు. అది కావాలని జరిగిందని అనుకోను. అలా వారిని ఇముడ్చుకోవాలన్న ప్రత్యేక అవగాహన, పోనీ చైతన్యం తగినంతగా లేనందు వలననే ఈ విషయమై ‘వివిధ రాజకీయ పార్టీలలో ఈ సామాజిక అణచివే తకు గురవుతున్న శక్తుల ప్రాధాన్యత’పై ఉస్మానియా యూనివర్సిటీలో డాక్ట రేట్ చేస్తున్న కృష్ణారావు సమాచారం కోసం నన్ను కలిశారు. మీ రాష్ట్ర ఉన్నత కమిటీ సెక్రెటేరియట్లో పరిస్థితి ఎలా ఉందని అడిగారు. నేను పై విషయం చెప్పి, మా పార్టీలో రిజర్వేషన్లు ఉండవని సమాధానం ఇచ్చాను. కనీసం అది మా లోపమేనని కూడా చెప్పలేక పోయాను. ఆ తర్వాత అందుకు కొంత పశ్చాత్తాపపడి అందుబాటులో ఉన్న ఓ ఇద్దరు కార్యదర్శివర్గ సభ్యులతో, కొర టాల గంగాధరరావుతో ఆ విషయాన్ని ప్రస్తావించాను, ‘‘అందులో పశ్చా త్తాపపడాల్సింది ఏముంది? రాష్ట్ర కమిటీలో నలుగురు దళితులున్నారు, కార్య దర్శివర్గ స్థాయికి వారు ఇంకా ఎదగాల్సి ఉంది’’ అన్నారు. అలాగే కొత్తపట్నంలో రాజకీయ పాఠశాల జరిగిన సందర్భంగా కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఆ పాఠశాలకు హాజరైన విద్యార్థుల నుంచి సూచనలను, అభిప్రా యాలను రాతపూర్వకంగా పార్టీకి అందజేయాలని కోరాం. ప్రస్తుతం తెలం గాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్న సి. రాములు మాత్రం ‘‘మన పార్టీలో అంబేద్కర్పై తగురీతిలో అవగాహన ఉన్నట్టు అనిపించడం లేదు. బహుశా అందువల్లనే పార్టీలో దళితులు తదితర అణగారిన సమూ హాల పట్ల మరింత శ్రద్ధ చూపలేకపోతున్నాము’’ అంటూ తన అభిప్రా యాన్ని తెలిపారు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దాన్ని కార్యదర్శి వర్గ సమావేశంలో చర్చకు పెడదామనుకుని, ముందుగా కార్యదర్శి గంగా ధరరావుతో చెప్పాను. ‘‘దాన్ని ఆ కామ్రేడ్ విమర్శనాత్మక దృష్టితో పెట్టారని అనుకోవడంలేదు. అందుకు అతణ్ణి వివరణ అడగనవసరం లేదు. సహ జంగా దళితులలో ఒకరుగా జన్మించి ఆ బాధలు అనుభవించారు గనుక అలా భావించడంలో తప్పు లేదు’’ అంటూ ఆ అభిప్రాయాన్ని ఒక క్షమార్హమైన భావనగా భావించి తీసి పక్కన పెట్టేశారు. అది చర్చనీయాంశమని నేనంటే.. ‘‘ఈచర్చ అనవసరమైన కుల చర్యలకు దారి తీస్తుంది’’ అన్నారాయన. చర్చకు వస్తూనే ఉన్న సామాజిక న్యాయం నేను కార్యదర్శివర్గంలో ఉండగానే కారంచేడులో దళితులపై అక్కడి ఆధి పత్య కులాల వారు దాడి చేయగా పలువురు మరణించారు, గాయపడ్డారు. నాటి పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా అక్కడికి వెళ్లిన నేను అది నగ్న అగ్రకుల దురహంకార దాడి అని స్పష్టంగా ‘ప్రజాశక్తి’లో రాశాను, కార్యదర్శివర్గానికీ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ కారంచేడు వెళ్లినప్పుడు నాటి ప్రకాశం జిల్లా పార్టీ కార్యదర్శి తవనం చెంచయ్య అక్కడ కలిశారు. అన్ని కులాల్లోని పేదలు, కష్ట జీవులను ఏకంచేసి, వర్గపోరాటం ద్వారా ఇలాంటి దురాగతాలను ఎండ గట్టగలమనే మన అవగాహన చెప్పడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఆ ఘటనపై తగినంత చేయలేకపోయామనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చగా నేను ఏకీభవించాను. ఆ తర్వాత విజయవాడలో జరిగిన రాష్ట్ర మహాసభలో పాతూరి రామయ్య (నేటి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు) ‘‘కారంచేడు దళితులపై దాడి సందర్భంగా మన పార్టీ తగిన రీతిలో స్పందించిందా అన్నది ఆలోచించుకోవాలి’’ అన్నారు. ఏవైనా ప్రధాన అంశాలు సభలో ప్రస్తావనకు వస్తే కార్యదర్శివర్గంలో చర్చించి, సమాధానం ఇవ్వాలి. కానీ కార్యదర్శి గంగా«ధరరావు లేచి ‘‘రామయ్య ఏనాడూ రాష్ట్ర కమిటీలోగానీ విడిగాగానీ ఇలాంటి సందేహాస్పద వ్యాఖ్యచేయలేదు. అదేమిటి హఠాత్తుగా ఇలా ఏకంగా రాష్ట్ర మహాసభలో ప్రస్తావించడం వింతగా ఉంది’’ అన్నారు. కార్యదర్శివర్గ కమిటీని మించిన అత్యున్నత వేదిక రాష్ట్ర మహాసభ. అక్కడ అభిప్రాయం చెప్పేహక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయినా వెంటనే రామయ్య ‘‘తొందర పడ్డాను, పొరపాటయ్యింది, క్షమించమని సభను, కార్యదర్శిని కోరుతు న్నాను’’ అంటూ చిన్నబుచ్చుకున్నారు. విజయవంతమైన నాటి సామాజిక న్యాయసభ ఉమ్మడి ఏపీలో సీపీఎంకు బలమైన జిల్లా నల్లగొండ. 1995 శాసనసభ ఎన్ని కల సందర్భంగా ‘సామాజిక న్యాయం’ అంశంపై పార్టీలో చీలిక వచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం(రెడ్డి)ను నిలపాలన్న పార్టీ నాయకత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా బుచ్చిరాములు (గౌడ)కు ఆ సీటును కేటాయించాలనీ, ఎప్పుడూ ఆ సీటును బీఎన్, స్వరాజ్యం, వీయన్, కుశలవరెడ్డిలకేనా, ఒక్కసారైనా బీసీకి ఇవ్వవచ్చు కదా అనే డిమాండ్ వచ్చింది. దీంతో రాష్ట్ర నాయకత్వం అయిష్టంగానే అయినా బుచ్చిరాములుకు సీటు ఇవ్వక తప్పలేదు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. స్వరాజ్యం, వీయన్లే అందుకు కారణం అంటూ సామాజిక న్యాయ గ్రూపుగా ఉన్న దళిత నాయకత్వం పార్టీ నుంచి విడిపోయింది. జిల్లా అగ్రనేత బీఎన్ సైతం వారితో నిలిచారు. 1977 డిసెంబర్ 2న సూర్యాపేటలో లక్షన్నర ప్రజానీకంతో భారీ ఎత్తున ‘సామాజికన్యాయసభ’ జరిగింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా జరిగిన ఆ సభకు బీఎన్ అధ్యక్షత వహించారు, ఓంకార్ ప్రధాన వక్త. మాదిగ దండోరా వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు నేత పీవీ రావు తదితర నేతలతో పాటూ ఆర్ కృష్ణయ్య, తుడుందెబ్బ గిరిజన నేతలు ఆ సభకు హాజరై సంఘీభావ సందేశాలిచ్చారు. నేను ప్రారంభోప న్యాసం చేశాను. దీంతో ఆ సభకు వ్యతిరేకంగా సీపీఎం తరఫున మోటూరు హనుమంతరావు ‘వెనుకబడిన కులాల సభకు బ్రాహ్మణ నాయకత్వం!?’ అంటూ నన్ను దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా కరపత్రాన్ని రచించారు. వాస్తవానికి నాడు న్యాయపోరాట శ్రామికపార్టీగా ఏర్పడిన సీపీఎం (బీఎన్) ప్రధాన నిర్వాహకులతో పోలిస్తే నేను చేసిన కృషి స్వల్పం.ఆ సభ నాడు శ్రమ జీవులకు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలు, మహిళలకు ఎంతో ఉత్తేజా న్నిచ్చింది. ఈ మైత్రీ బంధం విడరానిది ఈ పరిణామ ప్రభావం వల్ల, కమ్యూనిస్టు పార్టీలలో క్రమంగా పెరుగుతూ వచ్చిన ‘సామాజిక న్యాయ’ వాంఛా బలంవల్ల... నాటి సీపీఎం కార్యదర్శి రాఘవులు ముఖ్య బాధ్యతతో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుతున్నారు. సీపీఐ మాజీ ఎంఎల్ఏ మల్లేశ్ నాయకత్వాన దళిత హక్కుల వేదికను, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షులుగా సామాజిక హక్కుల వేదికను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ దిశగానే తెలంగాణలో సీపీఎం నేతృత్వాన దాదాపు వంద ప్రజా సంఘాలతో ప్రజా సాంస్కృతిక వేదిక ఏర్పాటైంది. వీటన్నిటి పర్యవసానమే గుణాత్మకంగా భిన్నమైనదిగా సాగిన తమ్మినేని సామాజిక న్యాయ సాధనా పాదయాత్రగా చెప్పవచ్చు. అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బం«ధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు రంగం మీదకు వస్తున్నారు. వారు మార్క్సిజాన్ని, అంబేడ్కర్ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలనాశక్తులు సహజమైన దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. ఈ నూతన చైతన్యం మరింత బలపడి నిర్ణయాత్మక శక్తి కావాలని ఆశిద్దాం! డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720 -
దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేడ్కర్
► అంబేడ్కర్ బాటలో పయనించి పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత వైఎస్సార్ ► రాజ్యాంగానికి విరుద్ధంగా కొనసాగుతున్న నేటి చంద్రబాబు ప్రభుత్వం ► అంబేడ్కర్ జయంతిలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్ : దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్..అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ 126వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేమ్మన్నారు. అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న ఓ దళిత కుటుంబంలో 14వ సంతానంగా జన్మించారని ఎంపీ చెప్పారు. పేద కుటుంబంలో జన్మించినా ప్రపంచం మొత్తం గర్వించేలా ఆయన సేవలు, ఆలోచనలు ఉన్నాయని, వాటిని ఇప్పటి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హిందువుగా జన్మించి బౌద్ధునిగా మరణించారని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలను దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేశారని గుర్తు చేశారు. దళిత రైతులకు 36 లక్షల హెక్టార్లు భూమిని పంపిణి చేసిన ఘనత దివంగత నేతదేనన్నారు. దళిత, బలహీన బడుగు వర్గాలు డబ్బులు లేవని విద్య, వైద్యానికి దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలు అందించారని ఎంపీ వైవీ వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సీఎం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎంపీ వైవీ మండిపడ్డారు. ఇతర పార్టీ గుర్తుతో గెలచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని అవమానుపరుస్తూ మంత్రి పదవులు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ సేవలకు తగ్గట్టుగా ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని ఎంపీ వైవీ పేర్కొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. అంబేడ్కర్ ఏ ఒక్కరి సొంతం కాదని, ఆయన జాతి సంపదని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు కోటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభానీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమణమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్రెడ్డి నాయకులు వై.వెంకటేశ్వరరావు, కాకుమాను రాజశేఖర్, అక్కిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు అనూరాధ, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావళి, రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య పాల్గొన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని నీలాయపాలెం, హెచ్సీఎం కాలేజీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఎంపీ వైవీ పాల్గొన్నారు. -
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
-
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
-
నా జాతికి లేని రక్షణ నాకెందుకు?
గన్మెన్లను వెనక్కి పంపుతున్నా: ఎమ్మెల్యే సంపత్ గద్వాల అర్బన్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘నా జాతికి లేని పోలీసు రక్షణ నాకెందుకు?.. అందుకే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా ప్రభుత్వ గన్మెన్లను వెనక్కి పంపు తున్నాను’’అని ఆయన ప్రకటించారు. గద్వాలలో జరిగిన అంబేడ్కర్ 126వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలసి ఆయన పాల్గొన్నారు. సంపత్ మాట్లాడుతూ ఒక దళిత మహిళ శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే బట్టలు ఊడదీసి కొడతానని ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషిం చాడని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల దళితులపై దాడులు జరిగిన విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
వర్ధంతి సందర్భంగా అంటూ శుభాకాంక్షలు చెప్పిన వైనం భవానీపురం (విజయవాడ పశ్చిమం) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పుగా ప్రసంగించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అన్నారు. ఆడిటోరియంలో ఉన్నవారు వర్ధంతి కాదు.. జయంతి అని అరవడంతో ఆయన నాలుక్కరుచుకుని.. సారీ.. జయంతి అని సరిదిద్దుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో కూడా లోకేశ్.. శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారని సభికులు గుర్తు చేసుకున్నారు. -
పేదల గొంతుక.. డిజిధన్
ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమం ► నాగ్పూర్ దీక్షాభూమిలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులు ► అక్కడే భీమ్–ఆధార్ యాప్ను ప్రారంభించిన మోదీ నాగ్పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిధన్ ఉద్యమం అవినీతిని పారదోలటంతోపాటు పేదల గొంతుకగా పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమమన్నారు. తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భీమ్ యాప్ వినియోగదారులకు రిఫరల్ బోనస్, దుకాణదారులకు క్యాష్బ్యాక్ పథకాలను ఆయన ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా నాగ్పూర్లోని అంబేడ్కర్ దీక్షాభూమిలో ప్రత్యేక నివాళులు అర్పించిన ప్రధాని.. అదే వేదికగా భీమ్–ఆధార్ యాప్ను ఆవిష్కరించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా మేం డిజిటల్ ఇండియా నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా పేదల నిజమైన ధనంగా మారేందుకు డిజిధన్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది పేద ప్రజల గొంతుకగా మారనుంది. ’ అని వెల్లడించారు. భీమ్ రిఫరల్ బోనస్ భీమ్ యాప్కు రూ.10తో రిఫరల్ బోనస్తోపాటు వ్యాపారులకు ప్రోత్సాహం అందించేలా క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆర్నెల్లకు రూ.495 కోట్లను క్యాష్బ్యాక్, రిఫరల్ బోనస్లుగా ఇవ్వనున్నారు. ‘మీరు ఒకరికి భీమ్ యాప్ను సూచిస్తే మీకు 10 రూపాయలొస్తాయి. అదే ఒకరోజులో 20 మందికి సూచిస్తే రూ.200 సంపాదించుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉంటేచాలు లావాదేవీలు జరుపుకునే స్థితికి మనం చేరుకుంటున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా భీమ్–ఆధార్ యాప్ను మోదీ ప్రారంభించారు. ఆధార్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్ సాయపడనుంది. యాప్ ద్వారా భారతీయ పౌరులు దుకాణదారుడి వద్దనున్న బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్రతోనే చెల్లింపులు చేయొచ్చు. తక్కువ నగదు వాడకంతో లావాదేవీలు పూర్తవుతాయి. ‘నిరక్షరాస్యులు మాత్రమే తమ సంతకంగా వేలిముద్ర వినియోగించే రోజులుండేవి. కానీ ఇప్పుడు వేలిముద్రే మీ బలం’ అని అన్నారు. దేశవ్యాప్తంగా 75 నగదు రహిత/తక్కువ నగదు లావాదేవీలు జరిగే టౌన్షిప్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో రోజుకు లక్షన్నర రూపాయల నగదురహిత లావాదేవీలు, ఏడాదికి 5.5 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇందులో గరిష్టంగా గుజరాత్ నుంచే 56 ఉన్నాయి. ఈ టౌన్షిప్ల ఎంపిక ప్రక్రియను ప్రైస్ వాటర్హౌజ్ కూపర్ సంస్థ ద్వారా నీతి ఆయోగ్ చేపట్టింది. అంబేడ్కర్కు నివాళులు అంతకుముందు దీక్షాభూమిలో అంబేడ్కర్కు ఘన నివాళులర్పించిన మోదీ.. చేతులు కట్టుకుని కాసేపు ప్రార్థన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. అంబేడ్కర్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. నాగ్పూర్లో ఐఐఎం, ట్రిపుల్ఐటీ, ఎయిమ్స్ సంస్థలకు శుక్రవారం మోదీ శంకుస్థాపన చేశారు. కోరడి, చంద్రపూర్, పర్లీలో 3,230 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన 14 యూనిట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణకు ప్రత్యక్ష సాక్షి లక్నో: అంబేడ్కర్ బౌద్ధమత స్వీకరణకు ప్రత్యక్ష సాక్షులైన ఏడుగురు బౌద్ధ సన్యాసుల్లో భదంత్ ప్రజ్ఞానంద్ ఒకరు. వారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఆయనొక్కరే. శ్రీలంకలో జన్మించిన ప్రజ్ఞానంద్(93) లక్నో బౌద్ధ విహార్లో నివసిస్తున్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని పుచ్చుకున్నారు. ఆయనను బౌద్ధంలోకి మార్చిన భదంత్ చంద్రమణి మహాథేరోకు అప్పటికి 22 ఏళ్ల వయసున్న ప్రజ్ఞానంద్ సహాయకుడిగా పనిచేశారు. ‘ఆరోజు నాగ్పూర్ దీక్షాభూమికి ఐదు లక్షల మంది వచ్చారు.. అంబేడ్కర్ పూర్తిగా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలేవీ లేనట్లు కనిపించారు..’ అని ప్రజ్ఞానంద్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై, సైగలతో సంభాషించే ప్రజ్ఞానంద్.. అంబేడ్కర్ అనే మాట వినగానే ఉత్సాహంతో మాట్లాడతారని శిష్యులు చెప్పారు. కోటి గెలుచుకున్న శ్రద్ధా న్యూఢిల్లీ: లక్కీ గ్రాహక్ పథకంలో రూ.కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ మంగ్షెటే(20)కి నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా బహుమతి అందించారు. శ్రద్ధా ప్రస్తుతం మహారాష్ట్రలోని లాతుర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. తాను కొత్తగా కొన్న మొబైల్ ఫోన్ నెలసరి వాయిదా(ఈఎంఐ) రూ.1509ని రూపే కార్డుతో ఆన్లైన్లో చెల్లించడంతో శ్రద్ధాను అదృష్టం వరించింది. లక్కీ గ్రాహక్ యోజనలో రెండో బహుమతి రూ.50 లక్షలను గుజరాత్ ఖంభట్లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హార్దిక్ కుమార్(29) అందుకున్నారు. -
గన్మెన్లను తిప్పిపంపిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తన రక్షణకు కేటాయోగించిన గన్ మెన్లను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తిప్పి పంపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తన గన్మెన్లను ఎమ్మెల్యే తిప్పి పంపారు. రాష్ట్రంలో ప్రజలకు లేని రక్షణ తనకెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అంబేద్కర్ అందరివాడు
కంభం: అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్ఐ రామానాయక్ అన్నారు. స్థానిక కందులాపురం కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాల చెన్నకేశవరావు అధ్యక్షతన అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కందులాపురం కూడలి నుంచి తహశీల్దార కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెంరాజు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పానుగంటి సతీశ్, మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్వకూరి అబ్రహం, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ చింతల అరుణ్దీప్, ఎన్జీఓ ఏలియా, సీఐటీయూ నాయకుడు దాసరిరెడ్డి, పీపుల్స్ యాక్షన్ ఫోరం నాయకుడు పులుగుజ్జు సురేశ్, కంభం, కందులాపురం సర్పంచులు స్టార్బాషా, మెర్సికమల తదితరులు పాల్గొన్నారు. వాసవీ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గోళ్ల సుబ్బరత్నం సిబ్బందితో కలిసి కందులాపురం కూడలిలో అంబేద్కర్కు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చెన్ను విజయ ఆధ్వర్యంలో కంభం, అర్ధవీడు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా వచ్చి కందులాపురం కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కంభం మండల రూరల్ లాయర్ శ్రీనివాసులరెడ్డి, నాయకులు సి.హెచ్. వెంకటేశ్వర్లు, గర్రె వెంకటేశ్వర్లు, పఠాన్ జఫ్రుల్లా ఖాన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ అశయాలను కొనసాగించాలి
పెండ్లిమర్రి: పేద, బడుగు, బహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అశయాలను కొనసాగించాలని ఎంపీడీవో మల్రెడ్డి, తహశీల్దార్ అంజనేయులు పేర్కొన్నారు. అంబేడ్కర్ 126వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటన్న మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.అలాగే పెండ్లిమర్రి వీరభద్రస్వామి దేవాళయంలో సమరసత సేవా పౌండేషన్ అధ్యక్షుడు రామలక్ష్మన్రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రఘనాథ్రెడ్డి, ఏఎస్ఐ నాగన్న, వీఆర్వో ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి బాస్కర్, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ బాలగురవయ్య, మండల మాల మహనాడు అధ్యక్షుడు రాజు, ఉపాధ్యాక్షుడు లారెన్స్ పాల్గొన్నారు. -
బుద్దుని ఎదుట ధ్యానం చేసిన మోదీ
-
ఎస్సీ సబ్ప్లాన్ నిధుల ఖర్చులో విఫలం
హైదరాబాద్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందిపోయి.. వాటిని తుంగలో తొక్కుతున్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు వచ్చే కార్యక్రమాల కోసం బడ్జెట్ నిధులు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ ఎస్సీ సబ్ప్లాన్ నిధులను సరిగ్గా ఖర్చు పెట్టడంలో విఫలమైంది. మంత్రివర్గ కూర్పులో దళితులు, మహిళలకు చోటు ఇవ్వనేలేదు.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారన్నారు. యాల్సి ఉంది. -
స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది. మొత్తం మీద సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి. శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు. -
అంబేద్కర్ చిరస్మరణీయుడు: వైవీ
విజయవాడ: భారతీయుల గుండెల్లో అంబేద్కర్ చిరస్మరణీయుడని, ఆయనకు మరణం లేదని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. విలేకరులతో మాట్లాడుతూ..అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునికి పుచ్చుకొని పని చేశారని వైవీ తెలిపారు. పేద, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల కపటనాటకం ప్రదర్శిస్తుందని విమర్శించారు. దళితులకు ఒక్క ఇల్లు కూడా కట్టని చంద్రబాబు తాను మాత్రం విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబుకి రాజ్యంగ పట్ల ఎంత గౌరవం ఉందో అర్దమౌతుందన్నారు. తెలుగదేశంలో సరైన నాయకులు లేరని అందుకే వైఎస్సార్సీపీ నుంచి గెలిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులని విస్మరిస్తోందని, ఇది ముమ్మాటికీ దళిత వ్యతిరేక ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. -
12న 3కే, 5కే రన్
– కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కర్నూలు(అర్బన్): అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 12న అన్ని మండల కేంద్రాల్లో 3కే రన్, జిల్లా కేంద్రంలో 13న 5కే రన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డీఎస్డీఓ మల్లికార్జునుడుని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ఈనెల 14న 125వ అంబేద్కర్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయాలన్నారు. నగరంలో 13వ తేదీ కలెక్టరేట్ నుండి కొండారెడ్డి ఫోర్ట్ వరకు 5కే రన్ నిర్వహించాలన్నారు. నర్సింగ్, మెడికల్ కళాశాల విద్యార్థులు రన్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అంబేద్కర్ సర్కిల్లో డయాస్ ఏర్పాటు, పూలమాల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్లందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మెప్మా పీడీ రామాంజనేయులు, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్ వలి, సాంఘిక సంక్షేమాధికారి తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ చైతన్యాన్ని నింపే ‘శరణం గచ్ఛామి’
విజయవాడ రైల్వే డీఎస్పీ సత్తిబాబు అమలాపురం టౌ¯ŒS : రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రిజర్వేషన్ల కోసం కల్పించిన హక్కులు, నిర్దేశించిన సూత్రాలను ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు విధిగా అమలు చేయాలో తెలుపుతూ తెరకెక్కించిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ప్రజల్లో రాజ్యాంగ చైతన్యాన్ని నింపుతుందని విజయవాడ రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు దేశానికి ఎంత అవసరమో చాటుతూ నిర్మించిన ‘శరణం గచ్ఛామి’ చిత్ర ప్రదర్శనను స్థానిక శేఖర్ స్క్రీ¯ŒS–2 థియేటర్లో ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. అంతకు ముందు థియేటర్కు సమీపంలోని బుద్ధవిహార్ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంబేడ్కర్వాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి చిత్ర సందేశాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థపై అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఈ చిత్రం ఓ సమగ్రమైన, శాస్త్రీయమైన ఆధారపూరిత వివరణ ఇచ్చిందన్నారు. అమలాపురంలో చిత్ర ప్రదర్శనకు సహకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్, కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విçష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ కో కన్వీనర్ నల్లా పవ¯ŒSకుమార్లను అభినందించారు. విషు్టమూర్తి, పవ¯ŒSకుమార్లు కూడా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ చెప్పారు. చిత్రాన్ని వీక్షించేందుకువచి్చన వందలాది మంది అంబేడ్కర్వాదులను డీఎస్పీ సత్తిబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డీఎస్పీ సహా కోనసీమ దళిత నేతలు చిత్రాన్ని వీక్షించారు. థియేటర్ వద్ద అంబేడ్కర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు. ‘జోహార్ అంబేడ్కర్’ నినాదాలతో థియేటర్ మారుమోగింది. అంబేడ్కర్ వాదులు పెనుమాల చిట్టిబాబు, పెయ్యల పరశురాముడు, మట్టా వెంకట్రావు, పోతుల సుభాష్ చంద్రబోస్, జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అసోసియేష¯ŒS అధ్యక్షుడు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాయం పాడిన గేయం
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా... కవిత్వం, సమాజం వేరు వేరు కాదు. సమాజంలో మనుషుల మధ్య హెచ్చు తగ్గులు, దూరాలు పెరిగే కొద్దీ ప్రశ్నించే క్రమంలో కవిత్వం కూడా కొత్త రూపాలు తొడుక్కుంటుంది.మనం హాయిగా ఉన్నంత కాలం మన పాలీ మెత్తగా ఉంటుంది. మన అస్తిత్వానికి అవమానం జరిగినప్పుడు మనలో ఒకరు కవిత్వంతో తన పాలీ ద్వారా తన జాతి ఆలోచనలకి పదును పెడతారు. అలా వచ్చిన ఈ తరం కవులే ఈ పది మంది. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం అనగానే మనకు గుర్తుకొచ్చే పేర్లు కొలకలూరి, మద్దూరి, తెరేష్ బాబు, కలేకూరి, ఎండ్లూరి, శిఖామణి, సతీష్ చందర్, గుండె డప్పు కనకయ్య తదితరులు. ఈ పాత నీటిని ఆస్వాదిస్తూ, వారి సొంత బాట వేసుకుని తమ గొంతుకు ప్రాణం పోసుకుంటున్నారు కొత్త కవులు. దళిత సాహిత్యం అవమానాల్లోంచి, ఆర్థిక పీడనల్లోంచి, అవహేళనలలోంచి, అమానుషత్వంలోంచి పుట్టింది. దళిత బహుజన ముస్లిం సమస్యలు సాహిత్య పరంగా ఎప్పుడూ తోడుగానే ఉంటాయి. ఇటు కులానికి అటు మతానికి దెబ్బ తిన్న వారు దళిత ముస్లింలు. ముఖ్యంగా క్రైస్తవ దళిత స్త్రీలు, ముస్లిం స్త్రీలు చాలా ప్రత్యేకమైన వివక్షలతో పోరాడుతుంటారు. ఈ స్త్రీలు తమ మతాల పేరుతో ఇళ్లలోంచే స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఎదుర్కొంటారు. మత పరంగా ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి అనే సంకెళ్ళ నుంచి చదువుతో ఇప్పుడిప్పుడే బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్త్రీలకు మొదటి శత్రువు తమ ఇంటి లోని పురుషులే అవుతారు. ఊరందరికీ దళితుడు బానిసగా ఉండి ఊడిగం చేసొచ్చి తన భార్యని తనకు బానిసను చేసుకుంటాడు. ఏ స్త్రీకయినా చదువే ఆయుధం. చదువుకుని, ఆర్ధిక స్వేచ్ఛ లభించడం తోనే ఆమె ప్రథమమైన పోరాటంలో గెలుస్తుంది. ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడంలో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటుంది. స్త్రీలందు దళిత స్త్రీలు వేరని దళిత రచయితలు నిరంతరం వారి వాదన వినిపిస్తూనే ఉంటారు. ఆ వాదాన్ని తమ కవితలతో మరింత బలంగా వినిపిస్తున్నారు అరుణ గోగులమండ, నస్రీన్ ఖాన్, రెహానా బేగం, మెర్సీ మార్గరెట్, షంషాద్ మొహమ్మద్. అత్యాచారానికి గురైన దళిత ఆడపిల్లలు ఎందుకు ’ఇండియాస్ డాటర్స్’ కాదో బల్ల గుద్ది చెబుతారు అరుణ. జ్యోతి సింగ్ దళితురాలైతే నిర్భయ చట్టం వచ్చేదా అన్న ప్రశ్నను మనలో రేపుతోంది తన కవిత. ముస్లింలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. మధ్యయుగంలో కాస్త బాగానే బతికుండొచ్చు కానీ రాను రాను వారి పై దాడులు, హింస పెరుగుతూనే వస్తున్నాయి. వీరు పేరుకి దళితులు కాకపోయినా అంతే అవమానాలను చవి చూస్తుంటారు. ముస్లిం రచయితలు రాసే రచనలు ముందుగా ముస్లింలే చదవాల్సిన అవసరం ఉంది. సాహిత్యం ఎక్కువగా చదవకపోయినా దళితులకు వారి సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ ముస్లింలకు వారి స్త్రీలు పడే చెప్పుకోలేని ఇబ్బందులు తెలియాలంటే ముస్లిం సాహిత్యం చదవాల్సిందే. తమని తాము లోపలి నుంచి తెలుసుకోవాలంటే ఈ సాహిత్యం అనే అద్దంలో చూస్కోవాల్సిందే. నస్రీన్ ఖాన్ రాసిన ’మూలవాసీ చెట్టు’ కవితలో ఇలా అంటారు //పుట్టినచోటే నిరంకుశంగా పరాయీకరణ పాలవుతున్న వైనం అతలాకుతలం చేస్తోంది ఒకే ఇంటిలో ఉంటున్నా తమను వేరు చేయడంపై ఆవేదనను వ్యక్తం చేశారు. రెహానా ’స్వప్న శిథిలాలు’ కవితలో ముస్లిం స్త్రీల పేదరికం, పైకి చెప్పుకోలేని బాధలను కళ్ళకు కట్టారు. నిజానికి, నిజాలు రాసే తెలుగు కవులు, కథకులు కరువవుతున్న ఈ నేపథ్యంలో వీరు అచ్చంగా తమ జీవితాల్లోంచి తాము పడ్డ వేదన, హింస, అసమానతలను అక్షరీకరించడం అభినందనీయం. దళిత సాహిత్యం అనగానే వెలివాడల వెతలు, అంటరాని అకృత్యాలు మాత్రమే ఉంటాయనే అపోహ, అభియోగం ఉన్నాయి. వాస్తవానికి పేదరికంలో కష్టాలతో పాటు హాస్యం, చతురులు కూడా ఉండకపోవు.దళిత హాస్యాన్ని ఏ మాత్రం వాస్తవం లోపించకుండా గుంటూరు మాండలికంలో విరివిగా రాస్తున్నారు ఇండస్ మార్టిన్. ’నిర్దేశం’ అనే కవితలో దళితవాడ లోని జీవననాన్ని వివరిస్తూ ఇలా అంటారు మార్టిన్. కుక్కిమంచాల్లోని బక్కజీవుల్ని నిదర్లు లేపుతూంటే కదుల్తున్న కడుపుని వుగ్గబట్టుకుంటా చాప రంగçస్థలం మీద నేనాడే నిద్రానాటకం మాయమ్మకు తెలిసిపోద్ది కుండలోని ఇగం లాంటి నీళ్ళు మొకాన పడితే కుంభకర్ణుడూ కుదేలైపోవాల్సిందేనని ఆయమ్మకు నేర్పిందెవుడో మనువాదాన్ని ధిక్కరించి మూలాలను ప్రశ్నించడం తోనే దళిత కవిత పురుడు పోసుకుంది. ఆ మనువాదాన్ని వివక్ష రూపంలో తాము స్వయంగా ఎదుర్కొన్న చేదు అనుభవాల్లోంచి నిగ్గదీసి అడుగుతున్నారు నవ కవులు వేణు ఉడుగుల, దానక్క ఉదయ భాను వారి ’ప్రాచీన శవాలు’ , ’మనువ్యాధి’ కవితలలో. భారత దేశంలో దళితులపై ఎన్నో దాడులు జరిగినా తెలుగు నాట జరిగిన చుండూరు, కారంచేడు, లక్షింపేట ఉదంతాలు ఇప్పటికీ వెన్నులో వణుకు, గుండెల్లో మంట పుట్టిస్తుంటాయి. పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకు తెలంగాణాలో మంథని మధుకర్ ని చంపిన తీరు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ దాడులకు అంతు ఉండదేమో ఇక. ఈ ఘటనల పై పసునూరి రవీందర్ ’అన్టచబుల్ ఎమర్జెన్సీ’ అనే పదునైన కవిత రాశారు. ‘వెలివాడలు మీ వెంటపడక ముందే మీ మస్తిష్కాల్లో తిష్ట వేసిన మౌఢ్యాన్ని పొలిమేరల అవతలికి తరమండి, మనుషులారా సరికొత్తగా బతకండి’ అంటూ హెచ్చరికతో ముగిస్తాడు. ప్రశ్నించే వాడే కవి, వెలివాడల కలల్ని గానం చేసినవాడే గాయకుడు అంటారు దళిత కవులు. నిప్పు కణికల్లాంటి అక్షరాలని నువ్వు రాయాలంటే మా మాల మాదిగ గూడేలకి రమ్మని పిలిపునిస్తాడు తంగిరాల సోని.మరుగుతున్న కొత్త నెత్తురు సురేంద్ర దేవ్ చెల్లి. ’కారంచేడు’ ను తన గోడుని చేసుకుని అగ్రవర్ణ తలలు సిగ్గుపడే ప్రశ్నతో కవితకు ముగింపు పలుకుతాడు. ఆ గాయాల సలపరాన్ని వివరిస్తూ పెద్ద కులపోళ్ల గుండెల్లో నిదురిస్తాడు. దళిత బహుజన ముస్లింల సమస్యలు చర్చించేది, వినేది కూడా వారే. పాలనలో వీరికి పరిష్కరించే వారు తక్కువ. యుగాలుగా ఇవి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సమాధానాలు, సంతోషాలు లేని జీవితాలు వీరివి. ఈ వివక్షను ఎదురుకొని కలసి పోరాడడానికి మరిన్ని గొంతులు కావాలి. ఎంతో సాహిత్యం రావాలి. యువత తమ పాళీని కదపాలి. -
అంబేడ్కర్.. తాత ఇంట్లో నివసించారు
ముంబై: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బాల్యంలో సతారాలోని తాత ఇంట్లో కచ్చితంగా నివసించి ఉంటారని భావిస్తున్నందునే ఆ ఇంటిని రక్షిత నిర్మాణంగా ప్రకటించామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు బాంబే హైకోర్టులో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ‘అంబేడ్కర్ తండ్రి రాంజీ మలోజీ సక్పల్ ఆ ప్రదేశంలో నివసించారు. ఆ ఆస్తి ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అంబేడ్కర్ పేరు ప్రతాప్సింగ్ హైస్కూల్లో నమోదైంది. అప్పుడు ఆయన ఎక్కడ నివసించాడో రికార్డుల్లో లేకున్నా.. చుట్టుపక్కల ఇళ్లేవీ లేకపోవడంతో కచ్చితంగా తండ్రితో కలసి ఆ ఇంట్లోనే జీవించి ఉంటారు’ అని వివరించింది. ఈ ఆస్తిని ప్రభుత్వం రక్షణ నిర్మాణంగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ లక్ష్మణ్ ఆమ్నే అనే వ్యక్తి ఇటీవల కోర్టుకెక్కారు. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.