computer
-
తొలి సైబర్ దాడి ఎప్పుడు జరిగింది?
జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్వర్క్లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్లను ప్రభావితం చేసే రహస్య వైరస్ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలుసురక్షిత పాస్వర్డ్లు: బలమైన, అసాధారణమైన పాస్వర్డ్లను ఉపయోగించాలివైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.నెట్వర్క్ భద్రత: సురక్షిత నెట్వర్క్ కనెక్షన్, ఫైర్వాల్ని ఉపయోగించాలి.సాఫ్ట్వేర్ అప్డేట్: తాజా భద్రతా ప్యాచ్లతో అన్ని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తుండాలి. ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
వేలానికి 1983 నాటి యాపిల్ ప్రోటోటైప్
ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. ఆ ప్రోటోటైప్ ద్వారానే వస్తువు పనితీరు ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత, ప్రోటోటైప్స్ నిరుపయోగమవుతాయి. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు లేదా వ్యక్తులు వేలంలో విక్రయిస్తాయి. ఆసక్తికలిగిన వారు భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటారు. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ 'మాకింతోష్ #ఎమ్001' (Apple Macintosh Prototype #M0001) ఇప్పుడు వేలానికి వచ్చిందియాపిల్ మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ అక్టోబర్ 23 వరకు న్యూయార్క్లోని బోన్హామ్స్లో వేలానికి ఉంటుంది. ఇది సుమారు 120000 డాలర్లకు (రూ. 1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన పురాతన యాపిల్ ఉత్పత్తులలో #ఎమ్001 ప్రోటోటైప్ కూడా ఒకటిగా మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది.మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ నాలుగు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ.. ఇది మంచి స్థితిలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తులను వేలంలో విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి ఓ ప్రోటోటైప్ను 150075 డాలర్లకు విక్రయించారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్కంప్యూటర్లు మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, జెఫ్ రాస్కిన్ సంతకం చేసిన 128కే మాకింతోష్ మదర్బోర్డ్ 2021లో 132049 డాలర్లకు అమ్ముడైంది. ఆ తరువాత స్టీవ్ జావ్స్ ఉపయోగించిన మాకింతోష్ ఎస్ఈ కంప్యూటర్ను 126375 డాలర్లకు వేలంలో విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్టాప్స్, నోట్బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్ని చూసి అబ్బురపడ్డారు. అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. ఇక ఈ కంప్యూటర్ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్నిర్మించిన ఈ త్రీడీ మోడల్ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!?
ప్రపంచంలోనే తొలిసారిగా సజీవ కంప్యూటర్ను రూపొందించారు స్వీడిష్ శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలాన్ని సేకరించి, లాబ్లో ఆ కణజాలాన్ని పదహారు చిన్న చిన్న ముద్దలుగా పెంపొందేలా చేశారు. వీటిని ‘ఆర్గనాయిడ్స్’ అంటున్నారు. మెదడు కణజాలం ముద్దలు వాటి నాడుల ద్వారా కంప్యూటర్ చిప్ మాదిరిగానే ఒక దాని నుంచి మరొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలుగుతున్నాయి. మనిషి మెదడు కణజాలం కంప్యూటర్ కంటే వెయ్యిరెట్ల మెమరీకి 10 నుంచి 20 వాట్ల విద్యుత్తును వినియోగించుకుంటే, కంప్యూటర్లు 21 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటాయని ఈ ప్రయోగం చేపట్టిన స్వీడిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రాసెసర్ చిప్ బదులుగా మనిషి మెదడు కణజాలంతో రూపొందిన చిప్ను అమర్చి తొలి సజీవ కంప్యూటర్ను తయారు చేయడంలో విజయం సాధించారు.‘ఫైనల్ స్పార్క్’ అనే స్టార్టప్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్ను తలపించే ఈ ప్రయోగం చేశారు. జీవనాడీ వ్యవస్థలను యంత్రాల్లో ఉపయోగించడం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే తమ సంస్థను ప్రారంభించినట్లు ‘ఫైనల్ స్పార్క్’ కో–సీఈవో డాక్టర్ ఫ్రెడ్ జోర్డాన్ ప్రకటించారు.ఫైనల్ స్పార్క్ దాదాపు పదివేల సజీవ నాడీకణాలతో 0.5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కంప్యూటర్ చిప్స్ను రూపొందిస్తోంది. వీటిని ‘మినీ బ్రెయిన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆర్గనాయిడ్స్తో తయారైన ఈ మినీబ్రెయిన్స్ ఎలక్ట్రోడ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇవి చదవండి: త్రీ ఇన్ వన్ తందూర్.. -
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ తయారీదారు హెచ్పీ క్వాలిటీ ప్రొడక్ట్స్తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ల్యాప్టాప్స్ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్టాప్స్తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్కి తీసుకొస్తుంది. ‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్టాప్లు, హెడ్సెట్లు, మైక్రోఫోన్లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని హెచ్పీ స్టోర్లు, హెచ్పీ ఆన్లైన్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హెచ్పీ ఒమెన్ 16 ల్యాప్టాప్లపై గరిష్టంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్టాప్ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్టాప్ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..? ఒమెన్ 16 ల్యాప్టాప్ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్సెట్తో సహా హైపర్ ఎక్స్ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్ ఎక్స్ క్లచ్ గేమ్ కంట్రోలర్పై రూ.999 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!
‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటికి సంబంధించిన చర్చలు ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్ను ఉపయోగించారు. యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్ గురించి కంప్యూటర్ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది? -
షూ కాదిది, కంప్యూటర్!, ధర ఎంతంటే?
చూడటానికి స్పోర్ట్స్ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ సీపీయూలో ఉండే మదర్బోర్డ్, ప్రాసెసర్, హార్డ్డిస్క్, ర్యామ్ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి. దీనిని మానిటర్కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070 జీపీయూ, ఇంటెల్కోర్ ఐ7 ప్రాసెసర్తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. అమెరికన్ కంపెనీ కూల్మాస్టర్ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు). -
Chandrababu : జలీల్ఖాన్కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్ఖాన్కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఈయన టైపింగ్ స్కిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే
-
టెక్నాలజీనే నమ్ముకుంటే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లక్షల మంది ఉద్యోగార్ధులకు సంబంధించిన అంశంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టతోనూ ఇమిడి ఉంటాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (2005–11) చైర్మన్గా, యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరగాళ్లు సులువుగా రూ. కోట్లు కొట్టేస్తున్న రోజుల్లో కీలకమైన ప్రశ్నపత్రాలను కేవలం టెక్నాలజీతో భద్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమనే సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు. సాంకేతికను కొంతవరకు నమ్ముకొని గత విధానాలను అనుసరిస్తే పేపర్ లీక్ వంటి ఘటనలకు తావుండబోదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు అనేక అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... మానవసహిత భద్రతకే ప్రాధాన్యమివ్వాలి... పాస్వర్డ్ లేదా ఓటీపీని తెలుసుకొని కేటుగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్న రోజులివి. కంప్యూటర్ యుగంలో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. అలాంటప్పుడు కేవలం సాంకేతికతపై ఆధారపడటం సరికాదేమో. టెక్నాలజీని అనుసరించడం అనివార్యమే అయినప్పటికీ లక్షల మంది జీవితాలతో ముడివడిన ఇలాంటి పరీక్షలపట్ల అప్రమత్తత అవసరం. మానవసహితమైన భద్రత కే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదనేది నా అనుభవం. అప్పట్లో ఏం చేశామంటే.. నేను ఆరేళ్లు ఏపీపీఎస్సీ చైర్మన్గా పనిచేశాను. నా హయాంలో ఏనాడూ పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోలేదు. అప్పట్లో మేం అనుసరించిన విధానాలు వేరు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో అనుసరించిన విధానాలు లీక్లకు ఆస్కారం లేకుండా చేశాయి. ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు ఎగ్జామినర్లను పిలిచేవాళ్లం. వారిని పూర్తి భద్రత ఉన్న హాలులోకి పంపే ముందే సమగ్రంగా పరీక్షించే ఏర్పాట్లు ఉండేవి. వాళ్ల వద్ద పెన్ను, పెన్సిల్ ఆఖరుకు చిన్న కాగితం ముక్క కూడా లేకుండా జాగ్రత్త పడేవాళ్లం. వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు ఉండేవి. ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశాలనేవీ వారు రాసుకొని వెళ్లేందుకు వీల్లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనేవాళ్లం. ప్రశ్నపత్రం చైర్మన్కు కూడా తెలిసేది కాదు... ఒక్కో సబ్జెక్ట్ నిపుణుడు ఒక్కో పేపర్ను సెట్ చేశాక దాన్ని సీల్డ్ కవర్లో కమిషన్ సెక్రటరీకి అందజేస్తారు. సెక్రటరీ తనకు అందిన ఐదు పేపర్లనూ కమిషన్ చైర్మన్ ముందు పెట్టేవారు. అందులోంచి ఒక పేపర్ను చైర్మన్ ఎంపిక చేశాక నేరుగా ప్రింటింగ్ కేంద్రానికి తరలేది. ఇక్కడ కమిషన్ చైర్మన్ లేదా సెక్రటరీ ప్రశ్నపత్రాన్ని చూసే అవకాశం లేదు. అలాగే ఎంపిక చేసిన పేపర్ ఏమిటనేది దాన్ని సెట్ చేయడానికి వచ్చిన ఐదుగురికి తెలిసే అవకాశమే ఉండదు. ప్రింటింగ్ కేంద్రం నిర్వాహకులకు మాత్రమే ఈ పేపర్ ఏమిటనేది తెలిసే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్ అయితే కేవలం ప్రింటర్ను మాత్రమే బాధ్యుడిని చేసేలా అప్పట్లో నిబంధనలుండేవి. ఒకవేళ పేపర్ లీక్ అయితే ప్రింటర్కు భారీ జరిమానా విధించేలా నిబంధనలు తెచ్చాం. పేపర్ లీక్ అయితే ప్రింటర్ ఆస్తులన్నీ జరిమానా కింద పోయేంత ప్రమాదం ఉండేది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి రిస్్కను ప్రింటర్ తీసుకొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్లే అప్పట్లో పేపర్ లీకేజీలు ఉండేవి కావు. భద్రత ఎంత వరకూ? పేపర్ల లీకేజీపై పత్రికల్లో వస్తున్న కథనాలనుబట్టి ఒక వ్యక్తి పాస్వర్డ్ తీసుకొని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడున్న టెక్నాలజీపై అనేక అనుమానాలు రావడం సహజమే. ఇది ఎంతవరకు భద్రత ఇస్తుందనేది ఇందులో ప్రధానాంశం. తాత్కాలిక ఉద్యోగులు ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే వాదన అర్థరహితం. ఇప్పుడే కాదు... అప్పట్లోనూ తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. కేవలం కమిషన్ నిర్వహణలో విశ్వసనీయతే ఇక్కడ ప్రధానం. ఏ వ్యక్తీ ప్రశ్నపత్రం చూసే అవకాశం లేకుండా చేయడమే ఇక్కడ ముఖ్యం. మళ్లీ పరీక్ష అనివార్యమే.. పేపర్ లీకేజీ వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించడం అనివార్యమే. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి వర్గాల మనో వేదన వర్ణనాతీతం. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్న వాళ్లున్నారు. ఎన్నో ఆశలతో ఇదే జీవితమని భావించి చదివిన వాళ్లూ ఉన్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే వారికి సమస్యే. కోచింగ్ కోసం మళ్లీ అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి వారికి ఉండొచ్చు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారి ఆవేదనకు కమిషన్ కారణం కాకుండా చూడొచ్చు. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
Aston University: వైరస్కు ప్రతి సృష్టి!
లండన్: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్కు కంప్యూటర్ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్లోని ఆస్టన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ద్మిత్రీ నెరుక్ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట! ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్ మోడలింగ్ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్ జర్నల్లో పబ్లిషైంది. -
పీసీ అప్గ్రేడ్ కోసం ‘డబ్ల్యూడీ ఎస్ఎన్ 570’
విజయవాడ: నేడు డేటా వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల (పీసీలు) అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న పీసీల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎక్కువ మంది చూస్తున్నారు. ఇటువంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘వెస్టర్న్ డిజిటల్’ సంస్థ.. డబ్ల్యూడీ బ్లూ ఎస్ఎన్ 570 పేరుతో ఎస్ఎస్డీని తీసుకొచ్చింది. ఇది ఎంతో స్లిమ్గా చేతిలోనే పట్టే సైజుతో ఉంటుంది. 250జీబీ, 500జీబీ, 1టీబీ, 2టీబీ కెపాసీటీతో వీటిని విడుదల చేసింది. వీటి ధరలు రూ.2,750 నుంచి మొదలై రూ.20,999 వరకు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఐదేళ్ల వారంటీని ఆఫర్ చే స్తోంది. ఈ సంస్థ శాన్డిస్క్, డబ్ల్యూడీ పేరుతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటుంది. -
విశాఖ ఐటీ సెజ్లో తొలి ఇండియన్ ప్రాసెసర్తో కంప్యూటర్ తయారీ
సాక్షి, విశాఖపట్నం : పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ఎంతో ముఖ్యం. కానీ, వీటిల్లో అశ్లీలతకు ఆస్కారం ఎక్కువ. దీనికి పరిష్కారంగా.. భవిష్యత్లో ఎదురయ్యే డిజిటల్ సవాళ్లని ఎదుర్కొనేందుకు విశాఖపట్నం ఐటీ సెజ్ వేదికగా.. మొట్టమొదటి ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఆవిష్కృతమైంది. తొలి భారతీయ ప్రాసెసర్తో డిజిటల్ స్కూల్ బ్యాగ్ (డీఎస్బీ) పేరుతో రూపొందించిన సిద్ధి డీసీబీ పీఆర్4ఏ కంప్యూటర్లోని కంటెంట్ని 18 భారతీయ భాషల్లోకి అనువదించే సౌలభ్యం ఉంటుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతమున్న కంప్యూటర్లకు భిన్నంగా కేవలం చదువు కోసం మాత్రమే వినియోగించుకునేలా సరికొత్త డివైజ్ని విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ డ్రీమ్చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఇది కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్గా చరిత్ర సృష్టించనుంది. అక్షరమాల నుంచి అన్ని రకాల అంశాలనూ ఇందులో చదువుకునేలా తీర్చిదిద్దారు. నూతన విద్యావిధానాలకు అనుగుణంగా.. పిల్లల బరువులో 10 శాతం మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలన్న నిబంధనల మేరకు కేవలం 1.5 కిలోల బరువుతోనే ఈ డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్ని తయారుచేశారు. ఏళ్ల తరబడి ప్రయోగాల తర్వాత.. అనేక ప్రయోగాల తర్వాత డ్రీమ్చిప్ డెవలపర్ కంపెనీ ప్రతినిధులు గోపీకుమార్ బులుసు, మురళీమనోహర్, వెంకటేశ్వరరావు చివరికి విజయం సాధించారు. ఎలాంటి అశ్లీలత కంటెంట్కు తావులేకుండా కేవలం చదువుకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఇందులో ఉండేలా ఈ కంప్యూటర్ని అభివృద్ధి చేశారు. ఇది ఆఫ్లైన్ మోడ్లో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యం కూడా ఉంది. దేశంలోనే తొలి సొంత ప్రాసెసర్ వినియోగించిన కంప్యూటర్ ఇది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్, కోడ్ లాంగ్వేజ్, ఫీచర్ల పరంగా.. ఇది ప్రస్తుతం ఉన్న ట్యాబ్లు, స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం ఐదువేల పేజీల్ని ఇందులో నిక్షిప్తం చేసుకునేలా అభివృద్ధి చేశారు. పైగా దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.4 వేలకు ఈ కంప్యూటర్ని విక్రయించాలని డ్రీమ్చిప్ నిర్ణయించింది. ఏటా 50 లక్షల యూనిట్లు తయారీ భారతీయ భాషల్లో కంప్యూటర్ను తయారుచేసి.. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించాలన్న సంకల్పంతో రూపొందించాం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని పూర్తిగా వైజాగ్లోనే తయారుచేశాం. ఇందులో 100 మల్టీ సబ్జెక్ట్స్ పాఠాలతో భారత బాలశిక్ష కూడా లోడ్ చేశాం. ఈ కంప్యూటర్లను పెద్దఎత్తున తయారుచేసేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విద్యా సంబంధిత ట్రస్ట్తో కలిసి ఏటా 50 లక్షల యూనిట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాం. – గోపీకుమార్ బులుసు, డ్రీమ్ చిప్ చీఫ్ టెక్నాలజిస్ట్ డ్రీమ్చిప్ కంప్యూటర్ ప్రత్యేకతలివే.. ఇది తెలుగు భాషతో ప్రారంభమయ్యే కంప్యూటర్. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలోనే మొదలు పెట్టేలా సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. ఒక పాఠాన్ని తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ చదువుకునే వెసులుబాటు ఇందులో ఉంది. కేవలం కంప్యూటర్లా మాత్రమే కాకుండా.. దీన్ని డిజిటల్ స్కూల్ బ్యాగ్గా కూడా వినియోగించుకోవచ్చు. దీనికి ఒకవైపు స్క్రీన్, మరోవైపు టెక్ట్ సబుక్ లేదా నోట్బుక్ షెల్ఫ్, రైటింగ్ ప్యాడ్ ఉంటుంది. స్క్రీన్ కింద భాగంలో పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే అర కూడా ఉంది. స్క్రీన్ పైభాగంలో రాత్రిపూట చదువుకునేందుకు వీలుగా ఎల్ఈడీ టేబుల్ ల్యాంప్నూ అమర్చారు. -
కాగితం వృథాను అరికట్టే రోలర్జెట్ ప్రింటర్!
కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాక, ప్రింటర్ల వినియోగం కూడా పెరిగింది. ఆఫీసుల్లో వాడే ప్రింటర్ల వల్ల ఎంతో కొంత కాగితం వృథా అవుతుండటం మామూలే. ప్రింటర్ల వల్ల కాగితం వృథాను అరికట్టే ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన డిజైనర్ జిసాన్ చుంగ్ ప్రయోగాత్మకంగా ‘రోలర్జెట్ ప్రింటర్’కు రూపకల్పన చేశాడు. పేపర్షీట్స్ బదులు పేపర్రోల్స్ వాడటానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దాడు. ప్రింటింగ్ పూర్తయ్యాక, ప్రింట్ అయినంత మేరకు దీని నుంచి కాగితాన్ని కత్తిరించి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్రింటర్ పనితీరు బాగున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెద్దస్థాయిలో దీని తయారీ చేపడితే, ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. -
చిచ్చర పిడుగు!...13 ఏళ్ల వయసులో 17 కంప్యూట్ భాషలు...
కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?... వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు. Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13 I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt — ANI (@ANI) July 2, 2022 -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకే పోష్చర్లో చాలాసేపు కంప్యూటర్పై పనిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవేమో!
కంప్యూటర్పై పనిచేస్తుండే సమయంలో కొందరు ఒకే భంగిమ (పోష్చర్)లో చాలాసేపు కూర్చుండిపోతారు. ఏకాగ్రతతో పనిలో మునిగిపోయినందున తమ పోష్చర్ విషయం పట్టించుకోరు. కేవలం కంప్యూటర్ మీద పనిచేసేవారే కాదు... చాలాసేపు కదలకుండా ఉండి పేషెంట్స్ను చూసుకునే వైద్యరంగాల్లోని వారికీ (హెల్త్ కేర్ గివర్స్), పోష్చర్ మారకుండా పనిచేసే ఇతర రంగాల్లోని వారికీ... కొద్దిసేపటి తర్వాత మెడ, ఒళ్లునొప్పులు రావడం, ఎంత జాగ్రత్తగాఉన్నా తప్పులు దొర్లడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితి. నిజానికి ఈ పదం పూర్తిగా వైద్యరంగానిది కాదు. చాలాకాలం పాటు ఒకేచోట ఉండే వస్తువు స్థితిని తెలపడానికి భౌతిక/ఇంజనీరింగ్ శాస్త్రాల్లో ఉన్న పారిభాషిక పదమే... ఆ తర్వాత వైద్యశాస్త్రం వాడుకలోకి వచ్చింది. ఒకే పోష్చర్లో చాలాసేపు కూర్చుని / కదలకుండా ఉండటంతో వచ్చే ఈ కండిషన్ చాలా రకాల అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ వేగం 20 శాతం వరకు తగ్గుతుంది. శ్వాస ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు 30 శాతం వరకు తగ్గుతాయి. అందుకే దేహానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదులు సైతం 30 శాతం తగ్గిపోతాయి. ఫలితంగా కణాలన్నింటికీ అవసరమైన ప్రాణవాయువు తగ్గుతుంది. శారీరకంగా ఎలాంటి శ్రమ లేనప్పటికీ... తీవ్రమైన అలసట కలుగుతుంది. చాలాసేపు కంప్యూటర్పై టైపింగ్ వల్ల వేళ్ల సమస్యలూ, ఒకే భంగిమలో సుదీర్ఘకాలం కూర్చోవడంతో కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇటు కంప్యూటర్పై పనిచేసేవారూ లేదా ఇతరత్రా పనుల్లో చాలాసేపు ఒకే పోష్చర్లో ఉండేవారు.... కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచినిలబడి, కాసేపు అటు ఇటు తిరగాలి. కంప్యూటర్ స్క్రీన్ను అదేపనిగా రెప్పవాల్చకుండా చూడకూడదు. ఇది కంటికి శ్రమ కలిగించడం, కనురెప్పలు కొట్టకపోవడం (బ్లింక్ చేయకపోవడం)తో లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి స్రవించే కన్నీరు కంటిపై సమంగా విస్తరించదు. దాంతో కన్నుపొడిబారడం, కన్ను అలసటకు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి గంట తర్వాత కనీసం 10 నిమిషాల బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్పై పనిచేస్తున్నప్పుడు కనురెప్పలు తరచూ మూస్తుండాలి. దాంతో ‘స్టాటిక్ లోడింగ్’ అనర్థాలను చాలావరకు నివారించవచ్చు. చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా? -
వెన్నుముక మార్పిడి... వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..
Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్ వరం. అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. 2017లో మిచెల్ రోకాటి మోటర్బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్ పల్స్తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్ పల్స్తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్ను చొప్పించి, పల్స్ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు. ఈ ఎలక్ట్రోడ్లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్ చేయగలవని జపాన్ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు. పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ పల్స్ కంప్యూటర్ ద్వారా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్ పోల్స్ని యాక్టివేట్ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్లో సుమారు 50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఈ కంప్యూటర్ ధర కేవలం రూ. 1000 మాత్రమే..!
సాధారణంగా ఒక డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్టాప్, ల్యాప్టాప్ కాన్ఫీగరేషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్ బెంచాఫ్ అనే ఒక డెవలపర్ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..! స్మార్ట్ఫోన్ సైజులో..! బ్రియాన్ తయారుచేసిన మినీ పాకెట్ సైజ్ కంప్యూటర్ ఇంచుమించు స్మార్ట్ఫోన్ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్ కంట్రోల్ బోర్డ్ను (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది స్క్రిప్ట్లను, పింగ్ రిమోట్ సర్వర్లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్ చేయవచ్చును. ఫీచర్స్లో కంప్యూటర్స్తో సమానంగా..! బ్రియాన్ తయారుచేసిన ఈ లైనక్స్ కంప్యూటర్లో సాధారణ కంప్యూటర్లో ఉండే ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్ను కూడా సపోర్ట్ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది. Wi-Fi అడాప్టర్, కీబోర్డ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్ను తయారుచేయడానికి బ్రియాన్ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. I designed the 'minimum viable computer', a full Linux computer that fits in your pocket. It costs $15.https://t.co/P7F3Re1mGw If you'd like to see more of this, please like, retweet, and share the above link in whatever forum or aggregator you frequent. pic.twitter.com/XzBSULz3El — VT-69 (@ViolenceWorks) January 26, 2022 చదవండి: మాస్కున్న ఫోన్ అన్లాక్ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..! -
దేశమే ఆయన కార్యక్షేత్రం
వైజ్ఞానికరంగంలో ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ రాధాకృష్ణ (ఆర్కే) 80 ఏళ్ళ వయసులో జనవరి 21న హైదరాబాదులో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఉత్తీర్ణులైన తొలితరం విద్యార్థుల్లో ఆయన ఒకరు. బీఏఆర్సీ (బార్క్)లో పరిశోధనలు చేస్తున్న క్రమంలో 1970కి ముందే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు. కశ్మీర్, శ్రీనగర్, చండీగఢ్లలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లలో ప్రొఫెసర్గా పనిచేసారు. అలహాబాద్ ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి 20 మంది దాకా నోబెల్ బహుమతి గ్రహీతలను ఆహ్వా నించి ‘సైన్సు సదస్సు’లను ఏడెని మిదేళ్ల పాటు నిర్వహించిన బృందంలో ఆర్కే కీలక పాత్ర వహించారు. ఆ నోబెల్ సైంటిస్టులు వారం రోజులపాటు క్యాంపస్ లోనే ఉండి ఉపన్యాసాలు, చర్చల్లో పాల్గొనే వారు. దేశ మంతటి నుంచీ సైన్సులో బోధన – పరిశోధనల పట్ల అసక్తి కల వెయ్యిమంది విద్యార్థులు, టీచర్లు ఆహ్వానితులుగా ఆ వారం రోజులూ అక్కడే ఉండే వీలు కల్పిం చిన విశిష్ట కార్యక్రమం అది. అందులో 200 మంది స్కూల్ ఫైనల్ స్థాయి విద్యార్థులూ ఉండే వారు. ఈ కార్యక్రమ ప్రధాన రూపకర్త ఆర్కే. ఆయన దేశభక్తి కేవలం నినాదప్రాయం కాదు. ప్రొఫెసర్గా ఎందరో విద్యార్థులను సైంటిస్టులుగా తయారుచేసి దేశానికి అందించిన ఆచరణశీలి ఆయన. సైన్సు విద్యను ప్రోత్సహించటానికి జీవితాన్ని అంకితం చేశారు. దశాబ్దాల క్రితమే ఎమ్ఐటీ (అమెరికా)లో ఆయన చేసిన కృషి ప్రశంసలందుకున్నది. 70 దేశాల ఉన్నత విద్యాలయాల్లో సైన్సు కార్యక్రమాల నిర్వహణలో పని చేసిన రాధాకృష్ణ ప్రధాన కార్య క్షేత్రం మాత్రం మన దేశమే. ఆయా దేశాల్లో 16 అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులు నిర్వహిం చినా, విదేశాల్లో పని చేయటానికి ఆయన ఇష్టపడలేదు. దేశంలోని ఎంటెక్, పిహెచ్డీ వంటి కోర్సులకు, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థలకు కావల్సిన పాఠ్యాంశాలను రూపొందించటం; రక్షణ శాఖలో, విద్యారంగంలో సాంకేతిక సలహా దారుగా పని చేయడం, విద్యా వాతావర ణాన్ని, శాస్త్రీయ çస్పృహను పెంపొందిం చడం వంటి ఎన్నో రకాలుగా దేశానికి విశిష్ట సేవలను అందించారు. – మరింగంటి శ్రీరామ, రిటైర్డ్ సీజీఎం, సింగరేణి ‘ 94922 05310 -
అద్భుతం.. మైండ్తో ట్వీట్ చేసిన తొలి వ్యక్తి
Paralysed man becomes worlds first person: పక్షవాతం గురించి మనందరికి తెలిసిందే. శరీరంలో ఏ భాగానికి పక్షవాతం వస్తుందో ఆయా భాగాలు చచ్చుబడిపోవడమే కాకుండా కదిలించలేరు. ఒక్కొసారి ఆ పరిస్థితి చాలా దయనీయంగా కూడా ఉంటుంది. అయితే పక్షవాతంతో శరీరం అంతా చ్చుబడిపోయి కదలకుండా ఉన్నవ్యక్తి తన మనసుతో ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఎలా ట్విట్ చేశాడని ఆలోచించేయకండి.! (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ ఓకీఫ్ వేళ్లతో కాకుండా మొదడును మాత్రమే ఉపయోగించి ట్వీట్ చేశాడు. అంటే అతను మెదడు కంప్యూటర్కి కనక్ట్ అవ్వడంతో తన ఆలోచనలకు అనుగుణంగా సందేశం కంప్యూటర్లో టైప్ అవుతుంది. నిజానికి ఫిలిప్ 2015 నుండి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్)తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణంగా అతను శరీరం అంతా పక్షవాతానికి గురై కదలకుండ చచ్చుబడిపోయింది. అయితే కాలిఫోర్నియాకు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ ఇలాంటి వ్యక్తులు తమ మనసుతో కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగేలా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ 62 ఏళ్ల ఫిలిప్ మొదడుని కంప్యూటర్కి అనుసంధినిస్తూ పేపర్క్లిప్ పరిమాణంలో ఉండే సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్ని అమర్చింది. దీంతో అతని మెదడుకు సంకేతాలను అందజేసే చిన్నమొదడు ఆలోచనలను ఈ ఇంప్లాంట్ మైక్రోచిప్ చదివి టెక్స్ట్(సందేశంగా) రూపొందిస్తుంది లేదా అనువదిస్తుంది. అయితే ఫిలిప్కి ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ సాంకేతికతో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా ఫిలిప్ 'హలో వరల్డ్' అనే సందేశాన్ని ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కారణంగా ఫిలిప్ ప్రపంచంలోనే ఆలోచన ద్వారా నేరుగా సోషల్ మీడియా సందేశాన్ని విజయవంతంగా పోస్ట్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు ఇది మొదటి ప్రత్యక్ష-ఆలోచన ట్వీట్గా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో ఫిలిప్ మాట్లాడుతూ..." ఈ సాంకేతికత గురించి మొదటిసారిగా విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఈ సాంకేతికతను వినియోగించాలంటే కొంత సాధన కూడా అవసరం. ఇక ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఈమెయిల్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి పనుల్ని కంప్యూటర్లో చేయగలను " అని అన్నారు. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి) -
45 ఏళ్ల క్రితం కంప్యూటర్.. దీని విలువ కోట్లలోనే!
45 ఏళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ స్వయంగా తయారుచేసిన యాపిల్–1 కంప్యూటర్ ఇది. అమెరికాలో మంగళవారం జరిగిన జాన్ మోరాన్ ఆక్షనీర్స్ వేలంపాటలో ఇది దాదాపు రూ.3 కోట్ల ధర పలికింది. ఎయిర్ బెలూన్ రికార్డు ఫ్రాన్స్లో 3,637 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్పై ఎక్కువ సేపు నిలబడి ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన ఈయన పేరు రెమీ ఓవర్డ్. బుధవారం చాటెలార్ట్లో తీసిందీ ఫొటో. -
ఆరుకోట్లకు అమ్ముడుపోయిన అటోగ్రాఫ్! ఎవరిదంటే..
Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ను ఓ పాథ్ మేకర్గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్ మ్యానువల్.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. 1977లో యాపిల్ II కంప్యూటర్ రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్.. పర్సనల్ కంప్యూటింగ్లో, కంప్యూటర్ల బిజినెస్లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్కు చెందిన మ్యానువల్పై స్టీవ్ జాబ్స్, యాపిల్ సెకండ్ సీఈవో మైక్ మర్క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్ మైక్ బ్రివర్(తర్వాత యూకే యాపిల్ కంప్యూటర్కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్.. మీ జనరేషన్ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్ జాబ్స్ చేత్తో రాసిన రాత కూడా ఉంది. మైక్తో స్టీవ్ జాబ్స్ బోస్టన్కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ కంపెనీ ఈ అటోగ్రాఫ్ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్ బిడ్ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్ కోల్ట్స్కు చెందిన.. జిమ్ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్, మర్క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్. ఇక 1973లో స్టీవ్ జాబ్స్ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని.. యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది. చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!! -
బగ్ బగ్ దెయ్యం.. పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు!
సూర్యచంద్రులు భూమి మీద కాకుండా ఆకాశంలో ఎందుకు ఉంటారో తెలుసా? బెడ్బగ్(నల్లి) బాధ భరించలేకే’ అంటాడు కవి చమత్కారంగా.‘బెడ్ బగ్’ సంగతి సరే, మరి ‘కంప్యూటర్ బగ్’ మాటేమిటి? అది బగ్ కాదు దెయ్యం అంటే కాదనేదేముంది!ఈ దెయ్యాన్ని చూసి పారిపోవాల్సిన పనిలేదు...పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు! మనం ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాం. ‘ఏ లోపం లేకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నాం’ అని మురిసిపోతాం. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్లుగా మన ఇల్లు మనకు ముద్దుగానే కనిపించి ఏ లోపాన్ని కనిపించనివ్వదు. ‘మా ఇంటి నిర్మాణంలో లోపం కనిపెడితే డబ్బులు ఇస్తాం’ అని ఆ ఇంటియజమాని ప్రకటించాడు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇదిగో ఫలాన చోట లోపం ఉంది’ అని చూపించారనుకోండి, సదరు యజమాని ఆ వ్యక్తికి నజరానా ఇస్తాడు. ఇలాగే... సైబర్ క్రిమినల్స్ చొరబడకుండా ఉండేందుకు ప్రముఖ టెక్కంపెనీలు సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ను అప్డేట్ చేస్తుంటాయి. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాలను కనిపెట్టిన వారికి కంపెనీలు నగదు బహుమతిని ఇస్తుంటాయి. ‘బగ్ బౌంటి’పై యూత్ ఆసక్తి చూపుతుంది. బహుమతుల గెలుపులో ‘యువతరం’ ముందుంటుంది. మైక్రోసాఫ్ట్,ఫేస్బుక్, యాహూ, మోజిల్లా కార్పోరేషన్, స్క్వైర్... మొదలైన దిగ్గజ సంస్థలు ‘బగ్బౌంటీ’లో భాగంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నాయి. మరోవైపు ‘యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’లాంటి ఏజెన్సీలు కూడా ‘బగ్ బౌంటీ’లు ప్రకటిస్తున్నాయి. సింగపూర్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటి)కి సంబంధించిన 13 విభాగాలలో ‘బగ్ బౌంటీ’ పథకం క్రింద ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘బగ్బౌంటీ’ ప్రోగ్రాం క్రింద వందకోట్లకు పైగా కేటాయించింది. 58 దేశాల్లో 340 మంది రివార్డ్లను గెలుచుకున్నారు. గూగుల్ బగ్బౌంటీ రివార్డ్స్ కోసం 50 కోట్లకు పైగా కేటాయించింది. 62 దేశాల్లో 662 మంది రివార్డ్లు గెలుచుకున్నారు. బగ్ హంటర్స్ కోసం గూగుల్ ఇటీవలే బగ్హంటర్స్.గూగుల్.కామ్ అనే కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించింది. మన దేశం విషయానికి వస్తే...మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మయూర్ ఇన్స్టాగ్రామ్లో ‘బగ్’ కనిపెట్టి 22 లక్షలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. ఇరవై సంవత్సరాల సెల్ఫ్–టాట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆదిత్సింగ్ (దిల్లీ) మైక్రోసాఫ్ట్ అజ్యూర్స్ క్లౌడ్ప్లాట్ఫామ్లో ఆర్సీయి (రిమోట్కోడ్ ఎగ్జిక్యూషన్) బగ్ను కనిపెట్టి 22 లక్షల పైచిలుకు బహుమతిని గెలుచుకుంది. చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముత్తయ్య మైక్రోసాప్ట్ ‘ఐడెంటిటీ బౌంటీ ప్రోగ్రాం’లో సుమారు 22 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. మధురైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి టీకే కిశోర్ ఫేస్బుక్లో ప్రైవసీకి భంగం కలిగించే బగ్ను కనిపెట్టి లక్ష రూపాయల వరకు గెలుచుకున్నాడు. 22 లక్షలు ఎక్కడా? లక్ష రూపాయలు ఎక్కడా? అని ఆశ్చర్యపోతున్నారా! విషయమేమిటంటే ‘బగ్’ను కనిపెట్టగానే లక్షలకు లక్షలు ఇస్తారని కాదు. ‘బగ్’ వల్ల ఎంత ఎక్కువ ముప్పు ఉంది? అనేదాన్ని బట్టే బహుమతి మొత్తం ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీలో కొమ్ములు తిరిగిన వారు మాత్రమే బౌంటీలో బహుమతులు గెలుచుకోవడం లేదు. ఆసక్తి ఉండి, అది అధ్యయనంగా మారి, విశ్లేషణ సామర్థ్యం, సృజనతో సెల్ఫ్–టాట్ సైబర్ ఎక్స్పర్ట్లుగా తమను తాము మలుచుకున్న అదితిలాంటి వారు ఎందరో ఉన్నారు. ‘మాకు కాస్తో కూస్తో తెలుసు. ఇంకా తెలుసుకోవాలని ఉంది’ అని ఆశించేవారి కోసం ఆన్లైన్ బగ్బౌంటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీదే ఆలస్యం. -
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా ట్యాబ్లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. -
Captcha: నేను రోబోను కాదు!
సాక్షి, సెంట్రల్ డెస్క్: మనం ఏదో ఒక పని మీద వెబ్సైట్లు ఓపెన్ చేస్తుంటాం.. ఒక్కోసారి ఆ పేజీలు ఓపెన్ కావడానికి ముందు ‘క్యాప్చా (CAPTCHA)’ను కంప్లీట్ చేయాలని అడుగుతుంది. అడ్డంగా, పొడుగ్గా సాగదీసి, వంగి ఉన్న అక్షరాలను చూపి.. వాటిని గుర్తించి ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఇంకొన్ని వెబ్ సైట్లలో ‘ఐయామ్ నాట్ రోబో (నేను రోబోను కాదు)’ అని టిక్ చేయాలని కోరుతుంది. మరికొన్నిటిలో చాలా బొమ్మలు పెట్టి.. ఇందులో కారు ఉన్న బొమ్మలను టిక్ చేయండి అని అడుగుతుంది.. అసలు ఇవన్నీ ఏమిటి? ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం రోబోలం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. వెబ్సైట్లకు రక్షణ కోసం కంప్యూటర్ టెక్నాలజీలు పెరిగాక ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోల రూపకల్పన మొదలైంది. నిర్దేశించిన పనిని, నిర్దేశించిన సమయంలో ఆటోమేటిగ్గా చేసే ఈ ప్రోగ్రాములు, రోబోల సాయంతో వెబ్ సైట్లను ఓపెన్ చేయడంతోపాటు, పేజీలను రీడ్ చేయొచ్చు. ఏదైనా వెబ్సైట్ను ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే.. వెబ్సైట్లు, వాటి సర్వర్లు క్రాష్ అవుతాయి. దీనితో పాటు వైరస్ అటాక్లు, ఫిషింగ్, మాల్వేర్లను చొప్పించడం వంటివాటిని కూడా ఈ ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోలు చేయగలుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికే ‘క్యాప్చా’ విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాప్చా అంటే.. ‘కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్’. వెబ్సైట్లను రోబోలు, ఆటోమేటిక్ ప్రోగ్రాముల నుంచి రక్షించేందుకు.. 2000వ సంవత్సరంలో దీనిని రూపొందించారు. మనుషులు సులువుగానే గుర్తించగలిగి.. కంప్యూటర్లు గుర్తించలేని చిన్నపాటి పరీక్ష ఇది అని చెప్పొచ్చు. అక్షరాలను గుర్తించడంతో.. అక్షరాలను చదివి గుర్తించడంలో మనుషులకు మంచి నైపుణ్యం ఉంటుంది. మనకు తెలిసిన అక్షరాలు వంగి ఉన్నా, సాగదీసి ఉన్నా, వివిధ రకాల ఫాంట్లలో ఉన్నా కూడా మనం కాస్త సులువుగానే గుర్తించగలం. ఈ సామర్థ్యమే మొదట క్యాప్చా రూపకల్పనకు మార్గం చూపింది. కంప్యూటర్లు ‘ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్’ సాంకేతికత సాయంతో అక్షరాలను గుర్తిస్తాయి. అవి నిర్దేశించిన మేరకు మాత్రమే కచ్చితంగా అంచనా వేస్తాయి. మనుషుల తరహాలో భిన్నమైన వాటిని గుర్తించలేవు. క్యాప్చా: ఒకే పదంతో పరీక్ష మొదట్లో ఒకే పదం ఉన్న క్యాప్చాలను ఉప యోగించారు. ప్రోగ్రామర్లు కంప్యూటర్కు ముందే ఒక పదాన్ని ఇస్తారు. అంటే క్యాప్చా ఏమిటనేది ఈ కంప్యూటర్కు ముందే తె లుస్తుంది. తర్వాత ఆ పదాన్ని సాగదీసి, వంచి, అక్షరాలను కూడా వేర్వేరుగా సాగదీసి.. వాటి మధ్య దూరం పెంచి ఒక ఇమేజ్ను తయారు చేస్తారు. దీనిని క్యాప్చాగా పెడతారు. మను షులు ఆ పదాన్ని లేదా అక్షరాలను గుర్తించి.. పక్కనే ఇచ్చిన బాక్స్లో నమోదు చేస్తారు. కంప్యూటర్ దానిని సరైనదిగా గుర్తించి వెబ్పేజీని ఓపెన్ చేస్తుంది. ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోలు ఈ క్యాప్చాలను అర్థం చేసుకోలేకపోతాయి కాబట్టి వెబ్పేజీ ఓపెన్కాదు. ప్రతిసారి ప్రోగ్రామర్లు పదాలను ఇవ్వలేరు కాబట్టి.. ముందే వేల సంఖ్యలో పదాలను కంప్యూటర్కు ఇచ్చారు. కంప్యూటరే ప్రతిసారి ఆటోమేటిగ్గా వాటిల్లోంచి ఓ పదాన్ని ఎంపిక చేసి.. వంచి, సాగదీసి క్యాప్చాలుగా పెడుతుంది. రీక్యాప్చా: రెండు పదాలతో.. సాంకేతికత పెరిగిన కొద్దీ ఈ పరీక్షను కాస్త కష్టతరం చేసేందుకు 2005లో రీక్యాప్చాను ప్రవేశపెట్టారు. ఇందులో రెండు పదాలు ఉంటాయి. ఒక పదాన్ని కంప్యూటర్ నేరుగా సృష్టించి ఇస్తుంది. స్కాన్ చేసి పెట్టిన పాత పుస్తకాలు, ఆర్టికల్స్ నుంచి మరో పదాన్ని ఇస్తుంది. మనం ఈ రెండు పదాలను నమోదు చేస్తే వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పదాలన్నీ డిజిటలైజ్ పాత పుస్తకాలు, ఆర్టికల్స్ను స్కాన్ చేసిన ఈ పదాలను మనం రీక్యాప్చా ల్లో ఎంటర్ చేస్తుం టాం. మరి అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? కంప్యూటర్ మళ్లీ వాటిని తీసుకెళ్లి వరు సగా అమర్చుతుంది. చివరికి అదంతా డిజిటలైజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తారు కాబట్టి ఇది భారీగా ఉం టుంది. ఎంత అంటే.. అమెరికాలోని న్యూ యార్క్ టైమ్స్ పత్రికలో ఏడాది పాటు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ నాలుగు రోజుల్లో డిజిటలైజ్అయిపోతాయన్నమాట. 2009లో ఈ ‘రీక్యాప్చా’ను కొనుగోలు చేసిన గూగుల్ సంస్థ.. పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్తోంది. కృత్రిమ మేధతో దెబ్బ! 2010–12 తర్వాత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ) బాగా అభివృద్ధి చెందింది. ఎంతగా వంచడం, సాగదీయడం వంటివి చేసినా కూడా అక్షరాలను గుర్తించగల సామర్థ్యం రోబోలు, ప్రోగ్రాములకు సమకూరాయి. అవి క్యాప్చాలను సులువుగా పరిష్కరించడం మొదలుపెట్టాయి. æ2014లో గూగుల్ మెషీన్ లెర్నింగ్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్థాయిలో మార్చిన అక్షరాలను మనుషులు 33 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తే.. ఏఐ ఆధారిత రోబోలు, ప్రోగ్రాములు ఏకంగా 99.8 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగాయి. రీక్యాప్చా వీ2: చిత్రాల సాయంతో.. ఇలా జరగడంతో ఏఐ ఆధారిత ప్రోగ్రాములు, రోబోల నుంచి తప్పించు కునేందుకు వెబ్సైట్లకు చిత్రాలతో కూడిన ‘రీక్యాప్చా వీ2’ను రూపొందించారు. 2015–16 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో కొన్ని చిత్రాలు చూపించి.. అందులో కొన్నింటిని గుర్తించే పరీక్ష పెట్టారు. ఉదాహరణకు.. చిత్రాల్లో ట్రాఫిక్ లైట్లు, రోడ్లు, షెడ్లు, చెట్లు, వాటి భాగాలు ఉన్న వాటిని గుర్తించాల్సి ఉంటుంది. అయితే, గూగుల్ తమ గూగుల్ మ్యాప్స్ను మెరుగుపర్చేందుకు ఈ డేటాను వాడుకుంటుండటం గమనార్హం. æ ఇంత చేసినా కూడా ఏఐ కంప్యూటర్ ప్రోగ్రాములు, రోబోలు వీటినీ సులువుగా గుర్తించడం మొదలుపెట్టాయి. రీక్యాప్చా వీ3: జస్ట్ క్లిక్ చేస్తే చాలు అన్ని రకాల క్యాప్చా పరీక్షలను ప్రోగ్రాములు, రోబోలు పరిష్కరిస్తుండటంతో.. కొత్తగా ‘రీక్యాప్చా వీ3’ని కొంతకాలంగా వినియోగిస్తున్నారు. ఇందులో వినియోగదా రుడు నేరుగా ఎలాంటి పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కేవలం ‘ఐయామ్ నాట్ రోబో’ అని ఉన్న డిక్లరేషన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ‘రీక్యాప్చా వీ3’ కూడా కృత్రిమ మేధ ఆధారంగా పనిచే స్తుంది. ఇది వెబ్పేజీల బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ.. వినియోగిస్తున్నది మనుషులేనా, కాదా అన్నదానిపై నిఘా పెడుతుంది. ఉదాహరణకు మౌస్తో అత్యంత వేగంగా, అత్యంత కచ్చితంగా క్లిక్స్ చేయడం, వేగంగా టైపింగ్ చేయడం, చకచకా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడం వంటి రోబోలు చేసే పనులు.. వీటి ఆధారంగా అది మనిషా, రోబోనా అని గుర్తిస్తుందన్నమాట. చూశారుగా.. మనం రోబో కాదని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయాసలు పడాల్సి వస్తోందో.. చదవండి: ఈ యాప్స్తో ఒత్తిడి పరార్..! -
కంప్యూటర్ టైపింగ్లో తప్పులెందుకొస్తాయో తెలుసా?
చాలామంది గంటలతరబడి అలాగే కంప్యూటర్ ముందు కూర్చుని టైపింగ్ వంటి పనిచేస్తుంటారు. అలా చేస్తున్న క్రమంలో ముందు కాసేపు బాగానే ఉండి... ఆ తర్వాత తప్పులు ఎక్కువగా దొర్లుతుంటాయి. దీనికో కారణం ఉంది. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోష్చర్లో కూర్చుంటే అది ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితికి దారితీస్తుంది. కొందరిలో కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్నా కొద్దిసేపట్లోనే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు కంప్యూటర్పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటికోసారి లేచి కాసేపు తిరగాలి. అలాగే కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు తప్పుల సంఖ్య తగ్గుతుంది. చదవండి: ఏసీ వాడుతున్నారా? ఇవి మీకోసమే -
రెండు వేల ఏళ్ల నాటి కంప్యూటర్!
ఏమైనా అంటే, ‘ఇప్పుడంతా కంప్యూటర్మయం’ అంటుంటాం. నిజానికి రెండు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు ఖగోళ సంబంధ విషయాల శోధనకు ఉపకరించే శక్తిమంతమైన కంప్యూటర్ను తయారుచేశారు. దీని గురించి ఎలా తెలిసింది అంటే... 1901లో అంటికితెర తీరం(దక్షిణ గ్రీకు దీవులు)లో ఓడ శిథిలాల్లో ఒక ఆసక్తికరమైన వస్తువు అవశేషాలను కనుగొన్నారు. ఆ వస్తువుపై వందసంవత్సరాలకు పైగా పరిశోధనలు సాగాయి. ఎట్టకేలకు యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసీఎల్) శాస్త్రవేత్తలు దీని మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించారు. ‘విశ్వానికి కేంద్రం భూమి’ అనే భూకేంద్ర సిద్ధాంతంతో పాటు ఆ కాలంలో ఉనికిలో ఉన్న రకరకాల నమ్మకాల ఆధారంగా గ్రీకు శాస్త్రవేత్తలు ఈ కంప్యూటర్ను రూపొందించారు. వర్కింగ్ గేర్ సిస్టంతో అలనాటి కంప్యూటర్ డిజిటల్ నమూనాను తయారుచేసి, ఒకప్పటి ఎక్స్–రే డేటా, ప్రాచీన గ్రీకు గణితశాస్త్ర పద్ధతుల ఆధారం గా ఈ పరికరం పనీచేసే తీరు (యాంటిక్ తెర మెకానిజం), ఖగోళ విషయాలను ఎలా అంచనా వేసేవారు.... మొదలైన వాటి గురించి యుసీఎల్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. చదవండి: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాద గ్రహశకలం! -
డిజిటల్ చదువు.. కంటికి బరువు
అంటే పరోక్షంగా ఇది వారి కళ్లకు కూడా పరీక్షా కాలమే.. ముఖ్యంగా డిజిటల్ లెర్నింగ్ సర్వసాధారణంగా మారిన పరిస్థితుల్లో రాత్రి పగలూ తేడా లేకుండా కళ్లను తప్పని సరి శ్రమపెట్టాల్సిన విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగర్వాల్స్ ఐ హాస్పిటల్కు చెందిన కన్సెల్టంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మాధవి మాజేటి సూచిస్తున్నారు. ఆమె అందిస్తున్న సూచనలివే... సాక్షి, సిటీబ్యూరో: సాధారణ సమయాల్లోనే గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్కు కళ్లను అతికించేసే విద్యార్థులు కంటి ఆరోగ్యం గురించి తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. మరోవైపు పరీక్షల సమయంలో వారి చదువులు కూడా ఆన్లైన్ ఆధారితం కావడం, ఇంటర్నెట్ నుంచి మెటీరియల్ తీసుకుని వారి ప్రాజెక్టులు సబ్మిట్ చేయాల్సి ఉండటం వల్ల దీర్ఘకాలం కంప్యూటర్ స్క్రీన్ల పైనే దృష్టి నిలపడంతో కంటి సమస్యలు ఈ సీజన్లో మరింత పెరుగుతున్నాయి. కంప్యూటర్స్, ట్యాబ్స్, ప్యాడ్స్, మొబైల్ ఫోన్స్.. ఇవన్నీ సమస్యల కారకాలే కాగా కంటి సమస్యల లక్షణాలు స్పష్టంగా కనపడతున్నాయి. పరీక్షల సమయం కదాని వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీస్తాయి. ఐస్ట్రెయిన్ నుంచి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దాకా.. దీర్ఘకాలం పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లకు అతుక్కుపోయి ఉండటం కారణంగా ఈ సమస్య వస్తోంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, దురద, ఎర్రబడటం, మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా చూపు మసకబారుతోంది. దృష్టి నిలపడం కష్టతరమవుతోంది. నిద్రలేమి సమస్య రావచ్చు. తెలియని అలసట ఆవరిస్తుంది. దీర్ఘకాలం పాటు కంప్యూటర్ స్క్రీన్లపై నిలిపే దృష్టి, కళ్లను తరచూ అటూ ఇటూ తిప్పడం, వేగంగా ఇమేజెస్ మార్చి మార్చి చూడటం.. కంటి కండరాలను అలసటకు గురి చేస్తాయి. రెటీనా ఇబ్బందులు, కాటరాక్టస్ వగైరా సమస్యలకు కారణమవుతోంది. దీనినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. మార్పులు చేర్పులు అవసరం.. కంప్యూటర్ స్క్రీన్లో బ్రైట్ నెస్, ఫాంట్ సైజ్ తగ్గించడం, మానిటర్ హైట్ కంటిచూపునకు తగ్గట్టు అమర్చుకోవడం, స్క్రీన్కు కళ్లకు మధ్య దూరం సరిచూసుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. ఆప్తమాలజిస్ట్కు చూపించుకుని అవసరమైతే కంటి అద్దాలు తప్పక ఉపయోగించాలి. అలాగే నిర్విరామంగా స్క్రీన్ను చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు అనే 20–20–20 రూల్ ప్రకారం దృష్టిని మళ్లిస్తుండాలి. తరచూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. అరచేతుల్ని రుద్ది వెచ్చగా మారాక మూసిన కళ్ల మీద పెట్టుకోవడం వంటి మసాజ్లు కూడా సహజమైన పద్ధతిలో ఉపకరిస్తాయి. సుదీర్ఘంగా స్క్రీన్ను చూడకుండా ప్రతి అరగంటకూ బ్రేక్ తీసుకోవాలి. -
పల్లెకింకా పాకాలె..
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ, పట్టణ భారతాల మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉందని తేలింది. ‘హౌస్హోల్డ్ సోషల్ కన్జంప్షన్: ఎడ్యుకేషన్’పేరుతో 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు 4 దశల్లో నిర్వహించిన 75వ రౌండ్ సర్వేను ఎన్ఎస్వో ఇటీవల విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఎన్ఎస్వో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాలను పలకరించి సమాచారం సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 8,097 గ్రామాలతో పాటు 6,188 పట్టణ బ్లాకుల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని ప్రతి కుటుంబం వినియోగిస్తున్న కంప్యూటర్ లెక్కలతో పాటు విద్యకు సంబంధించిన పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఇంట్లో కంప్యూటర్ను కలిగి ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అది 23.4 శాతమని తేలింది. ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను వినియోగించే వారి శాతం 14.9గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 42 శాతంగా ఉంది. వయసులోనూ ఆంతర్యం.. వయసు రీత్యా పరిశీలిస్తే ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అదే సమయంలో 13 శాతం ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించే వెసులుబాటును కలిగి ఉన్నారు. గత 30 రోజుల్లో ఇంటర్నెట్ను క్రమం తప్పకుండా ఉపయోగించిన వారి శాతం 10.8గా నమోదైంది. అదే పట్టణ ప్రాంతాలను పరిశీలిస్తే 32.4 శాతం మందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉందని, 37.1 శాతం మంది ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండగా, అందులో 33.8 శాతం మంది గత 30 రోజుల్లో క్రమం తప్పకుండా ఇంటర్నెట్ను వినియోగించారని ఎన్ఎస్వో సర్వేలో తేలింది. ఎన్ఎస్వో సర్వేలోని అంశాలు.. – ఏడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో అక్షరాస్యతా శాతం: 77.7 – అక్షరాస్యతా శాతం: గ్రామీణ ప్రాంతాల్లో 73.5, పట్టణ ప్రాంతాల్లో 87.7 – 15 ఏళ్లు నిండిన వారిలో సెకండరీ విద్య పూర్తి చేసిన వారి శాతం: 30.6 (గ్రామీణ), 57.5 (పట్టణ) – ఇదే వయసు నిండిన వారిలో గ్రాడ్యుయేషన్ చదివిన వారి శాతం: 5.7 (గ్రామీణ), 21.7 (పట్టణ) – పాఠశాలల్లో అసలు పేర్లు నమోదు కాని వారి శాతం: 15.7 (గ్రామీణ), 8.3 (పట్టణ) – ప్రాథమిక స్థాయిలో పాఠశాలలకు హాజరవుతున్న వారి శాతం: 86.1 – జనరల్ కోర్సులు చదువుతున్న వారు: 96.1 శాతం – టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు: 3.9 శాతం – జనరల్ కోర్సుల్లో చదువుతున్న వారికి సగటున ఏడాదికి అవుతున్న ఖర్చు: గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5,240, పట్టణ ప్రాంతాల్లో రూ. 16,308. -
మెదడును కంప్యూటర్తో అనుసంధానం..
ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో మనిషి ఆలోచనలు కూడా సూపర్ఫాస్ట్ అయిపోయాయి.అయితే మన ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. లైట్ వేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్నైనా వాడాలి. కానీ ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్ట్స్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో ఈ సరికొత్త ప్రాజెక్టుకు ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
తలచినదే.. జరుగునులే..!
రవి గాంచని చోటనూ కవి గాంచును.. అంటే మనిషి ఆలోచన సూపర్ఫాస్ట్ అన్నమాట. కానీ ఈ ఆలోచనలు ఆచరణలోకి రావాలంటే కొంత టైమ్ పడుతుంది. లైట్ వేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్నైనా వాడాలి. ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్స్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో కేవలం ఆలోచనలతోనే డ్రోన్లు నడిపించేందుకు గాను ఏడాది క్రితమే ఈ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కంప్యూటర్కు మెదడు అనుసంధానం.. డ్రోన్లు లేదా డ్రోన్ల గుంపులను కూడా ఆలోచనలతోనే నియంత్రించడం.. తద్వారా యంత్రాలతో పనిచేసే అవసరాన్ని తప్పించాలన్నది ఈ కొత్త ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా మన మెదడును కంప్యూటర్కు అనుసంధానించే (బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, క్లుప్తంగా బీసీఐ) ఓ పరికరాన్ని తయారు చేస్తారు. ఈ పరికరాన్ని తగిలించుకున్న సైనికులు ఎక్కడో దూరంగా ఎగురుతున్న డ్రోన్లు ఏ దిశగా వెళ్లాలి? ఎంత వేగంగా వెశ్లాలి? బాంబులు ఎప్పుడు వదలాలి? వంటి అంశాలను తమ ఆలోచనలతోనే నియంత్రిస్తుంటారు. తరంగాలను ఒడిసిపట్టడమే లక్ష్యం.. డార్పాకు చెందిన నాడీ శాస్త్రవేత్త అల్ ఎమోండీ నేతృత్వంలో ఏడాది క్రితం ఈ సరికొత్త ప్రాజెక్టు మొదలైంది. అయితే ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని 6 యూనివర్సిటీలు/పరిశోధన సంస్థలు కూడా వేర్వేరుగా బీసీఐ తయారీ కోసం పరిశోధనలు ప్రారంభించాయి. పెంటగాన్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 600 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విద్యుత్, అ్రల్టాసౌండ్ సంకేతాలతో బీసీఐని తయారు చేసేందుకు ప్రయతి్నస్తుండగా, పరారుణ కిరణాల సాయంతో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలు చేస్తోంది. మన మెదడులోని ఆలోచనలు సూక్ష్మ విద్యుత్ తరంగాల రూపంలో ఉంటాయని మనకు తెలుసు. ఈ తరంగాలను కచ్చితంగా ఒడిసిపట్టి.. అందులో దాగున్న సమాచారాన్ని ఆదేశాలుగా మార్చడం బీసీఐ ప్రధాన లక్ష్యం. నరాలు చచ్చుబడిపోయిన వారిలో మళ్లీ చైతన్యం కలిగించేందుకు ఇప్పటికే బీసీఐ ఈ తరహా యంత్రాలను వాడుతున్నా.. వాటిని అమర్చేందుకు శస్త్రచికిత్స మినహా మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో అసలు శస్త్రచికిత్స అవసరం ఏమాత్రం లేని యంత్రాన్ని తయారు చేస్తే ఆలోచనలను అత్యంత వేగంగా పనులుగా మార్చవచ్చని డార్పా యోచిస్తోంది. ఎన్నోశేష ప్రశ్నలు.. మెదడు ఆలోచనలను పనులుగా మార్చేందుకు బీసీఐ తయారైతే లాభాలు ఎన్ని ఉంటాయో ఇప్పటికైతే తెలియదుగానీ.. శాస్త్రవేత్తల్లో సందేహాలు మాత్రం బోలెడు. బీసీఐ ధరించిన సైనికుడు అనుకోకుండా తప్పుడు ఆలోచన చేస్తే పరిణామాలు ఏంటి? శత్రు సైనికులకు ఈ బీసీఐలు దొరికితే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు మచ్చుకు కొన్నే. అయితే నాణేనికి మరోవైపున ఈ బీసీఐలతో ఎన్నో ఉపయోగాలూ ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. మిలటరీ అవసరాలకు తయారైన టెక్నాలజీలు సాధారణ పౌర జీవితంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, జీపీఎస్, ఇంటర్నెట్ వంటివి వీటికి ఉదాహరణలని వారు గుర్తుచేస్తున్నారు. బీసీఐలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్లు మొదలుకొని ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాలన్నింటినీ ఆలోచనలతోనే నియంత్రించవచ్చు. పక్షవాతం వచి్చన వారు, లేదా ప్రమాదాల కారణంగా చక్రాల కురీ్చకి మాత్రమే పరిమితమైన వారు కూడా తమ ఆలోచనల శక్తితో మళ్లీ నడిచేందుకూ అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ సాకారమయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చుగానీ.. అసాధ్యమైతే కాకపోవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్
పారిస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్ ‘సికామోర్ మెషీన్’ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని బుధవారం తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అంటారు. గూగుల్ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది. సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. ఇందులోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్ క్యూబిట్స్ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్ ప్రాసెసర్ 54 క్యూబిట్స్ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వకారణమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్చేశారు. -
కంప్యూటర్ గణేశుడు..
అమీర్పేట: వినాయక వేడుకల్లో భాగంగా అమీర్పేటలో కంప్యూటర్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజశేఖర్ కంప్యూటర్ పరికరాలను ఉపయోగించి గణనాథుడిని తయారు చేశారు. పాస్పోర్టు కార్యాలయం సమీపంలో వెలసిన ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. -
అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్లైన్లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000– 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో యాపిల్ తొలి విడతలో తయారు చేసిన 200 యాపిల్–1 కంప్యూటర్స్లో ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికొచ్చింది. యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ దీన్ని రూపొందించారు. ‘అప్పట్లో సుమారు 200 యాపిల్–1 కంప్యూటర్స్ను తయారు చేశారు. 666.66 డాలర్ల ధరకు విక్రయించారు. 1977లో రేటును 475 డాలర్లకు తగ్గించారు. అదే ఏడాది ఆఖరు నాటికి యాపిల్– ఐఐ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత నుంచి యాపిల్–1 అమ్మకాలను నిలిపివేశారు‘ అని క్రిస్టీస్ సంస్థ పేర్కొంది. 1977 అక్టోబర్లో యాపిల్–1 అమ్మకాలను నిలిపివేసిన తర్వాత వాటిని కొనుక్కున్న వారు తిరిగి ఇస్తే కొంత డిస్కౌంటుతో కొత్త కంప్యూటర్ను కొనుగోలు చేసే ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. అలా తిరిగొచ్చిన వాటిలో చాలామటుకు కంప్యూటర్స్ ధ్వంసం కాగా.. యాపిల్–1 కంప్యూటర్స్లో సుమారు సగం మాత్రమే మిగిలాయి. వీటినే క్రిస్టీస్ ప్రస్తుతం అమ్మకానికి తెస్తోంది. -
దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లోకి చొరబడవచ్చు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు. -
హార్డ్డిస్క్లకు కాలం చెల్లినట్లేనా?
కంప్యూటర్లు, ల్యాప్టాపలలో బోలెడంత బరువుండే హార్డ్ డిస్క్లకు ఇక కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటారా? శ్యాంసంగ్ కంపెనీ ఏకంగా నాలుగు టెరాబైట్ల సమాచారాన్ని ఇముడ్చుకోగల మెమరీ కార్డును ఆవిష్కరించింది మరీ! అంతేకాదు.. ఈ మెమరీ డివైజ్లోకి ఏదైనా ఫైల్ను నిక్షిప్తం చేయడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. సెకనుకు 540 మెగాబిట్ల వేగంతో ఫైళ్లను చదవడం.. 520 మెగాబిట్ల వేగంతో రాయడం చేస్తుంది ఈ మెమరీ కార్డు. ఇంకోలా చెప్పాలంటే ఒకే రెండు సెకన్లలో ఓ మోస్తరు హెచ్డీ సినిమా మొత్తాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక్కో మెమరీ సెల్లో తాము మూడు స్థానంలో నాలుగు బిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలిగామని ఇందుకోసం మూడు బిట్ల ఎస్ఎస్డీ కంట్రోలర్, టర్బోరైట్ టెక్నాలజీలను వాడామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ మెమరీ కార్డులో 64 పొరలున్న వీ–ఎన్ఏఎన్డీ మైక్రోప్రాసెసర్లు 32 వాడామని ఫలితంగా ఇతర నాలుగు టెరాబైట్ల సామర్థ్యం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలదని చెప్పారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 2.5 అంగుళాల సైజు డ్రైవ్లకు కొత్త 4 టెరాబైట్ల మెమరీకార్డు తోడవనుందని.. ఇదే టెక్నాలజీతో తాము స్మార్ట్ఫోన్లలోనూ మెమరీ సామర్థ్యాన్ని పెంచగలమని శాంసంగ్ చెబుతోంది! -
‘ఎఫ్’ నుంచి ‘ఏ’ గ్రేడ్కు!
కన్సాస్: ఎక్కువ మార్కుల కోసం తల్లిదండ్రులు పిల్లలపై తెస్తున్న ఒత్తిడి ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. భారత సంతతికి చెందిన వరుణ్ సార్జా(20) అనే విద్యార్థి అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీలో 2016లో ఇంజనీరింగ్లో చేరాడు. అయితే మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఇంట్లో తల్లిదండ్రులు తిడతారని భయపడ్డ వరుణ్ అడ్డదారి తొక్కాడు. కీస్ట్రోక్ లాగర్ అనే హ్యాకింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి తన గణితం ప్రొఫెసర్ కంప్యూటర్ను హ్యాక్ చేశాడు. అనంతరం పరీక్షల్లో తనకు వచ్చిన ‘ఎఫ్’ గ్రేడ్ను ‘ఏ’ గ్రేడ్గా మార్చుకున్నాడు. ఇదే తరహాలో మిగిలిన 9 సబ్జెక్టుల్లోనూ ఏ గ్రేడ్ వచ్చినట్లు హ్యాక్ చేయగలిగాడు. అయితే గణితంలో ఎన్నడూ మంచిమార్కులు తెచ్చుకోని సార్జాకు ఏకంగా ‘ఏ’ గ్రేడ్ రావడంపై అకడమిక్ అడ్వైజర్కు అనుమానం వచ్చి మార్కుల్ని తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సార్జాకు ఇక్కడి కోర్టు 18 నెలల జైలుశిక్ష విధించింది. -
బియ్యం కన్నా చిన్న కంప్యూటర్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ను అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఇది బియ్యం గింజ కన్నా చాలా చిన్నది. ‘మిషిగాన్ మైక్రో మోట్’గా పిలుస్తున్న ఈ చిట్టి కంప్యూటర్ పనిచేసే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంది. సంప్రదాయ కంప్యూటర్లను ఆఫ్ చేసిన తరువాత కూడా వాటిలోని సమాచారం అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ను ఒకసారి స్విచాఫ్ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. ఈ సూక్ష్మ కంప్యూటర్లో ర్యామ్, కాంతి విద్యుత్ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వైర్లెస్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్లను అమర్చారు. పరిమాణంలో చిన్నవి కావడంతో వీటిలో ఆంటెనాకు బదులుగా కాంతి సాయంతో సమాచార మార్పిడి జరిగే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కంప్యూటర్ను కేన్సర్ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు. -
ఆసక్తి, పట్టుదలే అతని విజయ రహస్యం...
తిరువనంతపురం, కేరళ : అందరికి తల్లిదండ్రులు పేరు పెడితే అతనికి మాత్రం కంప్యూటరే పేరు పెట్టింది. కేవలం నామకరణతోనే ఆగక ఆ యువకుడి జీవిత చిత్రాన్నే మార్చేసింది. సొంత ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో పాటు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కంపెనికి యజమాని అయ్యేలా చేసింది. కంప్యూటర్ పట్ల ఆ యువకుడికి ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎన్నుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువు చేసాడు కేరళ కన్నూర్కు చెందిన 21 ఏళ్ల జవాద్. కంప్యూటర్ను మంచికి వినియోగిస్తే కలిగే ప్రయోజనాలకు సజీవ ఉదాహరణగా నిలిచాడు జవాద్. ఎవరీ జాదవ్...ఏమిటితని కథ...? కేరళ ఉన్నార్కు చెందిన జవాద్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. జవాద్ తండ్రి దుబాయిలో బ్యాంక్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో ఓ సారి ఇండియా వచ్చినప్పుడు జవాద్కు కంప్యూటర్ను బహుమతిగా ఇవ్వడమే కాక దానికి ఇంటర్నెట్ కనెక్షన్ను కూడా పెట్టించాడు. అదే జవాద్ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అనాటి నుంచి కంప్యూటర్తో ప్రేమలో పడిపోయాడు జవాద్. ఇక ఆరోజు నుంచి కంప్యూటర్కు బానిసయ్యాడు(మంచి వ్యసమే..). ఒక సారి తన పేరుతో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే క్రమంలో కంప్యూటర్ జవాద్ పేరును ‘టీఎన్ఎమ్ జవాద్’గా సజెస్ట్ చేసింది. ఆ పేరే నేడు ఎన్నో ప్రభంజనాలు సృష్టిస్తోంది. జవాద్ పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే కంప్యూటర్తో ప్రయోగాలు ప్రారంభించాడు. అంత చిన్న వయసులోనే వెబ్సైట్లు రూపొందించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించాడు. అలా పదో తరగతిలోనే 2,500 రూపాయల తొలి సంపాదనను అందుకున్నాడు జవాద్. ఒక్కసారిగా జవాద్ దగ్గర అంత సొమ్ము చూసిన అతని తల్లిదండ్రులకు భయమేసింది. తమ కుమారుడు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడేమోనని భయపడ్డారు. కానీ జవాద్ వారికి తాను ప్రారంభించిన వ్యాపారం గురించి వివరించాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో వెబ్ డిజైనింగ్ను మరింత బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్లో చేరాడు. కోర్సు అయిపోయిన తర్వాత తనకు వెబ్డిజైనింగ్ పాఠాలు చెప్పిన టీచర్లను తాను ప్రారంభించబోయే కంపెనీలో ఉద్యోగులుగా చేరమని కోరాడు. అందుకు వారు అంగీకరించడంతో వారిద్దరిని ఉద్యోగులుగా నియమించుకుని ‘టీఎన్ఎమ్ ఆన్లైన్ సొల్యూషన్న్’అనే వెబ్డిజైనింగ్ సంస్థను స్థాపించాడు. ప్రారంభంలో కేవలం వెయ్యి రూపాయల తక్కువ ధరకే వెబ్సైట్లను రూపొందించేవారు. అయినా కూడా నెలకు కేవలం 2,3 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్ తన అమ్మగారి బంగారు గాజులను కూడా కుదవపెట్టాడు. క్లైంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ..రెండేళ్ల నాటికి 100 వరకూ చిన్నా చితకా కంపెనీలు జవాద్ క్లయింట లిస్ట్లో చేరాయి. సరిగా ఇదే సమయంలో నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్ కేరళ సమ్మిట్లో జవాద్ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్లో పాల్గొనడం జవాద్కు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల జవాద్ కంపెనీ గురించి చాలామందికి తెలియడమే కాక మరిన్ని ఆఫర్లు రావడం ప్రారంభమయ్యింది. కంపెనీ బాగా నడవడంతో లాభాలు కూడా ఆశించిన రీతిలోనే వచ్చాయి. దాంతో జవాద్ తన సొంత ఇంటి కలను నిజం చేసుకోవడమే కాక చాలా ఖరీదైన బీఎమ్డబ్ల్యూ కార్ను కూడా కొన్నాడు. మరో కీలక మలుపు... వీటన్నిటి తర్వాత వెబ్ ప్రపంచానికి కీలకమైన ‘సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్’(ఎస్ఈవో) రంగంలోకి తన సేవలను విస్తరించాడు జవాద్. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యువ కెరటం. ఇతని ప్రతిభకు గుర్తుగా యూఏఈ, బిస్టౌడ్ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘డా. రామ్ బుక్సానీ’ అవార్డును జవాద్కు ప్రదానం చేసారు. ప్రస్తుతం జవాద్ వెబ్ డిజైనింగ్, ఆప్ డెవలప్మెంట్, ఈ కామర్స్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా క్లైంట్లను ఏర్పర్చుకున్నాడు. ఇవేకాక జవాద్ ప్రస్తుతం ‘టీఎన్ఎమ్ అకాడమీ’ని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వయసుతో సంబంధం లేకుండా వెబ్డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఆసక్తి ఉన్న రంగంలో పట్టుదలగా ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది జావేద్ జీవితం. -
టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. చావుకు దగ్గరైనట్టే
మాంచెస్టర్ : తీరిక సమయంలో చాలా మంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్ కావడానికి అయితే ఫరవాలేదు కాని అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వటమే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టీవీ తెరను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్లాండ్కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ గ్లస్గో’’ జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గ్లస్గో విశ్వవిద్యాలయం దాదాపు 4 లక్షల మందితో అతిపెద్ద సర్వేని నిర్వహించింది. శారీరికంగా దృఢంగా లేని వాళ్లు, కండరాళ్ల సత్తువ లేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఎక్కువ సేపు అలా టీవీ తెరను చూస్తూ ఉండటం వల్ల గుండె సంబంధ, ప్రేగు క్యాన్సర్, డయాబెటీస్, ఒబిసిటీ వంటి వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం టీవీ తెరకు మాత్రమే కాదు కంప్యూటర్ తెరకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం విషయానికి వస్తే అందరిపై ఒకే విధంగా ఉండదు. టీవీ, కంప్యూటర్ ను చూస్తున్నపుడు ఎంత విరామం తీసుకుంటున్నారు. శారీరకంగా వారు ఎంత బలంగా ఉన్నారు, ఆరోగ్యపు అలవాట్లు , శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. -
వ్యక్తిగత గోప్యత మన హక్కు: నాదెళ్ల
సియాటెల్: ప్రపంచమంతా కంప్యూటర్మయం అయిపోయిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, మానవ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక విలువలు, మౌలిక సూత్రాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2018 కాన్ఫరెన్స్ ప్రసంగంలో.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వేలమంది సాఫ్ట్వేర్ డెవలపర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత గోప్యత మానవ హక్కు. మైక్రోసాఫ్ట్లో మనమంతా ఈ హక్కులను కాపాడాలనే మూల సూత్రానికే కట్టుబడి పనిచేస్తున్నాం. మనం డేటా వినియోగించినపుడు అది వినియోగదారుడికి మేలు చేస్తుందనే భరోసాను మనం కల్పించగలగాలి. వ్యక్తిగత వివరాలన్నీ తన నియంత్రణలో ఉన్నట్లు యూజర్కు భరోసా కల్పించాలి. కంప్యూటర్లు ఏం చేయగలవు? ఏం చేయాలి? అనే దాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి.అదే నైతిక కృత్రిమ మేధ’ అని అన్నారు. -
ప్రజా సందర్శనకు హాకింగ్ కుర్చీ, కంప్యూటర్
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. -
ఆధార్ లీకేజీ కలకలం!
న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరో రుజువు దొరికింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఓ కంప్యూటర్లో ఆధార్ కార్డు ఉన్న వారి వ్యక్తిగత సమాచారం, పేర్లు, 12 అంకెలుండే ఆధార్ నంబర్తోపాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా లభ్యమయ్యాయని బిజినెస్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ జెడ్డీ నెట్ తెలిపింది. అయితే, ఏ సంస్థ కంప్యూటర్లలో ఇలా ఆధార్ సమాచారం దొరుకుతోందో జెడ్డీ నెట్ వెల్లడించలేదు. అయితే, ఈ పరిణామం ఆధార్ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఆధార్ వివరాలు తెలుసుకునేందుకు ముందుగా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ను గుర్తించాల్సి ఉంటుంది..దీనిని కేవలం 20 నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల కంప్యూటర్లలో ఇటువంటివి జరుగుతున్నట్లు తెలిసినా వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అయితే, ఆధార్ సమాచారం లీకవుతోందంటూ వచ్చిన వార్తలను యూఐడీఏఐ ఖండించింది. ఆధార్ వివరాలకు పూర్తి భద్రత, రక్షణ ఉందని తెలిపింది. లీకేజీ వాస్తవమనుకున్నప్పటికీ వెల్లడైన సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినదై ఉంటుందనీ, దానికి ఆధార్తో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆధార్ సంఖ్య తెలిసినా∙పూర్తి వ్యక్తిగత సమాచారం లీకయినట్లు కాదని పేర్కొంది. -
‘కంప్యూటర్’ నగరం!
ఈ ఫొటోను ఓ సారి పరిశీలించండి.. ఏముంది కంప్యూటర్లోని చిప్స్, ట్రాన్సిస్టర్లే కదా అనుకుంటున్నారా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ నగరం ఉంటుంది. అవును ఈ ఫొటోలో ఉన్నది మన్ హట్టన్ నగరం. అదేంటి నిజంగా ఆ నగరం అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారా..? అది నిజమైన నగరం కాదు కానీ.. అమెరికాలోని న్యూయార్క్ పక్కనే ఉండే మన్హట్టన్ను పోలి ఉండేలా నిర్మించారు. కంప్యూటర్లోని పనికిరాని వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఓ స్కూల్ పిల్లాడు. జింబాబ్వేకు చెందిన జేడ్ మెంక్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ నగరాన్ని రూపొందించేందుకు 3 నెలల సమయం తీసుకున్నాడట. అది కూడా 0.0635:100 నిష్పత్తిలో చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నగరాన్ని తీర్చిదిద్డాడు. ఇదంతా కూడా ఆ పిల్లాడి స్కూల్ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడి మరీ తయారు చేశాడు. ఇందుకోసం 27 మదర్బోర్డులు, 11 సీపీయూలు, 10 సీఆర్టీ మానిటర్ మదర్బోర్డులు, 18 ర్యామ్ స్టిక్లు, 12 నోకియా ఈ–సిరీస్ ఫోన్లు, 4 వాచ్లు, 4 ఆడియో కార్డులు, 2 టెలిఫోన్లు ఇలా వాడి పాడేసిన వస్తువుల సాయంతో తయారు చేశాడు. మన్హట్టన్లోని భవంతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఒక్కటేమిటి అచ్చు ఆ నగరాన్ని పోలినట్లే ఆ పిల్లాడు తయారు చేశాడు. ఇదంతా తయారు చేయడానికి మంచి తెలివితో పాటు ఎంతో ఓపిక ఉండాలి కదా..! -
అదేపనిగా కూర్చొనే ఉంటున్నాను... ఆరోగ్యం చెడకుండా సలహా ఇవ్వండి
నేను ఐటీ ప్రొఫెషన్లో ఉన్నాను. ఒకసారి ఆఫీసులోకి వచ్చాక నేను నా కంప్యూటర్ ముందు కూర్చున్నాననంటే మళ్లీ సాయంత్రం వరకూ లేచే పరిస్థితి ఉండదు. అంతంత సేపు అదేపనిగా కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్ అంటున్నారు. వారనేది వైద్యపరంగా కరక్టేనా? నా ప్రొఫెషన్ను దృష్టిలోపెట్టుకొని, నా ఆరోగ్యం కాపాడుకోడానికి తగిన సలహాలు ఇవ్వండి. – సమీర్, హైదరాబాద్ కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చొనే ఉండటం చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, వృత్తిపరంగా బైక్మీద కూర్చొనే చాలాసేపు ప్రయాణం చేస్తూ ఉండటం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం అవసరం. పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్లో నిమగ్నం కావడం అనే కారణాలతో అదేపనిగా కూర్చొనే ఉంటారు. ఇక పెద్దలు తమ ఆఫీసు పనుల్లో మునిగిపోయి కూర్చొనే ఉంటారు. కొన్ని సూచనలు : ∙మీ బెడ్రూమ్స్లో టీవీ / కంప్యూటర్ / ల్యాప్టాప్ లను ఉపయోగించకండి ∙మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి పిల్లలకు మీరు ఇచ్చే బహుమతుల్లో పిల్లలకు శారీరక ఆరోగ్యం చేకూర్చే బంతులు / ఆటవస్తువుల వంటివి ఉండేలా చూసుకోండి ∙మీరు ఆఫీసుకు వచ్చే ముందర లోకల్ బస్సుల్లో, లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేసేవారైతే ఆ టైమ్లో కూర్చుని ప్రయాణం చేయకండి. ∙ఎస్కలేటర్ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి ∙రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ∙మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్ తీసుకోండి ∙మీకు దగ్గరి కొలీగ్స్తో మాట్లాడాల్సి వస్తే మొబైల్ / మెయిల్ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడండి వ్యాయామంతో నిద్రపడుతుందా... పట్టదా? నేను దాదాపు రోజుకు 14 గంటలు కూర్చొనే పనిచేస్తుంటాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు. నేను సందిగ్ధంలో ఉన్నాను. దయచేసి సలహా ఇవ్వండి. – అనిల్కుమార్, విశాఖపట్నం మీరు విన్న రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్సైజ్కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కాల్ చేస్తే ‘కనిపెట్టేస్తారు’!
సాక్షి, హైదరాబాద్:నగరంలోని అబిడ్స్ ప్రాంతం. ఓ వ్యక్తికి హఠాత్తుగా ఆపద ఎదురైంది. వెంటనే ‘డయల్–100’కు కాల్ చేశాడు. ఆపై తను ఎక్కడ ఉన్నాడో చెప్పే పరిస్థితుల్లో అతడు లేడు. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో నగర పోలీసులకు ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘డయల్–100’వ్యవస్థను ఆధునీకరిస్తోంది. బాధితుడు కాల్ చేసిన వెంటనే అతడు ఉన్న ప్రాంతాన్నీ తక్షణం గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని.. మూడు నెలల్లో నగరంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రెస్పాన్స్ టైమ్ తగ్గించడమే లక్ష్యం.. బాధితుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎంత త్వరగా వారి వద్దకు చేరితే అంత ఎక్కువ మేలు జరిగే ఆస్కారం ఉంది. దీన్నే సాంకేతికంగా ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరడానికి నగరంలో గస్తీ విధులు నిర్వర్తించే రక్షక్, బ్లూకోల్ట్స్కు ‘రెస్పాన్స్ టైమ్’నిర్దేశిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే గస్తీ వాహనాలను ‘డయల్–100’తో అనుసంధానించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఆధారంగా పనిచేసే ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే బాధితులు ఉన్న ప్రాంతాన్ని (లొకేషన్) పక్కాగా తెసుకోవాల్సి. ఇది సాధ్యమైతే రెస్పాన్స్ టైమ్ను గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ‘100’కాల్స్ను డైవర్ట్ చేసినప్పటికీ.. బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. గస్తీ వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడంతో ‘100’సిబ్బందికి ఏ వాహనం ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుస్తోంది. బాధితునికి సమీప ప్రాంతంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ కాల్ను డైవర్ట్ చేస్తున్నారు. కాల్ అందుకున్న గస్తీ సిబ్బంది బా«ధితుడిని సమాచారం అడిగి అతను ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు.. ‘100’కు ఎవరైనా కాల్ చేస్తే వారు కచ్చితంగా ఎక్కడ నుంచి చేశారనేది కంప్యూటర్ తెరపై కనిపించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా ‘రెస్పాన్స్ టైమ్’గణనీయంగా తగ్గింది. లొకేషన్ తెలుసుకోవడానికి లింకేజీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ అందించింది. నగర పోలీసులు ఆ సంస్థ ప్రతినిధులతో బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లో బుధవారం సమావేశమయ్యారు. బాధితుడి లొకేషన్ తెలుసుకోవడానికి సెల్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి లింకేజ్ తీసుకోవాలి. మొత్తం 11 సర్వీస్ ప్రొవైడర్ల నుంచి లింకేజ్కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీకి చెందిన సంస్థ అందించనుంది. గరిష్టంగా మూడు నెలల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి నగర పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది అమలైతే బాధితులకు సత్వర సహాయం అందడంతో పాటు బోగస్ కాల్స్కు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు. -
ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధం!
కంప్యూటర్ రంగంలో సరికొత్త విప్లవానికి నాందిగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఐబీఎం 50 క్యూబిట్లతో ఓ క్వాంటమ్ కంప్యూటర్ను సిద్ధం చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తాయన్నది క్వాంటమ్ కంప్యూటర్కు మనం ఇవ్వగల సాధారణ పరిచయం. కణాల తీరును ఆధారంగా చేసుకుని ఇవి పనిచేస్తాయి. సాధారణ కంప్యూటర్లలో ఒక ట్రాన్సిస్టర్ గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’గా, ఆగిపోతే ‘0’గా గుర్తిస్తారని.. ఈ 1, 0లతోనే మొత్తం కంప్యూటర్ లెక్కలు ఆధారపడి ఉంటాయన్నది మనకు తెలిసిందే. ఈ రకమైన డిజిటల్ కంప్యూటర్లలో వృద్ధికి అవకాశాలు తక్కువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నారు. పదార్థపు సూక్ష్మ ప్రపంచాన్ని వివరించే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఒక కణం ఏకకాలంలో భిన్న స్థితుల్లో ఉండగలుగుతుంది. దీన్నే క్యూబిట్ అంటారు. ఇలాంటి కొన్ని కణాలను అనుసంధానించడం ద్వారా వాటితో లెక్కలు కట్టవచ్చునని అంచనా. ఈ నేపథ్యంలో ఐబీఎం దాదాపు 50 క్యూబిట్లతో ఒక కంప్యూటర్ను తయారు చేసినట్లు ప్రకటించింది. క్వాంటమ్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవని ముందుగానే చెప్పుకున్నాం గానీ.. దీన్ని సాధారణ ప్రజలు వాడుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపు వీటితో కొత్త కొత్త మందుల తయారీకి పరిశోధనలు నిర్వహించవచ్చు. అంతేకాకుండా వినూత్న లక్షణాలుండే పదార్థాలను ఆవిష్కరించవచ్చు. సుదూర అంతరిక్ష శోధన కూడా సులువు అవుతుంది.! -
కంప్యూటర్ చూస్తుంటే కళ్లు పొడిగా అవుతున్నాయి...
నా వయసు 39 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్పై వర్క్ చేస్తుంటాను. ఈమధ్య కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు నీళ్లతో కళ్లు కడుక్కుంటున్నాను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – సంపత్కుమార్, హైదరాబాద్ కంప్యూటర్పై ఎప్పుడూ కనురెప్పలను ఆర్పకుండా ఏకాగ్రతతో చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం, కంటికి వచ్చే మెబోమియన్ ఇన్ఫెక్షన్ వంటివి కారణాలు కావచ్చు. వైద్యపరిభాషలో మీ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్య నివారణ కోసం చేయాల్సినవి... ►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు ∙కంప్యూటర్పై పనిచేస్తున్న గదిలో తగినంత తేమ (హ్యుమిడిటీ) ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం రూమ్లో హ్యుమిడిఫైయర్ ఉంచుకోవాలి ∙మీ పనిలో మధ్యమధ్య కంటికి కాస్త విశ్రాంతినివ్వండి మీరు కంప్యూటర్ మీద చదువుతున్నప్పుడు స్క్రీన్ మీకు నేరుగా ఉండాలి. స్క్రీన్ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్పై చూడాల్సి ఉన్నప్పుడు స్క్రీన్కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి మీరు టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. డాక్టర్ను సంప్రదించి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి ∙ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ను అవలంబించండి ∙కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు ∙మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి ∙పొగతాగే అలవాటు తక్షణం మానివేయండి. కార్నియా చుట్టూ తెల్ల అంచు ఏమిటిది? నా వయస్సు 18 ఏళ్లు. రెండేళ్ల కిందట నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ అంచున తెల్ల చారలా కనిపిస్తోంది. కళ్ల డాక్టర్గారికి చూపించాను. ‘డస్ట్ అలర్జీ’ అని ఐ డ్రాప్స్ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ ఎప్పటిలాగే వస్తోంది. ఎన్నోచోట్ల చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. – నవీన, గూడూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే ఇది ‘వీకేసీ’ (వెర్నల్ కెరటో కంజంక్టివైటిస్) అనే అలర్జీతో వచ్చిన సవుస్య అని తెలుస్తోంది. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ‘హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే కాలుష్యాలకు దూరంగా ఉండాలి. ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడితే చాలావుటుకు కళ్లకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మాత్రం దీర్ఘకాలం వాడకూడదు. దీనితో చాలా దుష్పరిణామాలు ఉంటాయి. నాన్స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేనివి) మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు. దీనితో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్కు చూపించుకొని, వుందులు వాడండి. ఇప్పుడు ఈ సమస్యకు వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సవుస్య గురించి మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కళ్లకూ వ్యాయామాలు ఉన్నాయా? దేహంలో అన్ని అవయవాలకు బలం చేకూర్చడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నట్లే కళ్లకూ ఉంటాయా? – సుధీర్, గుంటూరు ఆరోగ్యంగా ఉండటం కోసం సాధారణంగా అందరూ చేసే వ్యాయామాలే కంటికి కూడా మేలు చేస్తాయి. అయితే మీకు ఏవైనా కంటి సమస్యలు అంటే ఉదాహరణకు మెల్లకన్ను గానీ, లేదా లేజీఐ అంటే ఒక కంటిలో చూపు మందగించడం వంటి సమస్య ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. అవి ఈ సమస్యలు ఉన్నవారి చూపు మెరుగుదలకు చాలా తోడ్పడతాయి. అయితే అందరూ చేసుకోడానికి మాత్రం కంటి ఉపశమనం కోసం తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడే కొన్ని వ్యాయామాలూ ఉంటాయి. అవి... కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ద్వారా అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండదు. అవి... ∙తదేకంగా చూడకుండా కంటిని తరచూ అటు ఇటు కదలిస్తూ ఉండటం ∙రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు) ∙బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది ∙యానింగ్ (ఆవలించడం – మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. కళ్లు అలసిపోయి భారంగా ఉన్నప్పుడు ఈ వ్యాయామాలు చేసి, తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
అనుకోని అతిథిని చూసి యాంకర్ షాక్!
-
‘కసబ్’కు కొత్త నిర్వచనం
‘కంప్యూటర్, స్మార్ట్ఫోన్ , బచ్చే’ అని చెప్పిన డింపుల్ జౌన్ పూర్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సంక్షిప్త పదాలతో ప్రత్యర్థి పార్టీ లపై విరుచుకుపడుతుండటం కొనసాగుతోం ది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంధించిన ‘కసబ్’ వాగ్బాణాన్ని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ తిప్పికొట్టారు. ‘క అంటే కాంగ్రెస్ అని బీజేపీ చెబుతోంది. కానీ ‘క’ అంటే కంప్యూటర్ అని మీ అఖిలేశ్ భయ్యా చెప్పారు. ‘స’ అంటే స్మార్ట్ఫోన్ . ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసు కోవచ్చు. ఇక ‘బ్’ అంటే బచ్చే (చిన్నా రులు)’ అంటూ డింపుల్ వివరించారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు ఇస్తామని సమాజ్వాదీ పార్టీ హామీ ఇచ్చింది. గర్భిణులకు ఇంటివద్దనే ఆహార ధాన్యాలు అందిస్తామని డింపుల్ యాదవ్æ హామీ ఇచ్చారు. -
కళ్లు పొడిబారుతున్నాయా?
ఐ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్పై వర్క్ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు వెళ్లి నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – నసీర్ బాషా, హైదరాబాద్ రెప్ప ఆర్పకుండా ఎప్పుడూ తదేకంగా ఏకాగ్రతతో కంప్యూటర్ తెరను చూసేవారికి కన్ను పొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి... l కనురెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా కంప్యూటర్ చూస్తూ ఉండకూడదు. l మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. l చదువుతున్నప్పుడు మధ్య మధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్యమధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు. l మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి. l టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి. l తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలోని వెలుతురుకూ ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్లో హ్యుమిడిఫయర్స్ ఉంచుకోవాలి. డాక్టర్ను సంప్రదించి, ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి. l శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్ గానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల విటమిన్లు (ఏ,బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి. l ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడు కాసేపు తీయండి. l ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ను అవలంబించాలి. l కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు. l మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి. l పొగతాగే అలవాటు, ఆల్కహాల్ తాగే అలవాట్లను తక్షణం మానివేయండి. డాక్టర్రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
మిణుగురు రాంబాబు!
‘‘మా ఫ్రెండ్ ఒకడు బాగా కొడుతుంటాడు రా..?’’ సెస్పెన్స్ మెయింటెయిన్ చేయడానికి నాందిగా మా రాంబాబుగాడు ఈ స్టైలు వాక్య నిర్మాణం చేస్తుంటాడు. అందుకే వాడి ధోరణి పట్ల నాకు మండింది. వాడికీ కాస్త నా మంట అంటేలా చేద్దామని నా ఉద్దేశం. అందుకే వాడికి ఘాటుగా బదులిస్తున్నట్టు... ‘‘ఏంటి పోజులు కొట్టడమా? స్టైలు కొట్టడమా? మాంసం కొట్టడమా లేక కంప్యూటర్ మీద టైప్ కొట్టడమా?. స్పెసిఫిక్గా ఇదీ అని చెప్పాలిరా’’ అన్నాను. ‘‘ఎక్కడున్నావురా బాబు నువ్వు... ఇవన్నీ ఎప్పుడో పాతబడిపోయాయి. సిక్స్ కొట్టడం కూడా సచిన్ నాటికే పాతబడిపోయింది. వాడు ఫేస్బుక్లో ‘లైక్’లు కొడుతుంటాడు. అదీ ఇప్పటి ట్రెండ్’’ అన్నాడు వాడు నా అంచనాలకు అందకుండా. ‘‘అవున్లే... చాలా మంది తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్లు ఫేస్బుక్ను ముఖ పుస్తకం అంటుంటారు. అవునట. అస్తమానం ఆ పుస్తకంలో గడపటం కూడా ఒక వేలం వెర్రిరా...’’ అంటూ ఉండగానే... ‘‘నో... నో... దాన్ని ముఖపుస్తకం అనడమూ తప్పే. దాంట్లో గడపటం వేలం వెర్రీ అనుకోవడమూ తప్పే’’ అంటూ నా మాటలకు అడ్డొచ్చాడు రాంబాబుగాడు. ‘‘మరి ఒప్పు ఏమిట్రా’’ అడిగా. ‘‘దాన్ని కేవలం ముఖ పుస్తకం అనకూడదు రా. ముఖ గ్రంథం అనాలి. అయినా అది పుస్తకం లెవెల్కు చాలా ఎక్కువ. గ్రంథం అనడం కూడా సరైనది కాదనుకో. అదొక ఉద్గ్రంథం. ఒక వాంగ్మయం. ఒక కావ్యం... ఒక ఇతిహా...’’ అంటూ వాడు తన్మయంగా అనబోతుంటే... ‘‘ఒరేయ్... మరీ అంతగా పొగడకు. దాంతో టైమ్ వేస్ట్ తప్ప మరే ఉపయోగమూ లేదు’’ అంటూ నేను రెట్టించబోతుండగా మళ్లీ నా మాటలకు అడ్డొచ్చాడు. ‘‘చూడు గురూ... ఎదురుగా ఉంటే నేను మాట్లాడబోతుంటే ఎందుకో అందరూ తప్పుకు తిరుగుతుంటారు. కానీ ఫేస్బుక్... అదే ముఖ పుస్తకంలో ముఖం చాటేయడానికి అవకాశమే లేదు. పైగా ఫేస్బుక్లో నా ముఖం చూడకుండా నా గురించి తెలియకుండా ఉన్నవాడెవడైనా నన్నే లైక్ చేస్తారు. ఎందుకంటే విచ్చలవిడిగా, ఎలాంటి అరమరికలు లేకుండా నేను ధారాళంగా లైక్లు కొడుతుంటా కాబట్టి...’’ అంటూ చెప్పబోతుంటే ‘‘అసలు అలా లైక్లు కొట్టడంలో ఏదైనా అర్థం ఉంది. నిజంగా బాగుంటే కొట్టాలిగానీ... కానీ నువ్వు కొట్టే లైక్ల ఆధారంగానే నీ గురించి తెలియని వాళ్లు నిన్ను నువ్వు వాళ్ల అభిమానాన్ని అనుమానించాలి’’ అన్నాను. ‘‘ఫేస్బుక్లో ఉన్నవాళ్లకు అవన్నీ ఎందుకు రా. నేను వాళ్లవి లైక్ చేస్తాను. కాబట్టి వాళ్లూ ఇతోధికంగా... బార్టర్ సిస్టమ్లో లాగా నన్నూ లైక్ చేస్తుంటారు. ఇంకో విషయం చెప్పనా?’’ ‘‘చెప్పు’’ ‘‘అసలు నువ్వు ఎప్పుడైనా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నావా? అంతెందుకు నీ సొంతపెళ్లాం పుట్టినరోజైనా గుర్తుండదు కదరా నీకు. కానీ ఫేస్ బుక్ ప్రతిరోజూ ఎవడెవడి పుట్టిన రోజునో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేస్తుంది. దాంతో వాళ్లు నాకు తెలిసిన వాళ్లూ... తెలియని వాళ్లనే తేడా లేకుండా అందరికీ నేను విషెస్ చెబుతా. దాంతో అందరూ నన్నే ఎక్కువ లైక్ చేస్తుంటారు రా. అందుకే నేను నీ కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ అని ఘంటాపథంగా చెప్పగలను. నేనొక స్వేచ్ఛా సైబర్ లైకరిని రా. పైగా నేను త్రికరణశుద్ధిగా ఫేస్బుక్ను ఫాలో అవుతుంటాను’’ అంటూ ఇంకా గొప్పలు చెప్పుకోబోతుండగా అడ్డుతగిలాను నేను. ‘‘ఒరేయ్... అసలు నీకు త్రికరణశుద్ధి అంటే అర్థం తెలుసా?’’ అడిగా. ‘‘ఓ... కానీ నువ్వు అనుకుంటున్న మనస్సు, వాక్కు, కర్మ మాత్రమే కాదు... ఫేస్బుక్ త్రికరణాలు వేరే ఉన్నాయి. మనస్సుకు నచ్చినదాన్ని లైక్ కొట్టడం త్రికరణాలలో మొదటిది, మనసుకు హత్తుకున్న దాన్ని గురించి మాట్లాడటం అనగా కామెంట్ చేయడం రెండోది. ఇక మూడోదీ, అతి ఉన్నతమైనదీ, గొప్పదీ అయిన కర్మ... షేర్ చేయడం. అనగా ఈ మూడింటినీ ఆచరించడమే రా ఫేస్బుక్ త్రికరణాలూ. ఇవే ఫేస్బుక్లోని నువ్వు పెట్టిన ఫొటో లేదా పోస్ట్ లేదా కామెంట్ కింది ఉండేవి. చూశావా నీకూ నాకూ తేడా. నువ్వు ఫేస్బుక్ను యాంత్రికంగా చూస్తావు. కానీ నేను దాన్ని ఒక సత్కర్మలా ఆచరిస్తాను. ఒక వేదాంత ధోరణితో అవలోకిస్తాను. ఇప్పుడు చెప్పు... నేనొక బుక్కర్షినా కాదా’’ అడిగాడు. ‘‘బుక్కర్షి ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. ‘‘ఫేస్బుక్లోనే ఉంటాను కాబట్టి మహర్షి, రాజర్షి టైప్లో మొట్టమొదటిసారిగా ఒక పదాన్ని సృష్టిస్తూ బుక్కర్షి అని నన్ను నేను డిక్లేర్ చేసుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘బుక్కర్షి కాదు గానీ... పుస్తకపు పురుగువు రా నువ్వు’’ అన్నాను నేను వాడిని పురుగులాగే చూస్తూ. ‘‘ఓకే నువ్వనుకున్నదే ఖాయం. కానీ ఫేస్బుక్జ్ఞానంతో వెలిగిపోయే స్వయంప్రకాశం ఉన్న ‘మిణుగురు’పురుగునే రా నేనూ’’ అంటూ మళ్లీ కంప్యూటర్లోని ఫేస్బుక్లో ఫేస్ దాచుకున్నాడు వాడు. - యాసీన్ -
విద్యార్థులకు కంప్యూటర్ బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం 250 మంది ఫ్యాకల్టీల నియామకం ప్రారంభమైన తరగతులు ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ భాస్కర్ దెందులూరు : జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ఇటీవల పునఃప్రారంభమైంది. రెండేళ్ల కిందట అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. పదేళ్ల కిందట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసీ) పథకంలో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.రెండేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయపార్టీల ఆందోళనకుతోడు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మన జిల్లాలో కంప్యూటర్ విద్య తిరిగి పునఃప్రారంభమైంది. జిల్లాలో 48 మండలాల్లో ఉన్న 464 పాఠశాలల్లో 250 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన గత వారంలో ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. దాదాపు రెండు లక్షల మంది 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి తరగతికి ఒక గంట కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, టాలీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ విభాగాల్లో ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు అత్యవసరం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేయాలనే లక్ష ్యంతో పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రారంభించాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అత్యవసరం. సర్వేశ్వరరావు, ఏఎంవో, సర్వశిక్షాభియాన్ కంప్యూటర్ విద్యాబోధన కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిపరిస్థితి. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరం. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బోధన మళ్లీ ప్రారంభించడం అభినందనీయం. టి కిశోర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ, గోపన్నపాలెం కలెక్టర్ కృషితో ప్రారంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించడంతో విద్యాబోధన ప్రారంభించాం. దుక్కిపాటి మధుసూదనరావు, డీఈవో ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం 250 మంది ఫ్యాకల్టీల నియామకం ప్రారంభమైన తరగతులు ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ భాస్కర్ దెందులూరు : జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ఇటీవల పునఃప్రారంభమైంది. రెండేళ్ల కిందట అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. పదేళ్ల కిందట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసీ) పథకంలో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.రెండేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయపార్టీల ఆందోళనకుతోడు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మన జిల్లాలో కంప్యూటర్ విద్య తిరిగి పునఃప్రారంభమైంది. జిల్లాలో 48 మండలాల్లో ఉన్న 464 పాఠశాలల్లో 250 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన గత వారంలో ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. దాదాపు రెండు లక్షల మంది 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి తరగతికి ఒక గంట కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, నెట్వర్కింగ్, టాలీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ విభాగాల్లో ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు అత్యవసరం కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేయాలనే లక్ష ్యంతో పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రారంభించాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అత్యవసరం. సర్వేశ్వరరావు, ఏఎంవో, సర్వశిక్షాభియాన్ కంప్యూటర్ విద్యాబోధన కీలకం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిపరిస్థితి. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరం. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బోధన మళ్లీ ప్రారంభించడం అభినందనీయం. టి కిశోర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ, గోపన్నపాలెం కలెక్టర్ కృషితో ప్రారంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించడంతో విద్యాబోధన ప్రారంభించాం. దుక్కిపాటి మధుసూదనరావు, డీఈవో -
విజయవాడలో పేలుడు కలకలం
విజయవాడ: విజయవాడలోని సుందరయ్యనగర్లో పేలుడు కలకలం సృష్టించింది. కాలనీకి చెందిన పద్మారావు ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయడంతోటే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్లో ఉన్న కారు, పక్కనున్న నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పద్మారావుతో పాటు పనిమనషి జ్యోష్నకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుడుతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. గ్యాస్సిలిండర్ లీక్ అవుతున్న సమయంలో కంప్యూటర్ ఆన్ చేయడంతో.. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసిపడ్డట్లు స్థానికులు భావిస్తున్నారు. -
కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
నల్లగొండ (నల్లగొండ క్రైం): జైలు నుంచి విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా జీవించాలని హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జైలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖైదీలకు జైళ్లలో యోగా నేర్పించడంతో పాటు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. అనంతరం జైలులో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కంప్యూటర్ టీచర్ల పోస్టులకు 728 మంది హాజరు
ఏలూరు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కంప్యూటర్ విద్యలో భాగంగా కంప్యూటర్ టీచర్ల నియామకాలకు శనివారం నిర్వహించిన ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షకు మొదటి రోజు 728 మంది అభ్యర్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు శనివారం తెలిపారు. 1,200 మంది హాజరుకావాల్సి ఉండగా 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారని చెప్పారు. రెండో రోజు ఆదివారం మరో 1,100 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షను రాషీ్ట్రయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్ఎంఎస్ఎ) ఏవో పార్వతి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
డిజిటల్ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్
న్యూయార్క్: ‘అరే! అదే పనిగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నావు. కళ్లు పోతాయ్!’ అంటూ పిల్లలను పెద్దవాళ్లు హెచ్చరించడం మనకు సర్వసాధారణంగా అనుభవమే. ఒకప్పుడు అది టీవీకి మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కంప్యూటర్లకు, లాప్ట్యాప్లకు, ట్యాబ్లెట్లకు, సెల్ఫోన్లకు అన్నింటికి వర్తిస్తుంది. వీటి వల్ల కళ్లు పూర్తిగా పోకపోయిన అనేక కంటి సమస్యలతోపాటు శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వాటినే ‘డిజిటల్ హై స్ట్రెయిన్’ అని పిలుస్తున్నారు. చూపు మందగించడం, మసగ్గా కనిపించడం, చూపు బ్లర్ అవడం, కళ్లు మంటపెట్టడం, గుంజడం లాంటి సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సార్లు రెటీనా దెబ్బదిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కాకుండా భుజాలు, మెడ, నడుము నొప్పులతోపాటు తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ డిజిటల్ స్క్రీన్లను మనం ఎంతసేపు చూస్తామనేదాన్నిబట్టి సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రేటింగ్ ఏజెన్సీ ‘నీల్సన్’ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 18 ఏళ్ల ప్రాయం యువత రోజుకు 11 గంటలపాటు ఈ డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. అందుకనే అక్కడి పిల్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మెడ, భుజాలు, వెన్ను నొప్పి వచ్చిందన్న వారు 36 శాతం మంది, కంటీ సమస్యలు వచ్చిందన్నవారు 35 శాతం, తలనొప్పి వచ్చిందన్న వారు 25 శాతం మంది, 30 ఏళ్ల లోపువారిని పరిగణలోకి తీసుకుంటే వారిలో 73 శాతం మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. అంటే కొత్త జనరేషనే ఈ డిజిటల్ హై స్ట్రెయిన్తో ఎక్కువగా బాధ పడుతోందన్న మాట. ఆఫీసు వ్యవహారాలతోపాటు వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఈమెయిళ్లు, ఫేస్బుక్ అప్డేట్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ చూడడం ఈ తరం ప్రజల్లో ఎక్కువైన విషయం తెల్సిందే. ఇప్పుడు మనం అఫీసుల్లో ఒకటి, రెండూ కంప్యూటింగ్ డివైస్లను ఉపయోగిస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. 2020 నాటికి ప్రతి ఉద్యోగి సగటున ఆరు కంప్యూటింగ్ డివైస్లను ఉపయోగించాల్సి వస్తుందని ‘సిట్రిక్స్’ సంస్థ వెల్లడించింది. మరి అప్పుడు పరిస్థితి మరెంత తీవ్రంగా ఉంటుందో. అన్నింటికన్నా కంటి సమస్యలను తీసుకొచ్చేది ఈ డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలే. వాటిలో నీలి కాంతి కిరణాలు మరీ ప్రమాదకరం. కంటిలోని రెటీనాకూ నీలికాంతిని ఫిల్టర్ చేసే సామర్థ్యం లేకపోవడమే అందుకు కారణం. ఊదారంగు కాంతికన్నా కూడా ఈ కాంతి ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ విప్లవం నుంచి మళ్లీ మనం ఎలాగూ వెనక్కి వెళ్లలేము గనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ల నుంచి వెలువడే కాంతిని వీలైనంత మేరకు తగ్గించుకోవాలని, వాటిని వీలైనంత దూరంగా పెట్టి పనిచేసుకోవాలని, నీలిరంగు కాంతిని ఫిల్లర్ చేసే కళ్ల జోళ్లు వాడాలని వారు సూచిస్తున్నారు. కొన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు నీలిరంగు కాంతి కిరణాలను ఫిల్టర్చేసే కళ్ల జోళ్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నాయి. ఐ ఫోన్లలో రాత్రిపూట కాంతిని నియంత్రించే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం అన్ని ఫోన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు యాప్స్ కూడా వస్తున్నాయి. ఈ దుష్ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కంటి నిపుణులు ‘20–20–20’ ఫార్ములాను పాటించాలని సూచిస్తున్నారు. అంటే డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరాన్ని చూడాలంటున్నారు. -
పొడిచేడు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ
మోత్కూరు మండలంలోని పొడిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 40వేల విలువ గల కంప్యూటర్ సెట్ను , నాలుగు సీలింగ్ఫ్యాన్లు అదేగ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త పేలపూడి పిచ్చయ్యచౌదరి (పీపీచౌదరి) బహూకరించారు. ఈ సందర్భంగా దాతను మంగళవారం పాఠశాల ఉపా«ధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వంగాల లలిత. ఉప సర్పంచ్ బండ రామనర్సయ్య, ప్రధానోపాధ్యాయులు మోహన్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పేలపూడి మధు తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్లకు కంప్యూటర్ శిక్షణ
కాజీపేట రూరల్ : జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టూల్స్, ఇంటర్నెట్, ఈ–మెయిల్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ౖyð రెక్టర్, నిట్, వరంగల్ పేరిట తీసిన రూ.200 డీడీతో ప్రిన్సిపాల్ అనుమతి పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కంప్యూటరీకరణతో సేవలు వేగవంతం
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కరీంనగర్అగ్రికల్చర్ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణతో సేవలు వేగవంతమవుతున్నాయని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుస్నాబాద్, గట్టుదుద్దెనపల్లి, చొప్పదండి, గంభీరావుపేట, రాయికల్, సుల్తానాబాద్ సంఘాల కంప్యూటరీకరణ సేవలు, అభివృద్ధిపై శనివారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి టెస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సురేందర్, సీఐవో ఎం.శ్రీనివాస్రావు, జిల్లా నుంచి డీసీవో అంబయ్య, డీఏసీవో చంద్రప్రకాశ్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని సంఘాలను కంప్యూటరీకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మెుక్కలు నాటారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్రెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణ, డీజీఎంలు నారాయణ, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఐటీ రంగంలో 'అ'సామాన్యుడు
నేను సగటు మనిషిని... అయితే, నా విజయగాథ సామాన్యుడికి స్ఫూర్తినిస్తుంది మన దిగ్గజాలు ‘నేను సగటు మనిషిని... అయితే, నా విజయగాథ సామాన్యుడికి స్ఫూర్తినిస్తుంది’ అని సగర్వంగానే కాదు, వినమ్రంగానూ చెబుతారు ఆయన. దేశంలో కంప్యూటర్ల గురించి సామాన్యులకు ఏమాత్రం అవగాహన లేని కాలంలో కంప్యూటర్లే లోకంగా పరిశోధనలు సాగించిన శాస్త్ర పరిశోధకుడు ఆయన. సొంత సంస్థను స్థాపించడమే కాకుండా, దానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన పారిశ్రామికవేత్త ఆయన. అలాగని ఆయన పుడుతూనే నోట్లో వెండి చెంచాతో పుట్టిన వాడు కాదు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి, విద్యనే నమ్ముకుని విజయాలు సాధించిన అసామాన్యుడు ఆయన. పరిశోధకుడుగా, పారిశ్రామికవేత్తగా ఆయన సాధించిన విజయాలు సామాన్యులకు స్ఫూర్తినిస్తాయి. ‘ఇన్ఫోసిస్’ ఇంటిపేరు నారాయణమూర్తి... అంటే ఎవరైనా ఏ నారాయణమూర్తి? అని అడుగుతారు. నాగవర రామారావు నారాయణమూర్తి అంటే కన్ఫ్యూజింగ్గా బుర్ర గోక్కుంటారు. అదే ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. భారత ఐటీ రంగంలో ఎన్.ఆర్.నారాయణమూర్తి తిరుగులేని హీరో. భార్య నుంచి తీసుకున్న పదివేల రూపాయలతో మరో ఆరుగురు మిత్రులతో కలసి నారాయణమూర్తి పునాదులు వేసిన సంస్థ ‘ఇన్ఫోసిస్’. అదే ఆయన ఇంటిపేరుగా మారిందంటే, ఆ సంస్థతో ఆయన అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవాల్సిందే. ‘ఇన్ఫోసిస్’ సీఈవోగా ఆయన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సేవలందించారు. ఆయన సారథ్యంలో ‘ఇన్ఫోసిస్’ సాధించిన ఘన విజయాలు భారత ఐటీ చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాదు. చురుకైన విద్యార్థి నారాయణమూర్తి కర్ణాటకలోని కోలార్ జిల్లా సిదియఘట్ట గ్రామంలో 1946 ఆగస్టు 20న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. పాఠశాల చదువు పూర్తయ్యాక మైసూరు వర్సిటీ పరిధిలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఐఐటీ-కాన్పూర్ నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ఐఐఎం-అహ్మదాబాద్లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్గా కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి కంప్యూటర్లపై పరిశోధనలే ఆయన లోకంగా మారాయి. ఐఐఎంలో పనిచేస్తున్నప్పుడే ఆయన భారత్లోని తొలి షేరింగ్ కంప్యూటర్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కోసం ‘బేసిక్’ ఇంటర్ప్రెటర్ను రూపొందించారు. తొలియత్నంలో వైఫల్యం ఉద్యోగంలో కొనసాగితే అనుకున్న పనులు సాధించలేమని భావించి, ‘సాఫ్ట్రానిక్స్’ పేరిట నారాయణమూర్తి సొంత కంపెనీని ప్రారంభించారు. అంతకు ముందు ఆయనకు ఎలాంటి వ్యాపారానుభవం లేకపోవడంతో ఏడాదిన్నరలోగానే కంపెనీ మూతపడింది. మళ్లీ ఉద్యోగపర్వమే శరణ్యమైంది. ఈసారి పుణేలోని ‘పత్ని కంప్యూటర్ సిస్టమ్స్’లో చేరారు. పుణేలో పనిచేస్తుండగానే, సుధా కుల్కర్ణితో పరిచయమైంది. కంప్యూటర్ సైన్స్లో పోస్ట్గ్రాడ్యుయేట్ అయిన సుధ రచయిత్రి కూడా. అప్పట్లో ఆమె టాటా కంపెనీలో పనిచేసేవారు. ఇద్దరి మనసులూ కలవడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె సుధామూర్తిగా ప్రసిద్ధి పొందారు. మళ్లీ సొంత కంపెనీ పెట్టుకునేలా నారాయణమూర్తిని ఆమె ప్రోత్సహించడమే కాదు, మూలధనంగా పదివేల రూపాయలు కూడా ఇచ్చారు. దాంతో ఆయన నందన్ నీలేకనితో పాటు మరో ఆరుగురు మిత్రులను కలుపుకొని 1981లో ‘ఇన్ఫోసిస్’ను స్థాపించారు. అప్పటి నుంచి 2002 వరకు సీఈవోగా ఆ సంస్థను ముందుకు నడిపించారు. ఆ తర్వాత 2006 వరకు ఇన్ఫోసిస్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత చైర్మన్, చీఫ్ మెంటర్గా సేవలందించి, 2011లో రిటైరయ్యారు. రెండేళ్ల తర్వాత కంపెనీ మళ్లీ ఆహ్వానించడంతో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, అడిషనల్ డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందించారు. ప్రస్తుతం చైర్మన్ ఎమిరిటస్గా ‘ఇన్ఫోసిస్’కు దిశానిర్దేశం చేస్తున్నారు. -
కంప్యూటర్ పాఠం.. భవితకు సోపానం
విద్యార్థులతో కిటకిటలాడుతున్న శిక్షణ కేంద్రాలు సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు పోచమ్మమైదాన్ : ఇది కంప్యూటర్ యుగం. ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిచోటా కంప్యూటర్లను వినియోగిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ అక్షరాస్యత ఎంతో అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే వేసవి సెలవుల్లో తమ పిల్లల్ని షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. విద్యార్థులు సైతం రోజూ ఎంతో ఉత్సాహంగా శిక్షణ కేంద్రాలకు వెళ్లి, నిపుణుల పర్యవేక్షణలో సాంకేతిక అంశాల్ని నేర్చుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నారుు. దీంతోపాటు టైప్ రైటింగ్ కోర్సులను నేర్చుకునేందుకూ ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో తొలుత కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. వాటిపై పట్టుసాధించిన విద్యార్థులకు డీసీఏ వంటి సాధారణ స్థారుు కోర్సుల్లో చేర్చుకుంటున్నారు. పాఠశాల దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక విద్యాపరమైన అంశాల్లో వారు ప్రతిభ కనబర్చే అవకాశాలు ఉంటాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పాఠశాలల్లో నిర్వహించే కంప్యూటర్ క్లాస్లలో విద్యార్థులు మరింత రాణించడానికి ఈ షార్ట్ టర్మ్ ట్రెరుునింగ్ దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, మల్టీమీడియూ, సీ ల్యాంగ్వేజ్, జావా, సీపీపీ, డాట్నెట్, ఒరాకిల్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, 2డీ యూనిమేషన్, 3డీ యూనిమేషన్, మాయూ, అకౌంటింగ్ కోర్సులు నేర్పిస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు ప్రత్యేకంగా.. బీటెక్ విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్లో చేరాలనుకునే వారి కోసం కంప్యూటర్ ట్రెరుునింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నారుు. ఆయూ విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు దోహదపడేలా ఈ కోర్సులను రూపొందించారు. హన్మకొండ, వరంగల్ల పరిధిలోని కొన్ని శిక్షణ కేంద్రాల్లో బీటెక్ విద్యార్థులకు రాబోయే సెమిస్టర్కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ముందస్తుగా కోర్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఫీజుల విషయూనికొస్తే ఒక్కో లాంగ్వేజీని బట్టి దాదాపు రూ.1000 నుంచి రూ.5వేల దాకా తీసుకుంటున్నారు. -
కంప్యూటర్ అధిక వాడకంతో సమస్యలే..!
ఆధునిక కాలంలో కంప్యూటర్లు.. వ్యక్తి జీవితంలో ప్రధాన వస్తువులుగా మారిపోయాయి. కంప్యూటర్ లేకుండా ఏ పనీ పూర్తి కావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంప్యూటర్ ప్రధానవస్తువైపోయింది. అయితే కంప్యూటర్ అధిక వినియోగం ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చొని పనిచేసేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ప్రతిరోజూ కంప్యూటర్ తో పనిచేయాల్సి రావడం ఆధునిక జీవితంలో తప్పని పరిస్థితిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కళ్ళకు ప్రమాదమేనంటున్నారు. కళ్ళు లాగడం, నొప్పి, కంటినుంచీ నీరు కారడం, మంటలు వంటి అనేక సమస్యలతో పాటు కొందరికి దృష్టిలోపం కూడ ఏర్పడుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలం కంప్యూటర్ ముందు కూర్చొనే వారిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల శరీరం బరువెక్కడం, ఉబకాయం సమస్యతోపాటు సోమరులుగా కూడ మారే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్లను వాడటంవల్ల దీర్ఘ కాల రోగాలైన ఉబ్బసం, రక్తపోటు వంటి రోగాలు సంక్రమించడంతోపాటు కొందరిలో నిరాశ చుట్టుముట్టి మానసిక వ్యాధులకు కూడ దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో ఆహారం పట్ల విముఖత ఏర్పడితే, మరి కొందరిలో అదేపనిగా తినే అలవాటుకూడ వస్తుందని, దీనివల్ల ఊబకాయ సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చోవడం వల్ల ఒళ్ళు నొప్పులు, మెడనొప్పులు, స్పాండిలైటిస్ వంటివి కూడ ప్రధాన సమస్యలుగా మారతాయని వైద్య నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు. కంప్యూటర్లో పనిచేసే వ్యక్తులకు దీర్ఘకాలిక తలనొప్పులు సంక్రమించే అవకాశం కూడ ఉంది. అటువంటి నొప్పి ఒక్కోసారి డిప్రెషన్ కు కూడ దారితీస్తుంది. నొప్పుల వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం, అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఏర్పడతాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే తప్పనిసరిగా కంప్యూటర్ తో పనిచేయాల్సి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నవాస్తవం బయటపడిందని పరిశోధకులు చెప్తున్నారు. తప్పనిసరిగా వ్యాయామం చేయడం, గంటకోసారైనా కాసేపు అటూఇటూ తిరగటం, వాడే సమయంలో అప్పుడప్పుడూ నీటితో ముఖం కడుక్కోవడం, ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తుండటం, స్క్రీన్ కు వీలైనంత దూరంగా కూర్చోవడం, వంటివి కంప్యూటర్ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక ముఖానికి ఎదురుగా లైట్ లేకుండా చూసుకోవడం, మానిటర్ కళ్ళకు ఎదురుగా సమానమైన ఎత్తులో ఉండేలా చూస్కోవడం, మౌస్ ప్యాడ్ వాడటం, తక్కువ రేడియేషన్ ఇచ్చే మానిటర్స్ ను వాడటం చేయాలంటున్నారు. కంటికి ఒత్తిడి తగ్గేలా యాంటీ గ్లేర్ స్క్రీన్ల వాడకం వంటి కొన్ని కనీస జాగ్రత్తలను పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండొచ్చని కొంతైనా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు. -
చీకట్లు
పసిమొగ్గల్లో అంధత్వం! ♦ చిన్నారుల్లో ఏ విటమిన్ లోపం ♦ {పతి వంద మందిలో ఏడుగురికి సమస్య ♦ రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ♦ పౌష్టికాహారలోపం, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం ♦ కళ్లజోళ్లు తప్పనిసరి అవుతున్న దుస్థితి జోగిపేట: గతంలో కంటి చూపు తగ్గుతుందంటే వృద్ధాప్యం దగ్గర పడుతుందని భావించే వారు. కానీ నేడు వయసుతో సంబం ధం లేకుండా కంటిచూపు మందగిస్తోంది. చీకటి గదుల్లో విద్యా బోధన, టీ వీ చూడటం, కంప్యూటర్, వీడియో గేమ్స్, సెల్లో చిత్రాలు వీక్షించడం తదితర కారణాలతో పిల్లల్లో కంటి చూపు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో దృష్టిలోపం ఏర్పడడం ఆందోళన కల్గించే అంశం. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పిల్లలందరూ కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో ఏడుగురికి దృష్టిలోపం ఉన్నట్లు సమాచారం. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 50 వేల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో తప్పనిసరిగా 2,609 మంది విద్యార్థుల కు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ మాసంలో అద్దాలను పంపిణీ చేయనున్నారు. వేలాది మంది విద్యార్థులకు కంటిలో వేసుకునేందుకు ఐ డ్రాప్స్ను పంపిణీ చేశారు. వీరిలో 10 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్లలోపు ఉన్న 100 మంది చిన్నారులను పరిశీలిస్తే అందులో ఏడుగురు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు నిర్వహించి విటమిన్ ఏ అందిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. కాగా.. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. చూపు తగ్గడానికి కారణాలు ♦ పిల్లలకు పాలు, గుడ్డు అకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు అవసరమైనంత మేరకు తీసుకోకపోవడంతో విటమిన్ ఏ కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపు మందగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ♦ వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయడం. ♦ తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులనే వాడాలి. బ్లాక్ బోర్డుపై చాక్పీస్తో రాసిన అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి. ♦ తెల్లబోర్డులు, మార్కర్లు వాడడంతో కళ్లపై ఒత్తిడి పడి నరాలపై ప్రభావం చూపి కంటి చూపు తగ్గుతుంది. ♦ {పస్తుతం పుస్తకాలలో అక్షరాలు కూడా మరీ చిన్నగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది. ♦ టీవీ, కంప్యూటర్, వీడియో, సెల్లో గేమ్స్ ఆడే పిల్లల్లో కంటి చూపు సమస్య ఉత్పన్నమవుతుంది. 50 వేల మంది చిన్నారులకు కంటి పరీక్షలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 2.069 మంది విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా కంటి అద్దాలు అవసరమని గుర్తించాం. వారికి ఈనెలలో కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఐ డ్రాప్స్ మందులను పంపిణీ చేశాం. చిన్నారులకు కంటిని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలను ప్రతి పాఠశాలలో వివరించాం. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్ అమర్సింగ్, డీఎంహెచ్ఓ, సంగారెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు క్యారెట్, ద్రాక్ష, బొప్పా యి, చిలుగడదుంపలు తీసుకోవడం తో కంటి సమస్యల నుంచి రక్షణ పొం దవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా అయిదారు సార్లు చేయడంతో కళ్లపై వత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూ స్తూ.. తెరుస్తూ ఉండటం మరచిపోవద్దు. పిల్లలు, పెద్ద లు ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేదుకు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ ఎస్.రవీందర్గౌడ్, కంటి వైద్య నిపుణులు -
పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి?
ఎగ్జామ్ టిప్స్ మైండ్ అనేది కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వచేసుకోవచ్చు. ఫలానా దానిని మీరు గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే... అది మీ పరిశీలనకు అందడం గాని, గుర్తుండడం గాని కష్టం. కాబట్టి... ఆసక్తిగా, గుర్తుంచుకునేలా చదవడం ముఖ్యం. {పాక్టీస్ వల్లే ఏ హ్యాబిట్ అయినా పర్ఫెక్ట్ అవుతుంది. ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించడం అలవాటు చేసుకోవాలి. అపుడు చదువు విషయంలో కూడా అనుసరించడం తేలికవుతుంది. బ్రెయిన్కి ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెల్సుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే ఏకాగ్రత కుదరకపోవడం. ఎలాగంటే ఉదాహరణకు మీరు చదువుతున్నపుడు ఇంటి ముందుగా ఏదైనా బ్యాండ్మేళం శబ్దం వినపడిందనుకోండి... ‘‘అది పెళ్ళిదా లేకపోతే ఏదైనా దేవుడి ఊరేగింపా...’’ వగైరా ప్రశ్నలు మనకు తెలీకుండానే బ్రెయిన్కి చేరతాయి. వాటికి సమాధానాలు తెల్సుకోవాలని తహతహలాడుతుంది. దాంతో మీ ఏకాగ్రత చెదురుతుంది. అందుకే చదివేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇలా జరగకుండా ఉండడానికి మార్గం ఏమిటంటే... బ్రెయిన్ను ఎప్పటికప్పుడు స్టడీస్కు, సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో నింపేస్తూ ఉండడం{బెయిన్కి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిగ్గా దాన్ని చేరుకునేందుకు సిద్ధపడుతుంది. లక్ష్యం లేకుండా చదవవద్దు. ‘‘ఈ గంటలో నేనీ చాప్టర్ ఫినిష్ చేయాలి. ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి’’ లాంటి లక్ష్యంతోనే చదవడం ప్రారంభించాలి. -
కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!
ఆ సీన్ - ఈ సీన్ ఒక రకంగా చూస్తే కంప్యూటర్ను కనుక్కొన్నవాడి కన్నా కాపీ పేస్ట్ను కనుకున్నవాడు గొప్పవాడు. అయితే సరిగ్గా పేస్ట్ చేయడం తెలీనప్పుడు కాపీ చేస్తే మాత్రం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది. ముఖ్యంగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను కాపీ చేసేసి, వాటిని అతి సాదాసీదాగా పేస్ట్ చేస్తే... సినిమా అభిమానుల ఫీలింగ్స్ దారుణంగా హర్ట్ అవుతాయి. అలా హర్ట్ చేసిన ఓ సినిమా... ‘మా నాన్నకు చిరంజీవి’. సూపర్ హిట్ అయిన ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’కి అనుకరణగా రూపొందిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. విల్ స్మిత్కు ఆస్కార్ అవార్డును, అంతకు మించిన అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’. 2006లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా ఒక వాస్తవ కథ. అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన కథ. స్మిత్ నులివెచ్చని భావవ్యక్తీకరణ సినిమాను కొత్త హైట్స్కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీమంతుల్లో ఒకరు క్రిస్ గార్డ్నర్. ఈ వ్యాపారవేత్త తన జీవితంలోని ఒక దశలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఆయన అధిగమించిన తీరును ఆటోబయోగ్రఫీగా రాశారు. దాన్నే ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాగా మలిచారు. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్ని ఎక్స్రే మిషన్లను కొని, వాటి వ్యాపారంలో తేడాలొచ్చి కట్టుబట్టలతో మిగులుతాడు క్రిస్ గార్డ్నర్ (విల్ స్మిత్). దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. కొడుకును తన దగ్గర వదిలిపెట్టి భార్య వెళ్లిపోతుంది. ఆరేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఆ సేల్స్మెన్ రోడ్డున పడ తాడు. తన పరిస్థితి తనయుడికి ఏ మాత్రం అర్థం తెలియ నీకుండా జాగ్రత్తపడతాడు. బాబుకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవ డానికి ఆ తండ్రి పడే తపన, మరోవైపు అడుగడుగునా దురదృష్టం ఎదురవుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదలక తన లక్ష్యం దిశగా ప్రయత్నాలను కొనసాగించే అతని ప్రయాణమే ఈ చిత్రం. ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుందీ సినిమా. ఈ కథా నేపథ్యాన్ని ‘మా నాన్న చిరంజీవి’ సినిమాకు అన్వయించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ వెర్షన్లో విల్ స్మిత్, ఆయన సొంత తనయుడు జేడెన్ స్మిత్లు నటించిన పాత్రల్లో తెలుగు వెర్షన్లో జగపతిబాబు, మాస్టర్ అతులిత్లు కనిపిస్తారు. భార్య మాట విని తనకు తెలియని వ్యాపారంలో డబ్బులన్నీ పెట్టి నష్టపోతాడు జగపతిబాబు. ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి తనే కారణం అయినా... భార్య అతడిని వదలి వెళ్లిపోతుంది. దీంతో హీరో కొడుకును తీసుకుని హైదరాబాద్ వ స్తాడు. ఈ రకంగా నేపథ్యాన్ని మార్చినా... ఇక్కడి నుంచి ఇక హీరోకి ఎదురయ్యే అనుభవాలన్నీ హాలీవుడ్ సినిమాకు అనుకరణగా రాసుకున్నవే. కొడుకుతో కలిసి ఒక రాత్రి రైల్వేస్టేషన్ బాత్రూమ్లో తల దాచుకోవాల్సి వస్తుంది హీరోకి. ఈ సీన్లో విల్స్మిత్ నటన కన్నీటిని తెప్పిస్తుంది. ఈ సన్నివేశాన్ని తెలుగు సినిమాలో కూడా యథాతథంగా వాడుకున్నారు. హాలీవుడ్ వెర్షన్లో హీరో తన దగ్గరే మిగిలిపోయిన ఎక్స్రే మిషన్ను అమ్మడానికి హీరో ప్రయత్నం చేస్తుంటాడు. తెలుగులో హీరో చేతిలో డిక్షనరీలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అనుకరణలు ఎన్నో ఉన్నా... ఏ దశలోనూ తెలుగు సినిమా హాలీవుడ్ డ్రామాను రీచ్ కాలేదు. అమెరికా నేపథ్యంలో సాగే కథను లోకలైజ్ చేయబోయి... గొప్ప కాన్సెప్ట్ను సాధారణ స్థాయికి తీసుకొచ్చేశారు రూపకర్తలు. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి తెలియదు! వాస్తవానికి విల్స్మిత్ సినిమాలో ఉన్న గొప్పదనం... నాటకీయమైన కథలోనిది కాదు. ఆ చిత్రంలోని అందమంతా దాని నిజాయితీలో ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో వాస్తవికంగా, మనసును తడిమేలా ఉంటడమే దాని సక్సెస్ సీక్రెట్. అలాంటి ఫీల్ తెలుగు సినిమాలో మిస్ అయ్యింది! అందుకే... పరాజయాల లిస్టులో చేరిపోయింది! - బి.జీవన్రెడ్డి -
ఆ సుందరికి సొంత కంప్యూటర్ కూడా లేదట
లండన్: ప్రముఖ హాలీవుడ్ సుందరి, టైటానిక్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారు మనసుల్లో శాశ్వత స్థానాన్ని దక్కించుకున్న కేట్ విన్స్లెట్.. తనకు కంప్యూటర్ కూడా లేదని చెప్పింది. సహజంగా తనకు సాంకేతిక పరిజ్ఞానం అంటే భయమని, చిరాకు అని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తన ఇంట్లో పిల్లలకు కూడా సోషల్ మీడియాలో అనుమతి లేదని చెప్పింది. వారికి కేవలం తన ఐఫోన్ మాత్రమే అందుబాటులో ఉంచుతున్నానని, అందులో కూడా చాలా పరిమితులు పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం కేట్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పిల్లలను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని, వారి బాల్యాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలని, సోషల్ మీడియా వారికి సహజ సిద్ధంగా లభించే అంశాలను హరించి వేస్తుందనే భయంతోనే అలాంటి వాటికి అనుమతించబోనని చెప్పింది. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకొని విడిపోయిన ఆమె సరిగ్గా రెండేళ్ల కిందటే నెడ్ రాకెన్ రోల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. -
షర్ట్ వేస్కో నెట్ చూస్కో...
ఇంటర్నెట్తో కనెక్ట్ కావాలంటే ఏముండాలి? డెస్క్టాప్ లేదా లాప్టాప్ కంప్యూటర్ ఉండాలి. తేలికగా ఉండాలంటే, కనీసం టాబ్లెట్ లేదా స్మార్ట్ఫోన్ ఉండాలి. ఇకపై ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యేందుకు ఇవేవీ అవసరం లేదు. చూడముచ్చటగా అదిరేటి డ్రెస్సు వేసుకుంటే చాలు... మీరు ఎక్కడ ఉన్నా, ‘నెట్’కొచ్చేయవచ్చు. షర్ట్ కాలర్ని తట్టడం ద్వారా మిత్రులకు సందేశాలు పంపుకోవచ్చు. కోటు బొత్తాన్ని ఒత్తడం ద్వారా మోగుతున్న ఫోను నోరుమూయించవచ్చు. షర్ట్ చేతులను మడతేయడం ద్వారా రికార్డయిన సంభాషణను మీకు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసుకోవచ్చు. డిజిటల్లీ కనెక్టెడ్ డ్రెస్తో ఇలాంటివే చాలా పనులు సునాయాసంగా చేయవచ్చు. డెనిమ్ దుస్తుల సంస్థ ‘లీవైజ్’ సాయంతో సెర్చింజన్ దిగ్గజం ‘గూగుల్’ ఇలాంటి డిజిటల్లీ కనెక్టెడ్ దుస్తులకు రూపకల్పన చేస్తోంది. విద్యుత్ వాహక శక్తిగల కొత్తరకం నూలు, మల్టీటచ్ ప్యానెల్స్, సెన్సర్లతో రూపొందిస్తున్న ఈ దుస్తులు ఫ్యాషన్ రంగంలో సంచలనం కాగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మీ పాపకో పాస్వర్డ్ పెట్టండి!
పాపకు పాస్వర్డ్ పెట్టడమేంటి? పాపేమైనా కంప్యూటరా? మొబైల్ ఫోనా? అనేకదా మీరు అడుగుతోంది. నిజమే.. కంప్యూటర్లో మనకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే దానికో పాస్వర్డ్ పెడతాం. మరి కంటికి రెప్పలా చూసుకుంటున్న మన చిన్నారులు భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ అక్కరలేదా?... కాస్త కన్ఫ్యూ జింగ్గా ఉంది కదూ.. అయితే ఇది చదవండి...తూర్పుఢిల్లీలోని వివేకానందనగర్లోగల లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న రితిక వయసు 8 ఏళ్లు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు తల్లి స్వయంగా స్కూల్కు వచ్చి తీసుకెళ్లేది. ఒకరోజు ట్రాఫిక్జామ్ కావడంతో తల్లిరావడం ఆలస్యమైంది. దీంతో రితిక తల్లికోసం ఎదురుచూస్తూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. పాపదగ్గరికి వెళ్లి.. మీ అమ్మకు ఏదో అర్జంట్ పని ఉండడంవల్ల రాలేకపోయిందని, తీసుకురమ్మని తనను పంపిందని పాపతో చెప్పాడు. వెంటనే ఆ ‘పాప పాస్వర్డ్ ఏంటి?’ అని అడిగింది. దీంతో బిత్తరపోయిన కిడ్నాపర్ ఏం చెప్పాలో తోచక మమ్మీ పాస్వర్డ్ ఏమీ చెప్పలేదన్నాడు. దీంతో ఎదుటి వ్యక్తి తనను కిడ్నాప్ చేయడానికే వచ్చాడన్న అనుమానంతో రితిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడం, కిడ్నాపర్ను పోలీసులకు పట్టివ్వడం చకచకా జరిగిపోయాయి. రితిక తల్లి చేసిన ఓ చిన్న ఆలోచన పాపను కిడ్నాప్ కాకుండా కాపాడింది. సో.. ఇప్పుడు అర్థమైంది కదా.. పాపకు పాస్వర్డ్ ఎందుకో? -
సెన్సర్ కీబోర్డు
గాడ్జెట్ ఏదైనా మెయిల్ టైప్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే మౌస్ ఉండక తప్పదు. ఊహూ.. అక్కరలేదంటోంది జెస్ట్. కీబోర్డు ఉందనుకుని గాల్లో టైప్ చేసినా వాటిని కంప్యూటర్ తెరపై అక్షరాలుగా మార్చేస్తుందీ హైటెక్ గాడ్జెట్. ఫొటోలో చూపినట్లు నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగ్లు, అరచేతిపై అమర్చుకునే పట్టీలతో కూడిన జెస్ట్లో యాక్సెలరోమీటర్లు, గైరోస్కోపులు, మాగ్నెటోమీటర్లు బోలెడు ఉంటాయి. ఇవన్నీ మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనావేసి స్క్రీన్పై చూపుతాయి. స్మార్ట్ఫోన్లలో మాదిరిగా ప్రిడిక్టివ్ టెక్ట్స్టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. తదనుగుణంగా మనం టైప్ చేసుకుంటూ కావాల్సిన పదాలను సెలెక్ట్ చేసుకుంటే సరి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హ్యాకథాన్లో రాత్రికిరాత్రి ఈ గాడ్జెట్ ప్రొటోటైప్ను తయారు చేసిన మైక్ ఫ్రిస్టర్ బృందం ఆ తరువాత అపోటాక్ట్ ల్యాబ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి జెస్ట్ను మరింత అభివృద్ధి చేసింది. వాణిజ్యస్థాయి తయారీకి నిధులు కావాలంటూ కిక్స్టార్టర్లో ప్రచారం చేపట్టడంతో దీని గురించి ప్రపంచానికి తెలిసింది. జెస్ట్ ఎక్స్బాక్స్ కైనిక్ట్ లేదా లీప్ మోషన్ మాదిరిగా పూర్తిగా వేలి కదలికలపై మాత్రమే ఆధారపడదని, మౌస్ బటన్ను డబుల్ క్లిక్ చేసినట్లు... లేదా కీబోర్డ్ షార్ట్కట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పనిచేస్తుందని ఫ్రిస్టర్ అంటున్నారు. బ్లూటూత్ ఉన్న ఏ పరికరంతోనైనా జెస్ట్ పనిచేస్తుందని చెప్పారు. కిక్స్టార్టర్ ద్వారా అనుకున్నన్ని నిధులు సమకూరితే వచ్చే ఏడాదికల్లా జెస్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. -
ఆ నేడు సెప్టెంబర్ 4, 1998
సమాచార విప్లవం... కంప్యూటర్ ముందు కూర్చున్న ఒకాయన దగ్గరికి ఒక పిల్లాడు వచ్చి -‘‘మా నాన్న కనిపించడం లేదు...కాస్త గూగుల్లో వెదికి పెడతారా!’’ అని అడిగాడట. ఆ పిల్లాడిది అమాయకత్వమో, అతివిశ్వాసమో, హాస్యమో తెలియదుగానీ... సారాంశంలో చెప్పుకోవాలంటే ‘గూగుల్ ఏ సమాచారాన్ని అయినా ఇవ్వగలదు’ అనే నమ్మకాన్ని ప్రపంచానికి ఇచ్చింది. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పీహెచ్డీ స్టూడెంట్స్గా లారీ పేజ్, సెర్జిబ్రిన్లు ఉన్నప్పుడు జనవరి 1996లో రీసెర్చ్ ప్రాజెక్ట్గా గూగుల్ మొదలైంది. ఇంటర్నెట్ సంబంధిత సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన గూగుల్ సంస్థ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్లో సెప్టెంబర్ 4, 1998న స్థాపించబడింది. ఎప్పటికప్పుడు సరికొత్త సృజనాత్మక ఆలోచనలతో ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగింది. శక్తిమంతమైన సెర్చింజన్గా పేరు తెచ్చుకుంది. -
టెక్నో నెక్ పోశ్చర్ అంటే...?
నా వయసు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇటీవల నేను ముందుకు ఒంగిపోతున్నానంటూ నా కొలీగ్స్ చెబుతున్నారు. బహుశా దానివల్లనేమో నాకు మెడ, నడుము నొప్పి కూడా వస్తున్నాయి. నా సమస్యలు తీరడానికి ఏం చేయాలో చెప్పండి. - వంశీకృష్ణ , హైదరాబాద్ ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వ్యవధి గణనీయంగా పెరిగిపోయింది. అంతేకాదు... అటు ల్యాప్టాప్ గానీ, స్మార్ట్ఫోన్గానీ, టెలివిజన్ చూసేప్పుడుగానీ, ఏదైనా బ్యాగ్ మోసేప్పుడుగానీ... ఇలా ప్రతి విషయంలోనూ ముందుకు ఒంగే పనిచేస్తున్నాం. పిల్లలు కూడా గేమ్స్ ఆడే సమయంలోనూ ఇదే భంగిమను అనుసరిస్తున్నారు. దాంతో తలనొప్పులు, తీవ్రమైన అలసట, కాళ్లచివర స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, మెడ దగ్గర నొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కూర్చోవడంలో గానీ, నిలబడటంలోగానీ ఈ తరహా లోపాల వల్ల కనిపించే సమస్యలన్నింటినీ కలుపుకొని ‘టెక్నో నెక్ లేదా టెక్ట్స్ నెక్ ‘ఐ’ పోశ్చర్’ అంటారు. గత కొంతకాలంగా మనం సాంకేతికంగా పురోగమిస్తుండం, ఇప్పుడు ప్రతివారూ కంప్యూటర్ను లేదా ముందుకు వంగి చూస్తూ సెల్ఫోన్నైనా ఉపయోగిస్తూ ఉండటం వల్ల మనం ఇదివరకులా నిటారుగా అంటే ఇంగ్లిష్ ‘ఐ’ అక్షరం ఆకృతిలో నిల్చోవడం తప్పిపోయింది. ఈ కింద పేర్కొన్న నిల్చున్న భంగిమల్లో మధ్య భంగిమ సరైనదని గుర్తించి, అలా నిల్చుంటే మన శరీరం అన్నివైపులా సమానమైన సౌష్ఠవంతో ఉంటుందని గ్రహించి ఎప్పుడూ ఇలా నిలబడటానికి ప్రయత్నించండి. కూర్చొని పనిచేసే సమయంలోనూ తలను నిటారుగా ఉంచండి. లేకపోతే తన బరువంతా మీ మెడపై పడుతుంది. మీ భంగిమ సక్రమంగా ఉందో లేదో తెలుసుకోడానికి ఈ కింది స్వీయపరీక్షలు చేసుకొని సరిదిద్దుకోండి. 1) మీరు నిల్చునప్పుడు రెండు భుజాలూ సమానంగా ఉంటున్నాయా లేక ఒకటి పైకి, మరొకటి కిందికీ ఉంటోందా? 2) మీరు నడుస్తున్నప్పుడు ఏదో ఒకవైపునకు ఒంగుతున్నారా 3) మీ రెండు భుజాల నుంచి తల సమానమైన దూరంలో ఉంటుందా? ఈ స్వీయపరీక్షలతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఇక మీ సమస్యలను తగ్గించుకోడానికి యోగా, ఈత వంటి వ్యాయామాలు చేయండి. ఈతకు వెళ్లలేకపోతే కనీసం పడక మీదే కాసేపు ఈదుతున్నట్లుగా అనుకరించండి. దాంతో మీ సమస్యలు చాలావరకు తగ్గుతాయి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ తరచు ముక్కు నుంచి రక్తం..? మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. వేడి చేయడం వల్ల అలా అవుతుందేమో అని ఎప్పటికప్పుడు చలువ చేసే పదార్థాలు ఇస్తూ వస్తున్నాము. అయితే ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ ప్రయోజనం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - డి. రాధిక, టంగుటూరు పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కు రంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అయితే ఇలా ముక్కు నుంచి రక్తం రావడానికి మరికొన్న కారణాలున్నాయి. అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. పిల్లల్ని ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. అలాగే వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది. మలంలో రక్తం పడటానికి కారణాలు మలద్వారం వద్ద చీలిక (ఫిషర్) ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కిందిభాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు. హోమియోవైద్యం పాజిటివ్ హోమియోపతిలో చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. మీరు ఆందోళన పడకుండా సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ప్రతి వర్షాకాలంలో బాబుకు జలుబు! మా బాబుకు పదేళ్లు. ప్రతీ ఏడాదీ వర్షాకాలంలో తరచూ జలుబు, దగ్గు వస్తుంటాయి. మందులు వాడితే అప్పటికి తగ్గుతుంది. మా పాపకు 13 ఏళ్లు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. బాబుకు మాత్రమే తరచూ ఎందుకిలా అవుతోంది. వాడెందుకు ఇలా అనారోగ్యానికి గురవుతున్నాడు. మాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీలత, ఒంగోలు సాధారణంగా వర్షాకాలంలో మన పరిసరాల్లో, తినే ఆహారంలో, నీటిలో కాలుష్యాలు పెరగడానికి అవకాశం ఎక్కువ. దీనివల్ల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా అనారోగ్య సమస్యలు రావడానికీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు కొంతమందిలో అలర్జీ సంబంధిత సమస్యలు (కొన్ని వాతావరణాలు, ఆహార పదార్థాలు సరిపడకపోవడం) రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీ బాబు విషయంలో కూడా కేవలం వర్షాకాలంలోనే తరచూ జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు వస్తున్నాయి అని మీరు చెబుతున్నారు. అంటే... మొదటి కారణం... మీ బాబుకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన వాతావరణం, ఆహార పదార్థాల కారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తుండవచ్చు లేదా చుట్టూ ఉన్న వాతావరణం లేదా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల అతడికి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తుండవచ్చు లేదా అతడికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల ఇతరులకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన అతడు తేలిగ్గా పడిపోతుండవచ్చు. ఇలాంటివారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాబుకు ఈ సీజన్లోనే అనారోగ్యం కలగటానికి కారణాలను ముందుగా తెలుసుకోవాలి. ఇక చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా మిగతా ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. మీ బాబు విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి. ఇవి మీ బాటుతో పాటు ఆరోగ్యంగా ఉండటం విషయంలో చాలామందికి ఉపయోగపడతాయి. అవి... తాగేనీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. (కాచి, వడబోసిన నీటిని వాడటం మంచిది). బయటి ఆహారం, నీరు తీసుకోకూడదు. గుంపులు గుంపులుగా ప్రజలు పోగయ్యేచోట ఆహారం, నీరు తీసుకోకపోవడం మేలు వర్షంతో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినీ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి నిల్వు ఉంచిన ఆహారాలను తీసుకోకూడదు గొంతులో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడే గోరువెచ్చని నీటిలో, కాస్త ఉప్పు వేసుకొని పుక్కిలించడం ద్వారా ఇన్ఫెక్షన్ను నివారించవచ్చు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఆహారం తీసుకోవడానికి ముందు) జలుబుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో విక్స్ వేసి ఆవిరిపట్టడం వల్ల ఉపశమనం ఉంటుంది ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే మిగతా వారికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా మీ అబ్బాయి తరచూ అనారోగ్యానికి గురవుతుంటే మీకు దగ్గర్లోని ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ గాల్బ్లాడర్లో రాళ్లు... సర్జరీ అవసరమా? నేను నెల రోజుల క్రితం క్యాజువల్గా హెల్త్ చెకప్ చేయించుకున్నాను. పొట్ట స్కానింగ్ చేసినప్పుడు గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటివరకు ఎప్పుడూ పొట్టనొప్పి రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. నేను అయోమయంలో ఉన్నా. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్. దొరబాబు, విశాఖపట్నం మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ‘ఎసింప్టమాటిక్ గాల్స్టోన్’ అనే కండిషన్తో బాధపడుతున్నారు. అంటే రాళ్లు ఉంటాయిగానీ, ఎలాంటి లక్షణాలూ కనిపించవన్నమాట. ఇలాంటి కండిషన్ ఉన్న ప్రతి వందమందిలో ఇద్దరికి మాత్రమే లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే మిగతా 98% మంది నార్మల్గా ఉంటారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించనంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. కాబట్టి మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఒకసారి మీ రిపోర్టులు చూశాక సలహా ఇవ్వడం మంచిది. కాబట్టి మీరు మీ దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును ఒకసారి సంప్రదించండి. నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితేనే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. - లక్ష్మయ్య, నిజామాబాద్ సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు. డాక్టర్ భవానీరాజు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బార్ కోడింగ్ భారం
నెలాఖరు నాటికి కంప్యూటర్లు ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా కంప్యూటర్, హోలోగ్రామ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాట్లు చేసుకోని వారికి లెసైన్స్లు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. తణుకు సర్కిల్ పరిధిలో అందరు వ్యాపారులు రూ.5 వేలు చొప్పున చెల్లించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని మద్యం షాపుల్లో కంప్యూటర్లు, హోలోగ్రామ్ మెషీన్లు ఏర్పాటు చేస్తాం. - టి.సత్యనారాయణమూర్తి, ఎక్సైజ్ సీఐ, తణుకు. తణుకు : మద్యం విక్రయించే దుకాణాల్లో బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖ తప్పనిసరి చేసింది. మార్కెట్లో రూ. 45 వేలకు వచ్చే కంప్యూటర్ను సంబంధిత కాంట్రాక్టు సంస్థ రూ. 1.20 లక్షలుగా నిర్ణయించింది. దీని నిమిత్తం నెలకు రూ. 5 వేలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణదారులు కంప్యూటర్తోపాటు హోలోగ్రామ్ మిషన్ కొనుగోలు చేస్తేనే మద్యం లెసైన్సులు ఇస్తామని, మద్యం నిల్వలు ఇస్తామని వ్యాపారులకు అధికారులు తెగేసి చెబుతుండటం జిల్లాలో వివాదంగా మారింది. ఆంక్ష లతో వ్యాపారులకు చిక్కులు జిల్లాలో 397 మద్యం దుకాణాలు దాదాపు 40 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్, మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్ను స్కాన్ చేసి విక్ర యించాల్సి ఉంటుంది. దీంతో తయారీ వివరాలు, విక్రయదారుని వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తమవుతాయి. ఇక్కడి వివరాలు మద్యం డిపోలు, డిస్టలరీస్లోని సాఫ్ట్వేర్లకు అనుసంధానం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం అంటోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లో రూ. 45 వేలు విలువ చేసే కంప్యూటర్, ఇతరత్రా పరికరాలను రెండేళ్లకు రూ. 1.20 లక్షలు అద్దె చెల్లించాలని, ఒకవేళ కంప్యూటర్ పాడైతే రూ. 80 వేలు కొనుగోలు ఖరీదు చెల్లించాలని ఆంక్షలు విధించడం వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అపిట్కో నిర్ధేశించిన సాఫ్ట్వేర్ను మాత్రమే వినియోగించాలని మరో మెలిక పెట్టారు. కార్వే సంస్థకు చెందిన కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా నెలకు రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. గతంలో విఫలమైనా... మద్యం విక్రయాల్లో బార్కోడింగ్ విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టాలని అధికారులు భావించినా వ్యాపారులు సహకరించకపోవడంతో అమలు కాలేదు. కొందరు వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినప్పటికీ అవి అలంకారప్రాయమే అయ్యాయి తప్ప అక్కరకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి బార్కోడింగ్ అంటూ వ్యాపారులను పరుగులెత్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో లేని బార్కోడింగ్ విధానం లెసైన్సు దుకాణాల్లో తప్పనిసరి చేయడం సబబు కాదంటున్నారు. ఆన్లైన్ ధరలు, అమ్మకాల కోసం బార్ కోడింగ్ విధానం తీసుకురావడం అభినందనీయమే అయినా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నెల వారీ వాయిదాలకు ఎక్సైజ్ శాఖ తెర తీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.