Dawood Ibrahim
-
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్లో మాఫియా డాన్ హత్యకు ప్లాన్!
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.ఎవరీ స్వప్నా దీదీ?ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్స్టర్ మెహమూద్ ఖాన్తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.డీ-కంపెనీ ఆగడాలకు చెక్ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్స్టర్గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.దావూద్ హత్యకు ప్లాన్మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్లో దావూద్ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్ను చంపాలని పథక రచన చేసింది.చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"22 సార్లు కత్తితో పొడిచి హత్యదురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. -
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
దావూద్ కుటుంబీకుల ఆస్తులకు రూ.2 కోట్లకు పైగా ధర
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు. -
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. "దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి. ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్సభకు జేపీ నడ్డా పోటీ? -
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ఆయన జీవితంపై ఇన్ని సినిమాలా? (ఫొటోలు)
-
బాలీవుడ్ హీరోయిన్ను పిచ్చిగా ప్రేమించిన దావూద్.. కానీ..
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడని అంటున్నారు. దీనిపై ఆయన అనుచరుడు చోటా షకీల్ స్పందిస్తూ భాయ్ క్షేమంగా ఉన్నాడని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత దావూద్ పేరు తెరపైకి రావడంతో సాధారణ క్రిమినల్ నుంచి డాన్గా ఎదిగిన తీరును, అతడి దుర్మార్గాలను గుర్తు చేసుకుంటున్నారు జనాలు. హీరోయిన్తో ప్రేమాయణం ఈ డాన్కు క్రిమినల్స్తోనే కాదు బాలీవుడ్తోనూ సంబంధాలున్నాయి. హీరోయిన్ మందాకినిని ఎంతో ఆరాధించాడు దావూద్. ఆమెను కూడా ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఈ మందాకిని.. 80వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. 1985లో రిలీజైన రామ్ తేరి గంగా మెయిలీ సినిమా ఆమె కెరీర్లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్తో ఎన్నో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఈ నటి.. సింహాసనం, భార్గవ రాముడు చిత్రాలతో తెలుగువారికీ పరిచయమైంది. కానీ ఒకే ఒక్క ఫోటో ఆమె కెరీర్నే నాశనం చేసింది. 1994లో దావూద్తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆ మోడల్ కోసం హత్య మొదట తనకేం తెలియదని బుకాయించిన హీరోయిన్ ఆ తర్వాత మాత్రం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ఈ సంఘటన వల్ల మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీంతో సినిమాలకు గుడ్బై చెప్పి కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది నటి. అనంతరం డాక్టర్ కాగ్యుర్ రింపోచే ఠాకూర్ను పెళ్లాడి విదేశాల్లో సెటిలైంది. వీరికి రబ్బిల్ అనే కుమారుడు, రబ్జే ఇనయ అని ఓ కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే నటి, మోడల్ అనిత అయ్యుబ్ కూడా దావుద్ ప్రియురాలే అని ఓ ప్రచారం ఉంది. ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి నిర్మాత జావెద్ సిద్దిఖి నిరాకరించడంతో దావూదే అతడిని కాల్చి చంపాడని చెప్తుంటారు. దావూద్ ఇబ్రహీంతో మందాకిని View this post on Instagram A post shared by Yasmeen Joseph Thakur | Mandakini (@mandakiniofficial) చదవండి: నా దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అడుగు బయటపెట్టాలంటేనే.. -
ముంబయ్ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం
-
Dawood: చోటా షకీల్ కీలక ప్రకటన
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు. మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి. -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికలపై ఎలాంటి ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు. దావూద్ కరాచీలో ఉంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. అతని భార్య జుబీనాజరీన్, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డీ-కంపెనీకి అధిపతిగా మారాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు ఈ కింది విధంగా ఉన్నట్లు సమాచారం. చమురు, లూబ్రికెంట్లు: ఒయాసిస్ ఆయిల్ & లూబ్ ఎల్సీసీ అనే దుబాయ్ ఆధారిత కంపెనీ చమురు, లూబ్రికెంట్ల వ్యాపారం సాగిస్తోంది. ఇది డీ-కంపెనీల్లో ఒకటిగా ఉన్నట్లు తెలిసింది. డైమండ్స్: అల్-నూర్ డైమండ్స్ అనేది దుబాయ్లోని వజ్రాల వ్యాపార సంస్థ. ఇది డి-కంపెనీకి మనీలాండరింగ్కు సహకరిస్తుందని గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవర్: ఒయాసిస్ పవర్ ఎల్సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సెక్టార్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది డీ-కంపెనీకి సహకరిస్తుందని నమ్ముతుంటారు. నిర్మాణ రంగం: డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం, రియల్ ఎస్టేట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది డీ-కంపెనీకి మద్దతు తెలుపుతుందని కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఎయిర్లైన్స్: ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ను దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించాడు. ఈ సంస్థను స్మగ్లింగ్, పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసివేశారు. ఇవి దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కొన్ని కంపెనీలని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి నిర్థారణలు లేవు. దావూద్ పాకిస్థాన్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కొందరు చెబుతుంటారు. అతను హవాలా మనీతో ఈ సమ్రాజ్యాన్ని సృష్టించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, గన్ సప్లైతో దావూద్కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం గ్యాంగ్స్టర్లలో దావూద్ అధిక ధనవంతుడిగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే.. దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పటికే దావూద్కు చెందిన అనేక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉందని తెలిసింది. -
కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికల నిజానిజాలపై ఎటువంటి నిర్ధారణ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి లో పటిష్ట భద్రత నడుమ చికిత్స చేయించుకుంటున్నాడు. దావూద్ చికిత్స కొనసాగుతున్న ఫ్లోర్లో ఆయన ఒక్కర్నే ఉంచినట్లు సమాచారం. ఆసుపత్రి వైద్యులు, దావూద్ సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్లోకి ప్రవేశం ఉందని తెలుస్తోంది. దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి తెలిపిన విషయం తెలిసిందే. కరాచీ ఎయిర్పోర్టును దావూద్ ఇబ్రహీమ్ అనుయాయులే నియంత్రిస్తున్నారని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, India's most wanted Dawood Ibrahim has been poisoned by UNKNOWN MEN and is now hospitalised in Karachi with a serious condition. Pakistani media also running this news 🔥🔥 Internet Services shutdown across Pakistan due to UNKNOWN… pic.twitter.com/AuDup7ytwx — Times Algebra (@TimesAlgebraIND) December 17, 2023 మరోవైపు దావూద్ ఇబ్రహీంకు దగ్గరి బంధువు అయిన క్రికెటర్ జావేద్ మియందాద్ను, అతడి కుటుంబాన్ని హౌజ్ అరెస్ట్లో పెట్టింది అక్కడి ప్రభుత్వం. జావేద్ మియందాద్, అతడి కుటుంబం బహిరంగంగా ఉండడం అంత శ్రేయస్కరం కాదని, మియందాద్ రక్షణ కోసమే అతడిని హౌజ్ అరెస్ట్లో పెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. BIG BREAKING NEWS - Entire family of former Pakistani cricketer Javed Miandad has been put under house arrest by the Pakistan Army and ISI 🔥🔥 Javed Miyadad is a close relative of terrorist Dawood Ibrahim. There is something big which Pakistan is hiding⚡ UNKNOWN MEN have… pic.twitter.com/ZP3qr0LzDh — Times Algebra (@TimesAlgebraIND) December 18, 2023 ఇదీ చదవండి: ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం
-
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్ను సోమవారం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
ఈ కంపెనీలో ఒక రోజు
వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్లో మాఫియా డాన్ కరీమ్లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్లో ఉన్న అమ్మాయిలను కరీమ్లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్. ‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా. ఒకసారి దావూద్ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్! తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్. -
వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే..
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు. అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్ -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్.. హత్య చేస్తామంటూ..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత్య చేస్తామంటూ దుండగులు కాల్ చేసి బెదిరించారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. నాగ్పూర్లోని గడ్కరీ నివాసానికి వచ్చిన ఈ కాల్స్కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాగా జనవరి 14నే గడ్కరీ ఆఫీస్ ల్యాండలైన్కు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. నిందితున్ని జయేష్ పుజారి అలియాస్ కాంత అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదటికాల్స్లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్గా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మార్చి 21న మరో బెదిరింపు కాల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లష్క్ర్ ఏ తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితున్ని మార్చి 28న ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి నాగ్పూర్ జైలుకు తరలించారు. అతను జైళ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరో బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ టీం నాగ్పుర్ చేరింది. దర్యాప్తును ప్రారంభించింది. చదవండి: విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్కి మొదటి భార్య మైజాబిన్తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్పై ఎన్ని కేసులన్నాయంటే..) -
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్లు భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు. వీరిద్దరు పాకిస్థాన్లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను భారత్కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే 25లక్షల రివార్డ్
-
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్గా ఐరాస భద్రతా మండలి దావూద్ను గుర్తించగా.. అరెస్ట్ను తప్పించుకోవడానికి దావూద్ పాక్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’
ముంబైలో గ్యాంగ్స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్ సోదరి హాసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్ను విచారించే క్రమంలో దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్ను వదిలి.. పాకిస్తాన్లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూర్ భార్య మెహ్జబీన్.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్.. పాకిస్తాన్లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు. In a big revelation, Haseena Parkar's son Alishah has told the Enforcement Directorate that underworld don Dawood Ibrahim is living in Pakistan's Karachi. Read more: https://t.co/TJtKSCm0ow#DawoodIbrahim pic.twitter.com/9bs8EW4xmT — TIMES NOW (@TimesNow) May 24, 2022 అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్ మాలిక్ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. Central Govt should take action on it. Till now the location was not known but now if the location is clear then the Central govt should take it seriously and take the action: Maharashtra Home Minister Dilip Walse Patil on Dawood Ibrahim pic.twitter.com/V56OvHK6pI — ANI (@ANI) May 24, 2022 ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్ -
బీజేపీలో చేరితే దావూద్కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
దావూద్ అనుచరుల ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు
ముంబై: ముంబైలో గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తోంది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది. బాంద్రా, నాగ్పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్లలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు, దేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి ఎన్ఐఏ ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై నిశీతంగా పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ఇప్పటికే ఎన్ఐఏ నిఘా పెట్టింది. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: ఉద్ధవ్కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్ -
దావూద్ ఇబ్రహీంకు, ఆర్జీవీకి చాలా పోలికలుంటాయి: డైరెక్టర్
'ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ► మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా. ► రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా. ► మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగులు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటలకల్లా సెట్కు వచ్చే వారు. ► ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్ గోపాల్ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే ట్రైలర్లో చూపించాను. ► టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది. ► షూటింగ్ ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం. ► కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను అని అన్నారు. చదవండి: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం.. -
దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు. అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు. -
ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్
-
ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్టు
ముంబై: మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి బుధవారం ఉదయం 8 గంటలకు మాలిక్ను తీసుకువచ్చిన ఈడీ అధికారులు ఆయన్ను దాదాపు 6 గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కస్టడీలోకి తీసుకొని బందోబస్తుతో వైద్య పరీక్షలకు పంపారు. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్ను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనకు ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3వరకు ఈడీ కస్టడీ విధించింది. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. దావూద్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. అఘాడీలో ఆందోళన నవాబ్ మాలిక్ అరెస్టుతో అధికార మహా అఘాడీ కూటమిలో కలకలం రేగింది. ఎన్సీపీకి చెందిన మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, హసన్ ముషరిఫ్, రాజేశ్ తోపె తదితరులు అధినేత శరద్ పవార్తో సమావేశమయ్యారు. మాలిక్ అరెస్టు తర్వాత పరిణామాలపై చర్చలు జరిపారు. మాలిక్ రాజీనామా చేస్తే ఆయన పోర్టుఫోలియోలను ఎవరికివ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మాలిక్ మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలాసాహెబ్, అశోక్, సునీల్ శరద్ పవార్తో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆరోపించారు. గతేడాది మాలిక్ అల్లుడు సమీర్ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటి కేసు ఈ నెల 15న ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్తో మాలిక్కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. 2.86 ఎకరాల భూమిన కారుచౌకగా మాలిక్ దక్కించుకున్నారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. కక్షపూరిత చర్య: ఎన్సీపీ కొందరు చేసిన తప్పులు బయటపెడుతున్నందుకే నవాబ్ మాలిక్ను కేంద్రం అరెస్టు చేయించిందని, కేంద్ర అధికార దుర్వినియోగానికి ఈ అరెస్టు నిదర్శనమని ఎన్సీపీ విమర్శించింది. ఇలాంటి రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తామని శివసేన, కాంగ్రెస్ ప్రకటించాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి శివసేన, కాంగ్రెస్ మహా అఘాడీ కూటమి పేరిట అధికారంలో ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీలు మాఫియాలాగా బీజేపీ వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. 2024 వరకు ఈ ధోరణి కొనసాగుతుందని, తర్వాత వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. అండర్వరల్డ్తో సంబంధం లేని ఒక ముస్లిం యాక్టివిస్టును అరెస్టు చేయాలంటే దావూద్ పేరు తీసుకువస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. సదరు కేసు నమోదై 25ఏళ్లు గడిచిపోయాయని, కానీ ఇప్పటికీ తమ వ్యతిరేకులను ఇబ్బంది పెట్టేందుకు ఆ కేసులో పేర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మాలిక్ అరెస్టును నిరసిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు ఈడీ ఆఫీసుకు దగ్గర్లోని ఎన్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అరెస్టైన మాలిక్కు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని, రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. మాలిక్ అరెస్టును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఖండించారు. -
డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్టు..
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇక్బాల్ కస్కర్ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ ధృవీకరించిందని వార్తా సంస్థ ఎఎన్ఐ తెలిపింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి ముంబైలో సరఫరా చేస్తుండగా అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలాఉండగా.. గతంలో కస్కర్ పై మనీలాండరింగ్ కేసుతో పాటు, ఒక బిల్డర్ నుంచి బెదిరించి డబ్బు దోచుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతనిపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీం అనుచరడు చోటా షకీల్, గ్యాంగ్స్టర్లు ఇస్రార్ జమీల్ సయ్యద్, ముంతాజ్ ఎజాజ్ షేక్ పంకజ్ గంగార్లను నిందితులుగా పేర్కొన్నారు. చదవండి:పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ -
ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘డీ కంపెనీ’ టీజర్ విడుదల
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ శనివారం విడుదలైంది. ఒక చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్ స్టర్ సినిమాల అన్నింటికి మదర్ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక టీజర్ విషయానికొస్తే.. తన గత సినిమాల మాదిరే బ్యాక్గ్రౌండ్మ్యూజిక్తో చింపేశాడు ఆర్జీవీ. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బీజీఎంతో స్టోరీ ఏంటో తెలియజేస్తూ చివరల్లో ఒకే ఒక డైలాగ్తో టీజర్ని ముగించేశాడు. ఒక వీధి ముఠాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా దావూద్ ఎలా మార్చారనేదే ‘డీ కంపెనీ’ కథ అని ఆర్జీవీ పేర్కొన్నారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నటి మోహ్విష్ హయత్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ప్రేమయాణం నడుపుతోందని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పాకిస్తాన్కి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుకుడిని వివాహం చేసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మోహ్విష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మీరు ఎటువంటి వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్న అడగ్గా.. మంచి ఎత్తు ఉండాలని, అదే విధంగా ఆకర్షనీయమైన రంగు ఉండాలని తన మనసులో మాటను తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన బిలావల్ భుట్టో జర్దారీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడున్నారా? మీరు ఆయనలా ఉండే వ్యక్తిని విహహం చేసుకుంటారా? అని హోస్ట్ ప్రశ్నించారు. చదవండి: అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్ భుట్టో దీనికి స్పందించిన మోహ్విష్.. మీరు బిలావల్ భుట్టో గురించి అడుతున్నారా? అని బదులిస్తూ.. అతడు చాలా అందంగా ఉంటాడని, యువ రాజకీయ నాయుకుడని ప్రశంసించారు. దీంతో మోహ్విష్.. బిలావల్ భుట్టో జర్దారీని వివాహం చేసుకోబోతున్నారని, ఇప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఇప్పటి వరకు స్పందిచలేదు. కాగా, బిలావాల్ భుట్టో జర్దారీ.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహ్విష్ దావుద్ ప్రేయసి అని ప్రచారంలో ఉంది. వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2019లో తెరపైకి వచ్చింది. దావుద్ ఆమెను ఓ ఐటెం సాంగ్లో చూసి మనసు పారేసుకున్నట్లు పాక్ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. ఆమెకు దావుద్ వల్లనే పలు సినిమా అవకాశాలు వస్తున్నాయని, అదే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డు వెనక కూడా ఆయన హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. దావుద్కి తనకు ప్రేమ ఉందని వస్తున్న వార్తలపై మోహ్విష్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. -
మాఫియా డాన్ దావూద్ ఆస్తులు వేలం
సాక్షి, ముంబై: పరారీలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను అధికారులు మంగళవారం వేలం వేశారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజి మానిప్యులేటర్స్ చట్టం(ఎస్ఎఎఫ్ఈఎంఇ) కింద ఆరు ఆస్తులకు వేలం నిర్వహించారు. ఈ ఆస్తులను దాదాపు రూ.23 లక్షలకు వేలం వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వేలానికి అద్భుతమైన స్పందన వచ్చిందని రత్నగిరిలోని ఆరు ఆస్తులు విజయవంతంగా అమ్ముడయ్యాయని ఉన్నతాధికారి ఆర్.ఎన్.డిసౌజా వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్, సీల్డ్ టెండర్ ద్వారా ముంబైలో నిర్వహించిన వేలంలో న్యాయవాది శ్రీవాస్తవతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది భూపేంద్ర భరద్వాజ్లు వాటిని దక్కించుకున్నారు. డిసౌజా ప్రకారం మిలిగిన ఆస్తులు రిజర్వ్ ధరకే అమ్ముడుకాగా, బ్లాక్లోని రెండు ఆస్తులలు రిజర్వ్ ధరల కంటే చాలా ఎక్కువ రూ .1.89 లక్షలు (రూ. 5.35 లక్షలకు అమ్ముడయ్యాయి), రూ .4.30 లక్షలు (రూ. 11.20 లక్షలకు అమ్ముడయ్యాయి). అయితే దావూద్ మాజీ సహాయకుడు ఇక్బాల్ మెమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చికి చెందిన ముంబైలోని శాంటాక్రూజ్ వెస్ట్లోని మిల్టన్ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లను వేలానికి ఉంచినా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈమొత్తంలో 25 శాతం వారంలోపు, మరో 25 శాతం నెలలోపు, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి మూడు నెలల్లో జమ చేయాలని డిసౌజా వివరించారు. పూర్తిగా చెల్లించిన తరువాత కొనుగోలుదారుడికి ప్రాపర్టీ సొంతం అవుతుందని డిసౌజా స్పష్టం చేశారు. 2019, ఏప్రిల్లో దావూద్ సోదరి హసీనా పార్కర్కు చెందిన నాగ్పాడాలోని గోర్డాన్ హాల్ అపార్ట్మెంట్లో 600 చదరపు అడుగుల ఫ్లాట్ను రూ .1.80 కోట్లకు వేలం వేసింది. (2014 లో హసీనా మరణించడంతో దీన్ని ఆమె సోదరుడు ఇక్బాల్ కస్కర్ దీన్ని ఆక్రమించారు. అయితే ఇక్బాల్ను 2017 లో థానే పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలులో ఉన్నాడు). 2018 లో దక్షిణ ముంబైలోని అమీనా మాన్షన్లో ఉన్న దావూద్ మరో మరొక ఆస్తిని రూ .79.50 లక్షల రిజర్వు ధరకంటే ఎక్కువగా రూ.3.51 కోట్లకు సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ కొనుగోలు చేసింది. 2017, నవంబర్లో, దక్షిణ ముంబైలోని ఆరు ఫ్లాట్లను, షబ్నం గెస్ట్ హౌస్ , రౌనాక్ ఆఫ్రోజ్ రెస్టారెంట్ను వేలం ద్వారా మొత్తం 11.50 కోట్లకు సేఫ్మా విక్రయించింది. రత్నగిరి జిల్లా, ఖేద్ సబ్ డిస్ట్రిక్ట్లోని ముంబేక్ గ్రామంలో వేలం నిర్వహించిన ఈ ఆస్తుల్లో చిన్న నిర్మాణాలు, ప్లాట్ల రూపంలో భూమి ఉంది. సీజ్ చేసిన ఈ మొత్తం 13 ఆస్తులను ఈ ఏడాది ఆరంభంలోనే సేఫ్మా కింద వేలం నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించారు. కానీ కోవిడ్-19 మహమ్మారి,లాక్డౌన్తో వాయిదా పడింది. -
సలాహుద్దీన్.. భత్కల్ సోదరులు..
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం పీచమణిచే చర్యల్లో భాగంగా మరో 18 మంది వ్యక్తులను మంగళవారం కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు భత్కల్ సోదరులు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఉన్నారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (సవరణ) చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి సంఖ్య 31కు చేరుకుంది. తాజా జాబితాలో 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అథర్, యూసఫ్ అజార్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడు, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మిర్, అదే సంస్థ కమాండర్ యూసఫ్ ముజమ్మిల్ తదితరుల పేర్లున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ముగ్గురు సోదరులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అఖ్తర్, యూసఫ్ అజార్లను ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ అలియాస్ సయ్యద్ మొహమ్మద్ యూసఫ్ షా, డిప్యూటీ చీఫ్ గులాం నబీ ఖాన్ అలియాస్ అమిర్ ఖాన్లను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించింది. భత్కల్ సోదరులు.. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రసంస్థను ఏర్పాటు చేసిన రియాజ్ ఇస్మాయిల్ షాబంద్రి అలియాస్ రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ పేర్లు ఉన్నాయి. వీరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010), జమా మసీదు (2010), షీతల్ఘాట్ (2010), ముంబై (2011)ల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. వీరిపై జైపూర్ (2008), ఢిల్లీ (2008), అహ్మదాబాద్, సూరత్ (2008)ల్లో వరుస పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దావూద్ అనుచరులు నలుగురు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన దావూద్ ఇబ్రహీం నలుగురు ముఖ్య అనుచరులు చోటా షకీల్, మొహమ్మద్ అనిస్ షేక్, టైగర్ మెమన్, జావెద్ చిక్నా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. యూఏపీఏ అమల్లోకి వచ్చాక కేంద్రం 2019 సెప్టెంబర్లో నలుగురిని, 2020 జూలైలో 9 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఇప్పటికే ఉగ్రముద్ర పడిన వారిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబై ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్ రహ్మాన్ లఖ్వి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజీత్ సింగ్ పన్వర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషన్ చీఫ్ వాధవా బబ్బర్ తదితరులు ఉన్నారు. -
దావూద్ పూర్వీకుల ఆస్తులు వేలం
ముంబై: భారత్తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(ఎస్ఏఎఫ్ఎంఏ) కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్లో దావూద్ పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్ ప్రక్రియ గతేడాదే ముగిసిన విషయం తెలిసిందే. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్కు స్థిరాస్తులు ఉన్నాయి. (చదవండి: మాతోశ్రీని పేల్చేస్తాం) 1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దావుద్ కుటుంబసభ్యులు దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉండనున్నట్లు తెలిసింది. కాగా, 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు దావూద్. అలాగే దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేస్తారు. వచ్ఛే నెల 2 న బిడ్డర్ల పరిశీలన జరుగుతుంది. -
దావూద్ ప్రమేయంపై ఎన్ఐఏ కూపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయం ఉండచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు వివరించింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జాతి వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. నిందితులకు ఉన్నతస్ధాయి దౌత్య వర్గాలతో ఉన్న సంబంధాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్ఐ ప్రత్యేక న్యాయస్దానానికి నివేదించింది. నిందితుల్లో ఒకరైన రమీస్ తాను టాంజానియాలో డైమండ్ వ్యాపారం చేస్తానని, ఆ బంగారాన్ని తాను దుబాయ్లో విక్రయించానని తెలిపాడని ఎన్ఐఎ వివరించింది. దావూద్ ఇబ్రహీంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ దావూద్ ఇబ్రహీం ఆగడాలపై వెల్లడించిన వివరాలతో పాటు ఆఫ్రికాలో దావూద్ ముఠా కార్యకలాపాలపై అమెరికా ట్రెజరీ విభాగం ప్రచురించిన ఫ్యాక్ట్ షీట్ వివరాలను ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్ధానానికి వివరించింది. చదవండి : లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ! -
మాతోశ్రీని పేల్చేస్తాం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్కాల్స్ కలకలం రేపాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడినని చెప్పుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్స్తో మహారాష్ట్ర పోలీసులు సీఎం ఉద్ధవ్ నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ‘బాంద్రా కాలానగర్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడు. తనెవరో చెప్పలేదు. దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం తరఫున ఫోన్ చేస్తున్నట్లు మాత్రమే చెప్పుకున్నాడు. దావూద్ సీఎం ఉద్ధవ్తో మాట్లాడాలనుకుంటున్నాడని అన్నాడు. అయితే, సీఎం నివాసంలోని టెలిఫోన్ ఆపరేటర్ ఈ కాల్స్ను ముఖ్యమంత్రికి ఫార్వార్డ్ చేయలేదు’అని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ ఫోన్ కాల్స్ దుబాయ్ నుంచేనా మరేదైనా ప్రాంతం నుంచి వచ్చాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల విషయమై చర్చించేందుకు ఆదివారం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్..బెదిరింపు కాల్స్పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఘటనపై నేర విభాగం దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తామంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ అన్నారు. -
దీపికా, రణ్వీర్తో దావుద్ డిన్నర్!
ముంబై : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె, ఆమె భర్త, హీరో రణ్వీర్ సింగ్లు కలిసి ఫొటో దిగారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది. ఈ చిత్రంలో దీపికా, రణ్వీర్, సందీప్, సంజయ్ లీలా భన్సాలీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అయితే ఈ ఫోటో 2013లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంటగా నటించిన ‘గోలియోంకి రాస్లీలా రామ్లీలా’ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలోనిది. అయితే ఇందులో దావుద్ కూడా ఉన్నాడని, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె వెనక వరసలో సందీప్ పక్కన కూర్చున్న వ్యక్తిని దావుద్ ఇబ్రహీంగా గుర్తిస్తూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. (‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’) ఈ ఫోటోను జస్టిస్ ఫర్ సుశాంత్సింగ్ రాజ్పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, సందీప్ తమ స్నేహితులతో కలిసి దిగిన ఈ ఫొటోలో దావుద్ ఇబ్రహీం కూడా ఉన్నాడంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ను జోడించారు. అయితే ఇదే ఫొటోను సందీప్ సింగ్ ఈ ఏడాది మేలో తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందులో ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లను కింద పేర్కొన్నారు. దీంతో ఇది వాస్తవం కాదని, ఆ ఫొటోలో దీపికా, రణ్వీర్, సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదని తేలింది. సంజయ్ లీలా భన్సాలీ, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆర్ వర్మన్తోపాటు దావుద్ గా చెబుతున్న వ్యక్తి వాసిక్ ఖాన్గా స్పష్టమైంది. వాసిక్ ఖాన్.. బాలీవుడ్లో ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. రామ్లీలా సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్గా పని చేశారు. వాస్తవం: దీపికా, రణ్వీర్, సందీప్లతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదు. ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్. View this post on Instagram #Iftar is the time of huge blessings, try to gather as many as you can... Breaking bread together since 2013. . #SanjayLeelaBhansali @ranveersingh @deepikapadukone @r_varman_ @siddharthgarima #WasiqKhan A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on May 17, 2020 at 5:25am PDT -
సమాధానం చెప్పాల్సిన పని లేదు: చోటా షకీల్
ఇస్లాంబాద్: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ బుధవారం ఖండించారు. కరాచీలో ఒక ఖరీదైన భవనంలో ఉన్నాడని భారత మీడియా చూపించిందని ఈ విషయంలో పూర్తి బాధ్యత దానిదే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్తో సహా తాము ఏ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటికి తాము బాధ్యత వహించబోమని తెలిపాడు. సామాజిక మాధ్యమాలలో విలువైన బంగ్లాలలో ఉంటూ, ఖరీదైన కార్లలలో తిరుగుతారని ఏవేవో రాస్తారని వాటన్నింటికి మేం ఎలా బాధ్యత వహిస్తామని చోటా షకిల్ ప్రశ్నించాడు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ చాలా సంవత్సరాల పాటు ఖండించింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నట్లు పాక్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చదవండి: పాక్లోనే దావూద్..! -
లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ!
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ సినీనటితో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ముంబైలో ఉన్న సమయంలోనూ గతంలో ఆయన పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలు కొనసాగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్న 60 ఏళ్ల దావూద్ గత మూడేళ్లుగా పాక్ నటి మోహ్విష్ హయత్తో ప్రేమాయాణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డుకు 2019లో ఎంపికైందని పలు కథనాల్లో వెల్లడైంది. చిన్నా చితకా పాత్రలు పోషించే మోహ్విష్కు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం కట్టబెట్టడంతో.. అసలు ఆమె ఎవరు? ఏమేం సినిమాల్లో నటించిందన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మోహ్విష్తో సంబంధాలపై మీడియా కథనాలు రావడంపై దావూద్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. (పాక్లోనే దావూద్..!) ఐటమ్ గాళ్గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ పేరు 2019లో అవార్డు రావడంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. దీంతో పెద్ద సినిమాల్లోనూ ఈ 37 ఏళ్ల భామకు అవకాశాలు వస్తున్నాయట. ఇదంతా దావూద్ సిఫార్సు వల్లేనని అక్కడి మీడియా కోడైకూస్తోంది. ప్రస్తుతం కరాచీలో అత్యంత లగ్జరీ బంగ్లాలో దావూద్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి మోహ్విష్ సైతం ఖరీదైన బంగ్లాల్లో నివసిస్తోందట. అంతేకాకుండా దావూద్ ప్రేయసిగా చలామణి అవుతూ పలు పార్టీలను కూడా నిర్వహిస్తోందట. కాగా, మోహ్విష్కు, దావూద్కు మధ్య 27 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఈ జంటపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (సినిమాలపై దావూద్ ప్రభావం) -
దావుద్ విషయంలో పాక్ యూటర్న్
-
పాక్లోనే దావూద్..!
ఇస్లామాబాద్: పూటకో మాట మార్చే తన బుద్ధిని పాకిస్తాన్ మరోసారి బయట పెట్టుకుంది. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని చెప్పినట్టుగానే చెప్పి యూ టర్న్ తీసుకుంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని ఎప్పట్నుంచో భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తొలిసారిగా ఆ దేశ మీడియా వెల్లడించింది. దావూద్ పాక్ గడ్డ మీదే ఉన్నాడని మీడియా కథనాల ద్వారా అయినా అంగీకరించడం ఇదే మొదటిసారి. పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నిషిద్ధ 88 ఉగ్రవాద సంస్థలు, వారి నాయకుల జాబితాను శనివారం వెల్లడించింది. అందులో భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తులపైనే ఆంక్షలు ఉంటాయి కాబట్టి దావూద్ పాక్లోనే ఉన్నాడని అంగీకరించినట్లే. కానీ ఎప్పటి మాదిరిగానే పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూ దావూద్ తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడుతోంది. మీడియా కథనాలు నిరాధారమైనవీ, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ ప్రక్రియనేనని తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికే.. ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నందుకుగాను ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్ను 2018 జూన్లో గ్రే లిస్ట్లో ఉంచింది. 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్ నాటికి కూడా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్లో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం పాక్కి అందదు. దీంతో గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్ శుక్రవారం హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంతో పాటుగా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా ది న్యూస్ కథనం వెల్లడించింది. జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, అల్ఖైదా, హక్కానీ గ్రూప్ వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను అప్పగించాల్సిందిగా అప్పగించాల్సిందిగా భారత్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. ó∙కరాచీలోనే తలదాచుకున్నాడని ఆధారాలను బయట పెట్టినా తమ వద్ద లేడని బుకాయిస్తూ వస్తోంది. -
దావూద్ @కరాచీ..
-
మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలోదాయాది దేశం పాకిస్తాన్ మరోసారి మాట మార్చింది. దావుద్ కరాచీలో ఉన్నట్లు అంగీకరించి, అతన్ని టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన పాక్.. వెంటనే యూటర్న్ తీసుకొని,ఇబ్రహీం కరాచీలో లేడని, అతనికి తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. భారత్ మీడియా కావాలనే దావుద్ తమ దేశంలో ఉన్నట్లు అంగీకరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించింది. ప్యారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(FATF) జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు... తాజాగా పాకిస్తాన్ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావుద్ ఇబ్రహీంను పేరుకూడా ఉంది. దావుద్ ఇబ్రహీంతో పాటు జమాతుద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చింది. వీరి స్థిర, చరస్తులను సీజ్ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు తెలియజేస్తూ రెండు నోటిఫికేషన్ల విడుదల చేసింది. గ్రే లిస్ట్లో దావుద్ను చేర్చడంతో మాఫియా డాన్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ అంగీకరించినట్లయ్యింది. అయితే లిస్ట్ ప్రకటించిన కొన్ని గంటలకే దాయాది దేశం మాట మార్చింది. దావూద్ తమ దేశంలో ఉన్నారని అంగీకరించినట్లు భారత్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఆరోపించింది. దావుద్కు తమదేశంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది కొత్త నోటిఫికేషన్ ఏం కాదని, ఈ నోటిఫికేషన్ ద్వారా పాక్ ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. (చదవండి : దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్) ఆగస్టు 18న జారీ అయిన ఒక నోటిఫికేషన్ గురించి స్థానిక విలేకరులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ 2020 ఆస్టు 18న జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్) చాలా పక్కా సమాచారంతో ఉందని, ఇంతకు ముందు జారీ చేసిన ఎస్ఆర్ఓను కూడా ఒక ప్రక్రియ ప్రకారమే ఇచ్చామని తెలిపారు. అందుకే నిషేధిత జాబితా, నిషేధిత చర్యల్లో ఎలాంటి మార్పులూ ఉండవని స్పష్టం చేశారు. ‘ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో తాలిబాన్, ఐఎస్, అల్ఖైదాల ప్రస్తుత స్థితిని చూపించడానికి 2020 ఆగస్టు 18న రెండు సంయుక్త ఎస్ఆర్ఓలు జారీ చేశాం. అప్పుడప్పుడూ ఈ ఎస్ఆర్ఓలు విడుదల అవుతుంటాయి. అలాగే, చట్టపరమైన అవసరాలు, అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం విదేశాంగ శాఖ ఈ ఎస్ఆర్ఓలను ప్రచురిస్తుంది. కానీ భారత్ మీడియా మాత్రం ఈ రిపోర్ట్ ద్వారా పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించిందని కథనాలు నడిపిస్తుంది. అది సరికాదు. ఈ ఎస్ఆర్ఓను చూపిస్తూ మా దేశంలో కొందరు ఉన్నట్లు(దావూద్) పాకిస్తాన్ అంగీకరించిందని భారత మీడియాలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అవి నిరాధారం, కల్పితం’అని జాహిద్ చౌధరి పేర్కొన్నారు. -
దావూద్ గుట్టువిప్పిన పాకిస్తాన్
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్టు ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆ దేశం తాజాగా ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో ఆయన పేరును కూడా పొందుపరిచింది. తమ గడ్డపై ఉగ్రవాదులను గుర్తిస్తూ పాకిస్థాన్ ఓ జాబితాను విడుదల చేసింది. కరుడుగట్టిన నేరగాళ్లు హాఫిజ్ సయీద్, మొహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన 88 మంది వివాదాస్పద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై వీరందరి మీద ఆంక్షలు విధించనుంది. బ్యాంక్ ఖాతాలను కూడా స్థంభింపచేయనుంది. ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్థాన్ ఈ జాబితానును శనివారం విడుదల చేసింది. దీంతో ఉగ్రవాద కార్యక్రమాలను ఊపిరి పోస్తున్న దావూద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఉగ్రవాద గ్రూపులపై, నాయకులపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నామని, స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, వారి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఇదంతా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించడానికేనా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రదారిగా ఉన్న దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్లోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. -
సినిమాలపై దావూద్ ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ సోకి మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. పాకిస్థాన్లోని కరాచిలో తలదాచుకుంటున్న దావూద్ మరణించలేదని ఆ తర్వాత తెల్సింది. అండర్ వరల్డ్ డాన్గా అనేక హత్యలు, దోపిడీలు చేసిన దావూద్కు 1993 పేలుళ్లతో టెర్రరిస్టుగా ముద్ర పడింది. ఆయనది చీకటి ప్రపంచమైనా బాలివుడ్ సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు. హీరో స్థాయి గుర్తింపు పొందారు. (చదవండి : కదలని చిత్రం - నడవని బండి) దావూద్ ఇబ్రహీం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీసుకునే ‘బ్లాక్ ఫ్రైడే, కంపెనీ, షూటవుట్ ఎల్ వడాలా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, డీ డే, హసీనా పార్కర్ సినిమాలు రాగా, ‘ఏక్తీ బేగమ్’ వెబ్ సిరీస్గా వచ్చింది. దాదావూద్ ఇబ్రహీం తరహా విలన్ను చంపడం కోసం ఓ మహిళ కుట్ర పన్నడమే ఆ సిరీస్ ఇతివృత్తం. 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించి అనురాగ్ కాష్యప్ తీసిన ‘బ్లాక్ ఫ్రైడే’ సినిమాలో దావూడ్ పాత్రను విజయ్ మౌర్య పోషించారు. 2002లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘కంపెనీ’ సినిమాలో ఒకప్పటి దావూద్ అనుంగు శిష్యుడు చోటా రాజన్, దావూద్కు మధ్య తలెత్తిన గొడవలను ప్రధానంగా తీసుకున్నారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టి సొమ్ము చేసుకున్నాయి. (చదవండి : అల్లరి నరేష్ ఫ్యాన్స్కు ఓ సర్ప్రైజ్) -
కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి..!
ఇస్లామాబాద్ : మోస్ట్ వాటెండ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్తో మృతి చెందాడన్న వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. 1994 నుంచి పాకిస్తాన్లోని కరాచీలో ఐఎస్ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్, అతడి భార్య మెహజబీన్ కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్ మృతి చెందాడని పేర్కొంది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. (దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్..!) అయితే దావూద్ మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. భారత్తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నారు. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు. -
డీ గ్యాంగ్ బాస్కు కరోనా?
కరాచీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ బారిన పడ్డాడా? అవునని కొందరు కాదని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి ముంబై నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఈ కరడుగట్టిన తీవ్రవాది దావూద్ భార్య మెహజబీన్కు కరోనా పాజిటివ్గా తేలిందని, దీంతో దావూద్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రక్షణ వ్యవహారాలను చూసే వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా.. అలాంటిదేమీ లేదని ‘భాయ్’ఆరోగ్యంగానే ఉన్నాడని అతడి తమ్ముడు అనీస్ ఇబ్రహీం తమతో చెప్పినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ ఇంకో కథనాన్ని ప్రచురించింది. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జన్మించిన దావూద్ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. 1994 నుంచి పాకిస్తాన్లోని కరాచీలో ఐఎస్ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్ ప్రస్తుతం కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతడి భార్య మెహజబీన్కూ వ్యాధి సోకిందని పీటీఐ తదితర వార్తా సంస్థలు తెలిపాయి. మరోవైపు.. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ దావూద్ ఇబ్రహీం తమ్ముడు అనీస్ ఇబ్రహీంతో తాము ఫోన్లో మాట్లాడామని దావూద్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అనీస్ చెప్పినట్లు పేర్కొంది. పాక్తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మాఫియా కూడా కార్యకలాపాలను నడుపుతున్నట్లు అనీస్ అంగీకరించినట్లు వెల్లడించింది. ‘‘భాయ్ బాగున్నాడు. షకీల్ కూడా. మా ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు’’అని అనీస్ చెప్పినట్లు తెలిపింది. -
దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్..!
ఇస్లామాబాద్ : ప్రపంచ ప్రజానీకంపై పగడవిప్పుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదలట్లేదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆయన భార్య కూడా కరోనా బారినపడ్డట్లు తెలిసింది. దావూద్కు పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో గల మిలటరీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారని సమాచారం. తొలుత ఆయన భార్య మెహజీబేన్కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో దావూద్కు నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది. (లాక్డౌన్ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం) దావూద్తో పాటు మరికొంతమంది ఆయన వ్యక్తి సిబ్బందిని కూడా క్వారెంటైన్కు తరలించినట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను పాక్ మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు. -
దావూద్ సాయంతో భారీ ఉగ్ర దాడికి పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమగా ఇదే అదనుగా పాక్ భారీ కుట్రలకు తెరలేపుతోంది. సరిహద్దుల్లో ఉగ్ర పొగపెడుతూనే భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు స్కెచ్ వేస్తోంది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహకారంతో జమ్ము కశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కుట్ర పన్నింది. దావూద్తో లష్కరే ఉగ్రమూక చేతులు కలిపిందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్ ఐఎస్ఐ బృందంతో కలిసి లష్కరే నేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్లామాబాద్లోని తన ఫాంహౌస్ నుంచి దావూద్ ఆదివారం బయలుదేరి వెళ్లారని తెలిపింది. (కరోనా క్యాబ్లు వచ్చేశాయ్!) కోవిడ్-19 మహమ్మారితో భారత్ పోరాడుతున్న క్రమంలో దేశంలో దొంగదెబ్బ తీయాలని ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో సోమవారం పదకొండవ రోజున జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఇదే రోజున పలుమార్లు ఉగ్రవాదులు భద్రతా దళాల కీలక స్ధావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా హంద్వారాలో జవాన్లపై దాడికి తమదే బాధ్యతని ప్రకటించిన నూతన ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సైతం మరిన్ని దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : కరోనా కాలంలో పాక్ కుట్రలు -
ఉగ్రవాదానికీ ఊతమిచ్చిన బాబ్రీ ఘటన!
బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వమూ కొన్ని మతఘర్షణల దాఖలాలున్నాయి. కానీ బాబ్రీ తరువాత కొన్ని ఉగ్రవాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ తనదైన ఆజ్యం పోయడం పరిస్థితి విషమించడానికి దారితీసింది. ఈ సంఘటన తరువాత దాన్ని కారణంగా చూపిస్తూ ఉగ్రమూకలు తెగబడిన దాడులు తక్కువేమీ కాదు.. 1993 ముంబై దాడులు.. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్ర పన్ని అమలు చేసిన పేలుళ్లు 1993 మార్చి 12న 257 మందిని బలిగొన్నాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3.40 గంటల మధ్యకాలంలో ముంబైలోని 12 చోట్ల కార్లు, స్కూటర్లలో బాంబులుంచి పేల్చేశారు. బాంబు ధాటికి ఓ డబుల్ డెక్కర్ బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. జస్టిస్ పి.డి.కోడే సుమారు 100 మందిని దోషులుగా నిర్దారించారు. 2006లో ప్రత్యేక టాడా కోర్టు... టైగర్ మెమన్తోపాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని దోషులుగా తేల్చింది. ముంబై, కేరళ, హైదరాబాద్లలోనూ... పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2006 జూలై 11న ముంబైలోని ఓ రైల్లో బాంబు పేలుళ్లకు తెగబడటంతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక స్థానిక ముస్లింలున్నట్లు విచారణలో తేలింది. కేరళలో ఏర్పాటైన అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడగా.. సంస్థ నాయకుడు సయ్యద్ అహ్మద్ భాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2007లో కోర్టు తీర్పునిచ్చింది. అల్ ఉమాపై నిషేధం విధించారు కూడా. బాబ్రీ కూల్చివేత తరువాత ఉగ్రవాదం వైపు మళ్లిన మరో సంస్థ దీన్దార్ అంజుమన్. యూపీలో ఏర్పాటైన సిమీలో ఒకదశలో దేశవ్యాప్తంగా 400 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు, ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారని, 30 ఏళ్ల వయసులోపు వారైన వీరు పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, కొన్నింటిని అమలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సిమీ అధ్యక్షుడైన మెకానికల్ ఇంజనీర్, జర్నలిస్టుగానూ పనిచేసిన సఫ్దర్ నాగోరీ 2008లో అరెస్ట్ కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపుగా సమసిపోయాయి. 2006 నుంచి దేశంలో అత్యంత చురుకుగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల్లో ఇండియన్ ముజాహిదీన్ ఒకటి. యూపీ న్యాయస్థానాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2008 నాటి ముంబై దాడుల కోసం లష్కరే తోయిబా తరఫున ఐఎం రెక్కీ కూడా నిర్వహించినట్లు వార్తలున్నాయి. -
భారత్కు తోడుగా ఉంటాం: అమెరికా
వాషింగ్టన్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్కు అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు...‘ నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్ అజర్, హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్, దావూద్ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో ట్వీట్ చేసింది. కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)-1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నెలలోపే.. దావూద్, మసూద్, సయీద్, లఖ్వీలను కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు భారత కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఈ నలుగురిపై అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మౌలానా మసూద్ అజార్ (జైషే మహమ్మద్ చీఫ్): ప్రమేయం ఉన్న దాడులు 2001లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడులు 2001లో పార్లమెంటుపై దాడి 2016లో పఠాన్కోట వైమానిక స్థావరంపై దాడి 2017లో శ్రీనగర్లో సరిహద్దు భద్రతా శిబిరంపై దాడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణించే బస్సుపై దాడి హఫీజ్ మహమ్మద్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) : ప్రమేయం ఉన్న దాడులు 2000 సంవత్సరంలో ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో దాడులు అదే ఏడాది యూపీలో రాం పూర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి భారత్పై జరిగిన దాడుల్లో అత్యంత హేయమైనది 2008 ముంబై దాడులు 2015లో కశ్మీర్ ఉధంపూర్లో సరిహద్దు భద్రతా దళం కాన్వాయ్పై దాడి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (లష్కరే తోయిబా కమాండర్): ప్రమేయం ఉన్న దాడులు 2000లో ఎర్రకోటపై దాడి 2008 ముంబై దాడులు రాంపూర్ సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడులు జమ్మూ కశ్మీర్ ఉధంపూర్లో సరిహద్దు భద్రతా దళంపై దాడులు లఖ్వీని ఐక్యరాజ్యసమితి 2008లో అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించింది దావూద్ ఇబ్రహీం(అండర్ వరల్డ్ డాన్ ) పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్పై దాడులకి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. ఆర్థిక సాయాన్ని అందించాడు తన అనుచరులతో కలిసి దాడులకు వ్యూహరచన చేశాడు. అల్ఖైదా, తాలిబన్ల కార్యకలాపాలకు మద్దతుగా ఉన్నాడు. 257 మంది నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్న 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు దావూద్ అనుచరుల పనే. We stand w/ #India & commend it for utilizing new legal authorities to designate 4 notorious terrorists: Maulana Masood Azhar, Hafiz Saeed, Zaki-ur-Rehman Lakhvi & Dawood Ibrahim. This new law expands possibilities for joint #USIndia efforts to combat scourge of terrorism. AGW — State_SCA (@State_SCA) September 4, 2019 -
దావూద్ ‘షేర్’ దందా
న్యూఢిల్లీ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను ఎక్కడికక్కడ స్థంభింపచేస్తున్నా డ్రగ్స్ సహా అజ్ఞాత కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న మొత్తాన్ని ఆయన పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్)లో పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడైంది. పలు క్యాపిటల్ సెక్యూరిటీ సంస్థల ద్వారా దావూద్ ఇబ్రహీం తన రాబడులను పీఎస్ఎక్స్ పరిధిలోని మూడు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో మదుపు చేస్తున్నాడు. పీఎస్ఎక్స్లో దావూద్ తన అక్రమ నిధులను పెట్టుబడి పెట్టడం పట్ల భారత నిఘా సంస్ధలు కీలక ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ లావాదేవీలు, నకిలీ భారత కరెన్సీ నోట్ల రాకెట్, దోపిడీ దందాల ద్వారా దావూద్ పెద్దమొత్తంలో డబ్బు కూడబెడుతున్నాడు. దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ప్రస్తుతం లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్న జబీర్ మోతీకి చెందిన ఐదు క్యాపిటల్ సెక్యూరిటీ కంపెనీలు ప్రస్తుతం పీఎస్ఎక్స్ పరిధిలో ఉండగా, వీటి ద్వారా దావూద్ తన పెట్టుబడులను షేర్ మార్కెట్లోకి మళ్లించినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్లోని ప్రముఖ షేర్ బ్రోకింగ్ కంపెనీ హబీబ్ బ్యాంక్ సబ్సిడరీ హబీబ్ మెట్రపాలిటన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా పలు షెల్ కంపెనీల పేరుతో దావూద్ గ్యాంగ్ షేర్ మార్కెట్లోకి నిధులను మళ్లించింది. హబీబ్ బ్యాంక్ ఉన్నతాధికారులను దావూద్కు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్, దావూద్ కుమార్తె మెహ్రీన్ మామ పరిచయం చేసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హబీబ్ బ్యాంక్పై మనీ ల్యాండరింగ్ సహా ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తుందని 2017లో అమెరికా ఆర్థిక సేవల శాఖ ఆరోపించడం గమనార్హం. -
దావూద్ సోదరుడి కుమారుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ను దేశం విడిచి పారిపోతుండగా ముంబై విమానాశ్రయంలో యాంటీ ఎక్ట్సోర్షన్ విభాగం అరెస్ట్ చేసింది. దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజ వధారియాను దుబాయ్లో అరెస్ట్ చేసిన కొద్దిరోజులకే రిజ్వాన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. అహ్మద్ రజాను ఓ దోపిడీ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. రజాతో రిజ్వాన్కు సంబంధాలున్నాయని భావిస్తున్నారు. రిజ్వాన్ను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో భారత్ వేటాడుతున్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. దావూద్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న తాజా చిత్రాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దావూద్ తమ భూభాగంలోనే ఉన్నట్టు పలు ఆధారాలు లభించినా 51 సంవత్సరాల మాఫియా డాన్ పాక్లో ఆశ్రయం పొందుతున్నారన్న వార్తలను పాక్ పదేపదే నిరాకరిస్తోంది. దావూద్ను పాకిస్తాన్ సత్వరమే భారత్కు అప్పగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పాకిస్తాన్ను డిమాండ్ చేశారు. -
భారత్కు దావూద్ కీలక అనుచరుడు!
న్యూఢిల్లీ: డీ-కంపెనీ ప్రధాన హవాలా నిర్వాహకుడు అహ్మద్ రజా అలియాస్ అఫ్రోజ్ వడారియాను భారతదేశానికి తీసుకురావడంలో ముంబై పోలీసులు, భారత ప్రభుత్వం గొప్ప పురోగతిని సాధించాయి. చోటా షకీల్, ఫహీమ్ మక్మాచ్లకు సన్నిహితుడైన రజా సూరత్, ముంబై, థానేలలో డీ-కంపెనీ వ్యాపారాలని నిర్వహిస్తున్నాడు. రజా సూరత్లో వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ముంబై పోలీసు బృందం గత సంవత్సర కాలం నుంచి రజాను ట్రాక్ చేస్తోంది. అతనిపై లుక్ అవుట్ నోటీస్లను కూడా జారీ చేసింది. అహ్మద్ రజాను అనూహ్యంగా గత నెలలో దుబాయ్లో అదుపులోకి తీసుకొని, భారత్కు తరలించే ప్రక్రియను భారత ఏజెన్సీలు ప్రారంభించాయి. ముంబై, థానే మరియు సూరత్లలో అతని సహాయకులను గుర్తించడానికి క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటుచేసి విచారణను ముమ్మరం చేసింది. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చీఫ్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన నేపథ్యంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని డి-కంపెనీపైనా చర్యలు తీసుకోవాలని భారతదేశం ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ను కోరుతోంది. దావూద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో కలిసి పనిచేస్తున్నాడు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్వహించడమే కాకుండా దేశంలోకి నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ల ద్వారా డీ-కంపెనీ నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తుంది. భారతదేశానికి నకిలీ నోట్లను తరలించడానికి, డి-కంపెనీ కార్యకలాపాలకు నేపాల్ ఒక రవాణా కేంద్రంగా పనిచేస్తోంది. డి-కంపెనీకి ముఖ్య సహాయకుడు జబీర్ మోతీవాలాను అమెరికాకు అప్పగించకుండా ఉండటానికి పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలపై మోతీవాలాను లండన్లో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. చేశారు. మోతీవాలాను అమెరికాకు తరలిస్తే, దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐతో ఉన్న సంబంధాన్ని అతను బహిర్గతం చేస్తాడని పాకిస్తాన్ భయపడుతోంది. మిలియన్ డాలర్ల అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ నడుపుతున్న ప్రపంచ ఉగ్రవాదిగా దావూద్ ఇబ్రహీంను అమెరికా ఇప్పటికే ప్రకటించింది. -
పాకిస్తాన్లోనే అండర్ వరల్డ్ డాన్
న్యూఢిల్లీ : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. దావూద్ పాక్లోనే ఉన్నాడన్న భారత్ ఆరోపణలను దాయాది దేశం పదే పదే ఖండించినప్పటికీ, అతడు పాకిస్తాన్లోనే తలదాచుకుంటున్నట్లు జీ-న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత 25 ఏళ్లుగా పరారీలో ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు, డి-కంపెనీ అంతర్జాతీయ నెట్వర్క్కు నాయకత్వం వహిస్తున్న జబీర్ మోతీవాలాను దావూద్ కలిసినట్లుగా ఉన్న ఫోటోలు లభించినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను జీ న్యూస్ విడుదల చేసింది. ఇందులో క్లీన్షేవ్లో ఉన్న దావూద్ను మనం చూడవచ్చు. నిజానికి అతడు మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినా.. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం... మోతీవాలా కరాచీలోని దావూద్ ఇళ్లు క్లిఫ్టన్ హౌస్ పక్కనే నివసిస్తున్నాడు. అతను దావూద్ భార్య మెహజబిన్, అతని కుమారుడు మొయిన్ నవాజ్లతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు.కాగా వ్యాపారవేత్త ముసుగులో మోతీవాలా దోపిడీలకు పాల్పడటంతో పాటుగా.. హెరాయిన్ స్మగ్లింగ్ చేయడం, మనీలాండరింగ్కు పాల్పడ్డాడంటూ ఎఫ్బీఐ అతడిని అరెస్టు చేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ యార్డ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతీవాలా కేవలం వ్యాపారవేత్త మాత్రమేనని, అతడిని అమెరికా ప్రభుత్వానికి అప్పగించలేమని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దావూద్తో కలిసి అతడు కరాచీలో ఉన్నట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో దావూద్ ఉనికి గురించి మోతీవాలా ఇప్పటికే వెల్లడించినట్లు ఎఫ్బీఐ సంస్థ తెలిపింది.మోతీవాలా దావూద్ కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి గనుక అతడి వద్ద డి-కంపెనీ డాన్ గురించి అతని దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంటుందనే నేపథ్యంలో .. డి-కంపెనీ కార్యకలాపాలపై ఎఫ్బీఐని సంప్రదించడానికి భారత ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. కాగా ఎఫ్బీఐ దర్యాప్తు ప్రకారం.. ‘మోతీవాలా 10సంవత్సరాలుగా యూకే వీసాతో అక్కడ ఉంటున్నాడు. ఇది 2028తో ముగియనుంది. అయితే గత కొన్ని నెలలుగా అతడు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్ కంపెనీలో 2 మిలియన్ డాలర్లు జమ చేశాడు’ అని వెల్లడైంది. అయితే దావూద్కు పరోక్షంగా సహకరిస్తున్న పాకిస్తాన్.. మోతీవాలాను కాపాడేందుకు యత్నిస్తోంది. మోతీవాలాపై ఎఫ్బీఐ మోపిన అభియోగాలను లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనం. మోతీవాలా ఒక గౌరవ వ్యాపారవేత్త అని, అతడికి డి-కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ హైకమిషన్ పేర్కొంది. అంతేగాక ఈ మేరకు యూకే వెస్ట్మినిస్టర్ కోర్టులో న్యాయమూర్తికి లేఖ ఇచ్చింది. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలించినట్లైతే మోతీవాలా అరెస్టుతో దావూద్ ఆచూకీ బహిర్గతం అవుతుందని పాక్ ఎంతగా వణికిపోతుందో అర్థమవుతోంది. ఇక మోతీవాలా ఆచూకీ కనుగొనేందుకు ఎఫ్బీఐ అతడితో హెరాయిన్ ఒప్పందం కుదుర్చుకుని ట్రాప్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్, మోతీవాల వ్యవహారాలకు సంబంధించి ఇన్ని ఆధారాలు లభించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వారిని వెనకేసుకురావడం చూస్తుంటే ఉగ్రవాదుల పట్ల దాయాది దేశం వైఖరేంటో స్పష్టంగా తెలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు
ఖాట్మండు : దావూద్ ఇబ్రహీం అనుచరుడు యూనస్ అన్సారీని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల భారత నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్సారీతో పాటు ముగ్గురు పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. భారత ఇంటలెజిన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అతడిని ఖాట్మండూ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా నేపాల్ మాజీ మంత్రి సలీం అన్సారీ, ఆయన కుమారుడైన యూనస్ అన్సారీకి అండర్వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఎస్ ఉగ్రవాదులతో కూడా యూనస్కు పరిచయం ఏర్పడింది. వారితో చేతులు కలిపిన యూనస్ ఐఎస్ ఫండింగ్ కోసం భారత నకిలీ కరెన్సీని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం నకిలీ కరెన్సీని తీసుకువస్తున్న ముగ్గురు పాకిస్తానీయులను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్కు చెందిన దావూద్, సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్ను కోరుతోంది. -
భారత్-పాక్ మ్యాచ్కు దావూద్ అనుచరులు?
దుబాయ్: భారత్-పాక్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ఈ క్రమంలో మ్యాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందే స్టేడియంలోని టిక్కెట్లన్నీ అమ్ముడుపోతాయి. ఆసియా కప్లో భాగంగా బుధవారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు కూడా వస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీషు మీడియా కథనాన్ని ప్రచురించింది. దాంతో ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దృష్టిసారించాయి. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు, అతని కుటుంబ సభ్యులు వస్తున్నట్లు ఈ ఆరు ఏజెన్సీలు వెల్లడించడం గమనార్హం. ఇండో-పాక్ మ్యాచ్ గురించి ఓ కీలక సమాచారం ఇంటెలిజెన్స్ గ్లోబల్ నెట్వర్క్కు అందింది. మరొకవైపు డీ గ్యాంగ్తో సన్నిహితంగా ఉండే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారని వాళ్లకు సమాచారం తెలిసింది. దీనిలో భాగంగా పలు దేశాలకు చెందిన నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. -
దావూద్ కొడుకు దారిలోనే ఛోటా షకీల్ కొడుకు..!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్కు షాక్ తగిలింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడంతో అరవయ్యేళ్ల పైబడ్డ షకీల్కు ఏమీ పాలుపోవడం లేదు. షకీల్ కొడుకు ముబషీర్ షైక్ (18) పవిత్ర ఖురాన్లో ఉన్న 6236 పద్యాలు కంఠస్తం పట్టడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ముబషీర్ ‘హఫీజ్ ఎ ఖురాన్’గా మారాడనీ, కరాచీలోని ఓ మసీదులో ప్రజలకు ఖురాన్ను బోధిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కొడుకు వ్యవహారంతో షాక్ తగలగా..ఆయన అనుచరుడు ఛోటా షకీల్కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దావూద్ కొడుకు మోయిన్ నవాజ్ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో అతను డిప్రెషన్కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దావూద్, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్వరల్డ్లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్ సృష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్ కొడుకు స్ఫూర్తితో ముబషీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. -
రూ.3.51 కోట్లకు దావూద్ భవనం
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని ఓ ఆస్తిని రూ.3.51 కోట్లకు ఓ ట్రస్టు సొంతం చేసుకుంది. దక్షిణ ముంబై బెండీ బజార్ ప్రాంతంలోని మసుల్లా అనే 4 అంతస్తుల భవనాన్ని వేలంలో దక్కించుకున్నామనిది సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ (ఎస్బీయూటీ) ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ ఈ వేలాన్ని నిర్వహించింది. మూడు ప్రక్రియల్లో జరిగిన వేలంలో ఈ–టెండరింగ్లో రూ.3.43 కోట్లకు ఎస్బీయూటీ బిడ్ను దాఖలు చేసింది. కాగా చివర్లో 3.51 కోట్ల ధరకు ఖరారు చేశారు. దీనిపై ఎస్బీయూటీ ప్రతినిధి మాట్లాడుతూ.. మసుల్లా భవనం నివాస యోగ్యం కాదని వెల్లడించారు. అయితే త్వరలోనే బెండీ బజార్ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఈ భవనాన్ని పునర్ నిర్మించునున్నట్లు తెలిపారు. -
ముంబైలో దావూద్ అనుచరుడి అరెస్ట్
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రామ్దాస్ రహానేను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దావూద్ గ్యాంగ్కి చెందిన రహానే పాకిస్తాన్లోని సహాచరుల ఆదేశాల మేరకు ఓ హోటల్ యాజమానిపై బెదిరింపులకు పాల్పడినందుకు ముంబై యాంటి ఎక్స్టార్షన్ సెల్(ఏఈసీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ యాజమానికి ఫోన్ చేసిన రహానే.. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అంతేకాకుండా 5 లక్షలు వెంటనే అందజేయాలని హెచ్చరించాడు. దీంతో హోటల్ యాజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో రహానే హస్తం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. సంగమనేరులోని రహానే ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఓ తుపాకిని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్పై డీసీసీ దిలీప్ సావంత్ మాట్లాడుతూ.. రహానే దావూద్ గ్యాంగ్లోని ముఖ్య సభ్యులలో ఒకరని తెలిపారు. హోటల్ యాజమాని ఫిర్యాదు మేరకు రహానేను అరెస్ట్ చేశామన్నారు. రహానేపై 11 సీరియస్ కేసులున్నట్టు వెల్లడించారు. 2011లో ప్రముఖ బిల్డర్ మనీష్పై చర్చిగేట్ సమీపంలో జరిగిన దాడిలో రహానే ప్రధాన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. 2017లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఆదేశాల మేరకు జామ్నగర్కు చెందిన వ్యాపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నందుకు రహానేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. -
దావూద్ ఫ్యామిలీకి షాక్
-
దావూద్ ఫ్యామిలీకి షాక్
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తులను స్వాధీన పర్చుకోవాలని భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు తమవేనంటూ దావూద్ తల్లి అమీనా బీ, సోదరి హసీనా పర్కార్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ముంబై నాగ్పాదలో దావూద్కి చెందిన ఆస్తులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయిన అనంతరం దావూద్ సోదరి, తల్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ‘స్మగ్లర్ల ఆస్తుల స్వాధీన చట్టం’ ప్రకారం 1998లో భారత ప్రభుత్వం.. దావూద్ సంబంధీకులు, విదేశీ సన్నిహితుల ఆధీనంలో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావూద్ తల్లి, సోదరి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు, ట్రిబ్యూనల్ వీరి పిటిషన్ని కొట్టేయటంతో చివరకు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆ ఆస్తులు తమ స్వార్జితమైనవేనని నిరూపించే ఆధారాలను చూపించాలని దావూద్ తల్లిని కోర్టు కోరింది. కానీ వారు సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయారు. పైగా పిటిషనర్లు ఇద్దరూ మరణించటంతో.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ అయ్యింది. వీరిద్దరి పేరిట మొత్తం ఏడు ఆస్తులు ఉన్నాయి. వాటిలో రెండు దావూద్ తల్లీ అమీనా బీ పేరున ఉండగా మిగితా ఐదు అతని సోదరి హసీనా పర్కార్ పేరు మీద ఉన్నాయి. కోట్ల విలువైన ఈ ఆస్తులను అక్రమ సంపాదనతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 1993 ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మరణించారు. ఈ పేలుళ్ల వెనక ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ దావూద్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. -
మదర్సా వ్యవస్థను రద్దు చేయండి : వసీం రిజ్వీ
లక్నో : మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీని హత్య చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. మదర్సాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తనని, తన కుటుంబాన్ని హతమారుస్తామని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు బెదిరిస్తున్నారని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ రిజ్వీ..! ‘పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్లలో పేరుపొందిన ఉగ్రవాదులు దియోబంధి మదర్సాలలో తయారు చేయబడ్డారు... ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని’ ఆరోపిస్తూ రిజ్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, కేబినెట్ సెక్రటరీకి ఐదు పేజీలతో కూడిన ఈ- మెయిల్ చేశారు. మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి లేఖ రాసి రజ్వీ వార్తల్లోకెక్కారు. ‘వారంతా పాకిస్తాన్ వెళ్లాలి’... రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్కు వెళ్లిపోవాలంటూ రిజ్వీ వ్యాఖ్యానించారు. మసీదు పేరిట జిహాద్ను వ్యాప్తి చేసేవారు అబూ బకర్ ఆల్-బాగ్దాదీ లేదా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షియా వర్గానికి చెందినవారు రజ్వీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి లేఖలు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించాలని గత నెలలో రిజ్వీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అంతేకాకుండా దేశంపై, దేవుడిపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటే అయెధ్యలో రామ మందిర నిర్మాణం, లక్నోలో మసీద్-ఇ-అమన్ నిర్మించేందుకు ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సహకరించాలని సూచించారు. -
డీ కంపెనీ దూకుడు..
వాషింగ్టన్ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ మెక్సికన్ డ్రగ్ కంపెనీల తరహాలో పలు అక్రమ వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. భారత మూలాలు కలిగిన పాక్కు చెందిన క్రైమ్ టెర్రర్ గ్రూప్ డీ కంపెనీ మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు భారీ నేర సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరిస్తోందని జార్జ్ మాసన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లూసీ షెల్లీ అమెరికన్ సెనేటర్లకు వివరించారు. డీ కంపెనీ ఆయుధాల రవాణాతో పాటు నకిలీ డీవీడీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా ఆర్థిక సేవల కార్యకలాపాల వంటి పలు రంగాల్లోకి చొచ్చుకువచ్చిందని ఉగ్రవాదం అక్రమ నిధులపై సెనేట్ సబ్కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న భారత అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో డీ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. పలు తీవ్ర నేరాలు, ముంబయి ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్న దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడని భారత్, అమెరికా చెబుతుండగా, తమ దేశంలో లేడని పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు. -
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్లో క్రియాశీలక ఏజెంట్గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
దావూద్ అనుచరుడు ఫరూక్ అరెస్టు
న్యూఢిల్లీ: అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడు గురువారం దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ముంబై తరలించి బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని మార్చి 19 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్ను భారత్కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్ సహాయకారిగా దోహదపడ్డాడు. -
దావూద్ కీలక అనుచరుడు అరెస్టు!
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. నేడు ముంబైలోని టాడా కోర్టులో అతన్ని హాజరు పరచనున్నారు. ఫరూఖ్ ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడు. ఇతనిపై తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై కేసులు నమోదయ్యాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దుబాయి పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్లో క్రియాశీలక ఏజెంట్గా ఎదిగాడు. దావూద్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ దుబాయ్ వేదికగా మాఫియా నడపడంలో ఫరూఖ్ది కీలకపాత్ర. 1995 లోనే ఇంటర్పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
సిటీపై డి–గ్యాంగ్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను హైదరాబాద్పై ఉందా? దీనికి ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్కు చెందిన డి–కంపెనీ హైదరాబాద్లో ఉండే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీనికోసం దావూద్ కుడిభుజం ఛోటా షకీల్ ఢిల్లీకి చెందిన షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ను రంగంలోకి దింపాడు. నసీంను నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నవంబర్లో అరెస్టు చేశారు. నసీం విచారణ నేపథ్యంలో ‘హైదరాబాద్ సెలబ్రిటీ–డి కంపెనీ’ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. టార్గెట్ నేపథ్యంలో.. నసీం ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా.. మరికొన్ని కేసుల్లో వాంటెడ్గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్ ప్రకటించారు. షార్ప్ షూటర్గా పేరున్న నసీం డి–కంపెనీకి అనుబంధంగా పని చేస్తున్నాడని, దావూద్తో పాటు ఛోటా షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని చంపడానికి రంగంలోకి దిగాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గతేడాది జూన్లో నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నసీం అనుచరుడు జునైద్ చౌదరిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నవంబర్ మొదటి వారంలో నసీంను పట్టుకున్నారు. వెలుగులోకి కీలకాంశాలు.. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో నసీం తాను ఛోటా. షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లు అంగీకరించాడు. పాక్లో పుట్టి కెనడియన్గా మారిన రచయిత తారిఖ్ ఫథాతో పాటు ‘కాఫీ విత్ డీ’ సినిమా నిర్మాత మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు బయటపెట్టాడు. తారిఖ్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆయన్ను హతమారిస్తే రూ.1.5 కోట్లు చెల్లించడానికి షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపాడు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న మరో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ కదలికల్నీ కనిపెట్టాల్సిందిగా షకీల్ చెప్పాడనీ అంగీకరించాడు. షకీల్–రాజన్ మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అతడిని హతమార్చడానికి రెక్కీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు స్పెషల్ సెల్ అనుమానిస్తోంది. షకీల్ రెండుసార్లు నసీంతో మాట్లాడి ఈ కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. రూ. 45 లక్షల సుపారీ ఛోటా షకీల్ నసీం విచారణలో హైదరాబాద్కు సంబంధించిన కోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఓ సెలబ్రిటీని చంపేందుకు షకీల్ నుంచి అతడు రూ.45 లక్షల సుపారీకి అంగీకరించాడని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్ను ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ మున్నా సింగ్తో కలసి చేయాల్సిందిగా షకీల్ స్పష్టం చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. దీనికోసం గుర్గావ్ ప్రాంతంలో మున్నాను కలిసే యత్నాల్లో ఉండగా నసీం ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సెల బ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి అంతు చిక్కట్లేదు. గతంలోనే సిటీలో డి–గ్యాంగ్ ఛాయలు కనిపించాయి. ఓ వీడియో కంపెనీ యజమానుల్ని దుబాయ్ కు పిలిపించుకుని వారిని కలిసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల్ని సంప్రదించగా.. నసీం కేసు దర్యాప్తులో ఉందని, అనేక అంశాలు వెలుగులోకి రావాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు మాత్రం సిటీ సెలబ్రిటీని డి–కంపెనీ టార్గెట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. -
చోటా రాజన్ హత్యకు మరో కుట్ర
సాక్షి,న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్ను హతమార్చేందుకు మరోసారి కుట్ర పన్నాడని వెల్లడైంది. చోటా రాజన్ హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీహార్ జైలు అధికారలను హెచ్చరించాయి. జైలులో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని కోరాయి.ఢిల్లీకి చెందిన టాప్ గ్యాంగ్స్టర్ నీరజ్ భవన సహచరుడు నిఘా ఏజెన్సీలకు ఈ సమాచారం చేరవేసినట్టు తెలిసింది. బెయిల్పై విడుదలైన ఈ గ్యాంగ్స్టర్ మద్యం మత్తులో వేరొకరితో మాట్లాడుతూ ఈ సమాచారం లీక్ చేసినట్టు వెల్లడైంది. రాజన్ను హతమార్చేందుకు గ్యాంగ్స్టర్ భవనతో డీ కంపెనీ టచ్లో ఉన్నట్టు తెలిసింది. దాదాపు రెండు దశాబ్ధాలుగా చోటా రాజన్ను మట్టుబెట్టేందుకు దావూద్ గ్యాంగ్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చోటా రజాన్ ఉన్న జైలులోనే ఉంటున్న నీరజ భవనను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సూచనతో వేరొక సెల్కు తరలించారు. భవనను ఇతర జైలుకు తరలించేముందు అతడి సెల్ నుంచి రెండు మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. తీహార్ జైలులో చోటా రాజన్ను చేరుకోవడం దావూద్ సన్నిహితులకు, భవన సన్నిహితుడికి కష్టసాధ్యమని జైలు అధికారులు చెబుతున్నారు.రాజన్కు రక్షణగా ప్రత్యేక సెక్యూరిటీ గార్డులు, కుక్లను నియమించారు. -
దావూద్ రైట్ హ్యాండ్.. రకరకాల కథలు
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావూద్ కుడి భుజంగా మెదులుతూ దశాబ్దాలుగా డీ-గ్యాంగ్ కార్యకలాపాలను షకీలే చూసుకుంటున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రాణాలతో లేడనేది దాని సారాంశం. దీనికి రకరకాల కథనాలు వినిపిస్తుండగా.. అందులో ఓ కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. పాక్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) అతన్ని ప్రాణాలు తీసిందంట. షకీల్కు, దావూద్కు మనస్ఫర్థలు వచ్చాక.. వారి మధ్య సయోధ్య కోసం ఐఎస్ఐ మధ్యవర్తిత్వం వహించిందని... అయితే అది విఫలం కావటంతో షకీల్ ఏక్షణానైనా తమ దేశానికి వ్యతిరేకంగా మారి భారత్కు సహకరిస్తాడన్న ఉద్దేశంతోనే చంపిందన్నది ఆ కథనం సారాంశం. చంపేశాక శవాన్ని సీ-130 రవాణా విమానంలో కరాచీకి తరలించి. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని.. ఈ విషయం ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్త పడ్డారంట. ఇక షకీల్ కుటుంబ సభ్యులను లాహోర్లోని ఓ ఇంటికి తరలించారని... దావూద్కు కూడా ఈ సమాచారం ఆలస్యంగా చేరిందనేది అందులో పేర్కొని ఉంది. ఇక మిగతా కథల్లో.. జనవరి 6, 2017న ప్రత్యర్థులు అతన్ని చంపారని.. ఈ మేరకు అతని గ్యాంగ్కు చెందిన బిలాల్కు ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్కు మధ్య జరిగిన ఆడియో సంభాషణల టేపు ఒకటి చక్కర్లు కొడుతోంది. గుండెపోటుతో మరణించాడనేది మరో కథనం వినిపిస్తోంది. మరో కథలో అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. దావూద్తో సంబంధాలను తెగదెంపులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడని చెబుతున్నారు. కానీ, గతంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో షకీల్ మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు భాయ్(దావూద్) తోనే ఉంటాడని చెప్పటం చూశాం. ఏది ఏమైనా ప్రస్తుతం అతని జాడ అంతుచిక్కకపోవటంతో అతను బతికున్నాడా? లేదా? అన్న విషయంపై భారత నిఘా వర్గాల్లో కూడా స్పష్టత కొరవడింది. గతంలో దావూద్ విషయంలో కూడా ఇలాగే అనారోగ్యం.. చావుబతుకుల్లో ఉన్నాడంటూ వార్తలు రావటం చూశాం. దావూద్ కోసం భారత్ మాస్టర్ ప్లాన్ ఇది కూడా చదవండి -
ఆఖరి శ్వాస వరకూ దావూద్తోనే!
ముంబై : డీ గ్యాంగ్లో విభేధాలు వచ్చాయన్న వార్తలపై ఛోటాషకీల్ తాజాగా స్పందించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని.. ఆఖరి శ్వాస వరకూ అతనితో ఉంటానని ఛోటా షకీల్ స్పష్టం చేశారు. అండర్ వరల్డ్లో డీ కంపెనీ కోసమే పనిచేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్ వేరు కుంపటి పెట్టుకున్నట్లు వచ్చిన నిఘా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దావూద్ గొడవలు వచ్చాయనడం కేవలం పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్ అన్నారు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీకే పనిచేస్తానని ఛోటా షకీల్ తాజాగా పేర్కొన్నారు. ఒక గుర్తుతెలియన ప్రాంతం నుంచి ఛోటా షకీల్ జీ న్యూస్కు ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ‘నేను భాయ్తో ఎప్పటిలాగే ఉన్నా. ఇకముందు ఉంటాను’ అని తెలిపారు. డీ గ్యాంగ్లో దావూద్కు ఛోటా షకీల్ను కుడి భుజంగా వ్యవహరిస్తారు. డీ గ్యాంగ్లో దావూద్ సోదరుడు అనీస్ పాత్ర పెరగడంతో.. షోటా షకీల్ దావూద్కు దూరమయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ను, ఛోటా షకీల్ను కలిపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని తెలిస్తోంది. -
‘డి’ డాన్ ఎవరు?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 20 దేశాల్లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్ దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరు? దావూద్ వ్యవహారాలు నచ్చని అతడి కుమారుడు మొయిన్ నవాజ్ ఇప్పటికే ఆ ముఠాకు దూరంగా ఉంటున్నాడు.. ఇప్పుడు దావూద్ ప్రధాన అనుచరుడు, ‘డి కంపెనీ’అనధికార సీఈవోగా పేరుపడ్డ చోటా షకీల్ కూడా ముఠా నుంచి బయటికి వెళ్లిపోయాడు. మరిప్పుడు ‘డి కంపెనీ’కి నాయకుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న 62 ఏళ్లు నిండుతున్న దావూద్ అనారోగ్యం కారణంగా వారసుడిపై దిగాలుగా ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. నమ్మినబంటు దూరం ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో ఉంటూ మాఫియా సామ్రాజ్యాన్ని నియంత్రిస్తున్న దావూద్ ఇబ్రహీంకు 30 ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్నాడు షకీల్. దావూద్ గ్యాంగ్ రోజూవారీ కార్యకలాపాల బాధ్యత చూసేది అతనే. దావూద్ తరఫున మీడియాతో మాట్లాడడం (కరాచీ నుంచి ఫోన్లో) చేసేదీ తనే. దావూద్ తర్వాత ‘డి కంపెనీ’కి తనే నేతృత్వం వహించవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దావూద్ కుమారుడు మోయిన్ నవాజ్కు మాఫియా కార్యకలాపాలపై ఇష్టం లేదు. ముఠా నాయకత్వం తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడని, దాంతో దావూద్ దిగులుతో ఉన్నాడని ముంబైలోని దావూద్ అనుచరుడు ఇక్బాల్ హసన్ వెల్లడించినట్లుగా పోలీసులు తెలిపారు కూడా. దీంతో కరాచీలోనే ఉంటున్న దావూద్ తమ్ముడు అనీస్కు ముఠా నాయకత్వం దక్కే వీలుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య దావూద్ సమక్షంలోనే అనీస్కు, చోటా షకీల్కు మధ్య విభేదాలు తలెత్తాయని.. అప్పటినుంచి డి గ్యాంగ్కు షకీల్ దూరంగా ఉంటున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై దావూద్ హెచ్చరించినా కూడా అనీస్ తీరు మార్చుకోలేదని.. దాంతో చోటా షకీల్ సొంత ముఠా ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాయి. అయితే దావూద్, చోటా షకీల్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. ఆ ఇద్దరు విడిపోతే భారత్కు వ్యతిరేకంగా తాము చేపట్టే కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని పాకిస్తాన్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు 20 దేశాల్లో.. భారత్తోపాటు పాకిస్తాన్, నేపాల్, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, యూఏఈ, సైప్రస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్ల వరకూ దావూద్ డి కంపెనీ నేర సామ్రాజ్యం విస్తరించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ గ్యాంగ్ ఆస్తులు, వ్యాపార కార్యకలాపాల విలువ 670 కోట్ల డాలర్ల (సుమారు రూ.40 వేల కోట్లు) అని రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. కరాచీలో ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న భారీ భవంతిలో నివసిస్తున్న దావూద్కు ప్రధానంగా హవాలా కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇదికాక మాదకద్రవ్యాల రవాణా, బలవంతపు వసూళ్లు, బినామీలతో సినిమాల నిర్మాణం, కిరాయి హత్యలు, రియల్ ఎస్టేట్, బెట్టింగ్, ఉగ్రవాదం, నకిలీ నోట్ల చలామణీ వంటి కార్యకలాపాలతో ఒక కంపెనీ తరహాలో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం నడుస్తోంది. ఈ గ్యాంగ్ ఆదాయంలో 40 శాతం భారత్ నుంచే వస్తుందని అంచనా. ఇక దావూద్కు దుబాయ్తోపాటు యూఏఈ, బ్రిటన్లలో ఇతరుల పేర్లతో చట్టబద్ధమైన ఆస్తులు ఉన్నాయి. ఒక్క ఇంగ్లండ్లోనే దావూద్ పెట్టుబడులు 45 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 వేల కోట్లు) మేర ఉంటాయని తెలుస్తోంది. డి కంపెనీ దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన వజ్రాలను గుజరాత్లో సానబెట్టే వ్యవహారాన్ని చోటా షకీల్ పర్యవేక్షిస్తాడని, ముంబైలోని గ్యాంగ్ సభ్యులకు నెలకు రూ.15 లక్షల దాకా చెల్లిస్తారని పోలీసులు చెబుతున్నారు. ముఠాలో 5 వేల మంది సభ్యులు! దావూద్ ముఠాలో ఐదు వేల మంది దాకా సభ్యులున్నారని.. లష్కరే తొయిబా, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలతో గట్టి సంబంధాలు ఉన్నాయని 2015లో అమెరికా కాంగ్రెస్ నివేదికలోనే పేర్కొన్నారు. కొన్నేళ్లు డి గ్యాంగ్లో పనిచేసిన చోటా రాజన్, అబూ సలేం, ఫాహీం తర్వాత సొంత ముఠాలు పెట్టుకున్నారు. భారత్లో కొందరు మహిళలు దావూద్ గ్యాంగ్లో పనిచేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. కరాచీలోనే దావూద్ 2015 ఆగస్టులో దావూద్ భార్య మెహజబీన్ పేరుతో ఉన్న ఒక ఫోన్ బిల్లును టైమ్స్నౌ టీవీ చానల్ సంపాదించింది. ఆ నంబర్కు ఫోన్ చేసి మాట్లాడగా.. దావూద్ నిద్రపోతున్నారనీ, తాను కరాచీలో ఉంటున్నట్టు ఆమె ధ్రువీకరించడం గమనార్హం. కానీ పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తుంటుంది. బిట్కాయిన్స్తో లావాదేవీలు తన చట్టవ్యతిరేక నగదు లావాదేవీలు సులువుగా సాగడానికి వీలుగా దావూద్ ఇబ్రహీం.. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డి గ్యాంగ్ రూ.950 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ సంపాదించిందని అతని సోదరుడు ఇక్బాల్ ఇటీవల ఓ ఇంటరాగేషన్లో వెల్లడించాడు. ఈ బిట్కాయిన్స్ను రియల్ ఎస్టేట్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాల్లో చెల్లింపులకుఉపయోగిస్తున్నారని బయటపెట్టాడు. ఎవరీ చోటా షకీల్? 1988లో దావూద్ గ్యాంగ్లో చేరిన షకీల్ అసలు పేరు షకీల్ షేక్. దావూద్తో పాటు దుబాయ్ పారిపోయాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడు. 2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసు సహా అనేక మంది శివ సైనికుల హత్యలతో షకీల్కు సంబంధముంది. 2000లో బ్యాంకాక్లో డి గ్యాంగ్ ప్రధాన శత్రువు చోటా రాజన్పై హత్యాయత్నం కూడా షకీల్ పన్నిన పథకం ప్రకారమే జరిగింది. డి కంపెనీకి అత్యధిక ఆదాయం వచ్చే భారత్లో కార్యకలాపాలన్నిటికీ బాధ్యుడు ఇతనే. దేశంలో కిరాయి హంతకుల ఎంపిక, రిక్రూట్మెంట్ అంతా షకీల్ కనుసన్నల్లోనే జరుగుతుందని చెబుతారు. షకీల్ తర్వాత టైగర్ (ఇబ్రహీం) మెమన్, ఉస్మాన్ చౌధరీ తదితరులు డి ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనీస్కే ముఠా పగ్గాలు? కస్కర్ అనే ఇంటి పేరున్న కొంకణ ముస్లిం కుటుంబంలో పుట్టిన దావూద్కు 11 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో దావూద్ అన్న షాబీర్ గ్యాంగ్వార్లో మరణించగా.. సోదరి హసీనా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయింది. ప్రస్తుతం దావూద్ అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గ్యాంగ్ అధీనంలోని ఆస్తులను కుటుంబ సభ్యులకు, ఓ ట్రస్టుకు పంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లోని నేర సామ్రాజ్యాలు నడిపే కుటుంబాల మాదిరిగానే ముఠా నాయకత్వాన్ని ఇబ్రహీం కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే దావూద్ సోదరుడు అనీస్కే నాయకత్వం దక్కుతుందని కొందరు చెబుతుండగా.. అనీస్కు కూడా వయసు పైబడిందని డి గ్యాంగ్ను నడిపే స్థితిలో లేడని వార్తలొస్తున్నాయి. -
డీ గ్యాంగ్లో సంక్షోభం
ఇస్లామాబాద్ : ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితులు.. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న చోటా షకీల్ కొన్నాళ్లుగా కరాచీలో ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విబేధాల వల్ల దావూద్ను చోటా షకీల్ కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని చీకటి సామ్రాజ్యంలో గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు ఒక రిపోర్ట్ ద్వారా బయటకు తెలిసింది. వీరిద్దరూ విడిపోతే భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేమని ఐఎస్ఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చోటా షకీల్ అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దావూద్ కుడి భుజంగా చోటాషకీల్ను డీ గ్యాంగ్ పిలుచుకుంటారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం వల్ల ఇద్దరి మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. డీ గ్యాంగ్ నిర్వహణలో అనీస్ జోక్యం పెరిగిపోవడంతో చోటా షకీల్ దావూద్తో విభేధించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో చోటా షకీల్ తాజాగా తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇదిలాఉండగా.. చోటా షకీల్-దావూద్ ఇబ్రహీం మధ్య తిరిగి సయోధ్య నెలకొల్పేందుకు ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. డీ గ్యాంగ్ సహకారం వల్ల అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్లు పాకిస్తాన్ తెగబడింది. ఈ నేపథ్యంలోనే వారిని కలిపేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
బురదలోంచి వెలుగులోకి
ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపాదించు కున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. మొదట దావూద్ ఇబ్రహీం గురించి. ఆయనది పెద్ద సామ్రాజ్యం. చాలా దేశాలలో ఆయ నకి పాలెస్లు ఉన్నాయి. ప్రతీ పాలెస్ పేరూ ‘వైట్ హౌస్’. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక పాకిస్తాన్లో మోయిన్ పాలెస్ నిర్మించారు. దాని చుట్టూ అనునిత్యం పహారా కాసే తుపాకీ వీరులు. ఆ పాలెస్ గదుల్లో స్వరోస్కి క్రిస్టల్ చాండ లీర్స్, ఒక చిన్న జలపాతం, ఎప్పుడు పడితే అప్పుడు ఉష్ణోగ్రతని నిర్ణయించగల స్విమ్మింగ్ పూల్, ఒక టెన్నిస్ కోర్టు, ఒక బిలియర్డ్స్ కోర్టు, ఉదయం జాగింగ్ చెయ్యడానికి ప్రత్యేకమైన ట్రాక్ ఉన్నాయి. ఆయన స్పెషల్ అతిథులు మోయిన్ పాలెస్లోనే ఉంటారు. మరికాస్త మామూలు అతిథులు పక్కనే ఉన్న బంగ ళాలో ఉంటారు. ఆయనది ఒక మహా చక్రవర్తి జీవితం. ఆయన సూట్లు లండన్ ‘సెవైల్ రో’లో తయారవుతాయి. ఆయనకి ఖరీద యిన గడియారాలు సేకరించడం సరదా. ఆయనెప్పుడూ పాటక్ ఫిలిప్ రిస్టువాచీలనే వాడుతాడు. ఆ వాచీలు అరుదైన వజ్రాలతో పొదగబడినవి– ఖరీదు లక్షల్లో ఉంటుంది. నల్ల కళ్లద్దాలు మాసె రాటీ బ్రాండువి. ఆయన వజ్రాలు పొదిగిన పెన్ను తోనే సంతకాలు చేస్తాడు. ఆ పెన్ను ఖరీదు కనీసం ఐదు లక్షలు. ఆయనకి చాలా కార్లు న్నాయి. కానీ బాంబులు పడినా చెక్కుచెదరని నల్లటి మెర్సిడిస్లోనే ప్రయాణం చేస్తారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రక్షణను చూసే పాకిస్తాన్ రేంజర్ల కట్టుదిట్టాలు– బహుశా పాకిస్తాన్ అధ్యక్షుడి రక్షణ కవచాన్ని కూడా వెక్కిరిస్తున్నట్టుంటాయి. అయితే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇవ్వ లేనిది ఒకటుంది. కంటి నిండా నిద్ర. నిద్ర దావూద్కి దూరం. పగలు ఏ కాస్తో నిద్రపోయి, రాత్రి వేళల్లో తన ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఎందరో మంత్రులు, బ్యూరోక్రాట్లు, మహానుభావులు ఆయన్తో ఇంట ర్వ్యూకి తహతహలాడుతుంటారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వెయిటింగ్ గదిలో అల్లా డుతుంటారు ఆయన దర్శనానికి. ఇదీ దావూద్ ఇబ్రహీం అనే హంతకుడి జీవన శైలి. డి–కంపెనీ అధినేత, కుట్రదారుడు, హవాలా చక్రవర్తి– ఇవన్నీ ఆయన బయట ప్రపంచం ఆయనకి పెట్టిన పేర్లు. ప్రపంచంలో ఉన్న పదిమంది గొప్ప నేరస్తుల జాబితాలో ఆయనది మూడవ స్థానం. ఆయన్ని పట్టుకున్నవారికి అమెరికా 250 లక్షల బహు మతిని ప్రకటించింది. ఆయనకి నాకూ చిన్న బంధుత్వం ఉంది. భారత దేశాన్ని తన అందంతో ఉర్రూతలూగించిన మందాకిని (‘రామ్ తెరీ గంగా మైలీ’ తార) ఆయన గర్లఫ్రెండ్. ‘భార్గవ రాముడు’ చిత్రంలో నా గర్ల్ఫ్రెండుగా నటించి క్లైమాక్స్లో నన్ను హత్య చేసింది. దావూద్ ఇబ్రహీం ఒక నిజాయితీపరుడైన పోలీసు కానిస్టేబుల్ కొడుకు. మొదటినుంచీ నేర ప్రపంచంతో సంబంధాలున్న దావూద్ ఒకానొక దొమ్మీలో తన సోదరుడిని ఒక ముఠా దారుణంగా హత్య చేయగా– వాళ్లని వెంటాడి ఒంటి చేతిమీద వారిని అంతే దారుణంగా హత్య చేసి– నేర ప్రపం చంలో వ్యక్తుల నరాల్లో వణుకు పుట్టించి– రాత్రికి రాత్రి ‘డాన్’గా అవతరించాడు. ఇది ‘దోంగ్రీ టు దుబాయ్’ పుస్తకంలో హుస్సేన్ జైదీ కథనం. ప్రతీ క్షణం హత్య, నేరం, పగ, తిరుగుబాటు, లొంగుబాటు, రివాల్వర్లు, తుపాకులు, దొమ్మీలతో సతమతమయ్యే జీవితం అతనిది. నిద్రకి అవకాశం లేని, ఆస్కారమూ లేని– అశ్విన్ నాయక్, ఛోటా షకీల్, అబూ సలీం, ఛోటా రాజన్, అరుణ్ గావ్లీ వంటి పేర్లతో ప్రతిధ్వనించే పాలెస్ జీవితం అతనిది. ఈయనకి ఒక్క గానొక్క కొడుకు– మోయిన్ నవాజ్ డి. కాస్కర్. వయస్సు 31. ఇంత గొప్ప, అనూహ్యమైన నేర సామ్రా జ్యానికి అతనొక్కడే వారసుడు. వైభవానికి ఆఖరి మెట్టుగా నిలిచిన ఈ పాలెస్లో అతని జీవితం గడిచి ఉంటుంది. హత్యలూ, గూడుపుఠా ణీలు, గూండాలు, అవధుల్లేని ధనం, అధికారం మధ్య అతని జీవితం గడిచి ఉంటుంది. కానీ ఇదేమిటి! మోయిన్ నవాజ్కి తండ్రి జీవితం పట్ల ఏవగింపు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా తండ్రి వైభవానికి దూరమయ్యాడు. అల్లా పిలుపుని గ్రహించి– ఒక మసీదులో మౌల్వీగా, మత గురువుగా మారిపోయాడు. తండ్రి వైభవానికి దూరమై– పవిత్ర ఖురాన్లో 6236 సూక్తులనూ కంఠస్థం చేసి మత గురువుగా మారిపోయాడు. తండ్రి నిర్మించిన పాలెస్కి దూరంగా ఒక మసీదు పక్కన చిన్న ఇంట్లో ఉంటు న్నాడట. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక దావూద్ ఇబ్ర హీం చాలా మనస్తాపానికి గురి అవుతున్నట్టు వార్త. ఆశ్చర్యం లేదు. అంతులేని సంపదా, అనూహ్య మైన ‘అవినీతి’ జీవనం ఏదో ఒకనాటికి వెగటు పుట్టిస్తుంది. ముఖం మొత్తుతుంది. It is a natural metamorphosis of the progeny from evil to righteousness ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపా దించుకున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. - గొల్లపూడి మారుతీరావు -
కుటుంబ కలహాలతో దావూద్ సతమతం!
ఠాణే: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ప్రస్తుతం కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు మహారాష్ట్రలోని ఠాణేలో ఉన్న బలవంతపు వసూళ్ల నిరోధక విభాగం (ఏఈసీ) అధికారులు ఇటీవల వెల్లడించారు. దావూద్ మూడో సంతానం, ఏకైక కొడుకైన మొయిన్ నవాజ్ కస్కర్ తన తండ్రి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడట. ఆ వ్యాపారాలను చూసుకునేందుకు నవాజ్ నిరాకరిస్తుండటం దావూద్కు మింగుడుపడటం లేదట. దావూద్ తమ్ముడు ఇబ్రహీంను ఏఈసీ అధికారులు గత సెప్టెంబరులో పట్టుకుని కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. దావూద్ కుటుంబ విషయాల గురించి విచారణలో ఇబ్రహీం పలు విషయాలు బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మత ప్రబోధకుడిగా మారాలనుకుంటున్న నవాజ్... కుటుంబ సభ్యుల మాటలు అసలు వినడం లేదట. దీంతోపాటు దావూద్కు మరికొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉన్నట్లు విచారణలో తెలిసిందని అధికారులు చెబుతున్నారు. -
కొడుకు వ్యవహారంతో కుమిలిపోతున్న దావూద్
ఠాణే : పాకిస్తాన్లో తల దాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డిప్రెషన్తో నలిగిపోతున్నట్లు తెలిసింది. డబ్బు, గన్ పవర్స్ ఉన్నా.. కుటుంబ వ్యవహారాలతో సతమతమవుతున్నట్లు పోలీసులకు రిపోర్టులు అందాయి. తన ఒకే ఒక్క తనయుడు మోయిన్ నవాజ్(31)తోనే దావూద్ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వారసత్వాన్ని కొనసాగించేందుకు నవాజ్ ‘నో’ చెప్పడంతో దావూద్ కుమిలిపోతున్నట్లు సమాచారం. తాను మత ప్రభోదకుడిగా మారిపోతానని మోయిన్ నవాజ్ దావూద్కు చెప్పినట్లు తెలిసింది. చట్టవిరుద్ద కార్యకలాపాలు చేసేందుకు మోయిన్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. నవాజ్కు ఖురాన్పై మంచి పట్టు ఉందని కూడా తెలిసింది. మత ప్రభోదకుడు కావడం నవాజ్ చిన్ననాటి కోరిక అని కూడా సమాచారం. అందుకోసం ఇంటికి దగ్గరలోని మసీదులోనే నవాజ్ నివాసం ఉంటున్నాడని తెలిసింది. -
పద్మావతిలో దావూద్ డబ్బులు!
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రంపై మరోసారి రాజ్పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం భాగస్వామిగా ఉన్నాడంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో గత రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన దీపికపై కూడా మండిపడ్డారు. ఈ చిత్రంలో ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి దావూద్ హస్తం కూడా ఉంది. అతను దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తే.. వాటితో భన్సాలీ పద్మావతిని తీశాడు. కరాచీ నుంచి నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అని కల్వి తెలిపారు. ఇక చిత్రం విడుదలైన తీరుతుందంటూ దీపిక పడుకొనే తనకు సవాల్ విసరటంపై ఆయన ధ్వజమెత్తారు. చిత్రాన్ని పద్రర్శించకుండా ఆటలాడుతున్నారని.. ఇంతలో సెన్సార్ గొడవ... చిత్ర విడుదల వాయిదా అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సినిమా థియేటర్లకు రాబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దీపికను తగలబెడితే కోటి పద్మావతి చిత్రంపై మరో నజరానాను ప్రకటించారు. ఈ చిత్ర హీరోయిన్ దీపికను సజీవంగా తగలబెట్టినవారికి కోటి రూపాయల నజరానా ఇస్తామని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం యువ నేత భువనేశ్వర్ సింగ్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పద్మావతి మహారాణి చేసిన త్యాగం గురించి అర్థం చేసుకునేంత తెలివి దీపికకు లేదు. అందుకే అలాంటి వాళ్లు బతకటానికి వీల్లేదు అంటూ భువనేశ్వర్ తెలిపారు. ఇంతకు ముందు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో ఆర్డినేటర్ సూరజ్ పాల్ అము.. భన్సాలీ, దీపిక తలలపై 10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. -
1993 పేలుళ్ల కంటే భారీ దాడి చేస్తాం
ముంబై: ముంబైలోని దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం నేపథ్యంలో అతని అనుచరురు ఒక చానల్ రిపోర్టర్కు ఫోన్ చేసి బెదిరించారు. కరాచీ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ లో ఉస్మాన్ చౌదరీగా పరిచయం చేసుకున్న దావూద్ అనుచరుడు.. వేలం స్థలాల్లో ఏ నిర్మాణాలు కట్టనివ్వమని బెదిరించాడు. ‘1993 నాటి పేలుళ్లు మరిచిపోయారా?. అంతకంటే పెద్ద దాడి చేస్తాం’ అని హెచ్చరించాడు. ఆస్తుల్ని వేలం వేయడంపై దావూద్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని పేర్కొన్నాడు. దావూద్, అతని అనుచరుడి మధ్య ఫోన్ సంభాషణను ప్రసారం చేసిన అనంతరం చానల్ రిపోర్టర్కు ఈ ఫోన్ కాల్ వచ్చింది. మరోవైపు దక్షిణ ముంబైలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన ఆస్తులను వేలం వేయగా రూ.11.58 కోట్లు వచ్చింది. సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్టు వీటిని సొంతం చేసుకుంది. వీటిలో ఢిల్లీ జైకా(రానక్ అఫ్రోజ్) అనే హోటల్ రూ.4.53 కోట్లు, షబ్నామ్ గెస్ట్ హౌస్ రూ.3.52 కోట్లు, దామర్వాలా భవంతిలోని ఆరు గదులు రూ.3.53 కోట్ల ధరలు పలికాయి. -
పాక్ వెళ్లగొట్టేలా భారత్ సూపర్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు దిగినట్లు ఓ ఐబీ అధికారి తెలిపారు. అతని ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ అతన్ని గత మూడు నెలల్లో నాలుగైదు ప్రాంతాలకు మార్చిందంట. ప్రస్తుతం కరాచీ నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టిన దావూద్ దుబాయ్లో ఉన్న ఓ వ్యక్తితో సంభాషిస్తుండగా ఆడియోలను రికార్డు చేసిందని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వంతో ఐబీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య డ్రగ్స్ వ్యవహారంతోపాటు, ముంబైలో లావాదేవీలు చూసుకుంటున్నాడంట. దీంతో ఎలాగైనా అతన్ని బయటకు రప్పించే ఉద్దేశ్యంతో ఉన్న భారత్ ప్లాన్ బీ ని అమలు చేయబోతుంది. దాని ప్రకారం అతని వ్యాపారాలను లక్ష్యంగా నాశనం చేయబోతుందంట. తద్వారా ఆర్థికంగా దావూద్ను దెబ్బతీయటం.. ఆ దెబ్బకు పాక్ కూడా అతనికి సహకరించటం ఆపేస్తుందని భారత్ భావిస్తోంది. -
దావూద్ హోటల్ కూల్చేసి.. టాయిలెట్ కట్టిస్తా!
ముంబయి : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ హోటల్ మరుగుదొడ్డిగా మారనుంది. కరడుగట్టిన హిందూత్వ వాది స్వామి చక్రపాణి ప్రభుత్వం నిర్వహించే వేలంలో దానిని దక్కించుకుని ఆ స్థానంలో పబ్లిక్ టాయిలెట్ను నిర్మిస్తానని ప్రకటించారు. ఇంతకుముందు ఆయనే.. దావూద్కు చెందిన కారును వేలంలో దక్కించుకుని ఆ తర్వాత దానిని తగులబెట్టేసిన విషయం తెలిసిందే. భేండి బజార్లో మాఫియా డాన్కు ఢిల్లీ జైకా అనే హోటల్ ఉండేది. ముంబై దాడుల అనంతరం, దావూద్ దొంగచాటుగా విదేశాలకు పారిపోవటంతో ప్రభుత్వం అతని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో అతని కారుతోపాటు హోటళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కారును వేలానికి ఉంచగా స్వామి చక్రపాణి దానిని దక్కించుకుని, తగులబెట్టారు. రెండేళ్ల క్రితం హోటల్ వేలం నిర్వహించగా అది సఫలం కాలేదు. దీంతో ఈ నెల 14వ తేదీన మరోసారి వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో తానే దక్కించుకుంటానని, దానిని కూలగొట్టి ఆ ప్రదేశంలో పబ్లిక్ మరుగుదొడ్డిని నిర్మిస్తానని శుక్రవారం ఆయన ప్రకటించారు. టాయిలెట్ నిర్మాణం పూర్తయ్యాక దానిని ప్రారంభించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను ఆహ్వానిస్తానని చెప్పారు. తీవ్రవాదానికి, తీవ్రవాదులకు ఎలాంటి చివరికి గతి పడుతుందో చెప్పటానికి ఈ పని చేస్తున్నానని స్పష్టం చేశారు. స్వామి చక్రపాణి ఆప్తమిత్రుడు, ఢిల్లీకి చెందిన న్యాయవాది అయిన అజయ్ శ్రీవాస్తవ మాఫియా డాన్కు చెందిన నగ్పడాలోని భవనాన్ని వేలంలో సొంతం చేసుకున్నారు. అనంతరం దానిని కూడా చక్రపాణికి చేశారు. ఆ భవనంలో ఆస్పత్రి ప్రారంభించి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ప్రకటించారు. దీనిద్వారా దావూద్ తీవ్రవాద చర్యలకు బలైన వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని చెప్పారు. -
దావూద్ అనుచరుడిని వినకపోతే ఖతం చేస్తా..
బంజారాహిల్స్: నేను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ అనుచరుడినని ...తనతో సంబంధం కొనసాగింకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూర్కు చెందిన యువతి(33) కమలాపురి కాలనీలో ఉంటూ సాఫ్ట్వేర్ సంస్దలో టెక్నికల్ రైటర్గా పనిచేస్తోంది. గత జూన్లో ఆమెకు ఫేస్బుక్ ద్వారా డీజే. అడ్డి దుబాయ్ అలియస్ ఎండీ సఫీ –ఉర్– రెహమాన్ అలియాస్ సఫీతో పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు లేరని దుబాయ్ పౌరసత్వం ఉందని, గత 8 ఏళ్లుగా అక్కడే డీజేగా పనిచేస్తున్నానని ఒక కేఫ్తో పాటు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నట్లు నమ్మించాడు. గత జులైలో ఇద్దరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సహజీవనం చేశారు. అతడికి అప్పటికే వివాహం జరిగిందని, ఒక కుమార్తె కూడా ఉందని, తల్లిదండ్రులతో కలిసి అత్తాపూర్ హుస్సేన్కాజిల్లో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ఈ నెల 2న అడ్డీని నిలదీయగా ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీంతో అతను తన లాప్ట్యాప్తో పాటు ఫోన్, నగలు, నగదు తీసుకుని పరారయ్యాడని ఈ విషయం పోలీసులకు చెబితే తనతో దిగిన ఫోటోలను సోషల్మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో విడిపోవాలని తాను నిర్ణయించుకున్నా తాను పిలిచినప్పుడల్లా వచ్చి కోరికలు తీర్చాల్సిందిగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనకు సహకరించకపోతే దావూద్ ఇబ్రహీంతో చెప్పి అడ్రస్ లేకుండా చేయిస్తానని హెచ్చరిస్తున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అడ్డి దుబాయ్పై పోలీసులు ఐపీసీ కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు, ఎస్ఐ వినోద్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ కుట్ర...!
-
మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ కుట్ర..!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో మారణహోమానికి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రపన్నాడా? ముంబైలో దాడులు చేసి.. అల్లకల్లోలం రేపాలని డీ గ్యాంగ్ స్కెచ్ వేసిందా? అంటే ముంబై పోలీసులు ఔననే అంటున్నారు. ముంబైలో మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ కుట్ర పన్నిందని, అన అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులు చేయాలని పథకం రచించిందని పోలీసులు చెప్తున్నారు. దావూద్, అనీస్ ఇబ్రహీం మధ్య ఫోన్ కాల్స్ను ట్యాప్ చేయడం ద్వారా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. దావూద్ కుట్ర గురించి తెలియడంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు.. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. దాదాపు 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతంలో పాకిస్థాన్లో నివసిస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు, ఉగ్రవాది అయిన దావూద్ భారత్లో విధ్వంసానికి ఎప్పటికప్పుడు కుట్ర పన్నుతున్న సంగతి తెలిసిందే. ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్ను భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా.. దావూద్ తమ వద్ద లేడని పాక్ బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. -
కస్కర్ దోపిడీ కేసులో నిందితుడిగా దావూద్
ముంబై : ఇక్బాల్ కస్కర్పై తాజాగా పోలీసు లు నమోదు చేసిన దోపిడీ కేసులో దావూద్ తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీంను నిందితులుగా పేర్కొన్నారు. 38 ఎకరాల స్థలం కొనుగోలుకు సంబం ధించి తనను బెదిరించి రూ.3 కోట్లు తీసు కున్నట్లు బిల్డర్ ఫిర్యాదు చేయడంతో కస్కర్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దోపిడీ కేసులో ముగ్గురు సోదరు లు నిందితులుగా ఉండటం ఇదే తొలిసార ని బుధవారం పోలీసులు మీడియాకు వివ రించారు. తాజా కేసుతో దావూద్, అనీస్ పేర్లు మళ్లీ తెరపైకి వచ్చినట్లయిందన్నారు. -
నన్ను చూస్తే సినీ పెద్దలు భయపడతారు!
ముంబై: మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ అల్లుడు జుబైర్ ఖాన్ తాజాగా హిందీ బిగ్బాస్ షోలో దర్శనమిచ్చాడు. కలర్స్ చానెల్లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో జుబైర్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన జుబైర్ మాట్లాడుతూ తనకు దావూద్తో ఎలాంటి లింక్స్ లేవని స్పష్టం చేశారు. దావూద్కు చుట్టమన్న ఒకే ఒక్క కారణంతో తన కెరీర్ దెబ్బతిన్నదని, బిగ్బాస్ షో ద్వారా తనపై పడిన తప్పుడు ముద్రను చెరిపేస్తానని ఆయన చెప్పారు. 'దావూద్కు నేను చుట్టం అని తెలిసినప్పటి నుంచి నా సినిమా ప్రాజెక్టుల నుంచి బయ్యర్లు, ఇన్సెస్టర్లు వెనుకకు తగ్గారు. ప్రజలు నన్ను చూస్తే భయపడేవారు. చిత్ర పరిశ్రమలో నాపై చాలామందికి ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు బిగ్బాస్ షో ఒక అవకాశంగా భావిస్తున్నా' అని జుబైర్ తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై పోరాటడమే తనకు కావాల్సిందని, తాను ఎవరికీ భయపడనని ఆయన చెప్పారు. 'నేను పెళ్లి చేసుకున్ననాటి నుంచే రిస్క్ మొదలైంది. అప్పటి నుంచి బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభమైంది. నేను వాటిని లెక్కచేయలేదు. జీవితంలో పుట్టుక-చావు ఒక్కసారే వస్తాయి. మార్పు నిరతరం.. మరణం శాశ్వతం. ఒకరోజు ఎలాగైనా మరణం వస్తుంది. కాబట్టి పోరాడి చనిపోవడమే ఉత్తమం. పిరికితనంతో ఉండాలని నేను అనుకోవడం లేదు. సంఘ వ్యతిరేక శక్తులపై పోరాడుతాను' అని జుబైర్ తెలిపారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో అనేక చీకటి కోణాలు తనకు తెలుసునని, త్వరలోనే వాటిని బయటపడతానని హెచ్చరించారు. తమకు సమస్య వస్తే పరిశ్రమలోని చాలామంది దావూద్తో మాట్లాడుతారని, బాలీవుడ్లో మురికి రాజకీయాలు ఎక్కువ అని జుబైర్ వ్యాఖ్యానించారు. -
'నా భర్తతో చాట్ చేస్తుంటే దావూద్ ఫోన్ చేశాడు'
ముంబయి : ప్రముఖ ఉద్యమకారురాలు అంజలి దమానియాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'నేను నా భర్తతో చాటింగ్ చేస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట నాకు ఓ ఫోన్ వచ్చింది. ట్రూకాలర్ ద్వారా ఆ నెంబర్ దావూద్ది అని తెలిసింది. పాకిస్థాన్ నెంబర్ నుంచే ఆ ఫోన్ వచ్చింది. తన ఫోన్లో దావూద్ 2 అని కనిపించింది. ఈ విషయాన్ని నేను ముంబయి కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశాను. ఆయన తగిన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు' అని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు స్క్రీన్ షాట్లు కూడా పంపించారు. -
గతేడాది ముంబైకి దావూద్ భార్య
-
గతేడాది ముంబైకి దావూద్ భార్య
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ అలియాస్ జుబీనా జరీన్ గతేడాది ముంబైకి వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడ్రోజుల క్రితం అరెస్టైన దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కార్ నుంచి విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలిపారు. అతని సమాచారం మేరకు.. తన తండ్రి సలీమ్ కశ్మీరీని కలుసుకునేందుకు జుబీనా గతేడాది ముంబైకి వచ్చినట్లు, ఆ తర్వాత దేశం దాటి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. దావూద్ ఇప్పటికీ పాకిస్తాన్లోనే ఉన్నట్లు చెప్పాడన్నారు. కరాచీలో అతనికి నాలుగు నివాసాలు కూడా ఉన్నాయని తేలిందన్నారు. పాకిస్తాన్లో దావూద్తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీం, సహచరుడు చోటా షకీల్ అందరూ కలిసే ఉంటున్నట్లుగా తెలిసిందన్నారు. -
పాక్లో నాలుగు ఇళ్లు మారాడు
కీలక విషయాలు వెల్లడించిన దావూద్ ఇబ్రహీం సోదరుడు థానే : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ వెల్లడించాడు. డబ్బుల కోసం బిల్డర్ను బెదిరించిన కేసులో సోమవారం కస్కర్ను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. 8 రోజులు తమ కస్టడీకి అప్పగించడంతో పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. డీ-కంపెనీ అధినేతగా చలామణి అవుతున్న దావూద్ పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టారని కస్కర్ తెలిపాడు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్లో దావూద్ నాలుగుసార్లు ఇళ్లు మారాడని వెల్లడించాడు. అంతేకాదు పాకిస్తాన్లో తన భద్రతను మరింత పెంచుకున్నాడని చెప్పాడు. తన ఆచూకీ ఎవరైనా కనిపెడతారన్న భయంతో కుటుంబ సభ్యులతో ఫోన్ కూడా దావూద్ మాట్లాడడని తెలిపాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడికి లాటిన్ అమెరికా డ్రగ్స్ వ్యాపారులతోనూ సంబంధాలున్నాయని వెల్లడించాడు. బెదిరింపుల వ్యవహారంలో దావూద్ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం గురించి పోలీసులకు కస్కర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా తన సోదరుడు నడిపిస్తున్నాడని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. కస్కర్ వాంగ్మూలంతో దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడన్న విషయం మరోసారి రుజువైంది. అయితే పాకిస్తాన్ మాత్రం మొదటి నుంచి దావూద్ తమ భూభాగంలో లేడని చెబుతూ వస్తోంది. -
దావూద్ ఇబ్రహీం పాత్రపై ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : దోపిడీ, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి అభియోగాలపై దావూద్ ఇబ్రహీం చిన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్ను అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసుకు సంబంధించి అండర్వరల్డ్ డాన్కు ఏమైనా నేరుగా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్టు థానే పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా స్థానిక రాజకీయ నేతలు, కార్పొరేటర్ల పాత్రపైనా నిగ్గుతేల్చనున్నట్టు తెలిపారు. మూడు నగరాలతో ముడిపడిన ఈ రాకెట్లో డ్రగ్స్ కోణం ఉండే అవకాశం ఉందని థానే పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ పేర్కొన్నారు. ఇక దావూద్ సోదరుడు కస్కర్ను సోమవారం ఆయన బంధువుల ఇంటిలో 40 మంది సభ్యులుగల స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. కస్కర్ తన అన్న పేరు చెప్పి బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, గూండాలతో బిగ్షాట్స్ను బెదిరించేవాడని పోలీసులు చెప్పారు. కస్కర్ ముఠా ద్వారా థానే, ముంబయి, నవీ ముంబయిల పరిధిలో యధేచ్చగా దోపిడీ దందా సాగిందని తెలిపారు. దావూద్ పేరుతో హెచ్చరించడం కొన్ని సార్లు షూటర్లను బయటనుంచి బిహార్ నుంచి పిలిపించి బలవంతంగా ఇళ్లు, ఆస్తుల నుంచి ఖాళీ చేయించేవారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఇక్బాల్ కస్కర్, మరో ఇద్దరిని థానే కోర్టులో హాజరుపరచగా వారికి 8 రోజుల కస్టడీ విధించింది. -
దావూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
-
దావూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ప్రపంచంలో అత్యంత ధనవంతులైన గ్యాంగ్స్టర్ల జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. బ్రిటన్లో దావూద్ ఆస్తుల జప్తు నేపధ్యంలో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఈ వివరాలు వెళ్లడించింది. కొకైన్ కింగ్గా పిలువబడే ఎస్కోబార్ మొదటి స్థానంలో ఉన్నాడు. అమెరికాలో ఉపయోగించే డ్రగ్స్లో సుమారు 80శాతం ఎస్కోబార్ సరఫరా చేస్తాడు. డైలీన్యూస్ కథనం ప్రకారం 1990ల నాటికే ఎస్కోబార్ 30 బిలియన్ డాలర్ల విలువైన సంపదలు ఉన్నాయని సమాచారం. అతను అత్యంత సంపన్నుడైన నేరస్థుడిగా డైలీన్యూస్ ప్రచురించింది. దావూద్కు 2015నాటికి 6.7 బిలియన్ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయని డైలీన్యూస్ తెలిపింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో దావూద్ ఇబ్రహీం ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. -
దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ షాక్
► ఆస్తులు జప్తు చేసిన యూకే లండన్: అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన దావూడ్కు మింగుడు పడని పని చేసింది. తాజాగా బ్రిటన్ విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దీంతో పెద్ద మొత్తంలో ఇబ్రహీం ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది, ఇది భారత ప్రభుత్వానికి పెద్ద దౌత్య విజయం లాంటిది. వివరాల్లోకి వెళ్తే దావూద్కు వార్విక్షైర్లో హోటల్, మిడ్ల్యాండ్లో నివాస ఆస్తులు ఉన్నాయి. చాలాకాలంగా దావూద్పై ఆర్ధిక ఆంక్షలు విధించాలని భారత్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ దావూద్ ఆస్తులను జప్తు చేసింది. గతంలో యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్స్ టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్కు పాకిస్తాన్లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు. -
ఔను! దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడు!
భారత్కు ఎందుకు అప్పగించాలి? లాహోర్: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నాడని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఓ పాకిస్థాన్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషార్రఫ్.. దావూద్ను అప్పగించాలన్న భారత్ డిమాండ్పై స్పందించారు. 'భారత్ చాలాకాలంగా పాక్పై ఆరోపణలు చేస్తోంది. ఎందుకు ఇప్పుడు మనం మంచివారిగా మారి వారికి సహకరించాలి? దావూద్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతను తప్పక ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. భారత్ ముస్లింలను చంపేస్తోంది. దానిపై దావూద్ ప్రతిస్పందిస్తున్నాడు' అని అన్నారు. పాక్ ఆశ్రయంలోనే దావూద్ ఉన్నాడన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. కరాచీలోని ఓ విలాసవంతమైన భవనంలో దావూద్ దర్జాగా జీవిస్తున్నాడని భారత్ అనేకసారి ఆధారాలతో పేర్కొన్నా.. పాక్ మాత్రం అతను తమ దేశంలో లేడని బుకాయిస్తోంది. గత పదేళ్లుగా ఈ విషయంలో ఎన్ని ఆధారాలు భారత్ సమర్పించినా.. పాక్ మాత్రం తన వాదన మార్చుకోవడంలేదు. ఒసామా బిన్ లాడెన్ కూడా పాక్లోనే తలదాచుకుంటున్నాడని భారత్ గతంలో ఆరోపించగా.. ఆ తర్వాత అమెరికా నేవీ సీల్స్ 2011లో అతన్ని హతమార్చిన సంగతి తెలిసిందే. -
21 మారు పేర్లు ఉపయోగించిన దావూద్
-
21 మారు పేర్లు ఉపయోగించిన దావూద్
లండన్: యూకే తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు. యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్స్ టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్కు పాకిస్తాన్లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేర్లో జన్మించాడని, ఆయన భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే భారత్ తన పాస్పోర్టును రద్దుచేసిన తరువాత దావూద్ భారత్, పాక్ నుంచి ఇతరుల పేరిట పాస్పోర్టులు సేకరించి దుర్వినియోగం చేశాడని జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఇతరులతో ఆర్థికపర లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తారు. అలాగే వారి ఆస్తులను స్తంభింపజేస్తారు. -
తొలిసారి దావూద్ ఇబ్రహీం మాట్లాడాడు
న్యూఢిల్లీ: కరడుగట్టిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ 1993లో భారత్లోని ముంబయిలో పేలుళ్లకు కీలక సూత్రదారుడు దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నట్లు స్పష్టమైంది. ఆయనతో నేరుగా ఓ టీవీ చానెల్ ఫోన్లో మాట్లాడింది. దాదాపు 13 నిమిషాలపాటు సాగిన ఫోన్ సంభాషణలో తొలుత రెండు మాటలు మాత్రమే మాట్లాడిన దావూద్ ఆ తర్వాత తన అనుచరుడికి ఫోన్ ఇచ్చాడు. మొన్నటి వరకు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ వచ్చిన వార్తలకు భిన్నంగా అతడి గొంతు వింటుంటే చాలా యాక్టివ్గా ఉన్నట్లు స్పష్టమైంది. సీఎన్ఎన్ చానెల్ కరాచీలోని క్లిఫ్టన్లోగల పలాటియల్ బంగ్లాకు నేరుగా ఫోన్ చేసింది. అది దావూద్ ఇబ్రహీం ఉంటున్న బంగ్లా. తొలుత ఫోన్ చేసిన సీఎన్ఎన్ ప్రతినిధి ఏం మాట్లాడారంటే.. మీడియా ప్రతినిధి : హలో.. హలో దావూద్ : హా.. హాజీ(చెప్పండి) మీడియా ప్రతినిధి : దావూద్ సాబ్ దావూద్ : నువ్వెవరు? (ఆప్ కౌన్) మీడియా ప్రతినిధి : గుడ్ ఈవినింగ్.. మాట్లాడుతుంది సీఎన్ఎన్ ప్రతినిధి దావూద్ : నీతో చొటానీ మాట్లాడతాడు మీడియా ప్రతినిధి: ఏంటండీ.. అంటుండగానే దావూద్ తన ఫోన్ను కీలక అనుచరుడు 2013ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన జావెద్ చోటానికి ఫోన్ ఇచ్చారు. జావెద్ చోటానీ : హలో ఎవరు? మీడియా ప్రతినిధి: కొంచెం దావూద్ సాబ్కు ఫోన్ ఇస్తారా జావెద్ చోటానీ : దావూద్ ఎవరు? మీడియా ప్రతినిధి : దావూద్ ఇబ్రహీ సాబ్. మీరు పాకిస్థాన్లోని కరాచీలో ఉన్నరన్నమాట. జావెద్ చోటానీ : ఎవరు చెప్పారు? మీడియా ప్రతినిధి : ఇది పాకిస్థాన్ ఫోన్ నెంబర్ దావూద్: సమయం వృధా చేయకు(నేరుగా ఫోన్లో చెప్పకుండా చొటానీకి దావూద్ ఈ మాట చెబుతుండగా ఫోన్లో వినిపించింది) జావెద్ చోటానీ : సమయం వృధా చేస్తున్నావ్. మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు నువ్వు? నీకు అసలు ఏమన్నా తెలుసా? నువ్వు చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు.. ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మీడియా ప్రతినిధి : దావుద్ తో ఈ మాట విన్నాక చోటానీ దేవుడిని తలుచుకుంటూ దావూద్ని ఇలాగేనా అనేది, ఇలా పిలుస్తూనే ఇంటర్వ్యూ తీసుకుంటావా? అసలు ఈ ఫోన్ నెంబర్ ఎవరిచ్చారని ప్రశ్నించాడు. వెంటనే నెంబర్ తొలగించమని, మీడియా ప్రతినిధి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. నెంబర్ ఇస్తే మాట్లాడిస్తానని చెప్పాడు. దీంతో నెంబర్ ఇవ్వగా, నేరుగా స్టూడియోలో ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ప్రశ్నించాడు. దీంతో తాను కరాచీకి కెమెరా పంపిస్తానని ప్రతినిధి చెప్పగా.. కరాచీనా? ఎందుకు.. ఇంటర్వ్యూ లేదు ఏమి లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు. దీని ద్వారా దావూద్ బతికే ఉన్నాడని, అది కూడా కరాచీలోనే ఉన్నాడని స్పష్టమైంది. -
జైల్లోనే ఛోటా రాజన్ హత్యకు 'ఢీ' గ్యాంగ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు మరోసారి చేధించారు. ఛోటా షకీల్ గ్యాంగ్ సభ్యుడు జునైద్ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల జునైద్ చౌదరి ఇండియా మోస్ట్ వాంటెడ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలా టాప్ గ్యాంగ్స్టర్ కావాలనుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్లో జన్మించి కెనేడియన్ రచయితగా స్థిరపడ్డ తారెక్ ఫతా హత్యకు కుట్రపన్ని జునైద్ చౌదరి పోలీసులకు చిక్కాడు. అయితే ఈ హత్యతోనే మరో హత్యకు కుట్రపన్నాడు జునైద్. ఇప్పటికే గత ఏడాది ఛోటా రాజన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని జునైద్ పథకం రచించి విఫలమయిన విషయం తెలిసిందే. రాజన్ను చంపేందుకు జునైద్తో పాటూ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం ముందుగా ఫతాను హతమార్చి పోలీసులకు చిక్కితే నేరుగా తీహార్ జైలుకెళ్లొచ్చని స్కెచ్ గీశాడు. దీంతో జైల్లోనే చోటా రాజన్ని మట్టుపెట్టొచ్చని ప్లాన్ వేశాడు. టెర్రరిజమ్ ఖండిస్తూ ఫతా పలుమార్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఫతాని అంతమొందిచాలని జునైద్ భావించాడని డీసీపీ(స్పెషల్ సెల్) పీఎస్ కుష్వా తెలిపారు. ఫతా ఢిల్లీ రానున్న నేపథ్యంలో జునైద్ రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకాల్పురీ ప్రాంతంలోని భాగీరథి విహార్కు చెందిన ఓ పాల వ్యాపారి కుమారుడు జునైద్. -
హసీనా ప్రేమలో పడ్డప్పుడు..!
ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిగా చూడముచ్చటైన పాత్రలతో అలరించిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు రూటు మార్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ‘హసీనా’గా కరుడుగట్టిన క్యారెక్టర్లో నటిస్తూ తన అభిమానులను షాక్ ఇచ్చింది. గతంలోనే హసీనా యవ్వనంలో, వయస్సు పైబడ్డప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రద్ధా. హసీనాగా ఆమె లుక్గా మంచి మార్కులే దక్కాయి. తాజాగా హసీనా భర్త పాత్రను ఆమె రీవిల్ చేసింది. హసీనా భర్త ఇబ్రహీం పార్కర్గా అంకుర్ భాటియా నటిస్తున్నాడు. సినిమాలో భాగంగా వారిద్దరూ రొమాన్స్లో మునిగితేలిన ఓ ఫొటోను మేం ప్రేమలో పడ్డప్పుడు అంటూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రద్ధ పోస్టుచేసింది. ఈ సినిమాలో హసీనా తమ్ముడిగా శ్రద్ధ తమ్ముడు సిద్ధాంత్ కపూర్ నటిస్తుండటం గమనార్హం. సొంత తమ్ముడే సినిమాలోనూ తమ్ముడిగా నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని శ్రద్ధ పేర్కొంది. -
దావూద్ బంధువు పెళ్లి: చిక్కుల్లో మంత్రి, పోలీసులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువు పెళ్లికి హాజరైన రాష్ట్ర మంత్రి , నాసిక్ మేయర్, పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన అనుచరుడు , వైద్య విద్యాశాఖమంత్రి గిరీష్ మహాజన్ గాంగ్స్టర్ దావూధ్ బంధువుల వివాహానికి హాజరు కావడం దుమారాన్ని రేపింది. అసిస్టెంట్ పోలీసు కమిషనర్, ఇద్దరు సీనియర్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాసిక్లోని దావూద్ ఇబ్రహీం బంధువు జగ్గి కొంకణి కుమార్తె వివాహం ఆధ్యాత్మిక గురువు ఖతిబ్ కుమారుడితో మే 19న జరిగింది. దావూద్ భార్య ,వధువు తల్లి తోబుట్టువులని నాసిక్ పోలీస్ కమీషనర్ రవీంద్ర సింఘాల్ నిర్ధారించారు. నాసిక్ మేయర్ రంజనా భనసి, డిప్యూటీ మేయర్ ప్రథమేష్ గైట్, బిజెపి శాసనసభ్యులు దేవని ఫరాండే, బాలసాహెబ్ సనాప్, సీమా హిరా, స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లు తదితరులు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. దీంతో ఈ వివాహానికి హాజరైన పోలీసు అధికారులపై రవీంద్ర సింఘాల్ అంతర్గత విచారణ చేపట్టామన్నారు. వీరి స్టేట్మెంట్లను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే సెలవులో ఉన్న కొంతమంది అధికారులపై అంతర్గత విచారణ పూర్తిచేయడానికి మరో రెండు రోజులు పడుతుందని పోలీసు కమిషనర్ చెప్పారు. అభ్యంతరకరమైన, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సంబంధిత నివేదికను కోసం మా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ముస్లిం మత పెద్దల ద్వారా ఈ ఆహ్వానాలు ఎంఎల్ఏలకు, పోలీసు అధికారులకు, మరికొంతమంది కార్పొరేటర్లకు అందాయని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రులను ప్రశ్నించలేమని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వివాహాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరు కావద్దని తాము ఎవరినీ అడ్డుకోలేమన్నారు.అయితే పెళ్లికి హాజరయ్యేంతవరకు ఇది దావూద్ బంధువుల వివాహమని తనకు తెలియదని మంత్రి మహాజన్ చెప్పడం విశేషం. -
నేనా.. దావూద్ ఇబ్రహీమా!!
ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితచరిత్ర ఆధారంగా వస్తున్న ''హసీనా: ద క్వీన్ ఆఫ్ ముంబై'' సినిమాలో దావూద్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో తెలుసా.. హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, అలనాటి గ్రేట్ విలన్ శక్తికపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్! సినిమా దర్శకుడు అపూర్వ లఖియా ఈ ఆఫర్తో తన వద్దకు వచ్చినప్పుడు అసలు సిద్ధాంత్ నమ్మలేకపోయాడు. తాను దావూద్ లాంటి బలమైన పాత్రను ఎలా పోషించగలనన్న అనుమానం వచ్చింది. దాంతో ముందు ఇంటికి వెళ్లి, తన తండ్రి శక్తికపూర్ పాత కాలంలో వేసుకున్న కోట్లు, ధరించిన గాగుల్స్ తీసుకుని వాటితో తన స్నేహితుడితో ఒక ఫొటోషూట్ చేయించుకున్నాడు. వీలైనంత వరకు అచ్చం దావూద్ ఇబ్రహీం స్టైల్లో కుర్చీలో కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవడం లాంటివి చేశాడు. ఆ ఫొటోలు చూసిన లఖియా.. వెంటనే ''నువ్వే నా దావూద్ ఇబ్రహీం" అన్నాడట. ఇప్పటికే 'డి డే', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా' సినిమాల్లో దావూద్ ఇబ్రహీం పాత్రలను రిషి కపూర్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రనటులు పోషించారు. వాళ్లకంటే చాలా భిన్నంగా కనిపించాలని, ఇంతకుముందు అంతటి సీనియర్లు పోషించిన పాత్రను ఇప్పుడు తాను చేయాలంటే కొంచెం బరువు పెంచాలని కూడా సిద్ధాంత్ అన్నాడు. దావూద్ 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటాడో ఆ పాత్రను తాను పోషిస్తున్నానని, ఏ సినిమాలోనూ దావూద్ అంతటి తక్కువ వయసులో ఉండగా ఎవరూ చూడలేదని చెప్పాడు. పుస్తకాలు చదివి, వర్క్షాప్లకు హాజరై, పలువురితో మాట్లాడి దావూద్ గురించి తెలుసుకుంటున్నానని తెలిపాడు. తన తండ్రి శక్తికపూర్ చాలా నెగెటివ్పాత్రలు పోషించారని, అందువల్ల ఈ పాత్ర ఎలా చేస్తే బాగుంటుందో ఆయనను కూడా అడుగుతానని అన్నాడు. 70లు, 80లలో ఎలాంటి దుస్తులు వేసుకునేవారో తన తండ్రి తనకు చెప్పారని, ఈ పాత్ర తప్పకుండా పోషించమన్నారని తెలిపాడు. హసీనా సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని అపూర్వ లఖియా అంటున్నారు. -
దావూద్ ఇబ్రహీం మృతి?
-
దావూద్ ఇబ్రహీం మృతి?
పాక్ మీడియాలో కథనం.. నిజం కాదన్న చోటా షకీల్ న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం (61) తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కరాచీలో మృతిచెందినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే అతడు గుండెపోటుతో కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను దావూద్ చిరకాల సన్నిహితుడు చోటా షకీల్ తోసిపుచ్చారు. దావూద్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఓ టీవీ చానల్కు చెప్పాడు. 257 మందిని బలిగొన్న 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్ను పట్టుకోవడానికి భారత్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. దావూద్ తమ దేశంలో లేడని చెప్పేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అతని ఆరోగ్య వివరాలను బయటపెట్టడం లేదని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న కరాచీలోని తన అల్లుడి ఇంట్లో జరిగిన విందులో దావూద్ చివరిసారిగా బయటి ప్రపంచానికి కనిపించాడని నిఘా వర్గాల సమాచారం. -
దావూద్ ఆరోగ్యంపై స్పందించిన ఛోటా షకీల్
అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చిందని ఒకసారి.. కాదు కన్నుమూశాడని మరోసారి సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. వాస్తవానికి శుక్రవారం నుంచే దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై ఛోటా షకీల్ కరాచీ నుంచి భారతీయ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ''నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలాంటి సమస్యా లేదు'' అని ఛోటా షకీల్ చెప్పాడు. కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. అతడు గత కొంత కాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించిందని పాకిస్తానీ మీడియాలోని ఒక వర్గం తెలిపింది. అయితే ఇప్పుడు అదంతా తప్పేనని ఛోటా షకీల్ అంటున్నాడు. -
దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు
-
దావూద్కు గుండెపోటు
న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు శుక్రవారం గుండెపోటు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్ దావూద్ను ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిసింది. ఈ మేరకు దావూద్ కుడిభుజం చోటా షకీల్ జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చాడు. అయితే దావూద్కు ఏమీ కాలేదని, అతను సేఫ్గా ఉన్నట్లు మరో రిపోర్టు కూడా వచ్చింది. గతేడాది దావూద్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
దావూద్ కీలక అనుచరుడు అరెస్టు
గాంధీనగర్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన కీలక గ్యాంగ్స్టర్ దావూద్ లాలా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. అహ్మదాబాద్లోని జుహాపురా ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకుంది. గుజరాత్లో ఓ హత్య కేసుకు సంబంధించి ఎప్పటి నుంచో పోలీసులు లాలా కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా రాజస్థాన్లోని పలు కీలక నేరాల్లో అతడి చేయి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్లలో దావూద్కు చెందిన గ్యాంగ్లన్నింటిని కూడా లాలానే నడిపిస్తున్నాడని ఏటీఎస్ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు దావూద్కు ఎంతో సన్నిహితంగా ఉన్న షరీఫ్ ఖాన్కు బంధువు అని కూడా తెలిసింది. మరోపక్క, లాలాను అరెస్టు చేయడంతో అతడి మరో ముగ్గురు సోదరులు కనిపించకుండా పోయారు. వారికోసం కూడా ఏటీఎస్ అధికారులు గాలిస్తున్నారు. ఒక్క రాజస్థాన్లోనే లాలాపై 15 కేసులు ఉన్నాయట. -
'కౌర్ ను దావూద్ తో పోల్చిన ఎంపీ'
బెంగళూరు: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ ను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. కౌర్ కంటే దావూదే నయమని వ్యాఖ్యానించారు. జాతి వ్యతిరేక విధానాన్ని ప్రకటించుకోవడానికి దావూద్ ఇబ్రహీం తన తండ్రి పేరును వాడుకోలేదని ప్రతాప్ సింహా అన్నారు. గుర్మెహర్ కౌర్ వ్యవహార శైలిని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కశ్మీర్, బస్తర్ కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేయమేనా అంటూ మండి పడ్డారు. గుర్మెహర్ కౌర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని, వారి గూండాయిజంకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
దావూద్ గ్యాంగ్కు ఎదురుదెబ్బ
-
దావూద్ గ్యాంగ్కు ఎదురుదెబ్బ
అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లోని జామ్నగర్లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు. ఒక షార్ప్ షూటర్, మరో ముగ్గురిని పోలీసులు రాజ్కోట్ నగర శివార్లలో అరెస్టు చేశారు. దావూద్ సోదరుడు అనీస్ సూచనల మేరకు వాళ్లు ఇక్కడికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం తరఫు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునే అనీస్ ఇబ్రహీం.. జామ్నగర్ వ్యాపారవేత్తను చంపేందుకు రామ్దాస్ రహానే, మరో ముగ్గురికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వాళ్లు ముగ్గురూ ఓ ప్రైవేటు బస్సులో వస్తున్నారని, కన్స్ట్రక్షన్ కంపెనీ నడిపే వ్యాపారి అష్ఫఖ్ ఖత్రీ వాళ్ల టార్గెట్ అని రాజ్కోట్ డీసీసీ ఎస్ఆర్ ఒడెదరా చెప్పారు. ఆయన నేతృత్వంలోని పోలీసు బృందం షూటర్లను పట్టుకుంది. ఖత్రీని వాళ్లు టార్గెట్ చేసిన విషయం తెలిసి రాజ్కోట్ - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కువదవా పట్టణంపై తాము గట్టిగా దృష్టిపెట్టామని, మహారాష్ట్ర నుంచి నలుగురు వ్యక్తులు ఒక ప్రైవేటు బస్సులో అనుమానాస్పదంగా వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఒడెదరా తెలిపారు. బస్సులో నలుగురు అలాగే కనిపించారని, వాళ్ల లగేజి చెక్ చేస్తే అందులో ఒక పిస్టల్, ఆరు లైవ్ కార్ట్రిడ్జులు, రెండు కత్తులు, గుజరాత్, మహారాష్ట్ర పేర్లతో ఉన్న నకిలీ నంబర్ ప్లేట్లు దొరికాయని వివరించారు. రామదాస్ అనే వ్యక్తి దావూద్ గ్యాంగు తరఫున కాంట్రాక్టు కిల్లర్గా వ్యవహరిస్తాడని, అతడిపై మహారాష్ట్రలో పలు ఆరోపణలున్నాయని చెప్పారు. దావూద్ గ్యాంగు వీళ్లకు పది లక్షలకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ముందుగా ఏదో ఒక వాహనం దొంగిలించి, దానికి నకిలీ నంబర్ ప్లేటు పెట్టి ఇక్కడ పని పూర్తయ్యాక అందులోనే మహారాష్ట్ర వెళ్లిపోవాలనుకున్నారని, అందుకే ఆ ప్లేట్లు తెచ్చారని తెలిపారు. -
జకీర్నాయక్ డబ్బంతా దావూద్ ఇబ్రహీందేనా?
ముంబై: ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎన్జీవోలోకి వచ్చిన నిధులన్నీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు చెందినవేనా? కరాచీ నుంచి హవాలా రూపంలో వందల కోట్లు జకీర్ నాయక్కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) అకౌంట్లకు తరలివచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఆర్ఎఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమీర్ గజ్దర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. విచారణలో గజ్దర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దావూద్కు సన్నిహితుడైన వ్యక్తి ఐఆర్ఎఫ్ నుంచి హవాలా ద్వారా సౌదీ అరేబియా, యూకే, చిన్న ఆఫ్రికా దేశాలకు డబ్బును పంపినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయితే దేశంలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు బయటపడుతుందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే వ్యక్తి ఐఆర్ఎఫ్, దావూద్ల మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిపారు. 2012లో దుబాయ్లో సుల్తాన్ జకీర్ను కలిసినట్లు చెప్పారు. అప్పటినుంచి యూకే, ఆఫ్రికా దేశాల నుంచి డబ్బు ఐఆర్ఎఫ్కు వస్తున్నట్లు వెల్లడించారు. -
దావూద్ కా బెహన్... మాఫియా క్వీన్!
ముంబయ్ అంటే బాలీవుడ్డే కాదు, ఇండియా బిజినెస్ కాపిటల్ కూడా! అంతేనా... ముంబయ్లో భాయ్ కల్చర్ కూడా బాగా ఫేమస్. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్... చీకటి ప్రపంచంలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న మాఫియా ప్రముఖులు ముంబయ్ కేంద్రంగా పలు పనులు చేశారని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. దావుద్ చెల్లెలు హసీనా కొన్నాళ్లు మకుటం లేని మహారాణిలా ముంబయ్లో రాజ్యాధికారం చెలాయించారట! ఇప్పుడామె కథతో రూపొందుతున్న సినిమా ‘హసీనా’లో శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఫొటోలో చూస్తున్నది సినిమాలో ఆమె ఫస్ట్ లుక్. ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేసే శ్రద్ధ... కళ్లలో కనబరుస్తున్న క్రూరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకూ హసీనా జీవితంలో జరిగిన విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. -
‘దావూద్ను పట్టి తేవడం చిటికెలో పని’
మరిన్ని సర్జికల్ దాడులు కొట్టిపారేయలేం పాక్ ఉగ్రసంస్థలు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోం సయీద్ గృహనిర్భంధం కంటితుడుపు చర్యే చిత్తశుద్ధి ఉంటే వెంటనే సయీద్ను జైలులో పెట్టాలి: రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం తమకు చిటికె వేసినంత సేపు పని అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని, అతడిని పట్టుకొస్తామన్న నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. ముఖ్యంగా పాక్ విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్ధలు కొట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరిన్ని సర్జికల్ దాడులు జరిగే అవకాశాన్ని తీసిపారేయలేమని తెలిపారు. పాకిస్థాన్ తమ పొరుగు దేశం అని, ఒక వేళ మంచి కోసం పాక్ మారదామని అనుకున్నా ఆ దేశం మాటలు నమ్మి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని, అసలు అలాంటి అడుగు వేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ నుంచి ఏ ఉగ్రసంస్థగానీ, ఉగ్రవాదులుగానీ భారత్పైకి దాడి చేసేందుకు వస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని, మరిన్ని సర్జికల్ దాడులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, ఇలాంటివి జరగాలని తాము కోరుకోవడం లేదని, అలాంటి పరిస్థితి ఉంటే తప్పక ధీటుగా స్పందిస్తామని తెలిపారు. గత నాలుగు నెలల కిందట భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సయీద్ గృహనిర్భంధంపై స్పందిస్తూ.. ‘ఉగ్రవాది, లష్కరే ఈ తోయిబా, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ను గృహ నిర్బంధం చేయడం ఒక కంటి తుడుపుచర్యే. నిజంగా పాక్కు చిత్తశుద్ధి ఉంటే అతడిని ఈ పాటికే జైలు ఊచలు లెక్కబెట్టిస్తుండాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి కూడా’ అని రాజ్నాథ్ అన్నారు. దావూద్పై స్పందిస్తూ.. ఎన్నేళ్ల నుంచో తప్పించుకుని తిరుగుతున్న దావూద్ పాక్లోనే తలదాచుకున్నాడని తెలుసు. అతడిని పట్టుకొని తీసుకురావడం మాకు చిటికెవేసినంతసేపు పని. అతడిని వెనక్కి తీసుకురావడంలో విజయంసాధిస్తామన్న నమ్మకం నాకుంది. -
హీరోను దావూద్తో పోల్చిన బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. షారుక్ను ఆయన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. మంగళవారం గుజరాత్లోని వడోదర రైల్వే స్టేషన్లో షారుక్ను చూసేందుకు భారీ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కైలాష్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. దావూద్ వీధుల్లోకి వచ్చినా అతణ్ని చూడటానికి జనం వస్తారని, వచ్చే జనాల సంఖ్యను బట్టి పాపులారిటీకి కొలమానంగా భావించరాదని అన్నారు. ఈ విషయం గురించి ఇంతకుమించి మాట్లాడబోనని, ప్రజలు పర్యవసానాల గురించి ఆలోచించాలని చెప్పారు. కైలాష్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని వ్యాపం స్కాం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది మీకు పెద్దది కావచ్చు కానీ తమకు చాలా చిన్న స్కాం అని అన్నారు. ఇక మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ఆయన మాట్లాడుతూ.. రామాయణంలో సీత లక్ష్మణరేఖ దాటడం వల్లే రావణుడు అపహరించుకుని వెళ్లాడని అన్నారు. అలాగే మహిళల వస్త్రధారణపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
దావూద్ ఇంట్లో ప్రముఖ నటుడికి పార్టీ
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో సూత్రధారి అయిన దావూద్ పాకిస్థాన్లో రహస్యంగా తలదాచుకుంటున్నాడు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ దుబాయిలో దావూద్ను కలిశాడట. దావుద్ ఇంటికి టీ పార్టీకి కూడా వెళ్లాడు. అయితే ఇది జరిగి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఈ విషయాలను రిషి కపూర్ స్వయంగా వెల్లడించాడు. 'సినిమా నటుడిగా ఉన్న పేరు ప్రతిష్టలు గొప్పవారితో పాటు అనుమానాస్పద వ్యక్తులనూ కలిసే చేస్తాయి. నేను కలిసిన ఇలాంటి వ్యక్తుల్లో దావూద్ కూడా ఉన్నాడు. 1988లో నేను దుబాయికి వెళ్లాను. నా క్లోజ్ ఫ్రెండ్ బిట్టూతో కలసి దుబాయి విమానాశ్రయంలో దిగిన తర్వాత ఓ పరిచితుడు నన్ను కలిసి ఫోన్లో మాట్లాడాల్సిందిగా కోరాడు. దావూద్ మీతో మాట్లాడాలని కోరాడని చెప్పాడు. 1993లో ముంబై బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోకముందు నాటి సంగతి ఇది. అప్పటికి దావూద్ రాష్ట్రానికి శత్రువు కాదు. దీంతో నేను దావూద్తో మాట్లాడాను. దుబాయికి వచ్చినందుకు అయన స్వాగతం పలికాడు. ఏ అవసరం వచ్చినా తానున్నాని గుర్తుపెట్టుకోమన్నాడు. అంతేగాక ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మేం బస చేసిన హోటల్కు కారు పంపగా నేను ఆయన ఇంటికి టీ పార్టీకి వెళ్లాను. కారు చాలా ప్రాంతాలు తిరిగి దావూద్ ఇంటికి చేరుకుంది. దీంతో దావూద్ ఇల్లు కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తు పెట్టుకోలేకపోయాను. మద్యం తాగనని, అలాగే సర్వ్ కూడా చేయనని దావూద్ నాతో చెప్పాడు. అందుకే టీ పార్టీకి ఆహ్వానించానని అన్నాడు. ఆయన ఇంట్లో నాలుగు గంటలు గడిపాను. టీ, బిస్కట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. నేను చిన్న చిన్న నేరాలు మాత్రమే చేశానని, ఎవరినీ చంపలేదని చెప్పాడు. ఆ తర్వాత 1989లో దుబాయిలో దావూద్తో మరోసారి మాత్రమే కలిశాను. అప్పుడు నా వెంట నా భార్య నీతూ కూడా ఉంది. దావూద్ చుట్టూ పదిమంది బాడీగార్డులున్నారు. ఏదైనా సాయం కావాలంటే అడగమని చెబుతూ మొబైల్ నెంబర్ ఇచ్చాడు. అయితే ఆయన ఆఫర్ను నేను తిరస్కరించాను. నేను నటుడినని, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటానని చెబితే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దావూద్తో ఎప్పుడూ మాట్లాడలేదు' అని రిషి కపూర్ చెప్పినట్టు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. -
దావూద్ ఆస్తులను నిజంగా జప్తు చేశారా?
భారత్ నుంచి తప్పించుకొని పాకిస్తాన్లో ప్రవాస జీవితం గడుపుతున్నట్లు భావిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన 15 వేల కోట్ల రూపాయల ఆస్తులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అక్కడి ప్రభుత్వం జప్తు చేసినట్లు ‘జీ న్యూస్’లో వచ్చిన వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ‘దౌత్యపరంగా ఇది భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన ఘన విజయం’ అంటూ భారతీయ జనతా పార్టీ ట్వీట్ కూడా చేసింది. దీంతో దేశంలోని పలు ఆంగ్ల పత్రికలు, ప్రాంతీయ భాషా పత్రికలు ఆ వార్తను పునర్ ప్రచురించాయి. తొలుత ఈ వార్తను ప్రచురించిన ‘జీ న్యూస్’లో కూడా ఈ విషయం ఎవరూ చెప్పారో లేదు. వార్తకు ‘జీ న్యూస్ బ్యూరో’ అని మాత్రమే ఉంది. వార్త సోర్స్ కనుక్కునేందుకు జీ న్యూస్ బ్యూరోను పలువురు సీనియర్ జర్నలిస్టులు సంప్రదించగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిని ఓ ఆన్లైన్ మీడియా జర్నలిస్టు సంప్రతించగా తాను కారు డ్రైవింగ్లో ఉన్నానని, అరగంట తర్వాత చెబుతానని చెప్పారు. ఆయన ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఇంతవరకు స్పందించడం లేదు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జప్తు గురించి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ జర్నలిస్టులు భారత ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలన్నింటినీ సంప్రదించగా అలాంటి సమాచారమేదీ తమవద్ద లేదని వారు సమాధానం ఇచ్చారట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మీడియాకు గానీ, అక్కడి ప్రభుత్వానికి గానీ ఏమైనా తెలుసేమో కనుక్కునేందుకు తోటి జర్నలిస్టులు అక్కడి జర్నలిస్టులను సంప్రదించగా, అలాంటి వార్తేదీ అక్కడి పత్రికల్లో రాలేదని, అక్కడి ప్రభుత్వానికి గానీ, విదేశాంగ శాఖకు గానీ, అక్కడి భారత ఎంబసీకి గానీ తెలియదని అక్కడి నుంచి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘ఖలీల్ టైమ్స్’కు చెందిన సతీష్ అనే జర్నలిస్ట్ స్పష్టంచేశారు. దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన ముఖ్యమైన వార్త అటు అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి గానీ, ఇటు భారత ప్రభుత్వానికి గానీ, అక్కడి భారత ఎండసీకి గానీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎక్కడినుంచి ఈ వార్త పుట్టింది. ఇందులో అసలు నిజం ఎంతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మను తోటి జర్నలిస్టులు ప్రశ్నించగా, పార్టీలోని సమాచార, సాంకేతిక విభాగం ముందుగా ట్వీట్ చేసిందని, దానికి ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మోదీ 2015, ఆగస్ట్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించి, అక్కడి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారని, ఆయన నాడు నెరపిన దౌత్యం కారణంగా దావూద్ ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తు చేసిందని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించారు. ఇంతకు వార్తకు ఆధారం ఏమిటని ప్రశ్నించగా, పార్టీ సమాచార విభాగానికి చాలా మార్గాల నుంచి సమాచారం వస్తుంటుందని, ఏదో మార్గం నుంచి సమాచారం రావడం వల్లనే ట్వీట్ చేశారని చెప్పారు. సోర్స్ మాత్రం చెప్పలేదు. ఈ వార్తను ప్రచురించిన పలు పత్రికలు తిరిగేసినా ‘ఎకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్’ అని ఉన్నదే తప్ప సోర్స్ను ఏ పత్రికా పేర్కొనలేదు. కొన్ని పత్రికలు బీజేపీ ట్వీట్ను ఉదహరించాయి. ఏ సోర్స్ లేకుండా ఈ వార్త ఎలా వెలుగులోకి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుతో మసకబారిన మోదీ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఈ వార్తను సృష్టించారా? దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన పరిణామ చర్యలపైనే ఈ వార్త ప్రామాణికత ఆధారపడి ఉంటుంది. మున్ముందు ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
దావూద్కు మోదీ మాస్టర్ స్ట్రోక్!!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వలర్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై అధికార బీజేపీ స్పందించింది. యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దావూద్కు చెందిన రూ. 15వేల కోట్ల ఆస్తులు సీజ్ చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోదీ మాస్టర్ స్ట్రోక్ అని అభివర్ణించింది. భారత ప్రభుత్వం పంపిన దౌత్య పత్రాల వల్లే దావూద్కు వ్యతిరేకంగా ఈ చర్యలు తీసుకున్నట్టు బీజేపీ అధికార పేజీ ట్వీట్ చేసింది. ‘ప్రధాని మోదీ గొప్ప దౌత్య విజయం. యూఏఈలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులు సీజ్ చేశారు’ అని బీజేపీ పేర్కొంది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్కు వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద అణచివేత చర్య ఇదేని పేర్కొంది. 2015లో తన యూఏఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. దావూద్ ఆస్తుల చిట్టాను ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపింది. ఈ దౌత్యపత్రాల ఆధారంగా విచారణ జరిపిన యూఏఈ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తన ఫొటో కామెంట్లో వివరించింది. 59 ఏళ్ల దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుమోసిన దావూద్ యూఏఈలో ఆస్తులు సీజ్ చేయడం అతిపెద్ద చర్యగా భావిస్తున్నప్పటికీ, ఈ కథనాలను భారత నిఘావర్గాలు ఇంకా ధ్రువీకరించడం లేదు. Major diplomatic success of PM Modi: One of India's most wanted criminals, Dawood Ibrahim's properties worth Rs. 15,000 crore seized in UAE. pic.twitter.com/MMERwLoPO1 — BJP (@BJP4India) January 4, 2017 -
దావూద్ వేట షురూ.. ఆస్తులు సీజ్!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అతడి ఆస్తులన్నింటిని సీజ్ చేసేందుకు ముందడుగేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్గానీ, దర్యాప్తు సంస్థలుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. తమకు యూఏఈ నుంచి దీనికి సంబంధించి సమాచారం ఇంకా రాలేదని అంటున్నాయి. అయితే, యూఏఈ సీజ్ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్ ఇబ్రహీం అని తెలిసిందే. ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు. అతడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ 2015లో యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు దావూద్ విషయాన్ని అక్కడ ప్రభుత్వానికి చెప్పడమే కాకుండా అతడి ఆస్తుల వివరాలను అందించి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అతడి ఆస్తులు సీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్కు షాక్
-
ఛోటా షకీల్ నుంచి బెదిరింపు కాల్స్!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ నుంచి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై రైటర్ కమ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా, నిర్మాత వినోద్ రమణి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. తాము తీసిన మూవీలో కొన్ని సీన్లు డిలీట్ చేయాలని, లేనిపక్షంలో విడుదల చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారని వారు తెలిపారు. డీసీపీ బీకే సింగ్ కథనం ప్రకారం.. బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ డి' ప్రమోషన్ ఈవెంట్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ మూవీలో దావూద్ ఇబ్రహీంపై జోకులు ఉన్న సీన్లు, అతడ్ని చెడుకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఖచ్చితంగా తొలగించాలని, లేకపోతే మూవీనే విడుదల చేయవద్దని ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు కాల్స్ వచ్చాయిన వారు ఫిర్యాదుచేశారు. తమకు ముంబైతో సబంధంలేని కారణంగా ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నట్లు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పారు. మొదట వారికి ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ నుంచి కాల్స్ చేసి తాము చెప్పింది చేస్తారా లేదా అని హెచ్చరించారు. సునీల్ గ్రోవర్ (కపిల్ శర్మ షో ఫేమ్) అనే జర్నలిస్టు దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేసే సీన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఇవే సమస్యకు దారితీశానని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ వివరించారు. -
'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్'
భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమని.. ఇక మనవాళ్ల తదుపరి లక్ష్యం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కావాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్కు మొట్టమొదటిసారిగా చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పామని తెలిపారు. పాకిస్థాన్తో చర్చించడం అంటే పంది ఎదుట ముత్యాలు చల్లడం లాంటిదని ఘాటుగా విమర్శించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్న పాక్ వాదనను ఖండిస్తూ.. పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలకోరేనని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించి, వేరేచోట ఖననం చేసిన తర్వాత అంతర్జాతీయ మీడియాను అక్కడకు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన గట్టి ఆధారాలు, వీడియో ఫుటేజి ఉన్నాయని, కానీ దాన్ని బయట పెట్టడం అనేది మన వ్యూహాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప నాయకుల డిమాండ్ల గురించి పట్టించుకోకూడదన్నారు. దాడులే జరగకపోతే... తాము దీటుగా స్పందిస్తామని ఇమ్రాన్ ఖాన్ లాంటి రాజకీయ తాబేదారులు ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించారు. పాకిస్థాన్లోని యువతరాన్ని చదివించడానికి భారతీయులంతా కొద్దికొద్దిగా విరాళాలు ఇవ్వాలని, కనీసం వాళ్లకు అక్షరాస్యత వస్తేనైనా ఉగ్రవాద భూతం వాళ్ల బుర్రల్లోంచి వదులుతుందని రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్లో అలాంటి చొరవ మొదలైతే.. దానికి పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందన్నారు. భారతీయులు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, చైనా నుంచి వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని ఆయన చెప్పారు. అమెరికా వాళ్లు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చినట్లుగానే మనవాళ్లు కూడా దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయాలని రాందేవ్ సూచించారు. వాళ్లను సజీవంగా తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. వీళ్లద్దరికీ మోక్షం కల్పించాలని అన్నారు. వాళ్ల చావుతో ప్రపంచం మొత్తానికి శాంతి లభిస్తుందని, ఇలా చేసినందుకు మోదీని కలకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. కేవలం తమ బూట్లు నాకేవాళ్లు, తమను పొగుడుతూ పాటలు పాడేవాళ్లను మాత్రమే పాకిస్థాన్ స్వాగతిస్తుందని.. వాళ్లు ఇప్పటికే మన సినిమాలను, మన నటులను బహిష్కరించినప్పుడు.. మనం మాత్రం ఎందుకు వాళ్ల నటులు, వాళ్ల సినిమాలను బహిష్కరించకూడదని ప్రశ్నించారు. నటులేమీ ఉగ్రవాదులు కారు కదా అని సల్మాన్ అంటున్నారు గానీ.. అసలు వాళ్లను ఉగ్రవాదులుగా ఎవరు అభివర్ణించారని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్కు సరిహద్దు అవతల కూడా మార్కెట్ ఉంది కాబట్టి, దాని గురించి ఆయనకు అంత బాధ ఉంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ భారతీయ సినిమాల మీద నిషేధం ఎత్తేయించాలని డిమాండ్ చేశారు. -
దావూద్కి కుచ్చుటోపీ పెట్టిన అనుచరుడు
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మోసపోయాడు. అది కూడా తన అనుచరుడి చేతిలో. దావూద్ కి నమ్మకస్తుడైన ఖలీక్ అహ్మద్ అనే అనుచరుడు భారీ మొత్తంలో డాన్ డబ్బును దోచేశాడు. దావూద్ భారత్ లో కేవలం ఆయుధాలు, వజ్రాలు, డ్రగ్స్ లను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా నల్లధనానికి సంబంధించిన బిజినెస్ లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి నల్లడబ్బును పెద్ద మొత్తంలో పనామా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్ లకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అదే డబ్బును మామూలుగా చలామణి చేయడానికి సహకరిస్తున్నాడు. ఈ ప్రక్రియలో అహ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ.45 కోట్ల రూపాయల నల్లధనాన్ని డాన్ తరఫున తీసుకోని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి వుంది. డబ్బును వ్యక్తి నుంచి తీసుకున్న అహ్మద్ సర్వీసు చార్జీ కింద దావూద్ కు రూ.5 కోట్లు పంపి, మిగిలిన రూ.40 కోట్లతో విదేశాలకు ఉడాయించాడు. భారత నిఘా సంస్థలు కొన్ని అంతర్జాతీయ నంబర్లను ట్యాప్ చేయగా ఈ వివరాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ లో దావుద్ అనుచరుడు జబీర్ మోతి అనే వ్యక్తి అహ్మద్ కు ఫోన్ చేసి డీల్ కు సంబంధించిన వివరాలు మాట్లాడినట్లు ఓ అధికారి వెల్లడించారు. దావూద్ పనులను చక్కబెట్టేందుకు అహ్మద్ తరచూ భారత్, షార్జాల మధ్య తిరుగుతుంటాడని తెలిసింది. అహ్మద్ చేసిన పనివల్ల డాన్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, దీనిపై దావూద్ చాలా సీరియస్ గా ఉన్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. అహ్మద్ ను పట్టుకోవడానికి నవంబర్ 26, 2015న దావూద్ అనుచరులు ఇద్దరు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అహ్మద్ ప్రస్తుతం మణిపూర్ లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. మోసగించిన డబ్బులో సగాన్ని అహ్మద్ పనామా బ్యాంకులో , మిగతా సగం డబ్బును విదేశాల్లో దావూద్ కు ఉన్న వ్యాపారాల్లో తన పేరు మీద పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. -
దావూద్ కోసం 5 ప్రత్యేక టీంలు!
గత రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను రూపొందించిన భారత్.. ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(రా), సీబీఐ ఇంటర్ పోల్ వింగ్ ల నుంచి మొత్తం 50 మందిని ఇందుకోసం ఎంపిక చేసింది. నాలుగు వింగ్ ల నుంచి మొత్తం పది మంది సభ్యులు ఒక్కో టీంకు ప్రాతినిధ్యం వహిస్తారు. పాకిస్తాన్, యూఏఈతో పాటు ప్రపంచదేశాల్లో దావూద్ గ్యాంగ్ కదలికలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతున్న 11మంది దావూద్ సన్నిహితులను నిఘా వర్గాలు గుర్తించాయి. విమానయానం, పవర్, ఆయిల్, కన్ స్ట్రక్షన్, గార్మెంట్ రంగాల్లో ఉన్న ఏడు దావూద్ కంపెనీలను కూడా నిఘా సంస్థలు అనుసరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్న దావూద్ ఆరోగ్యపరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం ఉంది. పాక్ లో ఉన్నా కూడా తన కుటుంబానికి, తనకు ప్రమాదం ఉన్నట్లు దావూద్ భావిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆరు బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజ్ కార్లను దావూద్ కుటుంబం తెప్పించుకుందని తెలిపాయి. షేక్ ఇస్మాయిల్ అనే వ్యాపారస్తుడి పేరు మీద దావూద్ ప్రస్తుతం కరాచీలో నివసిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా దావూద్ ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా ఆపేశాడు. ప్రస్తుతం అతని భార్య మెహజబీన్ షేక్ ఫోన్లను తీసుకుంటుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ లను కూడా ఆమే రన్ చేస్తోంది. -
దావూద్ జాడలు
తరచుగా మీడియా కథనాల్లో తప్ప బహిరంగంగా కనబడని దావూద్ ఇబ్రహీం మరోసారి వార్త అయ్యాడు. పాకిస్తాన్లో అతని నివాసాలుగా పేర్కొంటూ మన దేశం అందజేసిన తొమ్మిది చిరునామాల్లో ఆరు సరైనవేనని ఐక్యరాజ్యసమితి కమిటీ దాదాపుగా నిర్ధారించింది. మూడు చిరునామాలు మాత్రమే సరైనవి కాదని చెప్పడం ద్వారా మిగిలిన ఆరింటినీ అది ధ్రువీకరించినట్టయింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా, అంతక్రితం నేర ప్రపంచ రారాజుగా పేరు మోసిన దావూద్కు పాక్ ఆశ్రయమిస్తున్నదని మన దేశం ఎప్పటినుంచో ఆరోపిస్తున్నది. పాకిస్తాన్ మాత్రం దాన్ని తోసిపుచ్చుతోంది. ఆధారాలివ్వాలని సవాల్ చేస్తోంది. ఇప్పుడు సమితి కమిటీ తాజా నిర్ణయం వచ్చాక కూడా దాని బుకాయింపు ధోరణిలో మార్పేమీ లేదు. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ఆ కమిటీ తీసు కోబోయే చర్యలవల్ల దావూద్లాంటివారికి ఆశ్రయమివ్వడం పాకిస్తాన్కు కష్టమవు తుంది. ఆ కమిటీ జాబితా కెక్కిన వ్యక్తులనూ, సంస్థలనూ అదుపు చేయడం... వారి ఆస్తులను, బ్యాంకు ఖాతాలనూ స్వాధీనం చేసుకోవడం, పరారీ కాకుండా చూడటం సభ్య దేశాల బాధ్యత అవుతుంది. ఆ పనే జరిగితే పాకిస్తాన్కు ఊపి రాడని స్థితి ఏర్పడుతుంది. దావూద్పై ఇప్పటికే మన దేశం రెడ్ కార్నర్ నోటీసు జారీచేయించింది. 2000 సంవత్సరం నుంచి అమల్లోకొచ్చిన నేరస్తుల అప్పగింత ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జరిపిన పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉగ్రవాదులను అప్పగించడంలో తోడ్పాటునందిస్తోంది. తమ నిఘా వర్గాలిచ్చే సమాచారాన్ని మన దేశంతో పంచుకుంటున్నది. ఈ చర్యల వల్ల దావూద్ కార్యకలాపాలకు పరిమితులు ఏర్పడ్డాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు. పేరుకే రహస్య జీవనంగానీ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో నాలుగు గోడల మధ్యా గుట్టుగా ఏమీ బతకడం లేదు. అమెరికాలో 2001లో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత పాక్ దాటి వెళ్లకపోయి ఉండొచ్చుగానీ అంతక్రితం అతను నేరుగా వేర్వేరు దేశాల్లో తన కార్యకలాపాలు సాగించేవాడు. ప్రస్తుతం కరాచీలో కూర్చుని గల్ఫ్ దేశాల్లోని స్థిరాస్తి వ్యాపారాలను చక్కబెడుతున్నాడు. మాదక ద్రవ్యాలు, మ్యాచ్ ఫిక్సింగ్లు, మన దేశంలోకి దొంగ కరెన్సీ తరలింపు వగైరా వ్యాపారాలు... వాటి ద్వారా దావూద్ వెనకేసుకునే కోట్లాది డాలర్లు పాక్ ప్రభుత్వానికి తెలియనివి కాదు. అతను కరాచీలోనే ఉంటున్నా ఇబ్బందులు తలెత్తుతాయనుకున్నప్పుడు పాక్–అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతానికి తరలించడం మామూలే. ఎక్కడున్నా శాసించ డమెలాగో అతనికి తెలుసు. తనకు ఆశ్రయమిస్తున్న ఐఎస్ఐకి వివిధ దేశాల్లోని తన ఏజెంట్ల ద్వారా అందే సమాచారాన్ని చేరేయడం, తన అక్రమార్జనలో వాటా లివ్వడం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు సహకరించడం దావూద్ విధి. మన దేశాన్ని చికాకు పరచడంలో, నష్టం కలగజేయడంలో తోడ్పాటు నందిస్తున్నాడు గనుక పాకిస్తాన్ పాలకులకు అతను ఆప్తుడయ్యాడు. అతని గురించి పైకి ఏం చెప్పినా దావూద్ ఆచూకీ, ఆనుపానుల గురించి ఎప్పుడో ఒకప్పుడు నిర్ధారణ కాక తప్పదని పాక్ పాలకులకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితే తలెత్తితే అతన్ని ఎలా వదిలించుకోవాలన్న విషయంలో కూడా వారికి తగిన అవగాహనే ఉండొచ్చు. అగ్రరాజ్యం అమెరికా దావూద్ను ఒక సమస్యగా, ముప్పుగా పరిగణించనంత కాలం... అతనికి గానీ, అతని వల్ల పాక్ పాలకులకు గానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యం. దావూద్ గురించి తనకేమీ తెలియనట్టు అమెరికా నటిస్తున్నా ప్రస్తుతం ఆ దేశంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ దావూద్ గురించి, అతని కార్యకలాపాల గురించి ఇప్పటికే వారికి కావలసినంత సమాచారం అందించాడు. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తనకు మాత్రమే ఉన్న హక్కని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని అమెరికా నియమం పెట్టుకున్నట్టు కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుడు మన దేశాన్ని సందర్శించినప్పుడు వెలువడిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, హక్కానీ నెట్ వర్క్లతోపాటు దావూద్ ముఠా ప్రస్తావన కూడా ఉంది. ఇలాంటి ఉగ్రవాద సంస్థలను అణచడానికి సమష్టిగా కృషి చేయాలన్న సంక ల్పాన్ని ఇరుదేశాలూ వ్యక్తంచేశాయి.అయినా దావూద్ విషయంలో అటు నుంచి అందుతున్న సహకారం పెద్దగా లేదు. అయితే దావూద్లాంటివారు తలెత్తడానికీ, ఎదగడానికీ.. కొరకరాని కొయ్యగా మారడానికి మన దేశంలో ఇప్పటికీ పుష్కలంగా అవకాశాలున్నాయని నిన్న మొన్నటి నయీం ఉదంతం నిరూపించింది. దావూద్ ఇబ్రహీం ఇక్కడే పుట్టి పెరిగాడు. ముంబై మహానగరాన్ని అడ్డాగా చేసుకుని 1986 వరకూ దేశం లోనే ఉన్నాడు. అప్పట్లో రాజకీయ నాయకులతో, ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక వ్యక్తులతో, సినీ పరిశ్రమ పెద్దలతో చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు. తమ కక్షలు తీర్చుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకోవడానికి వీరందరికీ పని కొచ్చాడు. ఎప్పుడైనా పైనుంచి ఒత్తిళ్లు వస్తే... అరెస్టు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడితే ముందుగా సమాచారమిచ్చి అతను తప్పించుకు పోవ డానికి అన్నివిధాలా తోడ్పడింది వీరే. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా వెల్లడైన తర్వాత వీరిలో చాలామంది తమకు ఎప్పుడూ అతనితో సంబంధ బాంధవ్యాలు లేవన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. చిత్రమేమంటే... దావూద్ కార్యకలాపాలు ముంబైలో ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి కమిటీ తీసుకున్న చర్యతో దావూద్ విషయంలో కొంత ముందడుగు పడినట్టయింది. ప్రపంచానికి పాక్ నిజస్వరూపాన్ని చాటడానికి ఇలాంటి పరిణామాలు నిస్సందేహంగా దోహదపడతాయి. అయితే అంతకన్నా ముందు మన దేశంలో మరింత మంది దావూద్లు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పాలకులు గుర్తించాలి. -
దావూద్.. కేరాఫ్ పాక్
భారత్ ఇచ్చిన ఆరు చిరునామాలు ధ్రువీకరించిన ఐరాస - తొమ్మిది చిరునామాల్లో ఆరు సరైనవే - కుటుంబ సభ్యుల పేర్లు పేర్కొన్న ఐరాస కమిటీ ఐక్యరాజ్యసమితి: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయమిచ్చినట్లు మరోసారి రుజువైంది. భారత్ వాదనకు బలం చేకూరేలా పాక్లో దావూద్ నివాసాలకు సంబంధించిన చిరునామాలను ఐరాస కమిటీ ధ్రువీకరించింది. భారత్ రూపొందించిన పాక్లోని దావూద్ చిరునామాల జాబితాలోని తొమ్మిందింటిలో.. ఆరు సరైనవేనని, మూడు మాత్రం తప్పు చిరునామాలని ఆ కమిటీ స్పష్టం చేసింది. దీంతో భారత్ వాదనను ఖండిస్తూ వస్తున్న పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. భారత్ ఇచ్చిన జాబితాను భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, అల్కాయిదా శాంక్షన్స్ కమిటీ సోమవారం సవరించింది. జాబితాలోని మూడు చిరునామాలను కొట్టివేసింది. ఈ మూడింటిలో ఒకటి యూఎన్లో పాక్ రాయబారి మలీహ లోధీది అని గుర్తించింది. భద్రతా సమితి కమిటీ 1267 (1999), 1989 (2011), 2253 (2015) తీర్మానాల విషయంలో అండర్లైన్, కొట్టివేతలతో ఆ సవరణలు చేసింది. సవరణల్లో వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తుల జప్తు, ప్రయాణాలపై నిషేధం, ఆయుధాల ఆంక్షలు ఉన్నాయి. దీనిలో దావూద్కు సంబంధించిన పాకిస్తాన్లోని కరాచి చిరునామాలు కూడా ఉన్నాయి. ఈ చిరునామాలతోనే గతేడాది ఆగస్టులో భారత్ ఒక జాబితా ఐరాసకు ఇచ్చింది. యూఎన్ సవరణ జాబితాలో దావూద్ పాస్పోర్ట్ నంబర్లను కూడా పేర్కొంది. 1985 ఆగస్టు 18న దుబాయ్ ఇచ్చిన పాస్పోర్టు, 1991 ఆగస్టు 12న పాక్లోని రావల్పిండిలో పొందిన పాస్పోర్టును అతను దుర్వినియోగం చేశాడని పేర్కొన్న కమిటీ.. 1996లో పాస్పోర్టు నం సి-267185 (కరాచి), 2001లో నంబర్ హెచ్-123259 (రావల్పిండి), నంబర్ జి-869531 (రావల్పిండి)లలో పాక్ ఇచ్చిన వాటిని కూడా పేర్కొంది. భుట్టో ఇంటి సమీపంలోనే నివాసం దావూద్ చిరునామాల్లో ఒకటి పాక్ మాజీ ప్రధాని భుట్టో కొడుకు బిలావల్ భుట్టో నివాసం సమీపంలో ఉంది. దావూద్ చిరునామాల జాబితాను పాక్ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్కు ఇవ్వాలని భారత భద్రతా సలహాదారు రెండేళ్ల క్రితం అనుకున్నారు. ద్వైపాక్షిక చర్చలు రద్దు కావడంతో జాబితాను ఐరాసకు అందజేశారు. పాక్లో తరచూ ఇళ్లు మార్చే దావూద్ పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టాడని, పాక్ సంస్థల రక్షణలో అతను ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. దావూద్ తండ్రి పేరు షేక్ ఇబ్రహీం అలీ కస్కర్, తల్లి పేరు అమీనా బి, భార్య పేరు మెహజబీన్ షేక్గా పేర్కొంది. ముంబైలో పుట్టిన దావూద్కు షేక్ ఫరూఖీ, బాబా సేథ్, బాబా భాయ్, ఇక్బాల్ భాయ్, ముచ్చాద్, హజీ సాహెబ్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయని తెలిపింది. -
దావూద్ చిరునామా దొరికింది..
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం నిగ్గు తేల్చిన వాస్తవమిది. పాకిస్థాన్లోని ఆరు ప్రాంతాల్లో దావూద్కు ఇళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి బృందం నిర్థారించింది. ఈమేరకు దావూద్ నివాసాలకు సంబంధించి భారత్ సమర్పించిన 9 చిరునామాల్లో 6 సరైనవేనని ఐరాస ప్రత్యేక బృందం తేల్చింది. మూడు చిరునామాలు మాత్రం తప్పని పేర్కొంది. యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి. ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ విదేశాంగ కార్య దర్శి సర్తాజ్ అజీజ్కు అందచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని నిర్దారించింది. కాగా 1993లో ముంబై పేలుళ్లకు దావూద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడు భారత్ నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు దావూద్ ఇబ్రహీం భారత్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి. -
పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి
-
పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి
ముంబై: పోలీసుల నిఘా మధ్య మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషా పార్కర్ వివాహం బుధవారం జరిగింది. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కుమారుడైన అలిషా నగరంలోని వ్యాపారవేత్త షిరాజ్ ఏ కుమార్తె ఆయేషా నాగానిని పెళ్లాడాడు. దక్షిణ ముంబైలోని నాగపడా ప్రాంతంలోని రసూల్ మసీదులో జరిగిన వీరి వివాహానికి వధూవరుల కుటుంబాలకు చెందిన సభ్యులు, ఆహ్వానిత బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం రాత్రి జుహు ప్రాంతంలోని తులిప్ స్టార్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేనల్లుడి వివాహాన్ని స్కైప్ ద్వారా దావూద్ చూసే అవకాశముందని వార్తలు వచ్చాయి. కాగా, పెళ్లికి వచ్చిన వారి కదలికలను పోలీసులు నిశితంగా గమనించారు. అతిథులు వాహనాల నంబర్లు నమోదు చేసుకున్నారు. పెళ్లి, రిసెప్షన్ కు మీడియాను అనుమతించలేదు. -
అల్లుడి పెళ్లికి దావూద్ ఇబ్రహిం!
ముంబై ప్రస్తుతం పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కరడుగట్టిన నేరగాడు, మాఫియాడాన్ దావూద్ ఇబ్రహిం గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడయింది. ముంబైలో బుధవారం జరగబోయే తన మేనల్లుడి వివాహాన్ని ఇతడు వీడియో కాలింగ్ సర్వీస్ ‘స్కైప్’ ద్వారా చూస్తాడని తెలిసింది. దావూద్ సోదరి హసీనా పార్కర్ కొడుకు అలిషా పర్కర్ ముంబైకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెను పెళ్లాడుతున్నాడు. ముంబైలోని ఒక మసీదు నిర్వహించే నిఖాకు కేవలం 15 మంది మాత్రమే హాజరవుతున్నారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ వంటి కొందరు బంధువులు మాత్రమే నిఖాకు వస్తారని భావిస్తున్నారు. బలవంతపు వసూళ్లు, దాడుల కేసులో జైలు జీవితం అనుభవించిన కస్కర్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. కరాచీ నుంచి స్కైప్ ద్వారా దావూద్ పెళ్లి వేడుకలను చూస్తారని ఇతని కుటుంబ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఖా పరిసరాల్లో భారీ నిఘా పెట్టారని పేరు ఓ అధికారి తెలిపారు. ముంబైలో 1993లో 257 మంది మృతికి కారణమైన మతఘర్షణల కేసులో దావూద్కు ప్రమేయమున్నట్టు తేలడంతో ఇతడు భారత్ నుంచి పారిపోయాడు. పాకిస్తాన్ నుంచే తన డి కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. -
అనుచరులతో నయీం ఏం చెప్పాడు
సాక్షి, సిటీబ్యూరో: ముంబై నుంచి దుబాయ్కు వెళ్ళిపోయి ‘డి–కంపెనీ’ పేరుతో దావూద్ ఇబ్రహీం చేస్తున్న దందా నయీంను ఆకర్షించింది. నగరం కేంద్రంగా ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గత ఏడాది దుబాయ్ వెళ్ళిన నయీం అక్కడ దావూద్ అనుచరుల్నీ కలిశాడని తెలిసింది. వీలైనంత త్వరగా బేస్ను దుబాయ్కు మార్చేయడానికే టార్గెట్లు పెట్టుకుని మరీ వసూళ్ళకు దిగినట్లు సమాచారం. వారం రోజుల క్రితం నగర శివార్లలో అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయాన్ని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రకాలైన ‘సైన్యం’... గ్యాంగ్స్టర్ నయీం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ మూడు రకాలైన వారితో ‘సైన్యాలు’ సిద్ధం చేసుకున్నాడు. ఆయా అవసరాలకు తగ్గట్టు వీరిని వాడుకోవడానికే ఇలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఓపక్క రాజకీయ అండదండల కోసం రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. వీరికి డబ్బు ఇవ్వడంతో పాటు కోరిన సెటిల్మెంట్లు చేస్తూ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. అలాగే పోలీసులకు ‘అవసరమైన పనులు’ చేసిపెట్టడం, కొన్ని రకాలైన సమాచారాలు ఇవ్వ డం తదితరాలు చేస్తూ వారితో సత్సంబంధాలు కొనసాగిం చాడు. శివారు జిల్లాలతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులతోనూ నయీం సంబంధాలు కొనసాగించాడు. కొందరు యువకులకు నెలవారీ డబ్బులు ఇస్తూ తన ఆధీనంలో ఉంచుకున్నాడు. రెండు నెలల్లో వీలైనంత ఆర్జించాలని... ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలు కొనసాగించిన నయీం గతంలో ఓసారి పాకిస్థాన్కు వెళ్ళి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్తోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది దుబాయ్ వెళ్ళి వచ్చిన నయీం అక్కడ దావూద్ అనుచరుల్నీ కలిశాడు. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో తనకు ప్రైవేట్ సైన్యం ఉందంటూ వారికి చెప్పిన నయీం... దావూద్ మాదిరిగా ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దుబాయ్ కేంద్రంగా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు కుట్రపన్నాడు. దీనికోసం రెండు నెలల్లో దుబాయ్కి మకాం మార్చడానికి పథకం వేసిన నయీం అందుకు తగ్గట్లే జోరు పెంచి సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. తుక్కుగూడలో చివరి విందు... తన దుబాయ్ ఆలోచనల గురించి అనుచరులకు చెప్పడానికి నయీం గత ఆదివారం నగర శివార్లలోని తుక్కుగూడలో విందు ఏర్పాటు చేశాడు. అత్యంత సన్నిహితులైన 12 మందితో పాటు ఇతర గ్యాంగ్మెంబర్స్ సైతం హాజరయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ విందు ఇచ్చిన నయీం... తన ‘ఎన్–కంపెనీ’ విషయాన్ని వారికి చెప్పి, టార్గెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు తదితరుల్ని టార్గెట్గా చేసుకున్నాడు. దీనికోసమే జర్మన్, రష్యా, బెల్జియంల్లో తయారైన అత్యాధునిక షార్ట్ వెపన్స్ను సైతం సిద్ధం చేసుకున్నాడు. సోమ–మంగళవారాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఇవీ ఉన్నాయి. అశోక్ పేరుతో కేరళలో చికిత్స... రెండేళ్ళ క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన నయీం కేరళలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడకు అశోక్రెడ్డి పేరుతో వెళ్ళి వచ్చాడు. దీంతో నయీం ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో తన బలాన్ని మరోసారి చూపించాలని భావించాడు. దీనికోసం ఎనిమిది నెలల క్రితం నగర శివార్లలో ఓ విందు ఏర్పాటు చేశాడు. దీనికి రౌడీషీటర్లు, మాజీ మావోయిస్టులతో పాటు అసాంఘికశక్తులు అంతా హాజరయ్యారు. ఈ విందు వేదికపైకి ఎక్కిన నయీం చుట్టూ ముగ్గురు యువతులు ఏకే–47 ఆయుధాలతో, మరో నలుగురు షార్ట్ వెపన్స్గా పిలిచే పిస్టల్స్తో కాపుకాశారు. ఈ విందుతో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ అనుచరులకు సందేశం, ప్రత్యర్థులకు హెచ్చరికలు ఇచ్చాడు. ‘ఆలోచిస్తే’ అంతం చేసినట్లే... నయీం ఓ వ్యక్తిని టార్గెట్గా ఎంచుకుని, హతమార్చాలని నిర్ణయించుకుంటే వారికి హెచ్చరికలు పంపిస్తాడు. నేరుగా ఫోన్లు చేసే నయీం ఒక్కోసారి ఒక్కో సెల్ఫోన్, సిమ్కార్డు వినియోగిస్తాడు. అల్కాపురి టౌన్షిప్లోని అతడి ఇంట్లో 258 సెల్ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్కార్డులూ లభించడానికి ఇదే కారణమని పోలీసులు చెప్తున్నారు. నయీం ఎవరినైనా హతమార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ‘ఆలోచన’ ప్రస్తావన తీసుకువస్తాడు. ‘నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ్... నేను నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది’ అంటే అవతలి వ్యక్తిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడని అర్థమని పోలీసులు చెప్తున్నారు. ఇవీ భూదందాలు.. బంజారాహిల్స్/మన్సూరాబాద్/గచ్చిబౌలి: పోలీస్ కాల్పుల్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం సెటిల్మంట్ దందాలు సిటీలో భారీగానే జరిగాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, గచ్చిబౌలితో పాటు ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో వివిధ భూములకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు నయీం ఇంట్లో లభించడంతో వాటిపై పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని ఫ్లాట్ నెంబర్ 827 ఇంటి డాక్యుమెంట్లు, మన్సూరాబాద్ రాక్హిల్స్కాలనీలోని సర్వే నెంబర్ 66/10/బీ, శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 87లో 9.37 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించడంతో నయీం దందాలు సిటీలో బాగానే జరిగాయనే వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్లాట్ కథ ఇదీ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని ఫ్లాట్ నెంబర్ 827 స్థలం 2005కు ముందు కొంత వివాదంలో ఉండగా సెటిల్మెంట్ భాధితులు నయీంను ఆశ్రయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 1982 సంవత్సరం ఏప్రిల్28వ తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ జి. లక్ష్మమ్మకు ఈ ప్లాట్ అలాట్ చేసింది. 1983 మే 2వ తేదీన లక్ష్మమ్మ ఈ ప్లాట్ను నిర్మలకు విక్రయించగా, ఆమె దీన్ని 1983 మే 10వ తేదీన ఏవీ శ్రీనివాసరావుకు విక్రయించింది. అయితే లక్ష్మమ్మ దత్త కుమారుడు పూడురు అశోక్కుమార్ ఆమెకు తెలియకుండా ఈ ప్లాట్ను రామరాజ్ సీతారామరావు అనే వ్యక్తికి జీపీఏ చేశాడు. 2005, డిసెంబర్ 28వ తేదీన నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బి.శ్రీనివాసులురెడ్డి ఈ ప్లాట్ను ఏవీ శ్రీనివాసరావు నుండి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేశారు. ఆ సమయంలోనే జీపీఏ హోల్డర్ అంటూ రామరాజ్ సీతారామరావు ఇల్లు కట్టుకుంటున్న శ్రీనివాసులరెడ్డితో వివాదానికి దిగాడు. సీతారామరావు రిజిస్ట్రార్ ఆఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ట్రిబ్యునల్ ఈ కేసును కొట్టివేసింది. అయితే ఈ పాత డాక్యుమెంట్లు నయీం వద్దకు ఎలా చేరాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ...2005లో ఏవీ శ్రీనివాసరావు దగ్గర నుంచి ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాననితెలిపారు. ఆ డాక్యుమెంట్లు నయీం వద్దకు ఎలా చేరాయో తనకు తెలియదని పేర్కొన్నారు. మన్సూరాబాద్లో... నాగోలు డివిజన్ రాక్హిల్స్కాలనీలోని మన్సూరాబాద్ గ్రామ సర్వే నెంబర్ 66/10/బీ స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధిత యజమానులు నిర్మాణం చేపడుతుండగానే ఈ స్థలం మాదని నయీం మూఠా మనుషులు బెదిరించారు. ఏడాది క్రితం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో యజమానుల్లో ఒకరైన ఎస్.గిరిప్రసాద్రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్నగర్లో సర్వే నెం–9/1/1ఏ స్థలంలో నయీం అనుచరులు వెయ్యి గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్వే నెంబర 87లో 9.37 ఎకరాల స్థలం ఉన్నట్లు సైబరాబాద్ వెస్ట్ పోలీసులు నయీం నివాసం వద్ద లభించిన డాక్యుమెంట్లలో గుర్తించారు. అక్కడ చదరపు గజం స్థలం విలువ 25 వేలు ఉంటుంది. ఆ స్థలం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. ఈ స్థలం వివరాలు తమకు తెలియవని రాజేంద్రనగర్ ఆర్డీఓ సురేష్ తెలిపారు. అనుచరుల కోసం వేట తుర్కయంజాల్: గ్యాంగ్స్టర్ నయీం మృతితో వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఆయన అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవానీ ఎన్క్లేవ్లోని ప్లాట్ నెం–49లో నివాసమున్న శ్రీధర్గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీధర్గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు నయీం సన్నిహితులు, అనుచరుల కోసం వేటను మొదలుపెట్టినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జాయింట్ సీపీ శశిధర్రెడ్డి, డీసీపీ తఫ్సీర్ఇక్బాల్, ఏసీపీలు వేణుగోపాల్రావు, భాస్కర్గౌడ్, సీఐలు మురళీకృష్ణ తదితరులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ విచారణ ఒక్క రోజులో ముగిసేది కాదని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి విచారణ చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
హిందూ నాయకుల హత్యకు కుట్ర!
న్యూ ఢిల్లీ: దేశంలో కల్లోలం సృష్టించడానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పెద్ద స్కెచ్చే వేసిందని చెతుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశంలోని ప్రముఖ హిందూ నాయకులు, చర్చిలను టార్గెట్ చేసి దాడులు జరపాలని దావూద్ 'ఢీ కంపెనీ' ప్రణాళికలు సిద్ధం చేసిందని.. గుజరాత్లో ఇద్దరు బీజేపీ నాయకుల హత్యకేసుకు సంబంధించిన చార్జ్షీట్లో ఎన్ఐఏ స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని 'ఢీ కంపెనీ' యోచిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. హిందూ నేతలు, చర్చిలపై దాడులు జరపడం ద్వారా దేశంలో కల్లోల పరిస్థితులు సృష్టించాలని భావిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం యువతకు భారీ మొత్తంలో డబ్బును ఎరవేస్తూ ఆకర్షిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. కరాచీ, దక్షిణాఫ్రికాల్లోని దావూద్ ముఠా కార్యకలాపాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. -
‘దావూద్ కాదు, నాయక్ ను పట్టుకోండి’
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ వెంట పడడం మానేసి వివాదస్పద ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ‘పాకిస్థాన్ నుంచి దావూద్ లేదా మెమన్ రప్పిస్తాం లాంటి ప్రకటనలు మానేయండి. జకీర్ నాయక్పై దృష్టి పెట్టండి. స్వదేశంలోనే నక్కిన శత్రువును అరెస్ట్ చేయండి. 26/11 దాడి కేసులో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్ ను ఉంచిన జైలు గదిలో జకీర్ ను పడేయండ’ని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో వేర్పాటువాదులను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు, ప్రచారం ఉందని ‘సామ్నా’లో శివసేన పేర్కొంది. ముస్లిం యువతను హింసవైపు ప్రేరేపిస్తూ దేశంలో కొత్త తరహా అశాంతికి కారణమవుతున్నారని ఆరోపించింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికితీసే చర్యలను వాయిదా వేసి, జకీర్ నాయక్ కు నిధులు సమకూరుస్తున్న వారిని పట్టుకోవాలని కేంద్రానికి శివసేన సూచింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే జకీర్ నాయక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. -
ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’
కవర్ స్టోరీ ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ భీ నహీ... నా ముమ్కిన్ భీ హై...’ అంటూ అమితాబ్ బచ్చన్ ‘డాన్’ సినిమాలో స్థిరంగా, నిదానంగా పలికిన ఈ డైలాగుకు అప్పట్లో థియేటర్లలో ఈలలు మోగాయి. ‘డాన్’లంటే సమాజంలో అబ్బురపాటుతో కూడిన ఆసక్తి అప్పటి నుంచే మొదలైంది. డాన్లను పట్టుకోవడం అంతటి అసాధ్యమైన విషయమా? అనే సందేహాలు కూడా... డీ ఫర్ డాన్... డీ ఫర్ ధందా... డీ ఫర్ డేంజర్... అంతేకాదు, డీ ఫర్ దావూద్ కూడా! ముంబైని గడగడలాడించిన డాన్ దావూద్ ఇబ్రహీం జాడ కనుగొనడానికి ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు చేసిన భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలూ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతీ సాధించలేకపోయాయి. ఇప్పుడు అతడు మరణశయ్యపై ఉన్నాడంటూ కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. డయాబెటిక్ అయిన దావూద్ గ్యాంగరిన్తో బాధపడుతున్నాడని, రోజులు లెక్కిస్తున్నాడని పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దావూద్ దొరక్కపోతాడా..? లేక ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’ ఇది బిలియన్ డాలర్ల ప్రశ్న! చీకటి రాజ్యం మాఫియా వ్యాపారం ఒక చీకటి రాజ్యం. డాన్లు నడిపే డేంజరస్ ధందా ఇది. ప్రపంచంలోని నిషిద్ధ వస్తువులన్నింటినీ నిత్యావసరాల్లా విక్రయించే చీకటి విపణి ఇది. ఇందులో చట్టం గిట్టం జాన్తా నై. ఇక్కడ వ్యవహారాలన్నీ కరెన్సీ కట్టలతో ‘సామరస్యంగా’ సెటిలైపోతాయి. కాదూ కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే తూటాలు మాట్లాడతాయి. నడివీధుల్లో నెత్తుటేర్లు ప్రవహిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాదు, శాంతిభద్రతలకు కూడా పెనుసవాలుగా నిలుస్తున్న అధోజగత్తు ఇది. దీనిని సమూలంగా పెకలించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక భవిష్యత్ తరాలు ఇలాంటి ‘డాన్’లనే ఆదర్శంగా తీసుకుంటే, యావత్ సమాజమే అతలాకుతలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మరణశయ్యపై డాన్! దావూద్ ఇబ్రహీం పూర్తి పేరు షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్. ముంబై మాఫియాను కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. అప్పట్లో ఇతడి డెన్ ఇక్కడే ఉండేది. ఇతడి గ్యాంగ్ ‘డీ కంపెనీ’గా పేరుమోసింది. ముంబైలో ఉన్నంత కాలం సినీప్రముఖులతో రాసుకు పూసుకు తిరిగేవాడు. సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడని కూడా బాలీవుడ్లో చెప్పుకుంటారు. 1993లో ముంబై పేలుళ్ల తర్వాత భద్రతాదళాలు వేట మొదలుపెట్టడంతో ఈ ‘డాన్’ పలాయన మంత్రం చిత్తగించాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించింది. గత ఏడాది దావూద్కు అరవయ్యేళ్లు నిండాయి. షష్టిపూర్తి సందర్భంగా అతడు రిటైర్మెంట్ ప్రకటించుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే దావూద్ ఆరోగ్యం దిగజారి, గ్యాంగరిన్తో బాధపడుతూ మరణశయ్యపైకి చేరుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ వర్గాలేవీ వాటిని ధ్రువీకరించడంలేదు. ఇదిలా ఉంటే, దావూద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టి తెస్తామని, అతడి నేరాలపై విచారణ జరిపి, అతడికి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నెల్లాళ్ల క్రితం ప్రకటించారు. ఇందుకు అవసరమైన అంతర్జాతీయ భద్రతా బలగాల సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. మన ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా దావూద్ ఇబ్రహీం కోసం గాలింపు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పష్టంగా అతడి జాడ కనుక్కున్న దాఖలాల్లేవు. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తన మాట నిలబెట్టుకుంటారా... లేదా... వేచి చూడాల్సిందే! డాన్ కా ‘భయో’డేటా ⇒ దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముమ్కా గ్రామంలో 1955 డిసెంబర్ 4న కొంకణి ముస్లిం కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఇబ్రహీం కస్కర్ పోలీసు కానిస్టేబుల్గా పనిచేసేవాడు. ⇒ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్వార్లో పాల్గొనడంతో దావూద్ నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరఫున దావూద్ ఆ గ్యాంగ్వార్లో పాల్గొన్నాడు. ⇒ హాజీ మస్తాన్ గ్యాంగ్లో కొనసాగుతుండగానే 1980ల ప్రారంభంలో ఒక దోపిడీ కేసులో మొదటిసారిగా అరెస్టయ్యాడు. విడుదలయ్యాక నేరాలనే వృత్తిగా చేసుకుని, డాన్గా ఎదిగాడు. ⇒ హాజీ మస్తాన్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్ల నడుమ గ్యాంగ్వార్ల తర్వాత దావూద్ మరింత ప్రమాదకరంగా మారాడు. హాజీ గ్యాంగ్లో కొనసాగుతున్న తన సోదరుడు సబీర్ను సుర్వే గ్యాంగ్ సహాయంతో పఠాన్ గ్యాంగ్ హత్య చేయడంతో దావూద్ ప్రతీకార దాడులకు తెగబడి, సుర్వే గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్లను దాదాపు తుడిచిపెట్టేశాడు. ⇒ హాజీ మస్తాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో, దావూద్ గ్యాంగ్ పగ్గాలను చేపట్టాడు. కొద్దికాలంలోనే ముంబై అండర్ వరల్డ్లో హాజీ మస్తాన్ను మించిన డాన్గా ఎదిగాడు. ⇒ ముంబైలో పాతనౌకలను ధ్వంసం చేసే పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. కొంతకాలం దుబాయ్ని కేంద్రంగా చేసుకుని ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు సాగిస్తూ ఆర్థికంగా బలపడ్డాడు. ⇒ ఆర్థికబలం పుంజుకున్నాక బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు. బాలీవుడ్ వివాదాల సెటిల్మెంట్లలోనూ తలదూర్చేవాడు. క్రికెట్ బెట్టింగ్లను అనుకూలంగా మలచుకునేందుకు భారత్, వెస్టిండీస్ జట్లలోని కొందరు క్రికెటర్లనూ ‘మ్యానేజ్’ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ⇒ బాలీవుడ్కు ‘ఆర్థిక’సాయం చేస్తున్న కాలంలోనే దావూద్ అప్పటి హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత అనితా ఆయూబ్తో ఎఫైర్ నడిపాడు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడని కూడా కథనాలు వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం భారత్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి. యూపీఏ సర్కారు హయాంలో దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ దావూద్కు వాటా ఉందనే కథనాలు వచ్చాయి. మొదట్లో మిగిలిన డాన్ల మాదిరిగానే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, హవాలా లావాదేవీలు వంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చినా, క్రమంగా ఉగ్రవాదులతోనూ చేతులు కలిపాడు. ‘డాన్’ ముదిరి టైస్టుగా మారాడు. ‘అల్ కాయిదా’ అధినేత ఒసామా బిన్ లాడెన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు తేల్చాయి. చివరకు 2003లో దావూద్ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా కూడా ప్రకటించాయి. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దావూద్పై, అతడి అనుచరులపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా, ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి ఆస్తులను స్తంభించేలా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని చర్యలు ప్రారంభించినా ‘డీ కంపెనీ’ యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వస్తోంది. పలు దేశాల్లో యథేచ్ఛగా తన ఆస్తులను పోగేసుకుంటూనే ఉంది. గత ఏడాది ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన అంచనా ప్రకారం దావూద్ ఆస్తుల నికర విలువ 670 కోట్ల డాలర్లకు (రూ.45,181 కోట్లు) పైమాటే! ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలోని పది దేశాల్లో ‘డీ కంపెనీ’కి ఆస్తులు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా బ్రిటన్లోనే 45 కోట్ల డాలర్ల (రూ.3034 కోట్లు) ఆస్తులు ఉన్నాయని అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి. కరాచీలో డెన్! ముంబై నుంచి పరారైన తర్వాత పలుచోట్ల సురక్షిత స్థావరం కోసం ప్రయత్నాలు సాగించిన దావూద్ చివరకు పాక్ ఇంటెలిజెన్స్ అండదండలతో కరాచీ చేరుకుని, అక్కడ సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ కథనాలను ఎంతగా ఖండిస్తున్నా, అతడికి పాక్ ప్రభుత్వం తరఫున అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాల కారణంగానే అతడు అంతర్జాతీయ భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకోగలుగుతున్నాడనేది దాదాపు బహిరంగ రహస్యం. కరాచీలో సంపన్నులు నివసించే క్లిఫ్టన్ ఎన్క్లేవ్లో 36 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో శత్రు దుర్భేద్యమైన కోటలాంటి ఇల్లు నిర్మించుకుని, అక్కడి నుంచి ‘ధందా’ సాగిస్తున్నాడని కథనాలు వచ్చాయి. ‘బిజినెస్ ఇన్సైడర్’ గత ఏడాది ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో దావూద్కు తొమ్మిది నివాస భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ నివాసానికి అత్యంత చేరువలో ఉంది. దావూద్ ఫ్యామిలీ షబీర్ అహ్మద్: దావూద్కు అన్న. ఇబ్రహీం కస్కర్ సంతానంలో ఇతడే పెద్దవాడు. పఠాన్గ్యాంగ్ చేతిలో 1981 ఫిబ్రవరి 12న హత్యకు గురయ్యాడు. సయీదా కస్కర్: దావూద్కు అక్క. రత్నగిరి జిల్లాలోని స్వగ్రామం ముమ్కేలో నదిలో మునిగి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. నూరా ఉల్ హక్: దావూద్కు తమ్ముడు. ముంబైని వదిలి 1989లోనే గల్ఫ్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇక్కడకు రాలేదు. అక్కడే 2009 మే నెలలో గుండెపోటుతో మరణించాడు హసీనా ఇబ్రహీం పర్కర్: దావూద్ చెల్లి. ముంబైలోని నాగపడా ప్రాంతంలో ఉండేది. మాఫియా కార్యకలాపాలను శాసిస్తూ ‘గాడ్మదర్ ఆఫ్ నాగపడా’గా పేరుమోసింది. రెండేళ్ల కిందట గుండెపోటుతో మరణించింది. ముంతాజ్ రహీం: దావూద్ చెల్లి. పెళ్లి తర్వాత కరాచీలో స్థిరపడింది. దావూద్ ఇక్బాల్ కస్కర్: దావూద్ తమ్ముడు. ముంబై నుంచి పారిపోయాక కరాచీ డిఫెన్స్ కాలనీలో ఉండేవాడు. లాడెన్ హతం తర్వాత తనను కూడా అలాగే చంపేస్తారనే భయంతో పాక్-అఫ్ఘాన్ సరిహద్దులకు పారిపోయినట్లు కథనాలు వచ్చాయి. ముంబైలో ఉన్నప్పుడు అన్న అండతో రియల్ ఎస్టేట్ రంగంలో ‘ధందా’గిరీ చలాయించేవాడు. అనీస్ అహ్మద్: దావూద్ తమ్ముడు. మాఫియా ‘ధందా’లో అన్నకు చేదోడుగా ఉండేది ఇతడే. ముంబై పేలుళ్ల తర్వాత అన్న దావూద్తో కలసి ఇక్కడి నుంచి పరారయ్యాడు. బాలీవుడ్ ప్రముఖులకు వచ్చే బెదిరింపు కాల్స్ వెనుక ఇతడి ప్రమేయం ఉందంటారు. అంతేకాదు, దావూద్కు వారసుడు ఇతడేనని కూడా అంటారు. ఫర్జానా తుంగేకర్: దావూద్ చెల్లి. ఒక వ్యాపారిని పెళ్లి చేసుకుని, ముంబైలోని మజాగావ్ ప్రాంతంలో స్థిరపడింది. జైతూన్ అంతులే: దావూద్ చెల్లి. దుబాయ్ వ్యాపారి హమీద్ అంతులేతో పెళ్లి తర్వాత అక్కడే స్థిరపడింది. ముస్తకీం ఇబ్రహీం, మహమ్మద్ హుమయూన్ ఇబ్రహీం: దావూద్ కవల తమ్ముళ్లు. అయితే, మాఫియా నేరాలకు సంబంధించి వీరిపై ఎలాంటి కేసులూ లేవు. వీళ్లిద్దరూ కరాచీలోనే ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. వీరిద్దరిలో హుమయూన్ లంగ్ కేన్సర్తో, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతూ కరాచీ ఆస్పత్రిలో కొద్దిరోజుల కిందటే మరణించాడు. లేడీ డాన్ మెహజబీన్ అలియాస్ జుబీనా జరీన్: దావూద్ భార్య. లేడీ డాన్. ఎవరికీ భయపడని దావూద్... భార్య వద్ద మాత్రం భయపడతాడని చెబుతారు. ఆమె ఇంట్లో లేనప్పుడు విచ్చలవిడిగా పార్టీలు ఏర్పాటు చేసే దావూద్, ఇంకాసేపట్లో ఆమె వచ్చేస్తుందనే అనుమానం ఉంటే, అర్ధంతరంగానే పార్టీలకు ప్యాకప్ చెప్పిన సందర్భాలూ లేకపోలేదనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దావూద్, జుబీన్లకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు. పాక్ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్తో పెద్ద కూతురు మహ్రుక్ పెళ్లి జరిపించడంలో జుబీన్దే కీలక పాత్ర అని చెబుతారు. ఇక రెండో కూతురు మహ్రీన్ అమెరికాలో స్థిరపడ్డ పాక్ వ్యాపారి ఆయూబ్ను పెళ్లాడింది. ఒక్కగానొక్క కొడుకు మొయిన్ లండన్లోని ఒక వ్యాపారి కూతురు సానియాను పెళ్లాడాడు. ఖురాన్ను కంఠోపాఠం చేసిన మొయిన్ ‘ధందా’కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే దావూద్ వారసుడిగా అనీస్ ‘డీ కంపెనీ’ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. మాఫియా పుట్టినిల్లు ఇటలీ ఆధునిక మాఫియా కార్యకలాపాలకు మూలాలు ఇటలీలో ఉన్నాయి. సిసిలీ కేంద్రంగా తలెత్తిన మాఫియా గ్యాంగ్లు దశాబ్దాల పాటు ఇష్టారాజ్యం చలాయించాయి. తర్వాత ఈ మాఫియా ముఠాలు ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికాలోనూ వేళ్లూనుకున్నాయి. అక్కడి నుంచి క్రమంగా ఇతర దేశాలకూ విస్తరించాయి. ముసోలినీ హయాంలో ఇటలీ మాఫియా కాస్త వెనక్కు తగ్గినా, ముసోలినీ మరణం తర్వాత తిరిగి విజృంభించాయి. ఇక మన దేశంలో ముంబై కేంద్రంగా మాఫియా గ్యాంగ్లు అవతరించాయి. ఇతర దేశాల్లోని మాఫియా గ్యాంగ్లతో సంబంధ బాంధవ్యాలు నెరపుతూ చీకటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్లు విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకుని, ఇక్కడ ఉంటున్న తమ మనుషుల ద్వారా ‘ధందా’లు నడిపించుకుంటున్నారు. సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు సాగించుకుంటున్నారు. ముంబై మాఫియా ముంబైకి 1940వ దశకం తొలినాళ్లలో అఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన అబ్దుల్ కరీం షేర్ఖాన్ అలియాస్ కరీంలాలా ఓడ రేవుల్లో పనిచేసేవాడు. చిల్లర గ్యాంగులను ఏకతాటిపైకి తెచ్చి ముంబైలో మొట్టమొదటి మాఫియా డాన్గా అవతరించాడు. అప్పట్లోనే తమిళనాడు నుంచి వలస వచ్చిన మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్ కేవలం మాఫియా వ్యవహారాలకే పరిమితం కాలేదు. సినీరంగంలోనూ తలదూర్చాడు. సినిమాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాడు. సినీతారలకు తరచు పార్టీలు ఇచ్చేవాడు. ముంబైలో ‘సెలబ్రిటీ డాన్’గా దాదాపు రెండు దశాబ్దాల పాటు చీకటి రాజ్యాన్ని శాసించాడు. తర్వాత 1985లో ‘దళిత ముస్లిం సురక్షా మహాసంఘ్’ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళనాడు నుంచి వలస వచ్చిన వరదరాజన్ ముదలియార్ మద్యం అక్రమ వ్యాపారంతో రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్తో దోస్తానా చేసి డాన్గా ఎదిగాడు. దావూద్ ఇబ్రహీం సహా ఇప్పటి డాన్లలో చాలామంది ఒకప్పుడు హాజీ మస్తాన్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నవారే. అప్పట్లో దావూద్కు ఛోటారాజన్ కుడిభుజంగా ఉండేవాడు. 1993లో ముంబై పేలుళ్ల సంఘటన తర్వాత దావూద్కు దూరమయ్యాడు. దీంతో దావూద్ మనుషులు అతడిపై బ్యాంకాక్లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఛోటారాజన్ గత ఏడాది బాలిలో ఇండోనేసియన్ పోలీసులకు పట్టుబడ్డాడు. బాలీవుడ్పై మాఫియా నీడ మాఫియా కథల ఆధారంగా సినిమాలు రూపొందించే బాలీవుడ్ను మాఫియా పడగ నీడ వెన్నాడుతూనే ఉంది. టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత రాకేశ్ రోషన్పై 2000 జనవరిలో మాఫియా సభ్యులు కాల్పులకు తెగబడ్డా అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దావూద్ ఇబ్రహీంతో ‘సన్నిహిత’ సంబంధాలు ఉన్న నటి అనితా ఆయూబ్కు తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి నిరాకరించిన నిర్మాత జావేద్ సిద్దికీ 1995లో మాఫియా దాడిలోనే బలైపోయారు. మాఫియాతో సంబంధాలు కొనసాగించడం వల్లనే సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మహేశ్ భట్, సుభాష్ ఘయ్ తదితర దర్శక నిర్మాతలు తమకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదురైనట్లు మీడియాకు వెల్లడించారు. మాఫియా కార్యకలాపాలు కొనసాగిస్తూ బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త విక్రమ్ గోస్వామి రెండేళ్ల కిందట కెన్యాలో పట్టుబడ్డారు. మరో డాన్ అబు సలేంతో బాలీవుడ్ నటి మోనికా బేడీ కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించిన సంగతి బహిరంగ రహస్యమే. అబు సలేం అరెస్టు తర్వాత ఇద్దరూ విడిపోయారు. అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తదితర బడా హీరోలకూ మాఫియా డాన్లతో పరిచయాలు ఉన్నాయి. ఛోటా షకీల్తో తాను మాట్లాడినట్లు షారుఖ్ బహిరంగంగానే అంగీకరించాడు. - పన్యాల జగన్నాథదాసు -
ఆర్ణబ్ గోస్వామి (న్యూస్ యాంకర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు మనుషులు భలేగా ఉంటారు! దావూద్ ఇబ్రహీం అంటే వాళ్లకెప్పుడూ ఒకటే ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కుషన్ చెయిర్లో ఠీవిగా వెనక్కి వాలిపోయి, కాలు మీద కాలు వేసుకుని ఒకలాటి నిర్లక్ష్యపు డాన్ చూపు చూస్తున్న దావూదే వాళ్లకు మైండ్లోకి వస్తాడు. అరవై ఏళ్ల దావూద్ని, గ్యాంగ్రీన్తో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దావూద్ని వాళ్లు ఎప్పటికీ అంగీకరించలేరు! ‘‘లిజన్.. గోస్వామీ! దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్తో లేవలేకపోతున్నా సరే.. గన్ పట్టుకుని ముంబై వీధులలోకి వచ్చి గ్యాంగ్వార్లో కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురినైనా ధనాధన్మని పేల్చిపారేసి భారత ప్రభుత్వం కన్నుగప్పి తిరిగి కరాచీ వెళ్లిపోతుండాలని ఈ మనుషులంతా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ప్రైమ్ టైమ్లో రోజూ మనం ఆ న్యూస్ ఇవ్వగలగాలి.. వ్యూయర్స్ ఖాళీ లంచ్బాక్సులతో ఇంటికి చేరే సమయానికి’’ అన్నారు.. ఉదయం బోర్డు మీటింగులో చైర్పర్సన్. ‘‘ఎగ్జాట్లీ మేమ్’’ అన్నారు సమీర్ జైన్, వినీత్ జైన్, రాజ్ జైన్! ఒకరు వైస్ ఛైర్మన్, ఒకరు మేనేజింగ్ డెరైక్టర్, ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్! ఆలోచిస్తున్నాన్నేను. ‘‘వెల్ గోస్వామీ! వ్యూయర్స్లో మీకొక ఇమేజ్ ఉంది. దావూద్ ఇబ్రహీం మాఫియా డాన్ అయితే, ఆర్ణబ్ గోస్వామి మీడియా డాన్. దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సింది! కానీ ఏం చేశారు?! మోదీజీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మెత్తగా, కొత్తగా, కాస్త చెత్తగా కూడా మాట్లాడారు! మీరలా గన్ తీసి జేబులో పెట్టుకుని మాట్లాడ్డం ఈ దేశానికి నచ్చలేదు. ఎందుకలా చేశారు గోస్వామీ.. ది నేషన్ వాంట్స్ టు నో’’ అంటున్నారు బోర్డు మెంబర్లు.. కలగాపులగంగా, పరమ కంగాళీగా. లగడపాటి లాంటి వాళ్లనైతే ఈపాటికి లేపేసేవాడిని. ‘యు ఆర్ ఎ రకస్ క్రియేటింగ్ రౌడీ ఇన్ పార్లమెంట్ మిస్టర్ రాజగోపాల్. యు షుడ్ బి త్రోన్ అవుటాఫ్ పార్లమెంట్ అండ్ నెవర్ బి అలౌడ్ అగైన్ మిస్టర్ రాజగోపాల్’ అంటూ ఉంటే పాపం ఆయన నోరెత్తలేకపోయారు. బోర్డు రూమ్లో ఇవాళ నేను.. నాట్ లెస్ దేన్ ఎ రాజగోపాల్! ‘‘పి.ఎం. ఇంటర్వ్యూ తర్వాత మన టిఆర్పీలు పడిపోయాయి మిస్టర్ గోస్వామీ’’ అంటున్నారు మేడమ్. ‘‘గుజరాత్ సియెంగా ఉన్నప్పుడు మోదీని కరణ్ థాపర్ నీళ్లు తాగించినట్లుగా మీరూ ఏదైనా చేస్తారని అంతా ఎదురు చూశారట. ఫోన్లు వస్తున్నాయి గోస్వామీ. మోదీ చేత కనీసం ఒక్క గుటకనైనా వేయించలేకపోయారని మీ మీద, మన చానల్ మీద అంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు’’ అంటున్నారు ఎం.డీ. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలా, డిబేట్ డిబేట్లా ఉండాలి కదా.. అనబోయాను. ‘‘మీరు స్క్రీన్ మీద ఒకలా, స్ట్రీట్ మీద ఒకలా ఉంటే చానల్ డౌన్ అయిపోతుంది గోస్వామీ’’ అన్నారు బోర్డు మెంబర్లు. గాట్ ది పాయింట్. చానల్ వేల్యూ పెరగాలంటే నా వాల్యూమ్ తగ్గకూడదు! -
కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్!
దర్యాప్తు జరుపుతున్న నేపాల్ పోలీసులు కఠ్మాండు: తమ దేశం మీదుగా మాఫియా ముఠా నాయకుడు అంతర్జాతీయ మార్కెట్కి కొకైన్ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు నేపాల్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మార్కెటింగ్కు సంబంధించి దావూద్కు సన్నిహితులుగా అనుమానిస్తున్న ముగ్గురు పాక్ జాతీయులను ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో యోచిస్తున్నారు. నకిలీ కరెన్సీలో ప్రమేయం, హెరాయిన్ స్మగ్లింగ్తోపాటు యూరప్కు ఆసియామీదుగా కొకైన్ స్మగ్లింగ్లో పాక్ జాతీయుల ప్రమేయంపై నేపాల్ పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. ఇద్దరు స్థానికుల వద్ద నేపాల్ నార్కోటిక్ బ్యూరో (ఎన్సీబీ).. రెండు కిలోలకుపైగా కొకైన్ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ మార్కెట్లో దాదాపు 492 డాలర్లు ఉంటుంది. ఇందులో కొంతమంది ప్రభావవంతమైన డ్రగ్ లార్డుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎన్సీబీ చీఫ్, డీఐజీ జై బహదుర్ మీడియాతో మాట్లాడుతూ మెరిస్ కార్మెన్ నర్వేజ్ (వెనిజులా), మహ్మద్ లామైన్ డబో (నైజీరియా), తౌహిద్ ఖాన్ (భారత్), దిల్ బహదుర్ గురుంగ్ (నేపాల్)లను అరెస్టు చేసి, వారి వద్దనుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ జాతీయుల సహాయంతో వీరు హాంగ్కాంగ్కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని, సదరు పాక్ జాతీయులను వాహిద్ ఖాన్, అబ్దుల్ రజాక్, దావూద్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన అతని సోదరుడిగా గుర్తించామని చెప్పారు. భారతీయ గూఢచార విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ రాకెట్లో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న పాక్ జాతీయులను అరెస్టు చేశామని డీఐజీ చాంద్ చెప్పారు. -
దావూద్ ను పాక్ ఎప్పటికీ అప్పగించదు: చిదంబరం
న్యూఢిల్లీ: భారతదేశానికి పాకిస్థాన్ ఎప్పటికీ దావూద్ ఇబ్రహీంను అప్పగించదని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. మన దేశానికి లాభం చేకూర్చే ఏపనిని పాక్ చేయదని స్పష్టం చేశారు. గతంలో కూడా దావూద్ పాక్ లోనే ఉన్నాడని తమ ప్రభుత్వం చెబుతూ వచ్చిందని తెలిపారు. ప్రపంచానికంతటికీ ఈవిషయం తెలుసుని ఆయన అన్నారు. దావూద్ దుబాయ్,పాకిస్థాన్ లలోనే ఉండేవాడని చెప్పారు. దావూద్ ను భారత్ కు రప్పించక పోవడంలో ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేమని ఎందుకంటే పాక్ అతన్ని అప్పగించడానికి ఎప్పుడూ ఆదేశం సిద్ధంగా లేదని అన్నారు. 1993 లోముంబైలో జరిగిన బాంబు పేళుల్లలో 257 మంది మరణించిన కేసులో దావూద్ రప్పించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించామన్నారు. దావూద్ కరాచిలోనే ఉన్నాడని గతంలో తాము ఆధారాలతో సహా పాక్ కు తెలిపామన్నారు. ఆదేశం కావాలనే దావూద్ ను కాపాడుతూ వస్తోందని స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి దావూద్ కరాచీలో నివాసమున్న ఇంటి అడ్రస్ తో సహా బయటపట్టిన విషయం తెలిసిందే. -
దావూద్ చిరునామా ఇదే!!
పాకిస్థాన్ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్ నైబర్హుడ్ అత్యంత విలాసవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సింధ్ మాజీ ముఖ్యమంత్రి ముస్తఫా జాతోయ్ నివాసముంటున్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టోకి కూడా ఇక్కడో పెద్ద బంగ్లా ఉంది. పాక్లోని ప్రముఖులు నివసించే ప్రాంతంగా పేరొందిన ఇదే ప్రదేశంలో ఓ కరుడుగట్టిన నేరగాడు కూడా యథేచ్ఛగా నివసిస్తున్నాడు. 1993లో బొంబాయిలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి.. 257 మందిని పొట్టనబెట్టుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నివాసముంటున్నది ఇక్కడే. ఇతంటి విలాసవంతమైన ప్రాంతంలో ఓ భారీ భవంతిలో నిర్భయంగా బతుకున్నాడు దావూద్. అతన్ని పట్టుకొని.. భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ గత 23 ఏళ్లలో లెక్కలేని ప్రయత్నాలు చేసింది. అతడు పాక్లోనే ఉన్నాడని భారత్ ఎన్ని ఆధారాలు చూపినా.. దాయాది దేశం మా దగ్గర లేడని బొంకేది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా దావూద్ సంచలన స్టింగ్ ఆపరేషన్ జరిపింది. క్లిఫ్టన్లో ఉన్న దావూద్ ఇంటి చిరునామాను సాధించింది. డీ 13, బ్లాక్ 4, క్లిఫ్టన్, కరాచీ చిరునామాలో అతడు ఉంటున్నట్టు కనుగొన్నది. దావూద్ ఇంటి సమీపంలోని భవంతులపై నుంచి విహంగ విక్షణం ద్వారా అతని ఇంటి ఫొటోలను, అతని ఇంటి పరిసరాల ఫొటోలను ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వాహకులు తీశారు. దావూద్ బంగ్లాకు సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, దావూద్ భవంతి ఉన్న విలాసవంతమైన ప్రాంతం ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్పై పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ ఆధారాలను కూడా పాక్ ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. -
దేశంలో అల్లకల్లోలానికి దావూద్ ప్లాన్
న్యూఢిల్లీ: దేశంలో అరాచకం సృష్టించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రలు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు పెంచడంతోపాటు ఆయా మతాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేశాడని, వారిలో ముఖ్యంగా ఆరెస్సెస్ నాయకులు, చర్చిలు, చర్చిల ఫాథర్లు లక్ష్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీకి చెందిన పదిమందిపై శనివారం చార్జిషీట్ దాఖలు చేయనుంది. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో శాంతి అనేదే లేకుండా చేయాలని వారు కుట్ర పన్నినట్లు ఆ చార్జీషీట్లో పేర్కొంది. గత ఏడాది నవంబర్ 2న దావూద్ కంపెనీకి చెందిన షార్ప్ షూటర్స్ ఆరెస్సెస్ కు చెందిన శిరిష్ బెంగాలీ, ప్రగ్నీష్ మిస్త్రీలను గుజరాత్లోని భారుచ్లో చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని అరెస్టు చేయగా 1993 ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకు కారకుడైన యాకుబ్ మెమన్ను ఉరితీశారన్న కక్షతో వారిని చంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ షురూ చేసిన ఎన్ఐఏ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ లీడర్ల హత్య మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే అల్లకల్లోలం సృష్టించేందుకు భారీ పథకం పన్నినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. -
దావూద్ నుంచి భారత నేతకు ఫోన్లు!
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి రోజుకో ఆసక్తికర వార్త బయటకి వస్తోంది. ఇప్పటికే గ్యాంగ్రెయిన్ వ్యాధితో దావూద్ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడంటూ వార్తలు షికారు చేస్తుండగా తాజాగా మరో ముఖ్య విషయం వెలుగుచూసింది. పాకిస్థాన్ లోని కరాచీలో దావూద్ ఉంటున్న ఇంటి నుంచి భారత్కు తరచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయనేది ఆ వార్తల సారాంశం. అందులో మరాఠాకు చెందిన ఓ కీలక నేతకు కూడా దావూద్ ఇంటి నుంచి కాల్స్ వెళ్లాయని తెలుస్తోంది. వడోదరాకు చెందిన మనీష్ భాంగలే అనే ఎథికల్ హ్యాకర్ ఈ సమాచారాన్ని బయటికి తీసి ఇండియాటుడేకు అందజేశారు. కరాచీలోని దావూద్ ఇంట్లో 4 ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. ఐతే అవేవీ దావూద్ పేరిట లేవు. ఆయన భార్య మహేజబీన్ షేక్ పేరు మీదనే ఫోన్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇక భాంగలే తన పార్టనర్ జయేశ్ షాతో కలసి పాకిస్థాన్ టెలికాం కార్పొరేషన్ లిమిటెడ్ సైట్ను హ్యాక్ చేసి దావూద్ ఫోన్ కాల్స్ను పరిశీలించారు. 2015 సెప్టెంబర్ 5 నుంచి 2016 ఏప్రిల్ 5వ తేదీ మధ్య 7 నెలల కాల్డేటాను రాబట్టారు. ఇక 4 నెంబర్లలో ఒక నెంబర్ నుంచి తరచుగా డయల్ చేసిన 10 అంతర్జాతీయ నెంబర్లను ఇండియాటుడే విశ్లేషించింది. అందులో 5 నెంబర్లు భారత్కు, 4 దుబాయ్కి చెందినవి. ఒకటి బ్రిటన్లోని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుకు చెందిందని తేలింది. భారత్ నెంబర్లలో ఒకటి ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మహారాష్ట్ర నాయకుడిది కావడం ప్రకంపనలు రేపుతోంది. -
దావూద్ చనిపోతే.. వారసుడెవడు?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రాణ గండం సమీపించిందనే కథనాల నేపథ్యంలో దావూద్ వారసుడు ఎవరన్నది కీలకంగా మారింది. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ఆయనకు సోకిన గ్యాంగ్రీన్ చివరిదశలో ఉందని వైద్యులు తేల్చి చెప్పినట్లు తాజాగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు నిజం కావని, దావూద్ బలంగానే ఉన్నాడని అతని రైట్ హ్యాండ్ ఛోటా షకిల్ చెప్తున్నప్పటికీ.. దావూద్ చనిపోతే అతని స్థానంలో మాఫియా నేరప్రపంచం పగ్గాలు ఎవరు చేపడతారు? ముంబై మాఫియాను ఎవరు నడిపిస్తారన్నది? చర్చనీయాంశంగా మారింది. ముంబై అండర్ వరల్డ్ కేసులు ఎన్నింటినో దర్యాప్తు చేసిన మాజీ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. దావూద్ చనిపోతే.. అతని వీరవిధేయుడైన ఛోటా షకీల్ వారసుడిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని వెల్లడించారు. 'దావూద్ స్థానంలో ఛోటా షకీలే పగ్గాలు చేపట్టే అవకాశముంది. షకీల్కు దూకుడు ఎక్కువ' అని ముంబై మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ షంషేర్ ఖాన్ పఠాన్ తెలిపారు. అయితే, దావూద్ విషమపరిస్థితిలో ఉన్నాడని, రేపోమాపో అన్నట్టుగా అతని పరిస్థితి ఉందన్న కథనాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నాడని ఆయన కీలక అనుచరుడు చోటా షకీల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని అతను ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనా -
'మా డాన్ చాలా ఫిట్గా ఉన్నారు'
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా బలంగా ఉన్నారని ఆయన కీలక అనుచరుడు, సన్నిహితుడు చోటా షకీల్ చెప్పాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రాణ గండం సమీపించిందని మీడియాలో వచ్చిన కథనాలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే అని ఓ మీడియాకు తెలిపాడు. ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే దానిని మీడియా అనవసరంగా ప్రచారం చేస్తోందని, దావూద్కు ఎలాంటి ప్రాణముప్పు లేదని చెప్పాడు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని, సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే దావూద్ ఆరోగ్యంపై చోటా షకీల్ స్పందించాడు. 'మా గ్యాంగ్ స్టర్ దావూద్ చాలా ఫిట్ గా ఉన్నారు. వ్యక్తిగత లాభంతో ఎవరో సృష్టించిన గందరగోళంతో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. మీ వార్తా సంస్థల వద్ద ఉంది తప్పుడు సమాచారం. దావూద్ ఫిట్ గా ఉన్నారు' అని అతడు చెప్పాడు. -
దావూద్ పరిస్థితి విషమం!
కరాచీ: మాఫియా డాన్, ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో ఉన్నాడా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పేశారట.కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. సీఎన్ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల దావూద్ కాళ్లలోని రక్తసరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక కణజాలం కుళ్లిపోతోందని తేల్చారు. గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తయ్యే విషపదార్థాలు శరీరమంతా కూడా వ్యాపించే అవకాశముందంటున్నారు. కాళ్లు తీసేయడం తప్ప ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయం లేదని వైద్యులు భావిస్తున్నారట. ఐఎస్ఐ రక్షణ కింద ఉన్న దావూద్ను కరాచీ నుంచి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ దావూద్ పాక్లో చనిపోతే అతన్ని రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి వృథా అయినట్లే. -
దావూద్ ఇప్పుడెలా ఉంటాడో తెలుసా?
వెలుగులోకి వచ్చిన కొత్త ఫొటో ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడు? 60 ఏళ్ల అతడు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? గుర్తుపట్టలేనంతగా మారిపోయాడా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన అతని ఫొటో ఒకటి అదేమీ జరుగలేదని వెల్లడిస్తున్నది. 1993లో ముంబై వరుస పేలుళ్ల అనంతరం దావూద్ దిగిన ఫొటో ఒకటి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ముంబై పేలుళ్లకు పాల్పడి.. ఆ తర్వాత భారత్ నుంచి పారిపోయిన దావూద్ ప్రస్తుతం పాక్లో గడుపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట కరాచీ వెళ్లిన భారత జర్నలిస్టు వివేక్ అగర్వాల్.. అక్కడ దావూద్ ఫొటో తీశాడు. అప్పట్లో మొయిన్ ప్యాలెస్ లో ఉండే దావూద్ ఆ తర్వాత మకాం మార్చాడు. ఈ ఫొటోలో దావూద్ నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తాపైజామా ధరించి ఉన్నాడు. మీసం తొలగించి క్లీన్ షేవ్తో కనిపిస్తున్న అతడు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని ఈ ఫొటో స్పష్టం చేస్తున్నది. ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఫొటోలు కొన్నింటినీ భారత్ గత ఏడాది ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్లోని కరాచీలో దావూద్ యథేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ చెప్తుండగా.. పాక్ మాత్రం తమ గడ్డపై దావూద్ లేనేలేడని వాదిస్తున్నది. -
నా సినిమాలో దావూదే స్వయంగా నటిస్తున్నాడు!
సోషల్ మీడియాలో తన సినిమాలకు ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. ఎప్పుడూ ఏదో కామెంట్ చేస్తూ లైమ్ లైట్లో ఉంటూనే అవసరమైనప్పుడు తన సినిమాలకు దండిగా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. తాజాగా తన సినిమా 'గవర్నమెంట్' విషయంలోనే ఇదే ట్రిక్ ప్లే చేశాడు వర్మ. మాఫియా డాన్లు దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య బద్ధ శత్రుత్వం నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దావూద్ పాత్ర పోషించడానికి సరైన నటుడు దొరికాడంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. అయితే నటుడు దొరికానడం అబద్ధమని, స్వయంగా దావూదే ఈ సినిమాలో పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడని మరో ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. చివరకు చేసిన ఇంకో ట్వీట్లో అబ్బే దావూద్ ఇబ్రహీం మా సినిమాలో స్వయంగా నటించడం అబద్ధం అంటూ మరో మెలిక పెట్టాడు. మొత్తానికి 'గవర్నమెంట్' సినిమాలో కీలకమైన దావూద్ పాత్ర కోసం సరిగ్గా సరిపోయే నటుడు దొరికాడని చెప్పకనే చెప్పాడు వర్మ. -
దావూద్ ఇబ్రహీం అన్నకొడుకు అరెస్టు
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అన్నకొడుకు సోహైల్ కస్కర్ (36)ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నార్కో టెర్రరిజానికి పాల్పడుతూ కుట్రలు పన్నుతున్నాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. విదేశీ ఉగ్రవాద సంస్థకు సామగ్రి సరఫరా చేయడం, మిసైల్ లాంచింగ్ సిస్టంలను అక్రమంగా అమ్మడం లాంటి నేరాలు కూడా అతడిపై ఉన్నాయి. కొలంబియాకు చెందిన ఉగ్రవాద సంస్థతో సోహైల్కు సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికాలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) సంస్థ అతడితో పాటు మరో ఇద్దరు పాకిస్థానీయులను 2015 డిసెంబర్ నెలలో అరెస్టు చేసింది. స్పెయిన్ నుంచి అతడిని నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద రప్పించారు. కానీ దావూద్, అతడి మనుషులు ఈ విషయం ఇప్పటివరకు బయటపడకుండా తొక్కిపెట్టారు. ఇది బయటపడితే తమ పరువు ఎక్కడ పోతుందోనని వాళ్లిలా చేశారు. దావూద్ చిన్న తమ్ముడు నూరా పెద్దకొడుకే ఈ సోహైల్. నూరా గతంలోనే మరణించాడు. సోహైల్ను విడిపించేందుకు దావూద్ ఇబ్రహీం ఓ పెద్దస్థాయి లాయర్ను నియమించాడు. కానీ ఒకవేళ అతడిమీద నేరం రుజువైతే మాత్రం దాదాపు 25 ఏళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. -
పాక్లో దావూద్, మోదీ భేటీ: ఆజంఖాన్
లక్నో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గతేడాది డిసెంబర్ 25న పాకిస్తాన్లో జరిపిన ‘స్టాప్ఓవర్’లో ఆ దేశ ప్రధాని షరీఫ్తోపాటు.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంనూ కలిశాడని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. ‘షరీఫ్ ఇంట్లో జరిగిన వ్యక్తిగత భేటీలో ఆయన తల్లి, కూతురు, మోదీతోపాటు దావూద్ కూడా ఉన్నారు. కావాలంటే ఇది అబద్ధమని మోదీని చెప్పమనండి. నా దగ్గర ఆధారాలున్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనవి జాతిని అవమానించే వ్యాఖ్యలని పేర్కొంది. -
హిందీలో ‘గవర్నమెంట్’
మాఫియా సినిమాలు తీయడంలో రామ్గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ‘సత్య, కంపెనీ, సర్కార్’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు మళ్లీ మాఫియా నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ ‘గవర్నమెంట్’ పేరుతో ఓ సినిమా రూపొందించనున్నారు. ఇది హిందీ చిత్రం. మాఫియా డాన్లు దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ల మధ్య నెలకొన్న మనస్పర్థలు, వాళ్లిద్దరూ విడిపోయాక పుట్టగొడుగుల్లా వచ్చిన ఛోటా ఛోటా డాన్లు, హఠాత్తుగా అబూ సలేమ్ డాన్గా ఎదగడం వంటి అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూడు పాత్రలతో పాటు ఇంకా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, శివసేన అధినేత దివంగత బాల్ థాకరే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, నటి మోనికా బేడి, ఛోటా రాజన్ సతీమణి సుజాత... ఇలా పలువురి జీవితాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. దావూద్ ఇబ్రహీమ్-ఛోటా రాజన్ల జీవితం ఆధారంగా ‘కంపెనీ’ తీసినప్పటికీ అది కాల్పనిక కథ అనీ, ‘గవర్న మెంట్’ సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. ‘సర్కార్ 3’కీ, దీనికీ కూడా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
సోదరుడిని వారసుడిగా ప్రకటించనున్న దావూద్! * 60వ బర్త్డే పార్టీలో ప్రకటించే అవకాశం ముంబై: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా?వారసుడిని ప్రకటించనున్నాడా?.. ఈ ప్రశ్నలకు ముంబైలోని ‘డీ’ కంపెనీ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. ‘డీ’ కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. సోదరుడు అనీస్ అహ్మద్కు డీ కంపెనీ పగ్గాలు అప్పగించేందుకు దావూద్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు డీ గ్యాంగ్ సీఈఓగా ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు చోటా షకీల్ ఇకపైనా అదే బాధ్యతల్లో కొనసాగుతారు. అనీస్, షకీల్లు కలిసి, దావూద్ సలహ సంప్రదింపుల మేరకు ‘డీ’ కంపెనీ మాఫియా బిజినెస్ను నిర్వహిస్తారు. పలు దేశాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల అమ్మకం, బెట్టింగ్, హవాలా తదితర కార్యకలాపాల ద్వారా వెయ్యి కోట్ల డాలర్ల(సుమారు రూ. 66 వేల కోట్లు) మాఫియా సామ్రాజ్యాన్ని దావూద్ నిర్మించారు. దావూద్ సోదరుల్లో అనీస్, హుమాయున్, ముస్తఖీమ్.. దావూద్తోనే ఉంటున్నారు. వారిలో ముస్తఖీమ్ దీర్ఘకాల వ్యాధితో బాధపడ్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. హుమాయున్ ‘డీ’ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేడు. అందువల్ల అనీస్కే వారసత్వ పగ్గాలు అప్పగించవచ్చు. దావూద్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఆయన భార్య మెహజబీన్, ఇద్దరు పిల్లలు మహరూఖ్, మొయిన్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడ్తున్న దావూద్కు విశ్రాంతి అవసరమన్న ఉద్దేశంతో వారు బాధ్యతలను తగ్గించుకోవాలంటూ దావూద్పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చనుకుంటున్నారు. రహస్యం.. అంగరంగ వైభవం తన 60వ పుట్టిన రోజును దావూద్ శనివారం కరాచీలో వైభవంగా జరుపుకుంటున్నాడు. వేదిక ఎక్కడ అనేది అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. అతిధులకు కూడా ఆ వివరాలు ఇవ్వడం లేదు. బర్త్డే వేడుకలకు కాసేపు ముందు పికప్ చేసుకుంటామని వారికి చెప్పినట్లు సమాచారం. దావూద్ పాక్లో ఉండడు! ముంబై: ‘దావూద్ పాక్లో ఉండడు.. తరచుగా పాక్కు వస్తాడని వింటుంటాను.’ అని కరాచీకి చెందిన మీడియా గ్రూప్ ‘డాన్’ సీఈఓ హమీద్ పేర్కొన్నారు. ముంబై ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?
పాకిస్థాన్లో ఉండి.. ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇక రిటైర్ అవుదామని చూస్తున్నట్లుంది. శనివారం షష్టిపూర్తి చేసుకోబోతున్న దావూద్.. ఆరోజు తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్కు అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకొనే ఛోటా షకీల్కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని తెలుస్తోంది. అయితే, సాధారణంగా దావూద్ ఏం చేసినా ముంబైలోని బిగ్షాట్లకు తెలిసిపోతుంది. వాళ్లు కూడా 'భాయ్' దిగిపోతున్న విషయం తమకు తెలియదనే అంటున్నారు. కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని తన 60వ పుట్టినరోజు సందర్భంగా జరిగే పార్టీలో ప్రకటిస్తాడని అంచనా. పార్టీ ఎక్కడ జరుగుతుందన్న విషయం కూడా టాప్ సీక్రెట్గా ఉంచారు. పార్టీకి పిలిచినవాళ్లకు కూడా ఎక్కడన్న విషయం చివరి నిమిషంలోనే చెబుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయల డి కంపెనీ సామ్రాజ్యం తన అనారోగ్యం కారణంగా కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్ అంటున్నారు. దావూద్ సోదరుల్లో నూరుల్ హక్ అలియాస్ నూరా చనిపోయాడు. ఇక్బాల్ కస్కర్ను దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. దాంతో మరో ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నారు. వాళ్లు అనీస్, హుమాయూన్, ముస్తఖీమ్. వీళ్లలో అనీస్ తప్ప మిగిలిన ఇద్దరూ గ్యాంగు కార్యకలాపాల్లో అంత చురుగ్గా ఉండరు. ముస్తఖీమ్ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో అతడు ఇంటికే పరిమితం. దాంతో ఇక ఛోటా షకీల్ సాయంతో అనీస్ గ్యాంగు పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కూతుళ్ల ఒత్తిడి దావూద్ ఇబ్రహీంకు మహరూఖ్, మోయిన్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లలో మహరూఖ్ను మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ మియాందాద్కు ఇచ్చి పెళ్లి చేశాడు. మోయిన్ నిఖార్సైన ముస్లిం. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రిని ఇక పని ఒత్తిడి తగ్గించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరికి గ్యాంగు అప్పగించి ఇక విశ్రాంతి తీసుకోవాలని దావూద్ భార్య మెహజబీన్ కూడా ఎన్నాళ్ల నుంచో పోరు పెడుతోంది. అందుకే ఇక రిటైర్మెంటు గురించి డాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.