England Vs Pakistan
-
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
మరీ స్కూల్ పిల్లల్లా ఆడారు: పాక్ మాజీ బ్యాటర్ విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో టెస్టుల్లో రోహిత్ సేన మరీ స్కూల్ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్ టైగర్స్’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్)కే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్లో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్ సేన పేపర్పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగాఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో.. ‘‘న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది. ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్ టైగర్స్ అంటారు.మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయినపుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓటమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్ శర్మ అంటున్నాడు.కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్ గెలిచింది. మీ సంగతి ఏమిటి?మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టైటిల్ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్లు ఓడిన పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్పై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్కు ఎంపికైన పేసర్ -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాక్.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో పాక్ 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై ఘన విజయం సాధించింది. పాక్ గెలుపులో ఆ జట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కోల్పోయిన 20 వికెట్లను పాక్ స్పిన్నర్లే పడగొట్టారు. పాక్ స్పిన్నర్లలో సాజిద్ ఖాన్ 10 వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ 9, జహీద్ మెహమూద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.The wait is over for the Pakistan team 🔥pic.twitter.com/gLY4p3gaur— CricTracker (@Cricketracker) October 26, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ సూపర్ సెంచరీతో (134) పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో నౌమన్ అలీ (45), సాజిద్ ఖాన్ (48 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ 3, అట్కిన్సన్ 2, జాక్ లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.77 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. నౌమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) దెబ్బకు 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ (33) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం 36 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 3.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.చదవండి: Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్కు ఘోర పరాభవం -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్పై ఇంగ్లండ్కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్మ్యాన్’?! -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సర్ఫరాజ్ ఆల్టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
సౌద్ షకీల్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా పాక్!
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తోంది. పాక్ స్పిన్నర్ల దాటికి పర్యాటక ఇంగ్లీష్ జట్టు విల్లవిల్లాడుతోంది. 77 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్నర్లు నోమన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.షకీల్ సూపర్ సెంచరీ..అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులకు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన సెంచరీతో షకీల్ గట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న షకీల్ 5 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ 4 వికెట్లతో మెరవగా.. షోయబ్ బషీర్ మూడు, అట్కినసన్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 267 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్లో లంక చేతిలో పాక్ చిత్తు -
PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..!
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం. 52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు, సెకెండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడు, సెకెండ్ ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ సొంతగడ్డపై 11 మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ ఏడు, నౌమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, జాక్ లీచ్ 3, బ్రైడన్ కార్స్ 2, మాథ్యూ పాట్స్ ఓ వికెట్ పడగొట్టారు.297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ను నౌమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
PAK VS ENG 2nd Test: బెన్ డకెట్ వరల్డ్ రికార్డు
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన డకెట్ టెస్ట్ క్రికెట్ అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. డకెట్ తన 27 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 2293 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్ల్లో బంతుల పరంగా వేగవంతమైన 2000 పరుగులు..బెన్ డకెట్ 2293 బంతులుటిమ్ సౌథీ 2418 బంతులుఆడమ్ గిల్క్రిస్ట్ 2483 బంతులుసర్ఫరాజ్ అహ్మద్ 2693 బంతులువీరేంద్ర సెహ్వాగ్ 2759 బంతులురిషబ్ పంత్ 2797 బంతులుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బెన్ డకెట్ సెంచరీతో (114) కదంతొక్కగా.. జాక్ క్రాలే 27, ఓలీ పోప్ 29, జో రూట్ 34, హ్యారీ బ్రూక్ 9, బెన్ స్టోక్స్ ఒక్క పరుగు చేశారు. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకున్న రూట్ -
బెన్ డకెట్ సెంచరీ.. అయినా కష్టాల్లో ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ జట్టు ఉన్నట్లుండి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో సాజిద్ ఖాన్ (పాక్ స్పిన్నర్) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్కోర్ 124/1 వద్ద ఉన్న సమయంలో సాజిద్ ఖాన్ వరుసగా ఓలీ పోప్ (29), జో రూట్ (34), సెంచరీ హీరో బెన్ డకెట్ (114), హ్యారీ బ్రూక్ (9) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 14 పరుగుల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 239/6గా ఉంది. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది.బెన్ డకెట్ సెంచరీబెన్ డకెట్ 120 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డకెట్కు టెస్ట్ల్లో ఇది నాలుగో సెంచరీ. ఓపెనర్గా బరిలోకి దిగిన డకెట్ ఆది నుంచి పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డకెట్ తన ఇన్నింగ్స్లో మొత్తం 16 బౌండరీలు బాదాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా వరల్డ్కప్ విన్నర్ -
అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 7 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. బెన్ డకెట్ 26, జాక్ క్రాలే 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: IPL 2025: ‘కమిన్స్ను వదిలేయనున్న సన్రైజర్స్! కారణం ఇదే’ -
అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్
‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ తొలి మ్యాచ్లోనే దుమ్ములేపాడు.అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్ గులామ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కమ్రాన్ను కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన బాబర్.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్గా కమ్రాన్ గులామ్ రికార్డు సాధించాడు.తొలి ఆటగాడిగా మరో రికార్డుగతంలో పాక్ తరఫున ఖాలిద్ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్ మియాందాద్ (న్యూజిలాండ్పై 1976లో), సలీమ్ మాలిక్ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్ వసీమ్ (న్యూజిలాండ్పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్ మహమూద్ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్ ఖాన్ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్ ఉమర్ (బంగ్లాదేశ్పై 2001లో), యాసిర్ హమీద్ (బంగ్లాదేశ్పై 2003లో), ఫవాద్ ఆలమ్ (శ్రీలంకపై 2009లో), ఉమర్ అక్మల్ (న్యూజిలాండ్పై 2009లో), ఆబిద్ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్పై ఓ అరంగేట్ర పాకిస్తాన్ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.తొలిరోజు.. తడబడి.. నిలబడికమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్లో తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్ జట్టు... కమ్రాన్ గులామ్ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అయూబ్ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3), సౌద్ షకీల్ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్తో కలిసి కమ్రాన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, జాక్ లీచ్, కార్స్, పాట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్ ఆజమ్ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్ అన్నాడు. కాగా కమ్రాన్ గులామ్ ఇప్పటి వరకు 59 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పాక్ ప్లేయర్
బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ పాక్ తరఫున తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గులామ్.. 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన గులామ్.. చాలా బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. The Moments Kamran Ghulam completed his Hundred on Test Debut. 👏He came as Babar Azam's replacement and when came to bat Pakistan were 19/2 & then he smashed Hundred - THE FUTURE OF PAKISTAN. ⭐pic.twitter.com/Z33V23vVgV— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024అతడికి సైమ్ అయూబ్ (77) సహకారం అందించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 86 ఓవర్ల అనంతరం ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (7), సైమ్ అయూబ్ (77), షాన్ మసూద్ (3), కమ్రాన్ గులామ్ (118), సౌద్ షకీల్ (4) ఔట్ కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (31), అఘా సల్మాన్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్పై వేటు -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. పాక్ తుది జట్టు ప్రకటన
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించారు. తొలి టెస్ట్ ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ స్థానాల్లో కమ్రాన్ గులామ్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్ తుది జట్టులోకి వచ్చారు. ఈ జట్టుకు సారధిగా షాన్ మసూద్ కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్గా సౌద్ షకీల్ వ్యవహరించనున్నాడు. రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును కూడా ఇవాళే ప్రకటించారు. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి రాగా.. పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో మరో పేసర్ మాథ్యూ పాట్స్ను తుది జట్టులోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ స్థానంలో బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఓలీ పోప్ నుంచి స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.ఇంగ్లండ్తో రెండో టెస్ట్ కోసం పాక్ తుది జట్టు..సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్పాక్తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: భారత్తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే? -
పాక్తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్తో ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత నాలుగు టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు ఓలీ పోప్ నాయకత్వం వహించాడు. పోప్ నాయకత్వంలో ఇంగ్లండ్ నాలుగింట మూడు మ్యాచ్లు గెలిచింది. తాజాగా స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ జట్టు బలం మరింత పెరిగినట్లైంది. స్టోక్స్ను తుది జట్టులోకి తీసుకున్న క్రమంలో క్రిస్ వోక్స్కు తప్పించించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్. ఈ మార్పుతో పాటు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మరో మార్పు కూడా చేసింది. తొలి టెస్ట్లో ఆడిన గస్ అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ను తుది జట్టులోకి తీసుకుంది. స్టోక్స్ జట్టులో చేరిన క్రమంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి స్టోక్స్కే అప్పజెప్పాడు.మరోవైపు రెండో టెస్ట్కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా భారీ మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను పక్కకు పెట్టింది. ఇంగ్లండ్తో తదుపరి ఆడే రెండు టెస్ట్లకు వీరు దూరంగా ఉంటారు. వీరితో పాటు డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్ కూడా రెండో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.పాక్తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్ -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్తో సిరీస్లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముల్తాన్లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
పాక్ క్రికెట్కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్లలో క్లీన్స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్వన్ బ్యాటర్గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్వన్ బ్యాటర్గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ! -
ఇంగ్లండ్తో చివరి రెండు టెస్ట్లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్తో రెండు, మూడు టెస్ట్లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
బాబర్ ఆజంకు భారీ షాక్.. జట్టు నుంచి ఔట్?
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.బాబర్ కథ ముగిసినట్లేనా?బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
కషాల్లో పాకిస్తాన్ క్రికెట్.. ఆ స్టార్ క్రికెటర్కు మళ్లీ పిలుపు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్తో రెడ్ బాల్ సిరీస్ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.దీంతో సర్వాత్ర పాక్ జట్టు, మెనెజ్మెంట్ విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండు టెస్టుకు ముందు తమ జట్టులో పలు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్రకారం.. స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ను తిరిగి జట్టులోకి తీసుకు రావాలని పీసీబీ సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. అతడితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇమామ్ ఉల్ హక్ చివరగా పాకిస్తాన్ తరపున గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి పాక్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్లు ఆడిన ఇమామ్..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రాబిన్ ఉతప్ప -
ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ కెప్టెన్పై వేటు?
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరుస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూసింది.తొలి ఇన్నింగ్స్లో 550కు పైగా పరుగులు చేసి ఆ మ్యాచ్లో ఓడిపోయిన మొదటి జట్టు పాకిస్తాన్ చెత్త రికార్డును మూటకట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగులు చేసిన పాక్ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 220 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 823 పరుగుల భారీ స్కోర్ చేసింది.మసూద్పై వేటు..కాగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత అతడిని తమ జట్టు పగ్గాలను తప్పించాలని పాక్ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు పాక్ వెళ్లనుంది.ఈ టూర్కు ముందు పాక్కు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ఆల్రౌండర్ ఆఘా సల్మాన్ లేదా వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు పాక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. ఇక ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిఇక ఈ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్ను కోల్పోలేదు.అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
పాకిస్తాన్కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కాలంటే చివరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసంభవమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 115 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (41), అమెర్ జమాల్ (27) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్తో జరిగిన మ్యాచ్లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
బాబర్ ఆజమ్.. ఇక మారవా..?
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పని అయిపోయింది. బాబార్ గత 18 ఇన్నింగ్స్ల్లో (654 రోజులుగా) కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను చివరిసారిగా 2023లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ముల్తాన్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసిన పిచ్పై బాబర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. బాబర్తో పాటు సెకెండ్ ఇన్నింగ్స్లో పాక్ జట్టు మొత్తం పేకమేడలా కూలింది. ఆ జట్టు 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్.. 29 పరుగులకు రెండు వికెట్లు.. 41 పరుగులకు మూడు వికెట్లు.. అదే స్కోర్ వద్ద నాలుగో వికెట్.. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసిన పాక్ ఆటగాళ్లు సెకెండ్ ఇన్నింగ్స్లో ఇలా వచ్చి అలా ఔటైపోతున్నారు. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కాలంటే మరో 115 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం.పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (4), అమెర్ జమాల్ (3) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించాలంటే పాక్ మరో 180 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: తండ్రి ఆకస్మిక మరణం.. స్వదేశానికి పయనమైన పాక్ కెప్టెన్ -
PAK vs ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జోసఫ్ ఎడ్వర్డ్ రూట్ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారీ డబుల్ సెంచరీ (262) చేసిన రూట్.. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 20000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా, ఓవరాల్గా 13వ ఆటగాడిగా రికార్డుపుటల్లోకెక్కాడు. రూట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 350 మ్యాచ్లు ఆడి 20079 పరుగులు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత 20000 పరుగులు పూర్తి చేసింది రూట్ ఒక్కడే. విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 535 మ్యాచ్లు ఆడి 27041 పరుగులు చేశాడు.కాగా, పాక్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. సహచురుడు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడ్డాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: టెస్ట్ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్ -
టెస్ట్ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది. బ్రూక్ తన ట్రిపుల్ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్- సెహ్వాగ్- 278 బంతులు- బ్రూక్- 310 బంతులు- మాథ్యూ హేడెన్- 362 బంతులు- సెహ్వాగ్- 364 బంతులుకాగా, ఈ మ్యాచ్లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. పాక్పై ట్రిపుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.ముల్తాన్ వికెట్పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
పాక్కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఇప్పటికే జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చేరాడు. ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్కు స్వర్గధామంలా ఉన్న ముల్తాన్ పిచ్పై బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్డేను తలపిస్తూ పాక్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 ఫోర్లు, 1 సిక్సర్తో బ్రూక్ తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం 218 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.అది పిచ్ కాదు.. హైవే!తొలి టెస్టుకు సిద్దం చేసిన ముల్తాన్ పిచ్పై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్కు పనికిరాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్వింగ్, టర్న్ లేకుండా హైవేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్ను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 658 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(220), జో రూట్(259) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 414 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్లా డైవ్ చేస్తూ! వీడియో First Test double ton for Harry Brook 💯💯#PAKvENG | #TestAtHome pic.twitter.com/ZjikCyBQpu— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024 -
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రూట్కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
PAK VS ENG 1st Test: లక్కీ బ్రూక్..!
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులే వెనుకపడి ఉంది. జో రూట్ (176), హ్యారీ బ్రూక్ (141) అజేయ శతకాలతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరువగా.. ఓలీ పోప్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, ఆమెర్ జమాల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.What happened there?! 😲Brook is rendered lucky 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/qk5dzRKEYn— Pakistan Cricket (@TheRealPCB) October 9, 2024లక్కీ బ్రూక్ఈ మ్యాచ్లో బ్రూక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమెర్ జమాల్ బౌలింగ్లో బ్రూక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ వికెట్లకు తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో బ్రూక్ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు లక్కీ బ్రూక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో బ్రూక్ ఆరో టెస్ట్ సెంచరీని, రూట్ 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. పాక్కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో బ్రూక్ 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో బ్రూక్కు ఇది ఆరో సెంచరీ. పాక్పై కేవలం ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగవది. బ్రూక్తో పాటు మరో ఎండ్లో జో రూట్ కూడా సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు సెంచరీల మోత మోగించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ధీటుగా జవాబిస్తుంది. 85.2 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 427/3గా ఉంది. రూట్ 146, బ్రూక్ 108 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరిశారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా -
అరివీర భయంకర ఫామ్లో జో రూట్.. టెస్ట్ల్లో 35వ సెంచరీ
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. రూట్ గత మూడేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో రూట్ 2021 నుంచి 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.JOE ROOT, YOU FREAKING LEGEND. 🙇♂️- 35th Test century going past Gavaskar, Younis, Lara and Jayawardene and became England's leading run scorer as well in Tests. The GOAT!! 🐐 pic.twitter.com/uG9pkzpmOf— Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2024రూట్ ఖాతాలో 35వ సెంచరీతాజాగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో రూట్ మరో సెంచరీతో మెరిశాడు. రూట్కు టెస్ట్ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలో రూట్ సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేళ జయవర్దనే, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. పైన పేర్కొన్న వారంతా టెస్ట్ల్లో తలో 34 సెంచరీలు చేశారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు..సచిన్-51కల్లిస్-45పాంటింగ్-41సంగక్కర-38ద్రవిడ్-36రూట్-35*ఈ ఏడాది ఐదో సెంచరీరూట్ టెస్ట్ల్లో తన రెడ్ హాట్ ఫామ్ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. తాజా సెంచరీతో కలుపుకుని రూట్ ఈ ఏడాది ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఏడాది టెస్ట్ల్లో రూట్, కమిందు మెండిస్ మాత్రమే ఐదు సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా మ్యాచ్లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రూట్ (104), హ్యారీ బ్రూక్ (59) క్రీజ్లో ఉన్నారు. జాక్ క్రాలే (78), ఓలీ పోప్ (0), బెన్ డకెట్ (84) ఔటయ్యారు. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా
టెస్టు క్రికెట్లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగులు వరదపారిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్లో అదరగొట్టిన రూట్.. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ముల్తాన్ వేదికగా పాక్తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.కుక్ ఆల్టైమ్ రికార్డు బద్దలు..టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్పటివరకు 147 టెస్టులు ఆడి 12473* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కుక్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.చదవండి: CT 2025: పాక్కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? -
ENG vs PAK: పాక్తో అట్లుంటది మరి (వీడియో)
ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్కు ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న స్టార్ ప్లేయర్లు జో రూట్(72), బెన్ డకెట్(80) సెంచరీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా పాకిస్తాన్ టీమ్ మరోసారి తమ పరువు పోగొట్టుకుంది. ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలు అయింది.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాక్ పేసర్ అమీర్ జమాల్ తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతి కాస్త బ్యాట్కు దగ్గర వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్తో పాటు బౌలర్ క్యాచ్కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ కూడా అంత స్పష్టంగా అప్పీల్ చేయలేదు. ఎందుకంటే కనీసం బ్యాట్కు తాకిన శబ్ధం కూడా రాలేదు. కానీ జమాల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని కెప్టెన్ మసూద్కు సూచించాడు. మసూద్ ముందు వెనక ఆలోచించకుండా వెంటనే డీఆర్ఎస్కు సిగ్నల్ చేశాడు. అయితే రిప్లేలో బంతికి, బ్యాట్కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించాడు. బిగ్ స్క్రీన్పై రిప్లే చూసిన అభిమానులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్తో అట్లుంటది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: CT 2025: పాక్కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే? pic.twitter.com/d1uBa82Nh4— Jatin malu (Ja3) (@jatin_malu) October 9, 2024 -
PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్ లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్కే దక్కుతుంది.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..రూట్-5005లబూషేన్-3904స్టీవ్ స్మిత్-3486బెన్ స్టోక్స్-3101బాబర్ ఆజమ్-2755ఎడిషన్ల వారీగా రూట్ చేసిన పరుగులు..2019-21లో 1660 పరుగులు2021-23లో 1915 పరుగులు2023-25లో 1490 పరుగులురూట్ ఖాతాలో మరో రికార్డు..తాజా ఇన్నింగ్స్తో రూట్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఐదోసారి క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్.. బ్రియాన్ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్ల్లో) చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్లో ఆమెర్ జమాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్గా సచిన్ -
PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో పాక్ ఆటగాడు ఆమెర్ జమాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఆడిన పుల్ షాట్ను జమాల్ 'కమాల్' క్యాచ్గా మలిచాడు. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జమాల్ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్లా క్యాచ్ అందుకున్నాడు. జమాల్ కమాల్ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.UNBELIEVABLE CATCH 😲Aamir Jamal pucks it out of thin air to send back the England captain 👌#PAKvENG | #TestAtHome pic.twitter.com/MY3vsto4St— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్లో ఆమెర్ జమాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: హాంగ్కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. అఘా సల్మాన్ అజేయ శతకం.. పాక్ భారీ స్కోర్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు మూడో సెషన్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్లో ఆమెర్ జమాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 1.3 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 7/1గా ఉంది. జాక్ క్రాలే (4), జో రూట్ (3) క్రీజ్లో ఉన్నారు. చదవండి: Ind vs Aus: టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఓపెనర్ల సెంచరీలుకాగా బంగ్లాదేశ్తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్వాష్కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్తో సిరీస్ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకాలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. నసీం షా సైతం 33 పరుగులతోఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.రిజ్వాన్ మాత్రం డకౌట్ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్లో క్రిస్ వోక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌద్ షకీల్(35), నసీం షా(0) ఉన్నారు.అయితే పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 253 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మసూద్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 151 పరుగులు చేయగా.. షఫీక్ 184 బంతుల్లో 102 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్లో కూడా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఆజం ఔటయ్యాడు.తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో ఎల్బీగా బాబర్ పెవిలియన్కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బషీర్,వోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: కోచ్గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్ -
కోచ్గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్
ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ సోమవారం(ఆక్టోబర్ 7) ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. కాగా ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్గా బాధ్యతలు చేపట్టిన దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. ఇంకా జట్టుతో చేరలేదు.ఈ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంప్లో సైతం జిమ్మీ భాగం కాలేదు. అండర్సన్ ప్రస్తుతం స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న గోల్ప్ టోర్నీ ఆల్ఫ్రెడ్ డన్హిల్ లింక్స్ ఛాంపియన్షిప్లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు జట్టుతో కలిసేందుకు మరో రెండు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు అతడి తీరును తప్పుబడుతున్నారు. కీలకమైన సిరీస్ను పక్కన పెట్టి గోల్ప్ టోర్నీలో పాల్గోనడమెంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్సన్కు ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం మద్దతుగా నిలిచాడు. జిమ్మీ ఇంకా జట్టుతో చేరనప్పటకి వర్చవుల్గా తన సూచనలు అందిస్తున్నాడని మెకల్లమ్ తెలిపాడు."రెండు నెలల క్రితం ఆండర్సన్ కోచ్గా పనికిరాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో అతడు ఇంకా జట్టుతో చేరలేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మేము కూడా అతడిని మిస్ అవుతున్నాము. ఒక ఆటగాడి నుండి కోచ్గా మారిన తక్కువ సమయంలో జిమ్మీ ఎంత ప్రభావం చూపించాడో మాకు ఇప్పుడు ఆర్ధమవుతోంది.ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. అతడు తన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే జట్టుతో పాటే ఉండాల్సిన అవసరం లేదు. వర్చువల్గా అతడు మా బౌలర్లకు సలహాలు, చిట్కాలు అందిస్తున్నాడు. అతడు స్కాట్లాండ్లో జరుగుతున్న గోల్ఫ్ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ విషయం మాకు ముందే చెప్పాడు. మేము అందరి కలిసి తీసుకున్న నిర్ణయమిది. జిమ్మీ త్వరలోనే జట్టుతో చేరుతాడు. అతడు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తన న్యూ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. కాబట్టి అతడికి తన కుటుంబంతో గడిపే సమయం కూడా ఇవ్వాలి కాదా. జిమ్మీ మా జట్టు పార్ట్టైమ్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే. పూర్తి స్ధాయిలో అతడు తన సేవలను అందించడు" అంటూ ఓ ఇంటర్వ్యూలో మెకల్లమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో) -
పాక్ కెప్టెన్ సూపర్ సెంచరీ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై షాన్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్న మసూద్ కేవలం 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ప్రస్తుతం 104 పరుగులతో మసూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మసూద్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. అయితే అతడికి నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. మసూద్ చివరగా 2020లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో శతకం సాధించాడు.అంతేకాకుండా 2022 ఏడాది తర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. 2022 డిసెంబర్లో పాకిస్తాన్ కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజం.. కివీస్తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత మసూద్ సెంచరీతో మెరిశాడు. ఇక 39 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో మసూద్తో పాటు షఫీక్(72) పరుగులతో ఉన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
Pak Vs Eng: పాక్ తుదిజట్టు ఇదే.. సూపర్ స్టార్ రీఎంట్రీ
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆసీస్తో సిరీస్లో సత్తా చాటిన ఆమీర్బంగ్లాదేశ్తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్తో మ్యాచ్కు అతడు ఫిట్గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.ఆ ముగ్గురూ అవుట్అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవుఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్కు దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుపాకిస్తాన్సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.చదవండి: IPL 2025: రోహిత్, కిషన్కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Pak vs Eng: ‘అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి’
పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లోనూ ఘోర పరాభవం పాలైంది.షాన్ మసూద్ బృందంపై విమర్శలుతొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్లో 0-2తో వైట్వాష్కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్తో పాక్ టెస్టు జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండిపాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్మెన్ తయారు చేసిన పిచ్ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అప్పుడు 3-0తో చిత్తుకాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: IPL 2025: రోహిత్, కిషన్కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
పాక్తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఇంగ్లండ్ క్రికెట్ ప్రకటించింది.ముల్తాన్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టోక్స్.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ఈ సిరీస్తో స్టార్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకపై బ్యాట్, బాల్తో సత్తాచాటిన గుస్ అట్కిన్సన్కు కూడా ఇంగ్లండ్ మెనెజ్మెంట్ తొలి టెస్టుకు చోటు కల్పించింది.పాక్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
Pak vs Eng: పాకిస్తాన్తో తొలి టెస్టు.. బెన్ స్టోక్స్ దూరం!
పాకిస్తాన్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్రౌండర్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో ఒలీ పోప్ మరోసారి స్టోక్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ది హండ్రెడ్ లీగ్ 2024 సందర్భంగా బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. నార్తర్న్ సూపర్చార్జెర్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు తొడకండరాల నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కూడా ఆడలేకపోయాడు.ఈ క్రమంలో ఒలీ పోప్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇంగ్లండ్ శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, కెప్టెన్సీ పోప్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపగా.. అతడు విమర్శల పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 7 నుంచి పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది.ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టుఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ముల్తాన్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే మాట్లాడుతూ.. స్టోక్స్ గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘ఇంకో రెండు మూడు వైద్య పరీక్షల తర్వాత అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడో లేదో తెలుస్తుంది. పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నాం.రిస్క్ తీసుకోవడం అనవసరంమ్యాచ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నాడు. అయితే, రిస్క్ తీసుకోవడం అనవసరం. మా జట్టు పటిష్టంగా ఉంది. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్రౌండర్లుగా రాణించగల సమర్థులు ఉన్నారు. అందుకే.. అతడిపై మేనేజ్మెంట్ ఒత్తిడి పెట్టదలచుకోలేదు’’ అని జాక్ క్రాలే మీడియాతో పేర్కొన్నాడు. కాగా క్రాలే సైతం చేతి వేలికి గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడు శ్రీలంకతో టెస్టులు మిస్సయ్యాడు. అతడి స్థానంలో డాన్ లారెన్స్ ఓపెనింగ్ చేశాడు. పాక్తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, రెహాన్ అహ్మద్, జో రూట్, షోయబ్ బషీర్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: ఇషాన్ కిషన్ ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా స్టార్ -
Pak vs Eng Tests: ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ
పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ జోష్ హల్(Josh Hull).. పాక్తో టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దారించింది. తొడ కండరాల నొప్పి కారణంగా.. పాకిస్తాన్ టూర్కు జోష్ దూరమయ్యాడని తెలిపింది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించింది.అరంగేట్రంలో రాణించికాగా లీసస్టర్ఫైర్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ హల్ ఇటీవలే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో ఓవల్ టెస్టు(సెప్టెంబరు 6, 2024) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.గాయం కారణంగాఅయితే, ఈ మ్యాచ్ తర్వాత జోష్ తొడ కండరాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్తో టెస్టు సిరీస్ నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. కానీ.. జోష్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 16 మంది సభ్యుల జట్టుతోనే పాకిస్తాన్కు వెళ్లనుంది. ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జోష్ హల్కు ఇంగ్లండ్ బోర్డు ప్రత్యామ్నాయ బౌలర్ను ప్రకటించకపోవడం ఇందుకు కారణం.వుడ్ కూడా లేడుకాగా దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ పేస్ దళంలో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అయితే, మార్క్ వుడ్ శ్రీలంకతో సిరీస్ తర్వాత ఈ ఏడాది తదుపరి సిరీస్లన్నింటికి దూరం కాగా.. ఇప్పుడు జోష్ కూడా అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అక్టోబరు 7 నుంచి 28 వరకు పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్లు జరుగనున్న విషయం తెలిసిందే. ముల్తాన్, రావల్పిండి ఇందుకు వేదికలు.పాకిస్తాన్తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం -
అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్తో తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్తో టెస్టులకు ఎంపికైన కమ్రాన్ గులామ్, మహ్మద్ అలీలను ఈ సిరీస్కు పక్కన పెట్టడాన్ని చాలా పాక్ మాజీలు తప్పబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాక్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేరాడు. సెలక్టర్లపై షెహజాద్ విమర్శలు గుప్పించాడు. గులామ్, మహ్మద్ అలీలను జట్టు నుంచి ఎందుకు తప్పించిరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. "కమ్రాన్ గులాంకు మరోసారి మొండి చేయి చూపించారు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. ఎలాగో ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో జమాల్ను సెలక్ట్ చేశారు. జమాల్ సైతం పూర్తి ఫిట్నెస్తో లేడు.అంతేకాకుండా షాహీన్ అఫ్రిది కూడా గాయంతో బాధపడుతున్నాడు. అటువంటిప్పుడు పేసర్ మహమ్మద్ అలీని జట్టులోకి తీసుకోవచ్చుగా. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. వీరిద్దరితో పాటు మరో యువ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ సైతం డొమాస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడిని కూడా జట్టులోకి తీసుకోవడం లేదు.ఇందుకు సెలక్టర్లు ఏమి సమాధానం చెబుతారు? వారు చేసిన తప్పు ఏమిటి? బాబర్ బ్యాటింగ్ చేసే పొజిషన్లోనే బ్యాటింగ్ చేయడమా? కనీసం కమ్రాన్కు అయినా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఈ జట్టును సెలక్టర్గా యూసుఫ్ భాయ్ ఎంపిక చేశాడు.కాబట్టి కమ్రాన్ గులామ్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఒక్క కారణం చెప్పండి అంటూ" షెహజాద్ మండిపడ్డాడు. కాగా కమ్రాన్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అతడు 49.60 సగటు, 100 స్ట్రైక్-రేట్తో 248 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది. -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?
సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఘోర పరాభావం పొందిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో పాక్ తలపడనుంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ , ఆల్రౌండర్ అమీర్ జమాల్కు సెలక్టర్లు చోటిచ్చారు. నోమన్కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పాక్ తరపున మొత్తం 15 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. 37 ఏళ్ల నోమన్ చివరిసారిగా జూలై 2023లో పాక్ తరపున ఆడాడు. అదే విధంగా ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో జమాల్కు చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్తో సిరీస్కు సెలక్ట్ అయిన పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ వన్డే కప్లో భాగమయ్యారు.అయితే ప్రధాన కోచ్ జాసన్ గిల్లెస్పీ సూచన మేరకు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లేఆఫ్ల నుంచి తప్పుకున్నారు. ఈ సిరీస్ కోసం షాన్ మసూద్ అండ్ కో సెప్టెంబర్ 30న ముల్తాన్లో సమావేశం కానున్నారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: కోహ్లితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! 155 పరుగులతో విధ్వంసం? -
పాక్కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్కు దూరం?
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందుకు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్కు ఆ జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్ 2024లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.ఈ మ్యాచ్లో అతడి మెకాలికి గాయమైంది. డాల్ఫిన్స్ ఆల్రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్కు దూరమయ్యాడు.గతేడాది కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్ జట్టు మెనెజ్మెంట్ ఆందోళన చెందుతోంది. షాహీన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లే ఆఫ్స్కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.ఇంగ్లండ్తో సిరీస్ సమయానికి అఫ్రిది ఫిట్నెస్ సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటించనుంది. ఆక్టోబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్వాష్కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టోక్స్ రీఎంట్రీ
అక్టోబర్లో పాకిస్తాన్తో జరిగే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 17 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 10) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్తో పాటు జాక్ క్రాలే, జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు (డర్హమ్ సీమర్ బ్రైడన్ కార్స్, ఎసెక్స్ బ్యాటర్ జోర్డన్ కాక్స్) చోటు దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్లో పర్యటించాల్సి ఉంది. అయితే మ్యాచ్ల నిర్వహణకు వేదికలు సరిగ్గా లేవన్న కారణంగా ఈ సిరీస్ను యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. వేదికల మార్పుపై ఈ వారాంతంలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్.. అక్టోబర్ 15 నుంచి కరాచీ వేదికగా రెండో టెస్ట్.. అక్టోబర్ 24 నుంచి రావల్పిండి వేదికగా మూడో టెస్ట్ జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు 2022లో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సిరీస్ను పర్యాటక ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జోష్ హల్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఒల్లీ స్టోన్ , క్రిస్ వోక్స్రేపటి నుంచి ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లు..ఇంగ్లండ్ జట్టు రేపటి నుంచి (సెప్టెంబర్ 11) స్వదేశంలో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లలో తొలుత టీ20, ఆతర్వాత వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
Pak vs Eng: పాకిస్తాన్లో కాదు శ్రీలంకలో!?
బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది.అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే వేదిక మార్పుకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.లంక బెస్ట్ ఆప్షన్కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.పాకిస్తాన్లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచిమూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్తో మ్యాచ్లో 79 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా ఇది పాక్కు వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మక్సూద్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షోయబ్ మాలిక్(21) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మీకర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాడీ, స్కోఫీల్డ్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన ఆజ్మల్..197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 117 పరుగులకే కుప్పకూలింంది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ ఆజ్మల్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. రజాక్ రెండు, సోహైల్ ఖాన్, మాలిక్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ మాస్టర్డ్(30) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs SL: భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా సనత్ జయసూర్య -
అంతర్జాతీయ క్రికెట్కే సిగ్గుచేటు: పాక్ ఆటగాడిపై విమర్శలు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్ బృందంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ఆడింది.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.పూర్తిగా విఫలంఇదిలా ఉంటే.. తాజా సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఆడిన రెండు మ్యాచ్లలోనూ పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో డకౌట్ అయ్యాడు.ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్వుడ్ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్రేటు 135.38.అయితే, వరల్డ్కప్-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సిరీస్లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్ఇక ఈ సిరీస్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్పై పడింది. వికెట్ కీపర్గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆజం ఖాన్పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజం ఖాన్!!చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుAzam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf— yang goi (@GongR1ght) May 30, 2024Azam Khan is the best example of nepotism in our country. Mediocrity rules here in every department. Shameless people who persisted with him must be charged and sentenced. This is a criminal act not a simple mistake.— Mubasher Lucman (@mubasherlucman) May 30, 2024WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024 -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్గా రికార్డుకెక్కింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్క్ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను నమోదు చేసింది. తాజా మ్యాచ్తో క్యాథరిన్ ఆల్టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
ENG vs PAK: ఇంగ్లండ్కు ఓ గుడ్న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్తో జరగనున్న మూడో టీ20కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మూడో టీ20కు దూరమయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ తమ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్కప్-2024లోని తమ ప్రారంభ మ్యాచ్లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డకు జన్మనించే అవకాశం ఉంది.దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం
వన్డే వరల్డ్కప్-2023ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 44.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ వరల్డ్కప్లో పాకిస్తాన్కు ఇది ఐదో ఓటమి. వన్డే ప్రపంచకప్ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ 5 మ్యాచ్ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. "ఈ మ్యాచ్లో మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మేము దక్షిణాఫ్రికా మ్యాచ్లో గెలిచినట్లయితే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో తప్పిదాలు చేశాం. 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. మా స్పిన్నర్లు వికెట్లు తీయలేదు. అది మాపై పెద్ద ప్రభావాన్ని చూపింది. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టం. ఈ టోర్నీలో మేము చేసిన తప్పిదాలను కచ్చితంగా చర్చిస్తాం. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. జట్టుకు సారథిగా ఎల్లప్పుడూ 100 శాతం ఎఫెక్ట్ పెడతాను" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: నెదర్లాండ్స్తో మ్యాచ్.. బుమ్రా దూరం! జట్టులోకి యువ బౌలర్ -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్..
వన్డే ప్రపంచకప్-2023ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
జో రూట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్.. ఈ అరుదైన మైలు రాయిని రూట్ అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్కప్లో రూట్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన రూట్.. 248 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ 338 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తమ బ్యాటింగ్ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా వేదికగా పాకిస్తాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది. చదవండి: WC 2023: వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై..! -
టాస్ ఓడిన పాక్.. సెమీస్ రేసు నుంచి అవుట్! 2.5 ఓవర్లలో ఛేదిస్తేనే
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాబర్ టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా శ్రీలంకపై జయభేరి మోగించి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సాంకేతికంగా పాక్కు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు ఉండేవి. ఇంగ్లండ్పై 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 3 ఓవర్లలోపు ఛేదించడం వంటి సమీకరణలు ఉన్నాయి. అయితే, గత రికార్డుల దృష్ట్యా ఇది ఏ రకంగా చూసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక తాజాగా ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో మ్యాచ్ గెలిచి.. రన్రేటు భారీగా పెంచుకుంటామని తెలిపాడు. అయితే, అద్భుతం జరిగితే తప్ప అతడి మాటలు నిజమయ్యే ఛాన్స్ లేదు! కాబట్టి పాక్ ఖేల్ టాస్ వద్ద ఖతమైందని చెప్పొచ్చు! కానీ.. బాబర్ చెప్పినట్లు క్రికెట్లో ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! అయితే, పాజిటివిటీకి అది పరాకాష్ట లాంటిదే! సమీకరణాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇప్పుడైతే లేదు మరి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి! ►ఇంగ్లండ్ స్కోరు - 20, 1.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ స్కోరు - 50, పాక్ 2 ఓవర్లలోనే ఛేదించాలి ►ఇంగ్లండ్ - 100, 2.5 ఓవర్లలోనే పాక్ ఛేదించాలి ►ఇంగ్లండ్ - 150, పాక్ 3.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 200, 4.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 300, పాక్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! -
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
CWC 2023: పాక్ను సెమీస్కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
పాక్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..!
వన్డే వరల్డ్కప్ 2023లో సెమీస్ బెర్త్లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ సెమీస్కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్ నాలుగో సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుని భారత్తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్కు చేరలేవు. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు.. అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లండ్ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు..! -
న్యూజిలాండ్కు షాక్ తప్పదా? బ్యాడ్న్యూస్ ఏమిటంటే..?
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లను దాటి నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్లో అడుగుపెడుతుంది. ముందుగా న్యూజిలాండ్ బరిలోకి ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్కు ఎదురుదెబ్బ తప్పదు. అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ -
T20 WC: ప్రపంచకప్నకు ముందు పాక్ కీలక సిరీస్.. షెడ్యూల్ విడుదల
Pakistan Men And Women To Tour England 2024: టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్ వచ్చే ఏడాది ఇంగ్లండ్లో పర్యటించనుంది. వెస్టిండీస్, యూఎస్ఏలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి ముందు పాక్ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్ టీమ్తో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. స్వదేశంలో పాకిస్తాన్తో వరుస సిరీస్లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్- పాకిస్తాన్ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక అంతకంటే ముందుగానే అంటే.. మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్- పాకిస్తాన్ వుమెన్ టీమ్లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్- పాకిస్తాన్ తలపడగా.. జో రూట్ బృందం జగజ్జేతగా నిలిచింది. ఇంగ్లండ్లో పాకిస్తాన్ పర్యటన-2024 పూర్తి వివరాలు మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్ ►తొలి టీ20 మే 11- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హాం ►రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ ►మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్ ►మొదటి వన్డే మే 23- డెర్బీ ►రెండో వన్డే మే 26- టాంటన్ ►మూడో వన్డే మే 29- చెల్మ్స్ఫోర్డ్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మెన్స్ నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ►తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్ ►రెండో టీ20- మే 25- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హాం ►మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ ►నాలుగో టీ20- మే 30- ది ఓవల్, లండన్. చదవండి: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! -
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
‘టీమిండియాను పాక్ మాత్రమే ఓడించగలదు’.. అవునా! కౌంటర్ అదుర్స్
India vs Australia- World Test Championship: టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాకిస్తాన్ అభిమానికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సానుకూల దృక్పథంతో ఉండటం తప్పు కాదంటూనే పాక్ జట్టు వైఫల్యాలు ఎత్తిచూపుతూ సెటైర్లు వేశాడు. కాగా భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఇరు జట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి టెస్టు ఆరంభం కాగా.. ఆది నుంచి రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్విటిజెన్.. ‘‘భారత గడ్డపై టీమిండియాను ఓడించగల సత్తా కేవలం పాకిస్తాన్కు మాత్రమే ఉంది’’ అంటూ కామెంట్ చేశాడు. పాపం.. పాకిస్తాన్! తిక్క కుదిరింది.. ఇందుకు స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘నీ సానుకూల దృక్పథం నాకు నచ్చిందబ్బాయ్! అయితే.. ఒకటి కనీసం సొంతగడ్డపై అయినా మీ జట్టు సిరీస్లు గెలవొచ్చు కదా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్లు ఏమయ్యాయి. విదేశీ గడ్డపై బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ల సిరీస్లు అన్నిటిలో పాకిస్తాన్ గెలిచి ఉంటే గనుక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరి ఉండేది’’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తిక్క బాగా కుదిర్చావు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు ఆకాశ్ భాయ్’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ పోరులో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. ఆసీస్పై గెలిస్తే ఫైనల్ చేరడం ఖాయం. మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సొంతగడ్డపై ఇంగ్లండ్తో వైట్వాష్కు గురవడం సహా ఇతర సిరీస్లు గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్కు చుక్కలు! వీడియో వైరల్ Todd Murphy: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్ సంచలనం.. మరో రికార్డు! I love your positivity but janaab, aap Apne ghar ki series toh Jeet lo. With Australia, England and NZ at home. Bangladesh, Sri Lanka and WI in away series, Pakistan should have reached the WTC finals already. 🫣🫂 https://t.co/UEo67hQYU9 — Aakash Chopra (@cricketaakash) February 9, 2023 -
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్పై వేటు! బాబర్ కూడా..
ఇంగ్లండ్తో చారిత్రాత్మక టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. తమ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైన పాకిస్తాన్ క్రికెట్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, కెప్టెన్ బాబర్ ఆజంపై కూడా పీసీబీ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ అనంతరం సక్లైన్ ముస్తాక్ తన హెడ్ కోచ్ బాధ్యతలు తప్పుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో బాబర్ ఆజం కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం గడ్డాఫీ స్టేడియంలోని పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీసీబీ సెలెక్టర్ మహ్మద్ వసీం కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశంలో టెస్టు కెప్టెన్సీ, హెడ్ కోచ్ సక్లైన్ పాత్ర గురించి చర్చ జరిగింది. టెస్టు కెప్టెన్గా బాబర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకున్నాం. అతడిని వచ్చే ఏడాది జూలై వరకు టెస్టు కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పాక్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేస్తాం" అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా వైట్ బాల్ క్రికెట్లో సారథిగా విజయవంతమైన బాబర్.. టెస్టుల్లో మాత్రం తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. చదవండి: బంగ్లాదేశ్తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్కు గాయం..? -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్లో పిచ్ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్కప్లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! ప్రతి వాడూ..
Pakistan vs England, 3rd Test- Babar Azam: ‘‘ప్రతీ ఫార్మాట్ కోసం ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. తమ వ్యూహాలకు అనుగుణంగా ఎవరైనా ఎలాగైనా ఆడవచ్చు. అయితే, ఒక్కరోజు లేదంటే ఒక్క వారంలో మార్పు సాధ్యం కాదు. ఆటతీరు మార్చుకోవడానికి, ఆటగాళ్ల మైండ్సైట్ మారాలంటే కాస్త సమయం పడుతుంది. అంతేగానీ వెంట వెంటనే ఏదీ జరిగిపోదు. ఒకవేళ మేము డిఫెన్స్ ఆడితే.. దూకుడుగా ఎందుకు ఆడటం లేదని ప్రశ్నిస్తారు. అదే దూకుడుగా ఆడితే.. ఇంకోలా ఆడొచ్చు కదా అంటారు. మనం ఎలా ఆడినా ఇలాంటి పెదవి విరుపులు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందరికి సంతృప్తి కలిగేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఇంగ్లండ్లా ‘బజ్బాల్’ విధానాన్ని అవలంబించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాకు పరక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనం, కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలో ఇంగ్లండ్ టెస్టుల్లోనూ దూకుడైన ఆట తీరు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు తమ తమ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిదింట విజయం సాధించడంతో.. బజ్బాల్ విధానంపై క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది. బాబర్కు చెప్పాను.. ఈ నేపథ్యంలో పర్యాటక ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్రై క్రికెట్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ మాదిరిగానే.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడాలని బాబర్కు సూచించాను. ఇందుకోసం జట్టులో ఎక్కువ మంది టీ20 ప్లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను. పాకిస్తాన్ ఇలాంటి ఆటతీరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. భవిష్యత్ తరం ఇంగ్లండ్ మాదిరిగానే సంప్రదాయ క్రికెట్లోనూ టీ20ల మాదిరి ఆడాలని బలంగా కోరుకుంటున్నా’’ అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. మ్యాచ్ ఓడితే ఇంతే! ఈ విషయం గురించి మూడో టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజంకు ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ సారథి ఈ మేరకు పైవిధంగా స్పందించాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందన్న బాబర్... ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే విమర్శలు వినిపిస్తాయి అని పేర్కొన్నాడు. ప్రతి ఫార్మాట్కు ఒక విధానమంటూ ఉంటుందని.. ఒక్కరోజులోనే మార్పు సాధ్యం కాదంటూ రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో మూడు టెస్టుల మ్యాచ్లో పాక్ వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. దీంతో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: Ben Stokes: పాక్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్.. అరుదైన జాబితాలో చోటు Lionel Messi: వరల్డ్కప్ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
Pak Vs Eng: పాక్ను చిత్తుగా ఓడించి.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్
Pakistan vs England, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్కు ఘోర పరాభవాన్ని మిగిల్చి ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కరాచీలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ బృందం ఆతిథ్య పాక్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా స్వదేశంలో ఇలా క్లీన్స్వీప్ కావడం పాక్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కోహ్లి రికార్డు సమం అదే విధంగా.. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్టులు ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్ కూడా బాబర్ ఆజం కావడం విశేషం. ఇలా మూడో టెస్టుతో పాక్ ఖాతాలో చెత్త రికార్డులు నమోదు కాగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా విజయవంతమైన టెస్టు కెప్టెన్గా పేరొందిన విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టెస్టుల్లోనూ దూకుడుగా జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టిన స్టోక్స్.. జట్టును విజయపథంలో నడుపుతున్న విషయం తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్తో కలిసి సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడైన ఆటకు మారు పేరుగా జట్టును మార్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో పాక్తో మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో ఈ ఏడాది స్టోక్స్ ఖాతాలో 9(ఆడిన 10 మ్యాచ్లలో) విజయాలు చేరాయి. తద్వారా క్యాలెండర్ ఇయర్లో ఈ ఘనత సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), మైకేల్ వాన్(ఇంగ్లండ్), క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), విరాట్ కోహ్లి(ఇండియా) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై ఓటమి తప్పలేదు పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో గెలుపు కోసం మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ఇంగ్లండ్ మరో 55 పరుగులు చేయాల్సి ఉండగా... 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెన్ డకెట్ (82 నాటౌట్; 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ (35 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్కు అభేద్యంగా 73 పరుగులు జోడించి ఆటను ముగించారు. సిరీస్లోని తొలి టెస్టులో 74 పరుగులతో, రెండో టెస్టులో 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్ పేసర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
Pak Vs Eng: బాబర్ ఓ జీరో.. కోహ్లితో పోల్చడం ఆపండి ప్లీజ్: పాక్ మాజీ క్రికెటర్
Pakistan vs England Test Series 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా మండిపడ్డాడు. సారథిగా బాబర్ ఓ సున్నా అని, ఇకనైనా అతడిని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చడం ఆపేయాలని కోరాడు. కోహ్లితో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బాబర్ ఆజం బృందం వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన పాక్... సొంతగడ్డపై దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా పాక్ ఆట తీరుపై మండిపడ్డాడు. బాబర్ ఆజంకు కెప్టెన్గా ఉండే అర్హత లేదంటూ విమర్శించాడు. దానిష్ కనేరియా పాక్ జట్టులో అలాంటి వాళ్లు లేరు ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా కనేరియా మాట్లాడుతూ.. ‘‘దయచేసి ఇప్పటికైనా బాబర్ ఆజంను కోహ్లితో పోల్చడం ఆపేయండి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్లతో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరు. ఒకవేళ ఎవరైనా వాళ్లలా ప్రశంసలు అందుకోవాలంటే ఆటలో రారాజై ఉండాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాలి. లేదంటే జీరోలు అవుతారు. ఇక బాబర్ ఆజం కెప్టెన్గా ఓ పెద్ద సున్నా. అతడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం, నాయకత్వ ప్రతిభ అతడికి లేవు’’ అని బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. ఇగో పక్కన పెడితేనే ఇక ఇంగ్లండ్తో సిరీస్ ద్వారా కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకునే అవకాశం బాబర్కు దక్కిందన్న కనేరియా.. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో బాబర్ ఆజం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్లు ఓడిన మొదటి పాక్ కెప్టెన్గా నిలిచాడు. చదవండి: FIFA WC 2022: పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
Pak Vs Eng: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు
Pakistan vs England, 3rd Test- Babar Azam: సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది పాకిస్తాన్. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. ఇలా మరో పరభవాన్ని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో వరుసగా తొలి టెస్టులో 74 పరుగులు, రెండో టెస్టులో 26 పరుగులు, మూడో టెస్టులో 8 వికెట్లతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడి ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసి బెన్ స్టోక్స్ బృందం చరిత్ర సృష్టించింది. మరోవైపు.. పాక్ స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టులు ఓడటంతో కెప్టెన్ బాబర్ ఆజం పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఓ క్యాలెండర్ ఇయర్లో పర్యాటక జట్ల చేతిలో పాకిస్తాన్ వరుస మ్యాచ్లు ఓడిపోవడం ఇదే తొలిసారి. బాబర్ ఆజం చెత్త రికార్డు ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్ టెస్టు సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి రెండు డ్రాగా ముగియగా.. ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో పాక్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఏకంగా 3-0తో వైట్వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ రెండు సిరీస్లలో పాక్కు సారథ్యం వహించిన బాబర్ ఆజం.. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇలా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. చెత్త కెప్టెన్సీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో బాబర్ ఆజం వరుసగా 78, 54 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు స్కోర్లు: పాకిస్తాన్: 304 & 216 ఇంగ్లండ్: 354 & 170/2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ (111 పరుగులు) చదవండి: Harry Brook: ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు FIFA WC 2022: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్ను వారి సొంతగడ్డపై వైట్వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్లో 179 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం
పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో పాక్ బ్యాటర్లు తడబడడంతో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్ను ఉంచింది. జాక్ క్రాలీ 41 పరుగులు, రెహాన్ అహ్మద్ 10 పరుగులు చేసి ఔటవ్వగా.. బెన్ డకెట్, స్టోక్స్లు మరో వికెట పడకుండా ఇంగ్లండ్ను గెలిపించారు. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్: 304 ఆలౌట్ & 216 ఆలౌట్ ఇంగ్లండ్: 354 ఆలౌట్& 170/2 🏴 3-0 🇵🇰 Whitewash at home 🫣🥱#ENGvPAK || #PAKvENG #TestCricket #WTC23 pic.twitter.com/XWXxGzpwbc — Diptiman Yadav (@Diptiman_yadav9) December 20, 2022 చదవండి: అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్..
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 55 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఏం చేసినా ఇంగ్లండ్ గెలుపును ఆపడం పాక్కు కష్టమే.ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ క్లీన్స్వీప్పై గురి పెట్టింది. 17 సంవత్సరాల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ పాక్ జట్టుకు బొమ్మ చూపించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ అంపైర్కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్ అహ్మద్ ఔటయ్యాకా స్టోక్స్ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నుమాన్ అలీ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ చేతిలో గ్రిప్ జారిన బ్యాట్ స్క్వేర్లెగ్లో నిలబడిన లెగ్ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో భయపడిన అంపైర్ హసన్ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్వైపు చూశాడు. స్టోక్స్ కూడా అయ్యో నేను కావాలని చేయలేదు.. బ్యాట్ గ్రిప్ జారిందంటూ వివరించాడు. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే అంపైర్ అదృష్టం బాగుంది లేకపోయుంటే కచ్చితంగా ఏదో ఒక చోట తగిలేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి స్టోక్స్ తన చర్యతో అంపైర్ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. Ben Stokes has thrown a bat further than I have ever hit a ball I reckon pic.twitter.com/hDKH6gO5tO — Ticker Merchant (@WillMarshall15) December 19, 2022 చదవండి: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? IND VS BAN 1st Test: విరాట్ కోహ్లిని కాపాడిన రిషబ్ పంత్