facebook postings
-
చీకట్లో ఉరిమిన చిరు స్వరం
ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్కత్తాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...కోల్కత్తా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్ 14 అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్’ కాప్షన్తో రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా ‘రీక్లెయిమ్ ది నైట్’ క్యాంపెయిన్ను అభివర్ణించింది రిమ్జిమ్ సిన్హా. రీక్లెయిమ్ ది నైట్’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్ వైరల్ అయింది.రిమ్జిమ్ సిన్హా కోల్కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోషల్సైన్స్ రిసెర్చర్. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్ సిన్హా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై రిమ్జిమ్ సిన్హా మండిపడింది. ‘జూనియర్ డాక్టర్ ఒంటరిగా సెమినార్ హాల్కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్జిమ్ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్గా మారింది. ‘రీక్లయిమ్ ది నైట్’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్పూర్లోని 8బీ బస్స్టాండ్కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్జిమ్ సిన్హా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్పోర్ట్ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్ టాయిలెట్లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్స్’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్జిమ్ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
మహిళా ఐపీఎస్, ఐఏఎస్ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు
బనశంకరి: కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ రూపా మౌద్గిల్ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం సోమవారం ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. సోమవారం రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుధీర్ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్ను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పవార్పై అనుచిత పోస్ట్.. 20 కేసులతో జైల్లోనే నటి
ముంబై: మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ షేరింగ్ చేసిన వ్యవహారంలో నటికి ఊరట దొరకడం లేదు. బెయిల్ దొరికినా.. మరాఠీ నటి కేతకి చిటలే(29) ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకు కారణం.. ఆమెపై ఏకంగా 20 దాకా కేసులు నమోదు కావడం. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే.. పవార్ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు.. మే 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మధ్యలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఇది జరిగి నెల కావొస్తోంది. అయితే.. థానే కోర్టు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. అనుచిత పోస్ట్ షేరింగ్ విషయంలో ఆమెపై 20 కేసులు నమోదు అయ్యాయని, అందుకే ఆమె రిలీజ్ కుదరదని జైళ్ల శాఖ తెలిపింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వచ్చే వారం పిటిషన్ విచారణకు రానుంది. అదే విధంగా ఆయా కేసుల్లో విచారణపై స్టే విధించాలంటూ మరో పిటిషన్ను వేయగా.. ఆ పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉంది. మరోవైపు.. కేతకి చిటలేతో పాటు పవార్ వ్యతిరేక పోస్టును ట్విటర్లో షేర్ చేసిన నిఖిల్ భర్మే(23) అనే ఫార్మసీ స్టూడెంట్ సైతం అరెస్ట్ అయ్యాడు. నిఖిల్పై సైతం ఆరు కేసులు నమోదుకాగా, నెలపైనే జైల్లో ఉన్నాడు. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. -
Texas shooting: ఫేస్బుక్లో ప్రకటించి మరీ...
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్లో షూటౌట్కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్ఏంజెలెస్కు చెందిన ఓ యువతికి ఇన్స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు. ‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడు. టెక్సాస్లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు. నానమ్మతో నిత్యం గొడవలే డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు. నత్తితో బాధపడేవాడు రామోస్కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్కు వీరాభిమానిగా మారాడని వివరించాడు. -
శరద్ పవార్పై అనుచిత పోస్ట్.. నటిపై కేసు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్పై అనుచిత పోస్ట్ షేర్ చేసినందుకు నటిపై కేసు నమోదు అయ్యింది. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద శనివారం థానే పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. శుక్రవారం ఆ పోస్ట్ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్ను నటి చిటలే పోస్ట్చేయడంతో ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు థానేలోని కాల్వా పోలీసులు. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ వెనుక బీజేపీ, ఆర్సెస్ ప్రమేయం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, శివ సేనతో ఎస్పీపీ జట్టుకట్టడం బీజేపీకి సహించడం లేదని, ఈ క్రమంలోనే తమ పార్టీ, అధినేత శరద్ పవార్పై అభ్యంతర ప్రచారం సోషల్ మీడియాలో చేస్తోందని అంటున్నారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్ -
అఖిలేశ్ యాదవ్పై పోస్టు.. మార్క్ జుకర్బర్గ్పై కేసు!
మెటా కంపెనీ (ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్బర్గ్పై ఉత్తర ప్రదేశ్లో కేసు నమోదు అయ్యింది. సమాజ్వాదీ పార్టీ ఛీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది. జుకర్బర్గ్తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్బర్గ్కు ఆ పోస్ట్కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్ఫామ్లో ఆ పోస్ట్ పడడం, అందులో అఖిలేష్కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్ఐఆర్లో జుకర్బర్గ్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. కన్నౌజ్ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు. అఖిలేష్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్ అందజేసినా స్పందన లేదని కుమార్ కోర్టుకు వెల్లడించాడు. ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్బుక్ పేజీలో అఖిలేష్ యాదవ్తో పాటు బీఎస్పీ ఛీఫ్ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్ పోస్టులు పడుతుంటాయి. అయితే ఈ పిటిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్బర్గ్ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. చదవండి: పర్మిషన్ లేకుండా ఆ ఫొటోలు పెడితే ఎలా? -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్బుక్కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్బుక్ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్ను సొంతం చేసుకోవచ్చు! -
మీ ఫోన్ డెడ్ అయ్యిందా? ఇలా వినియోగించుకోండి
వాట్సాప్ వినియోగదారులకు కోసం వాట్సాప్ మల్టీ డివైజ్ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గత కొంతకాలంగా యూజర్లు మల్టీ డివైజ్ఆప్షన్ను ఎనేబుల్ చేయాలంటూ వాట్సాప్కు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆ ఆప్షన్పై వర్క్ చేస్తున్న వాట్సాప్ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. వాట్సాప్ను వినియోగదారుడు తన ఫోన్తో పాటు మరో నాలుగు రకాల డివైజ్లలో వినియోగించుకోవచ్చు. వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్లలో వాట్సాప్ ఆన్లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. మల్టీ డివైజ్ ఫీచర్ను ఎలా వినియోగించాలి ఈ మల్టీ డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఫీచర్ను వినియోగించడం అసాధ్యం. వాట్సాప్ బీటా బ్లాగ్ పోస్ట్లో ప్రస్తుతం మల్టీ డివైజ్ ఆప్షన్ను కొంతమంది యూజర్లకు మాత్రమే అనుమతిస్తూ టెస్ట్ ట్రయిల్స్ను నిర్వహిస్తున్నట్లు పోస్ట్లో పేర్కొంది. దానికి తోడు అదనంగా మరిన్ని ఫీచర్స్ను యాడ్స్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ ఆప్షన్ను ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 -
మరో ఫీచర్, ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్న్యూస్
వినియోగదారులకు అనుగుణంగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు డెస్క్ టాప్పై దర్శనమివ్వబోతున్నాయి."మాకు తెలుసు వినియోగదారులు స్మార్ట్ఫోన్ తో పాటు డెస్క్టాప్లో రీల్స్ను షేర్ చేయాలని చూస్తున్నారు. వారి కోసమే డెస్క్టాప్ ఫీచర్ను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రీల్స్ను రికార్డ్ చేసి.. డెస్క్ టాప్ ద్వారా అప్లోడ్ చేయోచ్చు"అని ఇన్స్టాగ్రామ్ స్పోక్ పర్సన్ అధికారికంగా ప్రకటించారు. రీల్స్ను ఎలా అప్లోడ్ చేయాలి. ♦ ఇన్స్టాగ్రామ్ ను మీకంప్యూటర్లో, లేదంటే ల్యాప్ట్యాప్ లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ ఇంటర్ ఫేస్లో ప్లస్ సింబల్ను క్లిక్ చేయాలి ♦ క్లిక్ చేసి సెలక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ ఆప్షన్లోకి వెళ్లాలి. ♦ అనంతరం మీకు కావాల్సిన ఒరిజనల్ స్కైర్,ల్యాండ్ స్కేప్, పోట్రేట్ సైజ్ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ సెలక్ట్ చేసుకున్న అనంతరం క్లిక్ నెక్ట్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. ♦ అలా ట్యాప్ చేస్తే ఫిల్టర్, ఎడిట్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. ♦ అనంతరం మీ వీడియోలకు, ఫోటోలకు క్యాప్షన్ రాసి, లోకేషన్ యాడ్ చేయాలి. ఆ తరువాత వీడియోని షేర్ చేసుకునే సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్ కల్పించింది. చదవండి: రేజర్పేతో ట్విటర్ జట్టు -
ఆ దొంగ ఎవరు?!
వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్ఎమ్లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు. ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ. పోస్ట్ చేసేది ఎవరు? తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్లో ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్గా ఎవరు తీశారో, ఎవరు అప్లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్కి, షాపింగ్కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది. ముక్కలైన బంధం కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది. మేకవన్నె పులి దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్లైన్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి. ఎమెషనల్ ఫ్రాడ్స్కి దూరం ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ పగ తీర్చుకోవాలనే.. కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్గా ముందు క్లోజ్గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం. – వి. గోపీనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం -
మధురైలో ఎన్ఐఏ సోదాల కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్బుక్లో సందేహాస్పద పోస్టింగ్లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు. ఈ కేసు ఏప్రిల్లో ఎన్ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధురై కాజీమర్ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్ ఇంటి నుంచి పెన్ డ్రైవ్, సిమ్కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్తో ఎక్కువసేపు వాట్సాప్లో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు. (చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు) -
‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’
భోపాల్: ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పట్టపగలే బైకులపై తిరుగుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్లమీద కనిపిస్తే కాల్చిపడేస్తాం’ అంటూ కొందరు ఆకతాయిలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మొరెనా జిల్లా బంఖండి ప్రాంతం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని 25మంది దుండగులు మాస్క్ ధరించి గన్స్తో వీరంగం సృష్టించారు. బైక్పై డ్రైవ్ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇళ్లు, బస్సులు ద్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ రాయ్ సింగ్ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే స్థానికుల వెర్షన్ మరోలా ఉంది. ఈ కాల్పులు లాక్డౌన్ నిబంధనల్ని పాటించనందుకు కాదు. ఓ యువతి ఫేస్ బుక్లో పెట్టిన పోస్ట్ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ్గిరాజేసిందని చెప్తున్నారు. ఓ వర్గం మరో వర్గంవారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదే అంటూ స్థానికులు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్లో కరోనావైరస్ విజృంభిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యం.. అందుకే రాష్ట్రంలో మే15 వరకు జనతాకర్ఫ్యూ పేరుతో లాక్డౌన్ విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. #CoronaCurfew not in Morena! dozens masked riding mobikes openly firing targeting the other caste over a social media post! @GargiRawat @ndtv @ndtvindia pic.twitter.com/B7GG8tXAa1 — Anurag Dwary (@Anurag_Dwary) May 8, 2021 -
కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా? రచయిత్రి వ్యాఖ్యలు దుమారం
గౌహతి: ఛత్తీస్గడ్లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫేసుబుక్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అని ప్రశ్నించింది. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని రచయిత్రి శిఖాశర్మ పేర్కొన్నారు. గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి ఆమె ఫేసుబుక్ పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రచయిత్రి శిఖాశర్మను డిస్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శిఖాశర్మ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇదే.. ‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. శిఖా శర్మ ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది కూడా. -
ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలు బంద్
వాషింగ్టన్: నిబంధనలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు ఫేస్బుక్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్విటర్ సైతం ట్రంప్ చేసిన మూడు ట్వీట్లను తొలగించమని కోరుతూ తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్ డీసీలో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్బుక్, ట్విటర్ ట్రంప్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలియజేశాయి. రెండు రకాల పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు పెట్టడంతో ఖాతాకు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ఇదే విధంగా కొత్త ప్రెసిడెంట్గా ఎంపికైన జో బైడెన్ను నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై ట్విటర్ 12 గంటలపాటు ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. ఈ అంశాలపై చేసిన మూడు ట్వీట్లను తొలగించవలసిందిగా సూచించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ట్వీట్లను తొలగించకపోతే.. ట్రంప్ ఖాతా నిలిపివేత కొనసాగుతుందని ట్విటర్ పేర్కొంది. (చైనా పేమెంట్ యాప్లకు ట్రంప్ చెక్) -
తిరిగిచ్చేసింది
ఎంత ధైర్యం గల మహిళ! డ్రగ్ లార్డ్ని అరెస్ట్ చేసింది. సీఎంని క్వొశ్చన్ చేసింది. చీఫ్ జస్టిస్ని ప్రశ్నించింది. ఇప్పుడు.. తన గ్యాలెంట్రీ మెడల్నే విసిరికొట్టేసింది. నీతి, నిబద్ధత గలవాళ్లంతే! వాళ్లకు డ్యూటీ ఫస్ట్. బృందాకైతే డ్యూటీనే సర్వస్వం. థోనావ్జామ్ బృందా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ‘ఫియర్ లెస్’ అని ఆమెకు పేరు. ఐదు నెలల క్రితం సంచలనాత్మకమైన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు ఆమె. అధికారంలో ఉన్నవారితో నేరుగా డీకొనడమే అది. మణిపూర్ ఏమైపోతోంది? బాలలకు మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాం.. అని పాలక పక్షాన్నే భుజాలు తడుముకునేలా చేశారు బృందా. ఇక మొన్నటి శుక్రవారం అయితే ఆమె తన ‘శౌర్య అవార్డు’ను ప్రభుత్వం ముఖాన దాదాపుగా విసరికొట్టేసినంత పనిచేశారు. డ్రగ్స్ మాఫియా యుద్ధంలో పై చేయి సాధించినందుకు ప్రశంసగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రెండేళ్ల క్రితం బృందాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పోలీస్ గ్యాలెంట్రీ అవార్డు ప్రదానం చేశారు. శౌర్య అవార్డు అందుకున్న రాష్ట్ర ‘నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ బ్యూరో’ (న్యాబ్) తొలి పోలీస్ ఆఫీసర్ బృందా. 2018 జూన్లో ‘న్యాబ్’ అధికారిగా డ్యూటీలోకి రాగానే ఆమె మొదట చేసిన పని డ్రగ్ లార్డ్ లుకోసీ జౌ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూన్లో ఆమె అరెస్ట్ చేస్తే, ఆగస్టులో ఆమెకు గ్యాలెంట్రీ అవార్డు వచ్చింది. అవార్డును ఇచ్చినట్లే ఇచ్చి, లుకోసీ జౌను కేసు నుంచి తప్పించమని బృందాపై ఒత్తిడి తెచ్చారు ముఖ్యమంత్రి. ఆమె వినలేదు. అరెస్ట్ అయిన నాలుగో రోజు నుంచే లుకోసీ బెయిల్ పై తిరుగుతున్నాడు. చివరికి గురువారం ఇంఫాల్ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడికి బెయిల్ ఇవ్వడంపై కోర్టును ప్రశ్నిస్తూ వస్తున్న బృందాను కోర్టు తీవ్రంగా మందలించింది. ఎఎస్పీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో లుకోసీని వదిలేయడం జరిగిందని తీర్పు చెప్పింది. దీనంతటి వెనుక ఎవరున్నారో బృందాకు తెలుసు. అందుకే తన మెడల్ను తిరిగి ఇచ్చేశారు. ‘‘నేను ఈ మెడల్కు అనర్హురాలిని. సమర్థులైన మరొకరికి దీనిని ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రెండేళ్లలోనూ.. చెబుతున్నా వినకుండా లుకోసీని అరెస్టు చేసినందుకు మణిపుర్లోని బి.జె.పి. ప్రభుత్వం బృందాను అనేక విధాలుగా వేధించింది. ఉద్యోగం తీయించడమే ఒక్కటే తక్కువ. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అర్థరహితమైన ఆరోపణతో కూడా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది! అదే నెలలో బృందా మామగారు 76 ఏళ్ల రాజ్కుమార్ మేఘన్కు భద్రత కల్పించే నెపంతో ఆ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. మేఘన్ మణిపుర్లోని తిరుగుబాటు ‘యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఛైర్మన్. ఆయన 44 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబరులో గౌహతి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వచ్చారు. బృందా 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మణిపుర్నూ అంతగా ప్రేమిస్తారు. మణిపుర్ భవిష్యత్ తరాల భద్రత, సంరక్షణల కోసమే ఆమె ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నానంటారు. -
రాజుకున్న రాజధాని
ఎమ్మెల్యే సమీప బంధువైన యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ మూకదాడులకు కారణమైంది. వేలాది మంది పోలీస్స్టేషన్, ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఐటీ సిటీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ అల్లర్లు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: బెంగళూరు నడిబొడ్డున పులకేశినగర నియోజకవర్గం కాడుగొండన (కేజీ) హళ్లి, దేవరజీవన (డీజే) హళ్లిలో దావాగ్నిలా అల్లర్లు, హింస చెలరేగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఘటనలో 60 మంది పైగా పోలీసులు గాయపడ్డారు. సుమారు 145 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆస్తినష్టం దాడుల్లో 26 ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు ఆటోలు, మూడు కార్లు, 40 పైగా ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. దాడుల్లో ఏటీఎం పగలగొట్టారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఇక పోలీసుల కాల్పుల్లో పది మంది వరకూ గాయపడ్డారు. ఆస్తినష్టం కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా. ఎలా మొదలైందంటే పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి మేనల్లుడయ్యే నవీన్ అనే యువకుని ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం సాయంత్రం అనుచితమైన పోస్టింగ్లు వచ్చాయి. దీంతో కొందరు మైనారిటీ వర్గాల యువకులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. అవహేళనగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇంతలో వేలాది మంది అక్కడికి చేరుకుని పోలీస్స్టేషన్లోని వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని గంటలపాటు ఈ తతంగం కొనసాగింది. పోలీసులు కూడా అదుపు చేయలేక తలోదిక్కుకు పరుగులు తీశారు. మరికొందరు పోలీసులు స్టేషన్లోపల దాక్కున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు భస్మీపటలం అయ్యాయి. ఆ వీధిలో ఉన్న ప్రజల వాహనాలు, ఇళ్లను కూడా వదిలిపెట్టలేదు. కార్లు, బైక్లు బూడిదయ్యాయి. తరువాత ఎమ్మెల్యే ఇంటిపైకి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అండతోనే నవీన్ ఇలా చేస్తున్నాడని భావించి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే గానీ, కుటుంబం కానీ లేకపోవడంతో ముప్పు తప్పింది. కానీ అక్కడ కూడా భారీ విధ్వంసమే చోటుచేసుకుంది. అల్లరిమూకల్ని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు యువకులు మరణించారు. అల్లర్లలో 60 మంది వరకూ పోలీసులు గాయపడ్డారు. కాగా అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల అదుపులో పాషా ఎస్డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) సంస్థ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్డీపీఐ బెంగళూరు నేత ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. అతడే మొదటి నిందితుడని డీజే హళ్లి పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరుగుతున్న సమయంలో అతడు మైక్ పట్టుకుని గుంపునుద్దేశించి మాట్లాడుతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. పాషాపై డీజే హళ్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయి. సీసీ కెమెరాల చిత్రాలు, సోషల్ మీడియాలో వస్తున్న చిత్రాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పులకేశినగరలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. -
భగ్గుమన్న బెంగళూరు!
సాక్షి, బెంగళూరు: ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడికి ప్రేరేపించింది. మంగళవారం సాయంత్రం చిన్నపాటి గొడవగా ఆరంభమై రాత్రికి అల్లర్లు ఉధృతమయ్యాయి. వేల సంఖ్యలో జనాలు వచ్చి పోలీస్స్టేషన్, ఎమ్మెల్యే ఇంటిపై దాడులకు తెగబడ్డారు. గంటలపాటు విధ్వంసకాండ కొనసాగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యక్తి పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సమీప బంధువు. ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మరో గుంపు కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసింది. అక్కడి వాహనాలకు నిప్పు పెట్టగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లు వెళ్లకుండా అడ్డుపడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు బెంగళూరు నగర కమిషనర్ కమల్పంత్ తెలిపారు. కాల్పుల్లో వాజిద్ ఖాన్ (20), యాసిమ్ పాషా (22), వాసిం (40) అనే వారు చనిపోయారు. దాడుల్లో 60 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్ను, అల్లర్లకు పాల్పడిన మరో 110 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే కుటుంబం క్షేమంగా బయటపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం యెడియూరప్ప ఆదేశించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సీఆర్పీఎఫ్ను మోహరించారు. ఏం జరిగిందంటే? శివాజీనగరకు చెందిన ఓ వర్గం వారు 15 మంది మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లారు. మతపరమైన అంశాల్లో నవీన్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేశవమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే తక్షణమే అరెస్టు చేయాలంటూ వాగ్వాదానికి దిగారు. అంతలోనే సుమారు 4 వేల మంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, పలు వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్పై రాళ్లురువ్వారు. అర్థరాత్రి 2 గంటల తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆ మార్గంలో 26 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 2 ఆటోలు, 3 కార్లు, 40 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. ఆరంభంలోనే సీసీటీవీలు ధ్వంసం చేశారు. ఏటీఎం పగలగొట్టారు. -
నేను బతికి ఉండటం అద్భుతం: శ్రీనివాసమూర్తి
బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం) అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు. -
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
ఇంటర్నెట్తో ప్రజాస్వామ్యానికి విఘాతం!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్ నాయర్ తెలిపారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి నోటిఫై చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను 2020 జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేస్తామన్నారు. -
ఆ పోస్టింగులతో నాకు సంబంధం లేదు: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, చిరంజీవి భేటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిటి ప్రచారంలోకి వచ్చిన ఫేస్బుక్ పోస్ట్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోస్ట్పై స్పందించారు చెవిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో శనివారం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి... తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్ అక్కౌంట్లు కాని, ఫేస్బుక్ అక్కౌంట్లుగాని లేవని తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చిరంజీవి గారితో నాకు ఎలాంటి గొడవలు లేవు. చిరంజీవిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ నాకు ఎటువంటి సంబంధం లేదు. — Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) October 12, 2019 మెగాస్టార్ చిరంజీవిగారిపై.. నా పేరిట ప్రచారం అవుతున్న పోస్టింగులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తుడా ఛైర్మన్గా ఉన్నప్పటి నుంచి చిరంజీవిగారితో సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్కి, చిరంజీవికి సత్సంబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంది. — Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) October 12, 2019 -
‘నాన్న ప్రత్యక్ష నరకం చూపించేవాడు’
భారతీయ సంస్కృతికి విదేశాలు జేజేలు పలకడానికి ముఖ్య కారణం ఇక్కడున్న వివాహ, కుటుంబ వ్యవస్థలే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఒక కుటుంబంగా రూపాంతరం చెందుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది సంస్కారవంతమైన సమాజానికి బీజం వేస్తుంది. అయితే ఇదంతా సవ్యంగా సాగడం అనేది భార్యాభర్తలుగా మారిన ఆ ఇద్దరు వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జంటలో ఏ ఒక్కరూ బాధ్యతగా, బంధం నిలుపుకొనే విధంగా మసలుకోకపోయినా ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోతే వారి పిల్లలు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. ఆ గొడవల తాలూకు ఛాయలు జీవితాంతం వారిని వెంటాడుతాయి. అంతేకాదు ఆ చేదు ఙ్ఞాపకాలు ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తాయి. అయితే ప్రతీ సమస్యకు చావే పరిష్కారం కాదని బలంగా విశ్వసించిన వారు..అటువంటి ప్రయత్నాల నుంచే పాఠాలు నేర్చుకుని అందమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ముంబైకి చెందిన ఓ యువతి జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న ఆమె స్టోరీని ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది. ‘కష్టాలను తట్టుకుని విధిని ఎదిరించి నిలబడగలిగే నీలాంటి వాళ్లు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు’ అంటూ నెటిజన్లు ఆమె స్టోరీని వైరల్ చేస్తున్నారు. సమకాలీన పరిస్థితుల్లో రెండు కోణాలను స్పృశిస్తున్న ఆ పోస్టు సారాంశం ఇది... ‘చిన్నపాటి, ఇరుకైన అపార్టుమెంటులోని ఓ ఇంట్లో పుట్టిపెరిగాను. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు నాకు అర్థమవసాగాయి. తరచుగా తగువులాడుకునే వారు. మా నాన్నకు అక్రమ సంబంధం ఉందని అమ్మ ఆరోపణ. ఆ వేదనతో తానెంతో కుంగిపోయేది. బాధ భరించలేక ఓ రోజు నాన్నతో తీవ్రంగా గొడవపడింది. దీంతో నాన్నకు పట్టలేనంత కోపం వచ్చింది. బెల్టు తీసుకుని అమ్మను దారుణంగా కొట్డాడు. ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సరుకులు తేవడం మానేశాడు.నాన్న ప్రవర్తనతో విసిగిపోయిన అమ్మ చచ్చిపోదామని నిర్ణయించుకుంది. నన్ను తనతో పాటు బీచ్కు తీసుకువెళ్లి ఇద్దరం చనిపోదాం అని చెప్పింది. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది. తన ఆలోచన తప్పు అని తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. నాన్న మారతాడేమోనని ఎదురుచూసింది కానీ అలా జరుగలేదు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాన్న మీద కేసు పెట్టింది. కాసేపటి తర్వాత నాన్న హాయిగా ఇంటికొచ్చేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు.ఆనాటి నుంచి మాకు ప్రత్యక్ష నరకం చూపించే వాడు. అమ్మ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అక్కడే నాకొక వ్యక్తి పరిచయమయ్యాడు. నాకన్నా ఐదేళ్లు పెద్దవాడు. ఎంతో చక్కగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా తను వెళ్లిపోతున్నానని, ఇక ఇక్కడ ఉండటం కుదరని చెప్పేశాడు. దాంతో అతనితో బాగా గొడపపడ్డాను. అచ్చం అమ్మానాన్నల గొడవలాగే అనిపించింది. నా గుండె పగిలిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఆరోజు బాధతో వీధి వెంట పిచ్చిగా పరిగెత్తాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. దగ్గర్లో ఉన్న ఓ షాపులోకి వెళ్లి ఫినాయిల్ బాటిల్ కొనుక్కుని అక్కడే తాగేశాను. తెల్లవారి మెలకువ వచ్చింది. ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచారు. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. నిజంగా చావాలనుకుంటే కాస్త గట్టిగా ప్రయత్నం చేయవచ్చు కదా అన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నా స్నేహితులు ఎవరూ నన్ను చూడటానికి రాలేదు. నాలాంటి వాళ్లతో వాళ్లకు స్నేహం అక్కర్లేదట. ఇరుగుపొరుగు వారికి నేనొక గాసిప్ అయిపోయా. నా జీవితం మరింత కఠినంగా మారింది. వాళ్ల కారణంగా ఎంతో వేదన అనుభవించా. కనీసం ఒక్కరైనా నా బాధను అర్థం చేసుకుని ఆత్మీయంగా పలకరిస్తే చాలు అనుకున్నా. అలా జరగలేదు. అయితే ఆ సంఘటనలే నాలో మార్పునకు కారణమయ్యాయి. నేనెందుకు చావాలి అనే ప్రశ్నను రేకెత్తించాయి. కౌన్సిలింగ్కి వెళ్లాను. ధ్యానం చేశాను. జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. కొన్నాళ్ల తర్వాత అమ్మా, నేను ఇళ్లు వదిలి వచ్చేశాము. జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నా. ఇదంతా జరిగి చాలా ఏళ్లు అవుతుంది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఉంది. నాకు తోడుగా కొంతమంది ఉన్నారు. మేమంతా కలిసి చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు చేపడతాము. సరదాగా బయటికి వెళ్తాం. అయితే ఇప్పటికీ నా గతానికి సంబంధించిన మరకలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటి వల్లే కదా ఎలా ఉండకూడదో అన్న విషయం తెలిసింది కదా అని సర్దిచెప్పుకొంటాను. నిజానికి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీలేదు’ అంటూ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది సదరు యువతి. ఎదుటివారి గురించి మాట్లాడే ముందు, వారిని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సలహా కూడా ఇచ్చింది. ఎందుకంటే కనిపించేదంతా నిజం కాకపోవచ్చు... ఎదుటి వారు మన నుంచి ప్రేమ, దయ, ఆప్యాయత కోరుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు చూపించే చొరవ వారి చావుబతుకులను నిర్ధేశించేదిగా ఉండవచ్చు అనేది ఆమె భావన. అంతేకదా.. బాధలో ఉన్న వారి వైపు ఆత్మీయంగా చూసే చూపు...చిందించే ఓ చిరునవ్వు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటి వారిలో ఆత్మన్యూనతను పోగొట్టి.. సానుకూల దృక్పథంతో కొత్త జీవితానికి పునాదులు వేసే ప్రేరణా శక్తిని కలిగి ఉంటాయి. -
హోం మంత్రిపై అభ్యంతరకర పోస్టింగ్లు; వ్యక్తి అరెస్ట్
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టిన వ్యక్తిని గుంటూరు పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ సబ్డివిజన్ డీఎస్పీ జె.కులశేఖర్ తెలిపిన మేరకు.. రామ్మహారాజ్ అనే ఫేస్బుక్ అకౌంట్తో హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టింగ్లు వచ్చాయి. పోస్టింగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దారం అశోక్కుమార్ పట్టాభిపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ కులశేఖర్ విశాఖ జిల్లా రోగుగుంట మండలం ఎం.కొత్తపట్నంకు చెందిన సర్వశుద్ధి రాము ఆ పోస్టింగ్లు పెట్టినట్లు దర్యాప్తులో ధృవీకరించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. -
తనయుడు: హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా!
‘‘అసలు ఇలాంటి ఒక నోట్ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. ఆధునిక సమాజంలో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే మనస్తత్వంలో మనం ఉన్నాం. ఎవరైతే అనుమానం, జాలి, వంటి భావనలు కలిగి ఉంటారో దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఇది మా అమ్మ పెళ్లి గురించి.’’ కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ అనే యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ప్రారంభ వాక్యాలే పైన మీరు చదివినవి. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తార్కాణంగా నిలిచిన పోస్ట్ అది. ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. తల్లిదండ్రులు మాత్రమేనా?! దైవభూమిగా పేరుగాంచిన కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్ శ్రీధర్ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప.. భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి.. ఆ చిట్టి గుండెకు కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన.. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా.. స్త్రీని ఒక బొమ్మలా భావించే తండ్రి మూర్ఖత్వానికి అమ్మ జీవితం బలైపోతుందనే అపరాధ భావన... గోకుల్కు మనశ్శాంతి లేకుండా చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అతడి మానసిక సంఘర్షణకు తెరపడింది. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి.. రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్ సంతోషంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేస్ బుక్లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి. రక్తం కారుతున్నా అమ్మ లెక్కచేయలేదు ‘‘అమ్మ.. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె తన వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ‘ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు?’ అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. ‘నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు’ అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు అమ్మతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. మేము ఇల్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా మాటపై అమ్మ పెళ్లి చేసుకున్నాక.. ‘అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నువ్వు సంతోషంగా ఉండాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి మనస్తత్త్వాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ -
నకిలీ ఎస్సై హల్చల్
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : పోలీస్ యూనిఫాం అంటే ఇష్టం ఉన్న యువకులు కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తారు. కాని ఈ ఇద్దరు యువకులు మాత్రం అలా కష్టపడి చదవే ఓపిక లేక ఇష్టపడే పోలీస్ యూనిఫాంను వేసుకోవడం మొదలు పెట్టారు. అలా పోలీస్ యూనిఫాం వేసుకోవడం అలవాటుగా చేసుకుని తొలుత ఫేస్బుక్, వాట్సాప్ల్లో ఫొటోలు పెట్టడం తర్వాత ఏకంగా యూనిఫాంతో పబ్లిక్లో రావడం మొదలుపెట్టారు. ఇలా సమాజాన్ని మాత్రమే కాదు ఏకంగా వారిని కన్న తల్లిదండ్రులను కూడా తాము పోలీసులమే అంటూ నమ్మించి మోసం చేశారు. అందులో ఒకరు చీపురుపల్లి మండలంలోని గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ కాగా.. మరొకరు మచిలీపట్నంనకు చెందిన అంకాల బాబు. ప్రసాద్ ఎస్సై అవతారం ఎత్తగా... అంకాలబాబు కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఫేస్బుక్ ఖాతాల్లో వీరి ఫొటోలు చూసి పరిచయమైన ఓ ముగ్గురు యువకులకు హోంగార్డ్ ఉద్యోగాలు వేయిస్తామని వారి నుంచి అడ్వాన్స్గా రూ.24 వేలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో చేరాక మిగిలిన డబ్బు ఇవ్వాలని ఒ ప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో నకిలీ ఎస్సై ప్రసాద్ తన స్వగ్రామానికి రావడంతో చీపురుపల్లి పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యవహారం బయిటకొచ్చింది. దీనికి సంబంధించి ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుపాకీ, వాహనంతో గొల్లలపాలెంలో ప్రత్యక్షం.... గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ గతంలో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదే సమయంలో ఊరి నుంచి వెళ్లిపోయిన ప్రసాద్ భీమవరంలో డీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 2017లో డిగ్రీలో చేరాడు. అక్కడ ఎన్సీసీలో ఉంటూ భీమవరం పోలీస్ స్టేషన్లో కమ్యూనిటీ పోలీస్గా స్వచ్ఛంద సేవలు అందించేవాడు. అదే సమయంలో పోలీస్ యూనిఫాంపై ప్రసాద్కు మక్కువ పెరిగింది. అయితే ఒక ఏడాది మా త్రమే డిగ్రీ చదివి తర్వాత మానేసి విజయవాడ వెళ్లిపోయి అక్కడ సర్కార్గ్రాండ్ అనే హోటల్లో ఎగ్జిక్యూటివ్గా పనిలో జాయిన్ అయ్యాడు. అయితే ఎస్సై యూనిఫాంతో ఫొటోలు తీసుకుని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తుం డడం ప్రసాద్కు అలవాటుగా మారింది. అంతా ఎస్సై అనుకుంటుండడంతో ప్రసాద్ కూడా తాను ఎస్సైననే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా ఈ నెల 13న ఎస్సై యూనిఫాంలో, తుపాకీతో పోలీస్ అని రాసి ఉన్న సుమో వాహనంలో గొల్లలపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలో కొం తమంది అనుమానించి చీపురుపల్లి ఎస్సైకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెళ్లి ప్రసాద్ను చీపురుపల్లి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా అసల కథ బయిటకొచ్చింది. డబ్బులు వసూలు.. ఎస్సైగా చలామణీలో ఉన్న బంకపల్లి ప్రసాద్కు ఫేస్బుక్ ద్వారా మచిలీపట్నానికి చెందిన అంకాల బాబు పరిచయమయ్యాడు. ఆయన కూడా అప్పటికే కాని స్టేబుల్ దుస్తులు వేసుకుని నకిలీ కాని స్టేబుల్గా విజయవాడలో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ఇద్ద రు కలిసి ఫేస్బుక్ ఖాతాలో విపరీతంగా ఫొటోలు పెడుతుండడంతో పశ్చిమగోదావరి జి ల్లా భీమవరం మండలంలోని గొట్లపాడు గ్రామానికి చెందిన కె.స్వామి అనే డిగ్రీ విద్యార్థికి వీరు ఫేస్బుక్లో పరిచమయ్యారు. వీరు స్వామికి హోమ్గార్డు ఉ ద్యోగాలిప్పిస్తామని చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ. లక్ష అవుతుందని, అడ్వాన్స్గా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని చెప్పారు. దీంతో స్వామితో పాటు మరో ఇద్దరు మిత్రులు కలిసి ఒక్కొక్కరు రూ.8 వేలు చొప్పున 24 వేలు నకిలీ ఎస్సై ప్రసాద్ పంపించిన భాను అనే వ్యక్తి చేతికి ఈ నెల 11న ఇచ్చారు. హోమ్గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని అడ్వాన్స్ తీసుకున్న అభ్యర్థులకు నిందితులు డీజీపీ కార్యాలయం పేరుతో నకిలీ ఉత్తరాలు కూడా పంపించారు. అయితే ఉత్తరాల్లో తప్పులు ఉండడంతో అప్పటికే వారికి అనుమానం వచ్చింది.చీపురుపల్లి పోలీస్స్టేషన్లో నకిలీ ఎస్సై ప్రసాద్ను విచారించే సమయంలో ఆయన మొబైల్లో బాధితుల ఫోన్ నంబర్లు స్థానిక ఎస్సైకు లభించాయి. దీంతో ఎస్సై వారితో ఫోన్లో మాట్లాడగా.. ఇదంతా మోసం అని తెలుసుకున్న స్వామి అనే యువకుడు భీమవరం టూ టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి చీపురుపల్లి పోలీస్స్టేషన్కు వివరాలు పంపించారు. అంతేకాకుండా హోంగార్డు ఉద్యోగం కోసం డబ్బులు సమర్పించుకున్న స్వామి కూడా చీపురుపల్లి పోలీస్స్టేషన్కు వచ్చి తన వాంగ్మూలాన్ని స్థానిక పోలీసులకు ఇచ్చాడు. -
కేశినేని పోరాటం ఎవరిపై?
-
‘ఫన్ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’
కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్బుక్లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు. ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు. -
‘హలో, నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను’
తిరువనంతపురం : అభిమాన సినీ తారలు, ఆటగాళ్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజంగా చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకుల కోసం గంటల తరబడి ఎదురుచూసే ఫ్యాన్స్ కాస్తా అరుదుగానే ఉంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఓ ఫేస్బుక్ పోస్ట్ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ తొలిసారి దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ ప్రస్తుతం మూడు రోజుల పాటు కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం వయనాడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ప్రియతమ నాయకుడిని కలవడం కోసం ఓ పదేళ్ల బాలుడు దాదాపు 5 గంటల పాటు ఎదురు చూశాడు. కానీ భద్రతా కారణాల వల్ల కలవలేకపోయాడు. పాపం నిరాశతో వెనుదిరిగాడు. ఆ చిన్నారి బాధ చూడలేక అతని తండ్రి ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఫేస్బుక్ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తన కుమారినికి రాహుల్ గాంధీ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. దానిలో ‘నా కుమారుని పేరు నందన్. తన వయసు 10 సంవత్సరాలు. తను రాహుల్ గాంధీకి చాలా పెద్ద అభిమాని. ఈ రోజు రాహుల్ వయనాడ్లో పర్యటిస్తున్నారని తెలిసి తనను కలిసేందుకు ఉదయం 5 గంటలకే సభా ప్రాంగణానికి వచ్చాడు. నందన్తో పాటు నేను కూడా ఉన్నాను. అంతేకాక రాహుల్ గాంధీ అంటే తనకు ఎంత అభిమానమో తెలిపేందుకు ఓ లేటర్లో ‘మోస్ట్ ఫేవరెట్ పర్సన్’ అని రాసుకుని మరీ తీసుకువచ్చాడు. తన చొక్కా జేబుకు రాహుల్ గాంధీ ఫోటోను కూడా పెట్టుకున్నాడు. నందన్.. తన అభిమాన నాయకున్ని కలవడం కోసం దాదాపు 5 గంటల సేపు నిరీక్షించాడు. కానీ భద్రతా కారణాల వల్ల రాహుల్ని కలిసే అవకాశం లభించలేదు. దాంతో నా కుమారుడు చాలా నిరాశకు గురయ్యాడు’ అని పేర్కొన్నాడు. ఇలా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే.. ఈ స్టోరి తెగ వైరలయ్యింది. స్థానిక మీడియా సాయంతో ఈ విషయం కాస్తా రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. తన కోసం అన్ని గంటల పాటు ఎదురు చూసిన ఆ చిన్నారిని నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో రాహుల్.. నందన్ తండ్రికి కాల్ చేశారు. ‘హాయ్.. నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా’ అని అడిగారు. అనంతరం తన చిన్నారి ఫ్యాన్తో కాసేపు మాట్లాడి.. అతన్ని సంతోషపెట్టారు. రాహుల్ గాంధీ నందన్కు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకురాలు రమ్య ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. రాహుల్ చేసిన పనిని తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు. A young boy in Kannur waited to see Rahul ji but couldn’t, read what happened next or get a Malayalam speaking friend to translate :) I did too. Such a sweet gesture by @RahulGandhi https://t.co/M7Nl01Bn9U — Divya Spandana/Ramya (@divyaspandana) April 18, 2019 -
అభినందన్ నిజంగా ఓటేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా బయటకు వచ్చి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారంటూ ఓ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. బీజేపీకి మద్దతు తెలియజేస్తున్న ఫేస్బుక్ పేజీలు, గ్రూపులు ఈ పోస్ట్ను తెగ షేర్ చేస్తున్నాయి. షేర్ చేయాల్సిందిగా మిత్రులను కోరుతున్నాయి. (చదవండి: ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ!) ‘వింగ్ కమాండర్ అభినందన్ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేయడం కోసం ఆయన లోక్సభ ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. మోదీకి మించిన మంచి ప్రధాని మరొకరు లేరన్నారు. మిత్రులారా! ఈ విషయం జిహాదీలు, కాంగ్రెసీలకు చేరే వరకు షేర్ చేయండి’ అన్న వ్యాఖ్యలతో వర్థమాన్ను కాస్త పోలిన వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. మెడలో కమలం గుర్గు కలిగిన కాషాయ కండువాను ధరించిన ఆ ఫొటోలోని వ్యక్తికి అభినందన్కు ఒక్క మీషాల విషయంలోనే పోలిక ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం తరఫున పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ విమానాన్ని పాక్ సైనికులు కూల్చివేయడం, రెండు రోజుల నిర్బంధం అనంతర అభినందన్ హీరోలాగా దేశానికి తిరిగి రావడం తదితర పరిణామాలు తెల్సినవే. (చదవండి: ప్రచారం కోసం ఇంత అబద్ధమా!) పోలికల్లో తేడాలు 1. అభినందన్ వర్థమాన్ వయస్సుకన్నా ఆ ఫొటోలోని వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంది. 2. ఫొటోలోకి వ్యక్తి బుగ్గల కింద, మీసాలపైన ముడతలు ఉన్నాయి. వయస్సు రీత్యా, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అలాంటి ముడతలు వస్తాయి. అభినందన్కు వృత్తిరీత్యా వ్యాయామం ఉంటుంది కనుక అలాంటి ముడతలు లేవు. 3. ఫొటోలోని వ్యక్తి భుజాలు జారీ పోయినట్లుగా ఉన్నాయి. అభినందన్ భుజాలు అలా లేవు. 4. ఫొటోలోని వ్యక్తి మెడపైన ముడతలు ఉన్నాయి. అభినందన్కు లేవు. పైగా అభినందన్ మెడ పొడుగ్గా ఉంటుంది. 5. ఫొటోలోని వ్యక్తి ముక్కు కొద్దిగా లావుగా కూడా ఉంది. 6. అన్నింటికంటే అభినందన్ పెదవుల కింద పుట్టుమచ్చ ఉంది. ఫొటోలోని వ్యక్తికి కుడికన్ను దిగువున పుట్టుమచ్చ ఉంది. అభినందన్కు లేదు. 7. కళ్లను చూసి మనిషిని ఇట్టే గుర్తు పట్టవచ్చ. అందుకని కళ్లు కనపడకుండా ఫొటోలోని వ్యక్తికి కళ్లజోడు టోపీ పెట్టి మనల్ని బురడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. భారత వైమానిక దళంలో ఉన్న వాళ్లు సాధారణంగా విధుల్లో ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయన ఓటు హక్కు ఉంటే తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ఇంతవరకు పోలింగే జరగలేదు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. వర్ధమాన్ ఒక్కరి కోసం పోలింగ్ నిర్వహించారా? (చదవండి: మార్ఫింగ్ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం) 1969, ఎయిర్స్ ఫోర్స్ రూల్స్ 1969 నాటి వైమానిక దళం నిబంధనల ప్రకారం ‘ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకారాదు. వాటిని ఉద్దేశించి ప్రసంగించరాదు. అసలు రాజకీయ కార్యకలాపాలతోనే ప్రమేయం ఉండరాదు. ఉద్యమాల్లోను పాల్గొనరాదు. సహాయం చేయరాదు. ఓటర్లను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు’ ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపైన శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయి. అంటే అభినందన్ ఉద్యోగానికి ఎసరు తీసుకరావడం కోసమే బీజేపీ వర్గాలు ఈ నకిలీ వార్తను సృష్టించాయా? -
ఫేస్బుక్ పోస్ట్..‘సీ విజిల్’ అలర్ట్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్బుక్పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్ అభినందన్తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్బుక్ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తదితరులు ఉన్నారు. అభినందన్ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్’ యాప్కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్బుక్ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్ దాడి, అభినందన్ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్ పత్రిక పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభినందన్ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది. -
‘45 మంది ధైర్యవంతులే.. కర్మకు ఫలితం అనుభవించారు’
గువాహటి : 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతదేశం ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది ఆ ఘటనను సమర్థించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జవాన్ల మరణాన్ని ఉటంకిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్ పోస్టు పెట్టిన పాప్రీ బెనర్జీ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప్రీ బెనర్జీ గువాహటిలోని ఐకాన్ కామర్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పుల్వామా దాడి అనంతరం... ‘నిన్నటి ఘటనలో 45 మంది సాహసవంతులైన యువకులు హత్యకు గురయ్యారు. ఇదేమీ యుద్ధం కాదు. దాడి చేసిన వారిపై ప్రతిదాడి చేసేందుకు వారికి సమయం దొరకలేదు. నిజంగా పిరికి పంద చర్యకు పరాకాష్ట ఈ ఘటన. ఇది ప్రతీ ఒక్క భారతీయుని హృదయాన్ని కకావికలం చేసింది... కానీ... కానీ.. కానీ.. లోయలో భద్రతా బలగాలు చేయని అకృత్యాలు ఉన్నాయా! అక్కడి మహిళలపై మీరు అత్యాచారం చేశారు... వాళ్ల పిల్లల్ని చంపారు... వాళ్ల భర్తలను హతమార్చారు.. మీ మీడియా వారందరినీ తక్కువగా చూపే ప్రయత్నమే చేసింది... అయినంత మాత్రాన ప్రతీకారం ఉండదని భావించారా??? అసలు మీకో విషయం తెలుసా.. ఉగ్రవాదం ఇస్లాంకు చెందినదే కావొచ్చు.. కానీ కర్మ అనేది హిందూ సనాతన ధర్మంలోనిది.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించండి’ అంటూ పిప్రీ ఫేస్బుక్లో రెచ్చగొట్టే కథనాన్ని రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
రాహుల్ ఫెయిలైన విద్యార్థి : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రఫేల్ ఒప్పందంలో అక్రమాలు అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రక్షణ బలగాలు, న్యాయవ్యవస్థ, ఆర్బీఐ వంటి వ్యవస్థలపై కాంగ్రెస్ బూటకపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఫెయిలైన విద్యార్ధి నిత్యం క్లాస్ టాపర్పై ద్వేషం వెళ్లగక్కుతాడని రాహుల్ను ఎద్దేవా చేశారు. వ్యవస్ధలను కాపాడతామంటూ ముందుకొస్తున్న విధ్వంసకుల నుంచి వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ, న్యాయవ్యవస్ధ, సీబీఐల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎంతలా తలదూర్చాయో తెలుసుకోవాలని జైట్లీ ఫేస్బుక్ పోస్ట్లో కాంగ్రెస్కు చురకలు వేశారు. అమెరికాలో వైద్య చికిత్స అనంతరం శనివారం భారత్కు చేరుకున్న అరుణ్ జైట్లీ వ్యవస్థలపై దాడి జరుగుతున్నదంటూ తన ఫేస్బుక్ పోస్ట్లో విపక్షాలను టార్గెట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతలు మొసలికన్నీరు కారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి వారసత్వ నేతల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
సత్యమే గెలుస్తుంది : రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : లండన్లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన క్రమంలో తానెలాంటి తప్పూ చేయలేదని వాద్రా ఆదివారం పేర్కొన్నారు. ఈడీ తనను ప్రశ్నించిన ఉదంతంపై స్పందించిన వాద్రా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులకు ధన్యవాదాలని, తాను ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటానని వాద్రా ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7 తేదీల్లో విచారించిన ఈడీ శనివారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించింది. కాగా తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని వాద్రా చెబుతున్నారు. -
‘ఆధార్తో రూ 90 వేల కోట్లు ఆదా’
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ దేశ ముఖచిత్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆధార్తో ఆదా అయిన డబ్బుతో ఆయుష్మాన్ భారత్ వంటి మూడు భారీ కార్యక్రమాలను చేపట్టే వెసులుబాటు కలిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధార్ను సమర్ధంగా అమలు చేస్తే, గత యూపీఏ సర్కార్ దీని అమలును సరిగ్గా పర్యవేక్షించలేదన్నారు. ఆధార్ ప్రయోజనాల పేరుతో జైట్లీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ సబ్సిడీల పంపిణీలో ఆధార్ వాడకంతో గత కొన్నేళ్లుగా రూ 90 వేల కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. ఆధార్ వినియోగంతో భారత్ ఏటా రూ 77,000 కోట్లు ఆదా చేయవచ్చని వరల్డ్ బ్యాంక్ తన డిజిటల్ డివిడెండ్ నివేదికలో పొందుపరిచిందన్నారు. ఆధార్ ద్వారా ఇప్పటివరకూ రూ 1,69,868 కోట్ల సబ్సిడీ బదిలీ జరిగిందని చెప్పారు. ఆధార్ వినియోగంతో దళారుల ప్రమేయం లేకుండా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళుతోందన్నారు. భారత్లోనే ఈ వినూత్న టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. ఆధార్ వాడకం ద్వారా ఆదా అవుతున్న మొత్తం పేదల సంక్షేమానికి చేరుతోందని చెప్పుకొచ్చారు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే 21 కోట్ల పాన్కార్డు కలిగిన వారిని వారి ఆధార్ నెంబర్లతో అనుసంధానించిందన్నారు. -
భారీ మాల్ చిన్నబోయింది..
కోల్కతా : బహిరంగ ప్రదేశాల్లో చంటి పిల్లలకు పాలివ్వడం తల్లులకు ఇప్పటికీ నరకప్రాయమేననే ఘటన చోటుచేసుకుంది. ఆకలితో మారాం చేస్తున్న చిన్నారికి పాలుపట్టేందుకు సైతం ఆ భారీ మాల్లో అవకాశం లేకుండా పోయింది. కోల్కతాలోని భారీ షాపింగ్ మాల్లో తన చిన్నారికి పాలుపట్టేందుకు అనువైన ప్రదేశం చూపాలని కోరిన మహిళకు సిబ్బంది నుంచి నిర్ఘాంతపోయే సమాధానం వచ్చింది. కోల్కతాలో అత్యంత ప్రముఖ షాపింగ్ మాల్ సౌత్ సిటీ మాల్లో 29 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఏడు నెలల పసికందుకు పాలుపట్టేందుకు సరైన ప్రదేశం కోసం మాల్ మొత్తం కలియదిరిగానని ఆమె ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారు. అంత పెద్ద మాల్లో చిన్నారికి తాను పాలిచ్చేందుకు సరైన స్థలమే లేదని, పైగా అక్కడి సిబ్బంది టాయ్లెట్లో పాలివ్వాలని సూచించారని తెలిపారు. ఇది భారీ మాల్ కాదని..యూజ్లెస్ మాల్ అంటూ మండిపడ్డారు. సిబ్బంది తీరుతో అవాక్కైన తనకు వారి నుంచి మరింత నిర్లక్ష్య సమాధానం ఎదురైందని చెప్పుకొచ్చారు. ప్రజల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి పనులన్నీ ఇంట్లో చక్కబెట్టుకుని రావాలని, మాల్లో కాదని ఉచిత సలహాలిచ్చారని చెప్పారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆ భారీ మాల్ తన నిర్వాకంతో చిన్నబోయిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. -
లైంగిక వేధింపులు : తగిన బుద్ధి చెప్పిన నటి
మలయాళ, కన్నడ నటి నేహా సక్సేనా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన వ్యక్తికి భలే బుద్ధి చెప్పారు. లైంగిక వాంఛ తీర్చాలంటూ అతని వక్రబుద్ధిని సోషల్ మీడియా సాక్షిగా బహిర్గతంచేయడంతో సదరు వ్యక్తి కక్కలేక మింగలేక, తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం అతగాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ , తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన నేహా సక్సేనా స్వయంగా ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ద్వారా వెల్లడించారు. అబుదాబిలో షైన్ సిస్టం సర్వీసెస్లో పనిచేసే ఎల్సన్ లోహి దక్షన్ అనే వ్యక్తి ఒక రాత్రికి తన కోరిక తీర్చాల్సిందిగా వాట్సాప్ద్వారా ప్రతిపాదన పెట్టాడు. దీంతో ఎంత అవుతుందో తెలపాలని కోరాడు. దీంతో ఆమె లోహిదక్షన్ ఫోన్ సంబరుతో సహా అతని వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్ర్కీన్లను ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేశారు. మరోవైపు ఈఆరోపణలను లోహిదక్షన్ ఖండించాడు. తన ఫోన్ హ్యాక్ అయిందనీ, మహిళల పట్ల తాను ఎపుడూ అలా పవర్తించలేదని ఫేస్బుక్లోవివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై అబుదాబి సీఐడీకి ఫిర్యాదు చెసినట్టువెల్లడించాడు. అంతేకాదుతన కరియర్ నాశనమవుతుంది, కుటుంబానికి తెలిస్తే తన పరువు పోతుందంటూ లబోదిబోమంటున్నాడు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
ముంబై : ఫేస్బుక్ పోస్ట్ ప్రాణం తీసింది. వివరాలు.. ముంబైకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ దుబే(45) అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. దుబే తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ పొలిటికల్ పోస్ట్ ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబే మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సంతాపం తెలిపారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. Shocking! Manoj Dubey, a staunch Congress worker was murdered for his facebook post by BJP goons. We strongly condemn such a coward act! The culprits should be brought to justice. Our deepest condolences to his family, Congress party stands with his family at this hour of grief. pic.twitter.com/BcVhzZdtD0 — Maharashtra Congress (@INCMaharashtra) October 22, 2018 -
శబరిమలపై మహిళ పోస్టు.. తీవ్ర ఉద్రిక్తత
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’) మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. (చదవండి : ‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు) -
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
-
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
హిమాచల్ప్రదేశ్లోని హమీర్ పూర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్బుక్లో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో 5000 సార్లకు పైగా షేర్ కూడా అయింది. మధ్యప్రదేశ్లోని కైలారస్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర శుక్లా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్యే కాకుండా.. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు ఈ చెప్పు దెబ్బలు తిన్నారు. వీడియోలో ఒక మహిళా.. సన్మాన కార్యక్రమంలో ఓ వ్యక్తికి దండ వేస్తూ ఉండగా... మరో మహిళ తన చెప్పు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటుంది. ఈ వీడియోలో వెనుక కనిపిస్తున్న పోస్టర్లో ‘హిమాచల్ పరివాహన్ మజ్దూర్ సంఘ్’ అని ఉంది. అయితే హమీర్ పూర్కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరిందర్ థాకూర్ను సంప్రదించగా.. తనకు అలాంటి అవమానకర సంఘటన ఎదురు కాలేదని చెప్పారు. కానీ హమీర్ పూర్లో ఆ సంఘటన జరిగిందన్నారు. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై ఈ దాడి జరిగిందని, మహిళలు కొట్టింది తనని కాదని చెప్పేశారు. 2018 జూలై 22న ఇద్దరు ట్రైనీ మహిళా కండక్టర్లు అతనిపై ఈ దాడికి పాల్పడట్టు తెలిసింది. ఆ తర్వాత వారిద్దర్ని వారి వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కూడా రిపోర్టుల వచ్చాయి. ఇదే విషయాన్ని హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు శంకర్ సింగ్ కూడా ధృవీకరించారు. 2018 జూన్ 22న కొంతమంది మహిళలు తనపై దాడి చేశారని, సన్మాన కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు మహిళా కండక్టర్లు తనను ఈ విధంగా చెప్పుతో కొట్టారని చెప్పారు. వారికి కార్పొరేషన్లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అయితే మీకు బీజేపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, తాను ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్ను అని, తనకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్లో షేర్ అవుతున్నట్టు బీజేపీ హమీర్పూర్ ఎమ్మెల్యేపై ఆ ఈవెంట్లో ఎలాంటి దాడి జరగలేదని, ఈ అవమానకర సంఘటనను హిమాచల్ రోడ్డు రహదారుల కార్పొరేషన్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ సింగ్ ఈ దాడికి గురయ్యారని చెప్పారు. -
వాజ్పేయిని విమర్శించాడని ప్రొఫెసర్ను చితకబాదారు
-
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్ను సోషల్మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్తో తాను చేయబోయే సినిమాలో హానన్కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని కేసు నమోదు
సాక్షి, పశ్చిమగోదావరి: చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై ఫేస్బుక్లో పోస్ట్లు పెట్టారని వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు సురేష్పై చింతలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి సురేశ్ని అరెస్ట్ చేసినట్టు తన కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే చింతలపూడి పోలీసులు సురేశ్ని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. దీంతో అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు చేస్తున్నారు. -
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టాడని దాడి
భీమడోలు/ఏలూరు టౌన్ : వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్బుక్లో పోస్టింగులు పెడుతున్నాడనే అక్కసుతోపాటు, పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నేత తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుడిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. గొడవ జరగటం చూసి అక్కడికి జనాలు రావటంతో టీడీపీ నేతలు జారుకున్నారు. తల, శరీరబాగాలపై తీవ్రంగా కొట్టటంతో పడిపోయిన అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు.. భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనుబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇటీవల భీమడోలులో కాపునేత ముద్రగడ పద్మనాభం కార్యక్రమానికి హాజరైన అతను ఆ సభలోని అంశాలతోపాటు కొంత కాలంగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్ బుక్కులో పోస్టింగులు పెడుతున్నాడు. దీంతో శ్రీనుబాబుపై కక్షపెంచుకున్న భీమడోలు మండల టీడీపీ అధ్యక్షుడు గంజి మాజేష్చౌదరి సమయం కోసం వేచిఉన్నాడు. వ్యవసాయ కూలీ అయిన శ్రీనుబాబు గురువారం సాయంత్రం డీజిల్ కోసమని భీమడోలు పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ కొట్టించుకుని బయటకు వస్తుండగా అతడిని అడ్డుకుని మాజేష్, అతని సోదరుడు మనోజ్, ఉయ్యాల సాయి, అలజింగి హరిష్, మోపిదేవి శివ, తుమ్మగుంట పవన్కల్యాణ్ తదితరులు తీవ్రంగా కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని శ్రీనుబాబు ప్రశ్నించగా, ఈ మధ్య బాగా అతి చేస్తున్నావనీ, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. ఈలోగా మరో వ్యక్తి కత్తి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా జనాలు గుమిగూడటంతో వారు అక్కడి నుంచి జారుకున్నారు. శ్రీనుబాబును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. తనను కొట్టిన వారిపై శ్రీనుబాబు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెనువెంటనే టీడీపీ నాయకులు బాధితుడు రామిశెట్టి శ్రీనుబాబు, వైఎస్సార్ సీపీ నేతలు తుమ్మగంట రంగాతో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు భీమడోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రామిశెట్టి శ్రీనివాసరావును దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన టీడీపీకి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద బైఠాయించారు. గాయపర్చిన వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారని ఎస్సై శ్రీరామగంగాధర్ను ప్రశ్నించారు. నేరస్తులైన టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారన్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై శ్రీరామగంగాధర్ వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించారు. రెండు కేసులను నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు.బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులు వెనుతిరిగారు. -
లిఫ్ట్ ఇవ్వటం ‘మహా’ పాపం
పాపం పోనీ అని లిఫ్ట్ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది. హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్ అధికారి చలాన్ రాసి చేతిలో పెట్టాడు. ముంబైకి చెందిన నితిన్ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు. జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్లో నితిన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం భారీగా పడుతుండటం, పైగా రవాణా సదుపాయం లేకపోవటంతో ముగ్గురు వ్యక్తులు కష్టపడుతుండటం అతని కంట పడింది. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి రూ. 1500 చలాన్ రాసిచ్చాడు. అంతేకాదు నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని ఛలాన్ కట్టి వాహనం తీసుకెళ్లాలని సూచించాడు. అయితే ఆ టైమ్లోనూ నితిన్ సాయం చేయటం మానలేదు. వారిని వారి వారి గమ్యస్థానంలో వదిలి మరుసటి రోజు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డాడు. తన అనుభవాన్ని నితిన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. నితిన్కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, అందుకే అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ పేరుతో సాయం చేసి తనలా బుక్ కాకండని సూచిస్తూ ఆ పోస్టును పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫేస్బుక్ యూజర్లకు మరోసారి షాక్
-
ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా: బాలకృష్ణ
‘‘సార్.. మేము దళితులం. మీకు పూలదండ వేసేందుకు కూడా పనికిరామా.. వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని పక్కకు లాగేస్తున్నారు. ఏళ్లుగా పార్టీ జెండా మోసినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా.’’ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. పనులు మాత్రం పర్సెంటేజీలు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. ఇదేం న్యాయం. మనోడైనా.. ప్రశ్నిస్తే పగోడే! అసలే బాలయ్య. కోపమొస్తే ఎవరి చెంప చెల్లుమంటుందో తెలియదు. రాకరాక ఊరికొస్తే.. ఆయనను ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందా! తనకు అంతా తెలుసనీ, ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తానని తనదైన శైలిలో సినిమా డైలాగ్ చెప్పేశారు. సాక్షి, హిందూపురం అర్బన్: చుట్టపుచూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఎమ్మెల్యే బాలకృష్ణ... నాలుగేళ్ల తర్వాత... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే గురువారం ఆయన స్థానిక సాయిరాం ఫంక్షన్ హాలులో చిలమత్తూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కాగా కార్యకర్తలు, నేతలు బాహాబాహీకి దిగడంతో బాలయ్య దిమ్మదిరిగింది. బయటపడ్డ విభేదాలు చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీగా సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరు పంచాయతీ గురించి ప్రస్తావన రాగానే.. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. పనులన్నీ పర్సంటేజిలు ఇచ్చినవారికే ఇచ్చుకుంటున్నారనీ.. కార్యకర్తలకు న్యాయం చేయడంలేదన్నారు. పాపన్న అన్నింటికీ అడ్డుపడుతూ వర్గాలు సృష్టిస్తున్నాడని ముద్దçపల్లి వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దీంతో పాపన్న స్పందిస్తూ... పార్టీ అభివృద్ధికోసం పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు. వారికి బాలకృష్ణ పీఏ వీరయ్య, శివప్పలు నచ్చచెప్పి కుర్చోబెట్టారు. ఇంతలో మరో కార్యకర్త స్పందిస్తూ..నేతలుæకార్యకర్తల రక్తం తాగుతున్నారనీ, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులంటే చులకన అనంతరం గంగాధర్ అనే కార్యకర్త మాట్లాడుతూ, దళితులందరూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నామన్నారు. అయితే తమకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలకృష్ణ ఎదుట వాపోయారు. ఎస్సీ కాలనీలో అనేక సమస్యలున్నా.. తీర్చేవారు లేరన్నారు. అనంతరం పాతసామర్లపల్లికి చెందిన మంజు మాట్లాడుతూ, చాలాకాలంగా తాను స్టోరు డీలరుగా ఉన్నాననీ, అయితే జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ తన స్టోరుపై అధికారులతో దాడిచేయించి స్టోరును లాగేసుకున్నాడన్నారు. ఇక అధికారులే తనపై లేనిపోనివి చెప్పి జనంతో ధర్నాలు చేయిస్తున్నారని చిలమత్తూరు సర్పంచ్ శ్రీకళ వాపోయారు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదనీ, టీడీపీలోకి వచ్చాక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎక్స్ట్రా చేస్తే తాటతీస్తా... అన్నీ విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ... ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో అన్నీ తనకు తెలుసనీ...ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా నంటూ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20తేదీ నుంచి పంచాయతీల్లో పర్యటిస్తాననీ...అన్నీ చూచి ఒక్కొక్కరికి ఏంచేయాలో అది చేస్తానన్నారు. సమావేశంలో టీడీపీ ఎంపీపీ నౌజియాభాను, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ, సర్పంచి శ్రీకళ, టీడీపీ బీసీసెల్ జిల్లా అ«ధ్యక్షుడు శివప్ప, మండల కన్వీనర్ బాబురెడ్డి పాల్గొన్నారు. రోడ్డులేదని చెప్పడానికొస్తే ఈడ్చిపడేశారు చిలమత్తూరు మండలం మరుసనపల్లి పంచాయతీ ఎస్.ముద్దిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు లేదు. వర్షం వస్తే మట్టిరోడ్డు బురదమయం అవుతోంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టా. బాలయ్య వచ్చాడు కదా అని చెప్పేందుకు వెళ్తే చుట్టూ చేరిన వారి మాటలు విని నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ నానా దుర్భాషలాడాడు. బయటికిపో అంటూ గద్దించాడు. పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చేశారు. – బత్తుల బాలాజి, ముద్దిరెడ్డిపల్లి టీడీపీ కార్యకర్త -
మరో ప్రమాదంలో ఫేస్బుక్ యూజర్లు
వాషింగ్టన్ : డేటా స్కాండల్ విషయంలో ఫేస్బుక్ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్వేర్లో బగ్ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్ను మార్చేసిందని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. దీంతో మరోసారి ఫేస్బుక్ ప్రైవసీపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఫేస్బుక్ తన సాఫ్ట్వేర్లో గుర్తించిన బగ్ వల్ల.. కేవలం స్నేహితులకు లేదా మీకు మాత్రమే షేర్ చేసుకున్న అంతకముందు పోస్టులు.. పబ్లిక్గా వెళ్లిపోయాయి. ఒకవేళ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ మారుతున్నట్టు గుర్తించలేకపోతే, వారు ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ప్రమాద పరిస్థితుల్లో వారి పోస్టులు పబ్లిక్గా వెళ్లిపోతాయి. అయితే ఈ బగ్ అంతకముందు పోస్టులపై ప్రభావితం చూపలేదని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఈగన్ చెప్పారు. బగ్ యాక్టివ్లో ఉన్న సమయంలో షేర్ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని తెలిపారు. ఒక్కసారి యూజర్లు తమ పోస్టులను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ మరింత డేటా స్కాండల్ వివాదంలో కూరుకుపోతోంది. ఆపిల్, శాంసంగ్ వంటి 60కి పైగా కంపెనీలతో ఫేస్బుక్ తన యూజర్ల డేటా షేర్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. కేవలం ఆ కంపెనీలు మాత్రమే కాక, నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు కూడా యూజర్ల డేటాను షేర్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ విషయంలో ఈ కంపెనీ తీవ్ర ఇరకాటంలో పడగా.. తాజా డేటా షేరింగ్ స్కాండల్స్ కూడా ఫేస్బుక్ను దెబ్బకొడుతున్నాయి. తాజాగా కంపెనీ గుర్తించిన బగ్ మే 18 నుంచి మే 27 వరకు యాక్టివ్లో ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఆ సమయంలో ప్రభావితమైన పోస్టులను ఒరిజినల్ ప్రైవసీ పారామీటర్స్కు మళ్లీ మార్చలేమని తెలిపింది. యూజర్లు ‘ఫీచర్ ఐటమ్స్’ను తమ ప్రొఫైల్స్లోకి షేర్ చేసేందుకు కొత్త ఫీచర్ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తప్పిదం జరిగిందని, దీంతో ఆటోమేటిక్గా పోస్టులు, ఫోటో ఆల్బమ్స్ పబ్లిక్కు వెళ్లిపోయాయని పేర్కొంది. -
పోస్ట్ చేశారు.. పోలీసులకు పట్టుబడ్డారు!
కర్నూలు: జిల్లాలో పార్థి, చెడ్డీ, బిహార్ గ్యాంగ్లున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు బాలురను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా వారి నుంచి మూడు సెల్ఫోన్లు, సిమ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్బీ డీఎస్పీ నజీముద్దీన్లతో కలిసి వివరాలు వెల్లడించారు. పోస్ట్ ఇలా..: ‘పిల్లలను చంపి మెదడు తినే మద్రాసుకు చెందిన 50 మంది గ్యాంగ్లో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టాం. అతడి పేరు జాన్కొల్లి, ఇంకొందరు వ్యక్తులను కోడూరులో పట్టుకున్నారు. మహానంది మండలం తిమ్మాపురం వాసులు వ్యక్తిని పట్టుకొని విచారిస్తున్న ఫొటోను జతపరిచి దానికి వాయిస్ను పైవిధంగా జతచేసి వాట్సప్, సామాజిక మాధ్యమాల ద్వారా సుమా రు 31 మంది పరిచయస్తులకు షేర్ చేశారు. పుకార్లు నమ్మొద్దు...: సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి గ్యాంగులు జిల్లాలో తిరగడంలేదన్నారు. వదంతుల నమ్మి మానసిక స్థితి సరిగా లేనివారిపైనా, అమాయకులపైనా భౌతిక దాడులకు పాల్పడి హాని కలిగించవద్దన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉందని సాయుధులైన ప్రత్యేక పోలీసు బృందాలతో గస్తీ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన సంఘటనలపై విచారించగా ఆయా గ్రామాల్లో ప్రజలకు పట్టుబడిన వారంతా మతిస్థిమితం లేనివారు, భిక్షగాళ్లు, చిన్నచిన్న వ్యాపారులుగా గుర్తించామన్నారు. ఇక ఆదోనిలో ప్రజల సామూహిక దాడిలో మృతి చెందిన వ్యక్తి కూడా ఓ అమాయకుడేనని తేలిందన్నారు. గ్యాంగ్ల గురించి సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించిన బాలురపై మహానంది పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసి కర్నూలు బీక్యాంపులోని జువైనల్ హోమ్కు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. -
ఫేసు బుక్కయ్యాడు..
ప్రొద్దుటూరు క్రైం : పార్థీ గ్యాంగ్ తిరుగుతోందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టిన యువకుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేకున్నా ప్రజలు జంకుతున్నారు. ఒక వైపు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో వినోద్కుమార్రెడ్డి అనే కుక్కుల వ్యాపారి ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ ఓబులేసు అరెస్ట్ విరాలను వెల్లడించారు. పాతకోట వినోద్కుమార్రెడ్డి ఆరేళ్ల నుంచి ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెలో భైరవ కెన్నల్ పేరుతో కుక్కల వ్యాపారం నిర్వహించేవాడు. ఇటీవల జిల్లాలో పార్థీ గ్యాంగ్ గురించి పుకార్లను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని చూశాడు. పార్థీ గ్యాంగ్ లేదని చెప్పిన పోలీసుల మాటలను నమ్మవద్దని, జిల్లాలో పార్థీ గ్యాంగ్ ముఠా సంచరిస్తోందని, ఇంటికి కాపలాగా ప్రతి ఒక్కరూ కుక్కను పెట్టుకోవాలని ప్రజలు నమ్మేలా ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఫేస్బుక్ ద్వారా ప్రజలను నమ్మించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న పార్థీ గ్యాంగ్ భయాన్ని పోగొట్టేందుకు పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో పార్థీ గ్యాంగ్ ఉందని ప్రజల్లో భయాన్ని కలిగించడం నేరమని సీఐ తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ కదలికలు లేవు.. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేదని సీఐ ఓబులేసు అన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో పార్థీ గ్యాంగ్ చేసిన నేరాలు, ఇతర సంఘటనలు ఒక్కటి కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనలను జిల్లాలో జరిగినట్లు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను ఇతరులకు పంపరాదని సీఐ సూచించారు. ఇలాంటి పుకార్లను, వదంతులను నమ్మరాదని కోరారు. పట్టణంలోనూ, గ్రామాల్లోనూ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు. -
కేటీఆర్ సార్.. స్పందించండి: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ట్వీట్లను స్క్రీన్ షాట్లు చేసి శ్రీరెడ్డి తాజాగా చేసి ఎఫ్బీ పోస్ట్ వైరల్గా మారింది. 'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.' 'సార్, ఇటీవల విడుదలైన మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను'కు మీరు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై స్పందించేందుకు మాత్రం సమయంలో ఎందుకు కేటాయించడం లేదు. మీ పీఏ మొబైల్కి పలుమార్లు మెస్సేజ్లు చేశాను. కానీ స్పందన కరువైంది. మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పండి సార్' అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. (సంబంధిత కథనం: ‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా) -
రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు
చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ గురువారం తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లు కాలేరు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్ను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేయిని ఫినాయిల్తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్ను షేర్ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్చేశానన్నారు. -
రేప్ చేస్తామంటూ కాల్స్.. ఆర్టిస్ట్ ఆందోళన!
తిరువనంతపురం: కథువా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసమయ్యాయని పట్టాంబి పోలీస్ స్టేషన్లో ఆర్టిస్ట్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పలక్కడ్ జిల్లా పట్టాంబిలో ఆర్టిస్ట్ దుర్గా మాలతి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. అయితే జమ్మూకశ్మీర్లోని ఉన్నావాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆపై హత్య ఘటన దుర్గను కలచివేసింది. దీంతో బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితులు హిందువులు కావడంతో.. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆమె కొన్ని పెయింటింగ్స్ వేశారు. వాటిని తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మర్మాంగం బొమ్మకు తమ దేవుళ్లను లింక్ చేసి అవమానించిందని.. తమ మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేసిందన్న కారణంగా కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఆమె ఇంటిపై రాళ్లదాడి చేసి కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు. అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఆందోళన వ్యక్తం చేశారు. రేప్ చేస్తామని కొందరు, హత్య చేస్తామని మరికొంత మంది నెటిజన్లు తన పోస్టులకు కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. -
స్పందించిన వర్మ.. పవన్కు సుదీర్ఘ లేఖ
నటుడు పవన్ కల్యాణ్తో వివాదంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్పై ఇకనుంచి నెగటివ్ కామెంట్లు చేయనని తన తల్లిపై ఒట్టేశానని చెప్పిన వర్మ.. ఆపై పవన్ చేసిన ట్వీట్లకు తాను లాజికల్గా సమాధానం ఇవ్వాల్సి ఉందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే.. ప్రాస్టిట్యూషన్ను చట్టబద్ధం చేయడం మీకు ముఖ్యమైందా అని పవన్ అడుగుతున్నారు. కానీ ప్రత్యేక హోదా కంటే మీకు ఎవరో వ్యక్తి తిట్టారన్న విషయమే జాతీయ సమస్యగా కనిపించిందా అని తన పోస్ట్లో ప్రశ్నించాడు. హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజే మీరు ఇలా నిరసన తెలపడం సమంజసమా అని లాజికల్గా పవన్ను అడుగుతున్నట్లు వర్మ తెలిపారు. పవన్ తల్లిని తిట్టించడానికి తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్న వర్మ.. ఈ వివరాలు తాను విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉన్నాయంటూ కొన్ని విషయాలు డైరెక్టర్ వర్మ పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు శుక్రవారం కొన్ని గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు జరిపిన అనంతరం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని అంతలోపు తనకు న్యాయం చేయాలని సినీ పెద్దలను పవన్ కోరిన విషయం తెలిసిందే. పవన్కు దర్శకుడు వర్మ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లేఖ యథాతథంగా... పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్ గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్ గా కాకుండా ,లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి “మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9 ABN ANDHRA JYOTHI ద్వారా నా మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో పెట్టారు..Ram gopal Varma,Tv 9 owner srini raju ,Ravi Prakash ,Lokesh Naidu ,అతని ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా RGV: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు.. ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ అనను. మీడియాలో మీటింగ్లు బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు..మీరన్న దానికి పాయింట్లు గా నా వివరణ ఇస్తాను 1.సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్ చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది 2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలపటానికి 3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం.. మహేష్ కత్తి example ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను ..ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు... ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను 4.ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్ కాదు.. ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం.. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం.. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే ల కొడుకు అనే పదం 5.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు 6.ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి 5 కోట్లు ఇఛ్చి తిట్టించమనుకుందాం.. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది.. మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా?, మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు తగ్గిపోతాయా? 7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లుగల వారెవరూ లేరు.. ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను PK: ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు." RGV: కళ్యాణ్ గారు, హీరో అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు.. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు.. ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం. పవన్ కళ్యాణ్ గారు వేసిన కొన్ని ఇంగ్లీష్ ట్వీట్లు PK: Hon C M For these channels, legalisation of prostitutes are more important than special status ..what is your priority as you control the media? RGV: I am shocked that you are calling all the unfortunate girls who are victims of casting couch and male abused as prostitutes..this is far worse than what Sri reddy said ..You mean to say just because he is close to your family , all the women whoever complained about the atrocities on your man Vaakadu Apparao are prostitutes ? Never heard anything more deameaning to women. PK: Interesting fact ,The current dream team also has mothers,sisters and daughters..But their women are secured and safe but my poor fragile 70 year old mother had to be abused for TRPs and political benifits RGV: What’s more interesting is I don’t understand how TRPs and political benifits can come to your opponents because of abuses? .. Do you mean to say that tv viewers and voters want to listen to mothers being abused ? Is that how bad you think of telugu people? If at all there’s any political benefit in this whole issue ,it’s only for you because you are dragging your mother into this to gain sympathy which might convert to votes And with regard to the so called dream team’s mothers,sisters and daughters you can always unleash many of ur fans in the social media and you very well know that no one in the world can match their exemplary language skills..in comparison to their abuses what Sri reddy said will sound like a pure morning prayer -your ardent fan RAM GOPAL VARMA -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
మంచు లక్ష్మిపై రేణూ దేశాయ్ పోస్ట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలు చేసే నటి మంచు లక్ష్మిని మరోనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి లక్ష్మి చాలా కృషి చేస్తున్నారని రేణు కొనియాడారు. ఆమెతో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్లో రేణు ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షోలో రేణు పాల్గొన్నారు. ఎలాంటి నగదు తీసుకోకుండా అవసరాల్లో ఉన్న వారి కోసం పనిచేయడం తృప్తి నిచ్చిందన్నారు. ‘బొమ్మలు అమ్మి 30 వేల రూపాయాలు సంపాదించా. వాటికి మరో 20 వేల రూపాయలు కలిపి ఇచ్చాను. ఆ నగదుకు మంచు లక్ష్మి మరో లక్ష రూపాయలు జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షల రూపాయలు లక్ష్మి విరాళంగా ఇచ్చేశారు. అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయమంటూ’ నటి రేణూ తన పోస్టులో పేర్కొన్నారు. హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ హ్యుమన్ అనే హ్యాష్ట్యాగ్స్తో రేణు చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
నెటిజన్ల ఆగ్రహం.. స్పందించిన కొటక్ మహీంద్రా
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్యాంక్ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తటంతో కొటక్ మహీంద్రా స్పందించింది. ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొచ్చిలోని పలారివట్టోమ్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ విష్ణు నందకుమార్ ఈ మధ్య ఫేస్బుక్లో మళయాళంలో ఓ పోస్ట్ చేశాడు. అందులో కథువా హత్యాచార ఘటనపై స్పందించిన విష్ణు.. ‘చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు చేశారు. పనిలో పనిగా కొటక్ మహీంద్రా బ్యాంక్కు కూడా కొందరు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని.. లేకపోతే బ్యాంకులపై దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్యాంక్ యాజమాన్యం.. ‘ఏప్రిల్ 11న విష్ణు నందకుమార్ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంది. అయితే పనిలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే అతన్ని తొలగించినట్లు ఆ ప్రకటన పేర్కొనటం గమనార్హం. విష్ణు నందకుమార్.. పక్కనే అతను చేసిన పోస్ట్ -
‘ఆ’ పోస్ట్.. శేఖర్ కమ్ముల సీరియస్
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోపం వచ్చింది. తనను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. అందులో ఉన్నవి అవాస్తవాలని.. తక్షణమే అది పోస్ట్ చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్... ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్పై జోరుగా చర్చసాగుతోంది. -
ఇంకా ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నాం.. వైరల్!
సాక్షి, ముంబై: కొన్నేళ్ల కిందట వచ్చిన '3 ఇడియట్స్' మూవీ చూసి కాలేజీలు, స్కూళ్లల్లో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు కదా. కానీ అలాంటివేం జరడగం లేదని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పోస్టును ఒక్కసారైన చదవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన '3 ఇడియట్స్' మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై దక్షిణాదిలో దర్శకుడు శంకర్ స్నేహితుడు పేరుతో తీయగా విద్యార్థులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాల ప్రభావం అనంతరం విద్యావ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. చదివే చదువు వేరు, చేయాలనుకున్న ఉద్యోగం, స్థిరపడాలనుకున్న రంగం వేరుగా ఉంటున్నాయని హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ విద్యార్థి పోస్ట్ చేశాడు. ఒకవేళ నేను సింగర్, నటుడు, డ్యాన్సర్, లేక డైరెక్టర్ అవ్వాలనుకుంటే చదువుకున్న పైథాగారస్ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించాడు. ప్రస్తుతం ముంబై నెటిజన్లకు అది ఓ హాట్ టాపిక్గా మారింది. నవ్వుకునేందుకు కామిక్ పుస్తకాలు చదువుతుంటాం. అయితే కామిక్ పుస్తకాలు చదివిన వారికి పరీక్షలు పెడతామని చెప్పండి. ఒక్కరూ కూడా కామిక్ బుక్స్ వైపు కన్నెతి చూడరు. బాగా వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ లో పడ్డట్లు విద్యార్థుల పరిస్థితి తయారవుతుంది. అమ్మానాన్నలు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు అనుకున్న దాని కంటే గొప్పగా ఎదిగి మీరు గర్వపడేలా చేస్తామంటూ సందేశం ఇచ్చాడు. మరో గంటలో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని, వెళ్తున్నానంటూ విద్యార్థి తన పోస్ట్ను ముగించాడు. -
అఫ్గాన్లో ‘ట్రంప్’కు కష్టాలు
కాబూల్: సాధారణంగా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన, నచ్చిన పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అయితే ఆ పేర్లు కొంచెం విచిత్రంగా ఉంటేమాత్రం అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్తాన్కు చెందిన సయ్యద్ అసదుల్లాహ్, జమీలా దంపతులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే 2016లో పుట్టిన తమ రెండో కుమారుడికి వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. అయితే చిన్నారి ట్రంప్కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో ఫేస్బుక్లో పోస్ట్చేయడంతో అసలు వివాదం రాజుకుంది. ముస్లింపేరు పెట్టకపోవడంతో అసదుల్లాహ్ను చంపేస్తామని కొంతమంది ఫేస్బుక్లో హెచ్చరించగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టేవారు. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఫేస్బుక్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇరుగుపొరుగువారు కూడా వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అసదుల్లాహ్ను బెదిరించసాగారు. దీంతో ఆయన స్వస్థలమైన డైకుండీ ప్రావిన్సును వదిలి కాబూల్కు వలస వచ్చారు. ఈ విషయమై అసదుల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ రాసిన ‘హౌ టు గెట్ రిచ్’ పర్షియన్ అనువాదాన్ని చదవడంతో పాటు చాలా పరిశోధన చేసిన తర్వాతే తన కుమారుడికి ట్రంప్ అని పేరుపెట్టినట్లు తెలిపారు. -
ఆమె పేరుతో నకిలీ ఇన్స్ట్రాగామ్..
మల్కాజిగిరి: ఫేస్బుక్ ద్వారా యువతిగా పరిచయం చేసుకుని మరో యువతిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కొమరయ్య కథనం ప్రకారం...మల్కాజిగిరి ఎస్పీనగర్కు చెందిన మహ్మద్ సొహైల్ హుస్సేన్ సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజిలో డిగ్రీ చదువుతున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్ధిని ఫేస్బుక్ ద్వారా మహిళగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోటోలు తీసుకోవడమే కాకుండా చాటింగ్ చేసిన మెసేజ్లను ఆసరా చేసుకొని ఆమెను ప్రేమించమని వేధించడమే కాకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై గత ఏడాది బాధితురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు ద్వారా రాజీ చేసుకున్నాడు. ఇటీవల ఆమె పేరుతో నకిలీ ఇన్స్ట్రాగామ్ ఖాతాను తెరిచి ఫోటోలు ఉంచడమే కాకుండా అసభ్యకరమైన కామెం ట్లు చేస్తుండటంతో బాధితురాలి గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సోహైల్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు. -
దేశం శ్రేణుల మధ్య ఫేస్బుక్ చిచ్చు
తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఫేస్బుక్ పోస్టింగ్ వివాదస్పదమైంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ అనుచరుల మధ్య యుద్ధం మొదలైంది. చివరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం...దానికి వ్యతిరేకంగా పోలీస్స్టేషన్ను ముట్టడించడం ఒకదాని తరువాత ఒకటి వరుస పరిణామాలు మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న విబేధాలను బయటపెట్టాయి. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి: జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు అనుచరుడు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినిక క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో ఫేస్బుక్ పోస్టింగ్ చేశాడంటూ పోలీసు శాఖ సుమోటోగా దాన్ని భావించి పోస్టు చేసిన అశోక్ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొంది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ వర్గీయులు, మహిళలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి పోలీస్స్షేషన్కు చేరుకుని నిరసన తెలిపారు. న్యాయవాది పూచీకత్తుపై అర్ధరాత్రి 12 తరువాత విడుదల చేసిన పోలీసులు బుధవారం ఉదయం స్టేషన్కు రావాలని ఎస్ఐ కాంతికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అశోక్తో సహా పోలీస్స్టేషన్కు వచ్చిన అశోక్తో పాటు జెడ్పీటీసీ వరహాలనాయుడు వర్గీయులు ఎమ్మెల్యే మృణాళిని కార్యాలయంలో పని చేసే ఉద్యోగి బొత్స గోపీనాధ్, ఆర్ఈసీఎస్ చైర్మన్ కారు డ్రైవర్ గవిడి శ్రీనివాసరావు, పిన్నింటి వివేక్, రాకేష్, రామ్స్లపై ఫిర్యాదు చేశారు.ఆ ఐదుగురు తనను సహనం కొల్పోయేలా ప్రేరేపించారని, భయపెడుతున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మరింత వివాదస్పదమైంది. హార్ట్ పేషెంట్ అని చెప్పినా.... ఫేస్బుక్లో పోస్టింగ్ వివాదాన్ని ఎదుర్కొంటున్న కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా స్టేషన్కు తీసుకొచ్చి కొట్టారని ఆరోపించాడు. తాను హార్ట్ పేషెంట్నని చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదన్నారు. ఫేస్బుక్లో తాను ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టింగ్లు పెట్టలేదని చెప్పాడు. ఐదుగురు యువకులు తనను హింసిస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... ఫేస్బుక్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టింగ్లు పెట్టినందుకు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ను ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు స్టేషన్కు తీసుకొచ్చినట్లు చె ప్పారు. ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే ఫిర్యాదు లేకపోయినా చర్యలు ఉంటాయన్నారు. ఆ పోస్టింగ్లు తానే పెట్టినట్లు అశోక్ అంగీకరించినట్లు చెప్పారు. మంగళవారం అశోక్ ఇచ్చిన ఫిర్యాదులో నేరం పట్టదగ్గ అంశాలు లేనందున విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
రేయ్.. నేను సుప్రియను మోసం చేశా!
సాక్షి, ముంబై : ‘సుప్రియా.. నీ బాయ్ ఫ్రెండ్తో జాగ్రత్త!’... ఈ పోస్టు గత వారం రోజులుగా ముంబై నగరంలో చక్కర్లు కొడుతోంది. తన గర్ల్ ఫ్రెండ్ను మోసం చేసి వేరే అమ్మాయితో అఫైర్ కొనసాగిస్తున్న ఓ వ్యక్తి బండారాన్ని బయటపెడుతూ ఓ యువతి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అంధేరీకి చెందిన ఐశ్వర్య శర్మ వారం రోజుల క్రితం ఓ పబ్కు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమె వెనకాలే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు ‘అరేయ్.. నేను సుప్రియను బోల్తా కొట్టించి.. నిధితో నిన్న రాత్రి బయటకు వెళ్లి ఎంజాయ్ చేశాను’ అని చెప్పాడు. దానికి మరో యువకుడు ‘సూపర్ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు’ అంటూ అన్నాడు. అయితే అది విన్న ఐశ్వర్య మాత్రం సుప్రియ నిన్ను కనిపెడుతుంది అంటూ ఓ పోస్ట్ చేసింది. ‘సుప్రియా. నీ ప్రియుడి పేరు అమన్. వాడు నిన్ను మోసం చేసి నిధితో కులుకుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్ప్రెండ్లలో ఎవడైనా అమన్ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్ చెప్పేయండి’ అంటూ సూచించింది. ముంబైలో మీకు తెలిసిన సుప్రియలందరికీ ఈ సందేశాన్ని షేర్ చెయ్యండంటూ ఐశ్వర్య కోరింది. అప్పటి నుంచి సేవ్ సుప్రియ పేరిట యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ సుప్రియ ఆచూకీ దొరికిందో లేదో తెలీటం లేదుగానీ.. పబ్లిసిటీ కోసమే ఐశ్వర్య ఈ పోస్టు చేసిందని అనుమానం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. ఆ సంగతి పక్కనపెడితే... 331 షేర్లతో.. 2 వేలకు పైగా రియాక్షన్లతో ప్రస్తుతానికైతే ఈ పోస్టు దూసుకుపోతుంది. -
కాస్గంజ్ అల్లర్లు.. కలెక్టర్ పోస్టుతో ప్రకంపనలు
లక్నో : కాస్గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్ ఆర్ విక్రమ్ సింగ్ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. పోస్ట్ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్వీ సింగ్) చేసిన పోస్ట్ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు. విక్రమ్ సింగ్ అధికారిక ఫేస్ బుక్లోని కొంత భాగం స్క్రీన్ షాట్ ఇక విమర్శలపై సింగ్ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్గంజ్ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్ చెప్పారు. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్..
హైదరాబాద్ : దేవుళ్లను కించపరుస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు చేస్తుండటంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఈ మేరకు పోస్ట్ చేసిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడిని రాచకొండ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ ..!
సాక్షి,బెంగళూరు: ‘నేను ఫ్రీ బర్డ్’ అంటూ హాయ్ బెంగళూరు వార పత్రిక సంపాదకుడు రవి బెళగెరె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సహచరుడు సునీల్ హెగ్గెరహళ్లిని చంపడానికి సుపారీ ఇచ్చిన కేసులో బెయిల్ లభించిన ఆయన ఈనెల 21 నుంచి పోలీసుల సమక్షంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆయన శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రి వైద్యుల సూచనమేరకు ఆయన్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఆయన నేను ఇక ఫ్రీ బర్డ్ను అంటూ పోస్ట్ చేశారు. నెటిజన్లు త్వరలోనే ఈ కేసులో కూడా ఫ్రీ బర్డ్ అవుతారు అంటూ ప్రతిస్పందించారు. -
ఆంగ్ల భాష.. ఆమె పాలిట శాపం
సాక్షి, న్యూఢిల్లీ : అర్హత ఎక్కువగా ఉన్నా ఇబ్బందేనని ఇక్కడో యువతి ఉదంతం నిరూపిస్తోంది. ఇంగ్లీష్ భాషపై పట్టు ఎక్కువగా ఉండటంతో బ్రిటన్ అధికారులు ఆమెకు వీసా నిరాకరించారు. పైగా అందుకు వారు ఇచ్చిన వివరణ మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్కు చెందిన చెందిన మహిళే ఇక్కడ బాధితురాలు కావటం విశేషం. వివరాల్లోకి వెళ్లితే... మేఘాలయా.. షిల్లాంగ్కు చెందిన అలెగ్జాండ్రియా రిన్టౌల్ ఐఈఎల్టీస్ ఉత్తీర్ణత సాధించింది. యూకే వెళ్లేందుకు ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. అందుకు ఓ చిన్న నిబంధన అడ్డు వచ్చింది. యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన కేంద్రాల్లో సదరు అభ్యర్థులు ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె పరీక్షకు హాజరుకావటంతోపాటు తన ఐఈఎల్టీఎస్ సర్టిఫికెట్ను వారికి పంపారు. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురైంది. దిగ్భ్రాంతికి గురైన ఆమె అధికారులను వివరణ కోరగా.. వారు విస్మయం కలిగించే వివరాలను వెల్లడించారు. ఆమె కావాల్సిన దానికంటే అధిక అర్హత కలిగి ఉన్నారని చెబుతూ... సమర్పించిన పత్రాలపై అనుమానం ఉన్నట్లు వారు తెలిపారు. పైగా ఆమె జాతీయతకు భంగం కలిగించేలా I am NOT SATISFIED your nationality is that of a MAJORITY English speaking country సదరు అధికారి ఓ లైన్ ను ఉంచారు. ఆంగ్ల భాష తక్కువగా మాట్లాడే దేశంలో అంత అనర్గళంగా ఆమె మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని.. పైగా యూకేవీకి ఆమె పంపిన సర్టిఫికెట్ చెల్లదని బదులు పంపింది. పీవీఎస్(ప్రయారిటీ వీసా సర్వీస్)కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రింటౌల్ తన ఫేస్బుక్లో ఓ సందేశాన్ని ఉంచారు. అన్ని అర్హతలు ఉన్నా వీసా తిరస్కరణకు గురికావటం బాధించిందని.. గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా ఆమె పడుతున్న కష్టాలు అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదో తెలీట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కాట్ లాండ్ కు చెందిన బాబీ రింటౌల్ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాదు యూకేలో వారు ఓ ఇల్లును కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్లో ఉంటున్న ఆమె పెరిగిపోతున్న ఖర్చులు చూసి కంగారుపడిపోతున్నారు. దయచేసి ఎవరైనా జోక్యం చేసుకోవాలంటూ ఆమె అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫేక్ పేస్బుక్ అకౌంట్తో వేధింపులు
సాక్షి, విజయవాడ : తన పేరుతో ఫేక్ పేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఓ యువతి అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సింగ్నగర్కు చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు కర్నూలుకు చెందిన చంద్రశేఖర్తో ఆగస్టులో నిశ్చితార్థం అయ్యింది. సెప్టెంబరులో పుట్టినరోజుకు చంద్రశేఖర్ ఫోన్ కొని ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఆమెకు వేరే అబ్బాయితో లవ్ ఎఫైర్ ఉందని చంద్రశేఖర్కు తెలిసింది. అ ప్పటి నుంచి చంద్రశేఖర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో తను కొనిచ్చిన ఫోన్ ఇచ్చేయాలని కోరగా ఆమె ఫోన్ ఇచ్చేసింది. ఆ ఫోన్లోని ఫొటోలతో పేస్బుక్లో ఫేక్ అకౌంట్ను క్రియేట్ చేసి అభ్యంతరకరంగా పోస్టింగ్లు పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుమేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫెట్ మహ్మద్పై పోస్టు.. హిందూ గ్రామానికి నిప్పు
కాక్స్బజార్ : ప్రొఫెట్(మత ప్రభోధకుడు)పై సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి దుండగుల గుంపు నిప్పు అంటించింది. ఈ ఘటన శుక్రవారం బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. హిందూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెట్ మహ్మద్ను ఉద్దేశించి ఫేస్బుక్లో అభ్యంతకరంగా పోస్టు చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్గా మారింది. దీంతో ఆగ్రహించిన కొందరు గుంపుగా పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి వెళ్లి ఊళ్లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు. అప్పటికే గ్రామంలోని 30కి పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంపై ఆగ్రహించిన దాడికి పాల్పడిన గుంపులోని వ్యక్తులు రంగ్పూర్ - దినాజ్పూర్ హైవేపై రాస్తారోకోకు దిగారు. -
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
-
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
సాక్షి, సినిమా : సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిశారే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే తాను ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో చెబుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫేస్బుక్ లో ఓ వీడియోను పోస్ట్ షేర్ చేశారు. ఫాలో యువర్ హార్ట్ అంటే మనస్సుకు నచ్చిందే చేయండి అంటూ మంజుల వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ''మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. దీనంతటికి కారణం మా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ అనిపించింది.(అప్పట్లో కృష్ణ అభిమానులే ఆమెను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారనే టాక్ వినిపించింది). కానీ ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా'' అంటూ మంజుల వివరించారు. ''ఆ తరువాత నాకు నచ్చింది నేను చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నా హృదయాన్ని ఫాలో అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. గమ్యం ముఖ్యంకాదు.. ప్రయాణమే ముఖ్యం. మనసుకు నచ్చింది చేస్తే ఏదైనా సాధించొచ్చు'' అంటూ ముగించింది. ఇక సోదరికి విషెస్ చెబుతూ ఆ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. ఆలోచన అద్భుతంగా ఉందంటూ సందేశం ఉంచాడు. నటి రకుల్ ప్రీత్ కూడా ఈ వీడియోను షేర్ చేయటం విశేషం. -
ఫోర్ ఇడియట్స్.. ప్రాణాలతో చెలగాటం!
క్వీన్స్ లాండ్ : ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకు దాదాపుగా ఎవరూ సాహసించరు. కానీ, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే మూర్ఖులు కాక ఏమంటారు చెప్పండి. క్వీన్స్ లాండ్లోని పోర్ట్ డగ్లస్ మెరీనా దగ్గర రెండు వారాల క్రితం వృద్ధురాలు మొసలి బారిన పడి చనిపోయింది. ఆ సరస్సులో మొసళ్ల బారిన పడి చాలా మంది గాయపడుతున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ ఘోరం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని పట్టుకునేందుకు అక్కడక్కడా ఉచ్చులను(బోనులను) ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న నలుగురు యువకులు ఆ సరస్సులోకి దిగి సుమారు గంటకు పైగా గడిపారు. అక్కడే ఉన్న ఓ బోనులో కూర్చుని ఫోటోలు దిగారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. ఆ ఫోటోలను తమ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వారి వేషాలపై విమర్శలు గుప్పించారు. వారు ఫోటోలు దిగిన ప్రాంతానికి 4 మీటర్ల దూరంలోనే మొసలి ఇంతకు ముందు వృద్ధురాలిని చంపటం విశేషం. ఘటనపై డగ్లస్ షైర్ మేయర్ జూలీ ల్యూ స్పందిస్తూ... వారు సరదాగా చేసిన ఆ యత్నం చాలా చెండాలంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం సాహసమని వారి భావించి ఉండొచ్చు. కానీ, వారి చేసిన పని మూర్ఖపు చర్యే. వారిని వదిలే ప్రసక్తేలేదు. చర్యలు తీసుకుని తీరతాం అని అన్నారు. నిబంధనల అతిక్రమించి నీటిలో దిగి బోను దగ్గరికి వెళ్లినందుకుగానూ వారికి 15 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫోటోను ముందుగా పోస్ట్ చేసిన స్టేసీ డబ్ల్యూ క్లేటన్ అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇడియట్స్ ఆఫ్ ది సెంచరీ యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Srsly? The meat we put in these traps is bait. For crocodiles. Don’t swim in them! It’s stupid, and illegal. @qldpol @7NewsCairns pic.twitter.com/nQsUZwI3Wc — Steven Miles (@StevenJMiles) 23 October 2017 -
వివాదాస్పదం: కట్నం వల్ల ఏడు లాభాలు
సాక్షి, బెంగళూర్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశంతో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. బెంగళూర్లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ పాఠ్యాంశమంటూ ఓ వ్యాసం ఫేస్ బుక్, వాట్సాప్లలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఉంది ఏంటంటే.. వరకట్నం తీసుకోవటం వల్ల లాభాలు. బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందిన సెయింట్ జోసెఫ్ కాలేజీ పేరిట ఈ వ్యాసం విడుదల అయ్యింది. వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలను అక్కడ పాఠ్యాంశంగా వల్లె వేస్తున్నారంట. సోషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా ఈ అంశాలను బోధిస్తున్నారని చెబుతున్నారు. వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే 7 ఉపయోగాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. - ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పెళ్లి చేయవచ్చు - అందమైన అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశజూపి పెళ్లికి ఒప్పించవచ్చు - కట్నం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్లు కలిసి జీవించడానికి కొంత ఆర్థిక సాయంగా ఉంటుంది - మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది - ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారు - ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుంది - అమ్మాయికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వడం కంటే.. కట్నం ఇచ్చి పంపించేస్తేనే ఉపయోగం ఉంది ఇలా ఆయా అంశాల గురించి అందులో కూలంకశంగా పేర్కొన్నారు. అయితే ఈ పాఠ్యాంశం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న యూనివర్సిటీ అధికారులు.. ఉతన్నస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. తమ కళాశాల ఇలాంటి వాటిని ప్రోత్సహించదని సెయింట్ జోసెఫ్ కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ చెప్పగా, సోషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ బెరిన్ కూడా ఆ ఆరోపణలను ఖండించారు. 1961 నుంచి భారత దేశంలో వరకట్న నిషేధం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఇంకా అది ఓ దురాచారంగానే కొనసాగుతుండగా.. ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఈ ప్రశ్నలకే జైల్లో పెడతారా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘గంగా నదికి ప్రాణి హోదా కల్పిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ఆ నదిలో మునిగిపోయి మరణిస్తే నదిపై క్రిమినల్ కేసులు దాఖలు చేస్తారా? అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం ఒట్టి జిమ్మిక్కు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ మందిరం నిర్మాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. ఈ హామీ కూడా పాకిస్తాన్కు ముల్లాలను పంపిస్తామని చెప్పడం లాంటిదే. హజ్ యాత్ర కోసం ముస్లింలకు ఎయిర్ ఇండియాలో ఇస్తున్న సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేస్తుందా?’ ఈ మూడు ప్రశ్నల్లో.... ఓ మనిషిని 42 రోజుల పాటు జైల్లో పెట్టేంత నేరం దాగిందా? ఫేస్బుక్లో ఈ మూడు ప్రశ్నలను షేర్ చేసినందుకు ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్బాద్కు చెందిన జకీర్ అలీ త్యాగిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం తెల్సిందే. వాస్తవానికి త్యాగి కూడా తనంతట తాను ఈ ప్రశ్నలు వేయలేదు. ఇతరులు వేసిన ప్రశ్నలను షేర్ చేసినందుకే అయన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసును ఆయన హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే....‘నేను ముజాఫర్నగర్లో మా సమీప బంధువు వారిస్ ఖాన్తో ఉంటున్నాను. ఏప్రిల్ 2వ తేదీన ఏదోపనిమీద బయటకు వెళ్లిన వాడిని రాత్రి 8.45 గంటలకు ఇంటికొచ్చాను. అప్పటికే ఇంట్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఖాన్ విజ్ఞప్తిపై వారికి మంచినీళ్లు ఇచ్చాను. వారున్న గది నుంచి మరో గదిలోకి వెళుతుండగా ఓ పోలీసు వచ్చి నా చేతిని పట్టుకున్నారు. ఫేసుబుక్ పోస్టింగ్లకు సంబంధించి విచారించాలి, పోలీసు స్టేషన్కు రమ్మని పిలిచారు. విషయం ఏమిటన్ ఖాన్ ప్రశ్నించగా, చిన్న విషయమే గంటలో వదిలేస్తామని చెప్పారు. నన్ను కొత్వాలి నగర్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్నే విమర్శించేంత వాడివారా? అంటూ సివిల్ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ సెల్లో నన్ను చితక్కొట్టారు. ఆయనెవరో ఇప్పటికీ నాకు తెలియదు. ఎవరిని అడిగినా ఆయనెవరో చెప్పలేదు. పోలీసులు కూడా ఆదిత్యనాథ్ను విమర్శించినందుకే ఉన్నతాధికారులు ఆదేశం మేరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే నేను ఏం విమర్శించానో అడగలేదు, చెప్పలేదు. ఎఫ్ఐఆర్లో మాత్రం నేను షేర్ చేసిన మూడు ప్రశ్నలను మాత్రమే పొందుపర్చారు. ఆ మరుసటి రోజున కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జీ రాలేదన్న కారణంగా జైలుకు పంపించారు. వారం రోజుల తర్వాత మళ్లీ కోర్టులో హాజరుపర్చారు. ఎలాంటి విచారణ జరుగకుండానే కేసు వాయిదా పడడంతో మళ్లీ జైలుకు పంపించారు. 42 రోజుల తర్వాత మే 13వ తేదీన బెయిల్ మంజూరైంది. ఇంటికి తిరిగి వెళ్లాను. నేను షేర్ చేసిన ప్రశ్నల్లో తప్పేముందో, నాపై కేసు ఎందుకు పెట్టారో, ఎందుకు జైలుకు పంపించారో! నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అని త్యాగి ఢిల్లీలోని ‘ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియాలో’ తన గోడును జర్నలిస్టులకు వినిపించారు. దేశంలోని దళితులు, మైనారిటీల పక్షాన న్యాయం కోసం పోరాడే ‘భీమ్ ఆర్మీ డిఫెన్స్ కమిటీ’ త్యాగిని యూపీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కమిటీ త్యాగి కేసును టేకప్ చేసింది. కాలిన్ గాన్సాల్వ్స్ లాంటి ప్రముఖ న్యాయవాదులు ఈ కమిటీలో ఉన్నారు. -
మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. కానీ: రేణు
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేయడంపై రేణు వాటిని స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ వైరల్గా మారింది. 'ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగిన పెళ్లి.. ప్రధాని హర్షం!
► పెళ్లికి అడ్డంకిగా మారిన ఫేస్బుక్ పోస్ట్ సిడ్నీ: సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్ ఏకంగా తన పెళ్లినే ఆపేస్తుందని ఆ యువతి భావించలేదు. ఆమె ఫేస్బుక్ పోస్టును సాకుగా చూపిస్తూ చర్చి నిర్వాహకులు మరికాసేపట్లో జరగబోయే యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో చోటుచేసుకుంది. ఇంతకు యువతి చేసిన పోస్ట్ ఏంటంటారా.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్ధతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో షేర్ చేయడమే. విక్టోరియాలోని బల్లారట్లో ఓ చర్చిలో యువతి, తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి వచ్చింది. చర్చి పెద్దలు వారి వివరాలు కనుక్కున్నారు. మరికాసేపట్లో వివాహం జరగనుండగా స్వలింగ సంప్కర వివాహానికి (గే మ్యారేజ్) మద్ధతుగా వధువు చేసిన ఫేస్బుక్ పోస్ట్ గురించి తెలుసుకున్న మత పెద్దలు కార్యక్రమాన్ని రద్దుచేశారు. వివాహాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని తన పోస్ట్లో ఆమె పేర్కొంది. ఇలాంటి తరహా వివాహాలకు (గే, లెస్బియన్ వివాహాలు) ఇక్కడ చట్టబద్ధత లేదని చర్చి మినిస్టర్ ఎబెనజర్ సెయింట్ జాన్ వెల్లడించారు. వివాదానికి కారణమైన యువతి ఎఫ్బీ పోస్ట్పై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్ స్పందించారు. పెళ్లిని నిలిపివేస్తూ చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతించాలి. ఇంకా చెప్పాలంటే చర్చికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారు ఆ వధువు పెళ్లిని నిలిపివేశారని చెప్పారు. క్యాథలిక్ చర్చిలో అయితే రెండోపెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారి వివాహాన్ని సమ్మతించరని వెల్లడించారు. -
ఫేస్బుక్ పోస్టింగ్తో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సాక్షి, ఆసిఫాబాద్: ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గం మనోభావాలు దెబ్బతినే రీతిలో ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫేస్బుక్ పోస్టింగ్ విషయం తెలిసి ఓ వర్గం యువకులు కాగజ్నగర్లోని రాజీవ్గాంధీచౌక్ వద్ద శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. దీంతో వెంటనే రూరల్ ఎస్ఐ రాజేశ్, దహెగాం ఎస్ఐ రమేశ్లు వచ్చి యువకులను అక్కడ నుంచి పంపించేశారు. యువకులు ర్యాలీగా వెళ్తుం డగా మరో వర్గం యువకులు వీరిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్ఐ రాజేశ్ తలకు గాయాలయ్యా యి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సన్ప్రీత్సింగ్, డీఎస్పీ హబీబ్ఖాన్లు సీఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు దారి తీసిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. -
కొత్త కుబేరుడు బెజోస్ పడిపోయారు
న్యూడిల్లీ : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎదిగిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ పడిపోయారు. ప్రపంచ కుబేరుడిగా నెంబర్ 1 టైటిల్ను దక్కించుకుని, వెంటనే దాన్ని కోల్పోయారు. అమెజాన్ శుక్రవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాలు భారీగా దెబ్బకొట్టడంతో, ఆయనకి ఈ పరిస్థితి ఎదురైంది. ఫలితాల్లో కంపెనీ లాభాలు 77 శాతం మేర పడిపోవడంతో, షేర్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో బెజోస్ సంపద 6 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెజాన్లో బెజోస్కు 16 శాతం మేర అంటే 80 మిలియన్ షేర్లున్నాయి. గురువారం మార్కెట్ ప్రారంభంలో అమెజాన్ షేర్లు దూసుకుపోవడంతో బెజోస్, బిల్గేట్స్ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. కానీ నేటి ట్రేడింగ్లో షేర్లు అతలాకుతలం అవడంతో, ఆయన కూడా ఆ టైటిల్ను వదులుకోవాల్సి వచ్చింది. బెజెస్ కొన్ని గంటల్లోనే నెంబర్ 2 స్పాట్కు పడిపోవడంతో, పుణేకు చెందిన ఫెబిన్ బెంజమిన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. ఆ పోస్టుకు విపరీతమైన లైక్స్, షేర్ల వెల్లువ కొనసాగుతోంది. '' హయ్ అమెజాన్, ఒక ప్రొడక్ట్ను నేను ఆర్డర్ చేశాను. వెంటనే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా నిలిచినట్టు వార్తవచ్చింది. కొంత సమయం తర్వాత నా ఆలోచన మారి, ఆర్డర్ను క్యాన్సిల్ చేశాను. అంతే వెంటనే జెఫ్ బెజోస్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయినట్టు వార్త వచ్చింది. ఒక్కసారి చెక్ చేస్తారా? నా ఆర్డర్ క్యాన్సిలేషన్ వల్లే ఇదంతా జరిగిందని?'' అని పోస్టు చేశాడు. అంతే ఈ పోస్టుకు ఒక్కసారిగా వైరల్ అయింది. 3వేలకు పైగా షేర్లు వచ్చాయి. కానీ తాను 1000కి పైగా లైక్స్ వస్తాయని ఊహించలేదని ఫెబిన్ బెజామిన్ చెబుతున్నాడు. తన పోస్టుకు 4వేలకు పైగా కామెంట్లను తాకుతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అమెజాన్ నుంచి ఇప్పుడే తాను విండోస్ 10 కొన్నానని, ప్రస్తుతం ఇక ఎవరు ధనికవంతులవుతారో ఆ దేవుడికి తెలుసని ఫేస్బుక్ యూజర్ చెప్పాడు.