Indian economy
-
భారత్ జీడీపీ వృద్ధి: మూడీస్ అంచనా ఇదే..
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి 2025–26 సంవత్సరంలో 6.5 శాతాన్ని మించుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3%గా ఉంటుందన్నది మూడిస్ రేటింగ్స్ గత అంచనా. ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు, పన్నుల తగ్గింపుతో పెరిగే వినియోగం, వడ్డీ రేట్ల తగ్గింపు ఇవన్నీ వృద్ధికి అనుకూలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత బ్యాంకింగ్ రంగం పట్ల స్థిరమైన దృక్పథాన్ని (స్టెబుల్ అవుట్లుక్) ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిర్వహణ వాతావరణం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడగా, మోస్తరుగా క్షీణించొచ్చని తెలిపింది. అన్ సెక్యూర్డ్, సూక్ష్మ రుణాల్లో (మైక్రోఫైనాన్స్) ఒత్తిళ్లను ప్రస్తావించింది. రేట్ల త గ్గింపు నేపథ్యంలో నికర వడ్డీ మార్జిన్లపై ప్రభావం పెద్దగా ఉండదని, బ్యాంకుల లాభదాయకత పటిష్టంగా ఉంటుందని అంచనా వేసింది.2024 మధ్య నుంచి భారత వృద్ధి నిదానించగా, తిరిగి వేగాన్ని అందుకుంటుందని.. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6%కి పడిపోగా, డిసెంబర్ క్వార్టర్లో తిరిగి 6.2%కి పుంజుకోవడం గమనార్హం.2025–26లో సగటు ద్రవ్యోల్బణం 4.5%కి దిగొస్తుందని మూడీస్ పేర్కొంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ‘‘అమెరికా వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో.. ఆర్బీఐ కాస్త అప్రమత్త ధోరణిని అనుసిరించొచ్చు. దీంతో తదుపరి రేట్ల కోత మోస్తరుగా ఉండొచ్చు’’అని మూడీస్ పేర్కొంది. 2025–26లో రుణాల వృద్ధి 11–13 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. -
త్వరలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.435.17 లక్షల కోట్లు) చేరుకోవడం ఇక ఎంతోదూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, నవీన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు అత్యంత కీలకమని వివరించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై బుధవారం జరిగిన వెబినార్లో ప్రధాని మోదీ మాట్లాడారు. 2014 నుంచి తమ ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచి్చందని అన్నారు. దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని, ఐదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2015 నుంచి 2025 దాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి చెందినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. వెబినార్లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సరైన దిశలో సరైన పెట్టుబడులు ‘‘ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలను మనం అధిగమించాం. ఇండియా త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యం. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలంటే సరైన దిశలో సరైన పెట్టుబడులు పెట్టడం అత్యంత కీలకం. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశాం. వాటిని అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భాగస్వామ్యపక్షాలన్నీ ఇందులో పాలుపంచుకోవాలి. ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్గా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులకు సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడానికి, నూతన అవకాశాలు కలి్పంచడానికి ‘పీఎం ఇంటర్న్షిప్ పథకం’ ప్రవేశపెట్టాం. పరిశ్రమ వర్గాలు సైతం ఈ పథకంలో భాగస్వామిగా మారాలి. ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.గ్లోబల్ టూరిజం, వెల్నెస్ హబ్గాఇండియా పర్యాటక రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కలి్పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జీడీపీలో 10 శాతం సమకూర్చగల సత్తా పర్యాటక రంగానికి ఉంది. దేశంలో 50 ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడి హోటళ్లకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.అర్బన్ చాలెంజ్ ఫండ్కు రూ.లక్ష కోట్లు జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా కీలకం. ఇందులో భాగంగా అర్బన్ చాలెంజ్ ఫండ్కు రూ.లక్ష కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రైవేట్ రంగం.. ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ చొరవ తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం. అందుకే ఏఐ ఆధారిత విద్య, పరిశోధనల కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం. ఏఐ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
భారత్కు గడ్డుకాలం ముగిసినట్టే: డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.క్యూ3 (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.ప్రస్తుత సైకిల్లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్ డాలర్ల స్వాప్ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవైభారత్ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. -
దక్షిణాది మేల్కొనాలి!
భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు... విద్య, ఆరోగ్య రంగాల్లో గొప్ప పురోగతి సాధించాయి. పరిశ్రమలు, ఐటీ, ఎగుమతుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్న ప్పటికీ, రాను రానూ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ రాష్ట్రాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 35–40% వాటా కలిగి ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. దేశ ఐటీ ఎగుమతుల్లో 60% దక్షిణాదిదే. అంతేకాక, దేశ ఎగుమతుల్లో దక్షిణాది వాటా 45 శాతానికి పైగా ఉంది. చెన్నై, విశాఖపట్నం, తూత్తుకుడి, మంగళూరు వంటి పోర్టులు అంతర్జాతీయ వాణి జ్యానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. తమిళ నాడు ఆటోమొబైల్ రంగంలో దేశానికి హబ్గా మారింది. కర్ణాటక ఏరోస్పేస్–డిఫెన్స్ మాన్యు ఫ్యాక్చరింగ్లో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫార్మా – బయోటెక్ పరిశ్రమల్లో దేశంలోనే ముందంజలో ఉన్నాయి.తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అత్యుత్తమ వైద్య సేవలను అంది స్తున్నాయి. కేరళ సాక్షరతా రేటు 96%, తమిళనాడు 82%, తెలంగాణ 72% కాగా, దేశ సగటు దీని కంటే తక్కువ. వ్యవసాయం, సహజ వనరుల పరంగా కూడా దక్షిణాది ముందుంది. కాఫీ, కూర గాయలు, పత్తి, మిర్చి, మామిడి ఉత్పత్తిలో ఈ ప్రాంతం దేశానికి ప్రధాన ఆదాయం అందిస్తోంది.అయితే, ఈ స్థాయిలో అభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి భారీగా పన్నులు చెల్లిస్తూనే తక్కువ నిధులు పొందు తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు కేటాయించడంతో, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ మొత్తమే అందుతోంది. జనాభా ప్రాతి పదికన నిధుల పంపిణీ విధానాన్ని అనుసరించడం వల్ల ఈ అన్యాయం జరుగుతోంది. దీనికితోడు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పునర్విభజన ప్రకారం, జనాభా ప్రాతి పదికన ఉత్తరాది రాష్ట్రాలకు అధిక సీట్లు రావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చు. ఇది కేంద్ర రాజకీయ వ్యవస్థను ఉత్తరాదికి దృష్టి మళ్లించే ప్రమాదాన్ని పెంచుతోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందుండటంతో, నియో జకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వాటి స్థానాలు తగ్గిపోతూ, భౌగోళికంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడుతోంది.ఇది మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా అమలుకావడం లేదు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేరళకు ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రం అనుమతిని ఇంకా మంజూరు చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసు కోలేదు. కర్ణాటక, తమిళనాడులో కొత్త హైవే ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ, వాటి అమలుకు కేంద్రం నుంచి ఆలస్యం అవుతోంది.దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఆర్థిక నిధుల పంపిణీలో సమానత్వాన్ని కోరాలని రాష్ట్రాలు డిమాండ్ చేయాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను పునః సమీక్షించాలని డిమాండ్ చేయాలి. ఫెడరల్ ప్రెజర్ గ్రూప్ ఏర్పాటుచేసి, దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం సమన్వయ ప్రయత్నాలు చేపట్టాలి.– శ్రీనివాస్ గౌడ్ ముద్దంఫైనాన్స్ రంగంలో నిపుణులు -
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు. -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) తన ఎనిమిదవ బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా 'హల్వా వేడుక' కూడా ముగిసింది. కాగా త్వరలో సమర్పించనున్న బడ్జెట్ను రూపొందించే వ్యక్తులు ఎవరనేది, ఈ కథనంలో చూసేద్దాం.తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి)తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్ధిక, రెవెన్యూ విభాగాల్లో ఈయనకు గొప్ప అనుభవం ఉంది. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ.. ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయనదే. బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు.. పాండే ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా రాబోయే సెషన్లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)అనంత నాగేశ్వరన్ ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ఈయన ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు. అతను, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం, సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం వంటివి చేస్తుంది.మనోజ్ గోవిల్ (డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శి)మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శిగా చేరడానికి ముందు.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. రాయితీల హేతుబద్ధీకరణ మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి)అజయ్ సేథ్.. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన తుది బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆర్ధిక వనరులను నిర్వహించడం, వ్యయాల నియంత్రణ అంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి.ఇదీ చదవండి: అరుణాచల్ ప్రదేశ్పై ప్రశ్న.. ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్ఎం నాగరాజు (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)నాగరాజు 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చేరడానికి ముందు.. ప్రైవేట్ వాణిజ్య మైనింగ్ రంగంలో ఉన్నారు. ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గనులను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన బృందం డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్టెక్ల నియంత్రణ, బీమా కవరేజిలను పెంచడం వంటివి చూస్తుంది.అరుణిష్ చావ్లా (డీఐపీఏఎం & డీపీఈ సెక్రటరీ)అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు. చావ్లా ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ, డిజ్ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా.. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు తయారు చేశారు. -
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 6.6 శాతం
భారత ఆర్థిక వ్యవస్థపై (Indian economy) ఐక్యరాజ్యసమితి ఆశావహ దృక్పథాన్ని ప్రకటించింది. 2025లో భారత్ జీడీపీ (GDP) 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.మౌలికరంగ వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2025’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను (UN report) విడుదల చేసింది. భారత్ జీడీపీ 2024లో 6.8 శాతం వృద్ధి చెందగా, 2025లో 6.6 శాతం, 2026లో 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది.సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రకాల వస్తు ఎగుమతుల్లో బలమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని తెలిపింది. 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉండడం 2025లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొంది. భారత్లో భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, ఫిజికల్, డిజిటల్ అనుసంధానత, సోషల్ ఇన్ఫ్రాపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు 2025లోనూ బలంగా కొనసాగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం దిగొస్తుంది.. భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.8 శాతం ఉండగా, 2025లో 4.3 శాతానికి దిగొస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. మధ్యకాలానికి ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి అయిన 2–6 శాతం మధ్యే ఉంటుందని పేర్కొంది. భారత్లో ఉపాధి మార్కెట్ 2024 వ్యాప్తంగా బలంగా ఉన్నట్టు, కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.పట్టణ ప్రాంత నిరుద్యోగం 2023లో 6.7 శాతంగా ఉంటే, 2024లో 6.6 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడినట్టు తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.8 శాతం, 2026లో 2.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2023, 2024లో 2.8 శాతంగా ఉండడం గమనార్హం. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
6.8 శాతం వరకూ భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది. ఎకానమీ పటిష్టమే.. 2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది. → గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. → 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. → భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది. → భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి. → సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. → భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.ప్రధాన ఆర్థిక సలహాదారుగా..1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.ఆర్బీఐ గవర్నర్గా..1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?ఆర్థిక మంత్రిగా..1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం. -
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించడమే భారత్ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అధీకృత ఆర్థిక ఆపరేటర్ల (ఏఈవోలు) భాగస్వామ్య విస్తరణ, సమగ్ర స్వేచ్ఛా ఆర్థిక కేంద్రాలు, వినూత్నమైన విధానాలను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు.‘సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ అనుసంధానతతో నూతన బెంచ్మార్క్లను (ప్రమాణాలు) ఏర్పాటు చేయాలనే భారత్ లక్ష్యం’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఈవోల సదస్సులో భాగంగా మల్హోత్రా తెలిపారు. టెక్నాలజీ, విశ్వాసం రెవెన్యూ విభాగానికి రెండు స్తంభాలుగా పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్వహణలో భారత్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పీళ్లు, రిఫండ్లు, చెల్లింపులు తదితర సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!‘బిలియన్ల కొద్దీ బిల్లులను ఏటా జారీ చేస్తుంటాం. టెక్నాలజీ సాయం లేకుండా ఈ స్థాయిలో నిర్వహణ సాధ్యం కాదు. భారత్ అన్ని పోర్టులను ఆటోమేట్ చేయాలనుకుంటోంది. 20 ప్రధాన పోర్టుల్లో 17 పోర్టులు ఇప్పటికే ఆటోమేట్గా మారాయి. పోర్టుల్లో అన్ని సేవలను, అన్ని సమయాల్లో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
జీడీపీ.. జోరుకు బ్రేక్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో వృద్ధి మందగమనం నెలకొంది. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతానికి (2023 ఇదే కాలంలో పోల్చి) పరిమితమైంది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఇంతక్రితం 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం) భారత్ ఎకానమీ 4.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సమీక్షా కాలంలో తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించినట్లు శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా వెల్లడించింది. 5.4 శాతం వృద్ధి రేటు ఎలా అంటే.. 2023–24 రెండవ త్రైమాసికంలో (2011–12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా) ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ, స్థిర ధరల వల్ల వాస్తవ జీడీపీ విలువ రూ.41.86 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలం (2024 జూలై–సెపె్టంబర్) ఈ విలువ రూ.44.10 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదయ్యింది. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని ప్రస్తుత ధరల వద్ద ఇదే కాలంలో జీడీపీ విలువ రూ.70.90 లక్షల కోట్ల నుంచి రూ.76.60 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు 8 శాతం. ఆరు నెలల్లో వృద్ధి 6 శాతం ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ద్రవ్యోల్బణం సర్దుబాటుతో స్థిర ధరల వద్ద గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ విలువ 82.77 లక్షల కోట్లుగా ఉంటే, తాజాగా 87.74 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 6%గా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, విలువ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి వృద్ధి రేటు 8.9%.కీలక రంగాలు ఇలా... → తయారీ రంగంలో వృద్ధి రేటు 14.3 శాతం (2023 క్యూ2) నుంచి 2.2 శాతానికి పడిపోయింది. → వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది. → మైనింగ్ అండ్ క్వారీయింగ్ విభాగంలో 11.1 శాతం వృద్ధి రేటు 0.01 శాతానికి క్షీణబాట పట్టింది. → ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సరీ్వసుల విభాగంలో వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది. → ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. → ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్సీఈ) వృద్ధి రేటు తాజా సమీక్షా కాలంలో 6 శాతంగా నమోదయ్యింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) ఈ విభాగం వృద్ధి రేటు 7.4%గా ఉంది.అక్టోబర్లో ‘మౌలిక’ రంగమూ నిరాశే.. ఇదిలావుండగా, ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల వృద్ధి రేటు అక్టోబర్లో 3.1 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే నెలతో పోలి్చతే (12.7 శాతం) వృద్ధి రేటు భారీగా పడిపోవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించగా, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు రంగాల్లో ఏకంగా క్షీణత నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో మాత్రం వృద్ధి రేటు పెరిగింది. కాగా, ఈ ఎనిమిది రంగాలూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 4.1 శాతం వృద్ధి సాధించగా, 2023 ఇదే కాలంలో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27%.వృద్ధి వేగంలో గ్లోబల్ ఫస్ట్.. తాజాగా గణాంకాలు వెలువడిన క్యూ2లో వృద్ధి వేగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే కొనసాగింది. భారత్ ఈ సమయంలో 5.4 శాతం వృద్ధి సాధిస్తే, రెండవ స్థానంలో ఉన్న చైనా ఇదే కాలంలో 4.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నిరుత్సాహమే, కానీ... జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు కావడం నిరుత్సాహపరిచే అంశమే. అయితే ఎకానమీలోని కొన్ని విభాగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇందులో ఉన్నాయి. ఆ అంశాలు ఎకానమీ ప్రమాదంలో లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. – వీ అనంత నాగేశ్వరన్, సీఈఏ -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్లు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
ఇదే లక్ష్యం.. జాతీయ సదస్సులో కేంద్రమంత్రి
ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్లో రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యాన్ని 341.55 మిలియన్ టన్నులుగా నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, 31 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో శివరాజ్సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరిలు రైతులు వేగంగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెరగని ప్రాంతాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాము. అలాంటి ప్రాంతాల్లోని రైతులపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుందని ఈ సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 131 రోజుల్లో రైతుల ప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్క్షాప్లు నిర్వహిస్తామని.. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. 17 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.ధాన్యం ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, రైతులకు నష్టపరిహారం అందించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ధాన్యాలకు సరైన నిల్వ సౌకర్యాలు కల్పించడం వంటి వాటితో పాటు ప్రపంచానికి భారతదేశాన్ని ఆహార కేంద్రంగా స్థాపించడం వంటివి ప్రభుత్వ లక్ష్యాలని చౌహాన్ వివరించారు. రబీ సీజన్లో ఆవాలు, శనగలు మొదలైన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఆరోపణలపై శివరాజ్సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు వచ్చే సమావేశంలో సమాధానాలు చెబుతామని వెల్లడించారు. -
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్బుక్లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
2035 నాటికి రోజుకు 12000 కార్లు రోడ్డుపైకి: ఐఈఏ
భారతదేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు వెల్లడించారు. ఈ తరుణంలో 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) పేర్కొంది. దీంతో 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.2035 నాటికి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కాబట్టి రోడ్ల విస్తరణ కూడా చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 నివేదికలో పేర్కొంది.పరిశ్రమలో ఇంధన డిమాండ్ను తీర్చడంలో బొగ్గు ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఐఈఏ వెల్లడించింది. అయితే 2070 నాటికి భారత్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇన్స్టాల్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు ఐఈఏ వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్లో కీలక మార్పుప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి వాహన వినియోగం కూడా పెరుగుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు గిరాకీ కూడా 20235 నాటికి 7.1 మిలియన్ బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంధన వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ప్రపంచ కార్ల మార్కెట్లో ఐదవ స్థానంలో ఉన్న భారత్.. ఇంధన వినియోగం, దిగుమతిలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించబడుతున్న ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. ఫ్యూయెల్ వాహనాల సంఖ్య రెండూ పెరుగుతాయని ఐఈఏ పేర్కొంది. -
భారత్ సరికొత్త రికార్డ్: ఆర్బీఐ
భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని ఆర్బీఐ పేర్కొంది.విదేశీ మార్కద్యవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు దాటడంతో.. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. రీవాల్యుయేషన్ లాభాలు, స్పాట్ మార్కెట్ డాలర్ కొనుగోళ్ల కారణంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 10.46 బిలియన్లు పెరిగాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవిరల్ జైన్గత వారం (సెప్టెంబర్ 20) విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 20న బంగారం నిల్వలు కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్రోల్మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..వియత్నాం, బంగ్లాదేశ్లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు. -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823 -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
లావోస్లోని వియంటైన్లో జరిగిన 12వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' దక్షిణ కొరియా.. మయన్మార్ దేశాల సహచరులతో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచడానికి పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.కొరియా వాణిజ్య, పరిశ్రమల, ఇంధన మంత్రి 'ఇంక్యో చియోంగ్'తో చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. ఫోటోలను కూడా షేర్ చేశారు. భారత్ - కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు జరిపినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!భారతదేశంలో దక్షిణ కొరియా పెట్టుబడులు ఉపాధి.. పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ కొరియాతో మాత్రమే కాకుండా.. మయన్మార్ విదేశీ ఆర్థిక సంబంధాల మంత్రి డాక్టర్ 'కాన్ జా'తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలను గురించి పీయూష్ గోయల్ చర్చించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగిన చర్చలు దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయని పలువురు భావిస్తున్నారు.Held productive talks with Mr. Inkyo Cheong, Minister of Trade, Industry and Energy, Republic of Korea. 🇮🇳🤝🇰🇷Deliberations were held on achieving more balanced trade, upgrading the India-Korea Comprehensive Economic Partnership Agreement (CEPA), promoting investments linked to… pic.twitter.com/5mgXtK6rSI— Piyush Goyal (@PiyushGoyal) September 21, 2024 -
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
మనం సాధించిందీ తక్కువేమీ కాదు!
భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. వికసిత్ భారత్–2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథం ఉండటమే కాదు, దాన్ని తు.చ. అనుసరించడం అవసరం. వికసిత్ భారత్ అనేది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన వంటి వివిధ అంశాల ఆధారంగా ఉంటుంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించు కోవడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ కలలను మనం ఎంతవరకు సాధించాము? భారతదేశం తన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందా? ఇవన్నీ ఈ సందర్భంగా చర్చ నీయాంశాలే.మన దేశం 3.937 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం 2023–24లో తలసరి ఆదాయం రూ. 2.12 లక్షలు. కానీ ఇప్పటికీ మనం 5 శాతం పేదరికంతో బాధపడుతున్నాము. 2023 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం (సీఎంఐఈ) ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగం రేటు 2024 మేలో 7 శాతం ఉంటే ఆ మరుసటి నెల (జూన్)లో 9.2 శాతానికి పెరిగింది. ఒక శాతం జనాభా సంపద వాటా 2022–23లో 40.1 శాతంగా ఉంది. 2023–24లో దేశంలోని పొదుపులో 92 శాతం సంపన్నులైన 20 శాతం మంది కలిగి ఉన్నారు.వీటితో పాటు 2023లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నే షనల్ యొక్క ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం 100కి 40 శాతం అవినీతి భారంతో భారతదేశం ఉంది. భారతదేశం 2023 నాటికి తన స్థూల దేశీ యోత్పత్తిలో దాదాపు 3–4 శాతం విద్యపై ఖర్చు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై 1.2–1.5 శాతం ఖర్చు చేస్తోంది. మానవాభివృద్ధి–సంబంధిత అంశాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6–8 శాతంగా అంచనా వేయబడింది. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. సరళీకరణ ఆర్థిక వ్యవస్థలో ‘రెడ్ టేపిజం’ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగా లలో కనిపిస్తుంది. అయితే ఇది వ్యాపారం, రాజకీ యాలు, క్రీడలు, వినోద రంగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వర కట్నం, ఆడ శిశుహత్య, లింగ అసమానత్వం, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచా రాలతో కునారిల్లుతున్నాం.మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో; మొబైల్ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ ర్యాంక్ కలిగి ఉంది. బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ మరియు స్పేస్లో 5వ స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది, 14వ అతిపెద్ద ఎగుమతిదారు మన దేశం. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐటీ పరిశ్రమ పోటీ తత్వంలో18వ ర్యాంక్, హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్లో 30వ ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానాన్ని భారత్ నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఫిన్టెక్, పునరు త్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్ లావా దేవీలు ఉన్నాయి.సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి మరియు విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన ప్లాట్ఫారమ్లు, చట్టాల గురించి తెలుసుకోవాలి. పౌరుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం లభిస్తాయి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని సాధించగలుగుతాం.డా‘‘ పి ఎస్. చారి వ్యాసకర్త మేనేజ్మెంట్ స్టడీస్లో ఆచార్యులుమొబైల్ : 83090 82823 -
ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్షలు తీవ్రంగా మండిపడిపడుతున్నాయి. అదానీ గ్రూప్లో ఆమె పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరత, ద్వేషం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ‘‘మూడోసారి (2024 లోక్సభ ఎన్నికలు) కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పార్టీ, టూల్కిట్ గ్యాంగ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో ద్వేషాన్ని పెంచాలని భావిస్తోంది. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం మేము పట్ల గర్వపడుతున్నాం. చిన్నమొత్తాల పెట్టుబడిదారులకు సల్యూట్ చేస్తున్నా. పెట్టుబడిదారులకు టూల్కిట్, హిండెన్బర్గ్ నివేదికలపై నమ్మకం లేదు’’ అని అన్నారు. -
భారత్ వృద్ధి చెందాలంటే?.. రంగరాజన్ సూచన
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని పలువురు ఆర్థిక వేత్తలు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ 'రంగరాజన్' కీలక వ్యాఖ్యలు చేయారు.ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 14వ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ.. ఉద్యోగాలు లేకుండా సాధించే వృద్ధి వ్యర్థం. కాబట్టి పెట్టుబడి రేటును పెంచడం, వ్యవసాయం, తయారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం.. ఉపాధికి అనుకూలమైన రంగాలను ప్రోత్సహించడం ద్వారా వృద్ధిని సాధ్యమవుతుందని అన్నారు.ఏదైనా దిగుమతి ఖరీదైనదైతే దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవాలి. ఇది దేశానికి మంచిదని రంగరాజన్ అన్నారు. భారత్ ద్రవ్యోల్బణం.. రూపాయి - డాలర్ రేటు వంటి సమస్యతో సతమతమవుతోంది. అలాగే 6-7 శాతం వృద్ధి సాధిస్తే.. 2024 చివరి నాటికి 13000 డాలర్ల స్థాయికి చేరుకోవడం సులభమవుతుంది.ఉద్యోగాల కల్పన అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన సవాలుగా మారనుంది. భారతదేశం సాధించిన దాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. నాణ్యత, ప్రభావ పరంగా ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య సంస్కరణ అంటే యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు -
మినీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న సవాళ్లు ఇవే..
Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్తోపాటు నేడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావంభారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.నైపుణ్యం, విద్య, వైద్యంస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది. -
నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు: చైనాతో పోటీ పడాలంటే..
కేంద్ర బడ్జెట్కు ముందు.. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్లో లోక్సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ రచించిన మరాఠీ పుస్తకం "మేడ్ ఇన్ చైనా" ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశానికి అనువైన ఆర్థిక విధానాలు అవసరమని అన్నారు. ఉద్యోగాల సృష్టిని పెంచడానికి, అసమానతలను తగ్గించగల సామాజిక ఆర్థిక నమూనా అవసరమని పేరొన్నారు.చైనాలో పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. కోవిడ్ 19 తర్వాత చాలా దేశాలు చైనాతో వ్యాపారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని గడ్కరీ అన్నారు. చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. చైనా నుంచి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే? సోషలిస్ట్, కమ్యూనిస్ట్ లేదా పెట్టుబడిదారీగా మారడానికి ముందు.. మనం ఉపాధిని సృష్టించగల ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన అన్నారు.ఉపాధిని సృష్టించి పేదరికాన్ని తొలగించగల సామాజిక ఆర్థిక నమూనా భారతదేశానికి అవసరమని ఆయన అన్నారు. ఒకసారి చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. చైనీయులు తమ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ప్రజల భావజాలం ఎలా ఉన్నప్పటికీ దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనతో చెప్పారని అన్నారు.పేదరికాన్ని తొలగించడానికి, మూలధన పెట్టుబడులను ఆకర్షించడానికి.. దాని నుంచి ఉపాధిని సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి మన ఆర్థిక విధానాలలో సౌలభ్యాన్ని తీసుకురావాలి గడ్కరీ అన్నారు. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.గ్రామీణ, గిరిజన వర్గాల జనాభా పేదలుగా, ఉపాధి లేకుండా ఉంటే తలసరి ఆదాయం తగ్గుతుంది. ఇలా జరిగితే 'ఆత్మనిర్భర్ భారత్' సాధ్యం కాదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. చైనా సాంకేతికతలో చాలా ముందుంది, దానితో పోటీ పడాలంటే భారతదేశం నాణ్యమైన తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. పొరుగు దేశంతో పోటీపడే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. మెర్సిడెస్ ఛైర్మన్ ఇటీవల పూణేలో తనను కలుసుకున్నట్లు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని తమ సంస్థ యోచిస్తున్నట్లు చెప్పారని గడ్కరీ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ ఆటోమొబైల్ రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. -
వృద్ధికి వర్షపాతం, ప్రపంచ సానుకూలతల దన్ను
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో నిర్మలా సీతారామన్ -
అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'భారత్' ఒకటి. అదే సమయంలో అత్యంత పేద దేశం కూడా.. అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024లో నిరుద్యోగిత రేటు 8.1%గా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొన్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు.భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి రావడం వల్ల భారత్కు మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితే.. దేశం మరింత వేగంగా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.భారత్ క్రమంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో చేరుతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా 2047 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.ఇక అసలు సమస్య ఏమిటంటే.. 2047-2050 నాటికి దేశంలో వృద్ధాప్యం పెరుగుతుంది. అప్పటికి భారతీయులంతా ధనవంతులు కాగలరా? అని రాజన్ అన్నారు. ప్రస్తుత జనాభా డివిడెండ్ శాశ్వతంగా ఉండదని, జనాభా వయస్సు పెరిగే కొద్దీ.. వర్క్ఫోర్స్లో సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు.Can India lift itself from the doldrums of a jobs crisis? Can the country grow rich before it grows old?My conversation with Raghuram Rajan, former head of India’s central bank and coauthor of “Breaking the Mold: India’s Untraveled Path to Prosperity” pic.twitter.com/hPz75GRE16— Fareed Zakaria (@FareedZakaria) May 19, 2024 -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
అతివకు అందలం!
ముంబై: దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పొచ్చు. ఇండియాలో 140 కోట్లకుపైగా జనాభా ఉండగా, వీరిలో 69.2 కోట్ల మంది మహిళామణులే. వీరిలో దాదాపు 37 శాతం మంది ఉద్యోగాలు, క్రియాశీలక పనుల్లో కొనసాగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ‘కెరీర్నెట్స్’ అనే సంస్థ ‘ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతులు’ పేరిట తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పుణే, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో శ్రామికశక్తిలో అతివల ప్రాతినిధ్యం 2 నుంచి 5 శాతం పెరిగినట్లు తెలియజేసింది. జూనియర్ ప్రొఫెషన్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో వారి భాగస్వామ్యం పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► 2023లో కాలేజీల నుంచి వచ్చి కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ► ఒకటి నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న మహిళలకు కొత్తగా జరుగుతున్న నియామకాల్లో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ► దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో మహిళల నియామకం పెరిగింది. ఢిల్లీలో మాత్రం తగ్గిపోయింది. ► ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్లో 34 శాతం, పుణేలో 33 శాతం, చెన్నైలో 29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఇది కేవలం 20 శాతంగా ఉంది. -
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భావం ఖాయం
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, అదనపు సంస్కరణలు, మెరుగైన సాంకేతికతను అవలంభించడం వంటి చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తుందని భారత్ కార్పొరేట్ విశ్వసిస్తోంది. ఈ దన్నుతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన సీఎక్స్వో సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేస్తుందని వ్యాపార ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదవుతుందని 50 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎకానమీపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ►అధిక రేటును అంచనా వేస్తున్న పారిశ్రామిక రంగాలలో ఆటోమోటివ్ (50 శాతం), వినియోగం, రిటైల్ (66 శాతం), సాంకేతికత, మీడియా, టెలికమ్యూనికేషన్ (47 శాతం) శక్తి, సంబంధిత వనరులు (44 శాతం) ఉన్నాయి. ►ప్రభుత్వ కార్యక్రమాలు, పెరిగిన వాణిజ్య భాగస్వామ్యాలు, లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపు, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే విధానాలు (తయారీలో తెలివైన ఆటోమేషన్, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల వైపు పెట్టుబడిని పెంచడం వంటివి) వృద్ధి ఊపును మరింత పెంచుతాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మారడం, బలమైన డిమాండ్, పట్టణీకరణ వృద్ధికి దోహదపడే ఇతర అంశాలు. ►ఆవిష్కరణలు, పరిశోధనలకు గ్లోబల్ హబ్గా భారతదేశం తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉత్పాదక రంగం, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నందున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నుండి సమగ్రమైన, దీర్ఘకాలిక పాలసీ ఫ్రేమ్వర్క్ను పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. ►స్థానిక కంపెనీలకు పరిశోధనా, అభివృద్ధి రంగాల్లో మద్దతు అవసరమని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. 57 శాతం మంది పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మేధో సంపత్తి హక్కుల ఫ్రేమ్వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటువంటి వ్యూహాత్మక చర్యలు భారతదేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. హై–టెక్నాలజీ తయారీ రంగాలలో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధునిక వ్యాపారానికి ఆధారం అయ్యిందని, వృద్ధికి అసాధారణ అవకాశాలను అందిస్తోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. దాదాపు 99 శాతం మంది ఏఐ మరింత పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 70 శాతం వినియోగ, రిటైల్ వ్యాపారాలు ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. డేటా అంశాల్లో నైతిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెబుతున్నారు. ►4.0 సాంకేతికతలను (ఏఐ, ఎంఎల్, ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్) అమలు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు, దానితో పాటు మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో నిరంతర ప్రయత్నాలతో పాటు, ముఖ్యంగా టైర్–2, 3 నగరాల్లో మానవ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ►భారతదేశ వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన వ్యాపార విస్తరణకు, దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను ఖచ్చితత్వం అవసరమని 80 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ►భౌగోళిక ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో భాగంగా, జీ 20 దేశాలు సమన్వయంతో పనిచేయాలని, సరఫరాల చైన్ను క్రమబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు ఉద్ఘాటించారు. ►పునరుత్పాదక శక్తి ప్రాముఖ్యతను 100 శాతం మంది ఉద్ఘాటించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, పర్యావరణ– సామాజిక–కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ)వ్యూహాలు, కార్యక్రమాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్పొరేట్ భావిస్తోంది. డిజిటలైజేషన్ సాధికారతకు ప్రాధాన్యత సవాళ్లు, అవకాశాలకు సంబంధించి సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలను మేము పరిశీలించినప్పుడు, దేశం డిజిటలైజన్ సాధికారతను సాధించాల్సిన అవశ్యత ఎంతో ఉందన్న విషయం స్పష్టమైంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే బాటలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేయడానికి సంయుక్తగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా తగిన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము. – సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురో గతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. -
మోదీతో అట్లుంటది ముచ్చట
-
Union Minister Amit Shah: ఎకానమీలో సహకార రంగ భాగస్వామ్యం పెరగాలి
న్యూఢిల్లీ: భారత్లో గత 75 సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకార రంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. దక్షిణ ఢిల్లీలోని నౌరోజీ నగర్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్బీసీసీ అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర సహకార మంత్రి షా ప్రసంగించారు. 175 కోట్లతో ఈ కొత్త కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు షా తెలిపారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30 నెలల్లో 60 పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ జూలై 2021లో ఏర్పాటయినట్లు వివరించారు. 21వ శతాబ్దంలోకి పురోగమనం స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి సహకార సంఘాల విజయగాథలు ఉన్నాయని, అయితే ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందలేదని షా అన్నారు. ‘‘ప్రధాని మోదీజీ లక్షిత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, సహకార సంస్థలకు పెద్ద వాటా ఉండాలని ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాము. సహకార రంగం 19వ శతాబ్దం నుండి నేరుగా 21వ శతాబ్దంలోకి పురోగమిస్తుంది’’ అని షా ఈ సందర్భంగా అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మల్టీ–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించిందని అన్నారు. అలాగే పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు), పీఏసీఎస్లను కంప్యూటరీకరించే పథకాన్ని బలోపేతం చేయడానికి నమూనా బై–లాస్ను తీసుకువచి్చందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల సంఘాల ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళ వినియోగ పీఏసీఎస్/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా తెలిపారు. ఇప్పటికే కొత్తగా 12,000 పీఏసీఎస్లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సహకార రంగంలో మరిన్ని బ్యాంకులను తెరవాల్సిన అవసరాన్ని షా ఉద్ఘాటించారు. తమను తాము బ్యాంకులుగా మార్చుకోవాలని బహుళ–రాష్ట్ర క్రెడిట్ సొసైటీలను సూచించారు. మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ 2023లో 102కి చేరిందని ఆయన పేర్కొంటూ 2020లో 10 నుంచి 10 రెట్లు పెరిగిందని వివరించారు. నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీలకు డిమాండ్ ఐఎఫ్ఎఫ్సీఓ వినూత్న ఉత్పత్తులైన నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్)లను షా ఈ సందర్భంగా ఉటంకించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. నానో యూరియా, నానో డీఏపీ పిచి కారీ చేసేందుకు పీఏసీఎస్లు రైతులకు డ్రోన్ లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఇటీవల షా ఆవిష్కరించిన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఉన్న త స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద 2022 జనవరి 25న ఎన్సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్క్లేవ్లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా భారత్
ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అత్యధిక జీడీపీ కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరిందని కొనియాడారు. వచ్చే అయిదేళ్ళలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులు అన్న అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోందని అన్నారు. గత ఏడాది దేశ జీడీపీ భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయిందని గుర్తు చేశారు. పన్నుల వసూళ్ళలో గణనీయమైన వృద్ధి పన్నుల వసూళ్ళలో నానాటికి సాధిస్తున్న గణనీయమైన వృద్ధి భారత్ ఆర్థిక పురోగతికి ఇంధనంలా మారింది. పదేళ్ళలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 160 శాతం పెరిగాయి. 2013-14 మధ్య 6.4 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2022-23 నాటికి 16.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పన్నుల వసూళ్ళు 18 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళు 13.3 లక్షల కోట్లు. అంటే సగటున 1.66 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్ళు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. పన్నులు పెద్దగా పెంచకుండానే ఇంత భారీగా పన్నులు వసూళ్ళు జరగడం వెనుక ప్రభుత్వ సామర్ధ్యం, పనితీరు స్పష్టం అవుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రదేశాలను అధిగమించి భారత్ దూసుకుపోతోంది. 2022లో దేశంలో 89 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అనుసరిస్తున్న అన్ని దేశాలను కలుపుకున్నా భారత్లో జరిగినన్ని డిజిటల్ లావాదేవీలు జరగలేదు. అంటే ప్రపంచ దేశాలలో జరిగిన రియల్ టైం పేమెంట్లలో సగానికి పైగా భారత్లోనే జరిగాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పడిపోతున్న రూపాయి మారకం విలువ దేశ ఆర్థిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా అంతే వేగంగా పడిపోవడం పట్ల విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో ఆసియా కరెన్సీలోకెల్లా మారకం విలువలో తీవ్ర ఒడిదుకులకు లోనైన కరెన్సీ రూపాయి. మొదటిసారిగా డాలర్తో రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటేసింది. ప్రస్తుతం ఒక డాలర్కు రూపాయి విలువ 83 రూపాయల 40 పైసలకు చేరిందని అన్నారు. గడిచిన అయిదేళ్ళుగా రూపాయి మారకం విలువ ఇలా క్షీణిస్తూనే ఉంది. ముడి సరుకులు, ఆయిల్ దిగుమతులపై భారత్ భారీగా ఆధారపడినందున దీని ప్రభావం దేశంలోని ఉత్పాదక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. రూపాయి మారక విలువ క్షీణత ప్రభావంతో ఉత్పాదక రంగం తీవ్ర ఒడిదుకులను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రూపాయి మారక విలువ క్షీణతతో ద్రవ్యోల్బణం 15 బేసిస్ పాయింట్లు పెరిగి సామాన్యుడిపై మరింత భారం పడింది. విదేశి మదుపుదార్లు భారత మార్కెట్ల నుంచి 18 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యంలో భారత మార్కెట్ల నుంచి విదేశి మదుపుదార్లు వెనక్కి తీసున్న మొత్తం 12 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే రూపాయి మారక విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం చూపగలదో ఇంతకంటే ఉదాహరణ లేదని ఆయన అన్నారు. ఆదాయం, సంపద మధ్య పెరుగుతున్న అగాధం దేశంలోని 60 శాతం సంపద దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉందన్నది కఠోర వాస్తవం. జనాభాలో 50 శాతం ప్రజల చేతుల్లో ఉన్న సంపద కేవలం 6 శాతం మాత్రమే. 2014 నుంచి తలసరి ఆదాయం రెట్టింపు అయి ఒక లక్షా 97 వేల రూపాయలకు చేరినప్పటికీ 197 దేశాల తలసరి ఆదాయంతో పోలిస్తే భారత్ 142వ స్థానంలో ఉండటం పట్ల విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ వాణిజ్య లోటు గత అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. చైనాతో వాణిజ్య లోటు నానాటికీ విస్తరిస్తూ ఆందోళకర స్థాయికి చేరుకుంది. 2022లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి అది 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని వైఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. -
4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్?, కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు!
ఇటీవల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఎక్స్’ వేదికగా పలువురు ప్రముఖులు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఫోర్బ్స్ ఇండియా భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. దేశ రాజధాని. ఇవన్నీ కలిపి భారత్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని దేశంగా నిలబెడుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత (2023లో) జీడీపీ 3.75 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తేలింది. జీడీపీని బట్టే దేశాభివృద్ది ఎలా ఉందనే విషయాన్ని గుర్తించవచ్చు. ఇంతకీ జీడీపీ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. ‘జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిద’ని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి పనితీరును, ఆయా పాఠ్యాంశాల్లో సదరు విద్యార్థి బలాబలాలను మార్కుల జాబితా ఎలా చెబుతుందో.. దేశ ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, అందులో వివిధ రంగాలు, అంశాల బలాబలాలను జీడీపీ ప్రతిఫలిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. మందగమనం ఉన్నట్లు జీడీపీ గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడచిన సంవత్సరంతో పోలిస్తే దేశంలో తగినన్ని సరకులు, సేవలు ఉత్పత్తి కావటం లేదని అర్ధం. తలసరి జీడీజీ విషయానికొస్తే ఇది దేశంలోని ప్రతి వ్యక్తికి సగటు ఆర్థిక ఉత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి (GDP)ని సూచించే కొలత. ఇది ఒక దేశ మొత్తం జీడీపీని దాని జనాభాతో గుణించడం ద్వారా అంచనా వేయొచ్చు.ఈ రెండు పారామీటర్స్ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంత జనాభా ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా కేంద్ర సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జీడీపీ డేటాను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మన దేశంలోని అత్యంత ధనిక,పేద రాష్ట్రాలను గుర్తింవచ్చు. -
వరల్డ్ కప్ ఫైనల్, దేశంలో బిజినెస్ అప్ & డౌన్
ప్రపంచకప్ ఫైనల్లో అహ్మాదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం భారత్లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో యూపీఐ లావాదేవీలు డల్ మ్యాచ్ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఆర్డర్, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. అమ్మకాలలో హెచ్చుతగ్గులు ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్లు, క్రికెట్కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్లోని వివిధ ఈవెంట్లపై బెట్టింగ్పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్, లైవ్ స్ట్రీమ్లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి. రెస్టారెంట్లు, బార్లపై ప్రభావం ప్రపంచ కప్ ఫైనల్ను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లలో మ్యాచ్ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు. మ్యాచ్ ఫలితాల్ని బట్టి మీమర్స్.. మీమ్స్ క్రియేట్ చేసి వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
టోకు ద్రవ్యోల్బణం.. 7వ నెలా రివర్స్..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా ఏడవనెల అక్టోబర్లోనూ మైనస్లోనే నిలిచింది. సమీక్షా నెల్లో సూచీ మైనస్ (–)0.52 వద్ద ఉంది. సూచీలో అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో ఉండే ఈ తరహా పరిస్థితిని ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. కొన్ని కీలక ఉత్పత్తుల ధరలు పెరక్కపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వ్యవస్థలో తగిన డిమాండ్ లేని పరిస్థితితో పాటు, వార్షికంగా హైబేస్ కూడా ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది. ఇక్కడ గత ఏడాది అక్టోబర్ను చూస్తే టోకు ద్రవ్యోల్బణం 8.67 శాతం (హైబేస్తో)గా ఉంది. -
ఆర్థిక వృద్ధిలో భారత్ ఎకానమీ ట్రాక్ రికార్డ్ - ఎస్అండ్పీ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్ రికార్డు) కలిగి ఉందని రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్ డ్రాగన్స్, రోరింగ్ టైగర్స్’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్ క్రెడిట్ అవుట్లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది. ► శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు. ► ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం. -
యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలనే విషయాలను వెల్లడించారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు. ఇదీ చదవండి: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే? ప్రభుత్వంలో అవినీతి కూడా తగ్గించాలని, పని గంటలు పెంచాలని ఆలా జరగకపోతే పురోగతి సాధించిన దేశాలతో పోటీ భారత్ పోటీ పడటం సాధ్యం కాదని అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
డ్రాగన్ నుంచి షిఫ్ట్ అవ్వాలనే యోచనలో దిగ్గజ సంస్థలు.. ఎందుకంటే..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత చైనా జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కుంటుపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో తయారీ రంగంలో డ్రాగన్కు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో విదేశీ సంస్థలకు భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మూడోసారి బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో భాగంగా తన విధానాల నుంచి వెనక్కు మళ్ళేది లేదని పలుమార్లు జిన్పింగ్ కరాఖండీగా చెప్పారు. మానవ వనరులు అధికంగా ఉండటంతో ప్రపంచంలోని వేలాది కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేశాయి. 2020లో వుహాన్లో కరోనా వ్యాప్తి చెందిన తరవాత దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు స్తంభించిపోయాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టిన తరవాత ప్రపంచ దేశాల్లో వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. చైనాలో జీరో కొవిడ్ లాక్డౌన్ల వల్ల వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచానికి చైనా ఉత్పత్తి కేంద్రంగా మారింది. డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలు దానికి ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలను ముందుకు తెచ్చాయి. ఆ ప్రయత్నాల్లో భారత్, వియత్నాం, థాయ్లాండ్ ముందున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఇప్పటికే తన విధానాలను భారత్ సవరించింది. ఇండియాలో 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో వియత్నాం నుంచి భారత్కు తీవ్ర పోటీ ఉంది. భౌగోళికంగా చైనాకు వియత్నాం చాలా చేరువలో ఉంది. పెద్దగా ఖర్చు లేకుండానే కర్మాగారాలను అక్కడకు తరలించవచ్చు. అయితే, వియత్నాంలో మౌలిక వసతుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. మౌలిక వసతుల విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏటా దేశంలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. దిల్లీ-ముంబయిల మధ్య నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ రహదారి, సరకులను తరలించే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలు, దేశ తీర ప్రాంతాల్లోని ఓడరేవులు..ఇలా పలు సంస్థలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం చైనాలోని కొన్ని విభాగాలను భారత్కు తరలించాలని యోచిస్తోంది. 2025 కల్లా 25శాతం ఐఫోన్ ఉత్పత్తులను భారత్లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తుంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వారికి అందించాలన్న చట్టంపై కొన్ని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మానవవనరుల పరంగా ఇప్పటికే భారత్ చైనాను దాటేసిందని సర్వేలు చెబుతున్నాయి. భారత్లోని ముఖ్యపట్టణాలతో పాటు ఇతర నగరాలను కలుపుతూ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వెరసి ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు భారత్వైపు చూసేందుకు ప్రధానకారణం అవుతుంది. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
భారత ఆర్థికవ్యవస్థను ఇంజిన్లా ముందుకు తీసుకెళుతున్న సేవారంగం
142 కోట్ల జనాభాలో 120 కోట్ల తక్కువ ఆదాయవర్గం కొనుగోలు శక్తి పెరిగితే ప్రగతి రథం పరుగులు పెడుతుంది! ప్రపంచంలో అనేక అభివృద్దిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం తరచు దర్శనమిస్తోంది. అయితే, ప్రపంచంలో అత్యధిక జనాభా, విస్తృత మార్కెట్ ఉన్న ఇండియా అంతర్జాతీయ కుదుపుల ప్రభావం పెద్దగా లేకుండా ముందుకు సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6–7 శాతం మధ్య కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను సేవారంగం రైలింజిన్లా ముందుకు వేగంగా నడిపిస్తోంది. భారత జీడీపీలో 60% వాటా కలిగి ఉన్న సేవారంగం ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. జీడీపీ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో కొనసాగడానికి సేవారంగం ప్రధాన పునాదిగా పనిచేస్తోంది. సేవారంగం పోగా మిగిలిన రెండు కీలకరంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు జీడీపీలో వరుసగా 26%, 14% వాటా కలిగి ఉన్నాయి. అనూహ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్న ఈ రెండు రంగాలు కాస్త అటూ ఇటూ అయినా పటిష్ఠమైన సేవారంగం ప్రగతితో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఆరోగ్యంతో పరుగులు తీస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక–తయారీ రంగాలు వరుసగా 4%, 5.5% వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు రంగాల అభివృద్ధి రేటు మరో ఐదు శాతం పెరిగితే దేశ జీడీపీ రేటు 8 శాతానికి పెరగడం సాధ్యమేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. జనాభాలో నంబర్ 1 అయినా– యువత నైపుణ్యం, ప్రతిభాపాటవాలు పెరగాలి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరించిన మాట నిజమే. అలాగే, ఇక్కడి జనసంఖ్యలో యువత వాటా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కాని, కళాశాలల్లో చదువులు పూర్తిచేసుకుని పట్టభద్రులుగా తిరిగొస్తున్న భారత యువతీయువకుల్లో ఉద్యోగాలు సమర్ధంగా చేసే నైపుణ్యాలు చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటి యువతకు అవసరమైనంత నైపుణ్యం సమకూర్చడానికి సర్కారు 2015 జులై 15న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ (ఎనెస్ డీఎం) ఏర్పాటు చేసింది. మంచి శిక్షణ పొందిన, నైపుణ్యమున్న కార్మికుల కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎనెస్ డీఎం వివరిస్తూ, ‘‘ఇండియాలో ఉద్యోగంలో చేరడానికి ముందు శిక్షణ పొందిన ఉద్యోగలు లేదా కార్మికుల సంఖ్య కేవలం 2.3% మాత్రమే. అదే యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, దక్షిణ కొరియాలో 96% ఉద్యోగ శిక్షణ పొందినవారే. ఉద్యోగాలిచ్చే సంస్థల యజమానుల అవసరాలకు అనుగుణంగా, దేశ ఆర్థిక ప్రగతిని పెంచడానికి యువత ప్రతిభాపాటవాలు పెంచడానికి తగిన శిక్షణ అవసరం’ అని నొక్కిచెప్పింది. పెరుగుతున్న వస్తుసేవల వినియోగం దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధికి అనుగుణంగా వాటి వినియోగం కూడా వాంఛనీయ స్థాయిలో పెరుగుతోంది. బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ రూపొందించిన తన 2023 ఇండస్ వ్యాలీ నివేదిక ప్రకారం దేశంలో అగ్రశ్రేణి వినియోగదారులు 12 కోట్ల మంది ఉన్నారు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.10 లక్షలు. వారిలో రూ.29 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఓ చిన్న సంపన్న శ్రేణి జనాభా రెండున్నర కోట్ల మంది. ద్వితీయ శ్రేణి వినియోగదారుల జనాభా 10 కోట్లు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు. ఈ ఆదాయవర్గాన్నే మధ్య తరగతి అని పిలుస్తారు. ఇక అసలు సిసలు ఇండియాగా పరిగణించే మూడో తరగతి వినియోగదారుల సంఖ్య 120 కోట్లని అంచనా. వారి సగటు వార్షికాదాయం రూ.1.20 లక్షలు. డాలర్–రూపాయి మారకం విలువ, అమెరికాలో వస్తుసేవల ధరలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న భారతీయుడు అమెరికాలో అంతే మొత్తం ఆదాయం (డాలర్లలో 12,00) ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ సరకులు కొనుగోలు చేయగలడని బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన 22 కోట్ల జనాభా ఉన్న మొదటి, రెండో అగ్రశ్రేణి వినియోగదారుల కొనుగోలు శక్తి భారత ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడానికి దోహదం చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భావిస్తోంది. అయితే, 142 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది ఉన్న తక్కువ ఆదాయవర్గం ఆదాయం, కొనుగోలు శక్తీ కూడా అభిలషణీయ స్థాయిలో పెరిగితే భారత ప్రగతి రథం అందరూ కోరుకునే రీతిలో వేగం పుంజుకుంటుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్గార్ మేళాలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
భారత్ వృద్ధి మరింత పైకి.. డెలాయిట్ ఇండియా
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 నుంచి 6.3 శాతం వరకూ పురోగమిస్తుందని డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనమిక్ అవుట్లుక్లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి తీవ్రత తగ్గితే వచ్చే రెండేళ్లలో 7 శాతం వరకూ కూడా వృద్ధి పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? అర్బన్ డిమాండ్సహా దేశీయంగా ఆటోమొబైల్, యూపీఐ లావాదేవీలు, దేశీయ విమాన ప్రకాణాలు, ట్రాక్టర్ అమ్మకాలు, ఐఐపీ నాన్–డ్యూరబుల్ గూడ్స్, ఎంజీఎన్ఆర్ఈజీఏ గణాంకాలు.. పూర్తి సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. (ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?) -
స్థానిక వినియోగమే భారత్కు బలం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు. ‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్కు పోర్ట్ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఈ మార్కెట్పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు. -
సంస్కరణల మద్దతుతో దూసుకుపోతున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ తెలిపింది. జీఎస్టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది. ‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది. కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్క్ లు చాలా పరిమితమని అభిప్రాయపడింది. 5.7 శాతం చొప్పున ‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేషించిది. డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది. వీటిల్లో మెరుగుపడాలి భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
రూ.88 వేల కోట్లు మిస్సింగ్! అన్నీ రూ.500 నోట్లు..
భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032.5 కోట్లు గల్లంతయ్యాయి. అన్నీ రూ.500 నోట్లు. ప్రింట్ అయ్యాయి కానీ ఆర్బీఐకి చేరలేదు. ఏమయ్యాయి ఈ నోట్లన్నీ? మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి. ప్రింట్ అయినవెన్ని.. ఆర్బీఐకి చేరినవెన్ని? దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్లోని దేవాస్లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. దేశంలోని ఈ మూడు మింట్లూ కొత్తగా డిజైన్ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే. గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్లో 2015 ఏప్రిల్ - 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి. సీఈఐబీ, ఈడీలకు లేఖలు కరెన్సీ నోట్ ప్రెస్లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
రెండేళ్లలో నాలుగు... ఆరేళ్లలో మూడు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర విధానాలు 2014 నుండి దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి దారితీశాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని అన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకర్షణీయ ప్రదేశంగా రూపొందిందనీ, ప్రపంచం దేశంపై తన విశ్వాసాన్ని ఉంచుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రస్తుత నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగించాలని వైష్ణవ్ కోరారు. 2014లో మోదీ ప్రభుత్వం అదికారంలోనికి వచ్చినప్పుడు దేశ ఎకానమీ ప్రపంచంలో పదవ స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఇది 5వ స్థానానికి మెరుగుపడిన విషయం తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి కూడా అయిన వైష్ణవ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► ఆరేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రభుత్వ హయాంలో ఎకానమీ పటిష్టంగా పురోగమిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతోంది. దేశాభివృద్ధే దృఢ సంకల్పంగా పూర్తి సానుకూల వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతోంది. ► కేంద్రం చేపట్టిన పలు పథకాలు, విధానాలు ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేశాయి. వారి జీవితాలో నాణ్యతను పెంచాయి. ► దేశ ప్రజల భవిష్యత్తు నేటి భారత్లో నిర్మితమవుతోంది. 2047 నాటికి, మీరు అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తారు. మీరు పురోగతి బాటన దేశాన్ని నడిపే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వోటుచేస్తే, భారత్ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. ► ప్రధానమంత్రి నాయకత్వం కొత్త ఆలోచనా విదానాన్ని, దృక్పథాన్ని తీసుకొచ్చింది. దేశాభివృద్ధికి సానుకూలంగా ఆలోచనలను మార్చింది. ► గతంలో పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారు. 2014 నుండి ప్రభుత్వ పథకాలు ప్రజల సాధికారతకు దారితీశాయి. పరివర్తన, గుణాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక ఫలాలు అట్టడుగు స్థాయికి అందజేసేలా నిరంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చేసే ప్రతి పైసా పేదల పురోగతికి దోహదపడాలన్నది కేంద్రం లక్ష్యం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న తీరును ఆయా అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. ► వ్యాక్సిన్లను సకాలంలో పొందడం నుండి (కోవిడ్ సమయంలో), సురక్షితమైన తాగునీటిని అందించడం వరకూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సరసమైన గృహాలను అందించడం నుండి రైలు, విమాన రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వరకు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ దేశంలో వాస్తవ, సానుకూల మార్పును తీసుకువచ్చాయి. సమగ్ర పురోగతికి ఆయా చర్యలు దోహదపడుతున్నాయి. ► నేడు దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు జతయ్యాయి. 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించారు. ► భారత్ నేడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది అవసరమైన వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం తగిన సౌలభ్యత కల్పిస్తోంది. ఈ పథకం మొత్తం కవరేజీ అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ. ► ఇక దేశీయ మౌలిక సదుపాయాలు కూడా 2014 నుండి చక్కటి పురోగతి రూపాన్ని పొందాయి. గతంలో సరైన ఆలోచనా విధానం లేకపోవడం 2014కు ముందు ఈ రంగం అంతగా పురోగతి చెందలేదు. ► తొమ్మిదేళ్లలో 74 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 వరకు ఏర్పాటు చేసిన సంఖ్యకు సమానం. భారతదేశం 2014 వరకు జలమార్గాలు లేని స్థితిలో ఉండేది. ప్రస్తుతం దేశంలో ఈ సంఖ్య 111గా ఉంది. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోంది. విమానాశ్రయాల మాదిరిగానే ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వేల్లో కల్పించడం జరుగుతోంది. ► ఇక దేశంలో డిజిటల్ సాంకేతికత పురోగతి పటిష్టంగా కొనసాగుతోంది. ఇది పేదలకు కొత్త అవకాశాలను తీసుకువచ్చింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఇక్కడ గమనించాల్సిన అంశం. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్పాయింట్’ ప్రకారం, భారత్లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్లుక్ సెమినార్ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
విధాన లోపం వ్యవస్థకు శాపం
2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది. ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు. ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’. కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది. జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం. భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది. పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది. ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది. ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే. మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది. 2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
3.7 ట్రిలియన్ల ఎకానమీగా భారత్: ఆర్బీఐ
ముంబై: భారత్ 2023లో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్బీఐ ప్రచురించిన జనవరి బులిటన్ పేర్కొంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది. -
ఎకానమీ శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్లో (2021 నవంబర్తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు... కీలక రంగాల పురోగతి ► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 6.1 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► డ్యూరబుల్స్: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎఫ్ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది. ► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది. తగ్గిన ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ తగ్గడం మొత్త రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ నవంబర్లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది. కూరగాయల ధరల స్పీడ్ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటున్న ఎకానమీ
ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడగలుగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకుగాను తగిన చర్యలు తీసుకోవడానికి నియంత్రణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. 26వ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) నివేదికలో ఆయన ఈ మేరకు ముందుమాట రాశారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే.. ► అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లలో ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాల కారణంగా ఆర్థిక మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ఆహారం, ఇంధన సరఫరాలు ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశా లు, ఎకానమీలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ప్ర తి ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లతో పోరాడుతోంది. ► ఇటువంటి ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఎకానమీ స్థిర ఆర్థిక ముఖచిత్రాన్ని కలిగిఉంది. దేశీయ ఆర్థిక మార్కెట్లు స్థిరంగా, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ తగిన మూలధనంతో పటిష్టంగా ఉంది. ఫారెక్స్ నిల్వలు, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం), వాణిజ్యలోటు వంటి అంతర్జాతీయ ఆర్థిక అంశాల విషయంలో దేశానికి పూర్తి సానుకూల పరిస్థితి ఉంది. ► కొన్ని సవాళ్లను చెప్పుకోవాలంటే అందులో వాతావరణ మార్పులు–నిర్వహణ ఒకటి. అలాగే ఊహించని సవాళ్లు ఎదురయినప్పుడు వాటిని ఎదుర్కొనడం, ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టత, ఫైనాన్షియల్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడ్డం వంటి అంశాలపై మరింత దృష్టి అవసరం. రెగ్యులేటర్లు, విధాన నిర్ణేతల ప్రాధాన్యత ఆయా అంశాలపై కొనసాగుతుంది. ► ఇక ద్రవ్యోల్బణం కట్టడికి తగిన అన్ని చర్యలనూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుంది. ఈ విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► భారతీయ ఆర్థిక వ్యవస్థ తన పటిష్ట స్థూల ఆర్థిక మూలాధారాల నుండి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ప్రపంచ పరిణామాలను ఎదుర్కొనడంపై ఆర్బీఐ నిరంతరం దృష్టి సారిస్తుంది. ► రిజర్వ్ బ్యాంక్తో పాటు ఇతర ఆర్థిక నియంత్రణ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తాయి. అవసరమైనప్పుడు తగిన జోక్యాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, పటిష్టతను పరిరక్షించడానికి, సంసిద్ధతతో ఉన్నాయి. ► 2023లో భారతదేశం జీ20 దేశాల ప్రెసిడెన్సీలో భాగంగా ప్రపంచ వేదికపై ప్రముఖ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఒక సమూహంగా జీ20 దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు.. ప్రపంచ సర్వతోముఖాభివృద్ధికి తగిన నిర్ణయాలను సమిష్టిగా తీసుకోవడం. ► ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లను పరిష్కరించడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో కరెన్సీ విషయంలో అన్ని స్థాయిల్లో ఏకాభిప్రాయ సాధన చాలా ముఖ్యం. ఈ విషయంలో తగిన ప్రయ త్నాలు జరగాలి. బ్యాంకింగ్ రంగం పటిష్టం... భారత్ బ్యాంకింగ్ రంగం తగిప మూలధనంతో పటిష్టంగా ఉందని 26వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక పేర్కొంది. భారత్ బ్యాంకింగ్ స్థూల మొండిబకాయిలు (జీఎన్పీఏ) సెప్టెంబర్ 2022 నాటికి ఏడేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి తగ్గాయని తెలిపింది. నివేదిక ప్రకారం, 017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మా ర్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది. చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడ్డం, బకా యిల మాఫీ వంటి అంశాలు స్థూల మొండిబకా యిలు తగ్గడానికి కారణం. ప్రస్తుతం బ్యాంకింగ్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్య త పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నా యి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. క్యూ2లో క్యాడ్ తీవ్రత కాగా, భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) జూలై–సెప్టెంబర్ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతంగా నమోదయ్యిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల ప్రకారం, విలువలో ఇది 36.4 బిలియన్ డాలర్లు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) క్యాడ్ అప్పటి జీడీపీ విలువలో 2.2 శాతం ఉంటే, విలువలో 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) క్యూ2లో జీడీపీలో క్యాడ్ 1.3 శాతం అయితే, విలువలో 9.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్)మధ్య క్యాడ్ 3.3 శాతంకాగా (జీడీపీ)లో 2021–22 ఇదే కాలంలో కేవలం 0.2 శాతంగా ఉంది. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా పెరగడం క్యాడ్ తీవ్రతకు దారిస్తోందని గణాంకాలు వెల్లడించాయి. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ పోర్ట్ఫోలియో నిధులు క్రమంగా పెరుగుతున్నందున, క్యాడ్ను భారత్ సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్థితిలోనే ఉందని ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే సరికి భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ స్థాయి క్యాడ్తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే క్యూ2లో భారీగా క్యాడ్ నమోదుకావడం తాజా ఆందోళనకు కారణం అవుతోంది. కరోనా తీవ్రత, ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. కాగా, 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్లుక్ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
భవిష్యత్ భారత్దే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానున్న భారతదేశానిదే భవిష్యత్ అని, మరో ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన వర్చువల్ విధానంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి నైపుణ్యం కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు. నైపుణ్య విద్యను అందించడంలో సెంచూరియన్ వర్సిటీ ముందుందని ప్రశంసించారు. సెంచూరియన్ చాన్సలర్ డాక్టర్ దేవీప్రసన్న పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సేవ్లానాయక్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. సెంచూరియన్ అధ్యక్షుడు డాక్టర్ ముక్తికాంత్ మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డి.ఎన్.రావు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, ఒడిశా క్యాంపస్ వైస్ చాన్సలర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
భారత్ వృద్ధిరేటు అప్గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ► క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ► మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ► అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ► భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం ఎంఎస్ఎంఈని ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: ఆహార ప్రాసెసింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు. పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య (ఎంఎస్ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్ వేస్టేజ్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. -
CMIE: నవంబర్లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత, 2022 - 23 లో వృద్ధి 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2022–23 వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) కుదించింది. క్రితం (సెప్టెంబర్ నాటి) 7.3 శాతం అంచనాలను 7 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. అయితే దేశీయంగా పటిష్టంగా ఉన్న డిమాండ్ పరిస్థితులు ఎకానమీని అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయీస్ క్యూజియెస్ విశ్లేషించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి సెప్టెంబర్ 6.5 శాతం అంచనాను తాజాగా 6 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో సగటును 6.8 శాతంగా ఉంటుందని, 2023 మార్చి నాటికి ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.9 శాతం) 6.25 శాతానికి చేరుతుందని ఎస్అండ్పీ భావిస్తోంది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును నాలుగు దఫాల్లో 1.9 శాతం పెంచింది. దీనితో ఈ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
2022లో 6.9 శాతం.. 2023లో 5.9 శాతం!
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2022, 2023లో వరుసగా 6.9 శాతం, 5.9 శాతం వృద్ధిని సాధిస్తుందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ ఒక నివేదికలో అంచనా వేసింది. 2022 భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఇటీవలే 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన నేపథ్యంలో గోల్డ్మన్ శాక్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ► వరుసగా రెండు సంవత్సరాల భారీ ర్యాలీ కొనసాగే వీలుంది. డిసెంబర్ 2023 నాటికి బెంచ్మార్క్ నిఫ్టీ 20,500 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది 12 శాతం ధర రాబడిని సూచిస్తుంది. ► ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2022లో సగటును 6.8 శాతం, 2023లో 6.1 శాతంగా ఉండే వీలుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లక్ష్యం కన్నా ఇది అప్పటికీ ఎక్కువగానే ఉండడం గమనార్హం. ► వచ్చే డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే రుణ రేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచే వీలుంది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్ పాయింట్లు పెరిగే వీలుంది. ఈ చర్యలతో రెపో రేటు 6.75 శాతానికి చేరుతుంది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. -
40 లక్షల కోట్ల డాలర్లకు భారత్!
న్యూఢిల్లీ: స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు. పండిట్ దీనదయాళ్ ఎనర్జీ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. వినియోగం, సామాజిక–ఆర్థిక సంస్కరణల ఊతంతో 2050 నాటికి భారత్ 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదుగుతుందంటూ అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో ముకేశ్ అంబానీ తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రస్తుతం 3 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2047 కల్లా 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఉంటుంది‘ అని అంబానీ చెప్పారు. అమృత కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో పెరుగుతాయని ఆయన తెలిపారు. (2022 – 2047 మధ్య కాలాన్ని అమృత కాలంగా వ్యవహరిస్తున్నారు. 2047 నాటికి భారత్కు స్వాతంత్య్రం లభించి వందేళ్లవుతుంది. మూడు విప్లవాల ఊతం.. ‘రాబోయే దశాబ్దాల్లో భారత వృద్ధిలో మూడు విప్లవాలు కీలకపాత్ర పోషించనున్నాయి. అవేమిటంటే.. స్వచ్ఛ ఇంధన విప్లవం, జీవ ఇంధన విప్లవం, డిజిటల్ విప్లవం. పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు మొదటి రెండూ ఉపయోగపడనుండగా, ఇంధనాన్ని సమర్ధమంతంగా వినియోగించుకునేందుకు మూడోది ఉపయోగపడుతుంది. మన గ్రహాన్ని వాతావరణ సంక్షోభాల నుండి కాపాడుకోవడంలో భారత్కు, ప్రపంచానికి ఈ మూడూ తోడ్పడతాయి‘ అని అంబానీ చెప్పారు. విద్యార్థులకు విజయ సూత్రాలు.. విజయాలు సాధించాలంటే మూడు సూత్రాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని విద్యార్థులకు అంబానీ సూచించారు. ఆలోచనల స్థాయి గొప్పగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, డిజిటలీకరణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్ను అంతర్జాతీయంగా స్వచ్ఛ ఇంధన లీడరుగా తీర్చిదిద్దడంలో ఈ మూడు సూత్రాలు తోడ్పడగలవని అంబానీ చెప్పారు. పండిట్ దీన్దయాళ్ ఎనర్జీ వర్సిటీ గవర్నర్ల బోర్డుకు అంబానీ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్నారు. టాటా చంద్రశేఖరన్కు ప్రశంసలు.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టాటా గ్రూప్ చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ను ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ప్రశంసించారు. తన దార్శనికత, దృఢ విశ్వాసం, అపార అనుభవంతో చంద్రశేఖరన్ ఇటీవలి కాలంలో టాటా గ్రూప్ అద్భుత వృద్ధి సాధించేలా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. మరోవైపు, ప్రపంచమంతా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లక తప్పదని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషయంలో సారథ్యం వహించేందుకు భారత్కి తగు సామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
మందగమనంలో ఆర్థిక వ్యవస్థ
దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పలు సందర్భాలలో సంక్షోభాల వలయంలో చిక్కుకొన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితి అన్నింటికంటే దయనీయంగా ఉంది. సంక్షోభం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా సర్వవ్యాపితంగా కనిపిస్తోంది. సెంచరీ దాటిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదవుతున్నా కిందకి దిగడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 దాటింది. డాలర్తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిందంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే! దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి చాలాకాలమే అయింది. నూనెలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు పైపైకి పోతున్నాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా వల్ల మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు కొంత మెరుగయినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో దిగుమతులు పెరిగాయి. ఎగు మతులలో క్షీణత నమోదవుతోంది. ఫలితంగా కరెంట్ ఎకౌంట్ బ్యాలెన్స్లో లోటు పెరిగిపోతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇక, రూపాయి శీఘ్రంగా పతనం అవుతూ సెంచరీ కొట్టే దిశగా సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న పన్నులు, సెస్సులు అంతకంతకూ పెరిగిపోతున్నా, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ రుణాలు తీసుకొంటున్నా, బడ్జెట్ అవసరాలను తీర్చలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఆర్థికరంగం ముఖచిత్రం ఇంత ఘోరంగా తయారవుతుంటే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించకుండా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అమెరికా డాలర్ బలపడటం వంటి బయటి అంశాలే కారణమని ఎటువంటి వెరపు లేకుండా సమర్థించు కోవడం అందర్నీ నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా... సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. కానీ, వాటిని ఎదుర్కొని ప్రతికూల పరిణామాల ప్రభావం ప్రజలపై దీర్ఘకాలం పాటు పడకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలోని ఎన్డీయే తీరు ఎంత బాధ్యతారహితంగా ఉన్నదంటే.. తమ తప్పుల్ని గత పాలకుల పాపాలుగా చూపి చేతులు దులుపుకొనే ప్రయత్నమే చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 90 డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ. దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 కిందికి దిగడం లేదు. 2013లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినపుడు కూడా లీటర్ పెట్రోల్ రూ. 70 కే లభించిం దికదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించడానికి ధర పెంచాం అనే సమాధానం ఇస్తున్నారు. కశ్మీర్లో శాంతిభద్రతలు అదుపు తప్పితే.. అందుకు దేశ తొలి ప్రధాని నెహ్రూని నిందిస్తారు. ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారిందంటే, అవన్నీ తప్పుడు లెక్కలని దబాయి స్తున్నారు. రూపాయి పతనానికి వింత భాష్యం చెప్పారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డాలర్తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. ఇటీవలికాలంలో విదేశీ మారకద్రవ్య నిల్వల నుండి దాదాపు ఒక బిలియన్ డాలర్లు వెచ్చించి పటిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసినా రూపాయి బలపడలేకపోయింది. 642 బిలియన్ డాలర్ల మేర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ మారకం నిల్వలు కేవలం 9 నెలల దిగుమతులకే సరిపోతాయి. కనీసం రెండేళ్ల దిగుమ తులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉంటే... అది ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిం దంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు నిజంగానే ఇతర కరెన్సీల కంటే రూపాయి మెరుగ్గానే ఉందా? అని ప్రశ్నించు కొంటే సమాధానం దొరకదు. ఉదాహరణకు విదేశాలలో విద్యనభ్య సిస్తున్న భారతీయ విద్యార్థులు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి మొదలైన వాటికయ్యే ఖర్చును డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్రిటన్లోనే పౌండ్లలో చెల్లిస్తారు. అంటే, ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గా ఉందని చెçప్పుకొన్నప్పటికీ... చెల్లింపులన్నీ డాలర్లలో చేసేటప్పుడు అదనపు భారాన్ని ఎవరు మోస్తున్నట్లు? తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించుకోవడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేటునే పాటించాలి. కనుక రూపాయి పటిష్టంగా ఉంటే డాలర్కు 82 నుంచి 84 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నట్లు? రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ఉపసంహరించు కుంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, రుణ భారాన్ని తగ్గించుకొంటూ ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేసినప్పుడే పరిస్థితులు మెరుగ వుతాయి. విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే దిగుమతుల్ని తగ్గించాలి. ప్రస్తుతం వాణిజ్య లోటు రూ. 2,600 కోట్ల డాలర్ల మేర ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముడి చమురు, ఎరువుల దిగుమతులకు అధిక శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్న నేపథ్యంలో పర్యాటకం, పారిశ్రామిక రంగాలను ప్రోత్స హించి విదేశీ కరెన్సీ రాబడి పెరిగేలా చూడాలి. అది జరగాలంటే... దేశంలో శాంతిభద్రతలు మెరుగవ్వాలి. మౌలిక సదుపాయాలు విస్తరించాలి. దిగుమతులలో అత్యధికంగా ఉన్న నూనెగింజలు, పప్పు ధాన్యాలను దేశీయంగానే సాగు చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు. ఈ అంశంలో నీతి ఆయోగ్ వెలువరించిన విధాన పత్రం ఏమయిందో తెలియదు. కాగా, ఇటీవల బియ్యం ఎగుమతులపై భారీ సుంకం విధించడంతో వాటి ఎగుమతులు మందగించి విదేశీ మారకద్రవ్యం ఆర్జించే అవకాశాలు తగ్గాయి. రష్యాతో చమురు దిగుమతుల ఒప్పందం కుదుర్చుకొన్నాక ఆ చెల్లింపులను డాలర్లలో కాక రూపాయిల్లోనే జరపడం కొంత ఊరట నిచ్చే అంశం. మేకిన్ ఇండియా ద్వారా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసు కొంటాం అని కేంద్రం నమ్మకంగా చెప్పిన విషయం ఆచరణలో తేలిపోయింది. చైనా ఆర్థికరంగంతో పదేపదే పోల్చుకొంటున్నప్పుడు, చైనా మాదిరిగా అన్ని రంగాలకు అవసరమైన యంత్రాలు, ఇతర సాధన సంపత్తిని ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నామో సమీక్షిం చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపడంతో వేలాదిమంది రుణ యాప్ల ద్వారా అప్పులు తీసుకొని ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ రంగ బ్యాంకుల బ్రాంచీల సంఖ్యను కుదించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి పరపతి సౌకర్యం మునుపటిలా సజావుగా అందడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీన్నిబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం సంపన్న వర్గాల సేవలకే పరిమితం అవుతున్నట్లు భావించాల్సి వస్తోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. సెస్సుల ద్వారా రాష్ట్రాలకు వాటా ఇవ్వని ఆదాయం కేంద్రానికి సమకూరు తోంది. ఇదికాక, ఎల్ఐసీ వంటి పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా లభిస్తున్న నిధులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ‘పీఎం కేర్స్’కు అందుతున్న విరాళాలు... ఇవి చాలవన్నట్లు విదేశీ అప్పులు! ఈ విధంగా పెద్దఎత్తున కేంద్రానికి నిధులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో సరైన విధానం లేకపోవ డంతోపాటు, రాజకీయ వ్యూహాలపై అధిక సమయం వెచ్చిస్తూ దేశాభి వృద్ధిని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కల్లోలం తర్వాత పరిస్థితులు క్రమంగా కుదుటపడినప్పటికీ అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల లేని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లకు తక్షణం కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలి. సి.రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో అమిత్ పాల్గొని ప్రసంగించారు. అవసరమైన చోట నిధుల సద్వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే అభివృద్ధి ఫలాలు త్వరగా చేతికొస్తాయన్నారు. కేంద్రనిధులతో పాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమన్నారు. ‘ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈశాన్య రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్ఈసీ చైర్మన్ హోదాలో అమిత్ సూచించారు. అమిత్, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 8 రాష్ట్రాల సీఎంలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్యకర పోటీ అవసరం : కిషన్రెడ్డి కేంద్రం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీతోపాటు ప్రత్యేక దృష్టిసారిస్తే çపురోగతి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం 500 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది. భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ స్థానం 132 కాగా, బ్రిటన్ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్) అసమానతలు, సామాజిక (సోషల్) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం. ఇక డాలర్తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్ పారాబాయిల్డ్ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది
కోల్కతా: భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని, రికవరీ బాటలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తుండడంపై అప్రమత్త ధోరణిని ప్రకటించారు. స్వదేశీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వర్చువల్ సెమినార్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని కీలక రంగాలు.. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మంచి పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు డిమాండ్, సేవల రంగం పనితీరు అంచనాలకు మించి ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు చేస్తోందంటూ, అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉందని అంగీకరించారు. బ్యాంకింగ్ రంగం తగినన్ని నిధులతో ఉందంటూ, బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం మెరుగునకు ఐబీసీ సాయపడినట్టు చెప్పారు. -
బ్యాంకుల్లో జనం దాచుకుంది కోటీ 35 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తలసరి అప్పు గురించి విన్నాం.. తలసరి ఆదాయం గురించి తెలుసుకున్నాం.. దేశం, రాష్ట్రాల అప్పుల చర్చలూ చూశాం.. మరి మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది. సేవింగ్స్ భారీగా పెరుగుతూ.. 1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి. 2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం 2014–15 21,78,847 41,046 22,19,893 2015–16 24,92,846 43,698 25,36,544 2016–17 33,40,707 52,876 33,93,583 2017–18 35,99,341 55,896 36,55,237 2018–19 39,72,547 58,630 40,31,177 2019–20 42,85,362 65,384 43,50,746 2020–21 49,74,715 81,092 50,55,807 2021–22 55,94,034 87,284 56,81,318 2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన 2014 3,64,909 7,34,703 7,73,620 2015 4,27,722 7,19,993 7,91,137 2016 4,35,318 5,55,536 8,47,659 2017 4,47,000 8,40,158 9,45,980 2018 4,25,420 8,05,586 10,00,865 2019 5,16,651 6,19,998 9,25,059 2020 10,84,623 4,58,797 9,93,286 2021 13,02,760 7,96,325 7,47,654 (ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది) అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా.. టర్మ్ (ఫిక్స్డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి. ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్బీఐ రాష్ట్రాల వారీగా లెక్కలేమీ వెల్లడించలేదు. అయితే ఆదాయ స్థాయిని బట్టి పొదుపు ఉంటుందనే ఆర్థిక సూత్రం ప్రకారం.. తెలంగాణలో సేవింగ్స్ ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ తలసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయమూ ఎక్కువేనంటున్నారు. ఈ లెక్కన మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో సేవింగ్స్ సొమ్ము ఎక్కువే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం: ఫిచ్ అంచనా తగ్గింపు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ అంచనావేసింది. ఈ మేరకు జూన్లో వేసిన తొలి 7.8 శాతం వృద్ధి అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు లేదా 0.80 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోతపెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు తమ తాజా అంచనాలకు కారణంగా చూపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి అంచనా 7.4 శాతాన్ని తాజాగా 6.7 శాతానికి కుదిస్తున్నట్లు కూడా ఫిచ్ తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్లుక్ పేర్కొంది. కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ పేర్కొంది. తొలి అంచనాలకన్నా ఇది అరశాతం (0.5 శాతం) తక్కువ. -
వృద్ధికి వ్యవసాయం, రియల్ దన్ను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శరవేగంతో దూసుకెళుతోంది. రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. తయారీ, వ్యాపారం, ఆతిథ్య రంగాలు వెన్నంటి నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడేళ్లలో నికర రాష్ట్ర విలువ (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్– ఎన్ఎస్వీఏ) రెండింతలు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం ‘భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు 2021–22’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే.. 2014–15లో నికర రాష్ట్ర విలువ రూ. 4.56 లక్షల కోట్లుకాగా.. 2021–22 నాటికి అది రూ. 10.41 లక్షల కోట్లు దాటిందని రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దూకుడుగా రియల్ రంగం.. రంగాల వారీగా చూస్తే.. నికర రాష్ట్ర విలువలో రియల్ ఎస్టేట్ రంగం అత్యధిక విలువ (రూ.1,86,257 కోట్లు) నమోదు చేయగా.. ఆ తర్వాత వ్యవసాయ రంగం (రూ.1,81,702 కోట్లు) నిలిచింది. ఇక నికర తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) కూడా గత ఏడేళ్లలో రెండింతలకన్నా పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో నికర తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,24,104 కాగా, అది 2021–22లో రూ.2,75,443కు చేరింది. భారీగా పంటల దిగుబడితో.. ఆర్బీఐ తాజా నివేదికలో రాష్ట్రాల వారీగా పంటల దిగుబడి వివరాలను కూడా వెల్లడించింది. తెలంగాణలో వరి ఉత్పత్తి 1.20 కోట్ల టన్నులు దాటింది. 2015–16లో 30.470 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా.. 2021–22 నాటికి 123.02 లక్షల టన్నులకు పెరిగింది. ఇక ఇతర ఆహార ధాన్యాల విషయానికి వస్తే.. 2015–16లో 51.290 లక్షల టన్నులు ఉత్పత్తికాగా.. 2021–22 నాటికి కోటిన్నర టన్నులు దాటింది. ఏమిటీ ‘నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్’? సాధారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తుసేవల విలువను ‘జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ – రాష్ట్ర స్థూల ఉత్పత్తి)’ అంటారు. ఇది ఆ రాష్ట్రంలో ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మొత్తం విలువను చెబుతుంది. అయితే ఆ ఉత్పత్తి కోసం అయ్యే మూలధన వ్యయాలు, జరిగే వినియోగానికి సంబంధించిన విలువను అందులోంచి తొలగిస్తే.. దానిని ‘నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్’ అని చెప్పవచ్చు. ఉదహరణకు ఒక రాష్ట్ర జీఎస్డీపీ పది లక్షల కోట్లు, అందులో ఉత్పత్తి మూలధన వ్యయం, వినియోగం లక్షన్నర కోట్లు అనుకుంటే... ఆ రాష్ట్రంలో నికరంగా జతకూడిన విలువ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అన్నమాట. -
Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. బ్రిటన్ వెనుకబాటుకూ, భారత్ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్ 814 బిలియన్ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్ డాలర్ల లెక్కన భారత్ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్ను భారత్ దాటేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. బ్రిటన్లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్ను వెనక్కి నెట్టి, భారత్ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్ రివెంజ్’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. కరోనా, ఉక్రెయిన్లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్’ (యూహెచ్సీ) లెక్కన చూసినా భారత్ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 2016 నాటికే బ్రిటన్ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్ను మధ్య ఆదాయ దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి. -
భారత ఎకానమీ వృద్ధిపై వివేక్ దేవరాయ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న 25 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తే, దేశం 2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అదే విధంగా దేశం అప్పటికి 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయం 10,000 డాలర్లకు చేరుతుందని అన్నారు. దీనివల్ల భారత్ సమాజ స్వభావం పూర్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఒక దేశ తలసరి ఆదాయం 12,000 డాలర్లు దాటితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని ప్రపంచ బ్యాంక్ సూచిస్తోంది. రాష్ట్రాలదే కీలకపాత్ర... ప్రస్తుతం భారత్ ఎకానమీ విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద ఆరవ ఆర్థిక వ్యవస్థ హోదాను పొందుతోంది. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలని ప్రధాని మోదీ లక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ది కాంపిటేటివ్నెస్ రోడ్మ్యాప్ ఫర్ ఇండియా@100’ పేరుతో వివేక్ దేవ్రాయ్ ఈ నివేదికను విడుదల చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ ప్రొఫెసర్ మైఖేల్ ఇ పోర్టర్, క్రిస్టియన్ కెటెల్స్, అమిత్ కపూర్లతో భాగస్వామ్యంతో ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక రూపొందింది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్న ప్రధాని ఆర్థిక సలహాదారు, రాష్ట్రాలు తమ వృద్ధి రికార్డులను ఎంత ఎక్కువగా నమోదుచేస్తే అంత ఎక్కువగా భారత్ పురోగతి సాధ్యమవుతుందని నివేదిక విడుదల సందర్భంగా దేవ్రాయ్ పేర్కొన్నారు. 1947లో బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ను ’మూడో–ప్రపంచ’ దేశంగా వర్గీకరించారు. అయితే గత ఏడు దశాబ్దాలలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం రూ. 2.7 లక్షల కోట్ల నుండి రూ. 150 లక్షల కోట్లకు పెరిగింది. నివేదికకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు.. ♦ వృద్ధి, పోటీతత్వ పెంపొందడం కోసం ఒక పొందికైన వ్యూహాన్ని అనుసరించాలి. ఇందుకు దేశం పారిశ్రామిక, ప్రాంతీయ విధానాలను పునర్వ్యవస్థీకరించాలి. రంగాల వారీగా, ప్రాంతాల వారీగా వృద్ధికి విధాన రూపకల్పన జరగాలి. ♦ భారత్ ఎకానమీ ఫండమెంటల్స్, స్థూల దేశీయోత్పత్తి పరిస్థితులు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్ ఎకానమీ వేగంగా పురోగమిస్తోంది. అయితే బలహీన సామాజిక పురోగతి, పెరుగుతున్న అసమానతలు, ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాల వల్ల చాలా మంది భారతీయుల జీవన నాణ్యతలో ఆశించిన మెరుగుదలను సాధించలేకపోతున్నాం. ♦ ఉపాధిని పెంపొందించే, ఉద్యోగార్ధులకు అడ్డంకులను తగ్గించే సామాజిక విధానాలను భారతదేశం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ♦ తగిన విధంగాలేని, కాలం చెల్లిన నియంత్రణ పరమైన నిబంధనలు, వ్యవస్థాపరమైన లోటుపాట్లు భారతదేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. ♦ కార్మిక చట్టాలు పెద్ద సంస్థలపై అధిక వ్యయాల భారాలకు కారణమవుతున్నాయి. భూ చట్టాల వల్ల తరచుగా అభివృద్ధి కోసం భూమిని పొందడం కష్టతరం అవుతోంది. ఆయా అంశాల్లో కీలక సంస్కరణలు జరగాలి. ఇక జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచండంపై దృష్టి సారించాలి. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరిచింది. అయితే ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా టారిఫ్ యేతర అడ్డంకులు మరింత తగ్గాలి. ప్రపంచ మార్కెట్లకు సేవలను అందించడానికి సంబంధించి ఒక ఆకర్షణీయ స్థానం సంపాదించడానికి విధాన రూపకల్పన భారత్ ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు. -
జెండా ఊంఛా రహే హమారా!
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హాసన్. హైదరాబాద్ వాసి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆజాద్ భారత్కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లలో వారి ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆక్రమించాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్ కోడ్ పాటించారు. వారి సెల్యూల్లో ఏ వంకా లేదు. ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి? రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే. ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం. మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టార్లోని వైట్కాలర్ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్ పదవులిస్తే కోపం. నామినేటెడ్ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్ డబ్బులు ఠంచన్గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు. ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్ మారకంలోభారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్ ప్రకటనపై ట్వీట్ చేసి మోదీ సర్కార్పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై) -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు). దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఎగుమతుల విభాగం ఇలా... ► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం. ► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ. ► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల తీరిది ► క్రూడ్ దిగుమతుల విలువ జూన్లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం. మొదటి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42 బిలియన్ డాలర్లు. రెట్టింపు కరెంట్ అకౌంట్ వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
ఎకానమీ.. రివర్స్గేర్..!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది. కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది. ‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి... కాగా 2021 ఏప్రిల్తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ‘మూలధనం’ సానుకూలతలు మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం. 8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే... జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%. చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది. కట్టడిలోనే ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు. అన్ని రంగాలూ బలహీనమే... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం. తలసరి ఆదాయం వృద్ధి అంతంతే... తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది. ప్రైవేటు వినియోగం బలహీనత నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకనమిస్ట్ స్టాగ్ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే... ఇతర దేశాలతో పోల్చితే భారత్కు స్టాగ్ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం... 2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్ఫ్లేషన్ సవాళ్లు భారత్పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి -
ఎస్బీఐ ఎకనమిస్టుల అంచనా: మార్చి త్రైమాసికంలో వృద్ధి 2.7 శాతమే!
ముంబై: భారత్ ఎకానమీ 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 2.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 8.5 శాతంగా ఉంటుందని విశ్లేషించారు. మే 31వ తేదీన మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో ఎస్బీఐ ఎకనమిస్టులు తాజా నివేదికను వెలువరించారు. కాగా, చమురు ధరలు ఎక్కువ కాలం పెరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ రేట్లు పెంచుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య సన్నిహిత సమన్వయం హర్షణీయమని పేర్కొన్నారు. మహమ్మారిసవాళ్ల సమయంతోసహా ప్రతి ఆర్థిక కీలక సమయంలోనూ నెలకొంటున్న ఈ అంశం ఎకానమీకి చక్కటి సంకేతాలు పంపుతుందని విశ్లేషించారు. -
కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ మహమ్మారి వల్ల వాటిల్లిన నష్టాలను పూడ్చుకోవడానికి 12 ఏళ్లు పట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కాలంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తి నష్టం జరిగిందని అంచనా వేసింది. ‘‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతరాయాల కారణంగా ప్రపంచ, దేశీయ వృద్ధికి ఆటంకాలు అధికం అవుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతంగా ఉంటుందని ఊహిస్తే.. భారత్ 2034–35లో కోవిడ్ నష్టాలను అధిగమించగలదని అంచనా’’ అని నివేదిక వివరించింది. ఆర్బీఐలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్ బృందం ఈ రిపోర్ట్ను రూపొందించింది. ఇవి పూర్తిగా రచయితల అభిప్రాయాలేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు ► భారత్ ఎకానమీపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ► ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. ► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. ► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్స్కు వెసులుబాటు ► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. -
ఆర్ఆర్ఆర్ చిత్రంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయనాయకులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ఎకానమీతో పోల్చిన గోయల్..! 2021-22 గాను భారత ఎగుమతులు సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 418 బిలియన్ డాలర్లను తాకేశాయి. ఈ నేపథ్యంలో గోయల్ మీడియాతో నిర్వహించిన సమావేశంలో...ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు.750 కోట్ల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచిందని విన్నాను. ఆర్ఆర్ఆర్ చిత్రం లాగే ఇండియన్ ఎకానమీ కూడా రాకెట్లా దూసుకుపోతుందని పీయూష్ గోయల్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2022 మార్చిలో ఎగుమతులు ఆల్టైమ్ గరిష్ట స్థాయి 40 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు.’ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాకారంలో ఎగుమతుల టార్గెట్ ఛేదన కీలక మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త..! మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన చిత్ర యూనిట్..! ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లను దేశ ఎకానమీతో పోల్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ట్విటర్లో స్పందించింది. దేశ అభివృద్ధిలో సినిమాలు ఓ చిన్న భాగంగా నిలుస్తోండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచస్థాయిలో మరిన్ని భారతీయ సినిమాలు సత్తా చాటుతాయనే నమ్మకం ఉందని చెప్పారు. చదవండి: డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..! -
భారత్ ఎకానమీకి ఉక్రెయిన్- రష్యా యుద్ధం సవాల్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. 6 శాతం కనిష్టం–7.8 శాతం గరిష్ట స్థాయిలో జీడీపీ పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. వృద్ధి తక్కువ స్థాయికి పడే క్లిష్ట పరిస్థితులే ఉంటాయని విశ్లేషించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం భారత్తో పాటు గ్లోబల్ ఎకానమీకి తీవ్ర సవాలని పేర్కొంది. కాగా, ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) రేటు 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరగవచ్చని సర్వే అంచనా వేసింది. సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆర్బీఐ తన ఏప్రిల్ పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని, తద్వారా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతును కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ► వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వృద్ధి అంచనా 2022–23కి 3.3 శాతం. పరిశ్రమలు, సేవల రంగాల వరుసగా 5.9 శాతం, 8.5 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. ► కోవిడ్–19 మహమ్మారి నుండి ముప్పు ఇంకా పొంచి ఉండగానే, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు తీవ్ర సవాలును విసురుతోంది. ► రష్యా– ఉక్రెయిన్లు క్రూడ్సహా కీలక ఉత్పత్తులకు ప్రపంచ సరఫరాదారులుగా ఉన్నందున, అంతర్జాతీయ స్థాయిలో కమోడిటీల ధరలు తీవ్రమవుతున్నాయి. ఇది ప్రపంచానికి తీవ్ర సవాలు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు, సహజ వాయువు, ఆహారం, ఎరువులు, లోహాలతో సహా ప్రధాన ముడి పదార్థాల సరఫరాను మరింత దెబ్బతీస్తుంది. ► 2022 ప్రథమార్థంలో ప్రపంచ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. ఆ తర్వాత తగ్గుతూ మధ్యస్థానికి చేరుకోవచ్చని సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ► పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థికవేత్తల నుండి మార్చిలో స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎకనామిక్ అవుట్లుక్ సర్వేను ఫిక్కీ రూపొందించింది. 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి), 2022–23 ఆర్థిక సంవత్సరం ఒకటవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ఆర్థిక అంచనాలపై సర్వే దృష్టి పెట్టింది. -
బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!
న్యూఢిల్లీ: బిస్కెట్లు మొదలుకుని నూడుల్స్ వరకు పలు ప్యాకేజ్డ్ ఉత్పత్తుల రేట్లు మళ్లీ పెరగనున్నాయి. రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. ‘పరిశ్రమలో ధరలు 10–15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం‘ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. ప్రస్తుతం కమోడిటీల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున.. రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పడం కష్టమేనని ఆయన చెప్పారు. పామాయిల్ రేటు లీటరుకు రూ.180కి ఎగియగా.. ప్రస్తుతం రూ.150కి తగ్గింది. అటు ముడిచమురు ధరలు బ్యారెల్కి 140 డాలర్లకు పెరిగినా.. మళ్లీ 100 డాలర్ల దిగువకి వచ్చాయి. అయినా ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయని షా పేర్కొన్నారు. ఆచితూచి నిర్ణయం.. కోవిడ్ అనంతరం ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్లను భారీగా పెంచే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని షా చెప్పారు. క్రితం సారి కూడా కంపెనీలు ధరల పెంపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపై బదలాయించకుండా కొంత మేర తామే భరించినట్లు వివరించారు. ‘అందరూ దాదాపు 10–15 శాతం మేర పెంపు గురించి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ముడి వస్తువుల ధరలు అంతకుమించి పెరిగిపోయాయి‘ అని షా చెప్పారు. పార్లే విషయానికొస్తే ప్రస్తుతానికి తమ వద్ద ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇతర ఉత్పత్తుల నిల్వలు తగినంత స్థాయిలో ఉన్నాయని, నెలా రెణ్నెల్ల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోందని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుశ్ జైన్ తెలిపారు. ‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, తత్ఫలితంగా ధరల పెంపు కారణంగా వినియోగదారులు తమ పర్సులను తెరవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల భారాన్ని అధిగమించేందుకు క్రమంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం‘ అని ఆయన చెప్పారు. ఇప్పటికే పెంపు.. హెచ్యూఎల్, నెస్లే ఇప్పటికే రేట్లను పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నందువల్ల అవి ధరలను సత్వరం పెంచగలుగుతున్నాయని పేర్కొన్నాయి.‘హెచ్యూఎల్, నెస్లే వంటి వాటికి ధరలను నిర్ణయించే విషయంలో కాస్తంత ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కాఫీ, ప్యాకేజింగ్ మెటీరియల్స్ భారాన్ని అవి వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరో విడత 3–5 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అవనీష్ రాయ్ చెప్పారు. కొన్ని వర్గాల కథనాల ప్రకారం హెచ్యూఎల్, నెస్లే మొదలైన సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడం కోసం టీ, కాఫీ, నూడుల్స్ వంటి ఉత్పత్తుల రేట్లను ఇప్పటికే పెంచేశాయి. బ్రూ కాఫీ, బ్రూక్బాండ్ టీ మొదలైన వాటి రేట్లను హెచ్యూఎల్ పెంచింది. అలాగే నెస్లే ఇండియా కూడా తమ మ్యాగీ నూడుల్స్ రేటును 9–16 శాతం మేర పెంచింది. అటు పాల పౌడరు, కాఫీ పౌడర్ ధరను కూడా పెంచినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా వ్యయాలను కట్టడి చేసుకోవడం, ఆదా చేసుకోదగిన అంశాలపై కసరత్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఇంకా భారం పడుతుంటే దాన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వస్తోందని కంపెనీల వర్గాలు పేర్కొన్నాయి. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ అవుట్లుక్– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కోవిడ్–19 మహమ్మారి అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ► ఉక్రెయిన్పై యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు. ► ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి. ► డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ►2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్ పరిస్థితి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్ వేవ్ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ►ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్ బ్యాండ్ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం. ► గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము. ► 2022 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే. అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్ తన అంచనాల్లో పేర్కొంది. ►యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ బ్యారల్ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్ ఇయర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. -
కరెన్సీకి కష్టకాలం
ఉక్రెయిన్లోని యుద్ధ ప్రకంపనలు ప్రపంచమంతటినీ తాకుతున్నాయి. అక్కడి సెగ ఇక్కడి మన స్టాక్ మార్కెట్లు, మదుపరులు, ఆర్థిక విధాన నిర్ణేతలు – ఇలా ప్రతి ఒక్కరికీ తగులుతోంది. రష్యా, ఉక్రెయిన్ల పోరు దీర్ఘకాలం సాగినకొద్దీ భారత ఆర్థిక వ్యవస్థపై భారం పెరగనుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ల పతనం, ఎన్నడూ లేనట్టు డాలర్కు 77 రూపాయల స్థాయికి కరెన్సీ విలువ క్షీణించడం, పెరగనున్న చమురు ధరలు వెక్కిరిస్తున్నాయి. కోవిడ్ అనంతరం క్రమంగా కోలుకుంటోందని భావిస్తున్న దేశ ఆర్థిక రంగం రాగల రోజుల్లో ఇంకెంత ఒత్తిడికి గురవుతుందోనని ఆందోళన కలుగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం మన ఆర్థిక విధాన నిర్ణేతలకు సవాలు కానుంది. నిజానికి, రష్యాతో మనం నేరుగా జరిపే వాణిజ్యం మరీ గణనీయమేమీ కాదు. మన ఎగుమతుల్లో 1 శాతమే రష్యాకు వెళతాయి. మొత్తం దిగుమతుల్లో 2.1 శాతమే అక్కడ నుంచి వస్తాయి. అయితే, ప్రపంచ సరకుల మార్కెట్లలో రష్యాది ప్రధాన పాత్ర. కాబట్టి, అక్కడి కుదుపులన్నీ మనపై ప్రభావం చూపక మానవు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజవాయు ఎగుమతిదారు రష్యా. రెండో అతి పెద్ద చమురు ఎగుమతిదారూ ఆ దేశమే. ఆ దేశ జీడీపీలో అయిదోవంతు వీటి పుణ్యమే. ప్రపంచ చమురు దిగుమతుల్లో 12 శాతం రష్యా నుంచే వస్తాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ముడి చమురు ఫ్యూచర్లు 26 శాతం పైగా పెరిగాయి. గత డిసెంబర్లో బ్యారల్ 70 డాలర్లున్న అంతర్జాతీయ ముడి చమురు ధర ఇప్పుడు దాదాపు రెట్టింపు అయింది. కొద్దివారాల్లో 150 – 200 డాలర్లు చేరుతుందని ఓ అంచనా. పధ్నాలుగేళ్ళలో ఎన్నడూ లేనట్టు ఇలా చమురు ధర పెరిగిపోవడం ఆందోళనకరం. చమురు అవసరాల్లో 85 శాతానికి దిగుమతులపైనే ఆధారపడ్డ దేశం మనది. ఇప్పుడిక ముడిచమురు దిగుమతి ఖర్చు భారీగా పెరుగుతుంది. ప్రపంచమంతటికీ ఈ కష్టం తప్పదు. చమురు కోసం రష్యాపై ఆధారపడ్డ పాశ్చాత్య దేశాలు తటపటాయిస్తున్నాయంటే అదీ ఓ కారణం. సహజ వాయువు విషయంలో జర్మనీ అధికంగా రష్యా పైనే ఆధారపడ్డది. యూరప్ చమురు సరఫరాల్లో 40 శాతం రష్యావే. అందుకే, రకరకాల ఆర్థిక ఆంక్షల మాట వినబడుతున్నా, ఆ దేశ చమురు దిగుమతులపై మాత్రం నిషేధం విధించలేమంటూ జర్మనీ, నెదర్ల్యాండ్లు తేల్చేశాయి. కానీ, చమురు అవసరాల్లో 8 శాతానికే రష్యాపై ఆధారపడ్డ అమెరికా మాత్రం పెద్దగా పోయేదేమీ లేదు. అందుకే, ఆ దిగుమతులపైనా తాజాగా ఆంక్షల పల్లవి అందుకుంది. వెరసి, చమురుపై భిన్నాభిప్రాయాలతో పాశ్చాత్య ప్రపంచం చీలిపోయిందనిస్తోంది. ఆంక్షల మాటెలా ఉన్నా, అంతర్జాతీయ ముడి చమురు ధరలతో అనివార్యంగా షిప్ ఫ్యూయల్ ధర పెరగనుంది. నౌకా రవాణా వ్యయంలో సింహభాగం – చమురుకు అయ్యే ఖర్చే. పెరిగే ఆ ఖర్చు ప్రభావం సరకుల రవాణా మీద పడుతుంది. అంటే, సరకుల రేట్లకు రెక్కలొస్తాయి. ఆహార ధరలు పెరుగుతాయి. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెట్రోల్ రేట్లు పెంచకుండా ఉగ్గబట్టుకొని కూర్చున్న కేంద్రం ఇక ఏ క్షణంలోనైనా పెట్రోల్ రేటు పెంపునూ ప్రకటించక మానదు. పరిస్థితులు ఇలానే ఉంటే, ఇప్పటికే లీటర్ వంద దాటేసిన పెట్రోల్ ధర రాగల కొద్ది నెలల్లో అంతకు రెండింతలైనా ఆశ్చర్యం లేదని ఓ లెక్క. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా పడిపోతోంది. వెరసి, యుద్ధ క్షేత్రానికి సుదూరాన ఉన్న సామాన్యులూ గాయాల పాలవుతున్నారు. ముyì చమురుకు తోడు వంటనూనెలున్నాయి. ప్రపంచంలో వాణిజ్యమయ్యే సన్ఫ్లవర్ నూనెలో అయిదింట నాలుగొంతులు రష్యా, ఉక్రెయిన్ల ఉత్పత్తే. మన సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతుల్లో 90 శాతం ఆ రెండు దేశాల నుంచే వస్తాయి. ఉక్రెయిన్ నుంచి సరఫరా నిలిచిపోతుందనే భయాలతో పామాయిల్, ఆవనూనెల ధరలు ఇప్పటికే పైకి చూస్తున్నాయి. గోదుమలు, మొక్కజొన్న, బార్లీ ప్రపంచ ఎగుమతుల్లోనూ రష్యా, ఉక్రెయిన్లది గణనీయమైన పాత్ర. వాటి రేట్లూ పెరుగుతున్నాయి. మన ఎరువుల దిగుమతుల్లో దాదాపు 17 శాతం పొటాష్, 60 శాతం ఎన్పీకే ఎరువులు రష్యావే. అదీ ఇబ్బందే. అల్యూమినియం, నికెల్, స్టీలు లాంటి లోహాల ప్రపంచ ధరలు పెరుగుతున్నాయి గనక, మన దగ్గరా అదే జరుగుతుంది. ప్రాథమిక వసతి సౌకర్యాల ప్రాజెక్టుల్లో 30 శాతం సామాన్లు రష్యా నుంచే వస్తాయట. అంటే, నిర్మాణ ఖర్చులూ ఎక్కువవుతాయి. ఇదీ ఇక్కడ మనం చేయాల్సిన యుద్ధం. ఈ యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో ఆర్థిక పునరుత్తేజం కోసం భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వేసుకున్న లెక్కలు తలకిందులయ్యాయి. క్షీణిస్తున్న రూపాయి విలువతో ఈ ఏడాది ఆసియాలోకెల్లా బాగా దెబ్బతిన్న కరెన్సీ ఇప్పుడు మనదేనట. ఇక, స్టాక్మార్కెట్ కష్టాలు సరేసరి. ఒక్క సోమవారమే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి ఏకంగా 1,491 పాయింట్లు, అంటే 2.74 శాతం పడిపోయింది. అలా భారత్ ఇప్పుడు ఆర్థిక, వాణిజ్య లోటులు రెంటినీ సంబాళించు కోవాల్సిన పరిస్థితి. జాతీయ, అంతర్జాతీయ ధరలు పెరుగుతుండడంతో దేశంలో ద్రవ్యోల్బణంపై తన వైఖరిని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పునఃసమీక్షించుకోవాలి. ధరలు ఇలానే పెరుగుతూ పోతే, వృద్ధిపై గట్టి దెబ్బ పడుతుంది. ఆర్బీఐ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. రూపాయి విలువ మరింత పడిపోకుండా కాపు కాయకపోతే కష్టమే. వృద్ధి స్తంభించి, ద్రవ్యోల్బణం పెరిగిపోయే విచిత్రమైన ‘స్టాగ్ఫ్లేషన్’ భయాలు చుట్టుముడుతున్న వేళ సత్వర కార్యాచరణే సాధనం. -
కోవిడ్ అనంతర ఆర్థిక స్థిరత్వమే బడ్జెట్ లక్ష్యం
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థలో కోవిడ్–19 అనంతర స్థిరత్వమే 2022–23 వార్షిక బడ్జెట్ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021–22 వార్షిక బడ్జెట్ను కూడా ఇదే విధమైన లక్ష్యంతో రూపొందించడం జరిగిందనీ, దానికి కొనసాగింపే 2022–23 వార్షిక బడ్జెట్ అని ఆమె తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రి మంగళవారం ప్రసంగించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కొనసాగింపు. కోవిడ్–19 మహమ్మారి నుండి ఆర్థిక పునరుజ్జీవనం, స్థిరత్వం లక్ష్యంగా రూపొందిన బడ్జెట్ ఇది. ’ఇండియా (యట్) 100’ చొరవలో భాగంగా వ్యవసాయం వంటి వివిధ రంగాలకు సాంకేతికత సౌలభ్యత పెంచడం, వైద్యం, విద్య వంటి వాటిలో డిజిటల్ ప్రోగ్రామ్లను విస్తరించడం వంటి అంశాల ద్వారా బడ్జెట్ భవిష్యత్ చర్యలను చేపట్టింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుంది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ పురోగతిపై దృష్టి సారిస్తుంది. ఆర్థికశాఖ సీనియర్ అధికారులుసహా ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్, జీఆర్టీ జ్యువెలరీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ అనంత పద్మనాభన్, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సీతారామన్ సన్నద్ధం!
ముంబై: కోవిడ్–19 మూడవ వేవ్ను ఎదుర్కొంటున్న భారత్ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రానున్న వార్షిక బడ్జెట్లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ► కన్సాలిడేటెడ్ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో 11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు. ► 2022–23లో కన్సాలిటేడెడ్ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు. ► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది. ► కొత్త బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. ► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం. ► పన్ను, పన్ను యేతర ఆదాయాలు 2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్ లక్ష్యాలను అధిగమించే వీలుంది. ► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్ బేస్) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యలోటు ధోరణి ఇది... కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
ప్రపంచంలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత్ ఎకానమీ
కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యసవ్థగా నిలవనుందని జాతీయ గణాంకాల కార్యలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఆర్థిక సంవత్సరం ఎకానమీ 9.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని, ఈ స్థాయి వృద్ధి రేటును ప్రపంచలో ఏ దేశమూ సాధించే స్థితిలో లేదని పేర్కొంది. ఎన్ఎస్ఓ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... ►2021 మే 31వ తేదీన వెలువడిన గణాంకాల ప్రకారం 2020–21లో జీడీపీ విలువ రూ.135.13 లక్షల కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.147.54 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. 2019–20 ఎకానమీ రూ. 145.69 లక్షల కోట్లకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ విలువ అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలిస్తే, జీవీఏ విలువ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 8.6 శాతం వృద్ధితో రూ.124.53 లక్షల కోట్ల నుంచి రూ.135.22 లక్షల కోట్లకు పెరగనుంది. ► తయారీ రంగం వృద్ధి రేటు 7.2 శాతం క్షీణత నుంచి 12.5 శాతం వృద్ధిలోకి మారే వీలుంది. ► గనులు, తవ్వకాల విభాగంలో వృద్ధి 14.3 శాతంగా ఉండే అవకాశం ఉంది. ► ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి 11.9 శాతంగా నమోదుకావచ్చు. ► ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.9 శాతానికి పెరుగే అవకాశం ఉంది. ‘బేస్ ఎఫెక్ట్’... విశ్లేషణలు.. అయితే ఈ స్థాయి వృద్ధి రేటుకు ప్రధానంగా లో బేస్ ఎఫెక్ట్ కారణమన్న విశ్లేషణలు ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 బేస్ ఇయర్ను గమనిస్తే కరోనా సవాళ్ల నేపథ్యంలో సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీలో అసలు వృద్ధి లేకపోగా 7.3 % క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. కోతల పర్వం ఇలా... నిజానికి తొలుత 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 10 శాతంపైగా అంచనావేయడం జరిగింది. అయితే ఒమిక్రాన్, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో ఈ గణాంకాల అంచనాలు 8.4 శాతం నుంచి 10 శాతం వరకూ కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అంచనాలు 9.5 శాతంకన్నా ఎన్ఎస్ఓ తాజా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. కాగా ఫిచ్ రేటింగ్స్ అంచనాలు 8.7 శాతం కాగా, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా 9.3 శాతంగా నమోదయ్యింది. ప్రపంచబ్యాంక్ అంచనా 8.3 శాతం. ఓఈసీడీ విషయంలో ఈ అంచనా ఇప్పటి వరకూ 9.7 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఎకనమిక్ సర్వే వీటన్నింటకన్నా అధికంగా అంచనా 11 శాతంగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటు అంచనావేయగం, జూలై–సెప్టెంబర్లో 8.4 శాతం వృద్ధి నమోదయ్యింది. కాగా, చైనా విషయంలో 2021–22 వృద్ధి అంచనాలు 8 శాతంగా ఉన్నాయి. 2030 నాటికి ఆసియాలో నెంబర్ 2గా భారత్ కాగా, 2030 నాటికి ఆసియాలో జపాన్ను పక్కకునెట్టి భారత్ రెండవ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే దేశ జీడీపీ జర్మనీ, బ్రిటన్లను దాటి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎదిగే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఆరువ స్థానంలో ఉంది. భారత్ జీడీపీ 2021లో 2.7 ట్రిలియన్ డాలర్లయితే, 2030 నాటికి ఈ విలువ 8.4 ట్రిలియన్ డాలర్లకు చేరే వీలుందని విశ్లేషించింది. వృద్ధి బాటలో వేగంగా నడుస్తున్న మధ్యతరగతి, వినియోగం భారీ వృద్ధి వంటి అంశాలు భారత్కు లాభిస్తున్న ప్రధాన అంశాలని పేర్కొంది. దేశ వినియోగం 2020లో 1.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే, ఇది 2030 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేషించింది. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020లో 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటే, 2030 నాటికి 1.1 బిలియన్లకు (110 కోట్లు) చేరుతుందని పేర్కొంది. కాగా, 2021–22 వృద్ధి అంచనాలను 8.2 శాతంగా పేర్కొంది. 2022–23లో ఈ రేటు 6.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. చదవండి: రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు.. -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక
India Economy Likely to Grow 9% Next Fiscal: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఢోకా ఉండబోదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ అంచనావేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు 10.5 శాతం వరకూ ఉండే వీలుందని పేర్కొంది. వృద్ధి అంచనా 8.4–9.5 శాతం శ్రేణిలో ఉంటుందన్న వివిధ అభిప్రాయాలు, అంచనాలకు భిన్నంగా క్రెడిట్ సూసీ విశ్లేషణ ఉండడం గమనార్హం. 2021–22లో 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనాకాగా, అంతర్జాతీయ రే టింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ విషయంలో ఈ అంచనా 8.4 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా నమోదవుతుందని స్విస్ బ్రో కరేజ్ దిగ్గజ సంస్థ పేర్కొంది. క్రెడిట్ సూసీలో ఆసియా పసిఫిక్, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీల కంత్ మిశ్రా విశ్లేషణల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... * ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో దిగువ ఆదాయ ఉద్యోగాల్లో సైతం రికవరీ కొనసాగే అవకాశం ఉంది. * ఇంధన, ముడి పదార్థాల ధరలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం ఉన్న ప్రధాన సవాలు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్, బొగ్గు, ఎరువులు, పామ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ పోతే వృద్ధి వేగం మందగించే అవకాశం ఉంటుంది. * విద్య, రవాణా, నిర్మాణ రంగం, ఆటో వంటి కొన్ని రంగాల్లో ఉపాధి కల్పన ఇంకా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. ఆయా రంగాలు ఇంకా కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకోలేదు. అయితే ఎకానమీ పూర్తిగా తెరుచుకునే క్రమంలో ఈ రంగాలూ పురోగమించే వీలుంది. * మహమ్మారి సమయంలో మూలధన కల్పనా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వినియోగదారు వ్యయాలు పెరగడం, పటిష్ట స్థాయిలో ఈక్విటీ ఫండ్ పెరుగుదల ఈ సవాళ్ల పరిష్కారానికి దోహదపడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రంగం), నిర్మాణ రంగాల్లో డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు. * ఇక మార్కెట్ల విషయానికి వస్తే, గ్లోబల్ ఈక్విటీల కంటే దేశంలో ప్రైస్–టూ–ఎర్నింగ్స్ (పీఈ) రేషియో ప్రీమియం 21 శాతంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే 72 శాతం ఇప్పటికే అధికంగా ఉంది. ఆయా అంశాలు పరిశీలిస్తే, ఈక్విటీ మార్కెట్లలో మరింత అప్ట్రెండ్ మరింత ఉండకపోవచ్చు. అయితే మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా పడిపోయిన మార్కెట్లకు ‘2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల అంచనాలు’ తిరిగి బలాన్ని ఇచ్చాయి. 2023–24లో కూడా ఇదే అంచనాల వల్ల మార్కెట్లు భారీగా పడిపోయే అవకాశాలు తక్కువే. * దేశ స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే వృద్ధికి సానుకూలంగానే ఉన్నాయి. ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వ ఆదాయాలు మెరుగ్గా ఉండడం ఎకానమీకి కలిసి వచ్చే అంశం. విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనగలుగుతుంది. * కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ లేదా డెల్టా వేరియంట్ యొక్క అవశేష ప్రభావం భారతదేశం కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన.. సర్దుబాటుకే మొగ్గు! -
దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత కీలక వ్యాఖ్యలు
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్లో జరిగిన అహ్మదాబాద్ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆర్థికవేత్త ఇటీవల తన పశ్చిమ బెంగాల్ పర్యటన గురుంచి కొన్ని ఆసక్తికర విషయాల పంచుకున్నారు. భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయి కంటే తక్కువగా ఉందని అన్నారు. ప్రజల చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక పోతున్నారని అన్నారు. మీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి గాని, కుటుంబం లేదా సమాజం ఒత్తిడికి గురికాకుండా ఉండాలని అన్నారు. మీ జీవితంలో నిజంగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ధైర్యం కలిగి ఉండాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మన భారతదేశంలోని ప్రజలు ఇంకా తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. "నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో కొంత సమయం గడిపాను. వారు చెప్పిన మాటలు వీని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. గ్రామీణ ప్రజలు చిన్న, చిన్న కోరికలు కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు" అని బెనర్జీ అన్నారు. "మనం చాలా బాధ అనుభవిస్తున్నాము నేను అనుకుంటున్నాను. ప్రస్తుత దేశం ఆర్థిక వ్యవస్థ 2019లో ఉన్న దానికంటే చాలా దిగువన ఉంది. ఎంత దిగువన ఉందో మాకు తెలియదు, కానీ ఇది చాలా తక్కువగా ఉంది అని నేను చెప్పగలను. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు" అని ఆర్థికవేత్త చెప్పారు, 2019లో ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమర్లతో పాటు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్యు)లో తను చదువుకుంటున్నప్పుడు తీహార్ జైలులో 10 రోజులు గడిపానని బెనర్జీ ప్రేక్షకులకు తెలియజేశారు. స్నాతకోత్సవం సందర్భంగా ప్రైవేట్ వర్సిటీకి చెందిన నలుగురు డాక్టరల్ విద్యార్థులతో సహా 833 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. (చదవండి: మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!) -
Economy: ఎకానమీలో వెలుగు రేఖలు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఆర్థిక మూలాలు పటిష్టతను ప్రతిబింబిస్తూ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఆగస్టులో ఐఐపీ సూచీ 117.2 వద్ద ఉంటే, 2021 ఆగస్టులో 131.1 పాయింట్లకు ఎగసింది. వెరసి వృద్ధి 11.9 శాతమన్నమాట. ఇదిలాఉండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 4.35 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి తీరిదీ.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధి గణాం కాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టు 2021లో 9.7 శాతం వృద్ధిని (2020 ఇదే నెల ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ► మైనింగ్: ఉత్పత్తి 23.6 శాతం ఎగసింది. ► విద్యుత్: ఉత్పత్తి విషయంలో వృద్ధి రేటు 16%. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతమైన క్యాపిటల్ గూడ్స్ విభాగం 19.9 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలల్లో క్షీణత 14.4 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు సంబంధించిన ఈ విభాగంలో 8% వృద్ధి నమోదయితే, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలో 10.2% క్షీణత నెలకొంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి ఈ విభాగంలో 3 శాతం క్షీణత 5.2 శాతం వృద్ధిలోకి మారింది. ► ఎనిమిది మౌలిక రంగాలు: మొత్తం సూచీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో 11.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఐదు నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–ఆగస్టు) ఐదు నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 28.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో 28.6 శాతం క్షీణత నమెదయ్యింది. కోవిడ్ సవాళ్లతో ఒడిదుడుకుల బాట మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... బేస్ కూడా కారణమే! తాజా సానుకూల గణాంకాలకు బేస్ కూడా కారణం కావడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 7.1 శాతం క్షీణతను (2019 ఇదే కాలం ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ కూడా 2020 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3% క్షీనత నమోదయ్యింది. 5 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఇక సెప్టెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వం ఇస్తున్న నిర్దేశాలకు అనుగుణంగా 4.35 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి (2021 ఏప్రిల్లో 4.23 శాతం). కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతం. అయితే, గత ఏడాది సెప్టెంబర్లో 7.27 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెలలో ధరల స్పీడ్ విషయానికి వస్తే... ఆహార ద్రవ్యోల్బణం 0.68 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 3.11 శాతం. ఒక్క కూరగాయల బాస్కెట్ 22.47 శాతం పడిపోయింది. ఆగస్టులో ఈ తగ్గుదల 11.68 శాతం. ఇంధనం, లైట్ విభాగంలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 12.95 శాతం (ఆగస్టు) 13.63 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక పటిష్టతకు రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళరత వడ్డీరేట్ల విధానానికి సీపీఐ ఈ స్థాయిలో కొనసాగడం కీలకం.. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా గడచిన ఎనిమిది ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు – ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను ఈ నెల మొదట్లో ఆర్బీఐ 5.3 శా>తానికి కుదించింది. 2021–22 రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1%, 4.5%, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2% నమోదవుతుందని భావిస్తోంది. -
పటిష్ట బాటన ఎకానమీ
చండీగఢ్: భారత్ ఎకానమీ పటిష్ట పునరుజ్జీవ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా నమోదుకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని స్టాక్ మార్కెట్ కూడా ప్రతిబింబిస్తోందన్నారు. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కరోనా సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవ బాట పట్టిందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి 2021–22 అర్ధ వార్షిక లక్ష్యాలను (ఏప్రిల్–సెపె్టంబర్) ఇప్పటికే సాధించడం జరిగింది. జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.11 లక్షల కోట్లు– రూ.1.12 లక్షల కోట్ల శ్రేణిలో ఉన్నాయి. 2022 మార్చితో ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి ఈ సగటు రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ► స్టాక్ మార్కెట్పై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. కంపెనీల లిస్టింగ్, సంబంధిత నిబంధనల్లో పారదర్శకత దీనికి ప్రధాన కారణం. అందువల్లే గతంలో మ్యూచువల్ ఫండ్స్పై మొగ్గుచూపే ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్షంగా మార్కెట్పై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ► పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) వల్ల వ్యవస్థలో నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగింది. ► పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోనికి తెచ్చే అంశంపై పరోక్ష పన్నుల అత్యున్నత స్థాయి మండలే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది. ► ఆర్థిక కార్యకలాపాల విషయంలో ‘అందరితో కలిసి, అందరి సంక్షేమం కోసం, అందరి విశ్వాసంతో, అందరి కృషితో’ పనిచేయాలన్నది కేంద్రం విధానం. ఇదే విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది. ► కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో వ్యాపార సంస్థలు సైతం తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యేకించి డిజిటలైజేషన్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ► జన్ధన్ పథకం వల్ల 80 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద 40 కోట్లకుపైగా అకౌంట్లు ఉన్నాయి. -
ఎకానమీ ‘యూ’ టర్న్!
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మరింత నష్టానికి గురయ్యే అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. సంఘటిత రంగం 2021 ముగింపుకల్లా కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేíÙంచారు. అయితే ఈ రికవరీ ఆయా రంగాలను బట్టి విభిన్నంగా ఉంటుందని అంచనావేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకప్రాత పోషించిన అహ్లూవాలియా తాజాగా ఒక వెర్చువల్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యంశాలను పరిశీలిస్తే... ► సంఘటిత రంగం తొలత పురోగమిస్తే, దానిని అసంఘటిత రంగం అనుసరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది ఎకానమీ పురోగతిలో కీలకం ► వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ అవసరం ఉంది. అయితే దానిని ఎలా నిర్వహించాలన్న అంశం కీలకం. చట్టాల అమలు(కేంద్రం ఇటీవలి మూడు చట్టాల అమలు) విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.పంజాబ్, హర్యానా, పశి్చమ ఉత్తరప్రదేశ్లకు చెందిన వందలాది మంది రైతులు గత ఏడాది నుంచీ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో ఆందోళనలు చేస్తూ, మూడు చట్టాల రద్దును కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఎంపీ ప్రయోజనకరమే: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) విధానానికి యూపీఏ ప్రభుత్వంలో ఎకానమీలో కీలక బాధ్యతలు పోషించిన అహ్లూవాలియా మద్దతు పలకడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల లీజు ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి కేంద్రం ఆవిష్కరించిన ఆరు లక్షల కోట్ల రూపాయల నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) విధానం వల్ల విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వేల వరకూ వివిధ రంగాల్లో మౌలిక రంగం ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఎంపీకి తాను అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. ఇది సరిగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మంచే జరుగుతుందని వివరించారు. బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ కార్యక్రమం కింద.. కేంద్రం ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్లో లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ మాత్రమే ఎన్ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదు. ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కలి్పంచడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్ ద్వారా వచి్చన నిధులను మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. అయితే 70 యేళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఈ విధానాన్ని ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పందిస్తూ, ‘‘అసలు ఆయన (రాహుల్ గాం«దీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. -
ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్ (13.6 శాతం) నిలిచాయి. -
ఎకానమీ గాడిన పడుతోంది..!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి కార్పొరేట్ రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉండడం సంతృప్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కంపెనీల రుణ నాణ్యతా అవుట్లుక్ను ప్రస్తుత ‘జాగరూకతతో కూడిన ఆశావాదం’ నుంచి ‘పాజిటివ్’కు మార్చుతున్నాం. ఫైనాన్షియల్ రంగం మినహా 43 రంగాలను అధ్యయనం చేయడం జరిగింది. ఆయా రంగాలు అన్నింటిలో పురోగమన ధోరణి కనిపిస్తోంది. వీటిలో నిర్మాణం, ఇంజనీరింగ్, పునరుత్పాదక ఇంధనంసహా 28 రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నాం. మిగిలినవి ఆ స్థాయిలో 85 శాతానికి చేరుకుంటాయి. భారత్ కార్పొరేట్ రంగం మూలాలు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ సవాళ్లు లేకుండా ఉంటే దేశీయ డిమాండ్ మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ సానుకూల అంశాలు కూడా దీనికి తోడవుతాయి. స్టీల్ ఇతర మెటల్స్, ఫార్మా, రసాయనాల రంగాల్లో డిమాండ్ బాగుంటుంది. కాగా ఆతిథ్యం, విద్యా సేవలు ఇంకా మెరుగుపడల్సి ఉంది. ఫైనాన్షియల్ రంగం కూడా 2020తో పోల్చితే ప్రస్తుతం బాగుంది. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. మొండి బకాయిల తగ్గింపు చర్యల ఫలితాలు సానుకూలంగా కనబడుతున్నాయి. రుణ లభ్యత మరింత మెరుగుపడే వీలుంది. జూన్ త్రైమాసికంలో 20 శాతం వృద్ధి: ఇక్రా భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎనామనీ వృద్ధి 20 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. అయితే దీనికి గత ఏడాది ఇదే కాలంలో లో బేస్ (24 శాతం క్షీణత) ప్రధాన కారణం. ఎకానమీ 20 శాతం పురోగమించినప్పటికీ, విలువల్లో కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకోడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, ఎగుమతులు, వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ వంటి అంశాలు ఎకానమీ విస్తృత ప్రాతిపదికన రికవరీకి దోహదపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు నిర్మాణ రంగం పురోగతికి దోహదపడతాయి. ఈ రంగం జూన్ త్రైమాసికంలో కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. వస్తువుల ఉత్పత్తి వరకూ సంబంధించిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి) జూన్ త్రైమాసికంలో 17 శాతం వరకూ ఉంటుందని విశ్వసిస్తున్నాం. ప్రీ కోవిడ్ ముందు పరిస్థితిని పోల్చితే 2021–22 తొలి త్రైమాసికంలో జీడీపీ, జీవీఏలు దాదాపు 9 శాతం క్షీణతలోనే ఉంటాయని భావిస్తున్నాం. పంట దిగుబడులు బాగుండే పరిస్థితులు కనిపిస్తుండడం హర్షణీయ పరిణామం. ఇది గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉండడానికి దోహదపడుతుంది. -
నాటి సంస్కరణలే గుర్తుకొస్తున్నాయ్..!
భారత ఆర్థిక వ్యవస్థను మూలమలుపు తిప్పిన తీవ్ర సంస్కరణలు దేశంలో మొదలై నేటికి 30 ఏళ్లయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, మూడు దశాబ్దాల తర్వాత కూడా దేశ ఆర్థికవృద్ధిపై నిరాశ అలుముకుంటోంది. 1991 నాటి తీవ్ర సంస్కరణలను పునఃసృష్టి చేయాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీడీపీ పతనం, కోవిడ్–19 కలిగించిన ఉత్పాతం మళ్లీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. పీవీ, మన్మోహన్ల సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. భారతదేశంలో 1991 సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు. దేశ ఆర్థిక విధానాలను మూల మలుపు తిప్పిన ఆ గొప్ప దశ గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా ఒక విశిష్ట ఘటనను తర్వాతి కాలక్రమంలో రజిత, స్వర్ణ, ప్లాటినమ్, శతాబ్ది వార్షికోత్సవాలతో గుర్తుంచుకోవడం కద్దు. వీటితో పోల్చి చూస్తే ముప్ఫై సంవత్సరాలకు అంతగా ప్రాధాన్యత లభించకపోవచ్చు. కానీ 1991 నాటి సంస్కరణలను ఇప్పుడు ఇంత విస్తృతంగా గుర్తించు కోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఆర్థికవృద్ధికి సంబంధించి ప్రస్తుతం అలుముకుంటున్న నిరాశా దృక్పథమే. దేశంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ అసలు పని చేస్తున్నాయా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్న సందర్భ మిది. మనకు ఆర్థికవృద్ధికి సంబంధించి ఒక వ్యూహం కానీ విధానం కానీ ఉందా అనే ప్రశ్న రేగుతోంది. 1991లో చేపట్టిన ఉదారవాద, సరళీకరణ క్రమం ఇప్పుడు వెనకపట్టు పడుతున్న సూచనలు కనిపిస్తు న్నాయి. అందుకనే 1991లో జరిగినట్లుగా ఆర్థిక స్తబ్దతను బద్దలు గొట్టడానికి ఏదైనా నాటకీయ చర్యను తప్పకుండా చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. అప్పట్లో మారకద్రవ్య విలువను తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్ రాజ్ను ఎత్తివేయడం వంటి చర్యలు వనరుల సమీకరణలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాయి. రెండేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్– 19 నేపథ్యంలో ఆనాటి సంస్కరణలను గుర్తుచేసుకోవడం మరింతగా పెరిగింది. 1991లో దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తీవ్ర చర్యలు చేపట్టినట్లే, ప్రస్తుత సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. రెండేళ్లకు ముందు చమురుధరలు కుప్పగూలడంతో భారత ఆర్థిక వృద్ధికి చెందిన అడ్డం కులు తొలిగిపోయినట్లయింది. ప్రైవేట్ పెట్టుబడులకు డిమాండ్ కొరత కొనసాగింది. ఈ కొరతను ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలతో భర్తీ చేయసాగారు. దీనికి చమురుపై పన్ను ద్వారా పెరిగిన రాబడులు దేవుడిచ్చిన బహుమతిగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో అంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు సగటు ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రతికూల ప్రభావం చూపింది. రాజకీయ ఇచ్ఛ లోపించడం కారణంగా పెండింగులో ఉండిపో యిన ఉత్పత్తి–మార్కెట్ సంస్కరణలకు సంబంధించిన డిమాండ్ ఈ సమయంలోనే వేగం పుంజుకుంది. నిజానికి మొదలుపెట్టకుండా నిలిపివేసిన సంస్కరణలకు కొత్త దారి చూపేందుకు, 2014లో బల మైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన తొలి హయాంలో వస్తుసేవల పన్నును 2017 జూలైలో ప్రవేశపెట్టడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సంస్క రణలకు దారితీసింది. 2016లో బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల నుంచి చాలాకాలంగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిల పరి ష్కారం కోసం దివాలా కోడ్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, స్థూలదేశీయోత్పత్తి తదుపరి రెండేళ్లలో పతనాన్ని చవిచూసింది. 2018–2019 సంవత్సరాల్లో మన జీడీపీ వరుసగా 6.8 శాతం, 6.5 శాతాన్ని మాత్రమే నమోదు చేసింది. దీంతో 1991 తరహా సంస్కరణలకు అనుకూలంగా ప్రైవేట్ రంగం గొంతు విప్పసాగింది. 2019 మధ్యనాటికి కేంద్రంలో గత ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో నిరాశాతత్వం మరింత పెర గడం కాకతాళీయమే కావచ్చు. ఆర్థిక సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిందిగా పరిశ్రమ నుంచి అభ్యర్థనలు పెరి గాయి. అంతవరకు కొనసాగిన సంస్కరణలు అనుకున్నంత ప్రయో జనం కలిగించలేదని, ప్రభుత్వ మదుపు.. వాణిజ్య రంగానికి అవస రమైనంతమేరకు లభ్యం కావడం లేదని అభిప్రాయాలు బలపడ్డాయి. దీంతో ప్రైవేట్ మదుపును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నులపై కోత పెట్టింది. ప్రతివారం అనేక ఇతర చర్యలు కూడా చేపట్టింది. కానీ జీడీపీ 5 శాతానికి దిగువకు పడిపోయింది. 2019 జూలై–సెప్టెంబర్లో 4.6 శాతానికి, అక్టోబర్–డిసెంబర్లో 3.3 శాతానికి 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3 శాతానికి మన స్థూల దేశీయోత్పత్తి దిగ జారిపోయింది. గత సంవత్సరం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగినంత పనయింది. ఈ సంక్షోభాన్ని అవ కాశంగా మలచాలంటూ పిలుపులు మొదలైపోయాయి. దీంతో కార్మిక, వ్యవ సాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్ సిరీస్లో కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కానీ, వ్యవసాయ మార్కెట్లు, సంస్థలలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఎదురుతన్నడంతో ఈ రంగంలో భవిష్యత్ ప్రయో జనాలను ఊహించడం కష్టసాధ్యమవుతోంది. చరిత్ర గతిని మార్చిన ఆ వందరోజులు ముప్ఫై ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యుడు కూడా కాని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ క్రమాన్నే నాటకీయంగా మార్చివేసిన సాహ సోపేతమైన సంస్కరణలకు నాంది పలికారు. ద్రవ్య, చెల్లింపుల సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు నాటి ప్రభుత్వం తన తొలి వంద రోజుల పాలనలోనే వరుస సంస్కరణలకు తెరతీసింది. దీనికి బలమైన నేపథ్యం ఉంది. 1991 జూలై తొలి వారంలో భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు కేవలం ఒక బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ప్రవాస భారతీ యులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలెట్టడంతో పరి స్థితి మరింత తీవ్రమైంది. దీంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ తమ తొలి వందరోజుల పాలన లోనే దేశ ఆర్థికక్రమాన్ని మలుపుతిప్పిన కఠిన చర్యలకు పూనుకున్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తొలి పక్షం రోజుల్లోనే అంటే 1991 జూలై 2న అమెరికా డాలర్తో పోల్చినప్పుడు భారత కరెన్సీ విలువను 9.5 శాతానికి తగ్గించివేసింది. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలో రూపాయి విలువను మరో 12 శాతం మేరకు తగ్గించి షాక్ కలిగించింది. అదేరోజున నాటి వాణిజ్యమంత్రి పి. చిదంబరం ఎగుమతిదారులకు నగదు ప్రోత్సాహా న్నందిస్తున్న సబ్సిడీలను రద్దుచేశారు. కొన్ని రకాల సరకుల దిగుమతిపై ప్రభుత్వ రంగ సంస్థలు చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎత్తివేశారు. మార్కెట్కు స్వేచ్ఛకలిగించే ఎగ్జిమ్ చట్టాన్ని తీసుకువస్తూ సుంకం లేని దిగుమతులకు అవకాశమిచ్చే లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పది కీలకరంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా ఉపసంహరించుకునే విధానాన్ని ప్రకటించారు. గడిచిన ముప్ఫై ఏళ్లుగా ద్రవ్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇతర సంస్కరణలను ఎన్నింటినో తీసుకువచ్చారు. కానీ ఆరోజు పీవీ ప్రభుత్వం చేపట్టిన సంస్క రణల నమూనా తర్వాత గత ముప్ఫై ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభు త్వాలు, వాటి ఆర్థిక మంత్రులు అదే రీతిలో కొనసాగిస్తూ ఉండటం గొప్ప విషయంగానే చెప్పాలి. గత రెండేళ్లకుపైగా డీజీపీ రేటు పడిపోవడం, కోవిడ్– 19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం నేపథ్యంలో నాటి పీవీ, సింగ్ సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు గత కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. రేణు కోహ్లి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
6.5 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచీ వరుసగా 6.5 శాతం నుంచి 7 శాతం సుస్థిర వృద్ధి బాటన సాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనావేశారు. కేంద్రం చేపట్టిన వివిధ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని కూడా వివరించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎకానమీపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దిగ్గజ విశ్లేషణా సంస్థ– డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ (డీఅండ్బీ) నిర్వహించిన ఒక వర్చువల్ కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ముఖ్యమైనవి... ► గడచిన ఏడాదిన్నరగా కేంద్రం పలు సంస్కరణాత్మక చర్యలను తీసుకుంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆయా చర్యలు మంచి వృద్ధి ఫలాలను అందిస్తాయని నేను భావిస్తున్నాను. ► 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో రికవరీ బాగుంది. అయితే ఊహించని రీతిలో సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్య మౌలిక రంగం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. అయితే మొదటి వేవ్తో పోల్చితే ఎకానమీపై ప్రభావం పరిమితమే. ► వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఎగుమతుల పీఎల్ఐ స్కీమ్, సూక్ష్మ లఘు మధ్య చిన్న తరహా పరిశ్రమల నిర్వచనం మార్పు, మొండిబకాయిలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు భవిష్యత్లో దేశాభివృద్ధిని సుస్థిర బాటన నడపనున్నాయి. ► మహమ్మారి నుంచి దేశం రికవరీ సాధించడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. తద్వారా కోవిడ్–19ను సాధారణ ఫ్లూ కింద మార్చి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. రెండేళ్ల పురోగతికి దూరమయ్యాము: వివేక్ దేవ్రాయ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ, 2021–22లో భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇది బేస్ మాయగా (పోల్చుతున్న నెల లేదా ఏడాదిలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లేదా ఏడాదిలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) ఆయన అంగీకరించారు. మహమ్మారి వల్ల దేశం రెండేళ్లు ఆర్థిక పురోగతిని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం కన్నా దాదాపు రెట్టింపై 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆవిర్భావం కల దూరమయ్యిందన్నారు. దీనితోపాటు 2030 నాటికి సుస్థిర ఆర్థికవృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాలనూ భారత్ చేరుకోలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. -
రెండు దశాబ్దాల్లో 15 ట్రిలియన్ డాలర్ల మార్క్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ చక్కని వృద్ధి చక్రంలోకి ప్రవేశించిందని.. ఈ దిశలో వచ్చే రెండు దశాబ్దాల కాలంలో (20 ఏళ్లలో) 15 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.1110 లక్షల కోట్లు)చేరుకుంటుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వ్యక్తం చేశారు. కరోనా రాక ముందు మన దేశ జీడీపీ 2.89 ట్రిలియన్ డాలర్లు(రూ.214 లక్షల కోట్లు)గా ఉంది. సోమవారం గ్రూపు వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి అదానీ మాట్లాడారు. రానున్న నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల పరిమాణానికి చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ.. దీన్ని భారత్ చేరుకుంటుందని, ఇందులో తనకు ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ తర్వాత 15 ట్రిలియన్ డాలర్ల పై స్థాయికి వచ్చే రెండు దశాబ్దాల్లో చేరుకుంటుంది’’ అని చెప్పారు. వినియోగం, మార్కెట్ పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తుందన్నారు. -
భారత ఎకానమీ వృద్ధి: బ్రిక్ వర్క్ అంచనాలు
సాక్షి,ముంబై: కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ ఎకానమీ వృద్ధి తొలి అంచనాలను తగ్గిస్తున్న ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థల వరుసలో తాజాగా బ్రిక్వర్క్ రేటింగ్స్ చేరింది. క్రితం 11 శాతం అంచనాలను 9 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. తొమ్మిది శాతం కూడా లోబేస్ వల్లే 2020-21లో అతి తక్కువ గణాకాల నమోదు) సాధ్యమవుతోందని తెలిపింది. వ్యాక్సినేషన్ విస్తృతమై, కరోనా కట్టడి జరిగే వరకూ సరఫరాల్లో ఇబ్బందులు, కార్మికుల కొరత, డిమాండ్ తగ్గుదల వంటి సవాళ్లు కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు భారత్ ఎకానమీ రికవరీ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిపింది. అయితే వ్యవసాయ రంగంపై మహమ్మారి ప్రతికూల సవాళ్లు అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ రంగం 2021-22లో 3.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చని అంచనావేసింది. పారిశ్రామిక రంగం వృద్ధి అంచనాలను 11.5 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. సేవల రంగం వృద్ధి అంచనాలను 11.8 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గించింది. భారత్ తొలి వృద్ధి అంచనాలు ఇప్పటికే ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి) కేర్ (10.2 శాతంనుంచి 10.7 శాతానికి) ఇండ్-రా (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్ట్ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) తగ్గించాయి. -
భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!
సాక్షి ముంబై: కరోనా సెకండ్వేవ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు కోతలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) శుక్రవారం ఏప్రిల్తో ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ వృద్ధి 10.1 శాతంగా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 10.4 శాతంగా ఉంది. ఇక ఎస్బీఐ రిసెర్చ్ క్రితం వృద్ధి అంచనా 11 శాతంకాగా, దీనిని తాజాగా 10.4 శాతానికి కుదించింది. ఇప్పటికే ఇక్రా, కేర్ రేటింగ్స్ భారత్ వృద్ధి అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. (సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్!) కేర్ రేటింగ్స్ ఏకంగా ఏప్రిల్లో వృద్ధి అంచనాలకు రెండుసార్లు కోతలు విధించింది. దేశ వృద్ధి రేటు 11 శాతం నుంచి 11.2 శాతం వరకూ ఉంటుందని 2021 మార్చి 24న కేర్ రేటింగ్స్ అంచనావేసింది. అయితే సెకండ్వేవ్ ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీన ఈ రేటును 10.7 శాతం నుంచి 10.9 శాతం శ్రేణికి తగ్గించింది. ఇటీవలి నివేదికలో దీనిని మరింతగా కుదించి 10.2 శాతానికి దించింది. ఇక దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ వారం మొదట్లో వృద్ధి రేటు అంచనా 10–11 శ్రేణిని 10–10.5 శాతం శ్రేణికి కుదించింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు -7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2021-22లో వృద్ధి రేటు 10.5 శాతం ఉంటుందని ఈ నెలారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఇండ్ రా, ఎస్బీఐ రిసెర్చ్ అంచనాలను పరిశీలిస్తే... వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక: ఇండ్ రా ఇండియా రేటింగ్స్ ప్రకటన ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుండడం ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. వైద్య రంగ మౌలిక వ్యవస్థ మొత్తంపై తీవ్ర ఒత్తిడి ఉంది. మే మధ్యస్థ నుంచి సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టే వీలుంది. ఫస్ట్ వేవ్తో పోల్చితే సెంకండ్వేవ్లో ఆర్థిక వ్యవస్థకు నష్టం తక్కువగా ఉంటుంది. లాక్డౌన్లు స్థానికతకు పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. సెకండ్వేవ్ను ఎదుర్కొనేందుకు కుటుంబాలు, వ్యాపారాలు, ఇతర ఆర్థిక వ్యవస్థలు కొంత సంసిద్ధమయ్యాయి. దీనికితోడు వ్యాక్సినేషన్ పక్రియా కొనసాగుతోంది. అయితే ఇది మరింత వేగవంతం కావాలి. వ్యాక్సినేషన్ పక్రియ జీడీపీతో పోల్చితే కేంద్రంపై 0.12 శాతం భారం మోపుతుంది. రాష్ట్రాల విషయంలో ఈ భారం 0.24 శాతంగా ఉంది. 2021లోనూ వ్యవసాయ రంగం కొంత సానుకూలంగా ఉండే వీలుంది. 2020–21లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం సగటున వరుసగా 5 శాతం, 5.9 శాతంగా కొనసాగవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు–చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాల మేరకు 6.8 శాతంగా ఉండవచ్చు. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో (రూ.1.75 లక్షల కోట్లు) విజయవంతం కావాలి. 2020–21లో మిగులులో ఉన్న కరెంట్ అకౌంట్ (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2021–22లో లోటులోకి మారే అవకాశం ఉంది. ఇది 0.4 శాతం (జీడీపీ)గా నమోదుకావచ్చు. 59 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి: ఎస్బీఐ రిసెర్చ్ ఎస్బీఐ రిసెర్చ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... కోవిడ్–19 ప్రతికూల ప్రభావం నుంచి బయటపడ్డానికి వీలుగా కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు ద్రవ్య, పరపతి ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంగా నమోదయ్యింది. గడచిన 59 సంవత్సరాల్లో (1962లో 5.38 శాతం) ఇంత తక్కువ స్థాయి రుణ వృద్ది రేటు ఎప్పుడూ నమోదుకాలేదు. గడచిన ఆర్థిక సంవత్సరం రుణ పరిమాణం 109.51 లక్షల కోట్లుగా ఉంది. కాగా డిపాజిట్లు 11.4 శాతం వృద్ధితో రూ.151.13 లక్షల కోట్లుగా నమోదయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వం 2020–21లో ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించింది. జీడీపీ విలువతో పోల్చితే ఇది 11 శాతం. అయితే దాదాపు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపనలను మాత్రమే వినియోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలి. లాక్డౌన్ల వల్ల కలిగే నష్టం కంటే వ్యాక్సినేషన్ వ్యయభారం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం వ్యాక్సినేషన్ వ్యయ భారం ఇప్పటికి జీడీపీలో 0.1 శాతం ఉంటే, లాక్డౌన్ల వల్ల జరిగిన నష్టం ఇప్పటికి 0.7 శాతంగా ఉంటుంది. పరిమిత లాక్డౌన్ల వల్ల ఇప్పటికి రూ.1.5 లక్షల కోట్ల నష్టం జరిగిందని అంచనా. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ల వాటా 80 శాతంకాగా, ఒక్క మహారాష్ట్ర వాటా 54 శాతంగా ఉంది. -
మొదటి వేవ్తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి వేవ్తో పోల్చితే ప్రస్తుత రెండవ దశలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇందుకు కారణాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకటని వివరించారు. మహమ్మారి భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4–మే 17, మే 18మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. దీనితో ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకున్నాయి. మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) కరోనా సెకండ్వేవ్ ఆందోళనల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020తో పోల్చితే ఇప్పుడు అనిశ్చితి వాతావరణం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అయితే సెకండ్ వేవ్ పట్ల ప్రజలు జాగరూకతతో వ్యవహరించాలి. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తత్సంబంధ అంశాలకు సంబంధించి కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ► కోవిడ్- నేపథ్యంలో డిజిటలైజేషన్, ఈ-కామర్స్లో పురోగతి నెలకొంది. ► దాదాపు 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నిత్యావసరాల సరఫరా జరిగింది. జన్ధన్, ఆధార్, మెబైల్ (జేఏఎం) ద్వారా ‘ఒక్క బటన్ క్లిక్’తో నగదు బదలాయింపు జరిగింది. అమెరికాస హా పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది. ► ఈ-కామర్స్ రంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన వృద్ధిని అందిపుచ్చుకోడానికి భారత్ తగిన రీతిలో సిద్ధంగా ఉంది. -
కరోనా సెకండ్వేవ్: ఎకానమీ కష్టాలు!
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్ సెకండ్వేవ్ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై సెకండ్వేవ్ తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2021లో రెండంకెల్లో వృద్ధి రేటు ఉన్నా 2020లో అతి తక్కువ స్థాయి గణాంకాలే(బేస్ ఎఫెక్ట్) ఇందుకు ప్రధాన కారణమవుతోందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా, పాక్షిక లాక్డౌన్ వల్ల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని పలువురు సీఈవోలు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు సీఐఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సెకండ్వేవ్ కేసుల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 1.4 శాతం నష్టం జరగనుందని బ్రిటిష్ బ్రోకరేజ్ దిగ్గజం– బార్ల్కేస్ అంచనావేస్తోంది. కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా కేసుల తీవ్రత, ధరల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత తత్సంబంధ సవాళ్లు తిరిగి ఎకానమీ రికవరీ వేగంపై అనుమానాలను సృష్టిస్తున్నాయి. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యలో గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో సీఐఐ, మూడీస్, బార్ల్కేస్ అంచనాలను వేర్వేరుగా పరిశీలిస్తే.. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) ఆర్థికాభివృద్ధి బాటలో అవరోధమే: మూడీస్ ► భారత్ వృద్ధి సానుకూల అంచనాలకు కోవిడ్–19 తాజా కేసులు సవాళ్లు విసురుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతకు సెకండ్వేవ్ అవరోధమే. అయినా జీడీపీ 2021లో రెండంకెల్లో వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. దీనికి ప్రధాన కారణం గత ఏడాది అతి తక్కువ స్థాయి (బేస్ ఎఫెక్ట్) గణాంకాలు కావడమే. ► 2020లో దేశ వ్యాప్తంగా జరిగిన కఠిన లాక్డౌన్ తరహా పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకపోవచ్చు. లాక్డౌన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా మాత్రమే పరిమితమవవచ్చు. దీనివల్ల 2020లో జరిగిన ‘లాక్డౌన్’ నష్టం తిరిగి 2021లో ఏర్పడదు. ► ఏప్రిల్ 12 వరకూ చూస్తే, భారత్ కోవిడ్–19 వల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,70,179గా ఉంది. భారత్లో యువత తక్కువగా ఉండడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంది. ► వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడంసహా కోవిడ్–19 కట్టడికి తీసుకునే పలు చర్యలు భారత్ను ‘క్రెడిట్–నెగటివ్’ ప్రభావం నుంచి తప్పిస్తాయి. ► ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2021లో 12 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. అయితే వృద్ధి అంచనాలను తాజా పరిస్థితులు దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కేసులు పెరగడం ఆర్థిక క్రియాశీలతను అలాగే కన్జూమర్ సెంటిమెంట్నూ దెబ్బతీస్తుంది. ► కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కమోడిటీ ధరల పెరుగుదల డిమాండ్కు అవరోధంగా మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులను భారత్ ఇప్పటికే ఎదుర్కొంటోంది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్లోనే ధరల స్పీడ్ కొంత ఎక్కువగానే ఉంది. ► దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర సెకండ్వేవ్కు కేంద్రంగా నిలవడం గమనార్హం. ఏప్రిల్ 12 నాటికి యాక్టివ్ కేస్లోడ్లో 50 శాతం ఇక్కడే ఉంది. (విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు ) వారానికి 1.25 బిలియన్ డాలర్ల నష్టం: బార్లే్కస్ ♦ సెకండ్వేవ్ తీవ్రత వ్యాపారాలు, రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్ల వల్ల వారానికి ఆర్థిక వ్యవస్థ సగటున 1.25 బిలియన్ డాలర్ల (డాలర్కు రూ.75 చొప్పున చూస్తే దాదాపు రూ. 9,375 కోట్లు) నష్టం జరుగనుంది. ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో దాదాపు 140 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) నష్టపోతుంది. నియంత్రణలు తక్కువగా ఉన్న వారం రోజుల క్రితం వారానికి ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 0.52 బిలియన్ డాలర్లే. ♦ మే నెల వరకూ ప్రస్తుత ఆంక్షలు కొనసాగితే ఇటు ఆర్థిక వ్యవస్థకు అటు వాణిజ్య కార్యకలాపాలకు రెండింటికీ కలిసి దాదాపు 10.5 బిలియన్ డాలర్ల నష్టం జరగనుంది. ♦ రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్ డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ♦ సెకండ్వేవ్ కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ♦ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదవుతుంది. దీనికి బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. కాగా కేసులు మరింత తీవ్రతరం కావడం, కఠిన లాక్డౌన్ పరిస్థితులు తలెత్తితే వృద్ధి రేటు మరింత పడిపోడానికే అవకాశం ఉంది. ♦ తాజా అంచనాల ప్రకారం, మే నెలాంతానికి కొత్త కేసుల పెరుగుదల సంఖ్యలో స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ విస్తృతి, మెరుగైన వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పనకు చర్యలు వంటి అంశాలు భారత్ సమీప భవిష్యత్ ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఉత్పత్తి పతనంపై సీఈవోల ఆందోళన: సీఐఐ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పాక్షిక లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడుతుందని 75 శాతం సీఈవోలు అభిప్రాయపడ్డారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. కరోనా.. లాక్డౌన్ అంశాలపై సీఐఐ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్మెంట్, కరోనా నియంత్రణ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటివి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రత చెందకుండా నియంత్రిస్తున్నప్పటికీ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలపై మహమ్మారి ప్రభావం పడకుండా చూడాల్సి ఉందని సీఐఐ పేర్కొంది. ఇందుకు తగిన చర్యలు అవసరమని పలు పరిశ్రమల సీఈవోలు అభిప్రాయపడ్డారని తెలిపింది. సీఈవోలు పాక్షిక లాక్డౌన్ పెడతారని భావిస్తున్నారని, అదే జరిగితే వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం, సరకు రవాణాకు అంతరాయం ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. సీఐఐ నిర్వహించిన పోల్ సర్వేలో 710 మంది (75శాతం) సీఈవోలు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిపింది. సరకు రవాణాపై నియంత్రణ తీసుకొస్తే తమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని 60శాతం సీఈవోలు తెలిపారని సీఐఐ వెల్లడించింది. సరకు రవాణాకు అనుకూలించే పర్యావరణ వ్యవస్థపై ఆంక్షలు విధిస్తే ఉత్పత్తి నష్టపోతామని 56 శాతం సీఈవోలు తెలిపారు. ఈ పోల్ సర్వేలో 68శాతం ఎంఎస్ఎంఈ సీఈవోలతోపాటు తయారీ, సేవల రంగాలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. భారతీయ పరిశ్రమలు ఆరోగ్య, భద్రత ప్రోటోకాల్స్ పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయని 96 శాతం సీఈవోలు చెప్పగా... పాక్షిక లాక్డౌన్ కన్నా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం మంచిదని 93శాతం సీఈవోలు పోల్ ద్వారా వెల్లడించారని సీఐఐ పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలు విధించినప్పటికీ కార్మికులను అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలని, సరకు రవాణా ఆగకుండా చూడాలని 60శాతం సీఈవోలు తెలిపారు. ఈ సమయంలో కార్మికులు, పరిశ్రమ సిబ్బంది ఆరోగ, భద్రత ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా చూడాలని వారు తెలిపారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠిన అమలు: టీవీ నరేంద్రన్ సీఐఐ అధ్యక్షుడు(ఎన్నికైన) టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమూహాలుగా ఒకే చోట చేరడం, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి తరచూ నిర్వహించే కార్యక్రమాలపైనా నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీకా మహోత్సవ్లో పరిశ్రమల కార్మికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్లోని 65 కార్యాలయాలను కోరామని తెలిపారు. 10.5 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు: గోల్డ్మన్ శాక్స్ భారత్లో పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉండొచ్చని లోగడ వేసిన అంచనాలను తాజాగా 10.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం విధిస్తున్న లాక్డౌన్లు వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. -
నీతి ఆయోగ్ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎవరికీ నష్టం జరగదని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశానికి, ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాన్నిబట్టి అన్ని కంపెనీలను కేంద్రం అమ్మేస్తోందనే భావన, ప్రచారం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించేందుకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, డి.ప్రదీప్ కుమార్, జంగారెడ్డి, కృష్ణ సాగర్రావు, డా. ప్రకాశ్రెడ్డిలతో కలసి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కంపెనీల పనితీరు ప్రాతిపదికనే... ప్రభుత్వరంగ కంపెనీల పనితీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాధాన్యత–ప్రాధాన్యేతర, వ్యూహాత్మక–వ్యూహాత్మకేతర అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి నష్టం జరగలేదని, తాము సహకార సమాఖ్య విధానాన్ని నమ్ముతామన్నారు. తెలంగాణ, ఏపీకి అనేక ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్లో తెలంగాణలోని రైల్వే లైన్లకు కేటాయింపులున్నాయని, ప్రస్తుతం రూ. 29 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2,111 కి.మీ. నిడివిగల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 13 ,990 కోట్లు వచ్చాయని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 9,172 కోట్లు వస్తాయని, ఆత్మనిర్భర భారత్ కింద తెలంగాణకు రూ. 400 కోట్లు ఏటా వస్తాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పోలవరానికి నిధుల కేటాయింపులు... కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరానికి ఒప్పందం మేరకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. స్టార్టప్లు, ఇతరత్రా రూపాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా తెలంగాణ, ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నుల కన్నా రాష్ట్ర పన్నులే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్ విలువను బట్టి మారుతూ ఉంటుందన్నారు. పన్నులు పెంచని బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: పేదలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించామని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోవిడ్తో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో శనివారం బడ్జెట్–2021పై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్సింగ్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొ న్నారు. ఠాకూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా ఉందని, నెలకు సగటున రూ.లక్ష కోట్లు జీఎస్టీ వసూలు అవుతోందన్నారు. గతేడాది కంటే ఈసారి 34 శాతం అధికంగా మూలధన వ్యయం పెంచామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు సమం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో అతిత్వరలో 3 ఆటోమొబైల్ తయారీ కేంద్రాలు రాబోతున్నాయని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీతో మరింత మైలేజీ గల వాహనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు లాభం చేకూరుస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఇన్నేళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాదిరిగా ఖర్చు చేయలేదని వివరించారు. బడ్జెట్ పట్ల సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర బడ్జెట్తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిలేదు. సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు. వాళ్లు బడ్జెట్పై ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు కదా. బడ్జెట్ బాగోలేదంటూ సీఎం మీకు ఫోన్చేసి చెప్పలేదు కదా’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం సందర్భంగా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ను ప్రశ్నించినప్పుడు సంజయ్ ఈవిధంగా స్పందించారు. -
దూసుకెళ్తున్న మార్కెట్లు : హెల్త్కేర్ షేర్లు జూమ్
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ కేర్ షేర్లు ఒక్కసారిగా జూమ్ అయ్యాయి. నారాయణ హెల్త్ కేర్ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్హెల్త్ కేర్ ఫోర్టిస్ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి. దీంతో సెన్సెక్స్ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్,హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న ఆమె... ఏళ్లలో రూ . 64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ను బలోపేతం చేయనున్నామని, ఇందుకోసం దేశంలో కొత్త 15 సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. -
కేంద్ర బడ్జెట్: 64,180 కోట్లతో సరికొత్త పథకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి 2021-22 బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం బడ్జెట్ యాప్ను విడుదల చేసింది. ఇక విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్... కరోనా లాక్డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ‘‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేశాం. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. ‘‘100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం’’ అని తెలిపారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ) ఇక గతంలో ఎన్నడూలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. గతేడాది లాక్డౌన్ అమలు చేయాలన్న నిర్ణయం కఠినమైనదేనన్న నిర్మలా సీతారామన్... లాక్డౌన్ విధించకపోతే మరింత ఘోరమైన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
కేంద్ర బడ్జెట్: దిగిరానున్న వెండి, బంగారం ధరలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం) పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు 11వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం బెంగాల్లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధి ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట్కోస్ట్ సరకు రవాణా కారిడార్ బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గానికి ఊరట గృహరుణ మినహాయింపులు 2022, మార్చి 31 వరకు కొనసాగింపు స్టార్టప్లకు ఇచ్చే తాయిలాలు మరో ఏడాది పొడిగింపు పెరిగేవి.. తగ్గేవి మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్పై రూ.4 వ్యవసాయ సెస్సు పెట్రోల్ లీటర్కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు పెరగనున్న మొబైల్ ధరలు అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు 5 % సెస్సు తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి రాగిపై పన్ను మినహాయింపులు పెరగనున్న సోలార్ ఇన్వెటర్ల ధరలు ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు కాటన్పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపు దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు పెరగనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు సీనియర్ సిటిజన్లకు ఊరట పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు. 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం ఎన్నారైలు భారత్లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు ఎన్ఐఆర్లకు డబుల్ టాక్సేషన్నుంచి ఊరట పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్కు ప్రోత్సాహం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 15 వేల పాఠశాలలు శక్తివంతం కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు ఎన్జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు లెహ్, లడఖ్లో యూనివర్సిటీ ఏర్పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ రైతుల సంక్షేమం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు మౌలిక రంగానికి భారీగా నిధులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు జమ్మూకశ్మీర్లో గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలు బ్యాడ్ బ్యాంక్కు బదలాయింపు ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు బీమా రంగంలో ఎఫ్డీఐలు 74 శాతానికి పెంపు 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు జల జీవన్ మిషన్కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే వాహన పొల్యూషన్ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ ఆత్మనిర్భర్ యోజన పథకం 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు ఆరోగ్య రంగానికి పెద్దపీట 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం యూనియన్ బడ్జెట్ యాప్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్, బడ్జెట్ యాప్ రిలీజ్ చేసిన కేంద్రం అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం ఆందోళనల నడుమ ప్రసంగం.. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. టీమిండియా అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్లో అప్లికేషన్ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్ను సభ ముందుంచునున్నారు. మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్ భేటీలో బడ్జెట్కు ఆమోదం అనంతరం లోక్సభలో ప్రవేశపెడతారు. చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మేడ్ఇన్ ఇండియా ట్యాబ్లో బడ్జెట్ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్లో చూసి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మేడ్ఇన్ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్తో నిర్మలా సీతారామన్, అనురాగ్ఠాకూర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, అమిత్ షా కూడా పార్లమెంట్కు హాజరయ్యారు. బహీ ఖాతాలో ఏం దాచారో.. ఇక వ్యాక్సిన్ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ జరగుతోంది. భారత్ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా బడ్జెట్ను లెదర్ బ్యాగ్లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది. -
జీడీపీకి సాగు దన్ను
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. మూడవ త్రైమాసికంలో ఎకానమీ మైనస్లోనే ఉంటుందని, నాల్గవ త్రైమాసికంలోనే వృద్ధి బాటకు వస్తుందని విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో 1.3 శాతం క్షీణ రేటును అంచనా వేసిన ఫిక్కీ, నాల్గవ త్రైమాసికంలో 0.5 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం దేశం 9.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని వివరించింది. 7.5 శాతం–12.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణిలో ఉండే వీలుందనీ సర్వే అంచనా వేసింది. అదే విధంగా.. దేశ వ్యవసాయ రంగం కరోనా ప్రేరిత సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఫిక్కీ సర్వే పేర్కొంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య 23.9 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ జారుడు రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరిలో పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన రూపొందించిన అవుట్లుక్ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ♦ 2020–21లో వ్యవసాయ, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుంది. ♦ కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరచింది. రబీ పంట విస్తీర్ణం, తగిన వర్షపాతం, భారీ రిజర్వాయర్ స్థాయిలు, ట్రాక్టర్ అమ్మకాల్లో పటిష్ట వృద్ధి తత్సంబంధ అంశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతికి సూచికగా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం పురోగతికి పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రత్యేకించి గిడ్డంగి సౌలభ్యతలు మెరుగుపడాలి. ♦ కరోనా వల్ల పరిశ్రమ, సేవల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ 2 రంగాలూ 2020–21లో వరుసగా 10%, 9.2% నష్టపోతాయి. ♦ పారిశ్రామిక రంగంలో రికవరీ ఉన్నా, ఇంకా విస్తృత ప్రాతిపదికన ఇది కనిపించడంలేదు. పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్ రికవరీకి దారితీసినా, దీర్ఘకాలంలో సానుకూలతలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ♦ పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆయా విభాగాల పురోగతికి ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీలు ఉండాలి. ♦ 2020–21లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 10.7% క్షీణతలో ఉంటుంది. కనిష్ట–గరిష్ట స్థాయిల శ్రేణి మైనస్ 9.5%– మైనస్ 12.5 శాతంగా ఉంటుంది. ♦ 2020–21లో 6.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. కనిష్ట–గరిష్ట స్థాయిలు 5.8 శాతం – 6.6 శాతం శ్రేణిలో ఉంటాయని అంచనా. ♦ ఇక ప్రభుత్వ ఆదాయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21లో 7.4%గా (జీడీపీలో) ఉండవచ్చు. 7–8.5% శ్రేణిలో ఉండే వీలుంది. -
జీడీపీ 7.7% క్షీణత!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) మైనస్ 7.7 శాతానికి క్షీణించొచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) అంచనా వేసింది. కీలకమైన తయారీ, సేవల రంగాలను కరోనా గట్టిగా దెబ్బతీసిన నేపథ్యంలో కేంద్రం ఈ అంచనాలకు రావడం గమనార్హం. సాగు, విద్యుత్తు, గ్యాస్ తదితర యుటిలిటీ రంగాల పనితీరును కాస్త ఊరటగా కేంద్రం భావిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2019–20)లో జీడీపీ 4.2 శాతం వృద్ధికి పరిమితమైన విషయం తెలిసిందే. ‘‘వాస్తవ జీడీపీ లేదా స్థిరమైన ధరల వద్ద (2011–12 నాటి) జీడీపీ అన్నది 2020–21లో రూ.134.40 లక్షల కోట్ల స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 2019–20 సంవత్సరానికి వేసిన తాత్కాలిక జీడీపీ అంచనా రూ.145.66 లక్షల కోట్లు. 2019–20లో వృద్ధి రేటు 4.2 శాతంగా ఉండగా, 2020–21లో వాస్తవ జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉంటుంది’’ అని ఎన్ఎస్వో తెలిపింది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) అన్నది కనీస ధరల ప్రకారం 2019–20లో రూ.133 లక్షల కోట్లుగా ఉంటే, 2020–21లో రూ.123.39 లక్షల కోట్లకు క్షీణిస్తుందని (7.2 శాతం క్షీణత).. ఎన్ఎస్వో తెలిపింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ విషయంలో వేసిన అంచనాలతో పోలిస్తే ఎన్ఎస్వో అంచనాలు కాస్త మెరుగ్గానే ఉండడం గమనార్హం. ఎన్ఎస్వో అంచనాలు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం జీవీఏ 9.4 శాతం మేర క్షీణించొచ్చు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఫ్లాట్గా (0.03 శాతమే వృద్ధి) ఉంది. ► మైనింగ్, క్వారీయింగ్, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవల్లో ఎక్కువ క్షీణత ఉంటుంది. మైనింగ్, క్వారీయింగ్ జీవీఏ మైనస్ 12.4 శాతం, ఇతర రంగాల జీవీఏ మైనస్ 21.4 శాతం వరకు క్షీణించొచ్చు. ► అదే విధంగా నిర్మాణ రంగం కూడా మైనస్ 12.6 శాతానికి, ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలు మైనస్ 3.7 శాతానికి, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో క్షీణత 0.8 శాతంగా ఉంటుంది. ► వ్యవసాయరంగం, ఫారెస్ట్రీ, మత్స్య రంగాల్లో వృద్ధి 3.4 శాతం నమోదు చేయవచ్చు. 2019–20లో ఇవే రంగాల్లో వృద్ధి 4 శాతంగా ఉంది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో 2.7 శాతం మేర వృద్ధి నమోదవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 4.1 శాతంగా ఉంది. ► ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ తలసరి నికర ఆదాయం రూ.1,26,968గా ఉంది. 2019–20లో ఉన్న రూ.1,34,226తో పోలిస్తే 5.4 శాతం తక్కువ. స్థిరమైన వీ–షేప్ రికవరీని సూచిస్తున్నాయి ఎన్ఎస్వో విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుజ్జీవాన్ని సంతరించుకుంటున్నట్టు, లాక్డౌన్ల తర్వాత స్థిరమైన వీ–షేప్ రికవరీ (ఏ తీరులో పడిపోయిందో.. అదే తీరులో తిరిగి కోలుకోవడం)ని సూచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
కోవిడ్–19పై శక్తివంచనలేకుండా పోరు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్ ద్వారా రీఫైనాన్షింగ్ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి: ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్ 2021 నాటికి కరోనా వైరస్ పోరులో భాగంగా 160 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్ తగిన కృషి జరపాలని బ్యాంక్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
కరోనా కష్టంతో 9.6% క్షీణత
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్డౌన్ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా, 2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావంతో భారత్లో సరఫరాలు–డిమాండ్ పరిస్థితుల మధ్య సమతౌల్యత పూర్తిగా దెబ్బతింది. ► వృద్ధికి మౌలిక రంగంలో పెట్టుబడులు అవసరం. అయితే ఇప్పుడు ద్రవ్య వనరులను ఆరోగ్యం, సామాజిక భద్రతపై అధికంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆయా అంశాలకు అనుగుణంగా మధ్య కాలానికి ద్రవ్య వ్యవస్థ–వ్యయ ప్రక్రియలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అయితే క్లిష్ట ద్రవ్య పరిస్థితుల్లోనూ కేంద్రం తన వంతు తగిన చర్యలను సమర్థవంతంగా తీసుకుంటోంది. ► అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. దీనితో పేదరికం సమస్య తీవ్రమవుతోంది. ఏడాదిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 33 శాతం పెరిగే అవకాశం ఉంది. ► బ్యాంకింగ్లో పెరుగుతున్న మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఆందోళన కలిగిస్తోంది. అన్ని అంచనాలూ క్షీణతలోనే... మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9% క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... 2020–21లో అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో).. -
జీడీపీ మైనస్ 11.5 శాతానికి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం. ► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం. ► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు. ► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి. ► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు. ► ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► సమీప భవిష్యత్తులో రేటింగ్ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్ పెంపు ఉండబోదు. భారత్ సావరిన్ రేటింగ్ను జూన్లో మూడీస్– నెగెటివ్ అవుట్లుక్తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్కు ఒక అంచ ఎక్కువ. ► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది. కేర్ రేటింగ్స్ అంచనా మైనస్ 8.2 శాతం కాగా దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్ రేటింగ్స్ తెలిపింది. అందరి అంచనాలూ క్షీణతే.. మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో) సంస్థ తాజా క్రితం అంచనా అంచనా గోల్డ్మన్ శాక్స్ 14.8 11.8 ఫిచ్ 10.5 5.0 ఇండియా రేటింగ్స్ – రిసెర్చ్ 11.8 5.3 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 6.8 -
వ్యవసాయ ఉద్దీపనతోనే భవిష్యత్తు
ఆర్థిక వ్యవస్థను మహమ్మారి కరోనా కుదేలు చేసిపడేసిన సమయంలోనూ వ్యవసాయమే అతిపెద్ద ఉద్యోగ కల్పనా శక్తిగా నిరూపితమైంది. ఈ తరుణంలో కోవిడ్–19 అనంతరం గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే ప్రాధాన్యాంశంగా ఉండాలి, రైతాంగం చేతుల్లోకి మరింత నగదును తీసుకువచ్చే విధానాలను అమలు చేయాలి. వ్యవసాయంపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేయాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్దేశించిన ఆర్థిక చింతన వల్లే వ్యవసాయం వాస్తవంగా బలైపోయింది. ఆ విధానాల వల్లే వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వంగా తగ్గించివేస్తూ వచ్చారు. అందుకే దేశంలో సాహసోపేతమైన సంస్కరణల కోసం నిజంగా పరితపిస్తున్నది వ్యవసాయరంగమేనని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ లెక్కలు కుప్పకూలిపోవడం ద్వారా ఆర్థిక మాంద్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వ్యవసాయం ఒక్కటే మనకు మిగిలిన ఆశాకిరణంలా కనిపిస్తోంది. రబీ సీజన్లో సమృద్ధిగా పంటలు పండినందున వ్యవసాయమే దేశాన్ని నిజంగా రక్షించే ఉత్పత్తి రంగంగా నిరూపితమైంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో కూడా 8 శాతం ఎక్కువగా నాట్లు వేయడం, ఇంతవరకు వర్షపాతం కూడా సాధారణ స్థాయికి ఎగువనే ఉండటంతో భారతదేశం మరోసారి పంటల్లో రికార్డు సృష్టించేవైపుగా ముందుకెళుతోంది. ఈ సంక్షోభ సమయంలో, వ్యవసాయం ఒక్కటే దేశానికి ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఉత్పత్తి ఖర్చులు, ముడిసరుకుల వ్యయం కంటే విలువ ఆధారిత సరుకులు, సేవల స్థూల విలువ తక్కువగా నమోదైన సమయంలోనే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు 3.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. లాక్డౌన్ అమలైన తొలి రెండు నెలల కాలంలో దేశంలోని అనేక పారిశ్రామిక సంస్థలు మూతపడటంతో ఆర్థిక కార్యాచరణ తీవ్రంగా దెబ్బతింది. అందుచేత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. ఇది ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలోనే అతి తక్కువ వృద్ధి శాతం అన్నమాట. 1996లో త్రైమాసిక జీడీపీ వివరాలను గణించడం మొదలుపెట్టాక భారత ఆర్థిక వ్యవస్థలో నమోదైన అతిపెద్ద ఆర్థిక పతనంగా దీన్ని భావించవచ్చు. దీనికి ఉద్యోగాల కోత అదనంగా తోడయింది. పైగా సగటు పౌరుడిపై ఆర్థికంగా పడిన దెబ్బ అసామాన్య స్థాయిలో ఉంటోంది. ఇక దేశంలో వ్యక్తిగత వినియోగం అత్యవసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే పరిమితమైంది. దీనికి అదనంగా వేతనాల్లో కోతలు, జీతం ఇవ్వకుండా సెలవులు ఇవ్వడం వంటివి ప్రజల కష్టాలను రెట్టింపు చేశాయి. ఇవి చాలవన్నట్లుగా సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం దాదాపు రెండు కోట్లమంది వేతన జీవులు, మరొక 70 లక్షల మంది రోజుకూలీలు గత ఏప్రిల్ నెల నుంచి తమ ఉద్యోగాలను కోల్పోయారని తెలుస్తోంది. ఈ అంచనాలకు అదనంగా దాదాపుగా 3 కోట్ల మంది వలస కార్మికులు (రాష్ట్రాల మధ్య జరిగిన వలసను కూడా లెక్కించినట్లయితే 8 కోట్లమంది వలస కార్మికులు ఈ జాబితాలో చేరతారు) వందల, వేల కిలోమీటర్ల దూరం తమ పిల్లలను భుజాలపై మోసుకుంటూ కాలినడక ద్వారా తమ ఇళ్లకు చేరుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద వలసగా దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేసిన మన ఆర్థిక విధానాల సంపూర్ణ వైఫల్యాన్నే మరోసారి ఇది గుర్తు చేసినట్లయింది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండగా, పంటల ధరలు మాత్రం స్తబ్దంగా ఉండిపోవడం లేక మరింత పతనం కావడంతో వ్యవసాయంలో వాణిజ్య విధానాలు తొలినుంచీ ప్రతికూల ధోరణితోనే కొనసాగుతున్నాయి. అందుచేత, గ్రామాలకు తరలిపోయిన కోట్లాది వలస కార్మికులను మళ్లీ నగరాలకు తీసుకురావడానికి బదులుగా, గ్రామీణ ప్రాంతాలనుంచి ప్రజ లను బయటకు నెట్టివేయడం అనే ఆర్థిక నమూనాను మార్చివేయడం వైపుగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం కుటుంబాలు వ్యవసాయపనుల్లో నిమగ్నం కావడాన్ని చూస్తే, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప జేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాల్సి ఉంటుంది. వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి సంబంధించి బలీయమైన శక్తిగా మార్చాల్సిన అవసరం వచ్చిపడింది. కరోనా మహమ్మారి మన ఆర్థిక వ్యవస్థలోని తప్పుడు విధానాలను నిర్దిష్టంగానే ఎత్తి చూపినందున, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకుపోతూ, ఉద్యోగాల కల్పనకు వీలిచ్చేటటువంటి కొత్త ఆర్థిక ఎజెండా రూపకల్పన కోసం కొత్త ఆలోచనలతో ముందుకు రావల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సి ఉంది. పరిశ్రమల కోసం వ్యవసాయాన్ని త్యాగం చేయడం అనే పాత ఆర్థిక వృద్ధినే అనుసరించడానికి కాలం చెల్లిపోయిందని, లాక్డౌన్ కాలంలో జరిగిన రివర్స్ వలస తిరుగులేని సాక్షీభూతంగా నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను మహమ్మారి కరోనా కుదేలు చేసిపడేసిన సమయంలోనూ వ్యవసాయమే అతిపెద్ద ఉద్యోగ కల్పనా శక్తిగా నిరూపితమైంది. ఈ తరుణంలో కోవిడ్–19 అనంతరం గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే ప్రాధాన్యాంశంగా ఉండాలి, రైతాంగం చేతుల్లోకి మరింత నగదును తీసుకువచ్చే విధానాలు అమలు చేయాలి. ప్రధాని నరేంద్రమోదీ ప్రవచిస్తున్న సబ్కా సాత్ సబ్గా వికాస్ స్వప్నాన్ని సాకారం చేయగల శక్తి దీనికి మాత్రమే ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) డైరెక్టర్ జనరల్ క్యూ డాంగ్యూ స్పష్టంగా చెప్పారు. ‘‘బలమైన ఆర్థిక వ్యవస్థల హితకరమైన ప్రభావాల కారణంగా గతంలో అబివృద్ధి కొనసాగింది. కానీ ఇది ఎల్ల ప్పటికీ అలాగే ఉండదు. ఇప్పుడు సామాజిక వాస్తవాలు మారాయి. కాబట్టి మన ఆలోచనలు కూడా తప్పకుండా మారాలి’’. మన వ్యవసాయ దుస్థితి దశాబ్దాలుగా కొనసాగడానికి కారణం దేవుడి చర్య కానే కాదని చెప్పాలి. వ్యవసాయంపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేయాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్దేశించిన ఆర్థిక చింతన వల్లే వ్యవసాయం వాస్తవంగా బలైపోయింది. ఆ విధానాల వల్లే దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వంగా తగ్గించివేస్తూ వచ్చారు. అభివృద్ధి అని తాము చెబుతున్న నమూనాను కొనసాగించేందుకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం కోసం వ్యవసాయాన్ని అధోగతి పాలుచేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతంలోపు ఉంచేలా చేయడం కోసం వినియోగదారీ ధరల సూచీ (సీపీఐ) గణనలో ఆహార పదార్థాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చినందున ఇన్నాళ్లుగా తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఖరీఫ్ పంటల సీజన్ కోసం వరిధాన్యం సేకరణ ధరను ఉదాహరణగా తీసుకుందాం. కనీస మద్దతు ధరను 2.9 శాతం మేరకు పెంచారు కానీ, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) చెబుతున్న దాని ప్రకారం వరిపంట ఉత్పత్తికోసం అయ్యే దిగుబడి ఖర్చులకు సంబంధించిన ధరలు అమాంతంగా 5.1 శాతం పెరిగిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ధాన్యసేకరణ ధరలను స్థిరీకరించడమే సీఏసీపీ వ్యవసాయ ధరల విధానం లక్ష్యాల్లో ఒకటిగా ఉంటూ వచ్చింది. లాక్డౌన్ సమయంలో కూడా వ్యవసాయం చక్కటి పనితీరును ప్రదర్శించినప్పటికీ, వ్యవసాయ ఆదాయాల వృద్ధి కంటే వ్యవసాయ కార్మికుల వాస్తవ ద్రవ్యోల్బణాన్ని అధికంగా చూపిస్తూ వస్తున్నారు. దీంతో వాస్తవంగా రైతులు రాబడిపరంగా దెబ్బతింటున్నారు. దేశం లోని మెజారిటీ రైతులు కనీస మద్దతు ధరకు సరిసమానమైన వాస్తవ రాబడి ధరలను తమ ఉత్పత్తులకు సంబంధించి అందుకోవడం లేదని గోవన్ కనెక్షన్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీసీడీఎస్) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. గత కొన్నేళ్లుగా కొనసాగిన పలు ఇతర అధ్యయనాల బట్టి వ్యవసాయ ధరలు దశాబ్దాలుగా స్తబ్దంగా ఉండిపోయాయని, ఘనీభవించిపోయాయని తెలుస్తోంది. అందుకే మన దేశ రైతులు పంటలను కాదు.. నష్టాలను పండిస్తున్నారని నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను. దేశంలో సాహసోపేతమైన సంస్కరణల కోసం నిజంగా పరితపిస్తున్నది వ్యవసాయరంగమేనని చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రస్తుత రూపంలో వ్యవసాయరంగం వృద్ధి చోదక శక్తిగా ఆవిర్భవించలేదంటే అంగీకరించాల్సిందే. కానీ మనం ఒక విషయం మర్చిపోవద్దు. ఆరోగ్యకరమైన వ్యవసాయానికి సౌభాగ్యవంతమైన వ్యవసాయ సామాజిక బృందం మనగలగాలి. రైతులకు నెలవారీ ఆదాయం కల్పించేలా వ్యవసాయ విధానం మార్పు చెందినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇది జరగాలంటే వ్యవసాయరంగంలో, ఆరోగ్య విద్యారంగాల్లో ప్రభుత్వ రంగ మదుపులను తీవ్రంగా పెంచాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాతీయ స్రవంతి ఆర్థిక చింతనలో మార్పులు చేసినప్పుడు ఇది తప్పకుండా సాధ్యపడుతుంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో వ్యవసాయం దేశానికే ప్రాణాధారంగా నిలిచి పనిచేసింది. ఇప్పుడు దేశం ముందున్న సమస్య ఏమిటంటే, వ్యవసాయరంగం ఇకపై వెనుకబాటుతనంలో ఉండిపోకుండా, వృద్ధి క్రమంలో ఒక సమాన భాగస్వామిగా ఎదగాల్సి ఉంటుంది. భారతదేశం తన విధానపరమైన దిశను మార్చుకోవలసిన పంథా ఇదే మరి. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : : hunger55@gmail.com -
భారత్లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఆర్థిక వ్యవస్థ, తిరిగి ‘వీ’ (V) తరహా వృద్ధి రేటును చూస్తోందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. కోవిడ్–19పై సమరానికి అమలు చేసిన కఠిన లాక్డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్రతికూల పరిస్థితే నెలకొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం, బ్రిటన్ 21.7 శాతం, ఫ్రాన్స్ 18.9 శాతం, స్పెయిన్ 22.1 శాతం, ఇటలీ 17.7 శాతం, జర్మనీ 11.3 శాతం నష్టపోగా. యూరో ప్రాంతం దాదాపు మైనస్ 15 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. జపాన్ విషయంలో ఈ క్షీణ రేటు 9.9 శాతంగా ఉంది. ► ఇక లాక్డౌన్ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే, కోవిడ్–19 ప్రతికూల పరిస్థితులపై ఈ కాలంలో ఒక స్పష్టమైన అంచనాలకు రాగలిగాం. మరణాల రేటు తగ్గడానికి తగిన చర్యలు తీసుకున్నాం. ప్రపంచంలో కోవిడ్–19 ప్రేరిత మృతుల రేటు (శాతాల్లో) భారత్లోనే తక్కువ ఉంది. ఆగస్టు 31 వరకూ చూస్తే, భారత్లో మృతుల రేటు కేవలం 1.78 శాతంగా ఉంటే, అమెరికాలో ఈ రేటు 3.04 శాతంగా ఉంది. బ్రిటన్లో ఈ రేటు ఏకంగా 12.35 శాతం. ఫ్రాన్స్లో 10.09 శాతం. జపాన్లో 1.89 శాతం. ఇటలీలో 13.18 శాతం. ► ప్రస్తుతం భారత్ ‘వీ’ (ఠి) తరహా వృద్ధి పురోగమనంలో ఉంది. ఇందుకు తగిన గణాంకాలు కనిపిస్తున్నాయి. ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. రైల్వే రవాణా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోంది. ఈ– వే బిల్స్ బాగున్నాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోంది. రహదారులపై రోజూవారీ టోల్ వసూళ్లు మెరుగుపడుతున్నాయి. రిటైల్ ఫైనాన్షియల్ లావాదేవీలు, తయారీ పర్చేజింగ్ మేనుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పరిస్థితి బాగుంది. మౌలిక రంగాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. పెట్టుబడులు మెరుగుపడుతున్నాయ్. ఎగుమతులు వృద్ధి బాటలోకి వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోగతి కనబడుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చరిత్రాత్మక రికార్డు స్థాయిల్లో (ఆగస్టు 28వ తేదీతో ముగిసిన వారంలో చరిత్రాత్మక రికార్డు స్థాయి 541.431 బిలియన్ డాలర్లు)కొనసాగుతున్నాయి. 14 నెలలకుపైగా దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా కేంద్రం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే ఇంకా కొన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలు, మౌలిక రంగం, స్టార్టప్స్, మానవ వనరుల నైపుణ్యత, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది. భూ, న్యాయ, కార్మిక, క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లో మరిన్ని వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. నిరుద్యోగ సమస్యసహా సమస్యల పరిష్కారానికి కేంద్రం అధిక దృష్టి కేంద్రీకరించింది. రూపాయికి 33 పైసలు లాభం ఈక్విటీ మార్కెట్ భారీగా నష్టపోయినా, శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు బలపడి 73.14 వద్ద ముగిసింది. దీనితో వారం వారీగా రూపాయి 25 పైసలు లాభపడినట్లయ్యింది. రూపాయి వరుసగా నాలుగు వారాల నుంచీ బలపడుతూ వస్తోంది. ఈ నెల మొత్తం ఐపీఓల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయన్న అంచనాలే రూపాయి బలోపేతానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెచ్ దేవర్‡్ష వికెల్ అభిప్రాయపడుతుండడం గమనార్హం. 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంగా భారత్: వుయ్ వర్క్ కోవిడ్–19 తీవ్ర సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంతో ఉందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రియల్టీ సంస్థ– ఎంబసీ గ్రూప్ అనుబంధ విభాగం వుయ్ వర్క్ అంచనావేసింది. దీనిని సాధించే అవకాశాలు కూడా భారత్కు ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే రాబడీ–వ్యయాలను చూస్తే 2019 కన్నా, 2020లో కొంత ప్రతికూలతలు తప్పవని తెలిపింది. -
మళ్లీ ‘డ్రాగన్’ షాక్!
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక జపాన్ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెబీ కొత్త ‘మార్జిన్’ నిబంధనలు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని మార్కెట్ విశేషాలు... ► సన్ఫార్మా షేర్ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి ► స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది. -
జీడీపీ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవంతో భారత ఎకానమీ కుప్పకూలింది. ఆర్థిక విశ్లేషకులు, సంస్థలు, విధాన నిర్ణేతల అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్డౌన్ దీనికి ప్రధాన కారణం. గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్లోకి జారిపోవడం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితులను కరోనా వైరస్ మరింత కుంగదీసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1% అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2%. అధికారికంగా సోమవారం విడుదలైన జీడీపీ లెక్కను పరిశీలిస్తే, త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగం ఒక్కటే గణాంకాల్లో కొంత ఊరటనిచ్చింది. మిగిలిన దాదాపు అన్ని రంగాల్లో క్షీణ ధోరణి కనిపించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయడం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది. అయితే క్షీణ రేటు మైనస్ 15–20% ఉంటుందని పలు విశ్లేషణా సంస్థలు అంచనావేస్తున్నాయి. విలువల్లో చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ –23.9 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నమాట. ఇక కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8% క్షీణించిందన్నమాట. వ్యవ‘సాయం’ ఒక్కటే ఊరట ► వ్యవసాయం: వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► ఫైనాన్షియల్, రియల్టీ, వృత్తిపరమైన సేవలు: మైనస్ 5.3% క్షీణించింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: క్షీణత రేటు మైనస్ 10 శాతంగా ఉంది. ► వాణిజ్యం, హోటల్స్ రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగాలు ఎన్నడూ లేనంతగా మైనస్ 47 శాతం పతనమయ్యాయి. ► తయారీ: మైనస్ 39.3% కుదేలైంది. ► నిర్మాణం: మైనస్ 50.3% కుప్పకూలింది. ► మైనింగ్: మైనస్ 23.3% క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్: క్షీణత మైనస్ 7%. ఊహించని షాక్ వల్లే... అంతర్జాతీయంగా ప్రతి దేశాన్నీ షాక్కు గురిచేసిన కరోనా వైరస్ ప్రభావమే తొలి త్రైమాసిక భారీ క్షీణ ఫలితానికి కారణం. జీడీపీ తలసరి ఆదాయం 1870 తరువాత ఎన్నడూ చూడని క్షీణ రేటును చూసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలూ లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడ్డాక, వృద్ధి ‘వీ’ షేప్లో ఉండొచ్చు. – కేవీ సుబ్రమణియన్, చీప్ ఎకనమిక్ అడ్వైజర్ రికవరీ ఉంటుందని భావిస్తున్నాం... ఊహించిన విధంగానే క్షీణత భారీగా ఉంది. లాక్డౌన్ ప్రభావిత అంశాలే దీనికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలూ బలహీన పరిస్థితి ఉన్నా, క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ కుదుట పడుతుంది... రానున్న త్రైమాసికాల్లో క్షీణ రేట్లు క్రమంగా దిగివస్తాయి. లాక్డౌన్ కఠిన పరిస్థితులు తొలగుతుండడం దీనికి కారణం. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్, ఆర్బీఐ చొరవలు పరిస్థితిని కుదుటపడేస్తాయని భావిస్తున్నాం. – నిరంజన్ హీరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు అంటే.. 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకూ ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడమే. -
కరోనాకు ముందే జీడీపీ పడిపోయింది కదా?
ఢిల్లీ : జీఎస్టీ పరిహారానికి సంబంధించి రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటాలపై గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ఖండించారు. కరోనా కారణంగానే జీఎస్టీ వృద్ధిరేటు పడిపోయిందన్న నిర్మలా వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని ఈ ప్రకృతి చర్యను దేవుని చర్యగా ఆమె అభివర్ణించారు. దీంతో ఆర్థికమంత్రిని దేవుని దూతగా వ్యంగంగా పేర్కొన్న చిదంబరం.. కరోనా సంక్షోభానికి ముందు పతనమైన ఆర్థికవ్యవస్థపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018-19 నాటికి 7.1గా ఉన్న ఆరథి వృద్ధిరేటు 2019-20 త్రైమాసికం నాటికి 3.1 శాతానికి ఎలా పడిపోయిందో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చిదంబర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. (ఎన్పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ) If the pandemic is an ‘Act of God’, how do we describe the mismanagement of the economy during 2017-18 2018-19 and 2019-20 BEFORE the pandemic struck India? Will the FM as the Messenger of God please answer? — P. Chidambaram (@PChidambaram_IN) August 29, 2020 జీఎస్టి పరిహారాన్ని కేంద్రం రెండు ఆప్షన్లుగా రాష్ర్టాలకే వదిలేసింది. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిహార సెస్ కింద భవిష్యత్తులో రాబడులను తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోవాలని మొదటి ఐచ్చికంలో ఉంది. అయితే దీని వల్ల ఆర్థిక భారం పూర్తిగా రాష్ట్రాలపై పడుతుంది. ఇక రెండో ఐచ్ఛిక కింద రాష్ట్రాలు ఆర్బిఐ విండో నుంచి రుణం తీసుకోమని ఉంది. ఇది మార్కెట్ రుణాల కంటే ఎక్కువ. దీని వల్ల రాష్ర్టాలకు ఒరిగే లాభమేంటి? కరోనా మహమ్మారి లాంటి ఒక విపత్తు తలెత్తినప్పుడు కేంద్రం చేయాతనివ్వాలి. కానీ కేంద్రం చెబుతున్న రెండు ఐచ్ఛికాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. రాష్ర్టాలకు ఇచ్చే ఆర్థిక పరిహారం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది అని పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక కొరత నేపథ్యంలో పరిహారం కోరుతూ రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత) -
2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత
న్యూడిల్లీ: కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. జీఎస్టీ అమలు కారణంగా (పాత వ్యవస్థ నుంచి కొత్త పన్ను చట్టానికి మళ్లడం) రాష్ట్రాలు ఎదుర్కొనే లోటుకు సంబంధించి తాము పరిహారం చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్ల మేర పరిహారంగా ఇవ్వాల్సి వస్తుందన్నది కేంద్రం అంచనా. ఇందులో రూ.65,000 కోట్లను వివిద రకాల సెస్సుల రూపంలో కేంద్రం రాబట్టుకోనుంది. దీంతో రూ.2.35 లక్షల కోట్ల మేర కేంద్రం లోటును ఎదుర్కోనుంది. ఈ లోటులో రూ.97,000 కోట్లు రాష్ట్రాలు జీఎస్టీకి మళ్లడం కారణంగా చెల్లించాల్సిన మొత్తమని, మిగిలిన మొత్తం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రభావమేనని అంచనా. ‘‘ఈ ఏడాది అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. సుమారు 10 శాతం కంటే తక్కువ ప్రభావం ప్రకృతి విపత్తు కారణంగానే ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థ సంకోచానికి కూడా కారణమవుతుంది’’ అని చెప్పారు. ఈ నెల 31న జీడీపీ క్యూ1 గణాంకాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అవుట్లుక్ ను ఫిచ్ గతవారమే స్టేబుల్ (స్థిర) నుంచి నెగటివ్ (ప్రతికూల) స్థాయికి డౌన్గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. ‘భారత్ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి. మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంచనాల కన్నా తక్కువే వృద్ధి.. స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్మాకర్ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు. -
కనీసం నాలుగు లక్షల కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్లో ఆహారం కొరత కారణంగా కరువు కాటకాలు ఏర్పడటం లేదు. కార్మికులకు కొనే శక్తి కరువైనప్పుడు కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కరువు కాటకాలను ప్రభుత్వాలు తలచుకుంటే పరిష్కరించవచ్చు’ అని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్యసేన్ చెప్పారు. కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వారందరి కుటుంబాలకు తిండి పెట్టేంత ఆహార ధాన్యాల నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. (వలస కార్మికులు.. వాస్తవాలు) దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు రెండు నెలల పాటు దినసరి కార్మికులు ఉపాధి కోల్పోవడం వల్ల నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, ఇది భారత జీడీపీలో రెండు నుంచి మూడు శాతమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలో ఎకనామిక్ ప్రొఫెసర్గా పని చేస్తోన్న జయన్ జోస్ థామస్ తెలిపారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ 2018, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం పురుషుల సగటు వేతన రోజుకు 282 రూపాయలు, మహిళల సగటు వేతనం రోజుకు 179 రూపాయలని ఆయన చెప్పారు. (‘వైరస్ కాదు.. ఎకానమీ ధ్వంసం’) గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనం, మగవారికి నెలకు సరాసరి సగటు 14,024కాగా, మహిళలకు 9,895 రూపాయలని, అదే పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 18,353 రూపాయలుకాగా, మహిళలకు 14,487 రూపాయలని థామస్ చెప్పారు. ఈ లెక్కన రెండు నెలల కాలానికి కార్మికులు కనీసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కింద నష్టపోయారని ఆయన అంచనా వేశారు. (ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు) -
కార్మికుల చట్టాలపై రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ కుమార్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్యారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాగా వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు ఇటీవల ప్రణాళికబద్దమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్మికులు, వ్యాపార సంస్థలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల చట్టాలను సంస్కరించడమంటే రద్దు చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం వినియోగదారుల డిమాండ్ను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి బ్యాంక్లు, ఎంఎస్ఎమ్ఈ లు(సూక్క్ష్మ మద్య స్థాయి పరిశ్రమలు) కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వలస కార్మికుల ఉచిత ఆహార ధాన్యాలకు సరిపోతాయని.. ఉచిత నగదు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజన్ స్పష్టం చేశారు. కార్మికులకు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వివిద రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే.. ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే నివేదికలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బ్యాంక్లు, సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. చదవండి: కోవిడ్-19 షాక్నకు ఆర్థిక టానిక్ అదే! -
లాక్డౌన్ ఎత్తేయాలి: రాజీవ్ బజాజ్
ముంబై: కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ యజయాన్యాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. భారత్లో కరోనా ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయంటూ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే లాక్డౌన్ ఎత్తివేయాలని తెలిపారు. దేశంలో 20 నుంచి 60 సంవత్సరాల వ్యక్తులను స్వేచ్చగా కార్యకలాపాలు చేసుకునే విధంగా అవకాశమివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాను జయించడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వర్తించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం జీఎస్టీ సరళీకరణ వంటి అనేక పన్నురాయితీలు కేటాయించినా.. కరోనా కారణంగా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొవడానికి ప్రజలు రోగనిరోదకశక్తిని పెంచుకోవాలని సూచించారు. దేశంలో యువ జనాభా, వాతావరణ పరిస్థితులు, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నందున లాక్డౌన్ అవసరం లేదని తెలిపారు. తమ కంపెనీ సామాజిక, ఆర్థిక, భావోద్వేగ పరిస్థితులను తట్టుకుని వ్యాపార వ్యూహాలు రచిస్తుందని పేర్కొన్నారు. -
భారత్ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన విశ్వరూపం చూపడం ప్రారంభించింది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు, పేద దేశాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ పలు దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. అలా ఆసియా దేశాల నుంచి ఇప్పటి వరకు 26 బిలియన్ డాలర్ల (దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు వెనక్కి పోగా, ఒక్క భారత్ నుంచి 16 బిలియన్ డాలర్లు (దాదాపు 12.12 లక్షల కోట్ల రూపాయలు) వెనక్కి వెళ్లిపోయినట్లు అమెరికాలోని స్వతంత్ర పరిశోధన సంస్థ ‘కాంగ్రెషనల్ రిసెర్చ్ సెంటర్’ ఓ నివేదికలో వెల్లడించింది. కరోనా ప్రభావం ఏయే దేశాలపై ఎలా ఉందో తెలియజేస్తూ ఆ సంస్థ ‘గ్లోబల్ ఎకనామిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్–19’ పేరిట ఓ నివేదికను వెల్లడించింది. యూరోజోన్ ఎకానమీ 3.8 శాతం కుంచించుకుపోయింది. 1995 నుంచి యూరోజోన్ ఎకానమి తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పడి పోవడం మాత్రం ఇదే మొదటిసారి. అలాగే కోవిడ్ కారణంగా అమెరికా జీడీపీ రేటు మొదటి త్రైమాసికంలోనే 4.8 శాతం పడి పోయింది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత జీడీపీ రేటు పడి పోవడం ఇదే మొదటి సారి. మార్చి మధ్యకాలం నుంచి ఏప్రిల్ నెల చివరి నాటికి దాదాపు మూడు కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ బీమా తీసుకున్నారని నివేదిక పేర్కొంది. 2020–21 సంవత్సరానికి భారత దేశం జీడీపీ వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తొలుత 5.8 శాతంగా అంచనా వేయగా ఆ తర్వాత దాన్ని 1.9 శాతంగా సవరించుకుంది. కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరించాల్సి వచ్చింది. లేకపోతే చైనా, భారత్లు పురోభివృద్ధి దిశగా దూసుకుపోతాయని ఐఎంఎఫ్ ముందుగా అంచనా వేసింది. చదవండి: కరోనాను కట్టడి చేసే సబ్బు సంగతులు