Model
-
'తండేల్' సక్సెస్ పార్టీతో ఈ బ్యూటీ ఫోటోలు వైరల్.. ఎవరో తెలుసా..? (ఫొటోలు)
-
అస్సలు మోడల్వి కాలేవన్నారు..కానీ ఇవాళ ఫ్యాషన్కే ..!
కొన్ని స్ఫూర్తిమంతమైన కథలు స్థైర్యంతోపాటు విమర్శలను ఛాలెంజ్గా ఎలా తీసుకోవాలో తెలియజేస్తాయి. అందరూ పదే పదే మన వల్ల కాదన్నప్పుడూ సహజంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దీంతో తెలియకుండా ప్రయత్నమే చెయ్యకుండా చేతులెత్తేస్తాం. కానీ కొందరూ వాటిని తలకు ఎక్కించుకోరు..సాధించాలన్నదే బ్రెయిన్లో తడుతుంటుంది. ఆ పట్టుదలే వాళ్లను అందనంత ఎత్తున ఉన్న సక్సెస్ని అందుకునేలా చేస్తుంది. అలాంటి గాథే ఈ ఫ్యాషన్ మోడల్ దీపక్ గుప్తా స్టోరీ. అతడి కథ ఇన్స్టాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. దీపక్ గుప్తా ముంబై వీధులలో మోడల్గా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడూ అందరూ నువ్వు మోడల్వి కాలేవనే చెప్పేవారు. మరికొందరూ ఏకంగా నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీకి సరిపోవని ముఖం మీద చెప్పేశారు కూడా. అయినా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు దీపక్. మోడల్గా తాను నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. మొదట్లో తనను చూసి నువ్వు ప్రముఖ లూయిస్ మిట్టన్ బ్రాండ్కి మోడల్వి కాలేవని అని తేల్చేశారు. ఎన్నో తిరస్కారాలు..అయినా దీపక్ మాత్రం ఏదో ఒక రోజు వీటన్నింటికి మించిన బ్రాండ్కి మోడల్ని అవుతానన్నదే అతడి గట్టి నమ్మకం. అయితే అతడి ఆశే చివరికి ఫలించిం అనుకున్నట్లుగానే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ రన్వేపై మోడల్గా వెళ్లేంత స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫ్యాషన్ పరిశ్రమలో పేరుగాంచిన మోడల్గా నెంబర వన్ స్థాయిలో ఒకడిగా ఉన్నాడు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎన్నో ఆఫర్లు అందుకున్నాడు."నాడు అందరూ ఫ్యాషన్ ఇండస్ట్రీకి తనస్సలు సూటు కావని అన్నారు. కానీ ఇవాళ ఫ్యాషన్కే ఐకానిక్గా మారాను అంటూ తన విజయ గాథను ఓ డాక్యుమెంట్ రూపంలో పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్గా " కాబట్టి ఎందుకు కాలేను" జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో అతడి స్ఫూర్తిదాయకమైన కథ బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, నర్గీస్ ఫఖ్రీ వంటి ప్రముఖులని కదిలించింది. అతడు షేర్ చేసిన వీడియోకి ప్రతిస్పందనగా రెడ్హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Deepak Gupta (@thedeepakgupta1) (చదవండి: అత్యంత ప్రమాదకరమైన పాయిజన్లతో తయారైన ఔషధాలివే..!) -
మదరాసు మెరుపుతీగ
నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి ఫ్లస్ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్ సమంతగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్ను కాపాడుకుంటూనే, తన ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే.. ⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.⇒చదువు అయ్యాక, మోడల్గా మారి, కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘మిస్ మద్రాస్’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్ ఆఫ్ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్గా నిలిచింది.⇒దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్ విత్ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.⇒ తొలిసారి ‘నాయిం శేఖర్’ చిత్రంతో హీరోయిన్గా మారింది. తర్వాత ‘టైమ్ ఎన్న బాస్!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.⇒ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, ‘ఇన్నమ్ ఒరు మురాయ్’, ‘కనవు’ అనే తన పోయెటిక్ వ్యూ వీడియోస్లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్’ ఆహోలో స్ట్రీమ్ అవుతోంది.ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి. -
సిల్వర్ స్క్రీన్ శిల్పం
‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.ఏ క్యారెక్టర్నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్. -
అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం..
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ డేల్ హడన్(Dayle Haddon(76)) అనూహ్యంగా మృతి చెందారు. తన ఇంటిలోని మొదటి అంతస్తులో అచేతనంగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. అయితే మోడల్ మరణం అనుమానాస్పదం లేక హత్యా అనే అనుమానం రేకెత్తించింది. అయితే పోలీసుల విచారణలో విషపూరిత కార్బన్ మోనాక్స్డ్ని పీల్చడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంటిలోని బాయిలర్ హీటింగ్ యూనిట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ హీటింగ్ యూనిట్ కార్బన్ మోనాక్సైడ్ వాయువు(Carbon Monoxide)కి మూలం. కావున ఈ యూనిట్ లీకేజ్ లోపం కారణంగానే ఈ కెనడా మోడల్(Canadian Model) మరణించినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అలాగే అగ్నిమాపక కంపెనీ నమోదు చేసిన రీడింగ్లో ఆ ఇంటిలో కార్బన్ మోనాక్స్డ్ వాయువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మాంట్రియల్లో పుట్టి పెరిగిన డేల్ హడన్కి ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో మంచి నిష్ణాతురాలు.తొలుత బ్యాలెట్(డ్యాన్సర్గా) ఈ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత రెవ్లాన్, ఎస్టీ లాడర్, క్లైరోల్ మరియు మాక్స్ ఫ్యాక్టర్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు మోడల్గా పనిచేసింది. అంతేగాదు వోగ్ మేగజైన్ కవర్పేజ్లో ఆమె ముఖం చిత్రం ప్రచురితమైంది. అలా ఆమె సూపర్ మోడల్ అనే పేరుని సుస్థిర పరుచుకుంది. అంతేగాదు 15 ఏళ్లకు పైగా లోరియల్(L'Or'eal) అనే కాస్మెటిక్ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసింది. అలాగే యూనిసెఫ్కు అంబాసిడర్గా బాలికలు, మహిళల విద్య కోసం కృషి చేశారు. అందుకోసం స్వచ్ఛంద సంస్థ విమెన్వన్ని స్థాపించి మహిళలకు మంచి విద్య అందేలా చూశారామె. కేవలం అందంతోనే గాక దయ, మానవత్వం వంటి సేవా కార్యక్రమాలతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది డేల్. తన తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమార్తె ర్యాన్ నివాళులర్పించారు. కాగా కుమార్తె కుమార్తె ర్యాన్ హాడన్ జర్నలిస్ట్, అల్లుడు పెన్సిల్వేనియా ఇల్లు బ్లూకాస్ హాల్మార్క్ నటుడు.(చదవండి: వనితదే చరిత) -
అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటి..?
మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..విదేశాల్లోని మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం. నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!) -
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన నటి, మోడల్ కృతిక అవస్థి (ఫొటోలు)
-
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
స్లిమ్గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!
చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్గా అయ్యిపోతారు. అంత సింపుల్గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్లో తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా. View this post on Instagram A post shared by 𝓗𝓲𝓶𝓪𝓷𝓼𝓱𝓲 𝓴𝓱𝓾𝓻𝓪𝓷𝓪 (@himanshian_) (చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!) -
బికినీలో మోడల్ ర్యాంప్ వాక్.. మండిపడుతున్న నెటిజన్లు
పాకిస్తానీ మోడల్ రోమా మైఖేల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో భాగంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. అంతేగాదు ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ఖాతా నుంచి తొలగించక తప్పలేదు. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో రోమా పాకిస్తాన్కి ప్రాతినిధ్యం వహించడంతోనే ఇంతలా వ్యతిరేకత ఎదురయ్యింది. పాకిస్తాన్లో మహిళలు ధరించే దుస్తుల విషయమై కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. అందులోనూ రోమా బికినీ ధరించి ర్యాంప్వాక్ చేయడమే గాక తాను పాకిస్తానీని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఊపందుకున్నాయి.రోమా మైఖేల్ ఎవరు?లాహోర్కు చెందిన రోమా మైఖేల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఒక ప్రొఫెషనల్ మోడల్గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు, ప్రసిద్ధ బ్రాండ్లతో కూడా పనిచేస్తుందామె. అంతేగాదు రోమా కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్స్టాలో రోమాకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే థాయ్లాండ్లో జరుగుతోన్న ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో దాదాపు 69 మంది అందాల భామలు పాల్గొన్నారు. అక్టోబర్ 25న ఫైనల్ ఈవెంట్ జరుగనుంది. అప్పుడే టైటిల్ విన్నర్ను ప్రకటిస్తారు. అందులో భాగంగా వారందరికీ వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తానీ మోడల్ రోమా (Roma Michael) బికినీలో ర్యాంప్ వాక్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమె వస్త్రాధారణను తప్పపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ వీడియో పలు ఖాతాల్లో షేర్ కావడంతో ఆ పోస్టును తొలగించినా ఆమెపై కామెంట్ల వెల్లువ ఆగడం లేదు. View this post on Instagram A post shared by Roma Michael Official (@romamichael78) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
గ్రామాలకు సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్టాప్లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ సోలార్ విలేజ్..గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.అంతా సోలార్మయంపైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్ను గ్రిడ్కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్ను అమరుస్తారు. బహుళ ప్రయోజనాలు..సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది. సిరిపురంలో సర్వే పూర్తిమధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగంమా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లాబిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లారుణపడి ఉంటాం..మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా -
మరోసారి హాట్టాపిక్గా మార్లిన్ మన్రో జీవితం..!
పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త సీరియస్గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్ బాల్ స్టార్ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మార్లిన్ మన్రో బర్త్ డే సాంగ్ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్ తాలూకు ప్రైవేట్ ప్రపంచంపై ‘ది ఫిక్సర్’ పుస్తకం దృష్టి సారిస్తుంది. మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్ ఒటాస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ మాత్రమే కాకుండా ‘డెయిలీ మెయిల్’ పత్రికలో వన్స్ అపాన్ ఏ టైమ్ వచ్చిన ‘ఆస్క్ నాట్’ సీరియల్లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్’ రచయితలు జోష్ యంగ్, మాన్ఫ్రెడ్లు వాడుకున్నారు. మార్లిన్ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.(చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?) -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్లో ఉండేలా నేరుగా మెసేజ్లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
డయానాలా కనిపించే ప్రముఖ ప్యాషన్ ఐకాన్ ఆమె..!
కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్కెన్ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు. ఇక కిట్టీ 2015 నుంచి మోడల్గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్మాన్లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్పై మోడల్గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్మెంట్కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్గా కూడా ఉంది.వ్యక్తిగత జీవితం..బిలియనీర్ మైఖేల్ లూయిస్ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్లో తండ్రిని..!) -
వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్స్ పెటిట్గా కన్నడ బ్యూటీ!
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్గా పనిచేస్తూ మరోవైపు మోడల్గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్మెంట్తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్గా టైటిల్ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!) -
సివిల్స్లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!
అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది. సోషల్ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్. సారా మెంటల్ హెల్త్ లాయర్(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్కి గురయ్యింది. సోషల్మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్కి దూరంగా ఉంది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని మిస్ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా. మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్ మీడీయా ట్రోల్స్కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్లైన్లో టైప్ చేసే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. (చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత) -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Siksha Das IPL 2024 Photos: ఐపీఎల్కు హీట్ పెంచుతున్న బెంగాలీ భామ.. ఎవరీ బ్యూటీ?(ఫోటోలు)
-
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
-
డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!
ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్తో బాధపడుతోంది. డౌన్సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతోంది. ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్బ్రెడ్ బై అనే బ్రాండ్తో ప్రముఖ బేకర్గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు మోడల్గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా. "మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్గా కూర్చొండిపోలే. లాస్ట్ని ఫస్ట్గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా. (చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!
మన దేశంలో అమ్మాయిలు చీరకట్టులో లేదా లెహెంగాలో కనిపించని అంత స్పెషల్గా ఏం ఉండదు. బహుశా ఈ రోజు ఏదైనా పండుగ లేదా వేడుక అయ్యి ఉండొచ్చు అనే అనుకుంటారు. అదే విదేశాల్లో మన దేశీ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో హల్చల్ చేస్తే..పరిస్థితి ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా అందరీ ముఖాల్లో వివిధ రకాల ఎక్స్ప్రెషన్లు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్టన్నింగ్ లుక్స్తో ఒక్కసారిగా అటెన్షన్ అయ్యిపోతారు. అలానే ఇక్కడొక మహిళ లెహంగాతో లండన్ వీధుల్లో షికారు చేసింది. అంతే వారి అటెన్షన్ అంతా ఆమెపైనే నిలిపి నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో శ్రద్ధ అనే భారత సంతతి స్పానిష్ మోడల్ ఎరుపు రంగు ఎంబ్రాయిడర్తో కూడిన లెహెంగా ధరించి, నిండుగా ఆభరణాలతో ధగ ధగ మెరిసిపోయింది. లండన్లోని మెట్రో రైలు ఎక్కగానే అందరి చూపు ఆమెపైనే ఉంది. ఇక ఆమె తన గమ్యాన్ని చేరుకుని, అక్కడ వీధుల్లో కాసేపు షికారు చేసింది. అయితే అక్కడ ఉన్న కొందరూ ఆమె చిత్రాలను క్లిక్మనిపించగా కొందరూ ఆసక్తికరమైన రీతీలో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ మేరకు శ్రద్ధ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేస్తూ..ఈ వీడియోకి 'లండన్ దేశీ టాప్ అండ్ స్కర్ట్కి వచ్చిన విశేష స్పందన' అనే క్యాప్షన్ ఇచ్చి మరీ పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం మీరు అని మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shraddha✨ (@shr9ddha) (చదవండి: ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!) -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్లా డ్రస్లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్టాక్లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
మిస్ జపాన్గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం
గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్లోని టీ పాయింట్ హోటల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. అయితే హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్రాజ్ గిల్ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016లో గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో అతని గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్లో బెయిల్పై విడుదలైంది. -
Divya Pahuja: అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశాడా?
మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పటియాలాలోని బస్ స్టేషన్లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్కు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్లో బెయిల్పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్లోని ఓ హోటల్లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్లే కలిసి అభిజీత్తో హత్య చేయించారని ఆరోపించింది. గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. -
నలుగురితో ప్రేమాయణం.. అదే చెత్త రిలేషన్ అంటున్న బ్యూటీ
లవ్ చేయాలా? వద్దా? అని యూత్ ఎక్కువగా ఆలోచించడం లేదు. నచ్చితే కంటిన్యూ అవుదాం.. లేదంటే బ్రేకప్ చెప్పేద్దాం.. అని సులువుగా లవ్ జర్నీ మొదలుపెడుతున్నారు. అంతే సులువుగా విడిపోతున్నారు. బాలీవుడ్లోనూ ఈ ధోరణి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోకే వస్తుంది మాజీ ప్రేమ జంట బషీర్ అషీ-నిఖిత భమిడిపాటి! తాజాగా నిఖిత తన బ్రేకప్కు గల కారణాల్ని బయటపెట్టింది. చెత్త రిలేషన్.. ప్రియుడి మాటలు, చేష్టలు నచ్చకే విడిపోయానంటోంది నటి. ఓ పాడ్క్యాస్ట్లో నిఖిత మాట్లాడుతూ.. 'నా జీవితంలోనే అది అత్యంత చెత్త రిలేషన్షిప్. పనికిమాలిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. మా సంబంధం చాలా విషపూరితమైంది. కానీ అప్పుడు మా జీవితాల్లో చాలామందిని దూరం చేసుకున్నాం. అలా చేయకుండా ఉండాల్సింది! ఇప్పుడు కూడా అతడు బయట నా గురించి మాట్లాడుతున్నాడంటే అది పబ్లిసిటీ కోసమే అనిపిస్తోంది. అయినా మాదసలు రిలేషనే కాదు, జస్ట్ టైం వేస్ట్ చేశాం. ఎమోషన్స్ను కూడా వృథాం చేశాం. అసభ్యంగా మాట్లాడేవాడు అయితే ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అతడు నన్ను మోసం చేయలేదు, నేను తనని మోసం చేయలేదు. కాకపోతే మా బంధం ప్రేమానురాగాలతో కాకుండా రాగద్వేషాలతోనే సాగింది. అసలు మేమిద్దరం ఎందుకు కలిసున్నామో కూడా అర్థం కావడం లేదు. బషీర్ నోటికొచ్చింది మాట్లాడేవాడు. అసభ్య పదజాలంతో దూషించేవాడు. నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు నేనూ ఎదురుతిరిగాను' అని చెప్పుకొచ్చింది నిఖిత. నలుగురితో లవ్వాయణం కాగా నిఖిత.. స్ప్లిట్స్విల్లా 13వ సీజన్లో పాల్గొన్నప్పుడు సామర్థ్య గుప్తాతో ప్రేమలో పడింది. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఆ తర్వాత నటుడు బషీర్ అలీని ప్రేమించింది. ఏడాది తిరిగేలోపే ఈ ప్రేమబంధం కూడా ముక్కలైంది. ఆ తర్వాత ఈ మోడల్.. టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఇందులో తనకు జోడీగా వచ్చిన ప్రియుడు తాన్యేతో కొంతకాలం పాటు డేటింగ్ చేసి అదే షోలో బ్రేకప్ చెప్పేసింది. అదే షోలో హిందీ బిగ్బాస్ ఓటీటీ రెండవ సీజన్ కంటెస్టెంట్ జద్ హదీద్తో లవ్లో పడ్డట్లు పేర్కొంది. చదవండి: టాలీవుడ్లో ఒక్క సినిమా లేదు.. బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్! -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్హీరో’ పుస్తకంతో రైటర్గా మారింది. రైటర్గా తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
మల్టీకలర్ డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న ఖుషి కపూర్..చూశారంటే మైమరిచిపోవాల్సిందే (ఫోటోలు)
-
నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె..
న్యూస్ రీడర్గా, కంపెనీ సీఈఓగా సంచలనం సృష్టించిన 'ఏఐ' (AI) టెక్నాలజీ, ఇప్పుడు ఓ కొత్త అవతారంలో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ.. ఆన్లైన్ యాడ్స్ చేస్తూ లక్షల డబ్బు సంపాదిస్తున్న దీని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 25 ఏళ్ల యువతిలా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే స్పానిష్ డిజైనర్ 'రూబెన్ క్రూజ్'( Ruben Cruz ), అతని కంపెనీ 'ది క్లూలెస్' కలిసి ఏఐ 'ఐటానా' (Aitana)ను రూపొందించారు. ఇది 25 ఏళ్ల యువతి ఎలా ఉంటుందో.. అలాంటి రూపంతో, ఫిట్ బాడీ కలిగి.. పింక్ స్ట్రెయిట్ హెయిర్తో చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. రుబెన్ క్రూజ్ యూరోన్యూస్ ఇంటర్వ్యూలో ఐటానా గురించి మాట్లాడుతూ.. బిజినెస్లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఏఐ మోడల్ను సృష్టించామని, ఇది ప్రస్తుతం మాకు లాభాలను తీసుకురావడంలో చాలా ఉపయోఅగపడుతున్నట్లు వెల్లడించాడు. మోడల్స్, ఇన్ఫ్లుయెంజర్స్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్న సమయంలో ఐటానాను రూపొందించామని, ప్రయోగాలకు, వివిధ లుక్స్ని ట్రై చేసేందుకు కాస్త సమయం పట్టింది, కానీ ప్రస్తుతం ఆదాయం లక్షల్లో ఉన్నట్లు ది క్లూలెస్ సంస్థ కో ఫౌండర్ 'డయానా న్యూనెజ్' వెల్లడించింది. నెలకు రూ.9 లక్షలు ఐటానాకు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 1,24,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఏఐ మోడల్ అనేక కంపెనీలకు మోడల్గా వ్యవహరిస్తూ నెలకు సుమారు 3000 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3 లక్షలు) సంపాదిస్తున్నట్లు, కొన్ని సార్లు ప్రకటనలు ఎక్కువ సంఖ్యలో వస్తే.. 10000 యూరోలు (సుమారు రూ. 9 లక్షలు) సంపాదిస్తోందని చెబుతున్నారు. డేట్కు పిలిచిన నటుడు నిజానికి ఐటానా మనిషి కాదని తెలియని చాలా మంది ఆమెకు మెసేజులు చేస్తూ ఉంటారు. దాదాపు 5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న ఒక ప్రముఖ లాటిన్ అమెరికా నటుడు ఏఐ మోడల్ అని తెలియక ఏకంగా డేట్కు పిలిచినట్లు సమాచారం. చివరికి అది మనిషి కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ! సెలబ్రిటీలలో మొదలైన భయం ఏఐ ఐటానా రాక సెలబ్రిటీలలో ఒకింత భయాన్ని రేపింది. ఇప్పటి వరకు ఉద్యోగులను మాత్రమే భయపెడుతున్న ఏఐ.. ప్రస్తుతం సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి మోడల్స్ రానున్న రోజుల్లో ఎక్కువైతే.. ఈ రంగంలోని సెలబ్రిటీలకు గండమే అని నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Aitana Lopez (@fit_aitana) -
పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!
ప్రకృతి వ్యవసాయంలో సరికొత్త అధ్యాయం ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) నమూనా. కొద్ది సెంట్ల భూమిలోనే ఏడాది పొడవునా రకరకాల కూరగాయ పంటల సాగు ద్వారా రైతుకు నిరంతర ఆదాయం ఇస్తున్న పంటల నమూనా ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులతో ఏటీఎం సాగును చేపట్టి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. కౌలు రైతు దూసరి పృథ్వీరాజ్ ఇందుకో నిదర్శనం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని తూములూరు శివారు క్రిస్టియన్పాలెం పృథ్వీరాజ్ నివాసం. కౌలుకు తీసుకున్న ఎకరం 20 సెంట్ల రేగడి భూమిలో ఏటీఎం మోడల్ను గత రెండు నెలలుగా సాగు చేస్తున్నారు. నాలుగు అడుగుల వెడల్పుతో ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని పైన డిజైన్లో చూపిన విధంగా 20 కూరగాయ పంటలు వేశారు. ఘనజీవామృతం, జీవామృతం 15 రోజులకోసారి ఇస్తున్నారు. జిల్లాలో 40 మంది రైతులతో ఏటీఎం మోడల్ను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామని డీపిఎం రాజకుమారి తెలిపారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి రెండు నెలల్లో రూ. పది వేల ఆదాయం! 2 నెలల క్రితం 20 సెంట్లలో ప్రకృతి వ్యవసాయం ఏటీఎం మోడల్లో పంటలు సాగు చేస్తున్నాను. 4 అడుగుల వెడల్పుండే 8 బెడ్స్లో 20 రకాల పంటలు వేశాం. గోంగూర, రెడ్ తోటకూర, పాలకూర, చుక్కకూర 20 రోజులకోసారి కోతకు వస్తున్నాయి. మరో ఐదారు బెడ్లలో ఆకుకూరలు కోయాల్సి ఉంది. బెండ, వంగ, బీర, గోరుచిక్కుడు, అనుములు, చెట్టుచిక్కుడు కోతకు వచ్చాయి. అన్నీ కలిపి ఇప్పటికి రూ. 10 వేల ఆదాయం వచ్చింది. చేలో ఒకే ఒక పంట వేసి చేతికొచ్చేవరకు ఆగకుండా రకరకాల పంటలను సాగు చేయటం ద్వారా ఎప్పటి కప్పుడు అధికాదాయం పొందుతున్నాం. ఏడాదికి 20 సెంట్లలో రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుందనుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరం పంటలను కనిపెట్టుకుంటూ పనులను మేమే చేసుకుంటున్నాం. రసాయనాల్లేని ఆహారం తీసుకుంటూ తగిన ఆదాయం పొందుతున్నాం. – డి. పృథ్వీరాజ్ (63058 37151), క్రిస్టియన్పాలెం, గుంటూరు జిల్లా (చదవండి: ఇంటి పంటగా కుంకుమ పువ్వు!) -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
బికినీతో ఎయిర్పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్లో ఎయిర్పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్ను ఇన్స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్లోని నవేగాంటెస్ ఎయిర్పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
బతికుండగానే అంత్యక్రియలు, మోడల్ అరియానా కన్నుమూత
బ్యూటీ క్వీన్, వెనిజులా మోడల్ అరియానా వీర రోడ్డుప్రమాదంలో మరణించింది. జూలై 13న ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. కారు నడిపే క్రమంలో అలసటకు లోనైన అరియానా డ్రైవింగ్లో రెప్పవాల్చడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అరియానా తల్లి వివియన్ ఓచోవా మీడియాకు వెల్లడించింది. తను ఎంతోమందికి సాయం చేసిందని, అలాంటి నా కూతుర్ని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా ఈ బ్యూటీ మే నెలలో అంత్యక్రియల వీడియో పోస్ట్ చేసింది. 'నా వీడియోలను నేనే తీసుకుంటాను. నేను చనిపోయాక నా అంత్యక్రియలను ఎవరైనా రికార్డు చేస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి నేనే రికార్డు చేసి పెట్టుకుంటున్నాను' అంటూ సదరు వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కాగా అరియానా మోడల్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. తను ఫుల్ హౌస్ క్లీనింగ్ సర్వీస్ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఇకపోతే అక్టోబర్లో జరగబోయే 'మిస్ లాటిన్ అమెరికా ఆఫ్ ద వరల్డ్ 2023' పోటీల్లో అరియానా.. వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం జరగడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే? -
రెడ్హ్యాండెడ్గా.. విమానాశ్రయంలో డ్రగ్స్తో పట్టుబడిన మోడల్
లండన్: యూకేలోని ఓ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన సూపర్ మోడల్ జిగి హడిద్ని అధికారులు డ్రగ్స్తో పట్టుకున్నారు. గిగి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ ద్వీపానికి వెళ్లింది. ఈ క్రమంలో ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె బ్యాగులను చెక్ చేయగా.. అందులో గంజాయి, వాటిని తాగేందుకు ఉపయోగించే వస్తువులు కూడా అందులో లభించాయి. ఇక రెడ్హ్యాండెడ్గా గిగి దొరికిపోయింది. ఆ సమయంలో గిగి తన స్నేహితురాలు లేహ్ నికోల్ మెక్కార్తీతో కలిసి ఉన్నారు. దీంతో పోలీసులు వారివురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో వారు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి రూ.1000 డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్ సూపర్ మోడల్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చదవండి China Common Man Becomes Rich: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది! -
26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!
సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు వయసు తేడాను కొందరు పరిగణనలోకి తీసుకుంటారు. సెలబ్రీటీల విషయంలో వీటిపై మరింత ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎవరైనా పెళ్లి విషయంలో కాస్తా అటు ఇటుగా 5 నుంచి పదేళ్ల వయస్సు తేడాలను చూసి ఉంటాం. కానీ ఏకంగా తన వయసులో సగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అరుదుగా కనిపించే దృశ్యం. కానీ పెళ్లికి వయసుతో పనిలేదంటూ.. నిజ జీవితంలోనూ ఇలాంటి పెళ్లి చేసుకోవచ్చని నిరూపించాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. (ఇది చదవండి: ‘బ్లడ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి) ప్రముఖ మోడల్, నటుడైన మిలింద్ సోమన్ జీవితం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను ఇప్పటికే చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జరిగిన వివాహాం అన్నింటికంటే ప్రత్యేకతను సంతరించుకుంది. 2018లో అంకితా కున్వర్తో జరిగిన వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అంకితను పెళ్లి చేసుకునే సమయానికి మిలింద్ వయసు 52 ఏళ్లు కాగా.. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలే. తన వయసులో సగం మాత్రమే అంకితను పెళ్లాడిన నటుడిగా సోమన్ నిలిచాడు. అంతకుముందే చాలామందితో డేటింగ్.. అంకితతో పెళ్లికి ముందు మిలింద్ మొదట ఫ్రెంచ్ నటి మైలీన్ జంపానోయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అతని కంటే మైలీన్ 15 సంవత్సరాలు చిన్నది. కాగా.. మిలింద్, మైలీన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చిత్రం సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్థలు రావడంతో 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మిలింద్ సోమన్ చాలామంది నటీమణులతో డేటింగ్ కొనసాగించారు. మోడల్ మధు సప్రే, నటి షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ వంటి నటీమణులతో అతనితో రిలేషన్లో ఉన్నారు. కానీ చివరికీ వయసులో తనకంటే సగం చిన్నదైన అంకిత కున్వర్ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా.. దాదాపుగా పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా వీరి బంధం బలపడుతోంది. ఇటీవల ఇద్దరు తరచుగా ట్రావెలింగ్, ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) క్యాబిన్ క్రూగా పనిచేసిన అంకిత మిలింద్ని పెళ్లి చేసుకునే ముందు అంకిత క్యాబిన్ క్రూ మెంబర్గా పనిచేసింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. అంకిత తరచుగా నన్ను పాపాజీ అని పిలుస్తుందని మిలింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంకితను పెళ్లి చేసుకోవాలనే కోరికను బయటపెట్టినప్పుడు.. అతని తల్లి షాక్ అయ్యిందని తెలిపారు. ఇది విని అంకిత కుటుంబ సభ్యులు సైతం షాక్ తిన్నారని నటుడు వివరించాడు. కాగా.. మిలింద్ హిందీ కామెడీ షో ఖత్రోన్ కే కిలాడీ సీజన్-3లో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
చాట్జీపీటీ, గూగుల్లకు పోటీగా మెటా ఏఐ.. ఉచిత వెర్షన్ విడుదల
ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్ను విడుదల చేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్జీపీటీ, బార్డ్ చాట్బాట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ ఏఐ, గూగుల్లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది. ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని.. ఏం జరిగిందంటే.. "ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా మెటా ఏఐ మోడల్ సరికొత్త, శక్తివంతమైన వర్షన్ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా? ఎంత అందంగా ఉందో
టీమిండియా యవ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన కెరీర్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. తాజాగా డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టుతో రెడ్బాల్ క్రికెట్లో కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ అడుగుపెట్టాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత కిషన్ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోయింది. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించిన కిషన్.. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా ఇషాన్ కిషన్ ఈ రోజు(జూలై 18) 25వసంతంలో అడుగుపెట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఫీల్డ్లో దూకుడుగా ఉండే కిషన్కు ఓ గర్ల్ఫ్రెండ్ ఉందన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. కిషన్ గత కొంతకాలంగా మోడల్ అదితి హుండియాతో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆమె గతంలో చాలా సార్లు పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ లలో కూడా దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ 2019 సీజన్లో ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. కిషన్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడిని ఉత్సాహపరుస్తూ కన్పించింది. దీంతో దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు వెళ్లిన ఫోటోలు కూడా గతంలో వైరల్ గా మారాయి. అదే విధంగా కిషన్ డబుల్ సెంచరీ సాధించినప్పుడు అతడిని అభినందిస్తూ ట్విట్ కూడా ఆమె చేసింది. ఎవరీ అదితి హుండియా? అదితి హుండియా.. మోడలింగ్ వరల్డ్లో బాగా సుపరిచితమైన పేరు. రాజస్తాన్కు చెందిన 25 ఏళ్ల అదితి మోడల్గా తన కెరీర్ ప్రారంభించిన కొద్దిరోజులకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మిస్ ఇండియా ఫైనల్కు చేరింది. అదే ఏడాదిలో మిస్ రాజస్తాన్గా ఆమె నిలిచింది. అలాగే 2018లో సూపర్ నేషనల్ మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్ అందాల పోటీలలో కూడా భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది. అయితే అప్పడప్పుడు తన ఫోటోలను అదితి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సమయంలో అదితి తన ఫోటో షూట్స్తో కుర్రకారును పిచ్చెక్కించింది. మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ దుస్తుల్లో కూడా అదితో తన అందంతో అందరిని కట్టిపడేసింది. చదవండి: Rinku Singh: ఐపీఎల్ కింగ్.. నాకు అతడే ఆదర్శం.. ఇక భజ్జూ పా సైతం..: రింకూ సింగ్ -
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది!
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్స్టర్డామ్లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్కి కిరీటం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్మోడల్గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ. (చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది) -
టాప్ స్పీడ్.. లాంగ్ రేంజ్.. లగ్జరీ.. అదిరిపోయే టెస్లా కార్లు (ఫొటోలు)
-
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
నోయిడా: నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది. అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాము. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మన్మోహన్ సింగ్ ఒక పిరికిపంద.. అమిత్ షా -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాత్రూమ్లో శవమై తేలిన యువనటుడు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్పుత్ బాత్రూమ్లో శవమై తేలాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. అయితే అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం కారణంగానే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) ఆదిత్య సింగ్ రాజ్పుత్ జర్నీ దిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్పుత్ మోడల్గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించాడు. స్ప్లిట్స్ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) View this post on Instagram A post shared by Aditya Singh Rajput OFFICIAL (@adityasinghrajput_official) -
ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటితో సహా ఓ మోడల్, ఏజెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) ఇన్స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్లో ఏజెంట్తో కలిసి భోజ్పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్ను అక్కడికి పంపాం. ఏజెంట్ను ఆన్లైన్ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్ని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని వెల్లడించారు. -
ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్కు గుండెపోటు..
చాలామందికి సెలబ్రిటీ అవ్వాలని కోరికగా ఉంటుంది. కానీ కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్ సింగర్ జిమిన్లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ మృతి చెందిన విషయం తెలిసిందే! తాజాగా అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మోడల్ క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ(34) అచ్చం కిమ్ కర్దాషియన్లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్కు జిరాక్స్ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు ఏప్రిల్ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఏప్రిల్ 20.. ఉదయం 4.31 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఒకరు.. అస్తెన్ చనిపోయిందని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ విషాద వార్తను చేరవేశారు. ఆ ఫోన్ కాల్ మా జీవితాలనే కుదిపేసింది. దురదృష్టవశాత్తూ అస్తెన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తను తీసుకున్న చికిత్స వల్లే ఇంతటి ఘోరం జరిగి ఉండవచ్చు' అని క్రిస్టినా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: 15 ఏళ్ల బంధానికి ముగింపు, బాలీవుడ్ జంట విడాకులు -
24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!
బిజినెస్ ప్రపంచంలో భారతీయ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. కంపెనీలు స్థాపించి విజయవంతంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. 24 ఏళ్లకే కంపెనీ పెట్టి దాన్ని రూ.1000 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన ఓ యువతి కథ ఇది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) వీయూ(Vu) గ్రూప్ ఛైర్పర్సన్, సీఈవో అయిన దేవితా సరాఫ్ 24 ఏళ్ల వయసులో ఈ కంపెనీని ప్రారంభించారు. Vu టెలివిజన్ల ఆదాయం రూ. 1000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పటివరకు 30 లక్షలకుపైగా టెలివిజన్లను విక్రయించింది. వీయూ టెలివిజన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ టీవీ బ్రాండ్. హురున్ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారతదేశంలో స్వయంకృషితో ఎదిగిన 40 ఏళ్లలోపు మహిళల్లో దేవితా సరాఫ్ అత్యంత ధనికురాలు. ఫార్చ్యూన్ ఇండియా టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. దేవితా సరాఫ్ను ఫోర్బ్స్ 'ఇండియాస్ మోడల్ సీఈఓ'గా ఎంపిక చేసింది. (ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?) దేవితా సరాఫ్ 2021లో ‘డైనమైట్ బై దేవితా సరాఫ్’అనే అనే పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఇది వ్యాపారంలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి పెర్ఫ్యూమ్. కోవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయడానికి దేవిత సరాఫ్ ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన దేవితా సరాఫ్ Vu గ్రూప్ సీఈవో మాత్రమే కాదు.. ఫ్యాషన్, లగ్జరీ ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. చాలా మంది ప్రసిద్ధ భారతీయ డిజైనర్లకు మోడల్గా ఉన్నారు. అనేక లగ్జరీ బ్రాండ్ల కోసం పనిచేశారు. నివేదికల ప్రకారం... దేవితా సరాఫ్ నికర ఆస్తి విలువ దాదాపు రూ.1800 కోట్లు. ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన ఆమె అంతర్జాతీయ హై ఐక్యూ మెన్సా సొసైటీలో సభ్యురాలు. -
నేను అందంగా లేనని మొహం మీదే అన్నారు.. కానీ: శోభిత
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఆమె హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్ లైఫ్తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో కనిపించింది. తాజాగా గతంలో ఎదురైనా ఓ సంఘటనను గుర్తు చేసుకుంది శోభిత. మొదట మోడల్గా పని చేస్తున్న రోజుల్లో ఆడిషన్స్కు వెళ్తే ఎవ్వరూ కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపింది. ఓ ప్రముఖ కంపెనీ తనను బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికి రావన్నారని.. కానీ ఆ తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని చెప్పుకొచ్చింది శోభిత. శోభిత మాట్లాడుతూ.. 'నేను అందంగా లేనని ఓ కంపెనీ వాళ్లు అన్నారు. నేను కూడా వెంటనే అవును అని ఒప్పుకున్నా. నా 20 ఏళ్ల వయసులో ఓ షాంపు కంపెనీకి వాణిజ్య ప్రకటన కోసం వెళ్లా. ఆ సమయంలో తనను బ్యాక్ గ్రౌండ్ మోడల్గా కూడా పనికి రావు అన్నారు. కొంతకాలం తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేసింది శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఆమె నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ రెండో భాగం ఈ ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్లో రెగ్యులర్గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..) -
మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..
ఇటీవలకాలంలో కోపంతో లేదా మరేదైనా ఇతర కారణాలతోనూ హత్యలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారిలోంచి వికృతమైన సైకో బయటకు వచ్చి.. బాధితుల కుటుంబసభ్యులు కడసారిచూపు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసుగా చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలాంటి దారుణ ఘటనే హాంకాంగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హాంకాంగ్లోని అబ్బి చోయి అనే 28 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. ఆమె కాళ్లను నగరశివార్లలోని ఒక ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో గుర్తించారు పోలీసులు. ఆ ప్రాంతంలోని మృతదేహాన్ని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా.. ఆమె శరీరంలోని మొండెం, తల, చేతులు గుర్తించాల్సి ఉంది. ఇటీవలే ఎల్ అఫియల్ మొనాకో ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్పై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి శరీర భాగాల కోసం గాలిస్తుండగా... స్థానిక మ్యాగజైన్లో ఆమె ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హాంకాంగ్ పోలీసులు మాట్లాడుతూ..ఈ హత్యకు సంబంధించి ఆమె మాజీ భర్తను, బావా, అతని సోదరుడు, అత్తగారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మోడల్ చోయి మంగళవారం నుంచి కనిపించకుండా పోయిందని, చివరిసారిగా తాయ్ పీఓ జిల్లాలో కనిపించిందని తెలిపారు. ఆమె శరీర భాగాలను ఆ జిల్లాలోని గ్రామంలోనే గుర్తించారు. మిగతా భాగాల కోసం డ్రోన్ల తోహా అధికారుల బృందం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
లండన్ నుంచి పేదోళ్ల ఇంటి వరకు...
బ్రిటీష్–ఇండియన్ మోడల్గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన. భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. మన బాలీవుడ్తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది. ‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన. ఇంగ్లాండ్లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ‘ఇండియాస్ ఫర్గాటెన్ పీపుల్’ (నెట్ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. -
Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ..
సాక్షి,హైదరాబాద్: మోడలింగ్ పేరుతో ప్రముఖ మాల్స్లో ర్యాంప్ షోలు నిర్వహించి, ప్రముఖ యాడ్స్లో సినీ తారలు, క్రికెటర్లతో కలిసి నటించే అవకాశాలు కల్పిస్తానని అమాయకులకు టోకరా వేస్తున్న ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాంప్ షోలో పాల్గొనే వారితో మేకప్ ఛార్జీలు, కాస్ట్యూమ్స్ ఇతర ఉపకరణాల పేరుతో ఖాతాలలో డబ్బు జమ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన అపూర్వ అశ్విన్ దౌడ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ గతంలో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కాస్మోపాలిటన్ మోడల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన అతను చైల్డ్ మోడలింగ్ షోలు నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో మదీనా గూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ కుమార్తెను తాను నిర్వహించిన షోలో ఎంపిక చేశాడు. అనంతరం ఆమెకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్తో కలిసి యాడ్లో నటించే అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. ఇందుకుగాను క్యాస్టూమ్స్, షూటింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.14 లక్షలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. అయితే తన కుమార్తెకు అవకాశం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15.60 లక్షల నగదు, 4 యాపిల్ ఫోస్లు, ల్యాప్ట్యాప్, 3 సిమ్ కార్డులు, 2 ఆధార్కార్డులు స్వాధీదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మంబైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. చదవండి: కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం! -
మోడల్తో డిన్నర్కు వెళ్లిన టైటానిక్ స్టార్, ఫోటో వైరల్
టైటానిక్ హీరో లియొనార్డో డికాప్రియో ఓ మోడల్తో కలిసి డిన్నర్కు వెళ్లాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదైన మోడల్ విక్టోరియా లామస్తో కలిసి మంగళవారం రాత్రి ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇక డిన్నర్ పూర్తవగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వారేమైనా ప్రేమలో ఉన్నారని కొందరు భ్రమపడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇలా కలిసి డిన్నర్ను ఆస్వాదించారట. కాగా నటుడు లారెంజో లామస్ కూతురే విక్టోరియా లామస్. ఎక్కువగా మోడలింగ్పైనే ఫోకస్ పెట్టిన విక్టోరియా ద లాస్ట్ థింగ్ ద ఎర్త్ సేడ్, ఎ విర్చుయస్ రోల్, టు నైనర్ వంటి సినిమాల్లోనూ నటించింది. లియొనార్డో డికాప్రియో విషయానికి వస్తే ఇటీవలే అతడు తన ప్రేయసి కెమిలా మోరోన్కు బ్రేకప్ చెప్పాడు. ప్రస్తుతం అతడు మోడల్ గిగి హాడిడ్తో లవ్లో ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ పార్టీలో వీరిద్దరూ క్లోజ్గా కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. గిగి విషయానికి వస్తే ఆమె ప్రియుడితో విడిపోయి ఒక్కగానొక్క బిడ్డతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Izabel Alves (@fofocamiope) చదవండి: తనపై జరిగిన దాడిపై తొలిసారి స్పందించిన హీరో తొలిసారి కూతురిని చూసి రేవంత్ ఎమోషనల్ -
FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ 2022 ఫాలో అవుతున్న వారికి క్రొయేషియా మోడల్ ఇవానా నోల్ గురించి పరిచయం అక్కర్లేదు. అసభ్య దుస్తులకు అనుమతి లేని చోట పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హాట్ లుక్స్తో ఫిఫా అభిమానులను అలరిస్తుంది. తనకు తాను హాటెస్ట్ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించుకున్న ఇవానా నోల్ తాజాగా తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు హాజరైన ఇవానా నోల్ మరింత రెచ్చిపోయింది. క్రొయేషియా జెండా కలర్ లో కట్ టాప్ డ్రెస్.. బ్లూ జీన్స్తో మ్యాచ్కు హాజరైంది. కట్టిపడేసే అందంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించింది. క్లీవేజ్ షో చేస్తూనే హాట్ హాట్ లుక్స్తో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది. అయితే క్రొయేషియా కథ సెమీస్లో ముగియడంతో అమ్మడు అందాలు కూడా ఇక్కడికే పరిమితమవుతాయేమోనని కొంతమంది తెగ ఫీలవుతున్నారు. క్రొయేషియా వెళ్లిపోయింది కాబట్టి తాను వెళ్లిపోతుందని.. ప్చ్ అందాల ప్రదర్శన మిస్ అవుతామోనని మరికొంత మంది కామెంట్స్ చేశారు. అయితే ఇవానా నోల్ ఖతర్ను వీడి వెళుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని.. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసాకే ఆమె తన దేశం వెళుతుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనా తన అందంతో ఈసారి ఫిఫా వరల్డ్కప్లో ఆటగాళ్లతో సమానంగా పేరు పొందిన ఇవానా నోల్కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అరబ్ లాంటి కఠినమైన దేశాల్లో వారి ఆంక్షలను బేఖాతరు చేసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందాలు ఆరబోసిన ఇవానా నోల్ దైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా తెలిపారు. View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) చదవండి: FIFA WC 2022: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ అరబ్ దేశమైన ఖతర్లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్కప్కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్కప్లో హాటెస్ట్ ఫ్యాన్గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు. అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్లో సెగలు పుట్టించింది. చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) -
క్యాన్సర్ బారిన పడిన హీరోయిన్.. ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్
సినీ పరిశ్రమలో ఈమధ్యకాలంలో ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పింది. బాలీవుడ్ నటి రోజాలిన్ ఖాన్ తనకు క్యాన్సర్ ఉందని వెల్లడిస్తూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్యాన్సర్.. నా జీవితంలో ఇదొక అధ్యాయం. ప్రతి ఎదురుదెబ్బ నన్ను బలంగా మారుస్తుంది. నాకోసం ప్రార్థించే వ్యక్తులు చాలామందే ఉన్నారు. నాకు అంతా మంచే జరుగుతుందనుకుంటున్నా. ఇప్పుడు మెడనొప్పి, బ్యాక్ పెయిన్ తప్పించి ఏం లేదు. జిమ్లో వర్కవుట్స్ కారణంగా నొప్పి అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ ప్రారంభదశలోనే దీన్ని గుర్తించగలిగాం. డియర్ బ్రాండ్స్.. ప్రతినెల 2వ వారం షూట్కి అందుబాటులో ఉంటాను. రాబోయే 7నెలల పాటు ప్రతినెలా కీమోథెరపీ చేయించుకోవాలి. ప్రతి సెషన్ తర్వాత వారం రోజుల పాటు రెస్ట్ అవసరం.కాబట్టి 2వ వారంలో నేను మీకు అందుబాటులో ఉంటాను. త్వరలో బట్టతల మోడల్తో పనిచేయాలంటే మీకు ధైర్యం కావాలి. ప్రస్తుతానికైతే లైవ్లోకి వస్తాను అంటూ రోజ్లిన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు మీరు త్వరలోనే కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మోడల్గా కెరీర్ ఆరంభించిన రోజాలిన్ 2012లో ‘దమా చౌక్డీ’ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా సత్తా చాటింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉండేది. క్యాన్సర్ బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పలు బ్రాండ్స్కి మోడల్గా వ్యవహరిస్తుంది. View this post on Instagram A post shared by Rozlyn Khan (@rozlynkhan) -
నా భర్తతో అర్ధరాత్రి చాటింగ్లు, ఫోన్కాల్స్ చాలిక!: నటి ఫైర్
బెంగాలీ నటిమణులు పొరి మొని, బిడ్యా సిన్హ మిమ్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తన సక్సెస్ చూసి కుళ్లుకుంటున్నావని ఒకరు, నీకంత సీన్ లేదని మరొకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంతకీ వీరి మధ్య గొడవేంటో చూద్దాం.. ఈ మధ్యే 'దమాల్' అనే బంగ్లాదేశ్ పీరియాడికల్ చిత్రం రిలీజైంది. రైహాన్ రఫి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బిద్య సిన్హ సాహ మిమ్, సరిపుల్ రాజ్, సియామ్ అహ్మద్, షహనాజ్ సుమీ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు సరిపుల్ రాజ్ భార్యే నటి పొరి మొని. సినిమా ప్రమోషన్స్లో హీరో సియామ్ అహ్మద్, హీరోయిన్ బిద్య సిన్హ క్లోజ్గా కనిపించడాన్ని తట్టుకోలేకపోయింది పొరి మొని. ఆమెకు నా భర్తే దొరికాడా అని రగిలిపోయింది. దీంతో తన ఫేస్బుక్లో.. నీ భర్తతో కలిసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించు అంటూ పరోక్షంగా బిద్య సిన్హకు చురకలు వేసింది. దీనిపై మిమ్ స్పందిస్తూ.. కొందరు నా విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని కౌంటరిచ్చింది. దానికి బదులుగా పొరి మొని ఫేస్బుక్లో దీర్ఘ లేఖను పోస్ట్ చేసింది. 'మీ అందరికీ కొన్ని విషయాలను తేటతెల్లం చేయాలనుకుంటున్నాను. మిమ్.. ఏమన్నావు? నీ సక్సెస్ చూసి కుళ్లుకుంటున్నానా? ఎవరో తెలియని వారు ఇలా అన్నారంటే ఓకే, కానీ ఈ మాట నువ్వెలా అనగలుగుతున్నావు. పోరన్ సినిమాలో సరిఫుల్, నువ్వు జంటగా బాగున్నారని, మీరు మరిన్ని సినిమాలు చేయాలని నేనే కదా ఎన్నోసార్లు చెప్పాను. మీ అమ్మతో కూడా ఇదే మాట అన్నాను. ఇంతలోనే ఎలా మర్చిపోయావు? కానీ మీరు లైన్ క్రాస్ చేస్తున్నారు. మీ ఇద్దరి బాగోతం వల్ల నా జీవితం నాశనమవడమే కాకుండా పిల్లాడి లైఫ్ కూడా దెబ్బ తింటుంది. రాజ్.. నువ్వు దమాల్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నావని తెలుసు. కానీ అది అడ్డుపెట్టుకుని నా జీవితాన్ని నరకంగా మార్చుతున్నావు. మీరిద్దరు రాత్రిళ్లు ఫోన్లో మాట్లాడుకోవడం, చాట్ చేయడం నాకు తెలుసు. అది ప్రమోషన్స్ కోసమో, సినిమా విషయాలో అని చెప్పి దాన్ని దాటవేస్తారనీ తెలుసు. కానీ అలా అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇక దీన్ని ఆపేయండి' అని రాసుకొచ్చింది పొరి మొని. చదవండి: నటిపై లైంగిక వేధింపుల కేసు నేనే తోపు అంటూ నన్ను మునగ చెట్టెక్కించారు, చివరకు.. : గీతూ -
తెలంగాణ కేసీఆర్- యూపీ ఆదిత్యనాథ్: ఎవరి మోడల్ బెటర్?
తెలంగాణలో ఎవరి మోడల్ పాలన బెటర్ అన్న చర్చకు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్లు తెరమీదకు తెస్తున్నాయి. టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ మోడల్ దేశానికే ఆదర్శం అని వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నేతలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోడల్ పాలనను తెలంగాణలో తెస్తామని అంటున్నారు. ప్రజలు ఎవరి మోడల్ కరెక్టు అని అనుకుంటారో ఎన్నికలలో కాని తేలదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజాదరణ చూరగొని రెండోసారి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది. తెలంగాణ 119 అసెంబ్లీ సీట్లతో చిన్న రాష్ట్రం అయితే, యూపీ 405 సీట్లతో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. చదవండి: జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందా! తెలంగాణలో ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం జరిగింది. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో అది మళ్లీ పునరుద్దరించబడిందని చెప్పాలి. రైతు బంధు, షాదీ ముబారక్, బిఎస్ ఐ పాస్, ధరణి వంటి కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుట్టారు. యూపీలో కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ మద్దతుతో యోగి ఆదిత్యనాథ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకించి శాంతి భద్రతల విషయంలో బాగా సీరియస్గా ఉన్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న నిందితుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చడం ద్వారా సంచలనం సృష్టించారు. అది వివాదాస్పదం అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో బాగా ఉపయోగపడుతోందన్న భావన ఏర్పడింది. అక్కడ అయోధ్య రామమందిరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో యాదాద్రి నరసింహస్వామి ఆలయ అభివృద్దికి కేసీఆర్ కృషి చేస్తున్నారు. యూపీలో కన్నా తెలంగాణలో మతపరమైన విద్వేషాలు తక్కువే అని చెప్పాలి. కాగా ఇటీవలికాలంలో కేంద్ర బీజేపీ నేతలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ ఇక్కడ యూపీ తరహా పాలన సాగిస్తామని , యోగి ఆదిత్యనాథ్ మాదిరి రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేవారిపై పై ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు. దీనివల్ల బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలియదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ముగింపు సభలో కాని, ఇతరత్రా కాని కేంద్ర బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ప్రజలలోకి వెళ్లడం వల్ల కూడా రాజకీయంగా లబ్ది చేకూరి ఉండవచ్చు. కాని తెలంగాణలో ఆ ధీరీ పనికి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే యూపీ రాజకీయాలు వేరు.. తెలంగాణ రాజకీయాలు వేరు. యూపీలో ఉన్న శాంతిభద్రత పరిస్థితి వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు. కేంద్ర బీజేపీ నేతలు ఈ విషయాలను గమనించకుండా యూపీ ప్రస్తావన తెస్తున్నట్లుగా అనిపిస్తుంది. యూపీలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికీ నేరాల రేటులో యూపీనే అగ్రస్థానంలో ఉంది. కాకపోతే అక్కడ జనాభా కూడా అధికం కావచ్చు. మతపరంగా జరిగే గొడవలు కూడా అక్కడ ఎక్కువే. వాటిని అదుపు చేసే క్రమంలోనే యోగి ప్రభుత్వం నేరాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను బుల్ డోజర్లతో కూల్చివేస్తోంది. పేరుకు అక్రమ నిర్మాణాలు అని చెబుతున్నా, వాస్తవం ఏమిటో తెలియదు. దానితో అక్కడి సమాజంలో మరీ విభజన హెచ్చుగా ఉందని అంటారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడే రైతులపై జీప్ ఎక్కించారన్న వార్త బీజేపీకి అప్రతిష్ట తెచ్చింది. అయినా సంబంధిత కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించలేదు. హత్రాస్ మానభంగ ఘటన, బలియాలో ఒక పోలీస్ స్టేషన్లోనే మాన భంగం జరిగిందన్న ఆరోపణ రావడం.. ఇలా అనేక అభియోగాలు వచ్చాయి. కాన్పూర్కు చెందిన ఒక గూండా జరిపిన అరాచకం నేపథ్యంలో అతనిని మధ్యప్రదేశ్లో పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు. అలాగే అతని ఇంటిని కూల్చివేయడం జరిగింది. అయితే గత సమాజవాది పార్టీ ప్రభుత్వంతో పోల్చితే ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని అంటారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అంత దారుణమైన పరిస్థితి లేదు. కొన్ని రేప్ ఘటనలు జరిగినా, యూపీతో పోల్చితే తక్కువే. ఒక కేసులో ఇక్కడ కూడా ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించింది. కాని యూపీలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు రాలేదు. తెలంగాణలో మతపరమైన గొడవలు ఒక్క భైంసా పట్టణంలో మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రం అంతటా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నివసిస్తున్నారు. వారెవరికి ప్రభుత్వపరంగా, సంఘ విద్రోహ శక్తుల పరంగా అంత తీవ్రమైన కష్టాలు లేవు. అందువల్ల యూపీ తరహాలో యోగి పాలన తెలంగాణలో తెస్తామని బీజేపీ ప్రచారం చేస్తే అది వారికి నష్టం చేయవచ్చు. ఎందుకంటే యోగి పాలనను బుల్ డోజర్ పాలనగా, నిరంకుశంగా ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వంగా విపక్షాలు విమర్శిస్తుంటాయి. బీజేపీపై ఇప్పటికే వివిధ రూపాలలో ఎక్కుపెట్టి అస్త్ర శస్త్రాలు కురిపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ అంశం ఆధారంగా కూడా బీజేపీని డిపెన్స్ లో పడేసే అవకాశం ఉంది. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ముంబై హోటల్లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ..
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో మోడల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అంధేరీ ప్రాంతంలోని ఓ హోట్ల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. మృతురాలిని ఆకాంక్ష మోహన్గా(30) గుర్తించారు, వివరాలు.. మోడల్ ఆకాంక్ష బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్లో చెక్ ఇన్ అయ్యింది. రాత్రికి 8 గంటలకు డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. అయితే గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. హోటల్కు చేరుకున్న పోలీసులు మాస్టర్ కీతో గదిని తెరిచి చూడగా మోడల్ మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు సుసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘నన్ను క్షమించండి. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు ప్రశాంతత కావాలి" అని నోట్ లో రాసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. చదవండి: ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్ప్రదేశ్లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్లోకి వచ్చా: రాజశేఖర్
Raja Shekar In Bigg Boss 6 Telugu: గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా మోడలింగ్ రంగం నుంచి ఒకరు బిగ్బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో అలీ రెజా, అనిల్ రాథోడ్, జెస్సీలు మోడలింగ్ రంగం నుంచి బిగ్బాస్లో పార్టిసిపెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మోడల్ రాజశేఖర్కు ఈ అవకాశం వరించింది.కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్తో పాటు మేజర్ సినిమాలోనూ రాజశేఖర్ నటించాడు. అంతేకాకుండా ఇతను బిగ్బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీకి మంచి ఫ్రెండ్ అని సమాచారం. మరి ఈ మోడల్ రాజశేఖర్ బిగ్బాస్-6లో ఎలా అలరిస్తాడో చూద్దాం. -
వేరే అమ్మాయితో నా మాజీ బాయ్ఫ్రెండ్, గుండె పగిలింది: సింగర్
మ్యూజిక్ క్వీన్ షకీరా - ఫుట్బాల్ ప్లేయర్ గెరార్డ్ పిక్ ఇద్దరూ ఇటీవలే బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే! అయితే విడిపోయి నెల రోజులైనా కాకముందే గెరార్డ్ మరో అమ్మాయితో లవ్లో పడ్డాడు. మోడల్ క్లారా చియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరూ చేతిలో చేయేసి నడుస్తున్న ఫొటోలు, స్విమ్మింగ్ పూల్లో ముద్దులు పెట్టుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన మాజీ బాయ్ఫ్రెండ్ అప్పుడే వేరొక అమ్మాయితో ఇలా తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిందీ సింగర్. ఈ ఫొటోలు చూసి తన గుండె పగిలిందంటూ అక్కడి మీడియాతో వాపోయిందట. కాగా షకీరా కంటే గెరార్డ్ పదేళ్లు చిన్నవాడు. షకీరా పాడిన వకా వకా సాంగ్ వీడియోలో గెరార్డ్ ఉన్నాడు. అలా వీళ్లిద్దరికీ పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2010 నుంచి డేటింగ్ చేసుకుంటున్నా, ఈ విషయాన్ని షకీరా 2011లో అధికారికంగా వెల్లడించింది. వీరిద్దరికీ 2013లో మిలన్, 2015లో సాషా అని ఇద్దరు కొడుకు జన్మించారు. పాప్ సింగర్కు పెళ్లంటే భయం ఉండటంతో వీరు వివాహం చేసుకోకుండానే పదకొండేళ్లుగా కలిసి జీవించారు. ఈ ఏడాది జూన్లో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం షకీరా డ్యాన్సింగ్ విత్ మైసెల్ఫ్ అనే టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. (ఫొటో సేకరణ: సీఎన్ఎన్) View this post on Instagram A post shared by TEVERED MX (@teveredmx) చదవండి: హృతిక్ రోషన్.. హీరోయిన్ ప్రైవేట్ ఫొటోలు చూపించాడు ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా? -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా వార్న్ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
‘మై ఫ్రెండ్ గణేశా’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
ఎహ్సాస్ చన్నా.. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెకెరుకైన.. ఆమెను ఎరిగిన ప్రపంచం ఒక్కటే సినిమా ప్రపంచం! చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి.. నటిగా ఆమె పెరిగింది.. ఎదిగింది అక్కడే! ఓటీటీ వచ్చాక ఆ ప్లాట్ఫామ్కూ తన పరిచయాన్నిచ్చి వెబ్ వీక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంటోంది. ► పుట్టింది పంజాబ్లోని జలంధర్లో. పెగింది ముంబైలో. తండ్రి.. ఇక్బాల్ బహదూర్ సింగ్ చన్నా, ప్రొడ్యూసర్. తల్లి.. కుల్బిర్ బహదూర్ సింగ్ చన్నా.. నటి. ► నటనా వాతావరణంలోనే పుట్టి.. పెరగిన ఎహ్సాస్.. తన నాలుగో ఏటనే సినీరంగ ప్రవేశం చేసింది. ‘వాస్తు శాస్త్ర’, ‘కభీ అల్విద నా కెహనా’, ‘మై ఫ్రెండ్ గణేశా’ మొదలు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమె నటించిన ఎన్నో సినిమాల్లో అబ్బాయి పాత్రలనే ఎక్కువగా పోషించింది. టీవీ సీరియళ్లలోనూ బాలవేషాలు వేసింది. ► డబ్స్మాష్ చేయడంలో దిట్ట. ఆమె ‘మ్యూజికల్లీ (టిక్టాక్ లాంటిది)’ వీడియోస్కు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ► ఐఐటీ అభ్యర్థుల ఇతివృత్తంతో వచ్చిన ‘కోటా ఫ్యాక్టరీ’తో వెబ్ సిరీస్లో నటించడం మొదలుపెట్టింది ఎహ్సాస్. అందులోని ఆమె నటన ఇంకొన్ని ఓటీటీ అవకాశాలను తెచ్చిపెట్టింది. వాటిల్లో ఒకటి ‘గర్ల్స్ప్లెయినింగ్’ సిరీస్. ► ఎహ్సాస్ .. మోడలింగ్లో కూడా కాలుమోపింది. ‘గీతాంజలి ఫ్యాషన్ వీక్’లో వాళ్లమ్మతో కలసి ర్యాంప్వాక్ చేసింది. ► టీనేజ్ పిల్లలు ఎదుర్కొనే సమస్యల మీద ‘డియర్ టీనేజ్ మి’ అనే పాడ్కాస్ట్ చానెల్ను నిర్వహిస్తోంది. ► వైవిధ్యమైన షూలు, మేకప్ వస్తువులు కలెక్ట్ చేయడం ఆమెకు సరదా. టీనేజ్లో ఉన్నప్పుడు కాస్త అటెన్షన్ సీకింగ్ అమ్మాయిగా ఉండేదాన్ని. నా స్వభావం కాకపోయినా పదిమంది దృష్టి నా మీద పడడానికి డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. ఇప్పుడు ఆలోచించుకుంటే నవ్వొస్తుంది. అయితే ఆ తప్పులన్నీ నన్ను నేను సరిదిద్దుకోవడానికి.. నేనీరోజు ఇలా నిలబడ్డానికి దోహదపడ్డవే. అందుకే నాలోని ఏ చిన్న గుణాన్నీ మార్చుకోవడానికి ఇష్టపడను. – ఎహ్సాస్ చన్నా View this post on Instagram A post shared by Ahsaas Channa (@ahsaassy_) చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే.. ఆ వ్యక్తి ఆరేళ్లు వేధించాడు.. క్షమించి వదిలేశా -
డ్రగ్స్తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ..
Model Shubham Malhotra Arrested: సినీ సెలబ్రిటీలు, మోడల్స్, అప్పుడే చిత్రసీమలోకి అడుగుపెడుతున్నవారు ఎందరో డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా మరో మోడల్ డ్రగ్స్తో ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. మోడల్ శుభమ్ మల్హోత్రా (25) అతడి స్నేహితురాలు కీర్తి (27) రూ. కోటీ విలువ చేసే మాదకద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. 'కొందరు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు ప్రారంభించాం. తర్వాత మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఈ ఇద్దరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాం' అని క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ రోహిత్ మీనా వెల్లడించారు. అయితే కీర్తి దిండు సాయంతో గర్భవతినని నమ్మించి తనిఖీ అధికారులను బురిడీ కొట్టించేదని దర్యాప్తులో తేలిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారి కారును వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. మోడల్ శుభమ్ మల్హోత్రా, కీర్తిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ఆ షాట్ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా.. -
బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
Kolkata Model Pooja Sarkar Suicide After Boyfriend Call: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదం నెలకొంటోంది. అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే, ఆత్మహత్యలకు పాల్పడుతూ పలువురు తనువు చాలిస్తున్నారు. వీరిలో కొందరు మోడల్స్ సైతం ఉంటున్నారు. తాజాగా కోల్కతాలో పూజా సర్కార్ (21) అనే మోడల్ విగతజీవిగా కనిపించింది. తను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూజా సర్కార్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం చదువుతోంది. సౌత్ కోల్కతాలోని బాన్స్ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన ఫ్రెండ్స్తో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లింది పూజా. రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాకు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకున్న పూజా.. ఆమె ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. దీంతో పూజా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజా సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని పూజా స్నేహింతులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్లర్' హీరోయిన్.. కాగా గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ బలవన్మరణం చెందారు. బిదిషా డే మజుందార్ అనే కోల్కతా మోడల్ మే 24న డమ్డమ్లోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయింది. తర్వాత పరిశ్రమలోని బిదిషా స్నేహితురాలు మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న పటులిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ రిలేషన్షిప్తోపాటు సరైనా అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
ఆమెలా ఉంటేనే గుర్తింపా?.. ఈమెకిది పునర్జన్మే!
అందంగా ముస్తాబు కావాలని, స్టయిల్గా ఉండాలనే తాపత్రయం ఎవరికి ఉండదు!. అయితే.. ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు కొందరు.. రెట్టింపు చేయాలన్న ఆరాటంతో నానా ప్రయత్నాలు చేసేవాళ్లు మరికొందరు. కానీ, ఇక్కడ ఓ యువతి అలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. 12 ఏళ్లుగా.. ఏకంగా 40 కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఒళ్లు హునం అయినా భరించింది. మన కరెన్సీలో నాలుగున్నర కోట్లు రూపాయల పైనే ఖర్చు చేసింది. చివరికి.. తత్వం బోధపడి తన రూపం తిరిగి కావాలంటూ మళ్లీ సర్జరీలు చేయించుకుంటోంది. అమెరికన్ సోషల్ ఫిగర్, సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్లా మారాలని ఓ యువతి కలలు కనింది. కానీ, అదంతా పైపై మెరుగులే అని గుర్తించేందుకు పదేళ్లు పైనే పట్టింది. ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్. ఇటలీ టాప్ కంపెనీ వర్సేస్లో మోడల్గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. మంచి చదువుతో పాటు వృత్తిలోనూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ఉమెన్గా రాణించాలనుకుంది. కానీ, కిమ్ కర్దాషియన్లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయ్యింది. ఆనందమే.. పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్లా బాడీ షేప్స్ రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్ కర్దాషియన్లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) కానీ.. కిమ్ కర్దాషియన్(ఎడమ), జెన్నిఫర్ పాంపలోనా(కుడి) అంతా ఆమెకు అనుకూలంగా సాగితే ఎలా?. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. సహజత్వం కోల్పోయింది ఆమె శరీరం. తన శరీరం తన అదుపు తప్పిందని గుర్తించింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా.. ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మళ్లీ ఖర్చు చేసి.. ఇస్తాంబుల్లో ఓ ఫిజీషియన్ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె. జెన్నిఫర్ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చిందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్కు సలహా ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్.. ఎబోట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్’ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్. అంతేకాదు.. డీట్రాన్సిషన్ సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా. -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్లో ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
వికటించిన సర్జరీ.. మృత్యువుతో పోరాడి ఓడిన మోడల్
బ్రెసిలియ: విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో. ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న టైంలో.. ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం.. రెండు నెలలు కోమాలో ఉన్న ఆ మాజీ సుందరి(27) కన్నుమూసింది. మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రెజిల్ మాజీ సుందరి గ్లెసీ కొర్రెయియా మోడల్, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్ బ్రెజిల్ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రాణిస్తోంది ఆమె. అయితే.. గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్ క్లినిక్లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. -
APPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు మోడల్ ఇంటర్వ్యూల కోసం ఉచిత శిక్షణ, దిశానిర్దేశం చేయనున్నట్టు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు కె.హర్షవర్థన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు ఈ నెల 15 నుంచి మౌఖి క పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిందన్నారు. చదవండి: AP: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే.. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా ఆ అభ్యర్థులకు తగిన తర్ఫీదు ఇచ్చేందుకు మోడల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఏపీటీడీసీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలని హర్షవర్థన్ సూచించారు. -
మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. క్రికెట్ కంటే ఫుట్బాల్ను విపరీతంగా ఇష్టపడే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో పోటీపడుతున్న మెస్సీ.. తన ఫాలోయింగ్ను అంతకంతకూ పెంచుకుంటూ ఎనలేని క్రేజ్ సంపాదించాడు. ఆటలో చురుకుగా కనిపించే మెస్సీ బయట కూడా అంతే చలాకీగా ఉంటాడు. తనను కలుసుకోవడానికి ఒక అభిమాని ఎంత దూరం నుంచి వచ్చినా.. తప్పక వారిని కలిసి సంతోషం కలిగేలా చేసేవాడు. అలాంటి మెస్సీని అందమైన యువతులు ఇష్టపడడం మాములే. అలాంటి కోవకే చెందింది బ్రెజిలియన్ మోడల్ సుజీ కోర్టేజ్. సుజీ కోర్టేజ్.. మెస్సీకి వీరాభిమాని. అతని ఆటను చూసేందుకు చాలాసార్లు ఫుట్బాల్ స్టేడియంలోకి వెళ్లింది. అతని ఆటోగ్రాఫ్ కోసం ఎంతో ప్రయత్నించి ఒక సందర్భంలో సక్సెస్ అయింది. అయితే ఆమె స్వయానా మోడల్ కావడంతో కొన్ని రెచ్చగొట్టే చిత్రాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి మెస్సీ ఆగ్రహాన్ని చవిచూసింది. అంతేకాదు స్వయంగా మెస్సీ, అతని భార్య ఆంటోనెల్లా రోకుజోలు సుజీ కోర్టేజ్ అకౌంట్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు. సుజీ కోర్టెజ్.. మెస్సీకి వీరాభిమాని మాత్రమే కాదు. మంచి అథ్లెట్, మోడల్, టీవీ హోస్ట్ ఇలా చాలా రంగాల్లో ముఖ్యపాత్ర పోషించింది. తన టాలెంట్తో 2015లో ''మిస్ బుమ్బుమ్'' విన్నర్గానూ నిలిచింది. సుజీ కోర్టెజ్కు ఇన్స్టాగ్రామ్లో 58వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు ఇటీవలే ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్పై మెరిసింది. 2015లో మిస్ బుమ్బుమ్ టైటిల్ గెలిచిన తర్వాత 2016 రియో ఒలింపిక్స్లో అంబాసిడర్గా వ్యవహరించడం విశేషం. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం
Bengali Model Saraswati Das Suicide in Kolkata: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్ మృతి చెందండం సంచలనంగా మారింది. కోల్కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరు లేకోపవడంతో రాత్రి తన అమ్మమ్మతో కలిసి పడుకుంది సరస్వతీ దాస్. చదవండి: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల పాత్రంలో సరస్వతి పక్కన లేకపోడంతో ఆమె అమ్మమ్మ ఇల్లంతా వేతికగా మరో గదిలో ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె అమ్మమ్మ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించగా అప్పటికే సరస్వతీ దాస్ మారణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కొంతకాలంగా తన తండ్రికి దూరంగా తల్లితో కలిసి వాళ్ల మేనమామ ఇంట్లో ఉంటోంది సరస్వతీ దాస్. మాధ్యామిక్ పరీక్షలో పాసయిన ఆమె చదువు విడిచిపెట్టి ట్యూషన్స్ చెబుతూ మోడల్గా రాణిస్తోంది. అయితే సరస్వతీ దాస్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల తెలిపారు. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో అంతేకాదు ఆత్మహత్యకు ముందు అర్థరాత్రి 1గంట వరకు ఆమె ఫోన్ మాట్లాడినట్లుగా తన ఫోన్ రికార్డులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరస్వతీ దాస్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు జరపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్కు చందిన నటి, మోడల్లు ఇలా వరుసగా ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు బెంగాలి మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా సరస్వతీ దాస్ అదే తరహాలో మరణించడం గమనార్హం. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బర్త్డే రోజే బాత్రూమ్లో విగతజీవిగా మోడల్, భర్తే చంపాడా?
పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజయ్యింది. బర్త్డే రోజు తన కుటుంబాన్ని కలవాలన్న కోరిక కూడా తీరకుండానే ఆమె కన్నుమూసింది. కేరళ మోడల్ షహానా బర్త్డే నాడే మరణించింది. అయితే ఆమెది సాధారణ మరణమో, ఆత్మహత్యో కాదని, తన భర్తే చంపేసి ఉంటాడని సహానా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్కు చెందిన మోడల్, నటి షహానా మే 12న 21వ పుట్టినరోజు జరుపుకుంది. కానీ అదే ఆమె జీవితంలో ఆఖరి రోజుగా మారింది. అర్ధరాత్రి ఒంటిగంటకు షహానా చనిపోయిందంటూ కేసర్గాడ్లో నివసిస్తున్న తన కుటుంబీకులకు ఫోన్ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆమె కుటుంబీకులు షహానా చావుకు ఆమె భర్తే కారణమని ఆరోపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఏసీపీ కె సుదర్శన్ మాట్లాడుతూ.. 'షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు ఆమెకు పారితోషికం ఇచ్చారు. దీనికోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే షహానా బర్త్డే రోజు కూడా సజ్జద్ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నాం' అని పేర్కొన్నాడు. షహానా తల్లి మాట్లాడుతూ.. 'నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపేశారు. అత్తారింట్లో తనను టార్చర్ పెడుతున్నారని నా కూతురు ఎప్పుడూ విలపించేది. ఆమె భర్త సజ్జద్ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. దీనికి తోడు అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా నా కూతురికి నరకం చూపించేవారు. తన బాధ చూడలేక వేరు కాపురం పెట్టమని సూచించాను. కానీ సజ్జద్ డబ్బు కోసం పోరు పెడుతున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని వాపోయేది. ఆమె దగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని అంతా వాడుకున్నారు. తన బర్త్డే రోజు మమ్మల్ని కలవాలనుకున్నా అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అంటూ బోరున ఏడ్చేసింది. కాగా షహానా పలు ఆభరణాల సంస్థల యాడ్స్లో నటించింది. ఏడాదిన్నర క్రితం సజ్జద్ను పెళ్లాడింది. అత్తింట్లో టార్చర్ భరించలేక కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసి భర్తతో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన వర్మ, ఏమన్నాడంటే.. ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు -
పదహారేళ్ల వయసుకే రియాలిటీ స్టార్ ఆత్మహత్య
చిన్నవయసులోనే ఇంటర్నెట్లో దక్కిన గుర్తింపు, కాస్త పెరిగాక దక్కిన పేరుప్రఖ్యాతులు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విషాదం. కేవలం 16 ఏళ్ల వయసుకే అర్ధాంతరంగా జీవితాన్ని ముగిచుకుంది కాయిలియ పోసే. ఆమె కథ ఇప్పుడు ఇంటర్నెట్లో విషాదాన్ని నింపింది. కాయిలియ పోసే.. అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్. చిన్నవయసులోనే ‘టాడ్లర్స్ అండ్ టియారస్’ సిరీస్తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇంటర్నెట్ గ్రిన్నింగ్ గర్ల్గా ఆమె జిఫ్ ఫైల్ ఈనాటికీ విపరీతంగా వైరల్ అవుతుంటుంది. అయితే.. హఠాత్తుగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కెనడా సరిహద్దుకు కొద్ది మైళ్ల దూరంలో.. వాషింగ్టన్ స్టేట్ బిర్చ్ బే స్టేట్ పార్క్ వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు. భవిష్యత్తులో ఎంతో ఎదిగే అవకాశం ఉన్నా.. ఆమె తీసుకున్న తీవ్ర నిర్ణయం.. మా కుటుంబంలో విషాదాన్ని నింపింది అంటూ పోసే కుటుంబం ఒక ప్రకటనలో తెలపింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Kailia Posey, who became a popular GIF from her appearance on the reality TV show "Toddlers & Tiaras," has died unexpectedly at age 16, her mom says pic.twitter.com/BVtBmUrQob — BNO News (@BNONews) May 3, 2022 హైలీ టాలెంటెడ్ అయిన కాయిలియ పోసే.. చిన్నతనం నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు, పోటీల్లో గెలుపొందింది. స్టార్ టాడ్లర్స్ షో టీఎల్సీ ఛానెల్లో 2009 నుంచి 2013 మధ్య టెలికాస్ట్ కాగా, అందులో అందాల పోటీలకు తమ పిల్లలను ప్రిపేర్ చేసే కుటుంబాలను చూపిస్తూ వచ్చారు. అందులో ఒక తారే ఈ కయిలియా పోసే. ఆపై ఆమె ఎన్నో టీవీ సిరీస్లు, రియాలిటీ షోలలోనూ కనిపించింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట
Brazilian Model Arthur O Urso Wants To Marry Two More: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా ఉంది అతగాడి తీరు. ఒకరికి డబ్బు పిచ్చి ఉంటుంది. మరొకొందరికి సినిమాల పిచ్చి.. ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఇతగాడికి మాత్రం భార్యల పిచ్చి ఉంది. ఒక భార్యతోనే వేగలేకపోతున్నామని గగ్గోలు పెడుతుంటారు ఫ్యామిలీ మ్యాన్లు. ఇతగాడు మాత్రం 'నాకు ఒక్కరు సరిపోరు పది మంది కావాలంటూ' కోరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు అంటే.. బ్రెజిల్కు చెందిన యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతోంది. ఎందుకంటే ఆర్థర్ ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా వారి అంగీకారంతోనే. 9 మంది భార్యలతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్థర్. ఆ ఫొటో కాస్తా వైరల్ కావడంతో ఫేమస్ అయ్యాడు మనోడు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఆర్థర్. ఇప్పటివరకు అతడితో అన్యోన్యంగా ఉన్న 9 మంది భార్యల్లో ఒకరు ఆర్థర్కు షాక్ ఇచ్చింది. ఆర్థర్ 9 మంది భార్యల్లో ఒకరైన అగాథ.. ఉర్సో నుంచి విడాకులు కోరిందట. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటుందని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేకపోవడంతో విడాకులకు అంగీకరించానని ఉర్సో చెప్పుకొచ్చాడు. 'నేను ఆమెకు మాత్రమే సొంతమట. ఇంకేవరితో నేను ఉండకూడదట. ఇదేమన్నా బాగుందా. మనం పంచుకోవాలి. మేము విడిపోతున్నందుకు బాధగానే ఉంది. కానీ ఆమె చెప్పిన కారణం నాకు షాకింగ్గా ఉంది.' అని తెలిపాడు బ్రెజిల్ యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. అంతేకాకుండా తన జీవితంలో 10 మంది భార్యలు ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు ఆర్థర్. అయితే ఇప్పుడే తన భార్య స్థానాన్ని భర్తీ చేయనని.. కానీ త్వరలోనే ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే అతడికి తన ప్రతీ భార్య పట్ల సమానమైన ప్రేమ ఉంటుదన్నాడు. ఈ యంగ్ మోడల్కు ఇన్స్టా గ్రామ్లో 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇదివరకు ఈ 9 మందితో జరిగిన తన వివాహానికి బ్రెజిల్లోని సోవో పావోలో చట్టబద్దత లేదు. ఆ దేశంలో బహుభార్యత్వం చట్ట విరుద్ధం. -
SK20: ఉక్రెయిన్ బ్యూటీతో శివకార్తికేయన్ రొమాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అప్కమింగ్ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతీరత్నాలు’ ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఎస్కే20 అనే వర్కింగ్ టైటిల్ ఇటీవల చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీతో ఉక్రెయిన్ నటి, మోడల్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్తో సరసన ఈ ఉక్రెయిన్ బ్యూటీ సందడి చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే హీరో శివకార్తీకేయన్ కూడా ‘వెల్కమ్ మరియా ర్యాబోషాప్క’ అంటూ ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫుల్ లెన్త్ కామెడీతో సాగే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A Beautiful Angel👼has just Landed to Mesmerise✨ Team #SK20 Welcomes Actress #MariaRyaboshapka On Board as Female Lead 🎬@Siva_Kartikeyan @anudeepfilm @MusicThaman @sureshProdns @SVCLLP @ShanthiTalkies #NarayanDasNarang@SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/75cKykYk1Z — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 21, 2022 -
పుతిన్ను తిట్టిపోసిన మోడల్ దారుణ హత్య
గ్రెట్టా వెడ్లెర్.. 23 ఏళ్ల రష్యన్ మోడల్. ఈమె దారుణ హత్య ప్రస్తుతం రష్యాలో కలకలం సృష్టిస్తోంది. కారణం.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఇష్టానుసారం తిట్టిన ఆమె.. చాన్నాళ్లూ కనిపించకుండా పోయింది. చివరకు ఓ ఫామ్హౌజ్లో పార్క్ చేసి ఉన్న కారులో పాతసూట్కేసులో కుక్కేసి ఉన్న ఆమె మృతదేహం బయటపడింది. గ్రెట్టా వెడ్లెర్.. మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఆమె పుతిన్ వ్యతిరేకి. గతంలో పుతిన్ను సైకోపాత్(మానసిక రోగి) అంటూ తిట్టిపోసింది. పుతిన్ను తిడుతూ.. 2021 జనవరిలో సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది. ‘‘బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను చవిచూశాడు. అందుకు అతని ఫిజిక్ కారణం. ఆ కారణంతోనే తన కోసం తాను నిలబడలేకపోయాడు. న్యాయ విద్యను విడిచిపెట్టి KGB లో చేరడానికి అదే కారణమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే నా దృష్టిలో అతనొక మానసిక రోగి’’ అంటూ కామెంట్లు చేసిందామె. ఆ తర్వాత కొన్నివారాలకు ఆ మోడల్ కనిపించకుండా పోయింది. దీంతో నానా కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆమె హత్యకు గురైందంటూ రష్యా దర్యాప్తు కమిటీ ఒకటి ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో వెడ్లెర్ ప్రియుడు దిమిత్రి కోరోవిన్.. తానే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఉంది. పుతిన్ను తిట్టిన వ్యవహారానికి, ఆమె హత్యకు ఎలాంటి సంబంధంలేదని.. కేవలం డబ్బు కోసం జరిగిన వాగ్వాదంలో ఆమెను చంపేసినట్లు కోరోవిన్ అంగీకరించాడు. చివరిసారిగా మాస్కోలో కనిపించిన గ్రెట్టా వెడ్లెర్.. ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని ఓ ఫామ్హౌజ్లో శవంగా కనిపించడం, అదీ ఏడాది తర్వాత కావడంతో ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
స్త్రీ శక్తి: ఆర్మీ లాయర్ అఖిల
‘అఖిల నారాయణ్ గురించి కాస్త చెప్పండి’ అని అడిగితే... సమాధానం తట్టక బుర్ర గోక్కునేవాళ్లు ఉండొచ్చు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు అయితే ‘ఆ..గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఒక సినిమాలో నటించింది కదా!’ అంటారు. అరుల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ హారర్ మూవీ ‘కదంపారీ’లో అఖిల నటించింది. అయితే ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఈ హారర్ సినిమా మాత్రమే అక్కర్లేదు. యూఎస్లో భారత సంతతికి చెందిన అఖిల తాజాగా అక్కడి సైన్యంలో లాయర్గా చేరింది. ‘భేష్’ అనిపించుకుంటోంది. లీగల్ అడ్వైజర్గా ఆమె సేవలు అందించనుంది. ‘యూఎస్ ఆర్మీ కంబాట్ ట్రైనింగ్’లో కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పొందింది అఖిల. రెడ్, వైట్, బ్లూ...అనే మూడు దశల్లో సాగే ఆర్మీ కంబాట్ ట్రైనింగ్లో వెపన్ ఆపరేటింగ్, వారియర్ టాస్క్, బ్యాటిల్ డ్రిల్స్, టాక్టికల్ స్కిల్...మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. అఖిలకు సంగీతం అంటే బోలెడు ఇష్టం. ‘నైటింగిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ పేరుతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. -
మోడల్గా మారిన 60 ఏళ్ల దినసరి కూలీ!
Mammikka, 60, is a daily wage earner from Kerala Turn Model: ఇంతవరకు చాలామంది మోడల్గా మారి మంచి పేరు తెచుకోవాలనుకునే వాళ్ల గురించి విని ఉన్నాం. పైగా అందుకోసం ఎంతో వ్యయప్రయాసలు పడి మరీ ఆ స్థాయికి చేరుకుంటారు కూడా. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి కష్టం పడకుండా ఊహించని విధంగా మోడల్గా నటించే అవకాశం భలే దొరుకుతుంది. పాపం వాళ్లు కలలో కూడా అనుకుని ఉండుండరు. పైగా వాళ్లకు మోడల్గా చేయడమంటే ఏంటో కూడా తెలిసి ఉండపోవచ్చు. అచ్చం అలాంటి సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే.... కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన్నాచితక పనులు చేసుకుంటూ బతుకుతన్న అతను ఉన్నట్టుండి మంచి సూట్, కూలింగ్ గ్లాస్ చేతిలో ఒక ఐప్యాడ్ పట్టుకుని వ్యాపారవేత్తగా ఫోజిస్తున్నట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్గా నటించమని మమ్మిక్కా అనే దినసరి కూలీని అడిగాడు. దీనికి మమ్మిక్కా కూడా అంగీకరించడంతో షరీక్ తన ఫోటోగ్రాఫిక్ నైపుణ్యంతో మమ్మిక్కాని మంచిగా ఫోటోలు తీశాడు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. దీంతో నెటిజన్లు ఒక కూలి మోడల్గా మారి అలా ఫోటోలకి పోజులిచ్చిన విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఫోటోగ్రాఫర్ నైపుణ్యాన్ని కూడా తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఫోటోల్లో మమిక్కా మళయాళం నటుడు వినాయక్ను పోలీ ఉండటంతో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అంతేకాదు తన కంపెనీకి మోడల్గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ షరీక్ చెప్పడం విశేషం. (చదవండి: వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి...) View this post on Instagram A post shared by Shareek Vayalil Shk 📸 (@shk_digital) -
అప్పుడు స్పెషల్ సాంగ్, ఇప్పుడేకంగా వెబ్సిరీస్లో ఛాన్స్!
గోడకు కొట్టిన బంతి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చినట్లు.. మొదటి సినిమాతో బోల్తా కొట్టినా రెట్టింపు వేగంతో తిరిగి వచ్చి, వరుస వెబ్ సిరీస్లతో దూసుకుపోతున్న స్టార్ స్నేహా పాల్. ఆమె పరిచయమే ఇది... స్నేహా పాల్.. కోల్కతాకు చెందిన మోడల్. చిన్నప్పుడు చదువు కన్నా ఆటపాటల్లో చురుగ్గా ఉండేది. అందులోనూ డాన్స్ అంటే మరీనూ. కొంతకాలం శాస్త్రీయ నాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ నాట్యమే ఆమెను వెండితెరకు పరిచయం చేసింది. మొదటిసారి ‘డ్రీమ్గర్ల్’ అనే కన్నడ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో నర్తించి ప్రేక్షకుల దృష్టిలో పడింది. కానీ డ్రీమ్గర్ల్లోని ఆ సాంగ్ తన డ్రీమ్ను నెరవేర్చలేకపోయింది. అభినయకౌశలంతో మెప్పించినా అవకాశాలు ఏవీ ఆమె దరిచేరలేదు. మోడల్గా కనిపించినా సరైన గుర్తింపు రాలేదు. దాంతో కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. దేశాన్ని చుట్టొచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ టూరే ఆమెను మళ్లీ ఇండస్ట్రీలోకి యూటర్న్ తీసుకొనేలా చేసింది. ముంబైలో తనని చూసిన ఓ టెక్నీషియన్ వెబ్ సిరీస్లో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సిరీసే ‘ది సిటీ అండ్ ఏ గర్ల్’. అది స్నేహాకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ‘చర్మ్సుఖ్ చాల్ హౌస్’ సిరీస్తో ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ పాత్రల్లో కనిపిస్తే వాటికే పరిమితం చేస్తారని చాలామంది చెప్పారు. కానీ, నటిగా ఎదగాలంటే ఎలాంటి పాత్రనైనా పోషించాలి. – స్నేహాపాల్ -
ఓ గృహిణి లక్ష్యం.. సవాళ్లే మన గురువులు
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది. బ్రిటిష్ ఎయిర్లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్లో ఫ్లైట్ అటెండెంట్గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది. అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది. ‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని. అడుగడుగునా సవాళ్లు కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది. బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను. అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది. దూరాన్ని దగ్గర చేసే నమ్మకం పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి. దూరం అనేది వివాహానికి సవాల్గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. -
Priyanka Nanda: గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్గా పోటీ!
Priyanka Nanda Contest In Panchayat Polls: మనలో మొలకెత్తిన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని తెలుసుకునేదై ఉండాలి. ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అది ఉత్తమమైన మార్గం వైపు సాగేలా ఉండాలి. ప్రియంకానంద ఆలోచన, ఆచరణ ఉన్నతి వైపుగా అడుగులు వేయించింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, తన గ్రామంలోని ఇరుకు రోడ్ల గతుకుల బతుకులను మార్చడానికి ప్రయాణమైంది. ఒరిస్సాలోని బలంగిర్ జిల్లాలోని ధులుసర్ గ్రామానికి చెందిన ప్రియంకానంద తన ఊళ్లో స్కూల్ చదువు పూర్తవగానే భోపాల్కి వెళ్లిపోయింది. అక్కడే పై చదువులు చదువుకుంది. కాలేజీ చదువులు పూర్తి చేసుకునే క్రమంలోనే గ్లామర్ ప్రపంచంవైపుగా అడుగులు వేసింది. ర్యాంప్ షోలలో పాల్గొంది. అందాల పోటీలలో టైటిల్స్ ఎన్నో గెలుచుకుంది. 2015 నుంచి మోడల్గా పనిచేస్తోంది. ఫస్ట్ ఇండియా రన్వే దివా బ్యూటీ పోటీలో పాల్గొని ఐదవస్థానంలో నిలిచింది. 2020లో ఇండియా స్టైల్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేసింది. లాక్డౌన్ సమయంలో తన ఊరు ధులుసర్ గ్రామానికి వచ్చిన ప్రియాంకానంద దృష్టి అక్కడ ప్రజల మీద పడింది. తన చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేని ఊరి పరిస్థితులు ఆమెను ఆలోచనల్లో పడేలా చేశాయి. మోడలింగ్లో తనకు ఎన్నో అవకాశాలు రావచ్చు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. డబ్బు సంపాదించడంలో అన్ని రకాల అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లచ్చు. ‘కానీ, ఎంతవరకు..? నా ఊరు లాంటి ఎన్నో ఊళ్ల పరిస్థితులు మార్చాలంటే ఇక్కడే ఉండాలి. గ్రామాభ్యుదయానికి పాటుపడే పని చేయాలి’ అనుకుంది. ఆ అనుకోవడానికి ఇటీవల వచ్చిన అవకాశం గ్రామ సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పోటీలో బరిలో దిగి, వీధి వీధి తిరుగుతూ ‘మీ కోసం వచ్చాను. బాగు చేసే అవకాశం ఇవ్వండి’ అంటూ ఓట్లను అడుగుతోంది. గ్లామర్ ప్రపంచంలో బ్యూటీ గర్ల్ అని పిలిపించుకునే ప్రియంకానంద ఒక మంచి పని కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత ఆలోచనలు దేశాభ్యున్నతి వైపుగా కదలాలి అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రియాంకానంద గెలిచి తన ఆలోచనలు అమలులో పెట్టే అవకాశం రావాలని అంతా కోరుకుంటున్నారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? -
మోడల్ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు..
జోధ్పూర్కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో రాజస్థాన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులిద్దరు ఉదయ్పూర్కు చెందిన వారు కాగా వారిలో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. వారి పేర్లు దీపాలి, అక్షయ్గా పోలీసులు తెలిపారు. కాగా జోధ్పూర్కు చెందిన ఫ్యాషన్ మోడల్ గున్గున్ ఉపాధ్యాయ్ రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్లో శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గున్గున్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: తండ్రికి చెప్పి ఆరో అంతస్థు నుంచి దూకిన మోడల్ ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. గున్గున్ను ఉపయోగించి భిల్వారా మంత్రిని హనీ ట్రాప్కు గురి చేసేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోని భిల్వారాకు చెందిన మంత్రి నిందితుల ఫైల్ను క్లియర్ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయనను హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలని నిందితులు దీపాలి, అక్షయ్లు ప్లాన్ చేసి గున్గున్ను వాడుకోవాలని చూశారని డీసీపీ భువన్ భూషన్ తెలిపారు. ప్లాన్ ప్రకారం మోడలింగ్ అసైన్మెంట్ ఉందంటూ నిందితులు గున్గున్ను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ షోలో అవకాశం ఉన్నట్లు నమ్మించి బాధితురాలిని భిల్వారా తీసుకెళ్లారు. చదవండి: వరుణ్ తేజ్తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. అక్కడికి వెళ్లాక మంత్రితో గడపాలని నిందితులు ఆమెను బలవంతం చేశారు. దీనికి గున్గున్ నిరాకరించి వారి నుంచి తప్పించుకుని జోధ్పూర్ చేరుకుంది. అక్కడ లార్డ్స్ ఇన్ హోటల్లో దిగి తన తండ్రికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమచారంతో పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. కానీ అప్పటికే గున్గున్ హోటల్పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ మీడియాకు తెలిపారు. అనంతరం గున్గున్ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
తండ్రికి ఫోన్ చేసి మోడల్ ఆత్మహత్యాయత్నం
జోధ్పూర్ (రాజస్థాన్): జోధ్పూర్కు చెందిన మోడల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిల్డింగ్పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గున్గున్ ఉపాధ్యాయ్ జోధ్పూర్కు చెందిన ఫ్యాషన్ మోడల్. ఏదో పని మీద ఉదయ్పూర్ వెళ్లిన శనివారం జోధ్పూర్కు తిరిగొచ్చింది. ఈ క్రమంలో రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్లో బస చేసిన ఆమె ఆరో అంతస్తు నుంచి కింది దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీనికన్నా ముందు ఆమె తన తండ్రితో ఆఖరుసారి మాట్లాడాలనుకుందట. అందుకని వెంటనే తండ్రికి ఫోన్ చేసి చనిపోతున్నాను నాన్నా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో వెంటనే ఆందోళన చెందిన ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆమెను ఆపాలని చెప్పాడు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే గున్గున్ బిల్డింగ్పై నుంచి దూకేసిది. ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
భారత్లో కోవిడ్ థర్డ్వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్వేవ్తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్వేవ్లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
ఎయిర్పోర్టులో ఫోర్న్ వీడియో చిత్రీకరణ.. మోడల్కు 18 యేళ్ల జైలు శిక్ష!
ఎయిర్ పోర్టులో బట్టలు విప్పి పోర్న్ వీడియోకు ఫోజులిచ్చిన మోడల్కు 18 యేళ్ల జీవిత ఖైదు పడే అవకాశం ఉందని మీడియా వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాలోని జావా విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో అశ్లీల ఫొటో షూట్కు సిస్కై అనే మోడల్ బట్టలు విప్పి, ఫొటోలకు ఫోజులిచ్చిన వీడియో చాలా తక్కువ సమయంలో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు తర్వాత డిసెంబర్ 4న పోలీసులు పశ్చిమ జావాలోని బాండుంగ్ సిటీలో సిస్కైని అరెస్టు చేశారు. అంతేకాదు పోర్నోగ్రఫీ చేసినందుకుగాను సదరు మోడల్కు 18 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో స్థానిక పోలీసు చీఫ్ ముహ్రొమా ఫజ్రినీ మాట్లాడుతూ.. ‘ఈ వీడియోను అక్టోబర్లో చిత్రీకరించారని విమానాశ్రయ సిబ్బంది తెలియజేశారు. మోడల్ ప్రయాణం కోసం కాకుండా ఫోటోషూట్ కోసం ఈ విమానాశ్రయానికి వచ్చింది. ఫోర్నోగ్రఫీ చట్టం, ఐటీఈ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై మోడల్ను అరెస్టు చేయడం జరిగిందని’ వెల్లడించారు. మరోవైపు మోడల్.. ‘ఇలాంటి ఫోటోలు, వీడియోల వల్ల నేను జనాల్లో చాలా పాపులర్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తిస్తారు. నా అభిమానులలో ఎక్కువ మంది పురుషులే. అనేక ప్రాంతాలకు ప్రయాణం చేశాను కూడా’ అని చెప్పుకొచ్చింది. చదవండి: Omicron: అవసరమైతే మూడో డోస్కు కూడా రెడీ! -
‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!
UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్ కార్డు లాంటి మోడల్ను ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్ గ్లోబల్ ఐడెంటిటీ సిస్టమ్పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది. ఆధార్పై ఇతర దేశాలు ఆసక్తి..! ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్లాంటి మోడల్పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్లో సౌరభ్ గార్గ్ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ఆధార్ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. ఇట్టే పసిగడతాయి..! ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్ను యాక్సెస్ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి. చదవండి: ఆండ్రాయిడ్లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాదీ!
ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని హైదరాబాద్కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు. జెస్సీ విక్టర్, రజ్నామొహమ్మద్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న RageNyou కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఒకటైన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్ను ప్రీతం కళ్యాణ్ కైవసం చేసుకున్నారు. మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్చే ఈ అవార్డును అందుకున్నారు. ఈ పోటీలో 20కి పైగా నగరాల నుండి 120 మందికి పైగా పోటీదారులు పోటీలో పాల్గొన్నారు. మంగళవారం ప్రీతం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అవార్డును దక్కించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మార్పును తీసుకురావడానికి అందాల వేదిక ఒక గొప్ప వేదిక అన్నారు. అందంగా ఉండటంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడుతాయన్నారు. మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, పరివర్తన, స్వీయ-అభివృద్ధి ప్రయాణమన్నారు. ఈ వేదిక ఎంతో మంది ఔత్సాహికులకు సరైన వేదికగా నిలవడమే కాకుండా దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తుందన్నారు. ఈ అవార్డు సాధించడం తనకు ఎంతో ఉత్సాహాన్ని నింపిందన్నారు. -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
‘మనోహరి’ పాటకు స్టెప్పులేసిన ఈ భామ ఇప్పుడేం చేస్తోంది?
ఓవర్నైట్ స్టార్గా మెరిసి.. వెంటనే కనుమరుగైన తారలు ఎంతోమంది. అలాంటి వారిలో ఒకరే.. మధుస్నేహ ఉపాధ్యాయ. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో వెండితెర మీద ఒక్కసారిగా మెరిసి ప్రస్తుతం వెబ్తెర మీద వెలిగిపోతోంది. ►మధుస్నేహ.. పుట్టింది కోల్కతాలో.. పెరిగింది ముంబైలో. ►చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్కు వెళ్లి తన్నులు తినింది. ►చదువు పూర్తిచేయాలని గట్టిగా చెప్పడంతో మంచి మార్కులతోనే డిగ్రీ పట్టా సాధించింది. ►నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ అటెండ్ అయ్యేది. ►మొదటి అవకాశంతోనే గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని ‘మనోహరి’ పాటలో ప్రభాస్తో పాటు డాన్స్ చేసింది. ఆ పాట.. ఆ డాన్స్ ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి కానీ కొత్త అవకాశాలను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలను వదిలి సిరీస్లలో నటించడం మొదలుపెట్టింది. ►2018లో ‘ది ఎట్సెట్రాస్’ అనే కామెడీ వెబ్ సిరీస్లో నటించి, పాపులర్ అయింది. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది. ►ప్రస్తుతం ‘బేకాబూ’ సిరీస్తో ప్రేక్షకులను అలరిస్తోంది. మా అమ్మ వయసులో ఉన్నప్పటి ఫొటోలను చూసి అమ్మ హీరోయిన్ అయితే బాగుండు అనుకున్నా. చిత్రంగా నాకు నటనపై ఇష్టం పెరిగింది. నటిగా మారాలనే లక్ష్యం కుదిరింది. – మధుస్నేహ ఉపాధ్యాయ. -
కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!
Russian Playboy Model Spends 5 Lakh For Dye Dog: గతంలో సెలబ్రిటీలు ఏం చేసినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసిన అది మీడియా ద్వారా తెలియాల్సిందే. అయితే సోషల్మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చేసే ప్రతీది ప్రపంచ మారుమూలాలకు వెళ్తోంది. అయితే అందులో కొన్ని నెటిజన్లకు నచ్చితే పోగడ్తలతో ముంచెత్తడం, లేదంటే విపరీతమైన ట్రోలింగ్ చేయడం సర్వ సాధారణం. తాజాగా ఓ పాపులర్ మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికి సరదానే. కాకపోతే ధనవంతులు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా చూసుకుంటారు. రష్యాకు చెందిన ‘ప్లేబాయ్’ మోడల్ పేరు అన్నా స్టూపక్ తన తన పెంపుడు కుక్కకి ఫోటోషూట్ చేయాలనుకుంది. ఇందులో ఆమెను విమర్శించాలి పని ఏముందని అనుకుంటున్నారా?. కానీ, అమ్మడు సరికొత్తగా ఆలోచించి ఫోటోషూట్ కోసం తన కుక్క పిల్ల కలర్నే మార్చేసింది. దాని ఒంటి మీదున్న వెంట్రుకలకు డై చేయించింది. అలా ఓ ఫోటో షూట్ కోసం ఏకంగా ఖర్చు 5 వేల యూరోలు (రూ. 5 లక్షలు) ఖర్చు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసింది. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది మూగ జీవాన్ని హింసించడమేనంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. దీంతో అన్నా తన చర్మానికి ఎలాంటి హానీ జరగకుండానే వైట్ డాగ్ను ఆరెంజ్ డాగ్గా మార్చామని బదులిచ్చింది. అయినా ఆమెపై విమర్శుల మాత్రం ఆగడం లేదు. చదవండి: బాడీలో ఆ పార్ట్కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ -
బాడీలో ఆ పార్ట్కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్
కొన్ని విలువైన వస్తువులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనం ఇల్లు, కారు, వాహనాలకు బీమా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆ బీమా డబ్బుని క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహాలోనే కొందరు సెలబ్రిటీలు తమ శరీర భాగాలకు ఇన్సురెన్స్ చేయించుకుంటుంటారు. ఈ జాబితాలో తారలు కూడా ఉన్నారు. తాజాగా బ్రేజిల్లో ఓ మోడల్ కూడా తన బాడీలోని ఓ పార్ట్ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకుంది. ఇంతకీ ఏంటా పార్ట్ అంటారా? ఆ మోడల్ తన పిరుదులను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటికే ఎందుకంటే.. బ్రెజిల్కు చెందిన మోడల్ నాథీ కిహారాకు తన పిరుదులే అందం. వాటి వల్లనే తను మిస్ బుమ్బుమ్ 2021 వరల్డ్ టైటిల్ను గెలుచుకుంది. ఆమె తన పిరుదుల కారణంగానే ప్రసిద్ధి చెందానని, అందుకే వాటికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది. నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. చదవండి: Britney Spears: నా జీవితంలో ఇదే అత్త్యుత్తమ రోజు: బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం -
ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్కు బెదిరింపులు
బెంగళూరు: ఆన్లైన్ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికి.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. సమాజంలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బెదిరింపులకు పాల్పడే వారిలో ఆడా, మగా అనే తేడా లేదు. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి బెంగళూరులో వెలుగు చేసింది. ఫేస్బుక్లో పరిచయం అయిన ఓ మహిళ.. స్నేహం ముసుగులో మంచిదానిగా నటిస్తూ.. మోడల్కు దగ్గరయ్యింది. ఆ తర్వాత మార్ఫ్డ్ వీడియోలతో ఆమెను బెదిరించసాగింది. మోడల్ ఫిర్యాదుతో పోలీసుల సదరు మహిళ మీద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు... కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఔత్సాహిక మోడల్కు ఫేస్బుక్లో నిందితురాలు సోనియా పర్నడీస్తో పరిచయం ఏర్పడింది. బాధితురాలు మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో.. సోనియా దాన్ని అవకాశంగా మార్చుకుంది. బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంపితే.. తనకు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. (చదవండి: ఆ ఫోటో చూసి సెట్స్లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్) ఆమె మాటలు నమ్మిన బాధితురాలు కొన్ని రోజుల క్రితం సోనియాకు తన వీడియోలు, ఫోటోలు పంపించింది. సోనియా తనకు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తుందని నమ్మకంగా ఉంది బాధితురాలు. ఈ క్రమంలో ఆమెకు అనుకోని షాక్ తగిలింది. తాను పంపిన ఫోటోలు, వీడియోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫ్ చేసి.. బాధితురాలి మొబైల్కి సెండ్ చేసింది సోనియా. (చదవండి: ఫ్యామిలీ గ్రూప్లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు) వాటిని చూసిన బాధితురాలు షాక్ అయ్యింది. తేరుకునేలోపే సోనియా బాధితురాలికి కాల్ చేసి.. ‘‘నీ నగ్న చిత్రాలు పంపకపోతే.. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని’’ బెదిరించసాగింది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. సోనియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. -
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు
సోషల్ మీడియాకు వాడుతున్న యూజర్ల సంఖ్య పెరగడంతో కొందరు తమ ఫోటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్ చేయడం అందులో కొన్ని వైరల్గా మారి హల్చల్ చేయడం షరా మామూలే. అయితే కొన్ని మాత్రం నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో అందులోని వారు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది తమ పైత్యాన్ని సోషల్మీడియాలో కూడా చూపెడుతూ నెటిజన్ల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా యూఎస్లోని ఫ్లోరిడాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ అమ్మాయి తండ్రి కొద్దిరోజుల క్రితం మరణించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలో ఆ యువతి తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోలో తన బాధను పక్కన పెట్టి చిరునవ్వు కూడా చిందించింది. తరువాత వాటిని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. తండ్రి శవం పక్కన ఆ ఫొటోలకు ఫోజులు ఏంటని మండిపడుతున్నారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేసింది ఆ యువతి. కానీ.. తను ఆ పోస్ట్ను డిలీట్ చేయడానికి ముందే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Have I mentioned the problem of a narcissistic and performative culture https://t.co/l7U7ZqdQKO— Tom Nichols (@RadioFreeTom) October 27, 2021 -
ఆ పని చేస్తే నగ్న ఫొటో పంపిస్తా: పోర్న్స్టార్ ఆఫర్!
వాషింగ్టన్: అమెరికన్ మోడల్, పోర్న్ స్టార్ కాజుమీ స్కూవర్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మగవాళ్లకు ఉచితంగా నగ్న ఫొటో పంపిస్తానని వెల్లడించింది. సాధారణంగా డబ్బులు తీసుకుని అలాంటి ఫొటోలు పంపుతానని, కానీ కరోనా వ్యాక్సిన్ క్యాంపెయిన్లో భాగంగా పైసా రుసుము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రజల జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపించిందో మనందరికీ తెలిసిన విషయమే! ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు విడిచారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ ప్రజలు టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అమెరికన్ పోర్న్ స్టార్ కాజుమీ కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి వినూత్న అవగాహన కార్యక్రమం ఆరంభించింది. కోవిడ్ టీకా వేసుకున్నవారికి నగ్న ఫొటో పంపిస్తానని ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం వారి కోవిడ్ సర్టిఫికెట్ నిజమా? కాదా? చెక్ చేశాకే ఫొటోలు పంపిస్తున్నాననంటోంది కాజుమీ. ఏదేమైనా ఆమె చేపట్టిన ఈ వింత ప్రయత్నం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. -
Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా?
Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రాన్స్ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్. కానీ, ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్ను డ్రెస్కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్ హూడీ’(సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు)ని డిజైన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్బెర్రీ మోడల్ లిజ్ కెనెడీ ‘సూసైడ్ ఏం ఫ్యాషన్ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Diet Prada ™ (@diet_prada) ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ‘డైట్ ప్రదా’ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్ చేస్తూ ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేయగా.. దుమారం మొదలైంది. View this post on Instagram A post shared by @liz.kennedy_ చదవండి: నెట్ఫ్లిక్స్ను ఆకాశానికెత్తిన అమెజాన్ బాస్ -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి డ్రగ్స్ వ్యవహరం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆర్యన్తో పాటు మున్మున్ ధమేచ అనే యువతి, ఆర్బాజ్ సేతు మర్చంట్లతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆర్భాజ్.. ఆర్యన్కు క్లోజ్ ఫ్రెండ్ కాగా మున్మున్ ధామేచ ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీయగా.. మున్మున్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యాషన్ మోడల్గా తెలిసింది. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఆమె వయసు 39. మున్మున్ స్వస్థలం మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లా. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరణించడంతో తన సోదరు ప్రిన్స్ ధమేచతో కలిసి 6 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తుంది. అయితే స్కూలింగ్ అంతా సాగర్లో చేసిన ఆమె ఆ తర్వాత పై చదువుల నిమిత్తం భోపాల్ల్కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ఆర్యన్, మున్మున్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా విచరాణలో నాలుగేళ్లుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ పోలీసులతో వెల్లడించాడు. చదవండి: Shahrukh Khan: షారుక్ ఖాన్కి భారీ షాక్! -
వెకిలిగా నవ్వాడు.. ఆ స్పర్శతో తొలిసారి నగ్నంగా ఫీలయ్యా: నటి
Emily Ratajkowski Alleges Robin Thicke: ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ చేస్తున్నప్పడు సింగర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ అమెరికన్ మోడల్ ఎమిలీ రటాజ్కోవ్స్కీ ఆరోపించింది. 2013లో ‘బ్లర్డ్ లైన్స్’అనే మ్యూజిక్ వీడియో షూట్ సమయంలో సమయంలో అమెరికన్ సింగర్ రాబిన్ తికే తాగి సెట్స్పైకి వచ్చాడు. 'అంతేకాకుండా నా చాతిని (వక్షోజాలను) టచ్ చేశాడు. ఓ వ్యక్తి స్పర్శను నేను వెంటనే పట్టిగట్టాను. ఎవరా అని వెనక్కి తిరిగి చేస్తూ..రాబిన్ వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. వెంటనే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పుడు మొదటిసారి నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది' అంటూ పేర్కొంది. ఈ మ్యూజిక్ వీడియోలో ఎమిలీతో పాటు మరో ఇద్దరు మోడల్స్ సైతం నగ్నంగా కనిపించారు. షూటింగ్ వరకు నగ్నంగా ఉన్నా తానెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని, రాబిన్ చర్యలతో సిగ్గుతో సెట్ వెనకాల దాక్కున్నట్లు ఎమిలీ ఆరోపించింది. కాగా ఇటీవలె ఈమె రాసిన ‘మై బాడీ‘అనే పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబిన్పై ఎమిలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ రాబిన్ ఇంత వరకు స్పందించలేదు. చదవండి: నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు! -
డ్రింక్ చేసి.. సీన్ క్రియేట్ చేసిన మోడల్
భోపాల్: తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్న ఘటనలను ఈ మధ్య మనం తరుచు చూస్తున్నాం . వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవి సఫలం కావటం లేదు. అంతేకాదు మరికొంత మంది డ్రింక్ చేసి రోడ్ల పైకి వచ్చి హల్చల్ చేసి పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడి....ట్రాఫ్రిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. తాజాగా అలాంటి సంఘటనే గాల్వియార్లో చోటు చేసుకుంది. (చదవండి: బాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!) మధ్యప్రదేశ్లోని గాల్వియార్లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల ఒక మోడల్ రద్దీ రహదారి పైకీ వచ్చి ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ కారు డ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెని వారించటానికీ ప్రయత్నిస్తుంటే ..ఆమె అతన్ని పక్కకు నెట్టేసి వాదనకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ ఆర్మీ అధికారి ఆమె పై ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదని పోలీసు అధికారి చెప్పారు. సదరు మోడల్ గాల్వియార్లో పర్యటించటానికి వచ్చినట్టుగా పేర్కొన్నారు.(చదవండి: డాక్టరేట్ గ్రహీత.. మాజీ అథ్లెట్.. మాజీ టీచర్కు దయనీయ పరిస్థితి) -
ఫొటోషూట్కు వెళ్లిన మోడల్పై చిరుతల దాడి
జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్పై రెండు చిరుత పులులు దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సదరు మోడల్ పేరు జెస్సికా లీడోల్ఫ్(36). ప్రముఖ అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. తూర్పు జర్మనీ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరుతలు ఉండే బోనుకు సమీపంలో జెస్సికా ఫొటోషూట్ తీసుకుంటుండగా రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నోటీసులు రాలేదంటున్న నటులు! ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్ హోం యజమాని బిర్గిట్ స్టేచ్ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో యజమానిపై కేసు నమోదు చేసి, ఈ హోంను అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. చదవండి: బిగ్బాస్ : అఫిషియల్ డేట్ వచ్చేసింది.. లిస్ట్ ఇదే! -
సెక్స్ రాకెట్: టాప్ మోడల్, నటి అరెస్ట్
ఓ స్టార్ హోటల్లో గుట్టుగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. జూహులోని ఓ 5 స్టార్ హోటల్లో పలువురు టీవీ నటులు, మోడల్తో ఆమె ఈ రాకెట్ను నడిపిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన సదరు మహిళను టాప్ మోడల్, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోవడంతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా సదరు మోడల్ పేరు ఇషా ఖాన్గా సమాచారం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం.. జూహులోని 5 స్టార్ హోటల్లో సదరు మోడల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చదవండి: పాయల్ రాజ్పుత్పై కేసు నమోదు దీంతో కస్టమర్లుగా ఇషాఖాన్కు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో వారితో గంటకు ఒక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం కుదరడంతో ఆమె పోలీసులకు కొంతమంది అమ్మాయిల ఫొటోలను వాట్సప్లో పంపించింది. ఆ తర్వాత వారిని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్ హోటల్కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. అనంతరం ఈ రాకెట్ నడుపుతున్న ఇషాఖాన్పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Maharashtra | Mumbai Crime Branch on Friday busted a high-profile prostitution racket at a five-star hotel in Juhu. A TV actress was arrested and two people, including a model and another TV actress, have been rescued. — ANI (@ANI) August 21, 2021 -
ఏపీలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు
-
రాజ్కుంద్రాపై ఆరోపణలు: చంపుతామంటూ నటికి బెదిరింపులు
Sagarika Shona Suman: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసిన మోడల్, నటి సాగరిక ఇబ్బందుల్లో పడింది. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది. ఈ మేరకు గురువారం నాడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు రాజ్ కుంద్రా ఏం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు పోర్న్ చిత్రాలు చూస్తారు కాబట్టే మేము వాటిని చిత్రీకరిస్తున్నామని దబాయించారు. ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పడటానికి కారణం నేనేనని నిందిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఈ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపించడమే కాక నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. దీనికి కారణమైనవారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను" అని చెప్పుకొచ్చింది. కాగా రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్ కావత్ నుంచి తనకు వెబ్ సిరీస్ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందని, ఈ వీడియోకాల్లో నగ్నంగా కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది. -
వెబ్ సిరీస్లో చాన్స్! కానీ నగ్నంగా ఆడిషన్ అంటూ కండీషన్!
Actress Sagarika Shona: ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టవడం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్లో అవకాశాల పేరిట యువతులను ట్రాప్లోకి దించి వారితో బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించాడంటూ అతడి మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మోడల్, నటి సాగరిక సోనా సుమన్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది. "నేను మోడల్ను. మూడు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో లాక్డౌన్లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. గతేడాది ఆగస్టులో ఉమేశ్ కామత్ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది. రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరని అడిగితే అతడు శిల్పాశెట్టి భర్త అని పేర్కొన్నాడు." "నేను ఆ వెబ్సిరీస్లో నటిస్తే మున్ముందు కూడా మంచి అవకాశాలు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటానని ఎంతో గొప్పగా చెప్పడంతో నేను సరే అన్నాను. అయితే ముందుగా ఆడిషన్ ఉంటుందని, కోవిడ్ టైం కాబట్టి వీడియో కాల్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పాడు. ఇక వీడియో కాల్లో జాయిన్ అయ్యాక అతడు నగ్నంగా ఆడిషన్లో పాల్గొనమన్నాడు. ఒక్కసారిగా షాకైన నేను వెంటనే అతడికి కుదరదని తేల్చి చెప్పాను" "అప్పుడు వీడియో కాల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు, కానీ అతడే రాజ్కుంద్రా అనుకుంటున్నా. నిజంగా అతడు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే రాజ్కుంద్రాను అరెస్ట్ చేసి, ఈ రాకెట్ గుట్టు రట్టు చేయాలని కోరుకుంటున్నా" అని సాగరిక పేర్కొంది. కాగా రాజ్కుంద్రా ఆఫీసు నుంచి పోర్న్ వీడియోలు అప్లోడ్ చేయడంలో ఉమేశ్ కామత్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే బలమైన ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. -
'పెళ్లి కాకుండానే తల్లయ్యాను, ప్రియుడు వదిలేశాడు'
Anmol Chaudhary: హిందీ మోడల్, సోషల్ మీడియా స్టార్ అన్మోల్ చౌదరి తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సింగిల్ మదర్గా వాడి ఆలనాపాలనా చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్మోల్ చౌదరి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో తను ఓ వ్యక్తిని ప్రేమించానని, అతడితో రెండేళ్లపాటు సహజీవనం చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో గతేడాది తను గర్భం దాల్చానని, అబార్షన్ కూడా చేయించుకోవాలనుకున్నామని తెలిపింది. కానీ అంతలోనే తన మనసు పేగు బంధం మీద ప్రేమ పెంచుకోవడంతో బిడ్డ ఊపిరి తీయలేకపోయానంది. సెప్టెంబర్లో ఆ పసికందు ఈ లోకంలోకి అడుగు పెట్టేసరికే ప్రియుడు తనతో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయాడని ఉద్వేగానికి లోనైంది. "బాయ్ఫ్రెండ్తో డేటింగ్ వల్ల గర్భం దాల్చాను. కడుపులో ఉన్న బిడ్డను వదిలించుకోమని నా మాజీ ప్రియుడు సలహా ఇచ్చాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. పసికందును పొత్తిళ్లలోకి తీసుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఆశపడ్డాను. అదేమాట అతడితో చెప్పాను. అతడికేనా.. నేను గర్భవతిని అన్న విషయాన్ని ఫొటోతో సహా ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. కానీ నిస్సహాయత వల్ల అలా చేయలేకపోయాను. అతికొద్దిమందికి మాత్రమే నేను గర్భం దాల్చానని తెలుసు. ఆఖరికి నా పేరెంట్స్కు కూడా ఈ విషయం తెలీదు." "పెళ్లి కాకుండానే గర్భవతి అయినందుకు నన్ను నిందిస్తారన్న భయంతో ఈ విషయాన్ని అందరితోపాటు, ఆఖరికి నా తల్లిదండ్రుల దగ్గర కూడా దాచిపెట్టాను. మరోపక్క నేను లావెక్కుతున్నానని జనాలు నన్ను అవమానించడం మొదలు పెట్టారు. నా కడుపులో పిల్లాడు ప్రాణం పోసుకుంటున్నందువల్లే నేను లావయ్యానని గట్టిగా అరిచి వాళ్ల నోళ్లు మూయించాలని ఉండేది. కానీ అప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాను. ఆ సమయంలో నా సోదరి నాకు అండగా నిలబడింది. డెలివరీ సమయంలో కూడా తనే దగ్గరుంది" "ఇవన్నీ చూశాక స్వంతంగా నా కాళ్ల మీద నేను నిలబడాలని నాకు తెలిసొచ్చింది. సరిగ్గా అప్పుడే నా మాజీ ప్రియుడు నాకు సాయం చేస్తానంటూ మాట కలిపాడు. కానీ ఎందుకు? నేనెక్కడ తన పేరును బయటపెడ్తానోనన్న భయం అతడిని ముందుకు వచ్చేలా చేసింది. నా బేబీకి తల్లిదండ్రులు ఉండాలన్న ఆశతో మేం మళ్లీ కలిసిపోవాలనుకున్నాం, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అవివాహిత ఒంటరి తల్లిగా బాబును పెంచుతున్నా. ఇప్పటికైనా నా మాజీ ప్రియుడు నా కొడుకును కలవాలనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు" అని అన్మోల్ చౌదరి చెప్పుకొచ్చింది. ఇటీవలే బాబు ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె నోయిడాలో తన సోదరితో కలిసి నివసిస్తోంది. ఆమె గతంలో 2007లో వచ్చిన స్ప్లిట్స్విల్లా పదో సీజన్లో పాల్గొంది. -
మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి
Model Nayab Nadeem: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రఖ్యాత మోడల్ అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసి.. నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు దుండగులు. సవతి సోదరుడి ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. పాకిస్తాన్ ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్ ఆదివారం అనుమానాస్పద రీతిలో హత్య గావించబడ్డారు. లాహోర్లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పాకిస్తాన్ న్యూస్ పేపర్ డ్వాన్ వెల్లడించింది. నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నది. నయాబ్ సవతి సోదరుడిచ్చిన ఫిర్యాదతో పోలీసులు కేసు నమోదు చేశారు. 29 ఏళ్ల నయాబ్ ఇంకా వివాహం చేసుకోలేదు. లాహోర్లోని డిఫెన్స్ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా నయాబ్ సవతి సోదరుడు నసీర్ మాట్లాడుతూ.. ‘‘శనివారం అర్థరాత్రి మేం ఐస్క్రీం తినడానికి బయటకు వెళ్లాం. ఆ తర్వాత నేను తనను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లాను. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్ కాల్ చేసింది. కానీ పడుకుని ఉండటంతో తన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. దాంతో తనను చూడటానికి వచ్చిన నాకు భయానక దృశ్యం కనిపించింది’’ అని తెలిపాడు. ‘‘గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న నయాబ్ శరీరం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే భయంతో బిగుసుకుపోయాను. ఆ తర్వాత తేరుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. ఇక తన నగ్న శరీరాన్నీ టీవీ రూంలో పడేశారు’’ అని నసీర్ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. -
మహాగనీ గెటర్: ఐ యామ్ బ్యూటిఫుల్!
లోపాన్ని ఆత్మవిశ్వాసం మాటున దాచేయడమే అందం..ఆత్మబలంతో బలహీనతను గల్లంతు చేయడమే విజయం..ఆ అందం, ఈ విజయానికి పోతపోసిన రూపం ‘మహాగనీ గెటర్’! రంగు– రూపు, ఒడ్డు–పొడుగు అనే స్టిరియోటైప్ బ్యూటీ డెఫినెషన్ను ఎడమకాలుతో తన్నింది! ఆత్మస్థయిర్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయింది.. పుట్టుకతో వచ్చిన అనారోగ్యాన్ని అందంగా కేరీ చేస్తోంది.. ధైర్యానికి మోడల్గా ఆమెను ఎంతోమంది అభిమానిస్తున్నారు అంతకంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. మహాగనీ గెటర్ .. వయసు 23 ఏళ్లు. అమెరికా, టెన్నెసీ రాష్ట్రంలోని నాక్స్విల్ నివాసి. ముగ్గురు అక్కాచెల్లెళ్ళలో తనే పెద్దది. గెటర్ పెరుగుతున్న కొద్దీ ఆమె ఎడమ చేయి, కాలు అసహజంగా పెరుగుతూ వచ్చాయి. డాక్టర్లకు చూపిస్తే ‘లింఫడీమా’ అనే వ్యాధే కారణం అని తేల్చారు. అది గెటర్కు పుట్టుకతోనే ఉన్నట్టు నిర్థారించారు. ‘ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమంటూ లేదు. కాలులో ఏర్పడే ద్రవాలను తీసివేయడం, మసాజ్ చేయడం, ఫిజయోథెరపీతో ఉపశమనం పొందడమనే తాత్కాలిక చికిత్స తప్ప’ అని చెప్పారు డాక్టర్లు. తన ఈడు వాళ్లతో చురుగ్గా ఆడుకోలేక, వేగంగా పరిగెత్త లేక.. లోపల్లోపలే కుమిలిపోయేది. టీన్స్లోకి అడుగుపెట్టాకయితే తన కాలు ఒక శాపంలా అనిపించేది ఆమెకు. అందరిలా తనెందుకు లేదనే బాధ తనను తాను అసహ్యించుకునేలా చేసింది. అయినా మనసులో ఏదో కసి.. పట్టుదల.. ఆ అనారోగ్యాన్ని చిన్నబుచ్చాలని. అందుకే డాక్టర్ల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కాపాడుకుంటోంది కూడా. లింఫ్ డాట్ గాడెస్23 ఆరోగ్యం ఇచ్చిన ధైర్యం ఆమెలో కొత్త ఆలోచనలను రేపింది. సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుంది. లింఫడిమా ఆన్లైన్ కమ్యూనిటీలతో కనెక్ట్ అయింది. కొత్త విషయాలను తెలుసుకుంది. తన అనుభవాలను పంచుకుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంది. దాంతో సోషల్ మీడియాను తన ప్రతిభకు ఎలా డయాస్గా మలచుకోవచ్చో అర్థం చేసుకుంది. కొత్త కొత్త కంటెంట్లు, టిక్టాక్లు వంటివి పోస్ట్ చేయసాగింది. వాటికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసరికి ఆమెలో ఉత్సాహం ఇనుమడించింది. దాంతో ‘లింఫ్ డాట్ గాడెస్ 23’ అనే పేరుతో ఇన్స్టాలోనూ అకౌంట్ తెరిచింది. అందులో తన ఫ్యాషన్ ఫొటోలు పెట్టి చూసింది. దానికీ ఫాలోవర్లు పెరిగారు ఆమే ఆశ్చర్య పోయేలా. నెగటివ్ కామెంట్స్నూ అందుకోలేక పోలేదు ఆమె. ఎడమచేత్తో వాటిని కొట్టిపడేసింది. ఇప్పుడు ఆమె ‘లింఫ్ డాట్ గాడెస్ 23’కి తొమ్మిదివేల మందికి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె 136 కేజీల బరువుంది. అందులో ఆమె ఎడమకాలి బరువే 45.3 కేజీలట. శపించాడనుకుని... ‘నన్ను దేవుడు శపించాడు అనుకుంటూ సెల్ఫ్ పిటీలోనే బాల్యం వెళ్లదీశాను. అనారోగ్యానికి భయపడినంత కాలం సెల్ఫ్ పిటీ మనల్ని మింగేస్తుందని ఎప్పుడైతే గ్రహించానో అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. అదే నాకు మానసిక బలాన్నిచ్చింది. నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. ఐ యామ్ బ్యూటిఫుల్ అని తెలుసుకున్నాను. ఇన్స్టాలోని నా ఫ్యాషన్ ఫొటోస్ను ముందుగా ఎంకరేజ్ చేసింది మా అమ్మే. తర్వాత ఆన్లైన్ లింఫడీమా కమ్యూనిటీ. నా ఈ అందమైన జర్నీలో వాళ్లందరూ భాగస్వాములే’ – మహాగనీ గెటర్ లింఫడీమా అంటే.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో భాగమైన లింఫాటిక్స్లో కొన్ని సందర్భాల్లో జన్యు ఉత్పరివర్తనాల కారణంగా అవరోధాలు ఏర్పడతాయి. దీంతో∙లింఫాటిక్స్లో ఉన్న ద్రవాలు శరీరంలోని మిగతా భాగాల్లోకి చేరి అక్కడ వాపునిస్తాయి. దీనినే లింఫడీమా అంటారు. ముఖ్యంగా చేతులు, కాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో రెండు కాళ్లు, రెండు చేతుల్లోనూ కనిపిస్తుంది. లింఫడీమాకు శాశ్వత వైద్య పరిష్కారం రాలేదింకా.. నియంత్రణా ట్రీట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. -పి. విజయా దిలీప్ -
Anam Darbar: సెలబ్రిటీ డాటర్ అట్రాక్టివ్ అనమ్!
తల్లిదండ్రుల సెలబ్రెటీ హోదాను వాడుకుని పాపులర్ అయ్యేవారు కొందరైతే.. సెలబ్రిటీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో స్టార్లుగా మెరుస్తున్నవారు మరికొందరు. ఇటువంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది.. ‘అనమ్ దర్బార్’. ముంబైకి చెందిన 23 ఏళ్ల అనమ్ దర్బార్ 22 లక్షలమంది ఫాలోవర్స్తో సోషల్ మీడియా స్టార్గా దూసుకుపోతోంది. ఎంతో క్యూట్గా కనిపించే అనమ్ .. మోడల్, డ్యాన్సర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. 2017లో టిక్టాక్తో సోషల్ మీడియాకు పరిచయమైన అనమ్... కొత్తగా కంటెంట్ను క్రియేట్ చేసేది. ట్రెండింగ్ టాపిక్స్పై వీడియోలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేది. అంతేగాకుండా లిప్సింక్, కామెడీ వీడియోలను సరికొత్తగా చేసి టిక్టాక్ ఫాలోవర్స్ను తనవైపు తిప్పుకుంది. దీంతో తన వీడియోలు చూసే ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిది మిలియన్లకు చేరింది. అయితే కొన్ని కారణాలతో ఇండియాలో టిక్టాక్ బ్యాన్ చేయడంతో.. అనమ్ తన సొంత యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లలో ప్రాంక్ వీడియోలు, డ్యాన్సింగ్ వీడియోలు, మేకప్ ట్యూటోరియల్స్, ట్రావెల్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనమ్ వీడియోలు బాగా పాపులర్ అవడంతో తన ఫోటో చాలా మ్యాగజీన్ల కవర్ పేజీలపై కనిపిస్తోంది. ఇవేగాక ప్రింట్ షూట్స్లో పనిచేస్తూ తర్వాత మోడలింగ్లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టిపెరిగిన అనమ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయేల్ దర్బార్ గారాల పట్టి. పాపులర్ కొరియోగ్రాఫర్, టిక్ టాక్ స్టార్ అవేజ్ దర్బార్కు స్వయానా చెల్లెలు. అవేజ్ దర్బార్, జైద్ దర్బార్లు ఇద్దరూ పాపులర్ కొరియోగ్రాఫర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఎంటర్టెయినర్స్కు అనమ్ ఒకరికి చెల్లి అయితే మరొకరి అక్క. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ‘బి యూ ఇన్’, ‘అత్రంగజ్’ డ్యాన్స్ స్టూడియోలను అవేజ్ నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు డ్యాన్స్ నేర్పించిన ఈ స్టూడియోలలో అనమ్ సభ్యురాలుగా ఉంది. అంతేగాక తన అన్నయ్యలతో కలసి అనేక డ్యాన్స్ వీడియోలు రూపొందించింది. అన్నయ్య ప్రేరణతో.. ముంబైలోనే పెరిగిన అనమ్ కామర్స్ గ్రాడ్యుయేట్. అనమ్ సెలబ్రెటీ కాకముందు కొంచెం లేజీగా ఉండేది. అయితే అవేజ్, అవేజ్ స్నేహితురాలు నగ్మా మిరాజ్కర్ కలిసి టిక్టాక్ వీడియోలు చేస్తుండడం చూసి.. వారిని ప్రేరణగా తీసుకుని తను కూడా వీడియోలు రూపొందించి టిక్టాక్లో పోస్టు చేసేది. చూస్తుండగానే బాగా పాపులర్ అయ్యింది. కొద్దికాలంలోనే తన వీడియోలను ఇష్టపడే వారి సంఖ్య లక్షలకు చేరింది. తన వీడియోలతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోన్న అనమ్ ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ను బాగా ఇష్టపడుతుంది. చేతిమీద ఇంగ్లిష్ అక్షరాల్లో ‘పాజిటివిటి’ అని ట్యాటూ వేసుకుని అంతే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఒకపక్క తన వీడియోలతో సోషల్ మీడియా నెటిజన్లను అలరిస్తూనే మరోపక్క ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, యాడ్లలో నటించడం ద్వారా, ఫ్యాషన్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తోంది. తన సంపాదనలో కొంత భాగాన్ని ఎన్జీవోలకు విరాళంగా ఇస్తూ ఎంతోమందికి విద్యాదానం చే స్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి
మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్. మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్ బి.టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్లో కనిపించారు. మిస్ మయన్మార్ అయ్యారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచారు. జిమ్నాస్టిక్స్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు. ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్సాంగ్ సూకీని అరెస్ట్ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు. ఈ ఘటనలన్నీ హటటున్ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి. ఇన్నాళ్లూ హటటున్ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్ సోల్జర్గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్ సోషల్ మీడియాలో విప్లవ నినాదం చేశారు. ఆ వెంటనే మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్. ∙∙ మయన్మార్లోని ప్రధాన నగరం యాంగూన్లో ఉండేవారు హటటున్. గత ఏప్రిల్లో అక్కడి నుంచి తన ఫ్రెండ్తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్ నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ డిఫెన్స్ ఫోర్స్లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్లను బట్టి తెలుస్తోంది. -
Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్ జర్నీ
ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్ ఫేస్ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం. ‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్ ప్రార్థన ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్ ఫేస్’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు. ‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన. స్నేహితులంతా జాంబీ ఫేస్ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన. 2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్ చేయటం ప్రారంభించి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, తనను సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ కావడమే కాదు, ఇంజినీరింగ్లో డిగ్రీ కూడా సాధించింది. తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్లో అప్లోడ్ చేసింది. బొల్లి గురించి తన చానెల్లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్ మీడియా. -
ఆయన్ని ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు : మోడల్
మొనాకొ: టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ .. సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకు టెన్నిస్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన జొకోవిచ్ వరల్డ్ చాంపియన్గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు జొకోవిచ్ కెరీర్లో 18 గ్రాండ్స్లామ్ టైటిల్స్, 82 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. టెన్నిస్ రారాజుగా వెలిగిపోతున్న జొకోవిచ్ను చూసి కొందరు గిట్టనివాళ్లు అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినట్లు సమాచారం. దీనికోసం సెర్బియన్ మోడల్.. ఇన్స్టాగ్రామ్ స్టార్ నటాలియా సెకిచ్ను జొకోవిచ్ను తప్పుగా చూపించాలంటూ కొందరు వ్యక్తులు సంప్రదించారు. అయితే సదరు మోడల్ జొకోవిచ్ ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారి ఆఫర్ను తిరస్కరించినట్లు తాజాగా ఒక మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది.''జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించాలి. అలా చేస్తే 60వేల యూరోలు(భారత కరెన్సీలో రూ. 52 లక్షలు) ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. కానీ జొకోవిచ్ అంటే నాకు ఎనలేని అభిమానం. అతని ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారిచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాను.'' అని తెలిపింది. చదవండి: మెద్వెదెవ్ మొదటిసారి... టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
మాట్లాడుకుందామని పిలిచి మోడల్పై ఆత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్లో దింపాడు. అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఫోన్లో సందేశాల ద్వారా కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో నిందితుడు తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న మరో హోటల్కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఫిబ్రవరి 23న ముంబైకి పంపినట్లు తెలిపారు. చదవండి: ఇంటి బేస్మెంట్లో ఓ పెద్ద సొరంగం -
బాప్రే.. 50 ఏళ్ల వయసులో 50 కేజీలు తగ్గాడు
న్యూఢిల్లీ: మనిషి ఏదైన సాధించాలనుకుంటే వయస్సు అడ్డం కాదు..కావాల్సిందల్లా బలమైన సంకల్పం, చేయగలననే విశ్వాసం మాత్రమే. ఒక వ్యక్తి తన 50వ ఏటా, 50 కేజీల బరువు తగ్గడమే కాకుండా, మోడల్ రంగంలోను రాణించాడు. రజనీకాంత్, షారుఖ్ వంటి స్టార్లతో సినిమాలలో నటించాడు. కాగా, మోడల్ దినేష్ మోహన్ తన బరువు తగ్గడం వెనుక పడిన కష్టాన్ని హ్యుమన్స్ ఆఫ్ బాంబెతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు...దినేష్ మోహన్ ఒకప్పుడు అందరిలా బాగానే ఉన్నాడు..కొన్నేళ్ళకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. దానితో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరోగ్య సమస్యలతో 44 ఏళ్ల వయస్సులో 130 కేజీల బరువు పెరిగిపోయాడు. అక్క, బావ డాక్టర్లు, సైకియాట్రిస్ట్ యార్టిక్స్లకు చూపించారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రంమార్పు రాలేదు. ఒక సంవత్సరంపాటు ఇంట్లోనే మంచానికే అంకిత మయ్యాడు. ఒకరోజు కుటుంబ సభ్యులందరు దినేష్ దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకున్నారు. నువ్వు ఇలా కృంగిపోవడం బాగాలేదని, స్పూర్తీవంతమైన మాటలు చెప్పారు. కొన్ని రోజులకు దినేష్లో మార్పురావడం మొదలైంది. వెంటనే డైటిషియన్ను సంప్రదించాడు. అతని సూచనల మేరకు ఆహర నియమాలు పాటించాడు. మనస్సుకు ఆహ్లదాన్నిచ్చే వీడియోలు చూసేవాడు. ప్రధానంగా ఐ ఆఫ్ టైగర్వినడం ఎంతో స్పూర్తీ నిచ్చిందని చెప్పాడు. కొన్ని రోజులకు తన చుట్టుపక్కల వారితో కలవడం ప్రారంభించాడు. క్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగై, బరువు 50 కేజీలు తగ్గింది. దీనికోసం అనేక రకాల వర్కవుట్స్ చేశాడు. కొన్నిరోజుల తర్వాత ఇతడు సోషల్ మీడియాలో నన్ను గుర్తుపట్టారా.. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను.. ఇప్పుడు ఎలా ఉన్నాను.. అని తన ఫోటోని పోస్ట్ చేశాడు. అది తెగ వైరల్ అయిపోయింది. ఆ ఫోటోలను ఫిదా అయిన నెటిజన్లు700ల కామెంట్లు, 18 వేల లైక్లు ఇచ్చి తమ సంతోషాన్నిపంచుకున్నారు... మీరు యువతకు ఎంతో ఆదర్శం, గొప్ప పనులకు వయస్సు అడ్డుకాదనడానికి మీరే మా స్ఫూర్తీ ప్రదాత అని కామెంట్టు చేశారు. .జీవితం ఎప్పుడూ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదని కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సాధించగలననే నమ్మకం కల్గిఉండాలని అందరిలోను స్పూర్తీని నింపాడు. -
విడాకుల వివాదం.. మోడల్ దారుణ హత్య
బీరూట్: లెబనాన్కు చెందిన జైనా కంజో చాలా అందంగా ఉంటుంది. బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని చూసిన మోడలింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు ఊరుకోరు కదా.. పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు లభిస్తోంది. మోడల్గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఇంకా ఏడాది కూడా గడవలేదు. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితంలో ఘర్షణలు మొదలయ్యాయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. మోడల్గా రాణించాలనేది జైనా ఆశ. కానీ ఆమె భర్త మాత్రం అందరి భార్యల్లాగే జైనా కూడా ఇంటి పట్టునే ఉండాలని.. కుటుంబాన్ని చూసుకోవాలని భావించాడు. దాంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలే. ఇక లాభం లేదునుకుని జైనా భర్త నుంచి విడిపోవాలని భావించింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైనా భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వత భయంతో అక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. జైనాను హత్య చేసిన తర్వాత ఆమె భర్త తాను చేసిన దారుణం గురించి సోదరితో చెప్పాడు. వారి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ మీడియాకు చిక్కింది. దీని ఆధారంగా పోలీసులు జైనా భర్త మీద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఆడియో క్లిప్పింగ్లో జైనా భర్త తన సోదరిని ఉద్దేశించి.. ‘‘నన్ను ఏమైనా అడుగు. నేను కావాలని తనను చంపలేదు. ఆమె చనిపోవాలని నేను కోరుకోలేదు. ఆమె ఏడుస్తుండటంతో నా చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టాను. ఏడవద్దని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు.. నాతో గొడవపడాలని చూసింది. తెల్లవారుతున్నా ఆమె ఏడుపు ఆపలేదు. నేను ఆమెను చంపానా’’ అని ఆడిగినట్లు తెలిసింది. ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే జైనా తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హింసిస్తున్నాడని.. భర్త నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. ఇక జైనా హత్యకు సంబంధించి ఆమె అభిమానులు పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అందానికి కొలతలెందుకు? 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను -
మోడల్ పొట్టి డ్రెస్.. ఫ్లైట్లోకి నో ఎంట్రీ
మెల్బోర్న్ : పొట్టి దుస్తులు ధరించిన కారణంగా ఓ మోడల్కు చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్ కారణంగా సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్స్టాగ్రామ్ మోడల్ జెట్స్టార్ అనే ఎయిర్లైన్స్లో గోల్డ్ కోస్ట్ నుంచి మెల్బోర్న్కు బయలుదేరింది. అయితే ఆమె వేసుకున్న టాప్ మరీ చిన్నదిగా ఉండటంతో సిబ్బంది ఆమెను విమానం ఎక్కనివ్వలేదు. ఆ సమయంలో మోడల్ బ్లూ జీన్స్, బ్లాక్ క్రాప్ టాప్ ధరించి ఉంది. అయితే టాప్ మరీ చిన్నదిగా ఉందని, ఓవర్ కోట్ ధరించాలని సూచించారు. లేదంటే విమానంలోకి అనుమతించమని సిబ్బంది తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీ లేక జాకెట్ను ధరించింది. ఈ విషయంపై తన ఫేస్బుక్ పేజీలో ఆవేదనను వ్యక్తం చేసింది. (రైతులకు మద్దతు.. నటికి అత్యాచార బెదిరింపులు) 'నేను విమానంలోకి అడుగుపెట్టగానే, అక్కడి సిబ్బంది ఏదో వెతకడం ప్రారంభించాడు. నా డ్రెస్ చూసి నన్ను జాకెట్ వేసుకోమని చెప్పినప్పుడు చలిగా ఉంటుందని అలా అన్నారేమో అనుకున్నా. కానీ నా టాప్ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలోకి ఎక్కించలేదమని చెప్పిన్పపుడు చాలా బాధేసింది. జాకెట్ వేసుకునేంత వరకు సీట్లోకి కూర్చోనివ్వలేదు. నేను ఒక మోడల్ని. అంత మంది ప్రయాణికుల ముందు నన్ను అవమానించారు. నాపై వివక్ష చూపించారు. జెట్ స్టార్ ఆస్ట్రేలియా..ఇది 1921 ఆ లేక 2021' ?అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. (ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్) View this post on Instagram A post shared by ISABELLE (@isabelle.eleanore) I almost got kicked off the plane for what I was wearing!! 🤬 This is ridiculous.. I was humiliated, degraded and discriminated against. @JetstarAirways you have some answering to do!! pic.twitter.com/66jk5P6J3E — Isabelle Eleanore (@IsabelleEleano) February 2, 2021 -
విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య
జీవితం వినోదం కాదనిపిస్తుంది.. వినోద రంగంలో ఉన్నవాళ్లు ఆత్మహత్యలకు తెగించినప్పుడు! స్క్రీన్ మీద నటించినవాళ్లు నిజ జీవితంలో నటించలేకపోతున్నారా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎంటర్టైనర్లుగా వెలిగిపోతున్నవాళ్లు బయటి జీవితంలో నిలదొక్కుకోలేక చీకటిలోకి పారిపోతున్నారా? జీవితం స్మార్ట్ అయ్యాక భూగోళమంతా ఇప్పుడు యువలోకమే. కానీ యూత్ ఎందుకని యమలోకం వైపు వెర్రిగా చూస్తోంది. శనివారం సౌత్ కొరియాలో ‘సాంగ్’ అనే యువ నటి చనిపోయింది. శనివారమే మనవైపు నెల్లూరులో రఫీ షేక్ అనే యువ టిక్టాక్ సెన్సేషన్ చనిపోయాడు. ఆదివారం కన్నడ బిగ్బాస్ ఫేమ్ జయశ్రీ విగతజీవిగా కనిపించారు. పంచినన్నాళ్లు వినోదాన్ని పంచి, అకస్మాత్తుగా వీళ్లెందుకని విషాదాన్నీ మిగిల్చి వెళుతున్నారు. గ్లామర్ ఫీల్డ్లో కొత్త టాలెంట్ని, కొత్తగా చూపిస్తున్న టాలెంట్ని నిలబడనివ్వని శక్తులు చాలానే ఉంటాయి. అవి గొంతు పట్టుకుంటాయి. ఊపిరి ఆడకుండా చేస్తాయి. మనిషి జీవితం అంటేనే భయం కలిగేలా, తిరిగి అమ్మ కడుపులోకే పారిపోవాలన్నంతగా భయపెడతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వెంటాడతాయి. చివరికి మరణం అంచుల వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి నెట్టేస్తాయి. పైకొస్తున్న అమ్మాయిలకు లైంగిక వేధింపులు ఉంటాయి. అబ్బాయిలకు అవమానాలు ఉంటాయి. పోటీ, ప్రేమ, డబ్బు.. ఈ రంగంలో ప్రథమ శత్రువులు. క్రియేటివిటీ ఉన్న చోట ఆ స్థాయిలోనే రూమర్లూ క్రియేట్ అవుతుంటాయి. ట్రోలింగ్లు జరుగుతుంటాయి. తట్టుకుని నిలబడలేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. డిప్రెషన్ మనిషికి చేయిపట్టుకుని తీసుకెళ్లే ఒకే ఒక చోటు.. మరణం! చదవండి: (వేధింపులకు తాళలేక టిక్టాక్ స్టార్ ఆత్మహత్య) దక్షిణ కొరియా యువనటి సాంగ్ యూ–జంగ్ నెల్లూరులో రఫీ షేక్, కర్ణాటకలో జయశ్రీల వేర్వేరు మరణాలలో కారణాలపై విచారణ జరుగుతోంది. సియోల్లో 26 ఏళ్ల కొరియన్ నటి సాంగ్ (పూర్తి పేరు సాంగ్ యూ–జంగ్) ‘ఆత్మహత్య’ కు కారణం మాత్రం ‘అన్నోన్’గానే మిగిలిపోయింది. కూతురే పోయాక కారణాలను ఏం చేసుకోను అని ఆమె తల్లిదండ్రులు నిర్లిప్తంగా ఉండిపోయారు. నిర్లిప్తంగానే సోమవారం కూతురి అంత్యక్రియలు జరిపించారు. సాంగ్కి ‘సబ్లైమ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ’లో జాబ్. అవును జాబ్! కళ ఉన్నవారికి అవకాశాలు ఇప్పించే సంస్థలు ప్రత్యేకంగా ఉంటాయి. నిర్మాతలు, నిర్వాహకులు ఎవరైనా వచ్చి సాంగ్ని వాళ్ల ‘షో’ కి, లేదా సినిమాకు ఒప్పించాలంటే సాంగ్ ఒప్పుకుంటే సరిపోదు. ఆమె పని చేస్తున్న సంస్థ ఒప్పుకోవాలి. అప్పుడప్పుడే పైకొస్తున్న యువ ఆర్టిస్టులంతా ఇంతే. పెద్ద స్టార్లు అయ్యాక గాని, తమ సంతకాన్ని తామే పెట్టే హక్కుకు సొంతదారులు కాలేరు. సాంగ్ తన హక్కును దక్కించుకునేందుకు చేసే ప్రయత్నంలోనే తనకు తెలీకుండా తను చావుదారిలోకి వెళ్లిపోయిందా?! సాంగ్ నిన్న మొన్నటి అమ్మాయి. 2019లో, ఇరవై నాలుగేళ్లు వయసులో నటిగా ఆమె తొలిసారి ‘డియర్ మై నేమ్’ అనే వెబ్ సీరీస్తో కొరియన్లకు అభిమాన నటి అయింది. అందులో ఆమె ఆర్కిటెక్చర్ విద్యార్థిని. అసలే అందగత్తె. పిక్సీ కట్తో (కురచ జుట్టు) మరింత క్యూట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాబోతుండగా కరోనా వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ వార్త.. సాంగ్ ఆత్మహత్య! చదవండి: (డిప్రెషన్తో బిగ్బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య!) వెబ్ సిరీస్లో వాస్తు శాస్త్ర విద్యార్థినిగా నటించిన సాంగ్ నిజ జీవితంలో తన కెరీర్ను నిర్మించుకోలేక టూల్స్ అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లుంది! వేధింపుల వెబ్ నుంచి ఆమె బయటపడలేక మృత్యువుతో స్నేహం చేసిందా! వయసులో ఉన్న పిల్లలకు, పేరొస్తున్న పిల్లలకు వేధింపులు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయినవాళ్లే కాదు, అపరిచితులైనా సరే.. ‘హు..’ అని ముఖం తిప్పేసుకుని వెళ్లినా చాలు వీళ్లు తట్టుకోలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. ఒంటరితనం ప్రాణసఖి అవుతుంది. ఇక ఆ ఎవరూలేనితనం ఎటు తీసుకెళితే అటు... అంతిమ యానం. పందొమ్మిదేళ్లకే సాంగ్ ఎస్టీ లాండర్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు మోడలింగ్ ఇచ్చింది. ఆ తర్వాత బాస్కిన్–రాబిన్స్ ఐస్ క్రీమ్కు. ఎవరబ్బా ఈ పిల్ల అని ఆ దేశ ప్రజలు ముచ్చటగా చూశారు. అందం కాదు ఇంకా ఏదో ఉంది సాంగ్లో. చలాకీదనం? చురుకుదనం? అవెలాగూ ఉన్నాయి. ఆ కళ్లు.. ఆ ముక్కు.. ఆ పెదవులు.. ప్రతిదీ ఎక్స్ప్రెసివ్. మూర్తీభవించిన మహాభినయం కూడా సాంగ్ చూపుకు సాగిలపడవలసిందే. అంత సమ్మోహనం. మాంత్రికత. మనసును నెమ్మది పరిచే శ్రావ్యగీతిక మానవజన్మ ఎత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సాంగ్. కొన్ని మ్యూజిక్ వీడియోల్లో, గోల్డెన్ రెయిన్బో, మేక్ యువర్ విష్, స్కూల్ 2017 అనే టీవీ సీరీస్లో నటించింది సాంగ్. నటనలోకి రాకపోయి ఉంటే కొరియన్ పాప్ మహరాణిగా తలపై ఆమె కిరీటాన్నీ ఏ చెలికత్తెలో సరిచేస్తూ ఉండేవారు. మనిషే లేకుండా పోయింది. సాంగ్ లేకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులతో పాటు మరొకరికీ తీరని లోటు! ఆమె ఎందరో వికలాంగులకు సహాయం చేస్తుంటుంది. వారంతా ఇప్పుడు మరోసారి అంగవైకల్యం పొందినట్లయింది. ‘వామ్ అకంపనిమెంట్’ అని దక్షిణ కొరియాలో ఒకపెద్ద సేవాసంస్థ ఉంది. ఆ సంస్థకు రాయబారిగా ఉండేది సాంగ్. ఇక ఇప్పుడు ఎవరి చేత రాయబారం పంపి ఈ దేవకన్యను స్వర్గం నుంచి వెనక్కు తెప్పించుకోవాలి.. కొరియాలో ఆమె వల్ల ఇప్పటి వరకు ఎంటర్టైన్ అవుతున్నవారు, ఆమె సహాయాలు పొందుతున్నవారు?! -
అందానికి కొలతలెందుకు?
మోడలింగ్ ప్రపంచం పొడవైన, సన్నగా ఉండేవారినే అందంగా పరిగణిస్తుంది. ఇది ప్రాచీన కాలం నుండి అందం ప్రమాణాలుగా పరిగణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళలను ‘మేమిక మోడలింగ్కి పనికిరాము’ అనే నిరాశలో ముంచేసింది. అందం అంటే ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తున్న మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసింది వైజాగ్ అమ్మాయి వర్షిత తటవర్తి. అందానికి కొలతలెందుకు? అని ప్రశ్నించడమే కాదు... అందుకు తగిన సమాధానమూ ఇచ్చింది. వర్షిత చిన్నప్పటి నుంచీ బొద్దుగానే ఉండేది. కానీ ఆమెకు మోడలింగ్, సినీ రంగం అంటే అమితమైన ఇష్టం. కోరుకున్న రంగాల్లో తన ప్రతిభను చాటాలనుకుంది. కానీ, చుట్టూ ఉన్నవారు లావుగా ఉంటే అవకాశాలు రావు అన్నారు. అందుకు, 15 కిలోల బరువు తగ్గి మరీ మోడలింగ్కు సంబంధించిన పోర్ట్ఫోలియోను తయారు చేసి, ఏజెన్సీలలో ఇచ్చింది. ‘కానీ, నా నడుము భాగం సరిగ్గా లేదని, మోడలింగ్కు సరిపోనని రిజక్ట్ చేశారు’ అని పాతికేళ్ల వర్షిత పేర్కొనడం చూస్తే అందం అంటే కొందరు నిర్దేశించిన కొలతల్లో స్త్రీ తనను తాను హింసించుకుంటూ ఇమిడి పోవాల్సిందేనా? అనిపించకమానదు. అన్నింటా తిరస్కారాలే.. ఆమె దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా టాలీవుడ్లో ప్రతిభ కనబరచాలనుకొని కొన్ని ఏజెన్సీలను, దర్శకులనూ కలిసింది. కానీ, ‘దక్షిణాది అమ్మాయిగా కనిపిస్తున్నావ’నే తిరస్కారాలను ఎదుర్కొన్నాను అని’ ఆమె వెల్లడించింది. బరువు తగ్గి, ఫెయిర్నెస్ చికిత్స తీసుకోమని సలహాలు ఇచ్చేవారు ఎందరో. ఆ పాట్లన్నీ పడింది వర్షిత. విశాఖపట్నంలో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత మణిపాల్లో డిగ్రీ చేసింది. మణిరత్నం సినిమాలపై పెంచుకున్న ప్రేమ 2017లో ఆమెను చెన్నైకి తీసుకెళ్లింది. కానీ, అక్కడా ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆభరణాల ప్రదర్శనలో వరించిన అదృష్టం మనసులో గట్టిగా అనుకుంటే ఏదో ఒకరోజు అవకాశం మనల్ని తప్పక వరిస్తుంది అనడానికి నిదర్శనం ఓ రోజు వర్షిత జీవితం లో జరిగింది. వర్షిత ఫ్రెండ్ చెన్నైలోని ఒక ఆభరణాల ప్రదర్శనకు డిజైనర్ సబ్యసాచిని ఆహ్వానించాడు. ‘సబ్యసాచి ఆ ప్రదర్శనలో ఉన్నారని తెలుసుకున్న వర్షిత అక్కడకు వెళ్లి, అతని డిజైన్స్కు అభిమానని చెప్పింది. ‘సబ్యసాచితో కలిసి ఒక ఫొటో తీసుకున్నాను. దానిని నా ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాను. రెండు నెలల తరువాత, సబ్యసాచి ఆఫీస్ నుంచి ఫోన్ ‘ఫొటో షూట్లో పాల్గొనడానికి రమ్మని.’ ఆ రోజు నా ఆనందం అంతా ఇంతా అని చెప్పలేను’ అని పేర్కొన్న వర్షిత అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోడలింగ్లో వర్షిత బ్యూటీ ఐకాన్ గా మారింది. ప్రశంసల వెల్లువ మొదలయ్యింది. ఆ‘కట్టు’కున్న ఆత్మవిశ్వాసం కిందటేడాది సబ్యసాచి రూపొందించిన అందమైన ఎర్రని పెళ్లి లెహంగాలో వేదికపై నడిచినప్పుడు ఆమె ఆత్మ విశ్వాసం ఆ ర్యాంప్ షోలో చాలామందిని ఆకట్టుకుంది. దీంతో చాలా ఆఫర్లు ఆమెను వరించాయి. ‘సబ్యసాచి కూడా ఎప్పుడూ ప్లస్సైజ్ మోడల్గా పేర్కొనలేదు. ఇతర మోడళ్ల మాదిరిగానే గుర్తించాడు’ అని అభిమానం వ్యక్తం చేస్తారు వర్షిత. చాలామంది ‘ప్లస్ సైజ్’ మోడల్గా సంబోధించినప్పుడు అది ఒక అవకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా మోడల్ అనగానే సన్నగా ఉండే మోడల్స్నే సూచిస్తారు. ఇది శరీర వివక్ష. నా శరీరం అపఖ్యాతి పాలైన పరిశ్రమలోనే ‘ఆమోదయోగ్యమైనది’ అనే ప్రయత్నం చేశాను’ అని అభిప్రాయపడ్డారు వర్షిత. ప్రకటనలతో దారుణాలు బాల్యం నుంచి బొద్దుగా ఉండే వర్షిత తన శరీరం సన్నగానే ఉండాలనే నియమం ఎప్పుడూ పెట్టుకోలేదంది. ‘ఉదయం లేచింది మొదలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ ‘ఫెయిర్ నెస్ క్రీములు, పౌడర్ల’ గురించి ప్రకటనలు విరివిగా వస్తుంటాయి. స్కూల్కెళ్లే అమ్మాయిలు వాటిని చూసి అవే సరైనవని అనుకుంటారు. దీంతో ‘శరీరాన్ని ఒక మూసలో సర్దుబాటు చేసుకోవాలనే ఆలోచన అంత చిన్నవయసులోనే నాటుకుంటుంది. లేదంటే, అనాకారిని’ అనే ఆత్మన్యూనతలో అమ్మాయిలు పడిపోవాల్సిన దుస్థితి మారాల’నే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఈ మోడల్. కిందటేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్షితతో సబ్యసాచి చేసిన ఫోటోషూట్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యింది. అందానికి నిబంధనలు లేవని నిరూపించారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. శరీర కొలతలతో పని లేకుండా సిసలైన అందానికి చిహ్నంగా కొనసాగుతున్నందున వర్షితను నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఆమె ఇన్బాక్స్ ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రశంసలు, సందేశాలతో ఇప్పటికీ నిండిపోతూనే ఉంది. వర్షిత కథ ప్రతి స్త్రీకి ప్రేరణగా నిలుస్తుంది. కాలక్రమంలో అధిక బరువు వల్ల వచ్చే నష్టాలను గమనించి, ఇప్పుడు స్లిమ్గా మారింది వర్షిత. ఏదేమైనా ఓవర్ వెయిట్ మోడల్స్ అనే కొత్త ట్రెండ్కి దక్షిణాది మోడల్గా వర్షిత నిలిచిపోతుంది. -
నేను ప్లస్ సైజ్ మోడల్ని..
స్లిమ్గా ఉన్నవాళ్లే అందంగా ఉంటారా? స్లిమ్గా ఉన్నవాళ్లే ఫ్యాషన్ దుస్తులు వేసుకోగలరా?స్లిమ్గా ఉన్నవాళ్లే మోడలింగ్ చేస్తారా?కేరళకు చెందిన ఇందూజా ప్రకాష్ ఇలా ప్రశ్నించడమే కాదు ప్లస్ సైజ్ మహిళల్లో విశ్వాసాన్ని తీసుకురావడానికి మోడల్గా మారింది. ‘నా ఊబకాయం నాకో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ’ అంటోంది. మోడల్ అవ్వాలంటే స్లిమ్గా ఉండడమే కాదు శరీరం కొన్ని కొలతల్లో ఇమిడిపోవాలి. చూపులను ఆకట్టుకునే రూపం సొంతమై ఉండాలి. ర్యాంప్ వేదికలపై సొగసుగా అడుగులు వేయడం రావాలి... అయితే ఇవేవీ అవసరం లేదంటోంది ఇందూజ ప్రకాష్. 27 సంవత్సరాల వయసులో మోడలింగ్ను వృత్తిగా మార్చుకొని ఊబకాయాన్ని ఎగతాళి చేసే వ్యక్తులకు తన రూపంతోనే సరైన సమాధానం ఇస్తోంది. నా తప్పుకాదు.. ‘‘ఊబకాయం ఉన్న మహిళల్ని, అమ్మాయిలను చాలా మంది గేలి చేస్తారు. ఊబకాయంగా ఉండటం అది వారి తప్పు కాదు. కానీ, ఎన్నో సమాజంలో ఎన్నో హేళనలు తట్టుకోవాలి. నా వరకే చూస్తే.. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను ఆటపట్టించినవారే. ఎక్కడకు వెళ్లినా బరువు తగ్గమని సలహాలు ఇచ్చేవారే ఎక్కువయ్యారు. దీంతో చాలా సార్లు బరువు తగ్గటానికి ప్రయత్నించాను. కొన్నిరోజులు ఎక్కడకూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. చాలా బాధగా అనిపించేది. తిండి తినకుండా అతిగా డైటింగ్ నియమాలు చాలా పాటించాను. ఆకలికి తట్టుకున్నాను. వ్యాయామాలు చేశాను. కానీ, బరువు తగ్గలేదు. విని విని విసుగిపోయాను. మా కుటుంబంలో ఊబకాయం వంశపారంపర్యంగా ఉంది. అది నాకూ వచ్చింది. లావుగా ఉండటం నా తప్పు కాదు’’ అని వివరించిన ఇందూజ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసింది. లాక్డౌన్ సమయాన్ని ప్లస్ సైజ్ మోడల్గా మార్చుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడదే వృత్తిగా చేసుకుంది. ఊబకాయం సమస్య, మానసికంగా తను ఎదిగిన విధానం గురించి మరింతగా వివరిస్తూ ‘‘ఎంత శ్రమ చేసినా తగ్గడం లేదు అని నిర్ధారణకు వచ్చాక ఇక ఈ సమస్య గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. అప్పుడు నా మనసు చాలా తేలికైనట్టనిపించింది. కేరళలో ప్లస్ సైజ్ మోడలింగ్ అంత సులభం కాదు. ఇక్కడి జనం స్లిమ్ సైజ్ వాళ్లే మోడలింగ్కి అర్హత గలవారు అనుకుంటారు. నిజానికి ఏ రాష్ట్రమైనా, ప్రాంతమైనా అంతటా అందరిలోనూ ఇదే అభిప్రాయం ఉంటుందని నాకు తెలుసు. కానీ, నేను ఇదే శరీరం తో జనాలను ఒప్పించాలి అని బలంగా అనుకున్నాను. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ కావాలనుకున్నాను. ప్లస్ సైజ్ మోడల్గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నచ్చిన పనిని కొనసాగిస్తున్నాను. ఇతరుల కోసం నన్ను నేను మార్చుకోలేను’ అని తెలిపింది ఇందూజ. ఇందూజ ఇప్పుడు ఫొటోగ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్టుల కోసం మోడలింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు మలయాళీ చిత్రాల్లోనూ నటించిన ఇందూజ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కృషి చేస్తోంది. -
మోడలింగ్ మోజు.. బంధువుల ఇళ్లే టార్గెట్!
ముంబై : మోడలింగ్ మోజుతో ఓ యువతి తప్పుదారి పట్టింది. బంధువుల ఇంట్లో దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలైంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, జోగేశ్వరి వెస్ట్కు చెందిన శీతల్ నాగ్రాజ్ గోలాప్ ఓ ప్రైవేట్ భీమా కంపెనీలో అడ్వైజర్గా పని చేసేది. మోడలింగ్ మీద ఉన్న మోజుతో లాక్డౌన్ ముందే ఉద్యోగం మానేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె దాచుకున్న డబ్బు మొత్తం కరిగిపోయింది. ఈ నేపథ్యంలో తన మోడలింగ్ కలలు నెరవేర్చుకోవటానికి దొంగతనాలు మొదలుపెట్టింది. ( యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత..) బంధువల ఇళ్లలోని బంగారు నగలు, డబ్బును చోరీ చేసేది. నగలు, డబ్బు పొగొట్టుకున్న బంధువు ఒకరు కొద్దిరోజుల క్రితం ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. శీతల్పై అనుమానంతో విచారించగా దొంగతనం చెసినట్లు అంగీకరించింది. శీతల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్దనుంచి 2 లక్షల రూపాయలు విలువచేసే నగల్ని స్వాధీనం చేసుకున్నారు. -
మన వంటింటి గరిట పట్టుకున్న విదేశీ భామ
సౌకుమార్యమే అక్కడ ప్రధాన అడుగు. జిగేల్మనే కాంతుల మధ్య మెరవడమే అసలైన లక్ష్యం. అలాంటి చోట తనను తాను నిరూపించుకుంది సారాటాడ్. మోడలింగ్లో విజయవంతంగా ఎదిగిన ఈ విదేశీయురాలు ఇప్పుడు మన భారతీయ వంటింటి మహారాణిగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రాంతీయ వంటకాలు ‘మహాభేష్’ అంటూ మాస్టర్ చెఫ్గా రాణిస్తోంది. విదేశీయురాలు.. అందులోనూ మోడల్. భారతీయ ఆహారం పట్ల మక్కువ పెంచుకోవడమే కాకుండా ఆ వంటల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకోవడం సాధారణ విషయమేమీ కాదు. సారాటాడ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నివాసి. 18 సంవత్సరాల వయస్సులో, మోడలింగ్ కోసం సిడ్నీకి వెళ్లింది. మోడలింగ్లో సక్సెస్ సాధించింది. ఐదేళ్లుగా సెలబ్రిటీ చెఫ్గా ప్రసిద్ది చెందింది. భారతీయ వంటకాల పట్ల మక్కువ పెంచుకుంది. పాకశాస్త్ర ప్రావీణ్యం సాధించింది. మాస్టర్ ఛెఫ్గా గోవాలో తన మొదటి రెస్టారెంట్ ప్రారంభించి భారత్పై తనకున్న ప్రేమను చాటుకుంది. పదార్థాలను తెలుసుకుంటూ.. భారతీయ వంటకాల గురించి సారా మాట్లాడుతూ– ‘ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతాల ఆహారానికీ సొంత ప్రత్యేకత ఉంది. నేను అస్సాం నుండి కాశ్మీర్– గోవాకు ప్రయాణిస్తున్న ప్రతిసారీ, ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, పద్ధతులను చాలా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. వాటిని నేను తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తుంటాను. భారతదేశం వైవిధ్యభరితమైనది. ఇక్కడే ఉంటూ ప్రాంతీయ వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, ఎంతో మందికి వాటిని పంచాలనుకుంటున్నాను. ఈ విధానం ద్వారా ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, ఆహార సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంతో తెలుసుకోవచ్చు’ అని వివరించింది సారాటాడ్. అపోహలు తొలగించాలి ఈ మాస్టర్ చెఫ్ గోవా తర్వాత మరో రెస్టారెంట్ను ఢిల్లీలో ప్రారంభించాలనుకుంటోంది. భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని కోరుకుంటున్నట్టుగా చెబుతోంది. ‘భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే, అది హోటళ్లలో వండినది. కానీ భారతీయుల ఇళ్లలో తింటున్న ఆహారం గురించి విదేశీయులకు అంతగా తెలియదు. యోగా పద్ధతులు, ఆయుర్వేద వంటకాలకు ప్రసిద్ధి ఈ దేశం. ఆరోగ్య దృక్పథం నుండి చూస్తే ఈ ఆహారం అత్యంత ఉత్తమమైనది, శక్తిమంతమైనది. భారతీయ ఆహారం నా వంట శైలిని పూర్తిగా మార్చివేసింది. ఈ ఆహారంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వాసన, రుచి ప్రత్యేకమైనవి. ఈ సుగంధ ద్రవ్యాలు లేకుండా నేను ఏ వంటకాన్నీ వండలేకపోతున్నాను. అంతగా వీటితో మమేకం అయ్యాను’ అని తెలిపింది సారాటాడ్. అంతేకాదు, విదేశాలలో భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలనుకుంటున్నట్టుగా కూడా చెబుతోంది. ఏమైనా మన దేశీయ వంటగది, అందులో వండే వంటకాలు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో.. వాటి పట్ల విదేశీయులు ఎంత ఆసక్తిని చూపుతారని సారాటాడ్ని కలిస్తే తెలిసిపోతుంది. విదేశీయురాలై ఉండి భారతీయ వంటకాలను ప్రేమగా నేర్చుకుంటున్న సారాటాడ్ లాంటి వాళ్లను చూస్తే ఇక్కడి యువత మన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొంతైనా తప్పక వంటబట్టించుకుంటారు. -
ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి
మోడల్, నటి గౌహర్ ఖాన్ ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి ఈ భామ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా స్టార్ జైద్ దర్బార్తో రిలేషన్షిప్లోఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక దర్బార్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. దీనికి ఉంగరం, హార్ట్ సింబల్ను జత చేశారు. ఇదే ఫోటోను జైద్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బెలూన్లతో ఏర్పాటు చేసిన లొకేషన్లో గౌహర్, జైద్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. దీంతో పెళ్లి పీటలెక్కనన్న గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ జంటకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గల నెలలో పెళ్లి చేసుకున్న నేహా కక్కర్ స్పందిస్తూ తమను ఇలా చూడటం ఆనందంగా ఉందని, ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: బిగ్బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం కాగా వీరు డిసెంబర్ 25న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. వివాహ వేడుకలు డిసెంబర్ 22 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కోవిడ్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వనించానున్నారు. ఇదిలా ఉండగా గౌహర్ ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్ 7లో పాల్గొని విజేతగా నిలిచారు. ప్రస్తుతం గౌహర్ ఖాన్కు 37 సంవత్సరాలు కాగా జైద్ దర్బార్కు 29. వీరిద్దరికి వయసులో ఎనిమిది సంవత్సరాల తేడా ఉంది. కానీ జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదని ఈ జంట పేర్కొన్నారు. చదవండి: ‘నాగిని’ ఎంగేజ్మెంట్ అయ్యిందా? View this post on Instagram 💍♥️ @zaid_darbar A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) on Nov 4, 2020 at 9:38pm PST -
ట్రంప్పై మరోసారి లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ. జీన్ కారోల్ అత్యాచార ఆరోపణలతో పాటు అనేక లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్పై ప్రస్తుతం డోరిస్ వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. (వైట్హౌస్లో ఒకరికి పాజిటివ్ : నేను ఓకే!) ది గార్డియన్ కథనం ప్రకారం 1997లో న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా ట్రంప్ వీఐపీ సూట్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అమీ డోరిస్ ఆరోపించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వీఐపీ సూట్లో ఉన్న ట్రంప్. తనపట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, తనపై పట్టు సాధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని, తన శరీరాన్ని అనుచితంగా తాకారని ఆరోపించారు. అపుడు తన వయసు 24 ఏళ్లు అని, ఆ సమయంలో ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు ఉండొచ్చని ఆమె చెప్పుకొచ్చారు. 2016 లోనే ఈ విషయంపై ముందుకు రావాలని భావించినప్పటికీ, కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే తన టీనేజ్ కవలకుమార్తెలకు రోల్ మోడల్గా ఉండేందుకే ఈ వేధింపులపై ప్రపంచానికి తెలిజేయాలని తాజాగా నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతో చే్స్తున్న ఆరోపణల తప్ప మరొకటి కాదని కొట్టి పారేశారు. (‘హెచ్1బీ’ కేసులో ట్రంప్కు ఊరట) -
ఫిట్నెస్ ట్రైనర్ మృతి
-
సెలబ్రిటీల ఫిట్నెస్ ట్రైనర్ మృతి
చండీఘడ్: మోడల్, బాడీ బిల్డర్, సెలబ్రిటీల ఫిట్నెస్ ట్రైనర్ సత్నాం ఖత్రా(31) హఠాత్తుగా మరణించారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచినట్లు అతని కోచ్ రోహిష్ ఖేరా వెల్లడించారు. ఆయన మరణం సినిమా పరిశ్రమను షాక్కు గురి చేసింది. 1989లో పంజాబ్లోని భాడ్సన్లో ఓ గ్రామంలో సత్నాం ఖత్రా జన్మించారు. మెలితిరిగిన కండలతో వీరుడిగా కనిపించే ఆయన మోడల్గా రాణించారు. ఖత్రా ఫిట్నెస్ క్లబ్కు ఫిట్నెస్ కోచ్గా వ్యవహరించేవారు, ఎందరో సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్గా పని చేశారు. అదే సమయంలో డ్రగ్స్ బారిన పడ్డారు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు వెంటనే సత్నాంను డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుని రికవరీ అయిన సత్నాం మాదక ద్రవ్యాలకు గుడ్బై చెప్పారు. ఆ తర్వాత మరింత ఫోకస్తో తన వృత్తిలో తిరిగి చేరారు. (చదవండి: రణ్బీర్ జిరాక్స్ ఇక లేరు) ఈ సందర్భంగా శారీరక వ్యాయామం చేయాలని చెప్తూనే డ్రగ్స్ వంటి అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లను మానుకోవాలని యువతకు సందేశమిచ్చేవారు. త్వరలోనే ఆయన స్వంత బ్రాండ్తో ఫిట్నెస్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన అకాల మరణం చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షలకు పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న సత్నాం మరణంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఫిట్నెస్ ఉన్న వ్యక్తికి గుండెపోటు రావడమేంటని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. డ్రగ్స్ మాఫియానే అతని చావుకు కారణమయ్యుంటుందా? అని చర్చిస్తున్నారు. (చదవండి: సంజనపై రియా కామెంట్స్: నటి ఆగ్రహం) -
బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్
ప్రేక్షకులకు నచ్చినట్టుగా కాదు.. తన ఇష్టాన్ని ప్రేక్షకులు మెచ్చేట్టుగా చేసుకున్న నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. సొంతూరు చండీగఢ్. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు గుర్బానీ. ఇంటి పేరు జడ్జ్. వెరసి గుర్బాని జడ్జ్. కాని ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. సినిమాలు, వెబ్ సిరీస్లలో ‘బానీ జె’గా టైటిల్ కార్డ్ పడుతోంది. కాబట్టి అభిమానులు అందరూ బానీ జె అనే పిలుస్తున్నారు. తల్లి తాన్యా జడ్జ్ సంరక్షణలో పెరిగింది బానీ జె... అక్క సనేయాతోపాటు. ముస్సోరీలోని వుడ్ స్టాక్ స్కూల్లో చదువుకుంది. గ్రాఫిక్ డిజైనింగ్లో డిగ్రీ తీసుకుంది. గమ్యం తెలియకుండానే ముంబై చేరింది. ఎమ్టీవీ రియాలిటీ షో ‘ఎమ్టీవీ రోడీస్’ పాల్గొంది. రన్నరప్గా నిలిచి అదే షోకి హోస్ట్గా ఎంపికై ఆ ‘షో’ తర్వాతి ఆరు సీజన్లను నడిపించింది. ఆ చానెల్కే చెందిన క్యాంపస్ డైరీస్, ఎమ్టీవీ అన్ప్లగ్డ్ మొదలైన రియాలిటీ షోస్కూ వీడియో జాకీగా వ్యవహరించింది. బిగ్బాస్నూ పలకరించింది.. పదవ సీజన్లో. ఇందులోనూ రన్నరప్గా నిలబడింది. 2007లో సినిమా ఎంట్రీ ఇచ్చింది... ‘ఆప్ కా సురూర్’తో. తెలుగు తెరకూ బానీ జె పరిచయమే 2016లో వచ్చిన ‘తిక్క’ అనే సినిమాతో. మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ కనిపించింది. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’తో బానీ జె వెబ్ సిరీస్ వీక్షకులకూ ఫేవరేట్ యాక్టర్ అయింది. అందులో ఫిట్నెస్ ట్రైనర్, లెస్బియన్.. ఉమన్ సింగ్ పాత్రలో నటించి తన నటనకే కాదు బోలెడంత ధైర్యానికీ అశేష వీక్షకాదరణను సొంతం చేసుకుంది. ఆ సిరీస్ సెకండ్ సీజన్లోనూ ఆ ఆదరణ కొనసాగింది. ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. ప్రయాణాలూ ఇష్టమే. కండలు తిరిగిన తన శరీరంతో చాలాసార్లు బాడీషేమింగ్కు గురైంది బానీ జె. ఆ కామెంట్స్నెప్పుడూ ఖాతరు చేయలేదు. ‘బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్. మెరుస్తున్న చర్మంతో ఆడవాళ్లు సున్నితంగా, నాజూగ్గా ఉండాలి అనే భావనను జనాల మెదళ్లలో స్థిరం చేస్తుంది. ఈ గిమ్మిక్ మీడియాకు తెలియనిది కాదు. అయినా అందులో భాగం అవుతోంది’ అంటుంది బానీ జె కాస్త ఘాటుగానే. కాంట్రవర్సీ ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీని తను ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. దాంతో వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి విమర్శలను ఆఫ్లైన్లోకి తోసింది బానీ జె. -
రణ్బీర్ జిరాక్స్ ఇక లేరు
శ్రీనగర్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు జిర్సాక్ కాపీగా వార్తల్లో నిలిచిన కశ్మీరీ మోడల్ జునైద్ షా కన్నుమూశారు. గుండెపోటు రావడంతో శ్రీనగర్లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కశ్మీర్ జర్నలిస్టు యూసఫ్ జమీల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "నిస్సార్ అహ్మద్ షా కొడుకు జునైద్ గుండెపోటుతో చనిపోయారు. అందరూ అతడిని హీరో రణ్బీర్ కపూర్లా ఉంటాడంటారు. నేను మాత్రం అతను కశ్మీర్కు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులకు ఉన్న కొండంత బలం, ఆశ అని చెప్తాను". (రణ్బీర్ మా ఇంటికొచ్చి ఆఫర్ ఇచ్చాడు) "28 ఏళ్ల జునైద్ను గత నెలలోనే ముంబైకు రావాల్సిందిగా కోరాను. ఇక్కడ మోడలింగ్ చేసుకుంటూ అనుపమ్ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకోవచ్చని తెలిపాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. అయితే అతనికి ఇంతకుముందెన్నడూ హృదయ సంబంధ వ్యాధులు లేవు" అని ఆయన పేర్కొన్నారు. కాగా కొన్ని సంవత్సరాల క్రితం అచ్చు రణ్బీర్ కపూర్లా ఉండే జునైద్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ తరుణంలో రణ్బీర్ తండ్రి రిషి కపూర్ సైతం కొడుకును పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (మోడల్ చనిపోయినట్లు ట్రోల్స్) OMG. My own son has a double!!! Promise cannot make out. A good double pic.twitter.com/iqF7uNyyIi — Rishi Kapoor (@chintskap) April 16, 2015 -
మోడల్ చనిపోయినట్లు ట్రోల్స్
ఇస్లామాబాద్ : అసభ్యకరమైన వస్త్రధారణతో సంప్రదాయాన్ని విస్మరించిందంటూ పాకిస్తాన్ మోడల్, నటి జరా అబిద్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఆమె ఇన్స్ట్రాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే గత శుక్రవారం కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో మోడల్ జరా అబిద్ మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ వైరల్గా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో జరా అదే విమానంలో ప్రయాణించినట్లు ఆమె స్నేహితులు భావిసున్నారు. అయితే పీఐఏ విమాన ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయట పడినట్లు పాక్ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో జరా విమానంలో ఉందా? లేదా? అన్న దానిపై ఇప్పటివరకు సరైన స్పష్టతలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తొలగించబడ్డాయి. ఆమె ట్విటర్, ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలను ఎవరు తొలగించారనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఈ క్రమంలో జరా అబిద్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాకిస్తాన్ మహిళలు సమాజంలో సంప్రదాయ వస్త్రాలను ధరించి నిరాడంబరంగా ఉంటారు. అయితే జరా మాత్రం సంప్రదాయ వస్తాధారణకు విరుద్ధంగా ఉంది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘శరీర భాగాలను కనిపించేలా దుస్తులు ధరించిన ఆమెను అల్లా ఎప్పటికీ ఇష్టపడడు. జన్నాత్(స్వర్గం)లో స్వచ్చమైన పురుషులు, మహిళలకు మాత్రమే ఆర్హత ఉంటుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఆమె మృతిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
‘నా పేరుతో అసభ్యకర ఫొటోలను పోస్టు చేశాడు’
తన పేరుతో అభ్యంతరకర వార్తలను ప్రచురిస్తూ.. మానసికంగా వేధిసున్నాడంటూ ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తిపై సూపర్ మోడల్, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటషా సూరి ముంబై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన లాయర్ మాధవ్ వి. తోరత్తో కలిసి దాదర్ పోలీసు స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. తన పేరుతో పబ్లిక్ వెబ్సైట్లలో అసభ్యకరమైన పోస్టులను ప్రచురిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2019లో నవంబర్లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని నా పేరుతో ప్రచురించడం మొదలు పెట్టారు. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటివి చాలా వచ్చాయి. ఎవరో కావాలనే ఇలా చేశారనుకున్న. క్రమంగా అవి తారస్థాయికి చేరాయి. ఏకంగా నా పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతాలను తెరిచి... అభ్యంతరకర వార్తలకు బాత్రూంలో ఉన్న అసభ్యకర అమ్మాయిల ఫొటోల ముఖాన్ని బ్లర్ చేసి వాటికి నటషా సూరి సింగ్ అనే పేరుతో షేర్ చేశాడు. దీన్నిబట్టి చూస్తే అతను నన్న లక్ష్యంగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లుగా నాకు అర్థమైంది. అలాగే పోర్న్సైట్లలో తల లేని శరీరాన్ని తీసుకుని వాటిని నా పేరుతో ప్రచురించడంతో గూగుల్లో ఆ ఫొటోలు నా పేరుతో వస్తున్నాయి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ సిద్దార్థ శుక్లా తనను వేధిస్తన్నట్లు.. ప్లిన్ నకిలీ వార్తలు ప్రచారం చేశాడని నటాషా పోలీసులకు తెలిపారు. ‘నా జీవితంతో ఇంతవరకు నేను శుక్లాను కలవనే లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు’ అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఆ వ్యక్తి కావాలనే తనను వివాదాల్లోకి లాగుతున్నాడని అర్థమైందన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసెందుకే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నటషా 2006లో ఫెమినా మిస్ ఇండియా (వరల్డ్) టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలో టాప్-10లో ఆమె నిలిచారు. ఆ తరువాత 2016లో వచ్చిన మలయాళ ‘కింగ్ లయర్’ చిత్రంలో నటించారు. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించారు. -
సెల్ఫీ కోసం ప్రముఖ మోడల్ బలి
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్లోని లింకన్షైర్కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్, 21 ఏళ్ల మోడలిన్ డేవిస్ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్ బే రిజర్వ్’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయానికి కూడా అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దాంతో వంద అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పక్కనున్న సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం పట్ల సోమవారం సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం ధ్రువీకరించడంతో రెండు దేశాల సోషల్ మీడియాలో ఆమె గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ‘బ్యూటీఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్’ అంటూ ఆమెను పలువురు వ్యాఖ్యానించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. ప్రపంచ పర్యటన పట్ల ఎంతో మక్కువ చూపించే డేవిస్ ఏడుగురు ‘బ్యాక్ప్యాకర్’ మిత్రులతో కలిసి ఆస్ట్రేలియా వచ్చారు. వారంతా వాక్లూజ్లో శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. అక్కడికి సమీపంలోని ‘డైమండ్ బే పర్వతం’ శిఖరాల మీదకు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పుడే ఉదయిస్తున్న లేత కిరణాల మసక వెళుతురులో శిఖరాగ్రం చివరన సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పక్కనున్న సముద్రంలో పడిపోయారు. హెలికాప్టర్ ద్వారా ఆదివారం వెతికించగా ఆమె మృతదేహం దొరికింది. గత ఆగస్టు నెలలో కూడా ఓ 27 ఏళ్ల యువతి సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు మరణించారు. -
‘మోడల్ రూ.20 లక్షలు డిమాండ్ చేసింది’
-
‘మా బిడ్డల్ని మోడల్ ట్రాప్ చేసింది’
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన రిషి, నిఖిల్ రెడ్డి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంకటగిరి ప్రాంతానికి చెందిన మోడల్ (21) శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. వారిపై ఈనెల 7న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్టుగా చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ఎదుటకు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మోడలే తమ కుమారులను ట్రాప్ చేసిందని రిషి, నిఖిల్రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. (చదవండి : మోడల్పై లైంగిక దాడి) డబ్బులు డిమాండ్ చేసింది.. రిషి, నిఖిల్రెడ్డిని మోడలే ట్రాప్ చేసిందని రిషి తల్లి ఆదిలక్ష్మీ, నిఖిల్రెడ్డి తల్లి సునీత వాపోయారు. తప్పుడు కేసు పెట్టి రూ.20 లక్షలు డిమాండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆడపిల్ల కదా అని కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. మగ పిల్లలను ట్రాఫ్ చేసి బెదిరింపులకు పాల్పడితే...ఆడపిల్లలపై కేసులు, చట్ట ప్రకారం చర్యలు ఉండవా. మా కుమారులు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పంతా మోడల్దే’అని వారు మీడియాతో అన్నారు. మోడల్ తన కొడుకుతో పెళ్లికి కూడా సిద్ధపడిందని రిషి తల్లి ఆదిలక్ష్మీ తెలిపారు. ‘మైనర్తో వివాహం కుదరదు అని చెప్పా. రెండేళ్ల తర్వాత రిషి మేజర్ అవుతాడు. అప్పుడు మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేస్తామని కూడా చెప్పాం. తన కొడుకు తప్పు చేశాడని తేలితే ఏ శిక్ష విధించినా అడ్డు చెప్పం. మోడల్ మా అబ్బాయిని ఎలా ట్రాప్ చేసిందో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏసీపీకి ఫిర్యాదు చేస్తాం. డబ్బు కోసం మోడల్ తల్లిదండ్రులు కూడా దిగజారారు. వారు కూడా 10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారు’అని రిషి తల్లి వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాం : ఏసీపీ కేఎస్ రావు జూబ్లీహిల్స్ మోడల్పై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. జనవరి 7న బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులను విచారించి చర్యలు తీసుకుంటాం. కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేయలేదు. ఐపీసీ సెక్షన్ 376 కింద నిందితులపై కేసు నమోదు చేశాం. నిందితుల తరపువారు చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటాం. ధైర్యంగా ఫిర్యాదు చేయాలి : బాధితురాలు (మోడల్) ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో నాకు న్యాయం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలి. మహిళలకు అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. -
మోడల్పై ఇద్దరు యువకుల అత్యాచారం
-
మోడల్పై లైంగిక దాడి.. వీడియో చిత్రీకరణ
బంజారాహిల్స్: ఓ మోడల్పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా మరో యువకుడు దానిని సెల్ఫోన్లో చిత్రీకరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ప్రాంతానికి యువతి(21) కొద్ది రోజుల క్రితం మోడలింగ్ చేయడానికి నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్లో ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు హాస్టల్ యజమాని కుమారుడు రిషితో పరిచయం ఏర్పడింది. కాగా నాలుగు నెలలుగా ఆమె తెలంగాణ మిస్ మోడల్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో తన చెల్లితో కలిసి అద్దెకు ఉంటోంది. గత నెల 28న ఆమె సోదరి బంధువుల వద్దకు వెళ్లడంతో రిషితో పాటు అతడి స్నేహితుడు నిఖిల్రెడ్డి భోజనం చేస్తామంటూ ఆమె గదికి వచ్చారు. గంజాయి మత్తులో ఉన్న రిషి ఆమెపై నోరు నొక్కి లైంగికదాడికి పాల్పడుతుండగా అతని స్నేహితుడు నిఖిల్రెడ్డి ఫోన్లో వీడియో తీశాడు. అంతేగాక నిఖిల్రెడ్డి ఆమె ఫోన్ లాక్కుని అందులో నుంచి రిషి ఫోన్కు ఓ తప్పుడు మెసేజ్ను కూడా పంపించాడు. అయితే తాను భయంతో ఎవరికీ చెప్పుకోలేక తన సొంత ఊరికి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచన మేరకు ఈనెల 7న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియాతో పేర్కొంది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు మార్చి రాయాలంటూ డీఐ రమేష్ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. తన కళ్లముందే ఎస్ఐ నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని పేర్కొంది. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్రావు పేర్కొన్నారు. -
మోడల్స్ హొయలు
-
మోడల్కు అసభ్యకర సందేశాలు పంపుతూ..
ముంబై : మోడల్పై దాడి చేయటమే కాకుండా అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడో వ్యాపారి. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను బలవంతపెడుతూ చివరకు జైలు పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన రామ్కుమార్ కురుప్పుసామి అనే వస్త్ర వ్యాపారికి 2014లో ముంబైకి చెందిన ఓ మోడల్తో పరిచయం ఏర్పడింది. వస్త్ర వ్యాపారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నిమిత్తం ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తరుచుగా వాట్సాప్లో చాటింగులు కూడా చేసుకున్నారు. 2015లో తనకో ఆధ్యాత్మిక గురువు తెలుసని, అతడి వద్ద పూజలు చేయిస్తే మంచి భవిష్యత్తుతో పాటు మోడలింగ్లో అవకాశాలు పెరుగుతాయని రామ్కుమార్ ఆమెను నమ్మించాడు. ఇందుకు గానూ రూ. 8 లక్షలు మోడల్ వద్దనుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు దగ్గరకు తీసుకెళ్లి ఆమెతో పూజలు చేయించాడు. అయితే రోజులు గడుస్తున్నా అవకాశాల విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని మోడల్ అతడిని కోరింది. కొద్దిరోజుల తర్వాత రామ్కుమార్ ఆమెకు డబ్బు తిరిగిచ్చేశాడు. ఆ తర్వాతి నుంచి పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. ఆమెపై చేయి చేసుకోవటమే కాకుండా వాట్సాప్కు అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బంది పెట్టేవాడు. అతడి వేధింపులకు తాళలేకపోయిన మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోడల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విదేశాలకు వెళుతున్న రామ్కుమార్ను శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. -
మోడల్పై క్యాబ్ డ్రైవర్ ఘాతుకం..
బెంగళూర్ : మోడల్ను హత్య చేసిన కేసులో 22 సంవత్సరాల ఓలా క్యాబ్ డ్రైవర్ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ నాగేష్ కోల్కతాకు చెందిన మోడల్ను విమానాశ్రయంలో దిగబెడుతూ అత్యంత కిరాకతంగా హతమార్చాడు. నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జులై 31న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని 32 ఏళ్ల మోడల్, ఈవెంట్ మేనేజర్ పూజా సింగ్ దేగా గుర్తించారు. మోడల్ పూజాను విమానాశ్రయానికి తీసుకువెళ్లాల్సిన డ్రైవర్ నాగేష్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి విలువైన వస్తువులను దొంగిలించి కిరాతకంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి నుంచి నగదు, మొబైల్ ఫోన్ను లాక్కున్న నిందితుడు ఆమె తలపై బలంగా కొట్టడంతో ఘటనా ప్రదేశంలోనే మరణించిందని చెప్పారు. బాధితురాలిని హత్య చేసిన నిందితుడు ఏకంగా ఆమె ఫోన్ నుంచే పూజ భర్తకు ఫోన్ చేసి రూ 5 లక్షలు డిమాండ్ చేశాడని వెల్లడించారు. బాధితురాలి శరీరంపై పలుచోట్ల కత్తి గాట్లు, తలపై బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. బాధితురాలు జులై 30న ఓ ఈవెంట్ కోసం బెంగళూర్కు వచ్చి తిరిగి పశ్చిమ బెంగాల్ వెళతుండగా ఈ హత్య జరిగిందని తెలిపారు. పూజ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. -
భాగ్యనగరానికి జపాన్ జంగల్
హైదరాబాద్: అడవులను నరకడం ఈజీ.. కానీ అడవిని పెంచడమే కష్టం.. ఇప్పటివరకు అందరి దృష్టిలో ఉంది ఇదే. అయితే ఇదంతా అబద్ధమని నిరూపించేందుకు మన రాజధానిలోకి ‘జపాన్ జంగల్లు’ రాబోతున్నాయి. రెండేళ్లలోనే చిట్టడవి వేళ్లూనుకోబోతోంది. ఖాళీ ప్రదేశాలన్నింటినీ దట్టమైన అరణ్యంలా మార్చేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. జపాన్లో బాగా ప్రాచుర్యం పొందిన అకిర మియవాకి అనే సాంకేతికతతో మూడేళ్లలోనే దట్టమైన అడవి రూపొందుతుంది. ఇదే సాంకేతికతను జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్లో అడవులను పెంచనున్నారు. సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా అడవుల ఏర్పాటు, నిర్వహణకు ఎన్టీపీసీ, జెన్క్యూ, ఎక్స్గాన్, సీజీఐ కంపెనీలు ముందుకొచ్చాయి. బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలో మియవాకి టెక్నాలజీతో అడవులను అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా అడవులను పెంచనున్నారు. ఎవరీ మియవాకి.. జపాన్లోని హిరోషిమా యూనివర్సిటీలో వృక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన అకిర మియవాకి రియో డీజెనీరోలో 1992లో జరిగిన ధరిత్రి సదస్సులో మాట్లాడుతూ.. అంతరిస్తున్న అడవులపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జాతుల మొక్కలతో సహజ అడవులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ తర్వాత సహజ వృక్ష సంపదపై అధ్యయనం ప్రారంభించారు. పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై స్థానిక చెట్ల విత్తనాలను నాటి అడవులుగా పునరుద్ధరించారు. దీన్ని మియవాకి పద్ధతి అని పిలుస్తారు. భూసారాన్ని పెంచి తేమ ఎక్కువగా ఉండేటట్లు చేసిన తర్వాత గుంపులు గుంపులుగా మొక్కలు నాటి చిట్టడవులుగా మార్చుతారు. రెండేళ్లలో అభివృద్ధి చేస్తాం.. మియవాకి సాంకేతికతతో మియవాకి అడవులను రెండేళ్లలో అభివృద్ధి చేస్తాం. హరితహారంలో భాగంగానే లక్షల మొక్కలను మియవాకితో వేర్వేరు చోట్ల పెంచి అడవులుగా తీర్చిదిద్దుతాం. బీహెచ్ఈఎల్లో 13 ఎకరాలు, గచ్చిబౌలి స్టేడియంలో 2 ఎకరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 3 ఎకరాలను మియవాకి అడవుల ఏర్పాటుకు కేటాయించాం. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మట్టి పనులు సాగుతున్నాయి. – జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన -
ఈ నటి వయసెంతో తెలుసా?
తాయ్పేయ్ : అందంగా ఉండటం అదృష్టమైతే! ఆ అందాన్ని చెక్కుచెదరనీయకుండా కాపాడుకోవటం అతి కష్టం. కొద్దిరోజులు శ్రద్ధపెట్టి అందానికి మెరుగులు దిద్దుకున్నా ఆ తర్వాత విసుగుపుట్టి వదిలేయటం జరుగుతుంటుంది. కానీ అతికొద్దిమంది మాత్రమే జీవితాంతం అలా వన్నెతరగని అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ కోవకు చెందినదే తైవాన్కు చెందిన సియావో అనే నటి. ఈ అందగత్తే టీవీ సీరియల్ నటిగా తన కెరియర్ను దాదాపు 20 ఏళ్లక్రితం మొదలెట్టింది. 1989లో తైవానీస్ రొమాంటిక్ డ్రామా టీవీ సిరీస్లో లీడ్ రోల్ పోషించింది. 1996లో వచ్చిన ‘ఏ సర్టైన్ ఆఫ్ లవ్ డ్రీమ్’ అనే టీవీ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె వయస్సుకు సంబంధించిన విషయాలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి. ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె వీబో అకౌంట్కు 344,000మంది ఫాలోయర్లు ఉన్నారు. సియావో మాట్లాడుతూ.. ‘‘నేను గత 10 సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను. తరుచూ స్విమ్మింగ్ కూడా చేస్తాను. పెంపుడు జంతువులతో కొసం కొంత సమయం కేటాయిస్తాను. నేను శాఖాహారినై ఉండటమే నిత్య యవ్వనానికి రహస్యం. సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణకు చాలా సంతోషంగా ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకుని పది మంది అందంగా అవ్వాలనుకుంటే ఇంకా సంతోషమ’ని పేర్కొంది. ఈమె 1968లో పుట్టింది. ప్రస్తుతం ఈమె వయస్సు 51 సంవత్సరాలు. -
‘సూత్ర’ బ్యూటీస్
-
క్యాట్వాక్ చేస్తూ కుప్పకూలి..
సౌపౌలో : ఫ్యాషన్ వీక్లో క్యాట్వాక్ చేస్తూ కుప్పకూలిన బ్రెజిల్ మోడల్ మరణించాడని నిర్వాహకులు తెలిపారు. సౌపోలో ఫ్యాషన్ వీక్ (ఎస్పీఎఫ్డబ్ల్యూ) ఈవెంట్ ముగింపు రోజు క్యాట్వాక్ చేస్తూ మోడల్ టేల్స్ సోర్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, అనంతరం చికిత్స పొందుతూ మరణించాడని నిర్వాహకులు వెల్లడించారు. 26 ఏళ్ల సోర్స్ క్యాట్వాక్ చేసి వెనుతివరిగి వస్తూ రన్వేపై పడిపోగా, హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటివకే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. సోర్స్ మరణం పట్ల ఫ్యాషన్ వీక్ నిర్వాహకులు సహా తోటి మోడల్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘నేను స్మోక్ చేస్తాను.. డ్రింక్ చేస్తాను అంతమాత్రానా’
‘నేను సిగరెట్ తాగుతాను.. డ్రింక్ చేస్తాను. అంత మాత్రానా నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. విషయమేంటంటే కొన్ని రోజుల క్రితం శ్వేతా తన ఇన్స్టాగ్రామ్లో సిగరెట్ తాగుతూ ఉన్న పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్తా నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో వారు ‘ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును. నేను తాగుతాను, ధూమపానం కూడా చేస్తాను. కానీ నేను నిజాయతీగా ఉంటాను. కేవలం డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం వంటి వాటి వల్ల నేను మంచి తల్లిని కాకుండా పోతానా? అయిన నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పని పాటా లేకుండా ఖాళీగా గడపడం చూశారా? ఎప్పుడైనా నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం నేను ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్ను, పారిశ్రామికవేత్తని. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి’ అంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అంతేకాక ‘నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. నా ఫాలోవర్ల గురించి.. నా పోస్ట్లకు చేసే లైక్ల గురించి నేను పట్టించుకోను. మీరే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్ఫాలో అవ్వచ్చు’ అంటూ డ్రింక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive , don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on Oct 28, 2018 at 5:51am PDT -
పోలీసులను హడలెత్తించిన మోడల్.. వీడియో వైరల్
ముంబై : ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన వివాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వివాదం ఈ నెల 25న జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. మేఘ శర్మ అనే మోడల్ ముంబైలోని లోఖండ్వాలా కాంప్లెక్స్లోని ఓ అపార్ట్మెంట్లో పెయింగ్ గెస్ట్గా ఉంటోంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటి గార్డ్ని పిలిచి సిగరెట్ ప్యాకెట్ తెమ్మని కోరింది. అర్థరాత్రి సమయం కావడంతో సెక్యూరిటి గార్డ్ అందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన శర్మ ఆ సెక్యూరిటి గార్డ్పై దాడికి దిగింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసింది. అపార్ట్మెంట్ వద్దకు చేరిన పోలీసులు శర్మను తమతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ శర్మ అందుకు నిరాకరించింది. ఇంత రాత్రి పూట.. అది కూడా ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మీతో పాటు ఇప్పుడు స్టేషన్కి రాలేను. రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి వస్తానని తెలిపింది. ఇప్పుడు తనను తన ప్లాట్కి వెళ్లానివ్వాల్సిందిగా కోరింది. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. దాంతో సహనం కోల్పొయిన శర్మ పోలీసులపై అరుస్తూ తన ఒంటి మీద దుస్తులను తొలగించింది. ఈ అనూహ్య చర్యకు జడిసిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే అపార్ట్మెంట్లో జరిగిన ఈ వివాదానికి సంబంధించిన వీడియోను స్వయంగా శర్మనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘ఇది మన ముంబై పోలీసుల పని తీరు. రాత్రి ఏడు తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకూడదు. కానీ ఈ పోలీసులు మాత్రం నన్ను తెల్లవారు జామున మూడు గంటలకు స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వమని ఆదేశించారు. వీరితో ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘పోలీసులు నాకు, సెక్యూరిటి గార్డ్కు మధ్య జరిగిన గొడవను చూస్తూ ఉన్నారు. కానీ అతని మీద ఎలాంటి చర్య తీసుకోక పోగా నన్ను నా ప్లాట్కి వెళ్లలనీవ్వకుండా అడ్డుకున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులను అక్కడి నుంచి పంపించడం కోసమే నేను నా దుస్తులను తొలగించాల్సి వచ్చింది’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం జరిగిన సమయంలో శర్మ మద్యం సేవించి ఉందని అందుకే ఇంతలా రచ్చ చేసిందంటున్నారు స్థానికులు. ఈ విషయం గురించి పోలీసులు ‘శర్మనే మాకు ఫోన్ చేసింది. అందుకే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారులు వెళ్లారు. అవసరమైన సమయంలో మాత్రమే మహిళ కానిస్టేబుల్ని పంపిస్తాము’ అని తెలిపారు. -
నయన్ తరువాత కెనడా మోడల్తో.
సినిమా: తమిళ సినిమాలో ప్రస్తుతం హాస్య నటుడు యోగిబాబు అంత బిజీ నటుడు మరోకరు లేరన్నది వాస్తవం. అంతే కాదు ఆయనంత లక్కీ నటుడు ఇంకోకరు లేరనే చెప్పాలి. అగ్రనటి నయనతారతో రొమాన్స్ చేయడానికి చాలా మంది యువ నటులు కలలు కంటుంటే కొలమావు కోకిల చిత్రంలో యోగిబాబు ఆమెను పిచ్చపిచ్చగా ప్రేమించే యువకుడిగా నటించి మెప్పించాడు. తాజాగా ఒక కెనడా మోడల్తో నటించడానికి రెడీ అవుతున్నాడు. అవును ఈయన గూర్ఖా అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇందులో ఆయనతో కెనడాకు చెందిన ప్రముఖ మోడల్ ఎలిస్సా నటించనుంది. శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ అమెరికాతో సహా పలువురు మోడల్స్ను పరిశీలించి చివరికి కెనడా మోడల్ ఎలిస్సాను ఎంపిక చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఆడిషన్లో చెప్పింది అర్థం చేసుకుని చక్కగా నటించి ఎలిస్సా ఈ అవకాశాన్ని దక్కించుకుందన్నారు. అయితే అందరూ ఊహించుకున్నట్లు ఎలిస్సా నటుడు యోగిబాబుకు జంటగా నటించడం లేదని, వీరి మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఉండవని చెప్పారు. డిశంబరులో చిత్ర షూటింగ్ను ప్రారంభించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ రిహార్సల్స్లో ఉందని చెప్పారు. ఇందులో కుక్క ముఖ్య పాత్రను పోషించనుందని తెలిపారు. దీన్ని 4 మంకీస్ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. మరికొందరు ప్రముఖ నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం, రూపన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులను, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈయన ప్రస్తుతం నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న 100 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
మోడల్ హత్య; శవంతో పాటు ప్రయాణం
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. అప్కమింగ్ మోడల్ మాన్సీ దీక్షిత్ అంధేరీలో దారుణ హత్యకు గురైంది. వివరాలు... హైదరాబాద్కు చెందిన ముజామిల్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం బంధువులతో కలిసి ముంబైకి వచ్చాడు. కాగా అతడి బంధువుల పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న మాన్సీ ముజామిల్ను కలిసేందుకు వాళ్ల ఫ్లాట్కు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ముజామిల్ మాన్సీని హతమార్చాడు. అనంతరం.. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని సూట్కేసులో కుక్కి టాక్సీని పిలిచాడు. మలాద్ ఏరియాలో ఆమె శవాన్ని పడేసి మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. కాగా ముజామిల్ ప్రవర్తనపై అనుమానం కలగడంతో టాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మలద్ ప్రాంతం నుంచి మాన్సీ శవాన్ని స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. -
రావణ బ్రహ్మలు
లార్డ్ గణేశ్.. యానిమేషన్కు ఓ క్యారెక్టర్ అయ్యాడు.రావణుడు.. యాడ్స్కి మోడల్ అయ్యాడు. తలనొప్పి మాత్రల నుంచి భావోద్వేగాల వరకు ప్రకటనలకు ఆయన పదితలలు పనికొచ్చినట్టుగా ఇంకే పౌరాణిక పాత్రా మేకప్ వేసుకోలేదు. ఇటీవలే నిమజ్జనం కాబట్టి గణేశ్ ఇంకా వార్తల్లో ఉన్నాడు అనుకోవచ్చు. మరి హఠాత్తుగా రావణుడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆయన బొమ్మల తయారీకి టైమ్ వచ్చింది కనుక. ఢిల్లీ ఆ పనిలో అప్పుడే బిజీ అయిపోయింది కూడా. దసరాకి ఉత్తర భారతంలో రావణ దగ్ధం ఓ ఘట్టం. అందుకు రావణుడి దిష్టిబొమ్మలు కావాలి కదా. తితార్పూర్ ఇప్పుడు ఆ పనిలో ఉంది. ఢిల్లీలోని సుభాష్నగర్కి టాగోర్ గార్డెన్స్కీ మధ్యలో ఉంటుంది తితార్పూర్. మెట్రోలో వెళ్లాలంటే బ్లూలైన్ పట్టుకోవాలి. ఇదొక అర్బన్ విలేజ్. దీన్ని రావణ సూపర్మార్కెట్ అని పిలిచుకుంటారు అర్బన్ ఫోక్స్ (పురజనులు). ఎందుకంటే ఆసియాఖండంలోనే అతిపెద్ద దిష్టిబొమ్మల మార్కెట్ ఇది. దసరా సమయంలో రావణ, మేఘనా«థుడు (రావణుడి కొడుకు), కుంభకర్ణుడి బొమ్మలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బొమ్మలు (రాజకీయ నాయకులు ఎట్సెట్రా) చేయమని ఆర్డర్ ఇస్తే అవి చేసిపెడ్తారు. తితార్పూర్ ఫుట్పాత్లన్నీ రావణుడి తలలు, చేతులు, కాళ్లు, అవయవాలతో నిండి ఉంటాయి. ఇంకోవైపు.. తయారైన రంగురంగుల దిష్టిబొమ్మలు. వీటిని కొనుక్కునేవాళ్లతోనే కాదు.. ఫొటోలు తీసుకునే విదేశీయులు, దేశీ టూరిస్ట్లతోనూ తితాపూర్ కిటకిటలాడుతూ ఉంటుంది దసరా వరకు. 2 నుంచి 80 అడుగుల వరకు వెదురు బద్దలతో ముందు రావణుడి దేహాకృతిని తయారు చేస్తారు. తర్వాత దాంట్లో అన్నీ గుడ్డముక్కలు కుక్కుతారు. పటాసులూ పెడ్తారు (పటాసులు కూడా కావాలని కోరుకున్న వాళ్లకు మాత్రమే పటాసులు పెట్టి తయారు చేసిస్తారు). పైనుంచి మళ్లీ ఓ గుడ్డను చుట్టి.. తర్వాత రంగురంగుల కాగితాలతో తల నుంచి కాళ్ల వరకు అతికించేస్తారు. ఇప్పుడు పెయింట్తో కళ్లు, ముక్కు, చెవులు, నోరు గీస్తారు. దాంతో రావణుడి దిష్టిబొమ్మ రెడీ. ఈ బొమ్మలు రెండు అడుగుల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అయిదు వందల నుంచి లక్షరూపాయల వరకు ధరలుంటాయి. బాహుబలి.. డ్రాక్యూలా దసరా వస్తోందంటే రావణుడి దిష్టిబొమ్మలకు చాలా గిరాకీ ఉంటుంది. రావణుడిని రావణుడి ఆకారంలోనే కాక తమకు ఇష్టమైన వారి ఆకారంలో కూడా తయారు చేసివ్వమని అడుగుతుంటారట కస్టమర్లు. కిందటేడు బాహుబలి, డ్రాక్యూలా షేప్లో రావణుడి బొమ్మలు కావాలని మహా డిమాండ్ వచ్చిందట. ఇంకొంత మంది తమకు నచ్చిన దుస్తుల్లో రావణుడిని అలంకరించమంటారట. కాని ఈ తయారీదారులు ఇలాంటి వాటికి ‘నో’ అని సమాధానం చెప్తారు చాలా సింపుల్గా. ‘‘ఎంతైనా రావణుడే కదా మాకు అన్నదాత. ఆయన బొమ్మలు అమ్మే కదా మా పొట్టనింపుకుంటున్నాం. మాకు అన్నంబెట్టే ఆ దేవుడిని అతని రూపంలో కాకుండా వేరే వేరే రూపాల్లో తయారు చేయడమంటే ఆ దేవుడిని అవమానించినట్టే కదా! అందుకే కలర్స్, డిజైన్ ఎలిమెంట్స్ తప్ప ఇంక వేటినీ కస్టమైజ్ చేయం’’ అంటాడు రాజు అనే తయారీదారుడు. దహనం చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతారా? అని అడిగితే.. ‘‘బాధనిపిస్తుంటుంది.. ఈ చేతులతో తయారు చేస్తాం కదా... కాని ఏంచేస్తాం? పండగలో భాగం. అదొక సంప్రదాయం’’ అని సమాధానమిస్తాడు శంకర్ అనే ఇంకో తయారీదారుడు. సీజన్ అయ్యాక ఇంట్లో శిక్షణ ఈ సంచార కమ్మరులు దిష్టిబొమ్మల తయారీని ఓ పరిశ్రమగా కాక కళగానే చూస్తారు. సీజన్ అయిపోయాక ఇంట్లో ఉన్న పిల్లలకు ఈ కళను నేర్పిస్తుంటారు. వెదురుబద్దలను ఎండబెట్టడం.. వాటిని చీల్చడం.. బొమ్మల్లా చేయడం, రంగులు తయారు చేయడం.. రంగుల ఎంపిక.. కనుముక్కు తీరు గీయడం... వంటివాటన్నిటిలో శిక్షణనిస్తారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్తూనే తమ పెద్దవాళ్ల దగ్గర ఈ కళనూ అభ్యసిస్తున్నారు. పనిముట్ల తయారీలో వచ్చే లాభం కన్నా సీజన్లో దిష్టిబొమ్మల ద్వారా సంపాదించేదే ఎక్కువ అని చెప్తారు. ఎవరీ రావణబ్రహ్మలు? కమ్మరుల్లో సంచార కమ్మరులు ఈ దిష్టిబొమ్మలు చేసేవారు. రాజస్థాన్కు చెందిన గడియా లోహార్ తెగవాళ్లు మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారట. అక్బర్తో జరిగిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తిరిగి విజయం సాధించే వరకు ఆ రాజ్యంలో అడుగుపెట్టమని ప్రతిజ్ఞచేసి మరీ మేవాడ్ను వదిలారట. అలా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురై సంచారం కొనసాగించారట. వాళ్ల వారసులమే అని తమ చరిత్ర చెప్తారు వీళ్లు. కర్ణాటకతోపాటు మన దగ్గర కనిపించే లండాలు కూడా ఈ తెగవారే అంటారు. తితార్పూర్లో ఉంటున్న గడియా లోహార్స్ సీజన్లో దిష్టిబొమ్మలను చేస్తూ మిగిలిన సమయంలో ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తారు. – శరాది -
రొనాల్డో తనపై అత్యాచారం చేశాడు: మాజీ మోడల్
లాస్ఏంజిల్స్: ‘నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, అవి ఫేక్.. ఫేక్ న్యూస్’అంటూ పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అనంతరం కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్ ఫుట్బాలర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. రొనాల్డో తనను అత్యాచారం చేశాడని అమెరికన్ మాజీ మోడల్ కేథరిన్ మయోగ్రా గత నెలలో నెవడా కోర్టులో కేసు వేసింది. జూన్ 13, 2009 రోజున లాస్ వెగాస్లోని రొనాల్డో తన పెంట్హౌస్లో తనను హత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతక ముందు ఒక రోజు కలిశామని, తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడని, ఒంటరిగా వున్న తనపై లైంగికంగా దాడి చేసి, చిత్రవధలకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం భయపడిన రొనాల్డో తన లాయర్తో అగ్రిమెంట్ చేయించి కేసు బయటకి రాకుండా చేశాడని తెలిపింది. రొనాల్డొ చర్యతో భయమేసిందని, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఉద్దేశంతో అప్పుట్లో బయటకి చెప్పలేకపోయానని వివరించింది. తాజాగా ‘మీ టూ’ ప్రోగ్రాంలో భాగంగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించి, కోర్టును ఆశ్రయించింది. లాస్ వెగాస్ పోలీసులు కూడా ఆ కేస్ను రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని అనుకుంటున్నారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన జర్మన్ మ్యాగజైన్ క్రిస్టియానో రొనాల్డో ఫోటో కవర్ పేజీపై వేసి ఆ వార్త ప్రచురించింది. దీనిపై రొనాల్డో వ్యక్తిగత లాయర్ ఆ మ్యాగజైన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్య్కులేషన్ను పెంచుకునే భాగంగా ఇలాంటి నిరాధారిత వార్తలు రాయడం తగదన్నారు. మ్యాగజైన్పై పరువునష్టం కేసు వేస్తామని తెలిపారు. ఈ వార్తపై పోలీసులు, కేథరిన్ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. -
మోడల్ దారుణ హత్య
బాగ్దాద్ : తారా ఫేర్స్ అనే ఇరాకీ మోడల్ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి నుంచి పోర్షే వాహనంలో బయల్దేరిన తారా(22)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. కారులో నుంచి ఆమెను కిందకి లాగి తుపాకీ గురిపెట్టి వరుసగా మూడు బుల్లెట్లు తలలోకి దించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. కాగా తారా మోడల్గా రాణిస్తూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తారాకు ఇన్స్టాగ్రామ్లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా మోడల్గా పని చేస్తుందన్న కారణంగానే ఛాందసవాదులు తారను అత్యంత దారుణంగా చంపివేశారంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘అందరు అమ్మాయిల్లాగే జీవితాన్ని తనకు నచ్చినట్టుగా, సంతోషంగా గడపాలనుకున్న తారాను కొంత మంది ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ గురువారం తారా వాళ్ల టార్గెట్. వచ్చే గురువారం ఇంకెవరో. స్వేచ్ఛగా జీవించాలనుకునే అమ్మాయిలకు ఇక్కడ ఇలా జరగడం సాధారణమైపోయింది కదా. నిజంగా సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్తమ్మాయి!
కెనడాలో పది రోజులపాటు జరిగిన ‘టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్’ నిన్నటితో ముగిసింది. ‘స్పెషల్ ప్రెజెంటేషన్స్’ సెక్షన్ కింద ఆ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం పొందిన ఫ్రెంచి సినిమా.. ‘మాయ’లో ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ అమ్మాయి ఆర్షి బెనర్జీ కెరీర్కు ఆ ముగింపు ఒక ప్రారంభాన్ని ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఆర్షి నటనకు అంతగా అభినందనలు లభించాయి! ఆర్షి బెనర్జీ : ఈ యువ మోడల్కు అనుకోకుండా ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించే అవకాశం చేజిక్కింది. అది కాస్తా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవ ఎర్ర తివాచీపై నడిచేలా చేయడం ఆమెను మరింత ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. మోడలింగ్ ఏజెన్సీ ‘ఇనేగా’ 19 ఏళ్ల మోడల్ ఆర్షి బెనర్జీని ఓ ఫ్రెంచ్ సినిమా ఆడిషన్కు రాగలరా అంటూ ఆహ్వానించినపుడు ఆమె పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఆడిషన్ పాసైన ఆమెకు ఏకంగా టైటిల్ రోలే లభించడంతో ఆనందంతో తబ్బిబ్బు అయ్యింది. తను నటించిన ఆ రొమాంటిక్ డ్రామా.. ‘మాయ’ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం అవుతుందనైతే ఆమె ఏమాత్రం ఊహించలేదు. ‘మాయ’ ఫ్రెంచి చిత్రం. మియా హన్సెస్ లవ్ ఆ చిత్ర దర్శకురాలు. ఆర్షి బెనర్జీ ఇండియా అమ్మాయి. కమ్మని కబురొచ్చింది! 30 ఏళ్ల ఫ్రెంచ్ వ్యక్తికి, టీనేజీ గోవా అమ్మాయి మధ్య సాగే ప్రేమాయణం చుట్టూ తిరిగే ఫ్రెంచ్–ఇంగ్లిష్ సినిమా ‘మాయ’. ఈ చిత్రంలోని పాత్ర కోసం 16–18 ఏళ్ల లోపు ఇండియన్ అమ్మాయి కోసం అన్వేషణ సాగింది. ఆ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్గా పని చేస్తున్న నందిని శ్రీకాంత్ ప్రయత్నాలు ఆర్షిని కలుసుకోవడంతో ముగిశాయి. ఆర్షి ఆడిషన్కు వెళ్లొచ్చింది. ఆ తర్వాత జలుబు బారిన పడి తన అపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్షికి నందిని నుంచి ఫోన్ వచ్చింది. డైరెక్టర్ హన్సెన్ దాదాపు 200 మందికి పైగా ఆడిషన్ టేపులను పరిశీలించాక ఆర్షిని కలుసుకునేందుకు మాత్రమే ఉత్సాహం కనబరుస్తున్నారన్నది కబురు. సినిమా ఆడిషన్లో పాల్గొన్న అనుభవం లేకపోవడంతో ఆర్షి మొదట కొంత నెర్వస్గా ఫీలైంది. రచయిత, దర్శకురాలు అయిన హన్సెస్ చిత్రాలేవి ఆర్షి అంతకు ముందు చూసి ఉండకపోవడంతో ఆమె తీసిన సినిమాల గురించి తెలుసుకుంది. వాటిలో ‘థింగ్స్ టు కమ్ (2011), ‘గుడ్బై ఫస్ట్ లవ్’ (2016) సినిమాలు ఆర్షికి నచ్చాయి. అమ్మ నుంచి ఇన్స్పిరేషన్ నటి, టెక్స్టైల్ డిజైనర్గా పేరుతెచ్చుకున్న తన తల్లి రతులా బెనర్జీ అడుగుజాడల్లోనే ఆర్షి ముందుకు సాగింది. ఆర్షి ముంబైలోని ర్యాన్ గ్లోబల్ స్కూల్లో చదువుకుంది. క్లాస్లోనే పొడగరి కావడంతో స్కూల్లో వేసే నాటకాల్లో ఆమెకు టీచర్, నాయనమ్మ వంటి పాత్రలే ఇచ్చేవారు. ఒక దశలో కాస్మటిక్ సర్జన్ కావాలని కోరుకున్నా.. సినిమాలే ఆమెకు లోలోపలి ‘ప్యాషన్’. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టి, ముందుగా స్టిల్ కెమెరా ముందు తన ప్రతిభ చాటుకుంది ఆర్షి. ‘మాయ’ ఫిల్మ్లో పాత్ర కోసం కొంకణి భాష నేర్చుకుంది. ఇది తన పాత్రకు మరింత దగ్గరయ్యేలా చేసింది. మొత్తం మహిళా నేతృత్వం! కథలో.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్న ఫ్రెంచ్ వ్యక్తితో ఈ అమ్మాయి ప్రేమలో పడుతుంది. అతడి పేరు గాబ్రియల్. వార్ రిపోర్టర్. సిరియాకు బందీగా ఉండి ఎలాగో ఇండియా వస్తాడు. అక్కడ ఆర్షికి పరిచయం అవుతాడు. మాయ (ఆర్షి బెనర్జీ) అతడిని ప్రేమిస్తుంది. ఇలాంటి థీమ్తో కథ నడిపించడానికి కథన కౌశలం కావాలి. హీరో, హీరోయిన్ సన్నిహితంగా కనిపించే సన్నివేశాలను కూడా దర్శకురాలు గొప్పగా, కళాత్మకంగా చిత్రీకరించడాన్ని చూసి ఆర్షితో పాటు ఆమె తల్లి రతులా కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. డైరెక్టర్ మియా హన్సెస్ ఈ పాత్రను అందంగా మలిచారని, ఎక్కడా తప్పుడు అభిప్రాయాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని రతులా.. హన్సెస్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రంలోని వివిధ విభాగాలకు మహిళలే నేతృత్వం వహించడంతో ప్రతీరోజు ఏడెనిమిది గంటలు మాత్రమే ఈ బృందం పనిచేసింది. అందులోనూ వారాంతపు సెలవులు ఎంజాయ్ చేశారు. ప్రతిష్టాత్మక టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ ఆర్షి నటనకు తగిన గుర్తింపు లభించడంతో.. ఫ్రెంచ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఫిల్మ్స్లోనూ అవకాశం వస్తుందని నమ్ముతున్నారు ఆర్షి అండ్ టీమ్. ఇక.. ధర్మ లేదా యాష్రాజ్ నిర్మాణసంస్థలో నటించే అవకాశం లభిస్తే తన కంటే అదృష్టవంతురాలు ఎవరుంటారని నవ్వుతూ అంటోంది ఆర్షి బెనర్జీ. – కె.రాహుల్