Onions
-
‘టాప్’ మోతపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాది ఏదో ఒక సీజన్లో టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఒకేసారి పెరిగి ‘సెంచరీ’కొట్టడం...మనందరి గుండెలు గుభిల్లుమనడం...మళ్లీ ఒక్కసారే వాటి ధరలు పడిపోవడం షరామామూలై పోతున్న విషయం మనకు తెలిసిందే. దక్షిణాదిలో ఈ సమస్య ఉండగా...టమాటా, ఉల్లిగడ్డల ధరల మోతతో పాటు దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ తదితర ప్రాంతాల్లో ఆలుగడ్డల ధరలు బెంబేలెత్తిస్తున్న సంగతి కూడా విదితమే. ఏ యేడాదికి ఆ ఏడాది ఇలా ధరల పిడుగు మనపై పడుతూ, ఉత్పత్తి, సరఫరా సరిగా లేక ఈ సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో ‘కిచెన్ బడ్జెట్’ను కిందా మీదా చేస్తున్నా దీనికి తగిన పరిష్కారమంటూ లభించకపోవడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ పేపర్ సిరీస్లో భాగంగా... డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అక్టోబర్–2024లో విడుదల చేసిన ‘వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా :ఏ స్టడీ ఆఫ్ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో (టాప్)’నివేదికలో వివిధ అంశాలను పొందుపరిచారు. కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (సీపీఐ)లో పెద్దగా ప్రాధాన్యత లేని టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు «వివిధ సందర్భాల్లో అధిక ధరల పెరుగుదల కారణంగా ఆహారపదార్థాలపై ప్రభావం పడటంతో పాటు ద్రవ్యోల్బణం విషయంలో వార్తాపత్రికలు, దృశ్యమాధ్యమాల పతాక శీర్షికలకు కారణమవుతోంది. ఈ నివేదికలో భాగంగా...వివిధ అంశాలను పరిశీలించారు. వాల్యూచెయిన్తో ముడిపడిన అంశాలు తదితరాలపై అధ్యయనం చేశారు. వీటిధరల్లో రైతుల భాగస్వామ్యం అనే విషయానికొస్తే...టమాటాల్లో 33 శాతం, ఉల్లిపాయల్లో 36 శాతం, ఆలుగడ్డల్లో 37 శాతం రైతుల ‘షేర్’ఉన్నట్టుగా పేర్కొన్నారు. వీటి పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం, కూలీల వేతనాలు ఇంకా... సీజనల్ ఆటోరిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ విత్ ఎక్సోజీనోస్ వేరియబుల్ (సారిమాక్స్) ప్రభావితం చేస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే భారత్లోనూ...కరోనా మహమ్మారి అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాల ప్రభావంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా... భారత్లో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణానికి కన్జూమర్ ప్రైస్ఇండెక్స్ (సీపీఐ)లో ఇవి మూడు అధిక ప్రాధాన్యతను పొందే పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యి, అధికంగా వినియోగించే కూరగాయల్లో ఈ మూడు ఉండటంతో కొరత ఏర్పడినప్పుడు ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి మూడు కూడా ప్రధానంగా స్వల్పకాలిక పంటలు, (షార్ట్ సీజనల్ క్రాప్స్) త్వరగా కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లోనే వీటి ఉత్పత్తి కేంద్రీకృతం కావడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం వీటిపై తీవ్రంగా పడడం వంటి కారణాల వల్ల ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఏర్పడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. సూచించిన పరిష్కారాలు... » నెలవారీగా ఈ మూడింటి సప్లయ్, డిమాండ్ను రూపొందించి, దీనికి తగ్గట్టుగా మార్కెట్ స్పందనలు.. మరీముఖ్యంగా రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు, స్టాకిస్ట్లు, వినియోగదారుల కొనుగోలుతీరును పరిశీలించాలి.» వీటి ధరలు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి స్టాక్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ధరల పెరుగుదలలు స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి.» వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ...వచ్చే 12 నెలలకుగాను ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వాటిని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ూ ఈ మూడింటి ధరలు పెరగకుండా జాగరూకతతో వ్యవహరించడంలో భాగంగా వీటికి సంబంధించి వాల్యూ చెయిన్ను అర్థం చేసుకుని, వినియోగదారులు చెల్లించే మొత్తంలో వీటిని పండించే రైతుల వాటాను పెంచేలా చర్యలు చేపట్టాలి. -
కిలో ఉల్లి రూ. 35.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్సేల్ మార్కెట్లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం? -
కొంచెం స్మార్ట్గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
ఉల్లిపాయలు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..!
ఉల్లి లేనిదే ఏ కూరకు రుచి రాదు. అలాంటి ఉల్లిపాయను సామాన్యుడు కొనుగోలు చేసేలా లేదు. ఏందిరా ఈ ధర అన్నట్లుగా ఉంది. ఇలాంటి టైంలో అసలు ఉల్లిపాయ లేకుండా కూరలు వండుకోవడం బెటర్ అనుకుంటుంటారు చాలామంది. కొందరూ ఉల్లికి దూరంగా ఉండటం లేదా వాడకం తగ్గించేస్తారు. నిజానికి ఇలా ఉల్లిపాయలు తీసుకోకుంటే ఏం జరుగుతుంది..?. మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. తదితరాలు గురించి తెలుసుకుందాం..!.ఉల్లిపాయలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయంటున్ననారు నిపుణులు. సీనియర్ డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కణాల ఎదుగులకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.ఉల్లిపాయలకు దూరంగా ఉంటే ఏం జరుగుతుందంటే..ఉల్లిపాయలు తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా..కొద్దికొద్ది మార్పులు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఉల్లిలో ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు అవసరమైన డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల మలబద్ధకంతో పాటు జీర్ణసమస్యలు తలెత్తుతాయి.అంతేకాదు, ఉల్లిపాయలను తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరిచే మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్ లోపాలు వస్తాయి. ఫలితంగా శరీరంలో అలసట ఏర్పడి ఎర్రరక్త కణాలు పడిపోవడం, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేయకుండా మితంగా తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందుకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరుకు పాటించటం ఉత్తమం. (చదవండి: రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!) -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..
ప్రభుత్వం ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగించే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఉల్లి ధర గడిచిన 15 రోజుల్లో దాదాపు 40 శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. లాసల్గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ధరల ప్రకారం కేజీ ఉల్లి ధర మంగళవారం రూ.28గా ఉంది.ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతనెలలో ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠ స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే హీట్వేవ్స్ వల్ల రబీలో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు.దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.పెరుగుతున్న ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. 2022-23లో 25 లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నులకు తగ్గాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని సమాచారం.ఇదీ చదవండి: వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్సీసీఎఫ్లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. -
Onions: ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్కు 50 వేల టన్నులు, మారిషస్కు 1,200 టన్నులు, బహ్రెయిన్కు 3 వేల టన్నులు, భూటాన్కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.. కానీ మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన విధంగా ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, దేశంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించి దేశీయంగా సరఫరా పెంచేందుకు కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ చేసిన సూచన మేరకు తాజాగా నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి? -
క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ తాజాగా ఉండాలంటే..!
కొన్ని రకాల కాయగూరలని ఫ్రిజ్లో ఉంచిన వెంటనే పాడైపోతాయి. ఎలా నిలువ చేయలో అర్థంకాక సతమతమవుతుంటాం. పైగా అవి ఖరీదు కూడా. పోనీ వెంటనే వండటం కుదురుతుందా అంటే ఒక్కొసారి అస్సలు కుదరదు. అలాంటి టైంతో మన పెద్దవాళ్లు లేదా కొందరూ చెఫ్లు చెప్పే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇబ్బంది తీరిపోతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం.. గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా కాస్త కట్ చేసుకోని వాడుకోవచ్చు. మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని దోరగా వేయించి గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రంప్స్లా ఇది ఉపయోగపడుతుంది. క్రిస్పీ వెజ్ నాన్వెజ్ డిష్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాప్సికాన్ని పేపర్ బ్యాగ్లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది. బేకింగ్ సోడాలో కాస్త వెనిగర్ వేసి నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపైన రాసి పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో తోమితే నలుపంతా పోయి పాత్ర కొత్తదానిలా మెరుస్తుంది. (చదవండి: దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? అలా అస్సలు చేయకండి
కిచెన్ టిప్స్: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది. ►ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్ బ్యాగ్లనే వాడాలి. పేపర్ బ్యాగ్స్లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు. ►రిఫ్రిజిరేటర్లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. ►ప్లాస్టిక్ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాగ్లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి. -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్ఫుడ్లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్
Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్ కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!) అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి , పంటను నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి. -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!
ముంబై: మన దేశంలో రైతుల అప్పులు, వ్యవసాయం సాగించేందుకు వారు పడే తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా ఎరువులు, పురుగులు మందు, కూలి ఖర్చులు, కావాల్సిన ఇతర సామాగ్రి ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుకు గిట్టు ధర తప్ప మిగతావన్నీ పైపైకి పోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో మార్పు రావడం లేదని చివరికి మిగిలేది అప్పులు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. మరీ రూ.2 ఇచ్చాడు తాజాగా ఓ రైతు ఎన్నో కష్టాలు, ఖర్చులు పెట్టి పండించిన పంటకు అన్నీ పోనూ చివరికి రూ. 2 మిగిలింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం రైతుల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. షోలాపూర్ జిల్లా బార్షి జిల్లాకు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చాడు. ఉల్లి ధరలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రైతులకు క్వింటాల్కు రూ.100 ధర లభించింది. రైతు తెచ్చిన ఉల్లిపాయలను అమ్మగా వచ్చిన మొత్తం బిల్లు 512 రూపాయలు. అందులో రవాణా, తూకం, వాహన ఛార్జీల కింద రూ. 509.51 పోయాయి. చివరికి రూ.2.49 మిగిలింది. దీంతో వ్యాపారి రౌండాఫ్ ఫిగర్ చేసి 2 రూపాయలు చెక్కును రైతుకు ఇచ్చాడు. చెక్కుపై తేదీ మార్చి 8, 2023 అని కూడా పేర్కొనడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులు శ్రమించి, ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పంట పండిస్తే తనకు మిగిలేది రెండు రూపాయలా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ఇచ్చిన రశీదు, చెక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
మహబూబ్నగర్: ఉల్లి ధరలు పడిపోవడంతో ఆందోళనలో రైతులు
-
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్లో భూకంపం) -
Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!
కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్ఫార్మిన్తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్స్పాట్గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. -
Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే!
Hair Care Tips In Telugu: ఉల్లి లేని కూరలను.. ఉప్పు లేని పప్పు చారుతో పోల్చుతారు కొంతమంది. ఎందుకంటే ఉల్లి వల్ల వంట రుచికరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు. అలాగే. ఉల్లి వల్ల జుట్టుకు కూడా ఎంతో మంచిదని ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ►ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకు ఏం చేయాలంటే..? ►ఉల్లిని మెత్తగా గ్రైండ్ చేసి.. దాన్నుంచి రసాన్ని తీసి.. ఒక గిన్నెలో నిల్వ చేసి కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►ఈ నూనెను గోరువెచ్చగా వేడి చేసు రాసుకున్నా మంచిదే. ఈ నూనె బట్టతల సమస్యలు రాకుండా కాపాడుతుంది. మెరిసే జుట్టును సొంతం చేసుకునేందుకు ఇలా చేయండి తేనె, ఆలివ్ ఆయిల్.. ►టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి కలపాలి. ►దీనిని కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. ►20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. కరివేపాకుతో.. ►కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ►ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. ►మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. ►కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ►ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. ►చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ►ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Hair Care: వర్షంలో తడిసినపుడు జుట్టుకు ఆయిల్ పెడితే!
రాబోయేది వర్షాల సీజన్. ఈ కాలంలో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి. వర్షంలో తడిచినా వెంటనే తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టాలి. జుట్టుకు ఆయిల్ పట్టించి గంటతరువాతే తలస్నానం చేయాలి. అదే విధంగా... వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి. నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో మరో నాలుగు టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టు కుదళ్ల నుంచి చివర్లకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇవన్నీ పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చదవండి👉🏾: Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
అమెరికాలో ‘ఉల్లి’ హడల్!
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
------------
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. ఏమిటీ సాల్మొనెల్లా..? సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమౌతాయి కూడా. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
తాడేపల్లిగూడెం నుంచి బెంగాల్కు కిసాన్ రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా పట్టణానికి ఆదివారం ఉల్లిపాయల లోడ్తో కిసాన్ రైలు బయల్దేరి వెళ్లింది. విజయవాడ డివిజన్లోని బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్(బీడీయూ) బృందం తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు రవాణా చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారవేత్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి దీన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంది. తక్కువ ఖర్చు, సురక్షిత రవాణా, సరుకు భద్రత, ప్రభుత్వం అందించే రాయితీల గురించి రైతులు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడం ద్వారా మొదటిసారిగా తాడేపల్లిగూడెం నుంచి మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు. కిసాన్ రైలును విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
కర్నూలు: కోవిడ్ నిబంధలను అనుసరించి ఉల్లి క్రయవిక్రయాలు
-
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు..
కోసిగి(కర్నూలు జిల్లా): పొలాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను అపహరించేందుకు వచ్చాడనే అనుమానంతో రైతులు ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన ఢణాపురం నసరన్న(55) శనివారం సాయంత్రం కోసిగిలో జరిగిన సిద్ధరూఢ స్వామి జాతరకు వెళ్లాడు. రాత్రి కావడంతో ఆశ్రమంలోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున సజ్జలగుడ్డం గ్రామానికి వెళ్లే రోడ్డులో కాల్వలో సాన్నం చేసేందుకు అడ్డదారిలో పొలాల్లో వెళ్తుండగా.. ఆరబెట్టిన ఉల్లి పంటకు కాపలా ఉన్న రైతులు చీకటిలో అతడిని దొంగగా అనుమానించి చితక బాదారు. తీవ్రంగా గాయ పడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వ్యక్తి మృతికి కారణమైన రైతులు కిందిగేరి ఈరన్న, కపటి ఈరన్న, కోసిగయ్య, తాయన్నతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. చదవండి: చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు హైడ్రామా -
మరో పిడుగు : భారీగా పెరగనున్న పాల ధర
సాక్షి, భోపాల్ : ఒకవైపు ఆకాశాన్నంటుతున్న పెట్రోలు ధరలు, మరోవైపు వంటగ్యాస్ ధర పెంపు సగటు భారతీయుడి నెత్తిన పెనుభారాన్నిమోపుతున్నాయి. పెట్రో ధరల సెగ నిత్యావసరాలు, రవాణా, ఇతర రంగాలపై పడుతుందన్న ఆందోళన నేపథ్యంలో మరో బాంబు ప్రజల నెత్తిన పడనుంది. ఇప్పటికే భారీ పెరిగిన ఉల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.. తాజాగా పాల ధర కూడా భగ్గుమనేందుకు సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దేశంలో కూడా ధర భారీగా పెరగనుందన్న ఆందోళన వినియోగదారులను మరింత బెంబేలెత్తిస్తోంది. (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) డీఎన్ఏ సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం సిటీలో పాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 25 గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల ఉత్పత్తిదారు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 23న నిర్వహించిన సమావేశంలో లీటరుపై రూ.12 పెంచేందుకు నిర్ణయించారు. సంబంధిత అధికారుల అనుమతి అనంతరం మార్చి 1 నుంచి ధర పెంపును అమలు చేయనున్నారు. ఈ ధర అమల్లోకి వస్తే, లీటరు పాల ధర రూ .55 పలకనుంది. అంటే ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 చెల్లించాల్సి ఉంటుందన్న మాట. గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు. కానీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడిందని ఇపుడిక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్ అధ్యక్షుడు హిరలాల్ చౌదరి వెల్లడించారు. -
పచ్చి ఆహారాన్ని లాగించేసిన కరోనా పేషెంట్
కరోనా అంటే హడలెత్తే రోజులు పోయాయి. ముఖాన మాస్కు, చేతిలో శానిటైజర్ ఉందంటే కరోనా కాదు కదా దాని మమ్మీలాంటి వైరస్ వచ్చినా ఏం చేయలేదు అన్న ధైర్యానికి జనాలు వచ్చేశారు. ఇక వైరస్ సోకినవారిలో సగం మందికి లక్షణాలు బయటపడుతుంటే మిగతా సగం జనానికి వైరస్ సోకిందన్న సంగతి కూడా తెలియడం లేదు. కాగా కరోనా లక్షణాలలో మొట్టమొదటిది రుచీవాసన తెలీకపోవడం. అది ఏ రేంజ్లో ఉంటుందనేది రసెల్ డనేలీ అనే వ్యక్తి జనాలకు తెలియజేయాలనుకున్నాడు. దీంతో వంటింట్లో ఉండే సామానంతా తన ముందు పెట్టుకుని వీడియో ఆన్ చేశాడు. పచ్చి ఆహారాన్ని పుష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినడం మొదలుపెట్టాడు. ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, బేబీ ఫుడ్ ఇలా తింటూనే ఉన్నాడు. (ఫోటో షూట్.. మరోరకం ట్రెండింగా..?) వంటకాల్లో ఉపయోగించే నిమ్మరసం, ఆపిల్ సైడ్ వెనిగర్ను గుట గుటా తాగేశాడు. నిమ్మకాయను నమిలి నమిలి మింగేశాడు. టూత్పేస్టును కూడా తినేందుకు ప్రయత్నించాడు. చిత్రవిచిత్రమైనవన్నీ తింటున్నా ఎలాంటి రుచీపచీ తెలీకపోవడంతో ఇదో క్రేజీ వైరస్ అని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 17 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో తీయడం గురించి రసెల్ మాట్లాడుతూ.. తాను ఏ వాసన పసిగట్టలేకపోతున్నాని, నాలుకకు రుచి తెలీట్లేదని చెప్తే తన స్నేహితులు నమ్మలేరని తెలిపాడు. ఈ వీడియోతో వారికి సమాధానం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. (భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు) -
రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి
కాకినాడ రూరల్/కర్నూలు (అగ్రికల్చర్): సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుబజార్లలో శుక్రవారం నుంచి కిలో ఉల్లిని రూ.40కే ప్రజలకు అందించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్లో కిలో ఉల్లిని రూ.80 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు. దీంతో ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కాకినాడలో గురువారం మంత్రి వివరించారు. 5 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు నాఫెడ్ ద్వారా ఇండెంట్ పెట్టామని, అత్యవసరంగా 1,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తొలి దశలో పట్టణ, నగర ప్రాంతాల్లోని రైతుబజార్ల ద్వారా ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున ఉల్లిని అందిస్తామన్నారు. కాగా, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లిని వెంటనే కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తొలుత వంద టన్నుల వరకు కొనుగోలు చేసి కర్నూలు జిల్లా, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలని సూచించింది. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రోఖియాబీ ఉల్లి కొనుగోలుకు గురువారం శ్రీకారం చుట్టారు. మరోవైపు పొలాల్లోకే వెళ్లి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి
ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడింది. రైతులకు కూడా మేలు చేకూరనుంది. కడప అగ్రికల్చర్/మైదుకూరు: కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు అరబ్ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యు లు వైఎస్ అవినాష్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు. బ్రిటీష్ వైశ్రాయ్ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గ రగా చూశారు. కుదేలైన వ్యవసాయానికి జవసత్వాలు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు. ►మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు.అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గత టీడీపీ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులను ఛీకొడుతూ వచ్చింది. ఎగుమతులు లేని పంటను ఎందుకు సాగు చేయాలని నాటి సీఎం, నేటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అప్పట్లో తెగేసి చెప్పినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి పంట సాగు.....: బ్రిటీష్ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్లేడీ, అగ్రిబ్రౌన్ రోజ్గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది. సంతోషకరం కేపీ ఉల్లి చారిత్రక పంట. బ్రిటిష్ కాలం కంటే ముందే ఈ పంటను రైతులు సాగు చేశారు. అయితే ఎన్నో ఏళ్లు ప్రభుత్వాలు కేపీ ఉల్లి రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ పంటకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరం. – లెక్కల వెంకటరెడ్డి, కేపీ ఉల్లి రైతుల సంఘం నాయకుడు, మైదుకూరు రైతు సంఘాల కృషి వల్లే రైతు సంఘాలు ఉద్యమాలు చేయడం వల్లే కేపీ ఉల్లి రైతులకు మేలు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు వల్ల పంటను అభివృద్ధి చేయాలి. – రాజమోహన్రెడ్డి, కేపీ ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం నాయకుడు, మైదుకూరు. -
ఒక్క కన్నీటి బొట్టు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్ అయి ‘ఇద్దరు’గా మిగిలారు. అమ్మాయి ఏడ్చింది. అబ్బాయి ఏడ్వలేదనుకుంది. ‘నా కోసం ఒక్క కన్నీటి బొట్టు.. నీ దగ్గర లేదా’ అని అడిగింది. అతడి చేత కన్నీళ్లు పెట్టించడానికి.. ట్రక్కునిండా ప్రేమను పంపింది. ‘‘రెండు కళ్ల నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి’’ అంటాడు క్రిష్. (డైరెక్టర్ కెవీ రెడ్డి ఆయన). ‘‘ఊ’’ అంటుంది కీర్తి సురేశ్. (నటి సావిత్రి ఆమె). మళ్లీ చెప్తాడు క్రిష్. ‘‘రెండు కళ్ల నుంచి కాదమ్మాయ్. ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి’’ ‘‘ఊ’’ అని తల ఊపుతుంది. పాట మొదలౌతుంది. ‘నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’. కీర్తి సురేశ్కి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీటి బొట్లు వచ్చేస్తాయి! రెండంటే రెండు బొట్లే అడిగి ఉంటాడు క్రిష్. రెండంటే రెండు బొట్లే రాలుస్తుంది కీర్తి సురేశ్. ‘మహానటి’లోని సన్నివేశం ఇది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు ) ∙∙ మిస్ ఝావో ఓ కుర్రాడిని ప్రేమించింది. అతడూ ఆమెను ప్రేమించాడు. ఇద్దరిదీ చైనా. జీబో అనే ప్రాంతంలో ఉంటారు. ఉండేది జీబోలోనే అయినా, ప్రేమ మొదలైనప్పట్నుంచీ ఒకరి మనసుల్లో ఒకరు ఉంటున్నారు. ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈమధ్యే విడిపోయారు. బ్రేకప్ చెప్పేశాడు ఆ కుర్రాడు. ఝావో తట్టుకోలేకపోయింది. తల్లడిల్లిపోయింది. ‘నీకోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’ అని పాడుకుంది. అతడు పట్టించుకోలేదు. కాల్ చేయలేదు. కాల్ చేస్తే తియ్యలేదు. ఏడ్చింది. తన లెక్క ప్రకారం అతడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అతడు ఏడ్వడం లేదని, హాయిగా ఉన్నాడని ఆమెకు తెలిసింది! అతడు ఏడుస్తూ లేకపోవడం చూసిన వారెవరో వచ్చి ఆమెకు చెప్తే తెలిసింది. ∙∙ ఝావో బాయ్ఫ్రెండ్ అప్పుడే నిద్ర లేచాడు. కళ్లు నలుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. గది నిండా ఉల్లి సంచులు! వెయ్యి కిలోల ఉల్లిపాయలు. డెలివరీ బాయ్ ట్రక్కులో తీసుకొచ్చి అక్కడి దింపేసి వెళ్లిపోయాడు. సంచుల్లో చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్లో ఎవరిదో చేతి రాత! ఎవరిదో ఏంటి.. తన గర్ల్ ఫ్రెండ్ ఝావోదే! అక్షరాలు పైకే కనిపిస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు నీ వంతు’’ అని రాసి ఉంది! ‘తిక్క పిల్ల’ అనుకున్నాడు. ఈలోగా, ‘‘ఏంటి బాబూ, ఇన్ని ఎర్ర ఉల్లిపాయల సంచులూ’’ అని పక్కింటి వాళ్లొచ్చి అడిగారు. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు. ‘‘నా ఫ్రెండే. ప్రతి దానికీ అతి చేస్తుంటుంది. అందుకే విడిపోయాం. విడిపోయినందుకు తను ఏడుస్తోందట. నన్నూ ఏడవమని ఈ ఉల్లిపాయల్ని పంపింది. బ్రేకప్ అయినప్పట్నుంచీ నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా ఫ్రెండ్స్ అందరితో చెబుతోందట! ఏడ్వనందుకు చెడ్డవాణ్ణి అయ్యాను’’ అని ఫీల్ అయ్యాడు. ఈ ఫీలింగేదో ఫోన్ చేసి ఆ పిల్ల దగ్గరే ఏడిస్తే హ్యాపీగా ఫీల్ అయి ఉండేది కదా పాపం. బ్రేకప్ అవడం అంటే మరింత దగ్గరవడం. ఉల్లి సంచుల్ని చూస్తూ తల పట్టుకున్న మిస్ ఝావో బాయ్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ ఇంటికి మిస్ ఝావో డెలివరీ చేసిన ఉల్లిపాయలు -
ఉల్లి లోడు పేరుతో భారీ గంజాయి స్మగ్లింగ్
బరంపురం : ఉల్లిపాయల లోడు పేరుతో అక్రమంగా 1100 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనలో ట్రక్కుని సీజ్ చేసి, డ్రైవర్తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం... బరంపురం జిల్లా కె.నువగాం పోలీసు స్టేషన్ పరిధిలో తుంబా అటవీమార్గం గుండా ఉల్లిపాయల లోడ్ పేరు చెప్పి, అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. గంజాం ఎస్పీ ఆదేశాల మేరకు కె.నువాగం పోలీసులు అటవీ మార్గంలో నిఘా పెట్టారు. ( ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ) అటువైపుగా వస్తున్న ట్రక్కుపై దాడి చేసి, తనిఖీ చేయగా.. భారీగా గంజాయి నిల్వలు కనిపించాయి. ఇందులో 1100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ట్రక్కు సహా సీజ్ చేసి, డ్రైవర్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారి వద్ద నుంచి ఒక తుపాకీ, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ/ఒంగోలు సిటీ/పట్నంబజారు(గుంటూరు): కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఒకటి, రెండు రోజుల్లో తొలగిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో రైతులు కేపీ రకం ఉల్లిపాయలను దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నారు. హాంకాంగ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలు కేపీ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబర్లో కేపీ రకం ఉల్లితో సహా ఉల్లిపాయల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం వల్ల కేపీ ఉల్లి సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఈ రకం ఉల్లిని దేశీయ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. కేపీ ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పనికి రాదు. అందువల్ల చేతికొచ్చిన పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కేపీ ఉల్లి పండించే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రోజ్ ఆనియన్ పేరుతో ఇదే రకం ఉల్లిని కర్ణాటక రైతులు సాగుచేస్తున్నారు. ఆ ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతించిన కేంద్రం కేపీ ఉల్లి ఎగుమతులకు మాత్రం అనుమతించకపోవడం న్యాయం కాదు. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తక్షణమే తొలగించాలి..’ అని వాణిజ్య శాఖ మంత్రి గోయల్ను అభ్యర్థించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది చాలా ప్రధానమైన సమస్య అని అంగీకరించారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందని సభా ముఖంగా హామీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వలేం: కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్ చేయించుకుంటున్న నిరుపేదలకు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే అవకాశం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. అలాంటి పేషెంట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నెలకు రూ. 10 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని అన్నారు. వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిరుపేదలైన దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో 35 కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న అడుగుతూ.. ‘ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ పరిశోధనా కేంద్రంతోపాటు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆరోగ్య మంత్రికి తెలుసు. కాబట్టి ఉద్దానం ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీతోపాటు పలాసలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి..’ అని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ. 2,527 కోట్ల మేర జీఎస్టీ ఎగవేత జూలైలో జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 2019 వరకు వ్యాపారుల నుంచి వినియోగదారులకు జరిగిన సరఫరాల్లో రూ. 2,527 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఎంపీ గల్లా నేరప్రవృత్తి ఉన్న ముఠాతో వచ్చారు తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని, తన ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు నేర ప్రవృత్తి ఉన్న ముఠాతో పాటు గల్లా జయదేవ్ అసెంబ్లీ ప్రాంతానికి వచ్చారని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ గల్లా జయదేవ్ అసెంబ్లీ ఏరియాలోకి వెళ్లాలని భావించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుందన్నారు. అసెంబ్లీ సభ్యుల భద్రత కోసం మాత్రమే పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అంతకుముందు గల్లా జయదేవ్ మాట్లాడుతూ తన మానవ హక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. జనవరి 20న అసెంబ్లీ జరుగుతున్న వేళ అమరావతి జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని, తన నియోజకవర్గ పరిధిలో ఉన్నందున వారికి మద్దతుగా తాను అందులో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లేసరికి పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారన్నారు. బాధ్యత పట్టని కంపెనీలపై తీసుకుంటున్న చర్యలేంటి? దేశంలోని వివిధ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) చేసుకున్న ఒప్పందాల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగం, ప్రభుత్వ పర్యవేక్షణ, పథకాల కేటాయింపు, వాటి అతిక్రమణలపై తీసుకుంటున్న చర్యల గురించి మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. ఈ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశంలోని కంపెనీలు 2015–16లో రూ.14,517 కోట్లు, 2016–17లో రూ.14,329 కోట్లు, 2017–18లో రూ.13,620 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఏపీలో 2015–16లో రూ.1,294 కోట్లు, 2016–17లో రూ.753 కోట్లు, 2017–18లో రూ.269 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ కమిటీ సిఫార్సులను అనుసరించి అన్ని విషయాలనూ బోర్డు చూసుకుంటుందని వివరించారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద ఏపీకి రూ.19 కోట్లు జాతీయ ఆయుష్ మిషన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి రూ.19.01 కోట్లు ఆర్థిక సహాయంగా అందించినట్లు ఆయుష్ శాఖల మంత్రి శ్ర్రీపాద యశోనాయక్ చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆయుష్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ. 363.73 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పురుగు మందుల వాడకం పరిమిత స్థాయిలోనే ఉంది వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోంది?, ఆంధ్రప్రదేశ్లో పరిమితికి మించి పురుగుమందుల వాడకం ఉందా? అంటూ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బదులిస్తూ.. రసాయనాల వాడకం పరిమిత స్థాయిలోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యవసాయ రంగంలో రసాయన, పురుగు మందుల వాడకంపై పలు ప్రశ్నలు అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చింది. ఏపీలో నాలుగు నగరాల్లో 266 విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఫేమ్ ఇండియా పథకం రెండో దశ కింద ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు 92, విశాఖపట్నానికి 71, తిరుపతికి 68, కాకినాడకు 35 చొప్పున విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 62 నగరాల్లో 2,636 విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణ్ణంరాజు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మిథున్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 106 ప్రతిపాదనలు అందినట్లు చెప్పారు. 893 మెట్రిక్ టన్నుల విదేశీ ఉల్లి కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వివిధ రాష్ట్రాలకు మార్కెట్ రేట్ల ప్రకారం సరఫరా చేస్తోందని వినిమయ వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి దాన్వే రావ్సాహెబ్ దాదారావు లోక్సభకు తెలిపారు. ఈ ఏడాది జనవరి చివరినాటికి ఆంధ్రప్రదేశ్కు 893.18 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు111.68 మెట్రిక్ టన్నుల ఉల్లిని అందజేసినట్లు ఆయన చెప్పారు. లోక్సభలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్, రెడ్డప్ప, ఆదాల అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జనవరి చివరినాటికి కేంద్రం 2,600 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రాలకు అందించిందన్నారు. -
కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కేపీ ఉల్లి ఎగుమతులకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాకు తెలిపారు. ఎంపీలు మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్పలతోపాటు అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య తరఫున సమాఖ్య కార్యదర్శి బండ్లపల్లె మదన్మోహన్రెడ్డి, సలహాదారు బొమ్మారెడ్డి కోటిరెడ్డి, కేపీ ఉల్లి రైతులు ఎ.వెంకటరామిరెడ్డి, ఎ.దస్తగిరిరెడ్డి తదితరులు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం పార్లమెంటు ఆవరణలో మిథున్రెడ్డి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో చిన్న సైజ్లో ఉండే కేపీ ఉల్లిగడ్డలను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశాం. ఇదివరకే పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కేపీ ఉల్లిగడ్డ దేశీయంగా వినియోగం తక్కువ. కర్ణాటకలో ఇదేతరహా ఉల్లికి ఎలాగైతే ఎగుమతులకు అనుమతి ఇచ్చారో ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్న కేపీ రకం ఉల్లి ఎగుమతులకు అనుమతివ్వాలని కోరాం. మంత్రి సానుకూలంగా స్పందించారు.’ అని వివరించారు. ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ‘నవంబర్ నుంచి కేపీ ఉల్లి రైతులు ఎగుమతులకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. మూడు వారాలుగా ఢిల్లీలోనే ఉన్న కేపీ ఉల్లి రైతులతో కలిసి మంత్రిని కలిశాం. కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తారన్న విశ్వాసం ఉంది..’ అని వివరించారు. -
ఉల్లిపాయలు పట్టుకెళ్తానన్న ఆర్మీ హీరో
న్యూ ఢిల్లీ: గతేడాది ఉల్లిపాయ ధరలు ఆకాశన్నంటగా ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాయి. అయితే కొన్నిప్రాంతాల్లో ఉల్లి సమస్య ఇంకా వెంటాడుతూనే ఉందడానికి ఇక్కడ చెప్పుకునే ఘటనే నిదర్శనం. జమ్ముకశ్మీర్లో లేహ్ జిల్లాలో లడక్ స్కౌట్లో నయూబ్ సుబేదార్గా మ్యుటప్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1985లో దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన అశోక్ చక్ర గ్రహీతను అందుకున్నారు. ఈ ఆర్మీ హీరో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ఢిల్లీ నుంచి లేహ్కు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు తనవెంట ఉల్లిని తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కేవలం రూ.60కే ఉల్లి దొరుకుతోంది. కానీ లేహ్లో కిలో ఉల్లి ధర రూ.200ను దాటిపోయింది. అందుకే ఈ నెల 31న నేను తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు ఏడెనిమిది కిలోల ఉల్లిని తీసుకెళ్తాను. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లాలని ఉన్నా పరిమిత బరువుల నిబంధన మేరకు ఆ ఆలోచన విరమించుకున్నా’నని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లి రేట్లు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆయన ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవళ్లు కూడా ఆర్మీలోనే చేరటం విశేషం. వర్షాలతో ఉల్లికి దెబ్బ.. గతేడాది ఆగస్టు- సెప్టెంబర్లో ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో భారీ వర్షాలతో పంట చేతికిరాలేదు. దీంతోపాటు ఉల్లిని పండించే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉల్లి దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లికొరత ఏర్పడింది. సాధారణంగా రూ.20 లేదా రూ.30కి లభించే ఉల్లిపాయలు ఒక్కసారిగా కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పలికాయి. ఈ క్రమంలో జమ్ము, కశ్మీర్లోని లేహ్ ప్రాంతంలోనూ ఉల్లి ధరలు చుక్కలను తాకాయి. ఇక ఈమధ్యే ఉల్లిధరలు దిగివచ్చినప్పటికీ లేహ్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతుండటం గమనార్హం. చదవండి: జామా మసీదు ముందు చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యక్షం ‘షి’పబ్లిక్డే -
ఆలూ, ఉల్లి షాక్: డబ్ల్యూపీఐ 2.59 శాతం
సాక్షి,న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం బాటలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా నడిచింది. డిసెంబరు నెల టోకు ధరల సూచీ మరింత ఎగిసింది. నవంబరు 0.58 శాతం శాతంతో పోలిస్తే డిసెంబరు మాసంలో 2.59 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార పదార్థాలు(ఆలూ, ఉల్లి) ఇంధన ధరలు సెగ డబ్ల్యూపీఐని ప్రభావితం చేసింది. ఆహార ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ ఫుడ్ ఇండెక్స్) 13.24 శాతం పెరిగింది. నవంబరులో ఇది 11 శాతం. నవంబరు మాసంలో 172.3 శాతంగా ఉన్న ఉల్లి ద్రవ్యోల్బణ రేటు డిసెంబరులో 455.8 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.35 శాతం వద్ద ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయినికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
కిలో ఉల్లిపాయలు రూ.15కే
సాక్షి, మచిలీపట్నం: సామాన్యులపై భారం పడకూడదన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు సరఫరా చేస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతున్నప్పటికీ రైతు బజార్లలో మాత్రం కిలో రూ.25లకే సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.15కే కృష్ణాపురం (కేపీ) ఉల్లిపాయలను విక్రయించాలని నిర్ణయించింది. జిల్లాలో రోజుకు సుమారు150 టన్నుల ఉల్లి వినియోగం జిల్లాలో ప్రతి రోజు 120 నుంచి 150 టన్నుల ఉల్లి వినియోగం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా వరదలు, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బ తినడంతో సెప్టెంబర్ నుంచి ఉల్లి ధరలు ఆకాశానికి ఎగబాకడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధులు ఉపయోగించి పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకుని సబ్సిడీ రేట్లకే ప్రజలకు అందిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి నెల రోజుల పాటు కొనసాగించిన ప్రత్యేక కౌంటర్లు, తిరిగి నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమై నేటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం కిలో రూ.100 నుంచి రూ.150 వరకు ధర వెచ్చించి కొనుగోలు చేసి జిల్లాలోని స్థానిక రైతు బజార్లలో కిలో రూ.25లకే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు జిల్లాలో 1327 మెట్రిక్ టన్నుల (ఎం.టీల) ఉల్లిపాయలను సబ్సిడీ ధరకే విక్రయాలు జరిపారు. మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, రాజస్థాన్లోని ఆళ్వార్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కర్నూలు, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలు చేసి జిల్లాలో సబ్సిడీపై విక్రయాలు చేశారు. కాగా ప్రస్తుతం కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలోని కృష్ణాపురం (కేపీ) ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో కేపీ ఉల్లి సాగవుతోంది. సాధారణ ఉల్లి కంటే చిన్న సైజు (50 ఎం.ఎం)లో ఉండే ఈ ఉల్లి ప్రస్తుతం కిలో రూ.50కు పైగా పలుకుతోంది. ఆ ధరకే మైదుకూరు మార్కెట్ నుంచి కొనుగోలు చేసి రప్పించేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కర్నూల్, నాసిక్ తదితర రకాల ఉల్లిపాయలను సబ్సిడీపై కిలో రూ.25కు విక్రయిస్తుండగా, చిన్న సైజులో ఉండే కేపీ ఉల్లిపాయలను కిలో రూ.15కే అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అక్కడ మార్కెట్కు వచ్చే సరుకును బట్టి రోజుకు 50 నుంచి 60 టన్నుల చొప్పున కొనుగోలు చేసి జిల్లాలోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు జరపాలని సంకల్పించినట్టు మార్కెటింగ్ ఏడీ ఎం.దివాకర్బాబు సాక్షికి తెలిపారు. గురువారం నుంచి కేపీ ఉల్లిపాయల అమ్మకాలకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఇక ఈజిప్టు ఉల్లి!
సాక్షి, అమరావతి బ్యూరో: కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఈజిప్టు ఉల్లి జిల్లాకు వచ్చేస్తోంది. ఈ మేరకు ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో బయలుదేరిన తొలి నౌక ఇప్పటికే ముంబైకి చేరింది. అక్కడ శనివారం రాత్రి ఉల్లిపాయలు లోడు చేసుకున్న లారీలు రాష్ట్రానికి బయలుదేరాయి. ఇవి సోమవారం నాటికి విజయవాడ చేరుకుంటాయని మార్కెటింగ్ శాఖ అధికారులుభావిస్తున్నారు. మంగళవారం నుంచి విక్రయాలు ప్రభుత్వం ఉల్లి కొరతను తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉల్లిపాయలు ఈజిప్టు నుంచి ముంబై పోర్టుకు నౌకలో వస్తాయి. అక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లారీల్లో తరలిస్తారు. జిల్లాకు తొలి విడతలో 25 టన్నుల ఈజిప్టు ఉల్లిని కేటాయించారు. నగరానికి రాగానే మంగళవారం నుంచి వీటిని రాయితీపై పంపిణీ చేయనున్నారు. కొన్నాళ్లుగా కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. కొద్దిరోజుల క్రితం అవి కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లాకు మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్ ప్రాంతాల నుంచి రోజుకు 60–70 టన్నుల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉల్లి ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ 17 నుంచి రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో రాయితీతో కిలో పాయలు రూ.25కే విక్రయిస్తోంది. తాజాగా ఈజిప్టు ఉల్లి కూడా అందుబాటులోకి రానుండడంతో వినియోగదారులకు ఉల్లిపాయల కొరత చాలా వరకు తీరనుంది. రాయితీ ఉల్లి అందుబా టులోకి తెచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,100 టన్నుల ఉల్లిని వినియోగదారులకు సరఫరా చేశామని మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డైరెక్టర్ దివాకరరావు చెప్పారు. మూడు రోజుల్లో రెండో నౌక.. రెండుమూడు రోజుల్లోనే మరో నౌక ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో ముంబైకి రానుంది. ఆ నౌక కూడా వస్తే మరిన్ని ఈజిప్టు ఉల్లిపాయలు రాష్ట్రానికి, జిల్లాకూ వస్తాయి. -
ట్వింకిల్ చెవులకు.. అక్షయ్ అరుదైన గిఫ్ట్
సాక్షి, ముంబై : భర్త ఇచ్చిన ప్రియమైన కానుకను ఆమె ధరించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు ప్రేమతో ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్వింకిల్ ఖన్నా ఆ ఇయర్ రింగ్స్ను పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెవులకు ఆ ఆనియన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇయర్ రింగ్స్ ఒక షూట్ నుంచి మరొక షూట్ వరకూ ఎలా ప్రయాణించాయో కదా అని ట్వింకిల్ వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది నెటిజన్లు వావ్ అంటూ అభినందించగా, మరికొందరు అబ్బే బాగోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్న్యూస్ మూవీ ప్రమోషన్ కోసం అక్షయ్ ఇటీవల కపిల్ శర్మ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ షో నుంచి అక్షయ్ ఉల్లిపాయలతో చేసిన చెవి రింగులను తెచ్చి ట్వింకిల్కు అందించగా ...ఆమె వాటిని సంతోషంగా స్వీకరించారు. తనకు అక్షయ్ నుంచి మంచి బహుమతి లభించిందని.... కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో వ్యాఖ్యానించారు. -
మహానగరంలో ఉల్లిపాయల దోంగలు
-
5 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు చోరీ
మిర్యాలగూడ అర్బన్: ఎవరైనా ఏం దొంగతనం చేస్తారు? డబ్బు, బంగారం, విలువైన వస్తువుల కోసం అని చెబుతాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా విలువైనవిగా మారాయి. ఓ దుకాణంలో దొంగ లు పడి డబ్బు కాకుండా ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పాతబస్టాండ్లో ఉల్లిగడ్డల వ్యాపారం నిర్వహిస్తున్న బక్కయ్య బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం తాళం పగులగొట్టి ఉంది. లోపల పది బస్తాల ఉల్లిగడ్డలు (5 క్వింటాళ్లు) కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన బక్కయ్య, వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పక్కనే డబ్బుల కౌంటర్ ఉన్నా దొంగలు దానిని ముట్టుకోలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. -
చతికిలబడ్డ ప్రతిపక్షం
ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు. సాంబిరెడ్డి గుడికి వెళ్లొస్తూ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటారు. సోమవారం ఆయన మార్కెట్కు వెళ్లినప్పుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. టీడీపీ వాళ్లు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం దుర్మార్గం. – సాంబిరెడ్డి కుటుంబీకులు సాక్షి, అమరావతి: ఉల్లిపై చర్చ తలబొప్పి కట్టించేలా చేసింది. హెరిటేజ్పై చేసిన సవాల్ ఇరుకున పడేసింది. రైతు భరోసాపై చెప్పిన లెక్కలన్నీ తప్పి తిప్పలుపెట్టాయి... వెరసి మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చివరకు సభ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఉల్లి ధరలపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఆయన సహచరులకు ఊహించని షాక్ తగిలింది. ఉల్లిపాయలకోసం రైతుబజార్ క్యూలో నిలబడి చనిపోయాడని చంద్రబాబు వ్యాఖ్యానించగా అది పూర్తిగా అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వీడియో సాక్ష్యంతో రుజువు చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ నాది కాదు ఫ్యూచర్ గ్రూప్కు అమ్మేశామని, తనదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అయితే ఆధార సహితంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రుజువుచేయడంతో ఇరుకునపడ్డారు. కేంద్ర పథకానికి జతచేసి రైతుభరోసా ఇస్తున్నారంటూ అధికారపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబు చివరకు తానే ఇరుక్కున్నారు. తన హయాంలో రుణమాఫీ పేరుతో దగాచేశారని, కేంద్రపథకాలన్నిటినీ చంద్రన్న పేరు తగిలించి ప్రచారం చేసుకున్నారంటూ మంత్రులు, అధికారపక్ష సభ్యులు ధ్వజమెత్తడంతో ప్రతిపక్షం వద్ద సమాధానమేలేకపోయింది. శవం దొరికింది కదా అని రెచ్చిపోతారా..? శాసనసభలో మంగళవారం టీ విరామం అనంతరం మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉల్లిపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించగా.. అనంతరం కొలుసు పార్ధసారథి మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా.. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ గుడివాడలో ఓ వ్యక్తి రైతుబజార్ వద్ద ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి చనిపోయాడని అన్నారు. ఈ దశలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని ‘శవాల మీద రాజకీయం చేసిందెవరు. గుడివాడలో సాంబిరెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే ఆయన శవం బొమ్మలతో సభకొచ్చి గందరగోళం సృష్టించింది తమరు కాదా?. సాంబిరెడ్డి ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులతో చెప్పించాలని ప్రయత్నించారు. అలా చెబితే తెల్లారేసరికి చంద్రబాబు గుడివాడ వస్తారని.. రూ.25 లక్షల నష్టపరిహారం వచ్చేలా చూస్తారని చెప్పిన మాట నిజమా? కాదా?. ఎంత వత్తిడి చేసినా సాంబిరెడ్డి కుటుంబీకులు మాత్రం తమ ఇంటికి రావొద్దని తెగేసి చెప్పి నిజాయితీని చాటుకున్నారు. ఈ రాష్ట్రం నీ జాగీరు కాదు. గుడివాడలో ఉన్నది కొడాలి నాని అని గుర్తు పెట్టుకో’ అంటూ చంద్రబాబును దులిపేశారు. అనంతరం సాంబిరెడ్డి కుమారుడు, బావమరిది చెప్పిన మాటలున్న వీడియోను సభలో ప్రదర్శించారు. అందులో ‘ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన ఖర్మ తమ కుటుంబానికి లేదని, సాంబిరెడ్డి గుడికి వెళ్లొస్తూ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటారని, అదే క్రమంలో సోమవారం ఆయన మార్కెట్కు వెళ్లినప్పుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించారని’ సాంబిరెడ్డి కుటుంబీకులు వివరించారు. ఎక్స్గ్రేషియో కోసం పాకులాడాల్సిన దుస్థితిలో తమ కుటుంబం లేదన్నారు. టీడీపీ వాళ్లు తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగాలని చూడడం, చావును రాజకీయం చేయాలని చూడటం దుర్మార్గమని ఆ వీడియోలో వివరించారు. పిచ్చిరాతలు రాసే వారిపై అవసరమైతే పరువు నష్టం దావా వేస్తామని కూడా స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న ప్రతిపక్షానికి నోట మాట లేకుండాపోయింది. హెరిటేజ్లో రూ.200కి అమ్మడం నిజం కాదా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలో కిలో ఉల్లిని రూ.200కు అమ్ముతున్నారనడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ‘హెరిటేజ్ ఫ్రెష్ నాది కాదు. ఫ్యూచర్ గ్రూప్నకు అమ్మేశాం. అది నాదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. లేకుంటే మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఏదిపడితే అది మాట్లాడటానికి వీల్లేదు’ అంటూ శివాలెత్తారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుంటూ ఫ్యూచర్ గ్రూప్లో చంద్రబాబుకు 3.65 శాతం షేర్లు ఉన్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన కథనాన్ని సభ ముందుంచి బాబును ఆత్మరక్షణలో పడేశారు. షేర్లు ఉన్నాయో లేవో చెప్పాలని నిలదీశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన చంద్రబాబు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. రైతుభరోసాపైనా ఇరకాటమే.. రైతు భరోసాపై చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి జగన్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు, ఐదు విడతల్లో చెల్లించాల్సిన రైతు రుణమాఫీపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. దీనిపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం యోజన ప్రకటించడానికి ముందే జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. బేషరతుగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు చివరకు దానిని చంద్రన్న దగాపథకంగా మార్చారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సభలో ప్రదర్శించారు. కేంద్ర పథకాలకు చంద్రన్న బాట, చంద్రన్న బీమా వంటి పేర్లు పెట్టుకున్నారని, నీరు–చెట్టు పథకంతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడలేకపోయారు. -
ఏపీలో రూ.25కే కిలో ఉల్లి..
సాక్షి, సచివాలయం: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉల్లిని రాయితీపై అందించడానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యంత్రాంగం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం వెలుపల మార్కెట్లలో కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25కే ఉల్లిని సరఫరా చేస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేసిన ఉల్లిని సామాన్యులకు రూ.25కే రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. శనివారం 400 టన్నులు కొనుగోలు చేయగా, శుక్రవారం 369 టన్నుల ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉల్లి సమస్యను పరిష్కరించడానికి కర్నూలు, షోలాపూర్, తాడేపల్లిగూడెం, ఆళ్వార్ మార్కెట్ల నుంచి ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 3,395 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయగా, రైతుబజార్లో రూ.25కే ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. (చదవండి: ‘ఉల్లి’కి ముకుతాడేద్దాం) -
మరి ఆమె అవకాడో తింటారా !
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అల్లాడుతున్న క్రమంలో తాము ఉల్లిపాయలు ఎక్కువగా తినమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. ఉల్లిపాయలు తిననని చెప్పిన మంత్రి అవకాడోలు తింటారా అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఉల్లిపాయలు తినకున్నా వాటి ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్పై విడుదలైన చిదంబరం నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నడిపించడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్ధ మేనేజర్గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతం అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని ఇందుకు ఆర్బీఐ అసమర్ధ అంచనా కారణమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా అని చిదంబరం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తన గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ కుప్పకూల్చిందని, ఎకానమీపై ప్రధాని నోరు మెదపడం లేదని చిదంబరం మండిపడ్డారు. -
మెనూలో ఉల్లి దోశ మాయమైంది!
బెంగళూరు: ఉల్లి ఉంటే మల్లి కూడా వంటలక్కే అని ఊరికే అనలేదు. ఏ వంటకమైనా ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ఇక టిఫిన్లు, చాట్లపై ఉల్లిపాయ చల్లకపోతే ముద్ద దిగదనుకోండి. అలాంటిది ఉల్లి రేటు చుక్కలనంటడంతో ఇంట్లో ఉల్లి కనిపించకుండా పోయింది. సరే, కనీసం హోటళ్లలోనైనా తిందామనుకుంటే అక్కడా ఉల్లిని బ్యాన్ చేసిన పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఉల్లి ధరల దెబ్బకు బెంగుళూరులోని పలు రెస్టారెంట్లలో ఉల్లి దోశను మెనూ నుంచి తీసేశారు. అంతేకాదు.. కొన్ని వంటకాల్లో ఉల్లి ఊసెత్తకుండా మమ అనిపిస్తుంటే మరికొన్ని వంటకాల్లో మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు. ఈ విషయంపై బెంగళూరులోని ఓ హోటల్ యాజమాని మాట్లాడుతూ.. ‘ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా ఉల్లి దోసెను మెనూలోంచి తీసేశాం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వంటకాల ధరలు పెంచవచ్చు. కానీ దీనివల్ల సగటు మధ్యతరగతి వాళ్లపై భారం పడుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాం. అయితే కొన్నింటిలో ఉల్లిపాయ లేకుండా వంటకాలు చేయలేం కాబట్టి మోతాదును మాత్రం తగ్గించామని పేర్కొన్నారు. దీనిపై భోజనప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లిపాయ లేకుండా చేసిన వంటలు బాగుండట్లేదని ఓ వినియోగదారుడు బాధను చెప్పుకొచ్చాడు. ఇక ఓ బాలుడు మాట్లాడుతూ ఉల్లిపాయ లేకపోతే వంటకాల రుచి దెబ్బతింటోందని, ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బెంగళూరులో కిలో ఉల్లిపాయ ధర రూ.100 పలుకుతోంది. -
లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!
శివ్పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్చంద్ మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్స్టేషన్ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది. సూరత్లో ఉల్లి దొంగలు గుజరాత్: సూరత్లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు -
నేటి నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు రైతుబజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.25కే విక్రయిస్తుండగా ఆదివారం నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 85 రైతుబజార్లు ఉండగా అందులో ఇప్పటికే 80 రైతుబజార్లలో ఉల్లి అందుబాటులో ఉంది. బయటి మార్కెట్లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 వరకు ఉండగా రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తుండటంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. అయితే.. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి రైతుబజార్లకు చేరుస్తున్నారు. మొదటి రెండు రోజులు ఉల్లిపాయల రవాణాలో కొంత జాప్యం జరగడంతో మారుమూల రైతుబజార్ల అవసరాలకు సరిపోను ఉల్లిపాయలు రాలేదు. దీంతో ధర మరింత పెరగొచ్చనే ఉద్దేశంతో రైతుబజార్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా.. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి కిలో రూ.48 నుంచి రూ.55 ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కర్నూలు జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ కర్నూలు ఉల్లినే కొనుగోలు చేస్తోంది. పండిన పంటనంతటినీ కర్నూలు రైతుల నుంచి కొనుగోలు చేశాకే ఇతర రాష్ట్రాల ఉల్లిని దిగుమతి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు ఎక్కువ ఉల్లి చేరాక కిలోకి మించి అమ్మాలని భావిస్తున్నారు. అవసరమైతే కౌంటర్లు పెంచుతాం నిర్ణీత సమయాలతో సంబంధం లేకుండా రైతుబజార్లకు చేరిన ఉల్లిపాయలను విక్రయిస్తాం. అవసరమైతే కౌంటర్ల సంఖ్యను పెంచుతాం. – ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
చలి బారిన పడకుండా చక్కటి చిట్కా
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఈ విషయం విన్న తర్వాత అది నిజమే అనిపిస్తుంది. అసలే చలికాలం మొదలైంది కాబట్టి రానున్న మూడు నెలలు చలి తీవ్రంగా ఉండబోతుంది. ఇప్పటికే ప్రతీ ఇంట్లో చలి నుంచి తప్పించుకోవడానికి రకరకాల స్వెటర్లు, ఇంకా అనేక దుస్తులను రెడీ చేసుకుంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిగడ్డను తీసుకోవడం ద్వారా ఎంతటి చలిలోనైనా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూరను వండరన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉల్లిలో ఉండే ఎంజైమ్స్, కొన్ని యంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన శరీరాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుతుందట. అందుకే చలికాలంలో రోజుకు ఒక ఉల్లి తింటే ఎంత చలికి తటుకొనైనా ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఉల్లిని జ్యూస్గా తీసుకోవడం వల్ల మన శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు అప్పటికప్పుడు తగినంత శక్తిని ఇస్తుందట. ఉల్లిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్, రసాయన పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి ఉల్లిలో సహజంగానే అల్లైల్ డై సల్ఫేట్, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల జ్వరం, జలుబు, దగ్గు, ఉబ్బసం, చెవి, చర్మ సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. చలికాలంలో సాధారణంగానే వ్యాయామం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కాబట్టి రోజు ఒక ఉల్లి తింటే బరువు పెరగకుండా ఉంచేందుకు దోహదపడుతుంది. ఉల్లిలో ఉండే కాల్షియం, ఐరన్, ఫోలేట్, సల్ఫర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, ఎక్కువ మోతాదులో ఉండే ఫైబర్ మనిషిని బరువు పెరగకుండా ఉంచుతుందట. చలికాలంలో తీపి వస్తువులు, కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తీసుకున్నప్పుడు మన చిగుళ్లు చెడిపోయే అవకాశం ఉంది. అయితే రోజు ఉల్లిని తింటే పిప్పి పళ్లను రాకుండా చేయడంతో పాటు చిగుళ్లను మరింత బలంగా తయారు చేస్తుంది. -
ఉల్లి ధరలపై ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర మరిన్ని చర్యల్ని చేపట్టింది. రిటైల్ మార్కెట్లో కిలోకుసుమారు రూ.100 వరకు పెరిగిన నేపథ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్నికేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్వీటర్ ద్వారా శనివారం పేర్కొన్నారు. ధరలను నియంత్రించడానికి లక్ష టన్నుల ఉల్లిపాయను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నవంబర్ 15, డిసెంబర్ 15 మధ్య కాలంలో ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరినట్లు ఆయన తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నాఫెడ్ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటిసి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుందనీ, దేశీయ మార్కెట్లో కీలకమైన నాఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం జరిగిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. सरकार ने प्याज की कीमतों को नियंत्रित करने के लिए 1 लाख टन प्याज के आयात का फैसला लिया है। MMTC 15 नवंबर से 15 दिसंबर के बीच आयातित प्याज देश में वितरण के लिए उपलब्ध कराएगा और NAFED को देश के हर हिस्से में प्याज का वितरण करने की जिम्मेदारी सौंपी गई है। #Onion @PMOIndia pic.twitter.com/O8KuaaO2la — Ram Vilas Paswan (@irvpaswan) November 9, 2019 -
ఉల్లి ధర ఢమాల్..రైతు ఫైర్
సాక్షి, కర్నూలు : ధర క్రమేణా పెరుగుతుండడంతో సంతోషంగా ఉన్న ఉల్లి రైతులకు బుధవారం ఒక్కసారిగా షాక్ తగిలింది. వ్యాపారులు సిండికేట్ అయ్యి ఊహించని విధంగా ధర తగ్గించేయడంతో రైతులు భగ్గుమన్నారు. దేశం మొత్తమ్మీద ఉల్లి ధరలు పెరుగుతుండగా... కర్నూలు మార్కెట్లో మాత్రం తగ్గడానికి వ్యాపారులు సిండికేట్ కావడమే కారణమంటూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. రైతులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు. కొందరు మార్కెట్ కమిటీ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడించగా... మరికొందరు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై పడుకోవడంతో పాటు బైఠాయించడంతో దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఉన్నట్టుండి తగ్గించేశారు! కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఉల్లి క్వింటాల్కు గరిష్టంగా రూ.4,500 ధర పలికింది. దీంతో బుధవారం ఈ ఏడాది ఇంతవరకు లేని విధంగా మార్కెట్కు ఉల్లి పోటెత్తింది. దాదాపు 50 వేల ప్యాకెట్లు వచ్చింది. వ్యాపారులు ఉదయం 11 గంటలకు వేలం పాట మొదలు పెట్టారు. రూ.500తో ప్రారంభించి.. రూ.1,500తో ముగించారు. దాదాపు 20 లాట్లకు ఈ ప్రకారమే ధర పలికింది. ఒక్కసారిగా ధర పతనం కావడానికి వ్యాపారులు సిండికేట్ కావడమే కారణమని గుర్తించిన రైతులు వేలంపాటను బంద్ చేయించి ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఈ ఆందోళనకు జిల్లా రైతుసంఘం కార్యదర్శి జగన్నాథం మద్దతు ప్రకటించారు. నాల్గవ పట్టణ పోలీసులు వచ్చి సర్దిచెప్పినా రైతులు శాంతించలేదు. ‘గత ఏడాది వరకు రూ.400, రూ.500 ధరతో అమ్ముకుని నష్టాలను మూటగట్టుకున్నాం. అయితే.. నిన్నటి వరకు ధరలు మెరుగ్గా ఉండడంతో ఊరట చెందాం. ఈరోజు ఉన్నట్టుండి ధర పడిపోవడం తీవ్రంగా కలచివేసింది. వ్యాపారుల వైఖరే ఇందుకు కారణం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల జోక్యం..వేలం పునఃప్రారంభం పోలీసులు జోక్యం చేసుకుని రైతులను మార్కెట్ కమిటీ సెక్రటరీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ, పోలీసు అధికారులు కలిసి వ్యాపారులతో చర్చించారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే..రైతుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం మూడు గంటలకు వేలం పునః ప్రారంభమైంది. క్వింటాల్కు గరిష్టంగా రూ.3,460 వరకు ధర లభించింది. అయినప్పటికీ మంగళవారంతో పోలిస్తే రూ.1000కి పైగా ధర తగ్గింది. మిగిలిన యార్డుల్లోనూ ధర తగ్గింది తాడేపల్లిగూడెం, హైదరాబాద్ మార్కెట్లలో కూడా ఉల్లి ధర పడిపోయినట్లు కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. అక్కడ రూ.3,200 నుంచి రూ.3,300 వరకు గరిష్ట ధర ఉందని, ఇక్కడా దాదాపు అదే విధంగా పలికినట్లు చెప్పారు. వర్షాలు పడుతుండటంతో ఉల్లిలో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ధరలు తగ్గిపోయాయని, మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉల్లి ధరలపై రైతులు సంయమనం పాటించాలని సూచించారు. చదవండి : భర్త హత్యకు భార్య కుట్ర -
ప్రాణం పోతున్నా కన్నెత్తి చూడలేదు..!
సాక్షి, ముంబై : ప్రాణం కన్నా మనిషికి మనీయే ముఖ్యమనే రోజులు దాపురించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ట్రక్ డ్రైవర్ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే.. ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. తేరగా వచ్చేది వదులుకుంటామా అని దొరికినన్ని ఉల్లిపాయల్ని దోచుకెళ్లారు. విషాదమేంటంటే.. అటుగా వెళ్తున్న ఇతర ట్రక్ డ్రైవర్లు సైతం గాయపడిన క్షతగాత్రునివంక కన్నెత్తి చూడలేదు. అందరూ అతని వాహనంలోని ఉల్లిపాయల్ని దోచుకునే పనిలో పడ్డారు. ఈ ఘటన ముంబై-పుణె ఎక్స్ప్రెస్ రహదారిపై గల వాల్వన్ బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్కు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన వాహనం ఉల్లిపాయల లోడుతో ముంబై నుంచి పుణె వెళుతోందని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్ ఢీకొట్టి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి వాహనం కిందపడడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. -
మింగలేక కక్కింది..!
పాములు పురుగులు.. కప్పలను తింటాయని మనకు తెలిసిందే. పాముల్లోకెల్లా చాలా డిఫరెంట్ కావాలనుకుందో లేక బాగా ఆకలైందో ఏమో కానీ ఉల్లిగడ్డలను తింది. అది కూడా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఉల్లిగడ్డలు. మరి వాటిని తిని కడుపు నింపుకుందా అంటే అదీ లేదు. మరి ఏం చేసిందనుకుంటున్నారు. పాపం వాటిని కొద్ది సేపు కూడా కడుపులో ఉంచుకోలేకపోయింది. మొత్తం కక్కేసింది. ఈ ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాడ అనే గ్రామంలో జరిగింది. సుశాంత బెహరాట్ అనే వ్యక్తి ఇంటిలో ఈ ఉల్లిగడ్డలను తిని బయటికి వచ్చి కక్కుతోందట. అయితే ఆ పాముకు ఏమైనా అవుతుందేమోనని స్థానికులు పాముల హెల్ప్లైన్కు ఫోన్ చేయగా వలంటీర్ హిమాన్షు వచ్చాడు. అయితే పాము అలా ఉల్లిగడ్డలను కక్కడం చూసి షాక్కు గురయ్యాడట. ఇలాంటి పామును చూడటం ఇదే తొలిసారని చెప్పాడు. పాము ఉల్లిగడ్డలను కక్కుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. -
పోటీపడి ఏరుకున్నారు !
దొడ్డబళ్లాపురం : ఫ్రీగా వస్తే ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఈ దృశ్యాలు చూస్తే... అవును...నెలమంగల పరిధిలోని 4వ జాతీయ రహదారి మార్గంలో గుండేనహళ్లి వద్ద ఉల్లిపాయల లోడ్తో వెళ్తున్న లారీ నుండి కొన్ని మూటలు జారి రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోవడంతో జనం తండోపతండాలుగా వచ్చి ఉల్లిపాయలను పోటీపడి మరీ ఏరుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా వస్తున్నా పట్టించుకోకుండా ఉల్లిపాయలు ఏరుకున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం నిలిపి మరీ ఉల్లిపాయలు ఏరుకోవడం కనిపించింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఏకంగా 11 ఉల్లిపాయలను మింగేసింది!
-
ఉల్లిగడ్డలు మింగిన నాగుపాము.. వైరల్
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 11 ఉల్లిపాయలను మింగిందో నాగుపాము. అయితే రంగంలోకి దిగిన స్నేక్ హెల్ప్లైన్ సిబ్బంది.. వాటిని కక్కించి పామును రక్షించాడు. ఒడిశాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అంగుల్ జిల్లా చెండిపాడ గ్రామంలో నివసించే సుసంత బెహెరా ఇంట్లోకి నాగుపాము చొరబడింది. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు స్థానికంగా ఉండే స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్ హిమాన్షు శేఖర్ దెహూరీకి కబురు పెట్టారు. ‘పామును పట్టుకోవాలని యత్నించినప్పుడు దాని పొట్టంతా ఉబ్బిపోయి ఉంది. అది ఒక్కో ఉల్లిపాయను కక్కుతూ వచ్చింది. అయితే అది అరుదైన దృశ్యం కాబట్టి ఫోన్తో రికార్డు చేయించాం. చివర్లో రెండు ఉల్లిపాయలు దాని నోటి నుంచి రావటం మీరూ ఆ వీడియోలో గమనించొచ్చు’ అని దెహూరీ చెబుతున్నాడు. అరుదైనదే... సాధారణంగా పాములు కప్పులు, పురుగుపుట్రతోపాటు కొన్నిసార్లు పండ్లు, కూరగాయాలను కూడా మింగుతాయి. కానీ, అది పొరపాటున ఉల్లిపాయలు మింగి ఉంటుంది. జీర్ణించుకోలేదు కాబట్టి పాపం అవస్థలు పడి బయటకు కక్కింది. అయితే ఏకంగా 11 ఉల్లిగడ్డలు మింగటం బహుశా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్లో కేరళలో ఓ పాము మాత్రం ఏడు గుడ్లను మింగి.. కక్కటం చూశాం’ అని స్నేక్ హెల్ప్లైన్ సెక్రెటరీ సుబేందు మాలిక్ చెబుతున్నారు. -
ఉల్లికి కన్నీరు!
ఉల్లి.. దాన్ని కోసేవారికి కన్నీరు రాక తప్పదు. ఎప్పుడూ కంటనీరు పెట్టని కఠిన హృదయులైనా ‘ఉల్లి’ ధాటికి కన్నీరు ఉబికి రావాల్సిందే. అయితే కంట నీరు రాకుండా ఉండే ఉల్లిని తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలే చేశారు. కొందరు సఫలమయ్యారు కూడా. 1980 నుంచి అమెరికాలోని వాషింగ్టన్, నెవడాలోని పంటపొలాల్లో పలు రకాల ఉల్లి జాతుల మధ్య సహజంగా సంకరం జరపడం వల్ల తాజాగా కొత్త రకం ఉల్లి ఆవిర్భవించింది. దీని పేరే ‘సునియాన్’. జన్యుమార్పుల వల్లే ఇది రూపొందిందని చెబుతున్నారు. ఈ ఉల్లి తియ్యటి రుచి కలిగి ఉంటుందని, కోసినప్పుడు కన్నీరు రాదని పేర్కొంటున్నారు. సునియాన్ భారత్కు ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అనుకుంటున్నారా.. దానికి ఇంకాస్త టైం ఉంది లెండి! -
సెంచరీ కొట్టిన క్యారెట్
-
ఉల్లి దిగుమతులకు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఎంఎంటీసీ ద్వారా 2000 టన్నుల ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సరఫరాలు పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు దేశీయ మార్కెట్ల నుంచి నాఫెడ్,ఎస్ఎఫ్ఏసీలు 12,000 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు కనిష్ట ఎగుమతి ధరను తిరిగి విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలు తగ్గడంతో దేశంలోని పలు చోట్ల ఉల్లి ధరలు కిలో రూ 50-65 మధ్య పలుకుతున్నాయి. ధరలకు చెక్ పెట్టేందుకు 12,000 టన్నుల ఉల్లిని సేకరించాలని తాము నాఫెడ్, ఎస్ఎఫ్ఏసీలను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలను పెంచి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. -
ఉల్లిగడ్డలు ఉన్నాయా అంటూ..!
సామాన్యుల్లా సరుకులు కొనుగోలు చేసేందుకు కిరాణా దుకాణానికి వెళ్తారు.. అది.. ఇది కావాలంటూ దుకాణాదారుడిని అడుగుతారు.. చివరకు ఉల్లిగడ్డలు కావాలని చెబుతారు.. అవి తెచ్చేందుకు దుకాణాదారుడు పక్క గదికి వెళ్లే సరికి గల్లా పెట్టెలోని డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు.. తుంగతుర్తి నియోజకరవ్గంలో ఇదే తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అర్వపల్లి : సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ అజీజుద్దీన్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన ముదురుకోల హరికృష్ణ ఇద్దరు యువకులు చోరీలనే వృత్తిగా ఎంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అర్వపల్లిలోని చిల్లంచర్ల విద్యాసాగర్ దుకాణంలో సరుకులు కావాలని అడిగి కొన్ని సరుకులు కొన్నారు. దుకాణం లోపల ఉన్న ఉల్లిగడ్డను చూసి అదికూడా కావాలని కోరగా దుకాణం యజమాని భార్య సరిత దుకాణం నుంచి అవతలిరూంలో ఉన్న ఉల్లిగడ్డలు తేవడానికి వెళ్లగా ఇదే అదునుగా భావించి క్యాష్ కౌంటర్ పక్కనే బ్యాగులోఉన్న రూ. 61వేల నగదును వేసుకుని తమ స్కూటిపై ఉడాయించారు. భార్య కేకలు వేయడంతో ఆమె భర్త విద్యాసాగర్ చుట్టుపక్కల మండలాల్లోని తన స్నేహితులు, ఇతర పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దీంతో దొంగల కోసం తిరుమలగిరి, తుంగతుర్తి, సూర్యాపేట రూట్లో బైక్లపై వెతకడం మొదలు పెట్టారు. అయితే దొంగలు అర్వపల్లి నుంచి తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి పోయి అక్కడ కొల్లూరి అంతయ్య దుకాణంలో ఇదే విధంగా సరుకులు కావాలని చెప్పి చివరగా దుకాణం అవతలి గదిలో ఉన్న ఉల్లిగడ్డలు కావాలని కోరడంతో వ్యాపారి ఉల్లి గడ్డలు తెచ్చేలోపు దుకాణంలోని రూ. 5వేల విలువ చేసే సెల్ రిచార్జ్ కూపన్లు చోరీ చేసుకుని పారిపోయారు. అనంతరం ఇదే మండలంలోని అన్నారంలో ఆగి అక్కడ కూడా దొంగతనం చేయడానికి పథకం రూపొందిస్తున్నారు. అయితే వెలుగుపల్లికి చెందిన విత్తనాల దుకాణం యజమాని సైదులుకు విషయం తెలిసి తన స్నేహితులతో కలిసి బైక్లపై దొంగల కోసం వెంటపడగా అన్నారంలో ఆగిన దుండగులను పట్టుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెల్సింది. రెండు నెలల క్రితం.. నిందితులు తుంగతుర్తి మండల కేంద్రంలోని మణికంఠ కిరాణం దుకాణంలో కూడా సరుకులు కావాలని వెళ్లి అక్కడ కూడా దుకాణం అవతలి గదిలో ఆరబోసిన ఉల్లిగడ్డలు కావాలని కోరగా యజమాని వీరయ్య అవి తెచ్చేలోపు కౌంటర్లోని రూ.60వేల విలువ చేసే రీచార్జ్ కూపన్లు ఇతర సామగ్రి అపహరించుకుపోయారు. వీరంతా శుక్రవారం రాత్రి అర్వపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. కాగా ఈవిషయమై ఎస్సై మోహన్రెడ్డిని వివరణ కోరగా చోరీలు జరిగిన విషయమై తమకు ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. దొంగలను తమ అదుపులోకి తీసుకున్నాక అన్నికోణాల్లో విచారణ సాగిస్తామని చెప్పారు. అన్నారంలో దొంగలను పట్టుకున్న వెలుగుపల్లికి చెందిన సైదులు, ఆయన స్నేహితులను అర్వపల్లిలో ప్రజలు, వ్యాపారులు అభినందించారు. -
మళ్లీ ఘాటెక్కుతున్న ఉల్లి ధర
-
46 బోగీల్లోని ఉల్లిపాయలు మాయం
బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన దొడ్డబళ్లాపురం (కర్ణాటక): కర్ణాటకలో ఉల్లిపాయల లోడుతో వెళుతున్న 46 బోగీల గూడ్సు రైలు లూటీకి గురైంది. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల సమీపంలోని బసవనహళ్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన బడా వ్యాపారులు ఉల్లిలోడును బీహార్కు తీసుకెళ్లారు. అవి నాసిరకంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించారు. దీంతో ఆ ఉల్లిని గూడ్సురైలులో నెలమంగల వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా.. బసవనహల్లి రైల్వే స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. దీంతో రైలును నిలిపివేశారు. కాగా, ఉల్లిగడ్డలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా బసవనహల్లి రైల్వే స్టేషన్కు వచ్చారు. గూడ్స్ రైలు బోగీల తలుపులు తెరిచి ఆ ఉల్లిమూటలను బైక్లపై, ఇతర వాహనాల్లో తీసుకువెళ్లిపోయారు. -
స్టఫ్డ్ పొట్లకాయ
హెల్దీకుకింగ్ తయారి సమయం: 30 నిమిషాలు కావలసినవి:పొట్లకాయ – 1(మూడంగుళాల పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి)ఉల్లిపాయ – 1జీలకర్ర – అర టీ స్పూన్ కొత్తిమీర – గార్నిష్కి సరిపడా స్టఫ్ కోసం:పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లుగసగసాలు – రెండు టీ స్పూన్లుపచ్చిమిర్చి – అయిదుపచ్చిబఠాణి– పావు కప్పు (ఉడికించాలి)ఉప్పు – సరిపడా(పై పదార్థాలలో కొద్దిగా నీటిని చిలకరించుకుని మిక్సీలో పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి) తయారి:∙ముందుగా పొట్లకాయ ముక్కల్లో స్టఫింగ్ మిశ్రమాన్ని కూరాలి.పాత్రలో నూనె వేడయిన తరవాత జీలకర్ర చిటపటలాడించి పసుపు, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.కూరిన పొట్లకాయ ముక్కల్ని జత చేసి కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి. (ప్లేట్లో కొద్దిగా నీరు పోసి మూత పెడితే అడుగంటకుండా ఆవిరికి త్వరగా ఉడుకుతుంది.) ఇలా 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.పొట్లకాయ మెత్తబడగానే దింపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా అన్నంలోకి వడ్డిస్తే రుచిగా ఉంటుంది. -
ఇంటిప్స్
అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ని చేసిన తరువాత ఒక టీ స్పూన్ వేడి నూనె, ఉప్పు కలిపి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా వండిన పదార్థాలు రుచికరంగా ఉంటాయి. వండుతున్న అన్నంలో కనోలా ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి వండితే అన్నం విడివిడిగా అవుతుంది. కొద్దిగా నిల్వ ఉన్న లడ్డూలను మైక్రో ఓవెన్లో అర నిమిషం పాటుంచితే తాజాగా అవుతాయి. చపాతీలు వత్తుకునేటప్పుడు బియ్యప్పిండిని పొడిపిండిగా వాడితే చపాతీలు మెత్తగా వస్తాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఒకేచోట నిల్వ చేయకూడదు. గది మూలల్లో కాస్తంత బోరిక్ పౌడర్ చల్లితే మూలల్లో దాగి ఉన్న బొద్దింకలు బయటికి వెళ్లిపోతాయి. నెమలిపింఛాన్ని గోడకి తగిలిస్తే బల్లులు బయటకు వెళ్లిపోతాయి. ఒక గ్లాస్ నీటిలో కర్పూరం వేయాలి. ఈ గ్లాస్ని మీరు పడుకునే బెడ్ దగ్గర పెడితే దోమలు దరి చేరవు. -
అక్కడ మరోసారి క్షీణించిన ఉల్లి ధరలు
నాసిక్ : నిన్న మొన్నటి దాకా వినియోగదారులకు కళ్లనీరు తెప్పించిన ఉల్లిధరలు ఇపుడు మహారాష్ట్రలో ఉల్లి రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి పాయల మార్కెట్ లాసల్గాన్ లో గురువారం ఉల్లి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడక్కడ మంచి రకానికి చెందిన వంద కిలోల ఉల్లిపాయలు ధర రూ. 425 పలుకుతున్నాయి. కిలో రూ 4.25 గా నమోదైంది. 2012 జూన్ తర్వాత ఈ స్థాయికి దిగి రావడం ఇదే మొదటి సారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ పోలిస్తే సరఫరాలో పెరుగుదలే ధరలు తగ్గుముఖం పట్టడానికి రైతులు భారీ పరిమాణంలో ఉల్లిపాయలు తీసుకువస్తున్నారనీ, డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఇదికాకుండా, మంచి నాణ్యతలేని ఉల్లిపాయల కారణంగా అత్యంత నష్టం వాటిల్లిందని లాసల్గాన్ ఏపీఎంసీ చైర్మన్ జయదత్త హోల్కర్ చెప్పారు. నాణ్యత లేని క్వింటా ఉల్లిని రూ .100 చొప్పున అమ్ముతున్నారని, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి ఉల్లి కనీస టోకు ధర రూ 150 క్వింటాలు వద్ద నిలిచిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నుంచి ఉత్పత్తి బావుందన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలు వేసవి పంట ఏప్రిల్, మే నెలలది, నాలుగు ఐదు నెలల పాతది కావడంతో ఇప్పటికే మొలకెత్తుతోందని జాతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ తెలిపారు. ఇది కూడా ధరల క్షీణతకు కారణమన్నారు. మరోవైపు భారతదేశం లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయవిధానంలోఅవకతవకలు రైతుల నడ్డి విరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయడ్డారు. ప్రధానంగా ఉల్లి ధరల్లోని భారీ ఒడిదుడుకులకు ఇదే నిదర్శనమన్నారు. ఫలితంగా అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్పత్తిదారులకు ప్రభుత్వాలు మార్కెట్ సదుపాయాలు, మంచి, వేగవంతమైన రవాణా వ్యవస్థలను కల్పించి, ధరల్లోని అస్థిరతను తొలగించాలనీ, దీనికి రాజకీయ సంకల్పం అవసరం విశ్లేషకుల వాదన. -
ఉల్లి ధరతో రైతుల గుండెల గుభేల్
-
1000 కిలోలు అమ్మితే రూపాయి మిగిలింది!
పుణే: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటన్న రైతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో ఉల్లి రైతుల పరిస్థితి అలాగే ఉంది. మహారాష్ట్ర రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను షాక్ కు గురిచేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. సాగు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా చేతికి రాకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే టన్ను(1000 కిలోలు) ఉల్లి అమ్మితే తనకు వచ్చిన ఆదాయం కేవలం ఒక్క రూపాయి అని రైతు చెబుతున్నాడు. రైతు దేవిదాస్ పర్భానే తనకున్న రెండెకరాలలో ఉల్లిని సాగుచేశాడు. నాసిక్ కు చెందిన కొందరు వర్తకులు, ఏపీఎంసీ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను కలిసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను, మార్కెట్లను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కు తన పంటను తీసుకొచ్చాడు. 80 వేల రూపాయలు ఖర్చుపెట్టి రెండకరాల్లో చేసిన సాగును అమ్మకానికి పెట్టగా వచ్చిన ధరకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నాడు. టన్ను ఉల్లిపాయలు విక్రయించగా కేవలం 1523 రూపాయలే వచ్చాయని, ఇందులో లేబర్ చార్జీలు, ట్రక్ డ్రైవర్ కు రూ.1320, ఇతర ఖర్చులు అన్ని తీసివేయగా తనకు మిగిలింది కేవలం ఒక్క రూపాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్ మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర రావడం, చివరగా కేజీకి 50 పైసలు మాత్రమే వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
కేజీ ఉల్లిపాయలు 50 పైసలే!
ఔరంగాబాద్ః ఉల్లి... రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను కుదేలు చేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. వందల్లో కూడ డబ్బు చేతికి రాకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అధః పాతాళానికి పడిపోయిన ఉల్లి ధరలను చూసి, ఔరంగాబాద్ లాసూర్ హోల్ సేల్ మార్కెట్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మార్కెట్ కు తెచ్చిన 450 కేజీల ఉల్లిపాయలను అమ్మగా... కేవలం 175 రూపాయలు మాత్రమే రావడం అక్కడి రైతును తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే ఎందుకా అని ఆశ్చర్యపోయేవాడినని, నిజంగా ప్రస్తుత ఉల్లి ధరలు చూస్తే.. ఏ రైతులైనా ఆత్మ హత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని... చిన్నతనంలో ఉల్లి పంటను పండించిన ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తాలూకా రైతు అంటున్నారు. అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్ మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర పలకడం రైతును నట్టేట ముంచింది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన నాసిక్ ఉల్లి మార్కెట్లో కూడ సరఫరాలో పెరుగుదలతో ధర తీవ్రంగా పడిపోయి, క్వింటాల్ కు 720 రూపాయలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలామంది రైతులకు తాము పండించిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేదని, ఎకరానికి 50 వేల నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు... మార్కెట్లో ధర పలకకపోవడంతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడ తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు కారణంగా చాలామంది చెరకు రైతులు కూడ ఈసారి ఉల్లిపంటను ఆశ్రయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం రైతులనుంచి ఉల్లి కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15,000 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసి, రైతులకు సాగులో సహాయపడతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు బిజేపీ ప్రాంతీయ ప్రతినిధులు చెప్తున్నారు. ఏది ఏమైనా డిమాండ్, సప్లైల్లో సమతుల్యత లేకపోవడమే ధర పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. -
నిశ్చింతగా ఉల్లి నిల్వ!
♦ ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో ఉల్లి నిల్వ ♦ మధ్యప్రదేశ్ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ.. పంట ఏదైనా రైతు చేతికొచ్చిన వెంటనే అమ్మేకంటే కొద్ది నెలలు నిల్వ చేసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఉల్లిపాయలు కూడా అంతే. అయితే, ఉల్లిపాయలను నిల్వ చేయడం చాలా కష్టతరమైన పని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనీసం 10 శాతం పాయలైనా కుళ్లిపోతుంటాయి. ఈ గడ్డు సమస్యకు ఓ ఉల్లి రైతే అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన రవి పటేల్ అనే ఓ మోతుబరి రైతు ఏటా టన్నులకొద్దీ ఉల్లిపాయలను పండిస్తుంటాడు. నిల్వ చేద్దామా అంటే.. ఫ్యాన్లు, కూలర్లతో గాలి తగిలే ఏర్పాటు చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా పాయలు కుళ్లిపోతున్నాయి. ఈ గడ్డు సమస్య నుంచి బయటపడేందుకు రవి బుర్రకు పదునుపెట్టాడు. అనేక విధాలుగా పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు. గదిలో ఆరబోసిన ఉల్లిపాయలకు, వాటి అడుగు నుంచి గాలి తగిలే విధంగా ప్రత్యేకంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాడు. నిల్వ నష్టాన్ని 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించగలిగాడు. ఇదే పద్ధతిలో గత రెండేళ్లుగా తన ఉల్లిపాయలకు పది రెట్ల ధర రాబట్టుకుంటున్నాడు! గదిలో నేల మీద అక్కడక్కడా 8 అంగుళాల మందాన ఇటుకలు పేర్చి.. ఆ ఇటుకలపై ఇనుప జాలీ (మెష్ వంటిది)ని పరిచి.. దానిపై ఉల్లిపాయలను ఆరబోస్తున్నాడు. ఇనుము లేదా ఫైబర్ ఖాళీ డ్రమ్ములను రెండు వైపులా కత్తిరించి గొట్టంలా మార్చి.. దాన్ని జాలీపైన నిలబెడుతున్నాడు. దానిపైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ను బిగిస్తున్నాడు (ఫొటో చూడండి). ఫ్యాన్ను ఆన్ చేసినప్పుడు నేలపైన ఇటుకలపై వేసిన జాలీ కింద ఖాళీలోకి గాలి వ్యాపిస్తుంది. ఉల్లిపాయలన్నిటికీ గాలి తగులుతూ ఉండటం వల్ల అవి కుళ్లిపోకుండా ఉంటున్నాయి. ఉల్లిపాయలు పోసిన ప్రతి వంద చదరపు అడుగులకు ఒక ఫ్యాన్ను అమర్చుతున్నాడు. పగలు గాలి వేడిగా ఉంటుంది కాబట్టి.. రాత్రి పూటంతా ఫ్యాన్లు వేసి ఉంచుతున్నాడు. గతంలో 10 శాతం ఉల్లిపాయలు కుళ్లిపోయేవని, ఈ ఫ్యాన్లు పెట్టిన తర్వాత నష్టం రెండు శాతానికి తగ్గిందని రవి పటేల్ చెప్పాడు. ఈ ఆవిష్కరణతో రవి పటేల్ జీవితమే మారిపోయింది. గత ఏడాది 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను ఇలాగే నిల్వ చేసి.. వర్షాకాలం తర్వాత కిలో రూ. 30కి అమ్మాడు. ఈ సంవత్సరం భారీ ప్రణాళికే వేశాడు. ఏకంగా 3 వేల క్వింటాళ్ల ఉల్లిని పండించి.. నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెయ్యి క్వింటాళ్లను ఇప్పటికే పొలాల నుంచి తరలించి గోదాముల్లో నిల్వ చేశాడు. మరో 2 వేల క్వింటాళ్లను తవ్వి పొలం నుంచి ఇంటికి తేవాల్సి ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట చేతికి రాగానే అమ్మితే కిలోకు రూ. 2 లేదా 3ల ధర మాత్రమే పలుకుతోంది. వానాకాలం దాటే వరకు నిల్వ చేస్తే కిలో రూ. 30 నుంచి 35 వరకు దక్కుతుంది. అందుకే చాలా రకాలుగా ప్రయత్నించి చివరకు ఈ పద్ధతిని కనుగొన్నానని రవి సంతోషంగా చెబుతున్నాడు. సులభమైన మార్గంలో ఉల్లి నిల్వ నష్టాలను తగ్గించే పద్ధతిని కనుగొన్న రైతు శాస్త్రవేత్త రవికి హేట్సాఫ్! - సాగుబడి డెస్క్ జూన్లో పాలేకర్ విస్తృత శిక్షణా శిబిరం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై తెలంగాణ ప్రాంత రైతులకు ఈ ఏడాది జూన్లో కనీసం 5 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామభారతి గౌరవాధ్యక్షులు, నాబార్డు రిటైర్డ్ సీజీఎం పి. మోహనయ్య తెలిపారు. మండలానికి ఐదుగురు రైతులను మాత్రమే ఎంపిక చేస్తారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహులు సుభాష్ పాలేకర్ స్వయంగా శిక్షణనిస్తారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటమే కాకుండా తోటి రైతులకు అవగాహన కల్పించి.. కార్యక్షేత్రంలో వారికి వచ్చే ఆటంకాలను తొలగించేందుకు అవసరమైన లోతైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా శిక్షణనిస్తారు. మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 12 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన రైతులు తమ పేరు, గ్రామం, మండలం, జిల్లా వంటి వివరాలను 94924 23875, 94404 17995, 90003 19345 నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలపవచ్చు. లేదా gramabharati@gmail.com, palusakarunakar@gmail.com, praveentalakanti@gmail.com కు ఈమెయిల్ ఇవ్వొచ్చు. 8న మామిడి, పత్తి, మిర్చి సాగుపై శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతునేస్తం ఫౌండేషన్ ఈనెల 8న మామిడి, పత్తి, మిర్చి, కూరగాయ పంటల సాగుపైరైతులకు శిక్షణ ఇస్తోంది. గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట రైతు శిక్షణ కేంద్రంలో అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు శిక్షణ ఇస్తారు. 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ధరాఘాతం
ఎకొండెక్కి కూర్చున్న నిత్యావసరాలు మధ్య తరగతికి బతుకు భారం వాచ్మేన్గా ఉంటూ, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తూ నెలకు వచ్చే ఐఆరు వేల ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పప్పులు గతంలో కేజీ రూ.100కి కొనేవాడ్ని. ఇప్పుడు రెండొందలయింది. ఉల్లిపాయలు వారానికి రెండు కిలోలు కొనేవాడ్ని. ఇప్పుడు కేజీతోనే సరిపెడ్తన్నాను. పెరిగిన రేట్లతో బతకడం కష్టమైపోతుంది. గతంలో పిల్లల్ని సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు పిల్లలు అడిగినా తీసుకెళ్లడం లేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నాం. నెలకు రెండు వేలు అదనంగా ఖర్చవుతోంది. ధరలు తగ్గించకపోతే పేదలు, మధ్యతరగతి వాళ్లు బతకలేరు. అక్కయ్యపాలెంకు చెందిన వాచ్మెన్ దాకమర్రి కృష్ణ ఆవేదన ఇది.. మార్కెట్లో ఒక్క నిత్యావసర సరుకు ధర పెరిగితేనే అమ్మో! అంటాం. అలాంటిది పాలు, నీళ్లు తప్ప అన్నీ కొండెక్కి కూర్చుంటే ఏం చేస్తాం? వాటిని కిందకు దించేందుకు ప్రయత్నించే వారే కరువైతే ఏం చేస్తాం? బతకడం కోసం చచ్చినట్టూ కొనుక్కు తింటాం. ప్రతి మధ్య తరగతి కుటుంబం కొన్ని నెలలుగా అదే చేస్తోంది. అరకొర ఆదాయంతో అతికష్టంపై పిల్లాపాపలతో బతుకు బండి లాగిస్తోంది. సాక్షి, విశాఖపట్నం విశాఖపట్నం: మూడు నెలల క్రితం కిలో ఉల్లిపాయలు రూ.80లకు చేరితే అంతా అల్లాడిపోయారు. అయ్యబాబోయ్.. ఎంత ధరో! అంటూ లబలబలాడారు. రైతుబజార్లలో సబ్సిడీ ధరకు కుళ్లిపోయిన ఉల్లిపాయలను విక్రయిస్తున్నారంటే కిలోమీటర్ల మేర గంటలకొద్దీ నిలబడి కొనుక్కున్నారు. ఓపికలేని వారు కిలోలకు బదులు పాయలతోనే సరిపెట్టుకున్నారు. ఆ వెంటనే కాయగూరల రేట్లూ శరవేగంగా పెరిగిపోయాయి. గతంలో కిలో రూ.10కి, 20కి దొరికిన సాదాసీదా కూరగాయలు కూడా కోరలు చాచాయి. అంతలోనే నిత్యం ఇంట్లో అవసరమయ్యే మినపపప్పు, కందిపప్పు ధరలు పోటాపోటీగా ఎగబాకాయి. రెండు నెలల వ్యవధిలో అవి రెట్టింపయ్యాయి. దీంతో ఉల్లిపాయలకంటే ఒక్కొక్కటీ భారమవడంతో ఉల్లి ప్రతాపాన్ని మరిచిపోయారు. మార్కెట్లో ఉల్లి సరఫరా కాస్త మెరుగవడంతో ప్రభుత్వం సబ్సిడీ కౌంటర్లను ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పటికీ ఉల్లి కిలో రూ.40లు దిగనంటోంది. రేషన్షాపుల్లో కిలో రూ.50కే ఇస్తామన్న కందిపప్పు జాడలేకుండా పోయింది. ఏం తినాలి? ఎలా బతకాలి? సంపన్నులకే భారంగా మారిన ప్రస్తుత నిత్యావసర సరకుల ధరలు సామాన్య, మధ్య తరగతి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అసలే అంతంతమాత్రపు బతుకులతో ఉన్న వారికి పిల్లాపాపలతో పూట గడవడం కష్టతరమవుతోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ ఇంట్లో సగటున నెలకు మూడు కిలోల మినపపప్పు, రెండు కిలోల కిందిపప్పు, ఐదు కిలోల ఉల్లిపాయలు, నాలుగు లీటర్ల వంటనూనె అవసరమవుతుంది. ఇలాంటి వారంతా ఇప్పుడు సగానికి పైగా వీటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. ఇంట్లో టిఫిన్ల జోలికివెళ్లడం లేదు. హోటళ్లకెళ్లి తిందామంటే అక్కడ సైజు తగ్గించి, ధరలు పెంచేశారు. దీంతో మినపపప్పుతో వండే వంటకాలకు బదులు బియ్యం, ముంబై రవ్వలతో ఏదొకటి వండుకు తింటున్నారు. గతంలో వారానికి రూ.100కే సంచి నిండిన కూరగాయలు ఇప్పుడు రూ.200లైనా నిండడం లేదు. రూ.50లుండే కేబుల్ బిల్లు రూ.200లు చేసేశారు. నిన్న మొన్నటిదాకా ఒకింత అందుబాటులో ఉన్న చికెన్ ధరలు కూడా మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల భారం ఒకో ఇంటిపై నెలకు 2-3 వేల భారం పడుతోందని అంచనా. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణే కష్టమవుతుంటే అదుపు తప్పిన ధరల భారాన్ని మోయలేకపోతున్నారు. తమ చిన్నారుల సినిమా, షికార్లు వంటి సరదాలూ తీర్చలేకపోతున్నారు. ఇంట్లో పిల్లలకు ఇష్టమైన పిండివంటలనూ వండిపెట్టలేకపోతున్నారు. ‘సర్దుకుపోండిరా నాన్నా’ అంటూ నచ్చజెప్పుకుంటున్నారు. అనుబంధాలు ఆవిరి.. ఆకాశంలో విహరిస్తున్న ధరలతో అయిన వారెవరైనా ఇంటికి వస్తున్నారంటే ఆందోళన చెందే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో చుట్టాలు, స్నేహితులను ఆప్యాయంగా రమ్మని పిలిచిన వారే ఇప్పుడు ఏదోలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ధరలు అనుబంధాలను ఎలా ఆవిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. బతకడం కానాకట్టం.. మాది పేద కుటంబం. ఆరెంపీ వైద్యం చేసే నా పెనిమిటి (భర్త) తెచ్చే రెక్కల కష్టంతోనే ఇల్లు కట్టంగా గడుత్తుంది. నెలంతా కట్టపడితే ఏడెనిమిది వేలు డబ్బుల్రావడం నేదు. ఈ గవుర్మెంటు అన్ని సరుకులు రేట్లు పెంచుతూ పోతంది. మాలాంటోల్లు ఎలా బతుకుతారో ఆలోసించడం నేదు. పప్పులూ ఉప్పులూ పెరిగిపోతనాయి. పది సదువుతున్న నా కొడుకు పీజు కట్టడానికే ఈతరమాతరం అవుతంది. గతంలో ఆరేడు వేలతో నెట్టుకొచ్చేవోల్లం. ఇప్పుడు నెల నెలా రెండుమూడు వేలు అప్పుల్జేయాల్సి వస్తోంది. ధరలు తగ్గకపోతే మాలాంటో బతకడం కానాకట్టమే. -వరలక్ష్మి, గృహిణి, అశోక్నగర్ ఈ ధరలెప్పుడూ చూడలేదు.. ఇలాంటి ధరలు ముందెప్పుడూ చూడలేదు. ఇంటిల్లపాదికి ఎంత తక్కువలో చూసుకున్నా నాలుగైదు కేజీల కంది పప్పు, మినపప్పు అవసరం. నిత్యాసవర సరుకుల్లో వెయ్యి రూపాయలు కంది, మినపకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంపై ఆర్ధిక భారం పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ధరలు పెరగడంతో ఆకుకూరలు తినడం మానేసాం. పప్పు ఉంటేగాని ఆకుకూరలు వండుకోలేం. నాణ్యమైన పప్పులను రేషన్షాపుల ద్వారా ఇవ్వాలి. - కె.మహాలక్ష్మి, చిన్నూరు, అక్కయ్యపాలెం. అమ్మకాలు పడిపోయాయి.. ధరలు పెరగడం వల్ల అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. కేజీ కొనేవారు అరకేజీయే కొంటున్నారు. మాకు పెట్టుబడులు పెరిగాయి. టిఫిన్లకు మినపపప్పు, పెసరపప్పులకు బదులు బియ్యం పిండిని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ధరలు తగ్గితేనే గాని అమ్మకాలు పెరగవు. లాభాలు రావు. -రేపాక రామకృష్ణ, కిరాణా షాపు. -
ఉల్లి కోసం ఎదురుచూపులు
సారవకోట(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూ.20కే కిలో ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళలు బారులు తీరారు. రేషన్ కార్డులు పట్టుకుని, ఎండలోనే గంటలకొద్దీ ఎదురు చూశారు. గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం
విజయనగరం: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలుతున్న ఉల్లి బయటపడింది. జిల్లాలోని సాలూరు పట్టణం వద్ద అధికారులు తనిఖాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల ఉల్లిపాయలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపించక పోవడంతో వాహనం సీజ్ చేసి స్థానిక తహశీల్దార్కు అప్పగించారు. -
‘ఉల్లి’తో తీరనున్న తగువు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ లొల్లిని త్వరలో ఉల్లి తీర్చబోతుందట. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీర్చలేని రెండు రాష్ట్రాల తగువును ఉల్లి ఎలా తీరుస్తుందనుకుంటున్నారా...! రెండు రాష్ట్రాల నడుమ ప్రధాన తకరారు అయిన ఎంట్రీ ట్యాక్స్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి రానుందట. ఇరు రాష్ట్రాలు ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై కౌంటర్ సిగ్నేచర్ ఒప్పందం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయట. తకరారు పరిష్కారానికి అసలు కారణం ఉల్లి కొరతేనని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి ఉల్లి కోసం లారీలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి లారీలు వెళుతున్నాయి. సరిహద్దు దాటేందుకు తెలంగాణ లారీలు ఏపీ రవాణా శాఖకు రూ.6 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం ఉల్లి వినియోగదారులపై మోపుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఎంట్రీ ట్యాక్స్ విషయంలో కౌంటర్ సిగ్నేచర్ విధానం పాటిద్దామని ప్రతిపాదించింది. ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే ఎంట్రీ ట్యాక్స్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్రానికి, గవర్నర్కు ఫిర్యాదులు చేసినా లాభం లేని లొల్లి ఉల్లితో తీరబోతోంది. ప్రభుత్వాలు పడగొట్టిన చరిత్ర ఉన్న ఉల్లికి ప్రభుత్వాల్ని కలిపే శక్తి కూడా ఉందన్న మాట. రెండు రాష్ట్రాలు అవగాహనతో ముందుకెళితే అక్టోబర్ నుంచి రెండు రాష్ట్రాల ప్రధాన వివాదం ఎంట్రీ ట్యాక్స్ కొలిక్కి వస్తుంది. -
హోటల్లో ఉల్లిగడ్డల చోరీ
కాటేదాన్ : ఉల్లి బంగారమైంది...ధర చుక్కలను తాకడంతో ఉల్లి గడ్డల చోరీలు కూడా జరుతున్నాయి. హోటల్లో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులను పక్కనపెట్టి ఉల్లిగడ్డ సంచిని ఎత్తుకెళ్లిన ఘటన కాటేదాన్ పారిశ్రామికవాడలో జరిగింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాలు... కాటేదాన్ పారిశ్రామికవాడలోని రవిఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బాలప్ప అనే వ్యక్తి గుడిసె ఏర్పాటు చేసి హాటల్ నిర్విహ స్తున్నాడు. సోమవారం హోటల్ను మూసివెళ్లిన తర్వాత అర్ధరాత్రి దొంగలు తలుపులు పగులగొట్టి హోటల్లోకి చొరబడ్డారు. హోటల్లో టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ వంటి విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు వాటిని పట్టుకెళ్లకుండా అక్కడ ఉన్న 40 కిలోల ఉల్లిగడ్డ సంచిని, రూ.7 వేల నగుదును ఎత్తుకెళ్లారు. ఉదయం హోటల్కు వచ్చిన బాలప్ప ఈ విషయం గమనించి స్థానికులకు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఉల్లిగడ్డ ధర మార్కెట్లో ఆకాశాన్నంటడంతో ఉల్లి దొంగతనం ఆసక్తిగా మారింది. -
ఉల్లి కోసం కుళ్లబొడిచారు సార్
కర్నూలు : అభంశుభం తెలియని తమను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులు కుళ్లబొడిచేస్తున్నారంటూ నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇటీవల ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో లారీలోని 15 టన్నుల ఉల్లిపాయలు స్థానిక చెంచులు తీసుకువెళ్లారని డ్రైవర్ ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన 15 మంది చెంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి...చిత్రహింసలకు గురి చేశారు. తమ వారిని విడిచిపెట్టలేదని కోపంతో ఉన్న చెంచులు శుక్రవారం భారీగా పోలీస్ స్టేషన్కి తరలి వచ్చారు. దీంతో 15 మందిని విడిచిపెట్టారు. పోలీసుల వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తిని కలిశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి తమను పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. తాము ఉల్లిగడ్డలు చోరీ చేయలేదని... వాటి గురించే అసలు తమకు తెలియదని వారు పేర్కొన్నారు. ఉల్లిగడ్డల చోరీ కేసుతో చెంచులకు సంబంధం లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పినా పోలీసులు పట్టించుకోకుండా తమ వారిని కుళ్లపొడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేట్ సైన్యం మధ్య ఉల్లి తల్లి
పుణె : ఉల్లి చేసే తమాషాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న దేశంలో ఉల్లి మాఫీయా పెరుగుతుందని పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ భావించింది. అంతే అనుకున్నదే తడవుగా దేశ సరిహద్దుల వెంట పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. అలాగే నేడు మహారాష్ట్రలోని చించ్వాడ్లోని పింప్రి మార్కెట్లో ఉల్లిపాయల రక్షణకు సాయుధ భద్రత సిబ్బందిని నియమించుకునేలా చేసింది. పింప్రీ - చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్లో కొన్ని రోజుల కిందట సుమారు 400 కిలోల ఉల్లి చోరీకి గురైంది. ఆ క్రమంలో ఉల్లి వ్యాపారులపై సదరు దొంగలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం వారి ఫిర్యాదుపై కనీసం స్పందించలేదు. పోలీసులు తీరు చూసిన సదరు వ్యాపారులు మార్కెట్లోని ఉల్లి తల్లిని మనమే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సొంత ఖర్చులతో ఆయుధాలతో కూడిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. -
స్కూల్లో ఉల్లి దానం!
గచ్చిబౌలి (రంగారెడ్డి) : ఇప్పటివరకు అన్నదానం, వస్త్రదానం లాంటివి చాలా చూశాం, చేశాం. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఉల్లి దానం! ఉల్లి ధర కొండెక్కి కూర్చున్న తరుణంలో ఓ స్కూల్ యాజమాన్యం కాలనీ వాసులకు ఉచితంగా ఉల్లిగడ్డలు పంపిణీ చేసింది. గచ్చిబౌలిలోని సన్షైన్ ప్రీ స్కూల్ యాజమాన్యం జీపీఆర్ఏ క్వార్టర్స్లో మంగళవారం చిన్నారుల తల్లిదండ్రులకు ఉచితంగా ఉల్లిగడ్డలు పంపిణీ చేసింది. మొత్తం 256 కిలోలు ఉచితంగా పంపిణీ చేసినట్లు సన్షైన్ కార్పొరేట్ అడ్మిన్ మేనేజర్ నాగరాజు తెలిపారు. నగరంలో తమ స్కూల్కు 25 బ్రాంచ్లు ఉన్నాయని, ప్రతిచోటా ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దాతృత్వం.. చక్కటి ప్రచారం.. అంతా ఉల్లి చలవే. ఉల్లిచేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఈ రకంగా కూడా ఉల్లి ఉభయులకూ మేలు చేస్తోందన్న మాట!! -
ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు
జైపూర్ : నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, పప్పులు ధరలు రోజురోజుకు రాకెట్ స్పీడ్తో ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ధరలను మాత్రం నియంత్రించలేకపోతుంది. కానీ వాటి ధర ఎంత పెరిగినా లెక్కచేయకుండా కొంగు బంగారంగా కొలిచే ఆ దేవుళ్లకు మాత్రం భక్తులు తమ భక్తి ప్రపత్తులతో ఉల్లిపాయలు, పప్పులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆచారం రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లా గోమేధి గ్రామంలో కొలువు తీరిన గొగాజీ, గురు గోరఖ్నాథ్ దేవాలయాల్లో ఆచారంగా కొనసాగుతుంది. అదీ ఒక్క భాద్రపథమాసంలోనే భక్తులు ఇలా దేవుళ్లకి సమర్పిస్తారని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ మాసంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ నుంచి దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ దేవుళ్లను దర్శించుకుంటారని చెప్పారు. పావు కేజీ ఉల్లిపాయలు, పప్పులు చెల్లించి తమ కోర్కెలు తీర్చమని భక్తులు కోరతారని తెలిపారు. ఈ ఒక్క మాసంలో దాదాపు 50 నుంచి 70 క్వింటాళ్ల ఉల్లిపాయలు దేవుడికి భక్తులు కానుకగా సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అయితే అలా వచ్చిన ఉల్లిపాయలను మార్కెట్లో విక్రయించి.. వచ్చిన నగదు గురు గోరఖ్నాథ్ దేవాలయం నిర్వహణతోపాటు గోశాలలోని గోవులకు ఆహారం సమకూరుస్తామని తెలిపారు. -
కొనకనే కన్నీళ్లు
- కిలో రూ.70లకు చేరిన ఉల్లిపాయలు - తగ్గిన సాగుబడి - ఆందోళన పుట్టిస్తున్న ధరలు - రేషన్కార్డు ఉంటేనే ఉల్లిగడ్డలు - ఇదేమి చోద్యమంటున్న వినియోగదారులు కడప అగ్రికల్చర్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. అలాంటి ఉల్లి ఇప్పుడు వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిపంట సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉల్లిధరలు అదుపు తప్పాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షం జాడలేకపోవడం, అరకొరగా ఉన్న భూగర్భజలాలు అడుగంటిపోవడం, బోరుబావులు ఎండిపోతుండడం, దీనికి తోడు కరెంటు కోతలతో రైతులు బోరుబావుల కింద ఉల్లి పంట సాగు చేయాలంటే జంకుతున్నారు. దీంతో ప్రతి నెలా ధరలు పెరుగుతూ పోతున్నాయి. జూన్, జూలై నెలలో రూ.14-15లు ఉన్న కిలో ఉల్లి ధరలు, ఆగస్టు ఆరంభం నుంచి ఆ ధర కాస్త రూ. 18-20లకు చేరి క్రమంగా ఎగబాకుతూ పోతోంది. మార్కెట్లో రోజు రోజుకు రూ.5,10 చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ధర కడప పెద్దమార్కెట్లో రూ. 60-70 మధ్య పలుకుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి మార్కెట్లలో అయితే కిలో రూ.70-80 మధ్య వ్యాపారులు విక్రయిస్తున్నారు. నిన్న ఆధార్ కార్డన్నారు... నేడు రేషన్కార్డు ఉంటేనే ఉల్లిగడ్డలంటున్నారు జిల్లా యంత్రాంగం ఆదేశాలతో మార్కెటింగ్, జిల్లా పౌరసరఫరాలశాఖలు సంయుక్తంగా కడప రైతుబజారులోను, జిల్లాలోని రాజంపేట, బద్వేలు, కమలాపురం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్యార్డుల్లో ఉల్లిగడ్డల విక్రయాలను చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్కార్డులను తప్పనిసరిచేసి అన్ని పథకాలకు ఆధార్ తప్పని సరి అని చెబుతూ ఇప్పుడేమో రేషన్కార్డు ఉంటేనే ఉల్లిపాయలు ఇస్తామని చెప్పడం ఇదెక్కడి చోద్యమని కార్డులు లేని నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి దిగుబడుల కోసం మార్కెట్ అధికారుల వెంపర్లాట : ఉల్లిపాయల ధరలు రోజు రోజుకు ఎగబాకుతుంటే ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు రావడంతో ఉల్లిపంట జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో అధికంగా పండిస్తారో ఆయా గ్రామాల రైతులను కలుసుకుంటూ ఎక్కడ ఉల్లిపంట ఉన్నా మార్కెట్యార్డుకు తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే రైతు బజారులో ఉంచి అమ్మకాలు చేయిస్తున్నారు. అరకొర సాగు : ఈసారి ఎల్నినోతో వర్షాలు సంపూర్తిగా కురవ వని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ఉల్లిపంటసాగుకు రైతులు ముందుకు రావడ ం లేదు. ప్రధానంగా పెండ్లిమర్రి, వేంపల్లె, వేముల, పులివెందుల, ముద్దనూరు. వీరపునాయునిపల్లె, కడప, సిద్ధవటం, చింతకొమ్మదిన్నె, బి.మఠం, మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, రాజుపాలెం, దువ్వూరు మండలాల్లో అధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువగాను మొత్తం కలిపి దాదాపు 12,500 ఎకరాల్లో ఉల్లిపంటను ఏటా సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 1400 ఎకరాల్లో కూడా పంట సాగుకు నోచుకోలేదు. దిగుమతులు కూడా తక్కువే....: డిమాండ్కు తగ్గట్లు స్థానికంగా పంట లేకపోవడంతో జిల్లా వ్యాపారులు కొందరు మహరాష్ట్ర, బళ్లారి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా అక్కడ కూడా పంటలేదని వ్యాపారులు అంటున్నారు. ఈ ధరలు మరింతగా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారులు కొందరు జిల్లాలోని అరకొర పంటను అప్పుడే రహస్య గోదాముల్లో అక్రమంగా నిల్వ చేశారని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో గతంలో ఒకటి రెండు కిలోల ఉల్లిగడ్డలను కొనుగోలు చేసే వినియోగాదారులు ఇప్పుడు అరకిలో, పావుకిలో కొనుగోలుతో సరిపెట్టుకుంటున్నారు. రేషన్కార్డులు అంటే ఎట్లా.. రేషన్షాపుల్లో సరుకులకు మాత్రమే ఉపయోగించుకునే రేషన్కార్డును ఇలా ఉల్లిపాయలకు వినియోగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉల్లిగడ్డలకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్కార్డు తీసుకురావాలన్నారు. నేడేమో దాన్ని పక్కనబెట్టి రేషన్కార్డు తీసుకురమ్మనడం ఎంతవరకు సమంజసం. - విజయలక్ష్మీ, గృహిణి,మత్యుంజయకుంట, కడప నగరం అందరికి కార్డులు ఉండాలి కదా...: రేషన్కార్డుల కోసం చాలామంది దర ఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు కార్డులు రాలేదు. అన్నింటికి ఆధార్కార్డులే ముఖ్యమని, ఇప్పుడు మళ్లీ రేషన్కార్డులు తప్పని సరిగా తీసుకురావాలని చెప్పడం దారుణం. - తస్లీమా,నకాష్, గృహిణి, కడప నగరం -
నమ్మాలి... ఉచితంగా ఉల్లి
వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘ఉల్లి లొల్లి’ అంతా ఇంతాకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి తల్లిని ఉచితంగా ఇస్తున్నారంటే ఎవరా ధర్మాత్ములు అంటారు. ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వం రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల కౌంటర్లు తెరిచింది. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా వరుసలో నిలుచున్నా సరుకు దొరకని పరిస్థితి. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయద’న్న సామెతను గుర్తెరిగారో యేమో.. అమీర్పేట్ లీలానగర్లో గల సన్షైన్ ప్రి స్కూల్ యాజమాన్యం స్కూల్లో ప్రత్యేక ఉల్లి శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు పిల్లలకు తలో కిలో చొప్పున మొత్తం 154 కిలోలు ఉల్లిపాయలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న చిన్నారులు తమ తల్లిదండ్రులతో వచ్చి వీటిని తీసుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలు గురించి తెలుసు.. ఉచిత రక్తదాన శిబిరాల గురించి విన్నాం. ఇప్పుడు ఉచిత ఉల్లి శిబిరాల వంతు వచ్చింది. - సనత్నగర్ -
సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ!
ఏంటీ అవాక్కయ్యారా..గంటల తరబడి కిలో ఉల్లిపాయల కోసం పడిగాపులు కాస్తుంటే ఉచితంగా ఉల్లి ఏంటని ఆలోచిస్తున్నారా..నమ్మలేకపోతున్నారా..అయితే మీరు పెందుర్తి రావలసిందే..వినియోగదారులను ఆకట్టుకునేందుకు సాదారణంగా బంగారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, వెండి, తగ్గింపు ధరలు పెడుతుంటారు. ఆ జాబితాలోకి తాజాగా ఉల్లి కూడా చేరింది. ఉల్లి డిమాండ్ను ‘క్యాష్’ చేసుకునేందుకు సెల్ఫోన్ దుకాణదారులు ఉచిత ఉల్లి ఆఫర్తో రంగంలోకి దిగారు. రూ.20కి సిమ్కార్డు కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇచ్చారు. పెందుర్తిలో శుక్రవారం ఈ వ్యాపారం మూడు సిమ్లు ఆరు ఉల్లిపాయల్లా చక్కగా సాగిపోయింది. - పెందుర్తి -
‘బాబు’ పాలనలో బువ్వా బరువే
అమలాపురం టౌన్:చంద్రబాబు పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు రెండు పూటలా సంతృప్తిగా భోజనం చేయలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉల్లి పాయల రేటు అందుబాటులో లేకుండా పోవడంపై ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ శ్రేణులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హైస్కూలు సెంటర్లోని మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు ఉల్లి దండలు మెడలో వేసుకుని, రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను స్తంభింపచేశారు. అధిక ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశ్వరూప్, చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి పాయలు సరఫరా చేస్తూ రూ.50 కోట్ల భారాన్ని భరిస్తున్నట్టు చెబుతున్న మాటలు బూటకమని ఆరోపించారు. ఉల్లిని అరకొరగా రైతుబజార్లకు సరఫరా చేస్తున్నా అందులో కొంత బ్లాక్ మార్కెట్కు తరలించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారన్నారు. కూరగాయల ధరలనే కాక పప్పుల ధరల్ని కూడా ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ధ్వజమెత్తారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మోకా వీరరాఘవులు, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణలాల్, సుంకర సుధ, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మట్టపర్తి నాగేంద్ర, ఉండ్రు వెంకటేశ్, రూరల్ మండల కార్యదర్శి సూదా గణపతి, పట్టణ పార్టీ మహిళాధ్యక్షురాలు కొల్లాటి దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి.. నీకు దండమే
స్టాకు పెంచుతున్నా తప్పని తిప్పలు బారులు తీరుతున్న ప్రజలు నేటి నుంచి మరిన్ని కౌంటర్లు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే సరఫరా తెల్లారితేచాలు..ఉల్లి కష్టాలు మొదలవుతున్నాయి. మార్కెట్లో చుక్కలను తాకిన పాయలను అందుకోలేక సామాన్య మధ్యతరగతి వర్గాలు రైతుబజారు బాట పడుతున్నారు. తీరా వెళ్లేసరికి చాంతాడంత క్యూ దర్శనమిస్తోంది. ఎక్కడ ఉల్లిపాయలు నోస్టాక్ బోర్డు పెట్టేస్తారేమోననే భయంతో తోపులాట..ఈ లైన్లలో ఎదురవుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎండయినా..వానయినా అడుగు కదలకుండా నిలబడుతున్నారు. తమవరకూ ఉల్లి వస్తుందా రాదా అని క్షణమొక యుగంగా లైన్లో ఎదురుచూస్తున్నారు. నిత్యం రైతు బజార్లలో ఇదే పరిస్థితి..రేపూ మారుతుందని నమ్మకం లేదు. విశాఖపట్నం: ఉల్లికష్టాలు ఇప్పట్లో తీరేటట్టు కన్పించడం లేదు. రోజురోజుకు ఉల్లి పాట్లు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డిమాండ్ తగ్గ సరుకులేకపోవడంతో ఉల్లిపాయ కూడా దొరకడం గగనంగా మారింది. ఇదే సమయంలో ఉల్లిదొంగతనాలు జోరందుకుంటున్నాయి. మరొకపక్క తార్మార్ తక్కెడ మార్ అంటూ తూకాల్లో మోసాలు ఎక్కువయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు ఏ మాత్రం సత్ప లితాలనివ్వడంలేదు. రైతుబజార్లలోనే హోల్సేల్, రిటైల్మార్కెట్లలో సైతం బోర్డుల్లో అధికారులు నిర్ధేశించిన ధరల కంటే కనీసం 20శాతం అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతవాసులకు ఉల్లిపాయ చూద్దామంటే కన్పించని పరిస్థితి నెలకొంది.విశాఖపరిసర ప్రాంతాల్లో ఉన్న 12 రైతు బజార్లలో ఇప్పటి వరకు అధికారికలెక్కల ప్రకారం 9562.20 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల విక్ర యాలు జరిగాయి. వీటిలో కనీసం 20 శాతం పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇప్పటివ రకు రైతుబజార్ల ద్వారా రోజుకు 30నుంచి 40 మెట్రిక్ టన్నుల ఉల్లివిక్రయాలు జరుగుతుండగా నేటి నుంచి స్టాక్ను పెంచుతున్నారు. ఇవన్నీ రికార్డులకే పరిమితమవుతున్నాయి తప్ప వాస్తవానికి ఆ స్థాయిలో అమ్మకాలు జరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. బుధవారం కంచరపాలెం రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏర్పాట్లు ఇలా చేస్తే ఎలా అంటూ నిల దీశారు. బుధవారం రాత్రికి కర్నూలు నుంచి 60 ఎంటీల దిగుబడి చేయిస్తున్నారు. గురువారం 11 రైతుబజార్లకు అదనంగా నగరంలోని సూపర్బజార్తో పాటు తగరపువలసలోని ఫుట్బాల్గ్రౌండ్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీల్ప్లాంట్లోని రైతుబజార్లో మాత్రం గురువారంవిక్రయాలను నిలిపి వేశారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను రెట్టింపు చేస్తున్నారు. తోపులాటలు జరగకుండా ఉండేందుకు దాదాపు అన్ని రైతుబజార్లలో ప్రత్యేకంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే స్టాక్ను కూడా పెంచుతున్నారు. రద్దీ పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా ప్రతీ ఒక్కరికి ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు తెల్లకార్డుపై కిలో ఉల్లి పాయలు మాత్రమే ఇస్తుండగా..నేటి నుంచి రెండుకిలోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసారు.అలాగే కౌంటర్ల వద్ద మంచీనీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉల్లి పాట్లు
విశాఖపట్నం : రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు. దాంతో మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత కష్టపడి ఉల్లిపాయలు పొందాల్సి వస్తోందని పలువురు మహిళలు వాపోయారు. -
ఉల్లి కోసం ఆగని పోరాటం
చిత్తూరు: ఉల్లి గడ్డల కోసం జనం సాగిస్తున్న పోరాటాలను అడ్డుకోలేక పోలీసులు చేష్టలుడిగి చూస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు నగరంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన రూ.20 కే కిలో ఉల్లి విక్రయకేంద్రం వద్ద పరిస్థితే ఇందుకు నిదర్శనం. బుధవారం ఉదయం 5 గంటలకే రైతు బజార్ కు జనం క్యూకట్టారు. దాదాపు 1700 మంది తరలిరాగా తోపులాట మొదలైంది. కానీ, బందోబస్తు కోసం అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. వారు అంతమంది జనాన్ని అదుపులోకి తేలేక చేతులెత్తేశారు. ఉదయం 8.30 గంటలకు జనం తోపులాటలు, అరుపులు కేకలతో రైతు బజార్ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రూ.20 కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గలేదు. నగరంలోని 8 విక్రయ కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచే క్యూలు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి రూ.70 వరకు పలుకుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారిని నియంత్రించేందుకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉల్లిపాయల కోసం ఘర్షణ
ఎంవీపీ కాలనీ: ఉల్లి అగ్గి రాజేస్తోంది. కేజీ ఉల్లిపాయల కోసం ఘర్షణకు దిగే పరిస్థితి వచ్చింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్లో మంగళవారం వినియోగదారులు ఉల్లిపాయల కోసం రైతు బజార్ ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావును కొట్టినంత పని చేశారు. మంగళవారం నుంచి ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను సరఫరా చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో సుమారు వెయ్యి మంది వినియోగదారులు రైతు బజార్కు తరలివచ్చారు. అదే సమయంలో 20 బస్తాల ఉల్లిపాయల సరుకు మాత్రమే రైత్ బజార్కు వచ్చింది. ఉదయం కౌంటర్ తెరచిన కొద్దిసేపటికే స్టాక్ అయిపోయింది. దీంతో వినియోగదారుల్లో ఉల్లి చిచ్చు రాజుకుంది. తగినంత సరుకు లేకుండా ఏం చేస్తున్నారంటూ కొందరు ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావుపై మండిపడ్డారు. కొందరు కొట్టేందుకు ముందుకు రాగా, ఆయన అక్కడ నుంచి జారుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. -
బతుకు భారం
-
అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు
విజయనగరం : అమ్మా.. ఉల్లి తల్లమ్మా.. మామీద కనికరం చూపమ్మా...అంటూ మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సాలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా ఈ విధంగా తమ ఆందోళన తెలిపారు. ప్రభుత్వాల చేతగానితనం వల్లే ఉల్లి ధరలు ఆకాశనంటాయని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళలు గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఉల్లి గడ్డల ధరలను నియంత్రించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు. -
బతుకు భారం
ధరల పిడుగుతో సామాన్యుడు సతమతం నిత్యావసర ధరలు ఘోరం ఉల్లి ఆల్టైం రికారు ్డధర పట్టించుకోని ప్రభుత్వం ఉల్లిపాయలు, టమాటాలు తదితర కూరగాయలే కాదు.. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు ధరల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అంతేనా? బియ్యం, నూనెల రేట్లూ పరుగులు తీస్తున్నాయి. ఇలా ఒకటేమిటి జనం తినడానికి అవసరమైన సరకులన్నీ పోటీ పడుతున్నాయి. సామాన్యుడిపై ధరలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. నిత్యం అవసరాలైన వీటిని కొనలేక, తినకుండా ఉండలేక నానా అగచాట్లు పడుతున్నాడు. బతుకు బండిని భారంగా లాక్కొస్తున్నాడు. ఇంటి బడ్జెట్ను సర్దుబాటు చేయలేక గృహిణి ఆవేదన చెందుతోంది. ధరలను నియంత్రించాల్సిన సర్కారు చోద్యం చూస్తోందంటూ ప్రతి ఇంటి ఇల్లాలూ మండిపడుతోంది. విశాఖపట్నం:కొన్నాళ్లుగా అన్ని సరకులూ పెరగడమే తప్ప తగ్గడం లేదు. పప్పులు ధర పెరిగిందని కూరగాయల వైపు మళ్లితే వాటిదీ అదే దారి. కాయగూరలు కొండెక్కాయని చికెన్, మటన్, పప్పుల వైపు వెళ్లినా అవీ అలాగే ఉన్నాయి. వేటికవే ధరల్లో రికార్డులు సృష్టిస్తూ సామాన్యుడిని పిండేస్తున్నాయి. విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ కిలో ఉల్లి రూ.80ల వరకూ పెరిగి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. రైతుబజార్లలో రూ.20లకే దొరుకుతుందని ఆశగా వెళ్లిన వారికి రోజంతా క్యూలో నిలబడితే అక్కడ అదృష్టవంతులనే ఉల్లి వరిస్తోంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే తుళ్లిపడే పరిస్థితి తలెత్తింది. అరకొర ఉల్లితోనే కూర పూర్తవుతోంది. కందిపప్పు కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. కిలో 120కు పెరిగితేనే విలవిల్లాడిన వారికిప్పుడది కిలో రూ.150లకు చేరుకుంది. పెసరపప్పు రూ.140లకు పెరిగింది. వేరుశనగపలుకుల ధర రూ.100లు పలుకుతోంది. తాజాగా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్కు రూ.4-5లు, 15 కిలోల డబ్బాపై రూ.50ల దాకా పెరిగింది. బియ్యం ధరలు పక్షం రోజుల నుంచి ఊపందుకున్నాయి. వరి దిగుబడి తగ్గిందన్న కారణంతో క్వింటాలుకు కనిష్టంగా రూ.400లు, 25 కిలోల బ్యాగుపై రూ. 100ల పెరిగాయి. ఇలా ఓ మధ్య తరగతి ఇంట్లో నెలకు సగటున రూ. 2 వేల వరకూ అదనంగా భారం పడుతోంది. నిత్యావసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఎంతలా ఖర్చు తగ్గించుకుందామన్నా వీల్లేని, విధిలేని పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోని ఇల్లాలూ అల్లాడిపోతోంది. అన్ని బారులూ ఉల్లికే కంచరపాలెం: కంచరపాలెం సమీపంలో రైతుబజారులో సోమవారం ఉల్లి కోసం బారులు తీరి కనిపించా రు. పిల్లాపాపంతో ఉదయం వేకువ జామునుంచి క్యూలు కడుతున్నారు. అమ్మకాలు ప్రారంభం అయిన గంటలోపే మహిళలు సిగపట్లు ప్రారంభించారు. ఉల్లిపాయాలు అయిపోతున్నాయని వార్తా క్యూలో నిలబడిన మహిళల చెవిలో పడింది. దీంతో తోపులాటలు మొదలయ్యాయి . ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు మహిళలు క్యూలో నలిగిపోయారు. దొంగలు సెల్ఫోన్లు, పరసలు తదితర వస్తువులను కాజేశారు. సబ్సీడీ ఉల్లిపాయలను రైతుబజారులకు కా కుండా చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేస్తే బాగుంటుదని మహిళలు సూచిస్తున్నారు. -
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
-
ఉల్లి చోరీ
ముంబైలో 700 కిలోల ఉల్లి దొంగతనం సాక్షి, ముంబై: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలియుగాంతం వచ్చేసిందా.. అంటే అవుననిపిస్తోంది. సొత్తు, డబ్బు దొంగతనం జరగడం సర్వసాధారణం. కానీ ఎన్నడూ కనీ.. వినీ ఎరగని రీతిలో ఉల్లి దొంగతనం జరిగింది. ‘న భూతో’ అన్నది నిజమే కానీ ‘న భవిష్యతి’ అని అనలేని పరిస్థితి. ఎందుకంటే రోజురోజుకీ ధర పెరుగుతూ ఎవరెస్టంత పెకైక్కి కూర్చున్న ఉల్లి.. సామాన్య మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు ఇంకిపోయేలా చేస్తోంది మరి. కొద్ది రోజులుగా ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో దొంగల కన్ను వాటిపై పడింది. సైన్ ప్రతీక్షనగర్లోని ఓ షాపులో నిల్వ ఉంచిన 700 కేజీల బంగారాన్ని.. సారీ ఉల్లిని దొంగిలించారు మహానుభావులు. ముంబై వడాలాలోని ట్రక్ టర్మినస్ పోలీసు స్టేషన్కు ఆనంద్ నాయక్ అనే ఉల్లి వ్యాపారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘నా షాపులో దొంగలు పడ్డారు, దొంగలు పడ్డార’ంటూ కేకలు వేయసాగాడు. ఏవైనా బంగారు, వెండి వంటి విలువైన వస్తువులు దోచుకుపోయి ఉండొచ్చని తొలుత పోలీసులు అనుకున్నారు. తన షాపులో నిల్వ చేసిన 700 కిలోల ఉల్లి చోరీకి గురైందని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షాపులో సీసీ టీవీ కెమెరాలున్నాయా, అని వ్యాపారిని ప్రశ్నించారు. ‘మాదేమైనా నగల దుకాణమా? సీసీ కెమెరాలు పెట్టడానికి’ అంటూ ఆనంద్ నాయక్ ఎదురు ప్రశ్నించాడు. షాపులో దొంగలు పడతారని కలలో కూడా ఊహించలేదని వాపోయాడు. శని వారం ఉదయం షాపు తెరిచి చూస్తే సరుకంతా మా యమైందని, 14 బస్తాల ఉల్లి దాదాపు 700 కిలోలు ఉంటుందని, విలువ రూ.50 వేల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అతడి బాధంతా విన్న పోలీసులు చేసేది లేక.. ‘దొంగల కన్ను ఉల్లి షాపులపై పడింది. ఉల్లి వ్యాపారులూ.. అప్రమత్తంగా ఉండండి’ అని ఓ ఉచిత సలహా ఇచ్చి పంపించారు. -
పోలీసు పహారాలో ఉల్లి విక్రయాలు!
⇒ రైతుబజార్ కౌంటర్ల వద్ద పోలీసు భద్రత ⇒ సబ్సిడీ ఉల్లికి పోటెత్తుతున్న ⇒ వినియోగదారులు సిబ్బందిపై దాడులతో ⇒ మార్కెటింగ్ శాఖ జాగ్రత్తలు ⇒సబ్సిడీ ఉల్లికి ఐడీ ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉల్లి కల్లోలం సృష్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో వినియోగదారులు సబ్సిడీ ఉల్లి కోసం రైతుబజార్లకు పోటెత్తుతున్నారు. దీంతో రైతుబజార్లలో ఉల్లి కౌంటర్ల వద్ద రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల పరిస్థితి ఘర్షణ వాతావరణాన్ని తలపిస్తోంది. నిర్ణీత సమయం ముగిశాక రైతుబజార్ సిబ్బంది కౌంటర్ మూసివేస్తుండటంతో.. గంటల తరబడి క్యూలో నిలబడ్డ వినియోగదారులు ఆవేశానికి లోనై దాడులకు దిగుతున్నారు. శనివారం ఎర్రగడ్డ రైతుబజార్లో జనం దాడులకు దిగడంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదివారం నుంచి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. గ్రేటర్లోని అన్ని రైతుబజార్లలో ఆదివారం ఉదయం నుంచే సబ్సిడీ కౌంటర్ల వద్ద మోహరించిన పోలీసులు.. విక్రయాలు సాఫీగా సాగేలా భద్రతా చర్యలు చేపట్టారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చే సి సబ్సిడీ ఉల్లిని అందించారు. ఏడు గంటల నుంచే క్యూ లైన్లు నగరంలోని 9 రైతుబజార్లలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే ఉదయం 7కే వినియోగదారులు రైతుబజార్కు చేరుకుంటున్నారు. సెలవు రోజైన ఆదివారం రద్దీ పెరగడంతో ఎర్రగ డ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం, సరూర్నగర్ రైతుబజార్లలో రాత్రి 8.30 వరకు విక్రయాలు సాగించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతుబజార్ల ద్వారా ఆదివారం 70 టన్నుల ఉల్లిని వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని హోల్సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.57(మోడల్ ప్రైస్) కనీస ధర పలకడంతో ఆదివారం నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.60-65 ధర పలికింది. ఇదే సరుకును రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కేజీ రూ.70-80 వసూలు చేస్తున్నారు. ఐడీ ఉంటేనే.. సబ్సిడీ ఉల్లి గ్రేటర్లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్లలో, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో ఈ నెల 5 నుంచి సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో వినియోగదారుడికి 2 కిలోల చొప్పున కేజీ రూ.20 ప్రకారం అందిస్తున్నారు. సబ్సిడీ ఉల్లి దుర్వినియోగం కాకుండా అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్, గ్యాస్ కనెక్షన్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి ఐడీగా చూపిస్తేనే సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలిపోకుండా మార్కెటింగ్ శాఖ ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు సీసీ కెమేరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండగా.. విజిలెన్స్ బృందాలు రైతుబజార్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందిపై డేగ కన్ను వేశాయి. కొరత రానివ్వం సబ్సిడీ ఉల్లికి కొరత రానివ్వబోమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉల్లి సరఫరాపై మార్కెటింగ్ మంత్రి తరచూ సమీక్షిస్తూ ఎంత ధర పెరిగినా రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, సబ్సిడీ ఉల్లి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సుమారు 100 టన్నుల ఉల్లిని సేకరించి బోయిన్పల్లి మార్కెట్లో నిల్వ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 700 టన్నుల ఉల్లిని సబ్సిడీ ధరపై రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించామని అధికారులు తెలిపారు. ఎంత ఖర్చయినా రాయితీ ఉల్లిని అందిస్తాం: మంత్రి హరీశ్రావు రాయితీ ఉల్లిగడ్డను ప్రజలకు అందించేందుకు ఎంత మొత్తం అయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో ఉల్లి కొరత లేకుండా చేస్తామని, దీనికోసం తమ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 లక్షల కిలోల ఉల్లిని రైతు బజార్ల ద్వారా అందించినట్లు, 7.50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లు తెలిపారు. 89 కేంద్రాల ద్వారా ఉల్లి అమ్మకాలు కొనసాగుతున్నాయని, ఉల్లి బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు సైతం అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేయాలని సూచించారు. -
అదుపు తప్పిన ఉల్లి ధరలు
హోల్సేల్ మార్కెట్లలో భారీగా పెరిగిన ధరలు రిటైల్ మార్కెట్లో రూ.100కు చేరే అవకాశం సాక్షి, హైదరాబాద్ : ఉల్లిధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలో ధరలు అనూహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతోంది. శుక్ర, శనివారాల్లో ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో కిలో ఉల్లి రేటు రూ.100కు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉల్లి మార్కెటింగ్లో కీలకమైన మలక్పేట హోల్సేల్ మార్కెట్లో శుక్రవారం నాటి ధరలతో పోల్చి చూస్తే ఒక్క రోజే కిలో ధర రూ.8-10 వరకు పెరిగింది. తక్కువ నాణ్యతగల కర్నూలు రకం కిలో ఉల్లి శుక్రవారం గరిష్టంగా రూ.40 పలకగా, శనివారం రూ.52కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో గ్రేడ్ వన్ రకం రూ.80 పలుకుతోంది. దేశంలో ఉల్లి మార్కెటింగ్లో అత్యంత కీలకమైన లసల్గావ్ (మహారాష్ట్ర) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కిలో రూ.55 పలకగా, శనివారం 57కు చేరుకుంది. దేశం మొత్తానికి లసల్గావ్ కీలకం కావడంతో అంతటా ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. లసల్గావ్ మార్కెట్కు ఉల్లి రాక గణనీయంగా తగ్గింది. గత జూలై 21న 1,021 టన్నులు రాగా, శుక్రవారం కేవలం 240 టన్నులు మాత్రమే మార్కెట్కు రావడం గమనార్హం. ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్, చైనా, ఈజిప్ట్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాల నుంచి దిగుమతులకు అనుమతించింది. విదేశాలకు ఎగుమతి అయ్యే ఉల్లి టన్ను ధరను 425 డాలర్ల నుంచి 700 డాలర్లకు పెంచింది. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం: మలక్పేట హోల్సేల్ మార్కెట్కు రోజుకు సగటున పది వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి అవుతుండగా, తాజాగా ఐదు వేల క్వింటాళ్లకు పడిపోయింది. ఇందులో 20 శాతం మహారాష్ట్ర నుంచి వస్తుండగా, మిగతాది కర్నూలు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వస్తోంది. దీంతో రాష్ట్రంలోనూ ధరలు ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయి. కిలోకు రూ.20 చొప్పున సబ్సిడీపై సరఫరా చేసేందుకు మార్కెటింగ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 88 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రూ.5.88 కోట్లు వెచ్చించి 1,479.42 టన్నుల ఉల్లిని సేకరించింది. ధరలు అనూహ్యంగా పెరుగుతుండటంతో సబ్సిడీపై ఇవ్వడం మార్కెటింగ్ శాఖకు సవాలుగా మారింది. శనివారం హోల్సేల్లో ఉల్లి ధర రూ.68 పలకడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విదేశాల నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకోవడం, ఖరీఫ్ ఉత్పత్తి మార్కెట్లోకి రావడం మినహా ధరలు అదుపు చేసేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఉల్లి ఎగుమతి ధర భారీగా పెంపు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో చుక్కలన్నింటిన ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కనీస ఎగుమతి ధర(ఎమ్ఈపీ)ను భారీ పెంచింది. టన్ను ధరపై దాదాపు రూ.18,203(275 డాలర్లు) పెంచి విదేశాలకు ఉల్లి ఎగుమతులను తగ్గించడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఇంత వరకూ టన్నుకు దాదాపు రూ.28,132(425 డాలర్లు)గా ఎమ్ఈపీ రూ. 46,335(700 డాలర్లు)కు చేరింది. ఫలితంగా ఎగుమతులు తగ్గి ఉల్లి దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, దరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అలాగే మరో పదివేల టన్నులు ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలోని లాసల్గాన్ ఉల్లి మార్కెట్లో తాజాగా హోల్సేల్లోనే కిలో ఉల్లి ధర రూ.57కి చేరింది. -
ఉల్లి కోసం బారులు
నెల్లూరు : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు ఆ ఉల్లి కొనాలంటే మాత్రం సామాన్యుల కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉల్లి అంతగా ఘాటెక్కింది. కాగా సామాన్యునికి అందుబాటులో రూ. 20 లకే కిలో ఉల్లిగడ్డలు పంపిణీ జరుగుతుండటంతో.. శనివారం నెల్లూరు రైతుబజార్ ముందు పట్టణవాసులు బారులు తీరారు. మార్కెట్లో రూ. 45 నుంచి రూ.70 వరకు అమ్ముడవుతుండగా.. రైతు బజార్లో రూ. 20 కే పంపిణీ జరుగుతుండటంతో శనివారం ప్రజలు ఉల్లి కొనుగోళ్లకు పోటెత్తారు. -
ఉల్లి లొల్లి
రైతుబజార్లలో క్యూ పల్లెవాసులకేదీ? ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మాత్రమే కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ గ్రామీణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్(ముకరంపుర): ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు.. కానీ సీన్ రివర్సయ్యింది. ప్రస్తుతం ఉల్లి అంతటా లొల్లి చేస్తోంది. వర్షాభావం.. దిగుబడి.. దిగుమతులు లేక ఉల్లి కొరత నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 పలుకుతున్న ఉల్లిని మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో రూ.20కే అందిస్తోంది. ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 6 రైతుబజార్లలో విక్రయిస్తోంది. కరీంనగర్లోని రెండు రైతుబజార్లు, సిరిసిల్ల, జగిత్యా ల, పెద్దపల్లి, మంథనిలోని ఒక్కో రైతుబజార్ కేంద్రంలో ప్రత్యేక విక్రయాలు చేస్తున్నారు. కుటుంబానికి 2 కిలోలే పంపిణీ చేస్తామని, ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరి అని నిబంధన విధించారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాల్లో ప్రజల తాకిడి ఒకేలా ఉంటోంది. అక్కడక్కడా క్యూలైన్లో గొడవలు కూడా ముదురుతున్నాయి. మరోవైపు ఏదేని గుర్తింపు కార్డు తేవాలని చెప్పడంతో ప్రజలంతా ఆధార్కార్డుతో కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్శాఖ అధికారులు తల లు పట్టుకుంటున్నారు. ఆహారభద్రత కార్డు కుటుంబానికి ఒక్కటే ఉంటుంది. కానీ, ఆధార్కార్డు కుటుంబంలో ముగ్గురి నుంచి ఐదుగురు సభ్యుల వరకు ఉండే అవకాశముంది. ఒకే కుటుం బసభ్యులంతా వేర్వేరుగా ఉల్లిగడ్డలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి ఎదురైంది. జిల్లాకు ఇప్పటికే 26 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు వచ్చాయి. మరో 26 మెట్రిక్ టన్నుల కోసం ప్రతిపాదనలు పంపారు. నిరుపేదలుండే పల్లెలను వదిలి పట్టణవాసులకు మాత్రమే సబ్సిడీపై ఉల్లిని అందుబాటులో ఉంచడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రజలు కిలో నాణ్యతను బట్టి కిలో రూ.50 నుంచి రూ.55కు కొనుగోలు చేస్తున్నారు. రెండు కిలోల ఉల్లిగడ్డల కిలోల కోసం తాము డివిజన్ కేంద్రాలకు వెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ కు కూడా పల్లెల్లో సబ్సిడీపై ఉల్లిగడ్డ అందించాలని కోరుతున్నారు. పాత సామగ్రికి ఉల్లిగడ్డలిచ్చే వ్యాపారులు సైతం ఇప్పుడు ఆలుగడ్డలు ఇస్తుండడం గమనార్హం. -
కిలో ఉల్లి కోసం గంటల నిరీక్షణ
మిర్యాలగూడ అర్బన్: ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిగడ్డలు రూ.20 కే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజారులో కౌంటర్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిసిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భారీ క్యూ ఏర్పడింది. కుటుంబానికి కిలో చొప్పున ఇచ్చే ఉల్లిగడ్డల కోసం గంటల తరబడి క్యూలో ఎదురుచూపులు చూశారు. పట్టణంలో ఒకే కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు జనం భారీగా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్థానికులు ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. -
ఉల్లి ధరకు రెక్కలు!
దేవరకద్ర(మహబూబ్నగర్) : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగాయి. గత వారం వచ్చిన ధరలే రికార్డు స్థాయిలో ఉండగా ఈ వారం ధరలు మరో రికార్డుగా మారాయి. ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కిలో రూ.20 కే విక్రయిస్తామంటున్నా ఇక్కడ ఏమాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అనూహ్యంగా డిమాండ్ పెరగటంతో బుధవారం మార్కెట్కు 300 బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి. జోరుగా సాగిన వేలంలో నాణ్యమైన ఉల్లి క్వింటాల్ ధర రూ. 3500 పలికింది. గత వారం కన్నా ఇది రూ. 300 అధికం. చిన్న సైజు ఉల్లిపాయలకు సైతం అధిక ధరలు నమోదయ్యాయి. మార్కెట్లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట కిలో రూ.40 వరకు విక్రయించారు. -
నల్లబజారుకు.. రాయితీ ఉల్లి
ఉల్లి.. తల్లివంటిదని అంటారు. ఓ కవి ‘ఉల్లుండవలయు లేదా తల్లుండవలయు భోజనోత్సవ వేళన్!’ అన్నాడు. ఎవరెలా అన్నా ప్రతి రోజూ వంటకాల్లో ఉల్లిపాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తగ్గిన దిగుబడితో ప్రస్తుతం మార్కెట్లో దాని ధర రెక్కలు కట్టుకు విహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని కూడా కొంతమంది అక్రమార్కులు అవకాశంగా పయోగించుకుంటున్నారు. రాయితీపై వస్తున్న సరుకును అధిక ధరకు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తుని : దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.35 నుంచి రూ.45 వరకూ ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉల్లి వినియోగం రోజువారీ అధికంగానే ఉంటుంది. ధర పెరగడంతో నెలవారీ బడ్జెట్లో దీనికే రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్కంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తూతూమంత్రంగానే దీనిని విక్రయిస్తున్నారు. రాయితీపై విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నియోజకవర్గానికి 10 టన్నుల చొప్పున ఉల్లిపాయలు సరఫరా చేశారు. వీటి అమ్మకం బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కిలో రూ.20 చొప్పున 2 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఒకటిన అట్టహాసంగా మార్కెట్ యార్డుల్లో, రైతుబజార్లలో వీటి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఉల్లికోసం జనం బారులు తీరడం మొదలుపెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్నిచోట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతున్నా.. కొంతమంది ప్రభుత్వం సరఫరా చేసిన ఉల్లిపాయలను గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ ఉల్లిని రూ.2600కు అమ్ముకుంటున్నారు. బయట మార్కెట్లో క్వింటాల్ ధర రూ.3వేలు పైగానే ఉంది. మొత్తంగా జిల్లాలో సుమారు 250 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాయితీపై అందించాల్సి ఉండగా, ఈ సరుకును నల్లబజారుకు తరలించి, టన్నుకు రూ.6 వేల చొప్పున అడ్డదారిలో సంపాదిస్తున్నారు. ఒక్క తుని నియోజకవర్గంలోనే ఒక టన్ను ఉల్లిపాయలను రాయితీపై కౌంటర్ల ద్వారా విక్రయించారు. మిగిలిన తొమ్మిది టన్నులను బయటి వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఒక్క తునిలోనే రూ.50 వేలు అడ్డదారిన సంపాదించారు. ఇతర నియోజవకర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించినందువల్లనే రాయితీ ఉల్లి నల్లబజారుకు తరలిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫలితంగా తమకు ఉల్లి ధరల ఘాటు తప్పడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
ఉల్లిపాయల కోసం క్యూ..
-
'ఆధార్' ఉంటేనే ఉల్లి.. లేదంటే లొల్లి
ఏలూరు: ఆధార్ కార్డు ఉంటేనే ఉల్లిపాయలు.. లేదంటే లేదు. ఇదేంటి అనుకుంటున్నారా ? ఔనండీ! తాజాగా ఉల్లి పాయలకూ 'ఆధార్' లింకు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు ఉంటేనే సబ్సిడీతో ఉల్లిపాయలు ఇస్తారట. ఈ పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని రైతు బజార్లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రైతు బజార్లో శనివారం నుంచి సబ్సిడీతో కిలో ఉల్లిపాయలు రూ.20 కి ఇస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. దాంతో వినియోగదారులు ఎంతో ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. విక్రయదారులు మాత్రం ఆధార్ కార్డు ఉంటేనే సబ్సిడీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఆధార్ లేని వారికి సబ్సిడీ ఉల్లిపాయలు ఇవ్వడానికి కుదరదని చెప్పారు. దాంతో సగానికి పైగా జనం నిరాశతో ఇళ్లకు వెళ్లారు. కొంతమంది ఏటీఎం కార్డు చూపించినా కూడా.. తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అక్కడ విక్రయించే వాటిలో నాసిరకం ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయని.. ఇంటికి వెళ్లే లోపే సగానికి పైగా పడేయాల్సి వస్తుందని ఓ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆధార్ కార్డ్ ఉంటేనే ఉల్లిపాయలు!
-
రైతుబజార్లో 'ఉల్లి' జాతర
అనంతపురం : రైతులు, వినియోగదారుల తాకిడి లేక బోసిపోయి అలంకార ప్రాయంగా ఉన్న అనంతపురం జిల్లా స్థానిక రైతుబజార్ గురువారం పూర్వ వైభవం సంతరించుకున్నట్లుగా జనంతో కిటకిటలాడింది. బైకులు, బ్యాగులతో వందలు, వేల సంఖ్యలో వినియోగదారులు తరలిరావడంతో రైతుబజార్ రద్దీగా కనిపించింది. వందలమంది నెత్తిన బ్యాగు పెట్టుకుని గంటల కొద్దీ లైన్లలో నిలుచున్నారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడలేక ముందు, వెనుకనున్న వారికి చెప్పి వృద్ధులు, మహిళలు చెట్ల కింద కాసేపు సేదతీరడం కనిపించింది. ఇంతకీ ఈ శ్రమంతా దేనికనుకుంటున్నారు? రెండు కిలోల ఉల్లిగడ్డల కోసమే! బహిరంగ మార్కెట్లో ఉల్లి ఘాటెక్కడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా యంత్రాంగం రైతుబజార్లో బుధవారం ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేసింది. కిలో రూ.20 ప్రకారం ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేపట్టింది. దీంతో రెండు కిలోల ఉల్లి కోసం రెండు గంటలపాటు క్యూలో నిల్చుకుని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక కౌంటర్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఒక్క రోజే 2,500 మందికి పైగా వినియోగదారులకు ఉల్లి పంపిణీ చేసినట్లు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్ రుద్ర తెలిపారు. -
ఉల్లి కొందామన్నా కన్నీళ్లే!
సాక్షి, హైదరాబాద్: కరువొస్తే ఢిల్లీ పీఠాన్నీ వణికించగల ఉల్లిగడ్డ రోజురోజుకూ ఘాటెక్కుతోంది.. కోస్తేనే కాదు కొందామన్నా కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో కొరత నెలకొనడంతో కొద్దిరోజు లుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి అవసరమైన స్థాయిలో రాకపోతుండడమే దీనికి కారణమవుతోంది. రాష్ట్రానికి రోజుకు సరాసరి 40 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ అవసరం. కానీ కొద్దిరోజు లుగా రోజూ కేవలం 25 వేల క్వింటాళ్లకు మించి సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 10 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం కాగా ప్రస్తుతం 6 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా అవుతోందని అంటున్నారు. గతేడాది హైదరాబాద్లోని మలక్పేట మార్కెట్కు రోజూ తొమ్మిది వేల క్వింటాళ్ల ఉల్లి సరఫరా కాగా తాజాగా శుక్రవారం కేవలం ఆరు వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా కావడం పరిస్థితేమిటో స్పష్టం చేస్తోంది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 9వరకు ఉండగా... ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 21కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఉల్లిగడ్డ ధర కిలో రూ. 25 నుంచి రూ. 35 వరకు పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర దెబ్బ.. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతుండగా... ఒక్క మహారాష్ట్రలోనే మూడు లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఇక్కడి నేలలు ఉల్లిసాగుకు అనువైనవి కాదు. దీంతో 90 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో ఉల్లి విత్తనం కొరత, దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఈసారి సాగు బాగా తగ్గిపోయి, ఉల్లిగడ్డ ఉత్పత్తి పడిపోయింది. పట్టించుకుంటేనే.. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. లేకుంటే కొరతను అడ్డుకోవడం, ధరలను నియంత్రించడం చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు. కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో... ఇప్పటికే కొందరు వ్యాపారులు ఉల్లిని నల్లబజారుకు తరలించినట్లు తెలి సింది. ఇక ఉల్లిగడ్డను తక్కువ ధరకే అందించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్లి కొరతపై మార్కెటింగ్ అధికారి లక్ష్మీబాయిని ‘సాక్షి’ స్పందన కోరగా శుక్రవారం ఉల్లి కొరతపైనా, ధరలపైనా చర్చించినట్లు చెప్పారు. -
స్లైసర్స్... మీకు మంచి హెల్పర్స్!
వాయనం: అతిథులు వచ్చారు. పెట్టడానికి ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు. వాటిని కడిగి, ముక్కలుగా కోసి పెట్టేసరికి లేటవుతుందేమోనని టెన్షన్ పడతాం. ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫ్రూట్ సలాడో, ఫుడ్డింగో చేద్దామనుకుంటాం. కానీ అన్ని పండ్లు ఎలా కోయాలా అని ఫీలవుతాం. పెద్ద మొత్తంలోను, తక్కువ సమయంలోను కోయాల్సి వచ్చినప్పుడు పడే ఈ ఇబ్బందిని తీర్చడానికే రకరకాల స్లైసర్స్ వచ్చాయి. ఏ పండునైనా కోయడానికి స్లైసర్ ఉందిప్పుడు. కొన్ని తక్కువ ధరలోనే లభిస్తుంటే, కొన్నిటికి కాస్త ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అన్నీ ఒకసారి కొనలేకపోతే అప్పుడప్పుడూ ఒక్కోటి కొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకెప్పటికీ ఉపయోగమే! ఇలా చేయండి చాలు! నెగైల్లా లాసన్... ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చెఫ్. వంటలు అద్భుతంగా చేయడంలోనే కాదు, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నేర్పరి ఆమె. తనకు తెలిసిన కొన్ని చిట్కాలను అందరికీ చెబుతూ ఉంటుంది కూడా. అందులో ఇవి కొన్ని... మూకుడు జిడ్డు వదలకుండా విసిగిస్తుంటే... దానిలో కాసిన్ని నీళ్లు, కొద్దిగా వాషింగ్ పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు స్టౌమీద మరిగించాలి. ఆ పైన మంచి నీటితో కడిగితే మూకుడు మెరుస్తుంది! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఓ కొవ్వొత్తిని వెలిగించి పక్కన పెట్టుకోండి. ఇక మీ కళ్లు మండవు! వంటగదిలో ఎప్పుడూ కలబందను ఉంచుకోండి. ఎప్పుడైనా పొరపాటున చేయి కాలితే కాస్త కలబంద రసం వేయండి. మంట మాయమౌతుంది! ైవైట్ వెనిగర్లో కాసింత బేకింగ్ సోడా వేసి, ఆ మిశ్రమంలో ముంచి తీసిన బట్టతో మైక్రో అవన్ని తుడవండి. కొత్తదానిలా మెరుస్తుంది! చేతులకు నూనె, పిండి లాంటివి అంటుకుని వదలకపోతే ఉప్పుతో రుద్దుకోండి. ఒకవేళ వాసన వదలకపోతే కాసింత కరివేపాకును గానీ, కొత్తిమీరను కానీ తీసి రుద్దండి! -
మద్యం దుకాణాల్లోనూ ఉల్లిపాయలు
న్యూఢిల్లీ :నగరంలోని మద్యం దుకాణాల్లోనూ ఇక ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను స్థిరీకరించడం కోసం ఉల్లిపాయలు, ఆలుగడ్డలను మద్యం దుకాణాల్లో విక్రయించడానికి సంసిద్ధంగా ఉంది. ఢిల్లీ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(డీఎస్ఐఐడీసీ) చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఢిల్లీవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై వినయ్కుమార్ అనే ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ‘నేను రోజూ బజారుకు వెళ్లే ముందు ఆలు-ఉల్లిపాయలు అవసరమా అని ఇంట్లో అడుగుతా. ఇప్పుడు మద్యం దుకాణాల్లో ఆలుగడ్డల్ని అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉంది. కూరగాయల మార్కె ట్లు రద్దీగా ఉంటాయి. దీంతో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు క్యూలో నిలబడాల్సి పనిలేకుండా పోయింది’ అని అన్నాడు. ఇంజినీర్ రాహుల్సింగ్ అనే మరో నగరవాసి మాట్లాడుతూ ‘ ఇంటికి మద్యం తెచ్చుకోవడానికి భార్య అనుమతించదు. ఈ పద్ధతి అమలు చేస్తే.. మద్యం లేదా బీరు ఎంచక్కా ఇంటికి తెచ్చుకోవచ్చు. దీని అమలు చేస్తే మంచిదే’నని అన్నాడు. న్యాయవాది ఆశిష్ మాట్లాడుతూ ‘ఢిల్లీవాసులకు మంచి రోజులు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో ఉల్లిపాయలను విక్రయించే విధానాన్ని ప్రవేశపెడితే సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి నేనే కూరగాయలు తీసుకొస్తాను. ఇప్పుడు కూరగాయలతోపాటు మద్యం కూడా తెచ్చుకోవచ్చు’ అని అన్నాడు. సుష్మ అనే గృహిణి మాట్లాడుతూ ‘ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లేకుండా కూరలు వండుకోవడం కష్టమే. ఇప్పుడు మద్యం దుకాణాల్లో కూడా లభిస్తున్నాయి. ప్రతిసారి నా భర్త మద్యం దుకాణానికి వెళ్లే అవసరం లేదు. నేను కూడా వెళ్లి ఉల్లిపాయలతోపాటు మద్యం కూడా తీసుకు రావడానికి వీలు కలిగింది. కూరగాయల కోసం మరికొంత దూర వెళ్లాల్సిన పని తప్పుతుంది’ అని పేర్కొంది. -
మళ్లీ తారాజువ్వల్లా..!
న్యూఢిల్లీ: టమాటాలు, ఉల్లిపాయల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో బుధవారం కిలో టమాటా రూ. 70 కాగా ఉల్లిపాయలు రూ. 40లకు విక్రయిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆశించినమేర వర్షాలు కురియకపోవడం, పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక మదర్డెయిరీ సఫల్ మార్కెట్లలో కిలో రూ. 55, ఉల్లిపాయలు రూ. 29 పలుకుతున్నాయి. ఇక స్థానిక చిల్లర వ్యాపారులు కిలో టమాటాలను దాదాపు రూ. 70కి విక్రయిస్తున్నారు. మరోవైపు ఆజాద్పూర్ మార్కెట్లో కిలో టమాటాలు రూ. 45 నుంచి రూ. 50 పలుకుతున్నాయి. టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధరలు రూ. 20 నుంచి రూ. 25 వరకూ పలుకుతున్నాయి. హిమాచల్ప్రదేశ్ నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక తగ్గిపోయింది. నగరానికి పెద్దసంఖ్యలో టమాటాలు ఆ రాష్ట్రం నుంచే వస్తాయి. టమాటాల ధరలు పెరగడంపై ఆజాద్పూర్ మండీ టమాటా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శన్లాల్ మాట్లాడుతూ కరువు ప్రభావమే కారణమన్నారు. నాసిక్, బెంగళూర్లతోపాటు ఉత్తరాది నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక గణనీయంగా తగ్గిపోయిందన్నారు. -
ధరలకు రెక్కలు
ఘాటెక్కిన అల్లం మళ్లీ ఉల్లి లొల్లి పెళ్లిళ్ల సీజన్లో కూరల కొరత నగరవాసి జేబులు ఖాళీ ఎండలు మండుతున్నాయి.. కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఒకవైపు దిగుబడి తగ్గిపోవడం.. మరోవైపు లగ్గసర్లు కావడంతో కూరలకు గిరాకీ బాగా పెరిగింది. బీన్స్, క్యారెట్, క్యాప్సికం కాదేదీ.. ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తేనే జేబులోకి సరిపడా కూరలు వస్తాయన్న చందంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఏం కొనాలో.. ఏం తినాల్లో అర్ధంకాక సగటుజీవి అల్లాడిపోతున్నాడు. విజయవాడ సిటీ : కూరల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. కూరగాయలు పండించే సీజన్ ముగియడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో వ్యాపారులు ధరలు దండిగా పెంచేశారు. ఫలితంగా కాయగూరలు దొరకక జనం ఇబ్బందిపడుతున్నారు. ఈ ప్రభావం రైతుబజార్లపై పడి అక్కడా ధరలు బాగా పెరిగాయి. ప్రైవేటు మార్కెట్ల వర్తకులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ జేబులు గుల్లచేస్తున్నారు. ఉల్లిపాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. అల్లం ధర కూడా ఘాటెక్కింది. వారం రోజుల క్రితం కంటే కూరగాయల ధరలు సగానికి సగం పెరిగాయి. వేసవి సీజన్ పూర్తికావడంతో స్థానికంగా కూరల దిగుబడులు తగ్గాయి. వారం రోజులుగా దాదాపు 30 శాతం దిగుబడులు తగ్గినట్లు రైతుబజారు అధికారులు చెప్పారు. విజయవాడలో ఐదు, జిల్లాలో 12 రైతుబజార్లు ఉన్నాయి. స్థానిక రైతుబజార్లకు 5,500 క్వింటాళ్ల కూరగాయల ఉత్పత్తులు వస్తుంటాయి. వీటిన్నింటిలో స్వరాజ్యమైదానం రైతుబజారులో అత్యధికంగా రోజుకు మూడు వేల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కొద్ది రోజులుగా రెండు వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. జిల్లాలో జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్జంక్షన్, నూజివీడు రైతుబజార్లకూ కూరగాయలు తక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రైవేటు మార్కెట్లలో రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇక ఇళ్ల వద్ద పావుకిలో కూరగాయలు రూ.10 చొప్పున, కేజీ రూ.40కి విక్రయిస్తున్నారు. ఇంకొన్ని రకాల కూరగాయలను కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయించిన ఉల్లి కేజీ రూ.21కు పెరిగింది. బయట మార్కెట్లో రూ.25కు విక్రయిస్తున్నారు. అల్లం రైతుబజార్లలో కేజీ రూ.120కి విక్రయిస్తుంటే.. బయట మార్కెట్లో రూ.150 వరకు అమ్ముతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో కూరలు అందుబాటులోకి వచ్చేటప్పటికి మరో రెండు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. -
ఘాటెక్కిన ఉల్లి ధర
-
ఉల్లి ఘాటెక్కుతోంది!
పదిరోజుల్లో రెట్టింపైన ధర సాధారణ మార్కెట్లో కిలో రూ.24 సూపర్మార్కెట్లలో మేలురకం పేరుతో రూ.34 సాక్షి, తిరుపతి : ఉల్లిగడ్డల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు వారాల్లో కిలో రేటు రెట్టింపు అయింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వంటింట్లో ఉల్లిగడ్డ లేనిదే ఏ కూర ఉడకని పరిస్థితి. ఒక్క తిరుపతి నగరంలోనే రోజుకు 50 టన్నుల ఉల్లిగడ్డలు హోల్సేల్ డీలర్ల నుంచి షాపులకు వెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఈ మొత్తం రెట్టింపు ఉంటుందని అంచనా. దీన్నిబట్టి వీటి ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. రెండు వారాల కిందట కిలో ధర రూ.12 ఉండగా అది కాస్తా ఇప్పుడు రూ.24కు చేరుకుంది. సూపర్మార్కెట్లలో మేలు రకం గడ్డల పేరుతో రూ.34కు అమ్మకాలు జరుపుతున్నారు. పది రోజుల కిందట వరకు రాష్ట్రంలోని కర్నూలు ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉల్లి గడ్డలు తిరుపతికి వచ్చేవి. అక్కడ నుంచి రవాణా చార్జీలు కిలోకు రూపాయి నుంచి రూపాయిన్నర పడేది. కాని అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఉత్తరప్రదేశ్లోని పూనా, నాశిక్ నుంచి తెప్పిస్తున్నారు. దీంతో రవాణా భారం భారీగా పడుతోంది. కిలోపైన నాలుగు నుంచి ఐదు రూపాయలు రవాణా ఖర్చులు వేసి హోల్సేల్ డీలర్లు రిటైల్ షాపులకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉల్లిగడ్డల ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు డీలర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉల్లి కొనుగోళ్లలో పెద్దగా తేడా లేనప్పటికీ ఇంతకంటే ఎక్కువ అయితే అమ్మకాలపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఉల్లి ధరలు ప్రభుత్వాలను మార్చిన చరిత్ర దేశంలో ఉంది. దీంతో కేంద్రప్రభుత్వం ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు జాగ్రత్త అధికారులు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ఉల్లి.. మళ్లీ లొల్లి
తాడేపల్లిగూడెం : వ్యాపార వర్గాలు అంచనా వేసినట్టుగానే ఉల్లి బాంబు పేలింది. వర్షాలకు పంటల దిగుబడులు తగ్గిపోవడంతో మహారాష్ట్ర మార్కెట్లో ఉల్లిపాయలకు కొరత ఏర్పడింది. దీనికితోడు కొన్ని మార్కెట్ల అవసరాలను తీర్చే కర్నూలు ఉల్లిపాయల సీజన్ ముగిసింది. దీంతో డిమాండ్కు, సరఫరాకు మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉల్లి ధరకు గుత్త మార్కెట్లో రెక్కలు వచ్చాయి. ఈ ప్రభావంతో రిటైల్ మార్కెట్లో వీటి ధర ఆకాశం వైపునకు చూడటం ప్రారంభించాయి. యుఏఈ దేశాలతో ఒప్పందాలలో భాగంగా నాణ్యమైన ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో మిగిలిన నాసిరకాలు మార్కెట్లకు వచ్చినా, వాటి ధర వినియోగదారులకు అందకుండా ఉంది. వీటికి తోడు వాతావరణ మార్పులు ఉల్లి ధరలు పెంచేలా చేశాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల ధర పెరుగుతూ వస్తోంది. జూన్లో కిలో రూ.20 పైగా, జూలై మొదటివారంలో రూ.30కు గుత్త మార్కెట్లో ధర పెరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనావేశాయి. దీనికి అనుగుణంగానే ఆదివారం మహారాష్ర్ట ఉల్లిపాయలు పదికిలోల ధర రూ.230కి చేరింది. ఎండ కారణంగా మార్కెట్కు సరుకు రాకపోవడం, ఉన్న సరుకును ఇతర మార్కెట్లకు తరలించడానికి లారీలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ధర పెరిగింది. ఆదివారం పది లారీల సరుకు మాత్రమే మార్కెట్కు వచ్చింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
రైతన్న ‘ఉల్లి’కిపాటు
ఉల్లి..ఆ పేరు వింటేనే రైతన్నలు ఉలిక్కిపడుతున్నారు. కష్టనష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.4వేలు పలికిన ఉల్లి రెండువారాలుగా రూ.250కు పడిపోయింది. దీంతో మార్కెట్లో అన్నదాతలకు దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. దేవరకద్ర, న్యూస్లైన్ : ఉల్లి ధరలు ఒక్కసారిగా మళ్లీ పడి పోయాయి. దాంతో రైతన్న దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు. గ డిచిన రెండు వారాలుగా ఓ మోస్తరుగా పె రిగిన ఉల్లి ధరలను చూసిన రైతాంగం బుధవారం దేవరకద్ర మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు తీసుకువచ్చారు. పా త యార్డు, కొత్త యార్డు ఆవరణ అంతా ఉ ల్లి కుప్పలతో నిండిపోయింది. తగిన స్థలం లేక షెడ్ల పక్కన, గోదాముల పక్కన రో డ్లపై కుప్పలుగా పోశారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి పాయలు రావడంతో మార్కెట్ యార్డు అవరణ అంతా ఉల్లిపాయల కుప్పలతో ముంచెత్తాయి. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్కు ఉల్లి పాయలు రావడం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. ధరలు పెరుగుతున్నాయని భావించిన రైతాంగానికి వేలం పాటలు ప్రారంభమైన తరువాత ఒక్కసారిగా నిరాశలో కురుకు పోయారు. గత రెండు వారాలుగా పెరుగుతూ వచ్చిన ధరలు సగానికి సగం పడి పోవడంతో చాల మంది రైతలు ట్రాక్టర్ల నుంచి కింద పోయకుండానే వాపసు తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున వచ్చిన ఉల్లిపాయలను కొనడానికి వ్యాపారులు ఆసక్తిని చూపక పోవడంతో కొందరు రైతులు తెచ్చిన ఉల్లిపాయలకు వేలం వేసే వారు కూడా కరువయ్యారు. సగం తగ్గిన ధరలు.. గత వారం కనిష్టంగా రూ. 600 ఉండగా, ప్రస్తుతం రూ. 250కు పడిపోయింది. గత వారం వచ్చిన ధరల కన్నా దాదాపు రూ. 350 వరకు ధరలు తగ్గిపోయాయి. గరిష్టంగా గత వారం రూ. 780 ఉండగా ఈ వారం రూ. 570లకు పడిపోయింది. ఇలా ఒక్కసారిగా ధరలు పడి పోవడానికి కారణం ఉల్లి ఎక్కువగా అమ్మకానికి రావడం వల్లనే అని తెలుస్తుంది. నాలుగు నెలల క్రితం సీజన్ ప్రారంభంలో రూ. 4 వేలకు క్వింటాల్ పలికిన ఉల్లి ధరలు ప్రతి వారం తగ్గు ముఖం పడుతూ వచ్చి చివరకు రూ. 250 పడిపోయింది. ధరలు రాక వాపసు తీసుకెళ్లిన రైతులు.. ఉల్లికి తగిన ధరలు రాక పోవడంతో కొందరు రైతులు వాపసు తీసుకెళ్లారు. మరి కొందరు తెచ్చిన ట్రాకర్ల నుంచి ఉల్లిని కింద పోయకుండానే తీసుకెళ్లి పోయారు. మరి కొందరు రైతులు వ్యాపారులను ప్రాధేయ పడుతూ ఏదో ధరకు తీసకోవాలని వేడుకున్నారు. మార్కెట్లో రైతుల పరిస్థితి చూస్తే దయనీయంగా తయారయింది. ఉల్లిని అడిగేవారు లేరు మార్కెట్కు ఉల్లిని తీసుకు వస్తే అడిగేవారు కరువయ్యారు. ధరలు చూస్తే కన్నీరు పెట్టిస్తున్నది. కనీసం ఉల్లిని తెంచడనికి మార్కెట్కు తీసుకురావడానికి అయిన ఖర్చులు కూడ రాని పరిస్థితి ఉంది. - బుచ్చారెడ్డి, ఉల్లి రైతు, డోకూర్ దిక్కు తోచడంలేదు.. తెచ్చిన ఉల్లి కొనేవారు కరువయ్యారు. ధరలు పెరుగుతున్నాయని మార్కెట్కు తెస్తే ఇలా కావడంతో దిక్కు తోచడంలేదు. తెచ్చిన ఉల్లిని మళ్లీ తీసుకెళ్లడానికి కూడా ఖర్చులు రావు. ఏదో ధరకు అమ్ముకోక తప్పదు. -రాములు, ఉల్లిరైతు, గోపన్పల్లి ధరలు చూస్తే కన్నీరొస్తుంది.. తె చ్చిన ఉల్లికి తక్కువ ధర వచ్చింది. గత వారం రూ. 600 వరకు వచ్చిన ఉల్లికి ఈ వారం రూ. 360 వచ్చింది. ఇలా ధరలు తగ్గడం రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. అధికారులు ఉల్లి రైతులను ఆదుకోవాలి. -రాము, ఉల్లిరైతు, మోదీపూర్ ఎవరిని అడుక్కోవాలి.. ధరలు రాలే దు. కనీసం తెచ్చిన ఉల్లిని కొనేవారు క రువయ్యారు. రైతు ల గురించి ఎవరికీ పట్టడంలేదు. ఉల్లిని కొనమని ఎవరిని అ డుక్కోవాలో తెలియడంలేదు. కనీసం పెట్టిన ఖర్చులు వస్తే చాలు. -రాకంకొండ, ఉల్లిరైతు, గూరకొండ -
కిచిడీ: ఇక ఉల్లి కోస్తే కన్నీళ్లు రావు!
ఉల్లిపాయలు లేకుంటే ఇంట్లో వంటే ఉండదు. అంటే... అది ఒక అత్యావశ్యక నిత్యావసర వస్తువు. కానీ, దాన్ని కోస్తే కన్నీళ్లొస్తాయి. రోజూ ఈ కళ్ల మంట భరించాల్సిందేనా? ఆ బాధ నుంచి తప్పించుకునే ఓ మంచి అవకాశం వచ్చింది. ఉల్లిగడ్డలు కోసేటపుడు వాటి ఘాటు కళ్లకు తగలకుండా ప్రత్యేక కళ్లద్దాలు వచ్చాయి. వీటిని పెట్టుకుని ఎంత ఘాటున్న ఉల్లిగడ్డలయినా కోసేయొచ్చు. కంటిని చుట్టూ కవర్ చేసి ఏ విధంగానూ వాటి ఘాటు కంటికి చేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. అమెజాన్.కామ్, ఇబే.కామ్లోకి వెళ్తే మీరు సులువుగా వీటిని కొనేసుకోవచ్చు. ధర వెయ్యి రూపాయల లోపే ఉంది. వీసా అడగని దేశాలు! మీకో విషయం తెలుసా? ప్రపంచంలో 52 దేశాలకు భారతీయులు వీసా లేకుండానే కేవలం పాస్పోర్ట్ చేతిలో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు. ఈ జాబితాలో మళ్లీ 28 దేశాలకు వీసా అవసరమే రాదు. మిగతా దేశాల్లో మాత్రం అక్కడ దిగాక వాళ్లే వీసా సులువుగా ఇచ్చేస్తారు. కానీ అక్కడే ఉండి ఉద్యోగం చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ వీసా ఉండాలి. ఇక నేపాల్, భూటాన్ దేశాల్లో అయితే అది కూడా మనకు అవసరం ఉండదు. మన సంగతి అలా ఉంచితే, బ్రిటనీయులు ప్రపంచంలో సుమారు 173 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉంది. -
ఉల్లిపై విజిలెన్స్
శ్రీకాకుళం, న్యూస్లైన్: ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధర పెరుగుదలకు కారణమవుతున్న వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా కేంద్రంలోని ఉల్లి హోల్సేల్ షాపులపై దాడులు చేసి ఏకంగా 32 టన్నుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 7 దుకాణాలను సీజ్ చేశారు. మరో రెండింటిపై కేసులు నమోదు చేశారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్లో బుధవారం అధికారులు ఉల్లి విక్రయ షాపులపై దాడు లు చేసి సోదాలు జరపగా అనధికారికంగా నిర్వహిస్తున్న గొడౌన్లలో పెద్ద ఎత్తున ఉల్లి నిల్వలు బయటపడ్డాయి. సోదాలు జరిపిన తొమ్మిది షాపుల్లో రెండిం టికి లెసైన్సులు ఉండగా, అవి చెల్లుబాటులో ఉన్నా యో లేదో తెలుసుకొనేందుకు సంబంధిత శాఖాధికారులకు పంపించాలని నిర్ణయించారు. మిగిలిన ఏడు షాపులను సీజ్ చేశారు. ఈ మొత్తం తొమ్మిది షాపులపైనా కేసులు నమోదు చేశారు. దుకాణాలకు హోల్సేల్ స్థాయిలో లెసైన్సులు అవసరమైనప్పటికీ చిల్లర వర్తకులుగా చెలామణీ అవుతుండటాన్ని కూడా అధికారులు గుర్తించారు. మొత్తం 800 బస్తాలు స్వాధీనం చేసుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీకి అప్పగించారు. ఒక్కో బస్తాలో 40 కిలోలు చొప్పున మొత్తం 32వేల కిలోలు అంటే 32 టన్నులుగా లెక్కకట్టారు. కాగా ప్రతి బస్తాలో 40 కిలోల ఉల్లి ఉంటుందని వ్యాపారులు చెబుతుండగా, అధికారులు అనుమానంతో కొన్ని బస్తాలను తూకం వేశారు. వారి అనుమానాలను నిజం చేస్తూ బస్తాకు 35 నుంచి 36 కిలోలు మాత్రమే ఉండడంతో తూకాలు కూడా సక్రమంగా లేవని నిర్ధారించారు. గత కొంతకాలంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయలేని స్థితి లో ఉండిపోయారు. కొందరు వర్తకులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు మరింత పెరిగేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా జిల్లా అధికారులు స్పందించలేదు. ఇటువంటి తరుణంలో విజిలెన్స్ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే కిలో ఉల్లి రూ.25కే విక్రయిస్తున్నట్లుగా మార్కెట్లోని షాపులన్నింటి ఎదుట బోర్డులు వేలాడదీయించారు. ఇంతకంటే ఎక్కువకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ కుమార్, సిఐ రేవతిలతో పాటు, సీఎస్డీటీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
కడ్చర్లలో దారుణం;ఉల్లి కోసం రైతు హత్య!
-
ఉల్లి కోసం రైతు హత్య!
నవాబుపేట, న్యూస్లైన్: ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది. బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊరడి ఎల్లయ్య(60) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, క్యారెట్, వంగ సాగు చేశాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. పొలం వద్ద ఇదివరకే క్వింటాలు ఉల్లిగడ్డలను విత్తనం కోసమని గడ్డికప్పి దాచి ఉంచారు. దాని పక్కనే ఉన్న చెట్టు కింద ఎల్లయ్య నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, ఉల్లిగడ్డలను సంచుల్లో నింపుకుంటుండగా ఎల్లయ్య నిద్ర లేచి వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు ఎల్లయ్య తలపై కర్రతో గట్టిగా మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు ఉల్లిగడ్డలను అక్కడే వదిలి పారిపోయారు. గురువారం ఉదయం పక్కపొలం రైతులు.. ఎల్లయ్య చనిపోయిన విషయం గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. భూ తగాదాలే కారణమై ఉండొచ్చు: ఎస్పీ ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ... భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని, ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారని చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని గురువారం రాత్రి ‘న్యూస్లైన్’కు చెప్పారు. -
ఉల్లి కోసం రైతు హత్య!
నవాబుపేట, న్యూస్లైన్: ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది. బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊరడి ఎల్లయ్య(60) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, క్యారెట్, వంగ సాగు చేశాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. పొలం వద్ద ఇదివరకే క్వింటాలు ఉల్లిగడ్డలను విత్తనం కోసమని గడ్డికప్పి దాచి ఉంచారు. దాని పక్కనే ఉన్న చెట్టు కింద ఎల్లయ్య నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, ఉల్లిగడ్డలను సంచుల్లో నింపుకుంటుండగా ఎల్లయ్య నిద్ర లేచి వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు ఎల్లయ్య తలపై కర్రతో గట్టిగా మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు ఉల్లిగడ్డలను అక్కడే వదిలి పారిపోయారు. గురువారం ఉదయం పక్కపొలం రైతులు.. ఎల్లయ్య చనిపోయిన విషయం గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. భూ తగాదాలే కారణమై ఉండొచ్చు: ఎస్పీ ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ... భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని, ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారని చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని గురువారం రాత్రి ‘న్యూస్లైన్’కు చెప్పారు. -
కొనలేం..తినలేం..
ఉల్లిలేని కూర, టమాట లేని చారును ప్రజలు ఊహించడం కష్టమే. అందుకే వాటి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో వాటి ధరలు కొండెక్కుతున్నాయి. ఇటీవల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో వీటి ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. వీటిని తినాలనే కోరిక ఉన్నా ధర చూసి జనం జడుసుకుంటున్నారు. నోరు కట్టేసుకుని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు. మదనపల్లె, న్యూస్లైన్: జిల్లాలో టమాట పంటకు మదనపల్లె పెట్టింది పేరు. ఇక్కడ టమాట పంట అత్యధికంగా పండించి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. పంట చివరి దశకు చేరింది. దీనికితోడు వరుస వర్షాలు పంటను సర్వనాశనం చేస్తున్నాయి. చేలల్లో నీళ్లు నిలబడిపోవడంతో టమాట మొక్కలు చనిపోతున్నాయి. కాయలు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో స్థానిక మార్కెట్కు రోజుకు సగటున 400 టన్నుల వరకు వచ్చేది. ఇప్పుడు 120 టన్నులకు పడిపోయింది. ధరలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. వారం రోజులుగా సగటున కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. వర్షాలు ఇలాగే కురిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఘాటెక్కిన ఉల్లి జిల్లాలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 వరకు లభిస్తోంది. నాసిరకం ఉల్లి రూ.60కి దొరుకుతోంది. అధికరేటు వెచ్చిం చినా నాసిరకం ఉల్లి ఘాటు లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు బెంగళూరు నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. పై-లీన్ కారణంగా అక్కడ దిగుబడి తగ్గిపోవడంతో దిగుమతి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలావుండగా మార్కెట్కు వచ్చే అరకొర పంటను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. ఆదివారం రైతుల వద్ద నుంచి టమాట పంటను రూ.39కి కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది -
ఉల్లిపాయ... మహా మాయ...
ఢిల్లీలో 1998లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కారణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. ‘టైర్లు కొంటే ఉల్లిపాయలు ఉచితం!’ ఇది కొద్దిరోజుల క్రితం జార్ఖండ్లో ఒక దుకాణం ముందు కనిపించిన రాత. ఇలాంటి ఎరల వివరాలు ఇంకొద్ది రోజులలో బంగారం దుకా ణాల ముందు వెలిసినా ఆశ్చర్యపోవక్కర లేదు. ఉల్లినీ, టొమేటోనీ బ్యాంకు లాకర్లలో పెట్టి ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు వినూత్న నిర సన తెలియచేశారు. ముందు ముందు టీవీ లూ మోటారుబైక్లూ లేదా నగలూ - వీటిని కాదు దొంగలు ఎత్తుకువెళ్లేది, ఉల్లిపాయలనే, అని కాన్పూరు ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్య అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. ఉల్లి సంక్షోభం, ధరలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇది దేశానికి కొత్తకాదు. పొరలు ఒలిచిన కొద్దీ ఉల్లిఘాటు పెరిగినట్టు, సంక్షోభం తరువాత సంక్షోభం తీవ్రమౌతోంది. కానీ తాజా ఉల్లి సంక్షోభానికి ప్రత్యేకత ఉంది. ఇది సామా న్యుల చేతకంటె రాజకీయ పార్టీలనీ, ముఖ్యం గా కొందరు ముఖ్యమంత్రుల చేత ధారాపా తంగా కంటనీరు పెట్టిస్తున్నది. రెండురోజుల క్రితం రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో వంద రూపాయలకు ఎగబాకిం ది. ముంబై, పాట్నా, చండీఘడ్లలో కూడా అంతే పలుకుతోంది. ఈ ఘాటుతో మొదట వణికిపోయిన రాజకీయ నేత ఢిల్లీ ముఖ్య మంత్రి షీలాదీక్షిత్. ప్రతికూల సర్వేలతో కుం గిపోయి ఉన్న కాంగ్రెస్ అడ్డూ అదుపూ లేకుం డా పెరుగుతున్న ఉల్లి ధరతో అక్షరాలా వణికి పోతోంది. అత్యవసరంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్తో సమావేశమైన షీలా దీక్షిత్ చర్యలు తీసుకోవాల్సిందని వేడుకున్నా రు. కోడ్ అమలులో ఉన్నందున, చౌక ధరలో ప్రజలకు ఉల్లి అందించడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాలని కూడా షీలా భావిస్తున్నారని వార్తలు వచ్చా యి. అంటే ఆహారంలో ప్రధాన దినుసుగా ఉండే ఉల్లి లేక దేశంలో అత్యధిక కుటుం బాలు బాధ పడుతున్నందుకు నేతలు కదల డంలేదు. డిసెంబర్ 4న జరిగే ఎన్నికలలో పార్టీకి ఉల్లి పా(మా)యతో జరగబోయే చేటు గురించి కలవరపడుతున్నారు. ఢిల్లీలో 1998 లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కార ణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. దేశంలో మూడింట రెండొంతుల మందికి బియ్యం, గోధుమ ఇవ్వడానికి ఉద్దే శించిన ఈ చట్టం ఉల్లి ఘాటును మాత్రం తట్టుకోలేదు. ప్రపంచ చరిత్రలోనే విస్తృత మైన ఆహార రాయితీ పథకంగా పేరు తెచ్చు కున్న భారత ఆహార భద్రత చట్టం, ఉల్లి సంక్షోభాల చరిత్ర ముందు తెల్లమొహం వేయవలసివచ్చింది. ఈనెలలో ఒక్క మూడో వారంలో ఉల్లి టోకు ధరలు 36 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ లెక్క ప్రకారం జూన్, 2012 నుంచి ఇప్పటిదాకా ఉల్లి ధర 114 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్/మే మాసాలలో టోకు మార్కెట్లో కిలో రూ.8కి అమ్మకాలు జరిగితే, బయట కిలో రూ.20 వంతున అమ్మారు. ఇంతలో ఎంత మార్పు! కాబట్టి ఇది కృత్రిమ సంక్షోభమంటూ వినిపిస్తున్న వాదన తోసిపుచ్చలేనిది. మన రాష్ట్రంలో కూ డా వంద దిశగా ఉల్లి ధర పరుగులు తీస్తోంది. నిరుడు అకాల వర్షాలతో దిగుబడి 20 శాతం తగ్గిన మాట నిజమే అయినా, ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. దేశంలో ఎనిమి దిన్నర లక్షల హెక్టార్లలో పదిహేను నుంచి పదిహేడు మిలియన్ టన్నుల ఉల్లి పండిస్తు న్నారు. ఇందులో 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటకలదే. శరద్ పవార్ సొంత రాష్ట్రంలోనే నాసిక్ పరిధిలో దిగుబడి తగ్గింది. అయినా కొన్నేళ్ల నుంచి ఉల్లి ఎగుమతుల మీద ఉన్న నిషేధాన్ని కేంద్ర వ్యవసాయమంత్రి ఎత్తేశారు. ఇలాంటి నిషేధాలు విధిస్తే నమ్మకమైన ఉత్పత్తిదారుగా భారత్ మీద ప్రపంచ దేశాలకు నమ్మకం పోతుందని ఆయన వాదన. మన ఉల్లి ప్రధా నంగా బంగ్లాదేశ్కు వె ళుతుంది. ఇందులో ఎక్కువ అనధికారిక ఎగుమతులేనని చెబు తారు. అరబ్ దేశాలకీ, శ్రీలంక, హాంకాంగ్, మలేసియా వంటి చోటికి మన ఉల్లి ఎగుమతి అవుతోంది. ఉల్లి ఎగుమతులు ఆపేస్తే దాని ప్రభావం ఇతర ఉత్పత్తుల మీద కూడా పడు తుందని పవార్ చేస్తున్న వాదన ఎలా ఉన్నా దేశంలో సామాన్యుడి మాటేమిటి? ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలలో వస్తున్న ఈ మార్పులకు కారణం రహస్యం కాదు. దేశంలో జరుగుతున్న కూరలు, పళ్ల ఉత్పత్తిలో నలభై శాతం మార్కెట్కు రాకుండానే ధ్వం సం అవుతున్నాయని రిజర్వు బ్యాంకు ఒక సర్వేలో పేర్కొంది. ఇప్పుడు భారత్ ఉల్లి దిగుమతి చేసుకోవాలని, లేదంటే రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా రు. ఇరుగు పొరుగు లేదా ఉల్లి ఎగుమతి చేసే చైనా, ఈజిప్ట్ దేశాలలో కూడా పరిస్థితి ఆశా జనకంగా లేదు. అయితే వర్షాలు పడితే సమస్య తీరిపోతుంది. ఇది తాత్కాలికం- ఇదీ పవార్ జవాబు. అంటే ఉల్లి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఉల్లిపాయలు అందక సామాన్య జనం రుచీపచీ లేని భోజనం చేస్తూ గడుపుతు న్నారు. కానీ ఎన్నికలలో వీరంతా ప్రభుత్వాల చేత చేదుగుళికలు మింగిస్తారు. ఆ భయం రాజకీయ నాయకులలో ఎక్కువగానే కనిపి స్తోంది. ఉల్లి ఇప్పుడు వంటింట్లో చిన్న దిను సు కాదు. ప్రభుత్వాలను మార్చే కింగ్మేకర్ స్థానాన్ని ఆక్రమించింది. తస్మాత్ జాగ్రత్త. - డా॥గోపరాజు నారాయణరావు -
కర్నూలు ఉల్లికి కేరాఫ్ గూడెం..!
తాడేపల్లిగూడెం, న్యూస్లైన్: అక్కడ ఉల్లి పండదు. పోనీ ఉల్లి పండే ప్రాంతానికి అది దగ్గరా కాదు. అయితేనేం! కర్నూలు ఉల్లికి కేరాఫ్ అడ్రస్గా మారింది తాడేపల్లి గూడెం. రాష్ట్రంలోనే ఉల్లిపాయల మార్కెట్కు అతిపెద్ద కేంద్రంగా మారింది. ఎందుకిలా? కర్నూలు రైతులు పండిస్తున్న ఉల్లిని సుదూరాన ఉన్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వ్యాపారులెందుకు అమ్ముతున్నారు? ఈ కథ తెలుసుకోవాలని ఉందా? అయితే ఇదిగో... దాదాపు 45 ఏళ్ల కిందట... అంటే 1970ల మొదట్లో తాడేపల్లిగూడెం మార్కెట్లోని వ్యాపారులు ఉల్లిపాయలను హైదరాబాద్ పరిసర మార్కెట్లలో కొనుగోలు చేసేవారు. అక్కడి నుంచి తెచ్చుకుని, తాడేపల్లి గూడెం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా ఇక్కడ ఉల్లి మార్కెట్ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో ఎక్కువగా ఉల్లిని హైదరాబాద్లో అమ్మేది కర్నూలు వ్యాపారులే. వారికి సరైన ధర లభించేది కాదు కూడా. ఇది గమనించిన గూడెం వ్యాపారులు కర్నూలు రైతులతో సంబంధాలు పెంచుకున్నారు. అవసరమైన వారికి ముందే పెట్టుబడులు సమకూర్చేవారు. తరవాత పంటను కూడా తగిన ధర చెల్లించి కొనేవారు. ముందే ధరపై భరోసా ఇవ్వటం, పెట్టుబడి పెట్టడం, ఎప్పటికప్పుడు నగదు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తుండటంతో కర్నూలు రైతులు దాదాపు 60 శాతం పంటను నేరుగా తాడేపల్లి గూడేనికే తీసుకొచ్చి విక్రయించటం మొదలుపెట్టారు. మొదట్లో వారానికి 10 లారీల సరుకు తాడేపల్లిగూడెం మార్కెట్కు వచ్చేది. ఇక్కడకు తెచ్చిన రైతులకు మెరుగైన ధర రావటంతో మిగతా రైతులూ తోడయ్యారు. అలా... లారీల సంఖ్య రోజుకు 150-200కు చేరింది. ఇక్కడి నుంచి కోల్కత, బంగ్లాదేశ్లకు భారీగా ఉల్లి ఎగుమతి అవుతుండటంతో ఎంత సరుకొచ్చినా ధర గిట్టుబాటయ్యేది. వడ్డీ మినహాయింపు.. వెంటనే నగదు చెల్లింపు కర్నూలు ఉల్లి రైతులకు స్థానిక వ్యాపారులు పెట్టుబడి పెడితే ఆ సొమ్ముకు రెండు రూపాయల వడ్డీ వసూలు చేసేవారు. దీంతో పాటు అక్కడ సరుకును విక్రయించినందుకు నాలుగు శాతం కమిషన్ ను చెల్లించాల్సి వచ్చేది. ఇక ఉల్లిని రాశులుగా పోసి గ్రేడింగ్ చేశాక విక్రయిస్తుండటంతో అందరికీ ఒకే ధర వచ్చేది కాదు. వీటన్నిటికీ తోడు పంటను అమ్ముకున్న 15 నుంచి నెల రోజులకు సొమ్ము చేతికందేది. అదే తాడేపల్లిగూడెం మార్కెట్లో అయితే రైతుకు పెట్టుబడిగా ఇచ్చిన సొమ్ముపై వ్యాపారులు వడ్డీ తీసుకోరు. కర్నూలు మార్కెట్ కంటే క్వింటాల్కు రెండు వందలకు తగ్గకుండా ధర నిర్ణయించి సొమ్ములిస్తారు. లారీలో వచ్చిన సరుకులో ఒకటి, రెండు బస్తాల నాణ్యతను చూసి సరుకును కొనుగోలు చేసి వెంటనే రైతుకు సొమ్ము చెల్లిస్తామని ప్రముఖ ఉల్లిపాయల వ్యాపారి నంద్యాల కృష్ణమార్తి(ఎన్కే) తెలిపారు. తమ వద్ద సరుకు కొనుగోలు చే సిన చిరు వ్యాపారులు వెంటనే సొమ్ములిచ్చినా ఇవ్వకపోయినా రైతులకు మాత్రం వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఏటా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కర్నూలు రైతులు వారానికి 1000 నుంచి 1400 లారీల సరుకును తాడేపల్లిగూడెం మార్కెట్కు తెస్తారు. రైతులకు ఎకరాకు పెట్టుబడిగా రూ.40 వేల వరకు అప్పు ఇవ్వడంతో పాటు, సంచులను సరఫరా చేస్తారు. రైతుల కష్టానికి ఫలితం రావడంతో కర్నూలు ఉల్లిపాయలకు తాడేపల్లిగూడెం సంప్రదాయ మార్కెట్గా మారింది. -
మళ్లీ ఉల్లి బాంబ్!
-
మళ్లీ ఉల్లి బాంబ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉల్లి ధరలు పెరగటానికి దిగుబడి తగ్గటం... ఎగుమతులు పెరగటం... అక్రమ నిల్వలుంచటం వంటివి అసలు కారణాలు కాదు. రైతు నుంచి సరుకును వినియోగదారుకు చేర్చడానికి మధ్య ఉన్న దళారీ వ్యవస్థే అసలు కారణం. ఇరువురి మధ్యా వారధిలా ఉండాల్సిన వ్యవస్థ... ఇరువురినీ శాసించే స్థాయికి చేరటమే అసలు సమస్య. ఉల్లి ధర పెరుగుదలకు దిగుబడి తగ్గటమే కారణమా? అబద్ధం. ఎందుకంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా అంచనా వేసిన పంట దిగుబడి 16.5 మిలియన్ టన్నులు. దిగుబడి కూడా అంచనాకు తగ్గట్టే 16 నుంచి 17 మిలియన్ టన్నుల మధ్య వస్తోంది. అంటే దిగుబడి తగ్గిందన్న ప్రసక్తే లేదు. ఒకవేళ నాలుగైదు శాతం దిగుబడి తగ్గినా దానికి ధరల్ని 300 నుంచి 400 శాతం పెంచేంత శక్తి ఉందనుకోలేం. ఇక ఎగుమతులు పెరగటం వల్లేనన్న వాదనను తీసుకుంటే... అది కూడా అబద్ధమని తేలుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య మన దేశం నుంచి ఎగుమతయిన మొత్తం ఉల్లి 7 లక్షల టన్నులు. గతేడాది ఈ కాలంలో జరిగిన ఎగుమతి 8.5 లక్షల టన్నులు. మరి అప్పటికన్నా తక్కువ ఎగుమతి జరిగినపుడు అప్పటికన్నా రేటు ఇంతలా ఎలా పెరిగింది? పెపైచ్చు జూలైలో 1.5 లక్షల టన్నులు ఎగుమతి కాగా... ధరలు ఆకాశానికెగసిన ఆగస్టులో జరిగిన ఎగుమతులు కేవలం 30 వేల టన్నులు. అయినా దేశీయంగా ఇంత ధరొస్తున్నపుడు ఎవరైనా ఎగుమతులెందుకు చేస్తారు చెప్పండి!! పోనీ ఈ రెండూకాక అక్రమ నిల్వల వల్లే ధరలు ఈ స్థాయికి చేరాయన్న వాదనను పరిశీలించినా... అదీ అబద్ధమని తేలిపోతుంది. ఎందుకంటే ఉల్లి సీజనల్ ఉత్పత్తి. దాన్ని అన్సీజన్లో నిల్వ ఉంచక తప్పదు. అలా నిల్వ ఉంచడానికి ప్రభుత్వ ఏజెన్సీలే సహకరిస్తుంటాయి. పెపైచ్చు మార్కెట్లో ధర ఈ స్థాయికి చేరినపుడు ఏ వ్యాపారైనా బయట విక్రయిస్తాడు తప్ప దాచుకోడు. ఇవన్నీ చూశాక... రైతుల వాదన విన్నాక అనిపించేదొక్కటే. రైతులకు, వినియోగదారులకు మధ్య ఏర్పాటయిన బలమైన దళారీ వ్యవస్థకే అధిక డబ్బులు పోతున్నాయని. అది రైతుల మాటల్లోనే విందాం... ధర 80 దాటినా రైతుకు దక్కింది రూ. 22!! ఆగస్టులో రాష్ట్రంలో ఉల్లి ధర కిలో రూ.80 దాటేసింది. అప్పుడు కర్నూలులో ఉల్లి పండించిన రైతుకు... అత్యుత్తమ రకానికి కిలోకు రూ.25 దక్కింది. మామూలు రకాలకైతే కిలోకు రూ.20 నుంచి 22 వరకూ దక్కింది. దీనిపై కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రైతు అయ్యప్పతో మాట్లాడితే ‘‘మార్కెట్లో ధర ఎంతున్నా మాకొచ్చేది తక్కువే. ఒకోసారి మార్కెట్లో ఎంత ధర ఉందో కూడా మాకు తెలియదు. తెలిసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికీ మాకు ఉల్లి పంట గిట్టడమే లేదు. ఎందుకంటే ఎకరాకు రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. దిగుబడి తగ్గి 70 క్వింటాళ్లకు మించటం లేదు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటమే లేదు. కిలోకు రూ.15 మించితేనే మాకు గిడుతుంది’’ అనే సమాధానం వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. కిలో రూ.60 దాటేస్తోంది. ఏ కారణం వల్లో కానీ ఇపుడు కర్నూలు రైతుకు దాదాపు సగం ధర వస్తోంది. దీనిపై అదే జిల్లా సి.బెల్గల్ గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి మాట్లాడుతూ ‘‘మాకు నాణ్యమైన పంట వచ్చింది. పంట తక్కువగా ఉండటం వల్లో ఏమో కానీ ఇపుడు మాకు క్వింటాలుకు రూ. 3200 వరకూ వస్తోంది. (కిలోకు రూ.32) అయితే దళారుల చేతికి క్వింటాలుకు రూ.500 వరకూ పోతోంది. అలా పోకుండా ఉంటే మాకు మంచి లాభసాటిగా ఉండేది’’ అని చెప్పాడు. రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లిమార్కెట్ అయిన తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం రైతుకు ఒక్కో కేజీకి రూ.32 చొప్పున లభిస్తుండగా.. వ్యాపారులు హోల్సేల్గా రూ.55-60కి విక్రయిస్తుండటం గమనార్హం. మొత్తమ్మీద ఎలా చూసుకున్నా... రైతు నుంచి మార్కెట్ కొచ్చేసరికి ఉల్లి రెండు నుంచి నాలుగింతలు ఘాటెక్కుతోంది. ఎందుకిలా? తెచ్చేది, కొనేది వారే... వ్యవసాయ మార్కెట్లలో క్రయ విక్రయాలు బహిరంగ వేలం ద్వారానే సాగుతాయి. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయనేది వ్యాపారుల మాట. నిజమే! కానీ వ్యవసాయ మార్కెట్కు వచ్చేవారంతా రైతులేనా? రైతులేమో చేల దగ్గరే సరుకును విక్రయిస్తున్నామంటున్నారు. మరి మార్కెట్కు తెచ్చేదెవరు? వ్యాపారులేగా! సరుకు తెచ్చేవారు, కొనేవారు కుమ్మక్కయి... అంతా కలిసి ఒకే ధర నిర్ణయిస్తే అటు రైతులకు గానీ ఇటు వినియోగదారులకు గానీ దిక్కెవరు? రైతు దగ్గర కిలో రూ.10కి కొన్న వ్యాపారి, అవే ఉల్లిగడ్డల్ని వ ్యవసాయ మార్కెట్లో రూ.40కి విక్రయిస్తే... వాటిని కొన్న వ్యాపారి రూ.42కు హోల్సేలర్కు అమ్మితే... అక్కడి నుంచి రిటైలర్కు.. తర్వాత వినియోగదారుకు వచ్చేసరికి ధర రూ.50-60కి చేరితే దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం కాదా? ప్రతిసారీ ఉల్లిపాయలు జాతీయ స్థాయిలో హాట్టాపిక్గా మారడానికి ఈ సరఫరా లింకేజీ లోపాలే అసలు కారణం కాదా? ఇదీ... రైతు దుస్థితి రైతుల మాటల్లో చెప్పాలంటే వారు నేరుగా తెచ్చి విక్రయించలేరు. అది సాధ్యం కాదు. కారణమేంటంటే స్థానికంగా ఉండే దళారి. గౌరవంగా చెప్పాలంటే ఖరీదుదారు. దళారిని కాదని మార్కెట్లో విక్రయించే పరిస్థితి రైతుకుండదు. ఎందుకంటే తను ఆ రైతుకు ముందే రుణమిస్తాడు. ఇలా రుణాలివ్వటానికి దళారులు ఎప్పుడూ ముందే ఉంటారు. బ్యాంకుల నుంచి రుణం రావటమంటే మాటలు కాదు కనక రైతులెప్పుడూ దళారులనే ఆశ్రయిస్తారు. అవసరాన్ని బట్టి ఈ రుణాలకు నెలకు 4 శాతం వడ్డీ చెల్లించే రైతులూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సాగు ప్రారంభానికి ముందే రైతు, దళారి మధ్య ‘ఒప్పందం’ జరుగుతోంది. పంట చేతికి రాగానే సదరు దళారికి సరుకు పూర్తిగా అప్పగించాలి. దళారి మొదట నిర్ణయించిన ధరకు మించి ఒక్కపైసా రైతుకివ్వడు. ‘‘అవసరమైనప్పుడు సాయం చేస్తారు కాబట్టి వారి మాట వింటాం. వారు చెప్పిన ధరకు సరుకు విక్రయిస్తాం. రూ.6 వేలు అప్పు ఇచ్చిన దళారి కూడా మాకు గొప్పే’’ అని ఓ రైతు చెప్పాడు. ఒకవేళ రేటు గిట్టుబాటు కాదని బతిమాలితే... పంట నాణ్యత సరిగా లేదు. ఇంత కన్నా ఎక్కువ ధర రాదనే సమాధానం ఎదురవుతుంది. పంటను నిల్వ చేసే తాహతు రైతుకుండదు.అందుకే రైతుకు దక్కిందే బంగారం మరి. -
ఉల్లి.. తలచినంతనే కన్నీటి జల్లు!
ఉల్లిపాయ.. పెట్రోలు.. బీరు.. ఈ మూడూ ఇప్పుడు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. దేశ రాజధాని నగరంలో ఉల్లిపాయలు కిలో 80-90 రూపాయలకు పైగా ఉంటోంది. రాష్ట్ర రాజధాని నగరంలో కూడా 40 నుంచి 60 రూపాయలకు ఏమాత్రం తగ్గడంలేదు. రైతు బజార్లలోనే చూసుకున్నా కూడా కిలో ఉల్లిపాయలు 44 రూపాయల వరకు ఉంటున్నాయి. ఉల్లిపాయను కోస్తే కాదు.. తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. వారం కాదు.. నెల కాదు.. దాదాపు మూడు నెలలుగా ఉల్లిపాయ ధరలు ఆకాశంలోనే ఉంటున్నా, ప్రభుత్వాలు మాత్రం చలించిన పాపాన పోవట్లేదు. దేశంలోని చాలా వరకు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయలు కిలో 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్రలో అకాల వర్షాలు కురవడం వల్ల అక్కడి ఖరీఫ్ పంట బాగా దెబ్బతింది. దీంతో దిగుబడి లేక ఉల్లిధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో జనం ప్రభుత్వాల మీద మండిపడుతున్నారు. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదన్న కోపంతో ఉత్తర భారతంలో ఓ వ్యక్తి ఏకంగా ఓ చిరువ్యాపారిని తుపాకితో కాల్చిపారేసిన సంఘటన కూడా జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే ఉల్లిపాయల వాడకం పూర్తిగా మానేశారు. బిర్యానీ, రోటీలు ఆర్డర్ చేసినప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయలు కోసి, నిమ్మకాయ ముక్కలతో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం కేవలం కీరా, క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి రేటు చూస్తే అంత భయపడాల్సి వస్తోంది మరి. ఉల్లిధరలు అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎగుమతుల మీద నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో టన్నుకు 650 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను 900 డాలర్లు చేశారు. అయినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఉల్లిపాయల సరఫరా పడిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈనెలలో ఉల్లిపంట దిగుబడి వస్తుందని, అది బాగా వస్తే అప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఖాయమని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. -
మళ్లీ ఉల్లి ధర భగ్గు
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్:ఉల్లిగడ్డ ధర మళ్లీ భగ్గుమంది. గత రెండు మూడు నెలలుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మొదట రూ. 60 నుంచి 100 రూపాయలవరకు ధర ఉండగా...గత నెలలో మాత్రం కిలో రూ. 40 నుంచి 45 రూపాయలకు విక్రయించారు. ఈ ధర చాలా రోజులు స్థిరంగా ఉంది. అయితే శని, ఆదివారాల్లో ఉల్లి రేటు మళ్లీ రూ.60కి చేరింది. ధరలు తగ్గుతాయని ఆశతో ఉన్న తరుణంలో మళ్లీ పెరగడం సామాన్య ప్రజల ను బెంబేలెత్తిస్తోంది. ధరలకు భయపడి సామాన్య ప్రజలు కొంత కాలంగా ఉల్లిగడ్డ కొనడమే మానేశారు. హైదరాబాద్ మార్కెట్లోనే ఉల్లిగడ్డ ధరలు పెరగడం వల్ల ఇక్కడ కూడా ధరలు పెంచి విక్రయించాల్సి వస్తోం దని ఇక్కడి వ్యాపారులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు. -
ఉల్లిపాయల ట్రక్ బోల్తా
-
ఉల్లి వచ్చేసిందోచ్!
సాక్షి, ముంబై: ఈజిప్టు, పాకిస్థాన్తోపాటు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి నిల్వలు ముంబైకి వస్తుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ఆవరణలోకి ఆదివారం భారీగా సరు కు చేరుకోవడంతో ముంబైకర్లకు త్వరలో చౌక ధరకే ఉల్లి లభిస్తుందని అధికారులు చెబుతున్నా రు. ఇదివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో బేజారవుతున్న ముంబైకర్లకు ఈ ఉల్లిరాకతో కొంతమేర ఊరట లభించనుంది. ఏపీఎంసీలోకి 56 టన్నుల చైనా ఉల్లి దిగుమతి కావడంతో టోకు వ్యాపారులకు దీన్ని రూ.37 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరిగిపోవడంతో గృహిణుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. ధరలను నియంత్రించేందుకు వ్యాపారులు ఈజిప్టు, పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ఉల్లి ధరలు పెద్దగా తగ్గలేదు. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు చైనా నుంచి రెండు కంటెయినర్ల (56 క్వింటాళ్లు) ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఈ ఉల్లి ఏసీ కంటెయిన ర్లో రావడం వల్ల కొంత తడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఆకారంలో ఇవి పెద్దగా ఉండడంతో ఒకే రోజు మొత్తంసరుకు అమ్ముడుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారత్లో ఉల్లి సాగుకు నాసిక్ జిల్లా లాసల్గావ్, నిఫాడ్ ప్రాంతాలు ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలో ఉల్లి పండించే దేశాల్లో చైనా ప్రథమస్థానంలో ఉండగా భారత్ రెండోస్థానంలో ఉంది. 2012లో చైనాలో 2,05, 07,759 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తికాగా భారత్లో 2012లో 1,33,72,100 మెట్రిక్ టన్నుల ఉల్లి పండింది. చైనా ఉల్లి చూడడానికి పెద్దగా, రుచి కూడా ఉంటుంది. 2010లో ఇలాగే ఉల్లి కొరత ఏర్పడినప్పుడు ముంబైకి చైనా నుంచి దిగుమతి అయిం ది. దీంతో ధరలు కొంత అదపులోకి వచ్చాయి. ఒకపక్క వివిధ ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడంతో లాసల్గావ్ మార్కెట్లో ఉల్లి ధరలు 7.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోపక్క ఎపీఎంసీకు చైనాతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రా ల నుంచి పెద్ద సంఖ్యలో ఉల్లి రావడంతో కొత్త ఉల్లి కేజీకీ రూ.25-40 చొప్పున విక్రయిస్తున్నారు. త్వరలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వస్తాయని ఎపీఎంసీకి చెందిన ఉల్లి వ్యాపారి శివాజీ డెంబరే ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆమ్లెట్లో ఉల్లిపాయలు లేవని.. కాల్చిపారేశాడు!!
ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి. పానీ పూరీ నుంచి దేంట్లోనూ ఒక్క ఉల్లిపాయ ముక్క కనపడితే ఒట్టు. ఇలాంటి సమయంలో, ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయడం సాధ్యమేనా? కానీ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదని ఓ వ్యక్తి ఓ చిరు వ్యాపారిని కాల్చి పారేశాడు!! ఈ సంఘటన ఇటా ప్రాంతంలోని అలీగంజ్ సమీపంలో జరిగింది. పూజారి అనేవ్యక్తి పాత నేరస్థుడు. అతడు తనతో పాటు నలుగురు స్నేహితులకు ఆమ్లెట్లు కావాలని ఓ చిరు వ్యాపారి వద్ద ఆర్డర్ చేశాడు. అతడు ఆమ్లెట్లయితే ఇచ్చాడు గానీ, వాటిలో ఉల్లిపాయలు వేలేదు. దీంతో వారందరికీ ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఉల్లిపాయలు కొనేంత స్థోమత తనకు లేదని, అందువల్లనే ఉత్త ఆమ్లెట్లు ఇస్తున్నానని దీపు కశ్యప్ అనే సదరు చిరు వ్యాపారి వారికి చెప్పాడు. వెంటనే పూజారి జేబులోంచి తుపాకి తీసి.. అతడిని కాల్చిపారేశాడు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని, వారి కోసం గాలిస్తున్నామని ఐజీపీ (ఆగ్రా) అశుతోష్ పాండే తెలిపారు. -
ఉల్లి విక్రయ కేంద్రాలు మూత
హోల్సేల్ ధరకే ప్రజలకు ఉల్లిపాయల్ని అందుబాటులో ఉంచుతామన్న అధికారుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయూరుు. ధరలను నియంత్రిస్తామంటూ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడ్డారుు. వాటిని కొనుక్కుందామని వెళ్తున్న వినియోగదారులను ‘తక్కువ ధరకే ఉల్లిపాయలు’ అనే బోర్డులు వెక్కిరిస్తున్నారుు. గత్యంతరం లేక మార్కెట్లోకి వెళ్లి అధిక ధరకు ఉల్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు పట్టణాల్లోని పరిస్థితులపై శుక్రవారం ‘న్యూస్లైన్’ పరిశీలన జరిపింది. తాడేపల్లిగూడెం, న్యూస్లైన్ : ఉల్లిపాయ ధరలు రిటైల్ మార్కెట్లో రూ.60 ఉన్న సమయంలో హడావుడిగా జిల్లా అధికారులు హోల్సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. లాభాలను పక్కనపెట్టి ఉల్లిని హోల్సేల్ ధరకే వినియోగదారులకు విక్రరుుంచాలని ఆదేశించారు. ఈ నేప థ్యంలోనే కర్నూలు ఉల్లికి రాష్ట్రంలోనే ప్రధాన మార్కెట్ అరుున తాడేపల్లిగూడెం వచ్చిన మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ హోల్సేల్ దుకాణాలను తనిఖీ చేశారు. ఇక్కడి మార్కెట్కు ఉల్లిపాయలను తీసుకొచ్చే రైతులతో మాట్లాడారు. తక్కువ ధరకు ఉల్లిని విక్రరుుంచడానికి వ్యాపారులు సహకరించాలని కోరారు. తర్వాత కేఎన్ రోడ్లో తక్కువ ధరకే ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిరకం పాయలను ఈ కేంద్రం ద్వారా కిలో రూ.35కే అమ్మారు. తర్వాత విక్రయాలు ఆగి పోయాయి. చివరకు ఈ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. అక్కడివారిని ఆరాతీస్తే చాలా రోజుల క్రితమే ఈ కేంద్రం మూతపడిం దని చెప్పారు. తడి రకం ఉల్లి వచ్చినప్పుడు మాత్రమే దీనిని తెరుస్తున్నారని చెప్పారు. ప్రస్తుత మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.45 నుంచి రూ.50 ఉండటంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులకే మూత కొవ్వూరు రూరల్, న్యూస్లైన్ : మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గతనెల 22న కొవ్వూరు రైతు బజార్లో ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యత గల ఉల్లిని కిలో రూ.44కే విక్రరుుస్తున్నట్టు మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ కె.నాగేశ్వరశర్మ ఆ సందర్భంలో చెప్పారు. నాలుగు రోజులకే ఇది మూతపడింది. ఈ విషయమై ఇక్కడి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీలతను శుక్రవారం ‘న్యూస్లైన్’ సంప్రదించగా, ఉల్లి ధరలు పెరగడంతో మార్కెటింగ్ శాఖ ద్వారా అప్పట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ధరలు కొంతమేర తగ్గడంతో రైతు బజారులోని దుకాణాల ద్వారా మాత్రమే ఉల్లిపాయలు అమ్ముతున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండు రకాల ఉల్లి అందుబాటులో ఉందని, కిలో రూ.32, మరో రకం రూ.40కు అమ్మేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విక్రయ కేంద్రం జాడేది భీమవరం (టూటౌన్), న్యూస్లైన్ : భీమవరం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రంలో వారం రోజులపాటు మాత్రమే అమ్మకాలు జరిపారు. కిలో రూ.36 చొప్పున విక్రరుుంచారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో ఉల్లి నాణ్యతను బట్టి కిలో రూ.68నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు. జేసీ వచ్చి విక్రయ కేంద్రాన్ని పరిశీలించి వెళ్లారు. వినియోగదారులు ఉల్లి విక్రయ కేంద్రాలకు వెళ్తే స్టాకు లేదు, రావడం లేదని సమాధానం వస్తోంది. దుకాణమే లేదు తణుకు, న్యూస్లైన్ : ఉల్లి ధరలు పెరిగి జనం గగ్గోలు పెడుతున్నా.. ధర నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలు ప్రయోజనం కలిగిం చడం లేదు. పట్టణంలో సుమారు 22 వేల కుటుంబాలు, 90 వేల జనాభా ఉన్నారు. తక్కువ ధరకు కూరగాయలు, ఉల్లిపాయలు అందించేందుకు పట్టణంలో రైతుబజార్ లేదు. ప్రస్తుతం ఉల్లి ధర నాణ్యతను బట్టి తణుకులో కిలో రూ.45 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు ఉల్లి విక్రరుుంచే కేం ద్రాన్ని పట్టణంలో ఏర్పాటు చేయలేదని, ప్రస్తు త ధరకు కిలో ఉల్లి కూడా కొనుగోలు చేయలేక పోతున్నామని పాతూరుకు చెందిన నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయ కేంద్రమా.. అంటే ఏమిటి పాలకొల్లు, న్యూస్లైన్ : మూడు నెలలుగా ఉల్లి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాణ్యతను బట్టి ఇక్కడి మార్కెట్లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యమైన పాయలు పాలకొల్లు మార్కెట్కు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిధరలు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడని వినియోగదారులు వాపోతున్నారు. ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా పాలకొల్లులో వాటి జాడే లేదు. తడిసిన, సగం కుళ్లిపోయిన ఉల్లిపాయలే ఇక్కడి ప్రజలకు దిక్కయ్యూరుు. -
2-3 వారాల్లో ఉల్లి ధరలు తగ్గుముఖం: శరద్ పవార్
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు రెండు మూడు వారాల్లో తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో పండించిన కొత్త పంట మార్కెట్లోకి వస్తుందని, దీంతో కొనుగోలు దారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. గురువారమిక్కడ రైతులు, వర్తకులతో పవార్ సమావేశమయ్యారు. ఖరీఫ్లో సాగుచేసిన ఉల్లి ఆశించిన స్థాయిలో మార్కెట్కు వస్తుందని పవార్ చెప్పారు. ఉల్లి సరఫరా పెరిగే అవకాశముందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉల్లి ధర చిల్లరగా కిలోకు 70-80 రూపాయలు పలుకుతోంది. -
దిగుమతుల యోచన మానుకోరా?
సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, పామాయిల్ తదితర వ్యవసాయోత్పత్తుల దిగుమతులను వచ్చే ఏడాది 50 శాతం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శాసనసభ అంచనాల కమిటీ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉత్పత్తి పెంచడంపై దృష్టిపెట్టకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. ‘ఉల్లిగడ్డను మహారాష్ట్ర, పూలను కర్ణాటక, బియ్యాన్ని పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి, పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి, పామాయిల్ను విదేశాల నుంచి.. దిగుమతి చేసుకోవడమేనా పని?... రైతులకు సబ్సిడీలిచ్చి ఆయా పంటలను బాగా పండించి.. ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే ధ్యాసే మీకు పట్టదా? దిగుమతి ఆలోచనను అసలు మానుకోరా?’ అని శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు ఉల్లిపాయలు, కూరగాయల కొరత, పామాయిల్ దిగుమతి వంటి అంశాలపై సమీక్షించారు. చెరుకు ముత్యంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.ఆర్.ఆమోస్, మల్లాది విష్ణు, పి.నాగేశ్వరరావు, మహేందర్రెడ్డి, పంతం గాంధీ తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఉత్పత్తిలో మన రాష్ర్టం అగ్రస్థానంలో ఉన్నా... విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. పామాయిల్ పంటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పామాయిల్ను ఎగుమతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన రాకపోగా... రూ.వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం శోచనీయమన్నారు. ఉల్లిపాయల తీవ్రకొరతకు దారితీసిన కారణాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది ఉల్లి ధర పడిపోవడంతో గిట్టుబాటు లేదనే భావనతో రైతులు ఈ ఏడాది ఆ పంటవైపు చూడలేదని అధికారులు చెప్పారు. దీనికితోడు మహారాష్ర్టలోనే ఉల్లికి కొరత రావడంతో మన రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీనిపై స్పందించిన సభ్యులు ఉల్లికి కొరత వస్తుందని తెలిసీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. -
ఉల్లి రూ.46
విశాఖపట్నం, న్యూస్లైన్ : ఉల్లి ధర వింటేనే వినియోగదారుల గుండె గుభేల్ మంటోంది. రోజురోజుకు ధర పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఉల్లి లేని కూర నోటికి రుచించకపోవడంతో రెండు కిలోలు కొనాలని మార్కెట్కు వచ్చినవారు కిలోతో సర్దుకుంటున్నారు. ఎంవీపీ కాలనీ రైతు బజార్లో సోమవారం కిలో ఉల్లి రూ.46లకు విక్రయించారు. కర్నూలు హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధర ఆదివారం హటాత్తుగా కిలో రూ.34కు పెరగడంతో అక్కడి నుంచి రావాల్సిన ఉల్లిపాయలు నిలిచిపోయారు. దీంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్లో ఉల్లి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు మూతపడ్డాయి. గత్యంతరం లేక వినియోగదారులు మహారాష్ట్రకు చెందిన ఉల్లి రూ.46కు కొనాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ కర్నూలులో ఉల్లి రేటు తగ్గితే మళ్లీ అమ్మకాలు జరుపుతామన్నారు. అధికారులు ఇప్పటికే హోల్సేల్ వ్యాపారులతో రేటు విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు. -
కొనలేం.. తినలేం
ఉదయగిరి, న్యూస్లైన్: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సంచి నిండా డబ్బు ఎత్తుకెళ్లినా, సరిపడా సరుకులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాపారులు కృత్రిమ నిల్వలు సృష్టించి నిత్యావసర సరుకుల ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు, రాజకీయ నేతలు వ్యాపారులకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెరిగిన ధరలతో కనీసం ఒక పూటైనా పోషకాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారులు మరింత బరితెగించి ధరలు విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. బియ్యం, పప్పుదినుసులు, నూనె, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర మసాలా దినుసులు, ఒకటేమిటి..సరుకు ఏదైనా వాటి ధరలు చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. రూ.500 తీసుకెళితే చిన్న ప్లాస్టిక్ కవరునిండా సరుకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అధికారులు సన్న బియ్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కేంద్రాల్లో కిలో రూ.28కే అందించేందుకు తెరిచిన దుకాణాలు నేడు ఒక్కటీ కనిపించడం లేదు. నాణ్యమైన సన్నబియ్యం ప్రస్తుతం కిలో రూ.55 పలుకుతోంది. నిత్యం ఉపయోగించే శనగ నూనె రూ.110, పామాయిల్ రూ.65 పలుకుతోంది. కందిపప్పు రూ.75,పెసరపప్పు రూ.76,చక్కెర రూ.40కు చేరింది. చింతపండు రూ.116, మినప్పప్పు రూ.55, వేరుశనగ పప్పు రూ.86, శనగపప్పు రూ.75 ధర పలుకుతోంది. కొండెక్కిన కూరగాయల ధరలు జిల్లా కేంద్రంలో ఏసీ కూరగాయల మార్కెట్లో నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్, కడప, చిత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ఎప్పుడూ కిటకిటలాడే ఈ మార్కెట్లో ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పదిరోజుల క్రితం రూ.10 పలికిన పచ్చిమిర్చి నేడు రూ.70కి చేరింది. కడప నుంచి దిగుమతి అయ్యే వంకాయలు 15 రోజుల క్రితం కిలో రూ.25 ఉంటే నేడు రూ.65. గత వారంలో కిలో క్యారెట్ రూ.30 ఉండగా నేడు రూ.60కి అమ్ముతున్నారు. కిలో పది పదిహేను రూపాయలు అమ్మే బీరకాయలు, మటిక్కాయలు కూడా రూ.40 పైనే పలుకుతున్నాయి. ఆలుగడ్డలు రూ.30, బీట్రూట్ రూ.60, క్యాబేజి రూ.30, గోరుచిక్కుళ్లు రూ.60 పలుకుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. అల్లం ధర ఏకంగా రూ.150కి చేరింది. కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలు వంటల్లో ఉల్లిపాయ ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. అలాంటి నిత్యావసర ఉల్లిపాయ ధర చూస్తే మాత్రం వినియోగదారుడికి గుండె ఆగిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో రోజుకు 20 లారీల వరకు ఉల్లిపాయల వినియోగం ఉంది. వారం క్రితం కిలో రూ.30 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.50కి చేరింది. మేలురకం ఉల్లిపాయలు ఏకంగా రూ.70కి ఎగబాకాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లరగా కొనే వినియోగదారులు వీటి వాడకాన్నే మానేసే పరిస్థితి కనిపిస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ఉల్లిపాయల ధరలతో రోజుకు లక్షల్లో వినియోగదారులపై భారం పడుతోంది. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తదితర కారణాలు చూపుతూ వ్యాపారులు సరుకులు బ్లాక్లో నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేస్తున్నారు. -
ఉల్లి లొల్లికి పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్లైన్: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయ విక్రయాల్లో ఏర్పడిన ప్రతిష్టంబన ఎట్టకేలకు తొలగిపోయింది. మార్కెట్కు భారీగా ఉల్లి రావడంతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కూడా వేలం పాట నిర్వహించారు. జాతీయంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు కూడా వేలం పాటల్లో చురుగ్గా పాల్గొన్నారు. లారీ అసోసియేషన్ ఉల్లి రవాణాకు సరైన సమయంలో లారీలు పెట్టడం లేదనే ఆరోపణలపై వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపేశారు. మార్కెట్ కమిటీ అధికారులెవ్వరూ లేకపోవడంతో రైతులు గొడవకు దిగారు. చివరికి కమిటీ పాలక వర్గ సభ్యులు ఫరూక్ అహ్మద్, శేషగిరి శెట్టి తదితరులు జోక్యం చేసుకుని కొనుగోలుదారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మార్కెట్ కమిటీ కార్యాలయంలోనే ఉండి అడిగిన గంటలోపే లారీని పంపే ఏర్పాటు చేశారు. మార్కెట్లో భారీగా ఉల్లి నిల్వలు.. మార్కెట్ యార్డు నిండా ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. శనివారం వేలంపాట నిర్వహించకపోవడం, ఆదివారం మరింత సరుకు విక్రయానికి రావడంతో మార్కెట్లో ఎటు చూసినా ఉల్లి నిల్వలే కనిపించాయి. సుమారు 20 వేల క్వింటాళ్ల నిల్వలుండిపోయాయి. వీటిని వేలంపాట ద్వారా కొనాలంటే రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ మేరకు రైతులు మార్కెట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రేడింగ్ భూతం.. గ్రేడింగ్ చేయకుండానే ఉల్లిని కొనాల్సిన వ్యాపారులు ఒకటికి రెండుసార్లు గ్రేడింగ్ చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యత లేదనే కారణంతో గ్రేడింగ్ సాకుతో వేరుచేసిన ఉల్లిని రైతులు పారబోయాల్సి వస్తోంది. గ్రేడింగ్కు అవకాశం లేకపోయినా మార్కెట్ కమిటీ ఒకసారికి అవకాశం ఇచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు రెండోసారి కూడా చేయిస్తూ రైతులను దెబ్బతీస్తున్నారు. -
ఉల్లి లొల్లి
‘రాఖీ కట్టిన చెల్లికి ఉల్లిపాయలు గిఫ్ట్గా ఇవ్వండి.. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు చూడండి..’ ‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’ ‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’ .... ఇవన్నీ పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తున్న జోకులు. ఉల్లిధర రికార్డు స్ధాయిలో రూ.70కి చేరువ కావడంతో ‘ఆనియన్’ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి... ట్విట్టర్, ఫేస్బుక్లకూ విస్తరించింది. ఉల్లి ధరలపై కార్టూన్లు, కామెంట్స్, జోకుల రూపంలో నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, సిటీబ్యూరో : ప్రజల ఆవేదనకు ప్రతిబింబాలుగా నిలుస్తున్న ‘నెట్’ కామెంట్లు ఇవీ... ‘నేను ఈ మధ్య ఓ జోక్ చూశా.. డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’ ఇది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, నటుడు కమల్ కామరాజ్ తదితర సెలబ్రిటీలు ట్విట్టర్లో షేర్ చేసిన జోక్. ‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లిధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్బేడి ట్విట్టర్లో స్పందించారు. కార్టూన్లు.. ఫేస్బుక్లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్బుక్లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్లు సోషల్ సైట్స్లో హల్చల్ చేస్తున్నాయి. ట్విట్టర్లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ‘ఉల్లి’జోకులు.. ‘ఈ మధ్య బప్పీలహరి ఉల్లి నగలతో కనిపిస్తున్నాడు’ ‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు.’ ‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’ ‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’ ‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’ ‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్లు చేసే అవకాశం ఉంది.’ ‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’ -
పాక్ నుంచి ఉల్లి దిగుమతులు కోరుతున్నాం: వ్యాపారులు
చండీగఢ్: దేశంలో ఉల్లిపాయల కొరత తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా చర్యలు చేపట్టినట్టు అమృత్సర్కు చెందిన వ్యాపారులు తెలిపారు. దీనిలో భాగంగా పాకిస్థాన్ వ్యాపారులు భారత్కు ఉల్లిపాయలను ఎగుమతి చేసుకునేందుకు గాను అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అట్టారీ-వాఘా రహదారి మార్గం ద్వారా భారత్కు ఉల్లిపాయలను ఎగుమతి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పాక్ వ్యాపారులను కోరినట్టు రాజ్దీప్ ఉప్పల్ అనే వ్యాపారి తెలిపారు. సాధారణంగా ఈ మార్గంలో ఉల్లిపాయల ఎగుమతికి పాక్ అనుమతించదని, అయితే, ఈ దారిగుండా ఉల్లిపాయలు భారత్కు చేరుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని, ఈ విషయాన్ని త్వరగా పరిశీలించి అమల్లోకి వచ్చేలా చూడాలని లాహోర్ ఉల్లి వ్యాపారులను అడిగామని రాజ్దీప్ వివరించారు. ప్రస్తుతం భారత్లో కిలో ఉల్లి రూ. 70 నుంచి 80 మధ్య పలుకుతోందని పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటే దీని ధర రూ.40కి పడిపోతుందని ఆయన చెప్పారు. -
వంట.. మంట
సాక్షి, సిటీబ్యూరో:ధరల సెగ దడ పుట్టిస్తోంది. కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. వంటింట్లో ప్రధాన వస్తువులైన పచ్చిమిర్చి, ఉల్లి ధరలైతే.. సామాన్యలకు అందనంత పైకి ఎగబాకాయి. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కిస్తుండగా, ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. వీటి ప్రభావం మిగతా కూరలపై చూపుతోంది. మార్కెట్లో ఏ రకం కొందామన్నా.. రూ.30-80 మధ్య ధర పలుకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు సీమాంధ్రలో ఆందోళనలు, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలో మిర్చి, ఉల్లి, ఇతర కూరగాయలకు కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం పెరగడంతో ధరల దెయ్యం జడలు విప్పుకుంది. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా నగర అవసరాలను ఏమాత్రం తీర్చలేక పోతున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరల కత్తి దూస్తున్నారు. ఇష్టారీతిన పెంచేసి దగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. పాలకులకు పదవులు, పార్టీ వ్యవహారాలు తప్ప అదుపు తప్పిన నిత్యావసరాల ధరలు, ప్రజల బాధల గురిం చి పట్టించుకొనే తీరికే లేకుండా పోయింది. దీంతో సంబంధిత శాఖలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ముందు చూపేదీ? సీమాంధ్రలో ఆందోళనల వల్ల అక్కడి నుంచి నగరానికి కూరగాయలు దిగుమతి ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటప్పుడు ముందస్తు చర్యలు చేపట్టి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తెప్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖది. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రవాణా నిలిచిపోవడంతో మిర్చి కొరత ఎదురైందని సాకుగా చూపుతూ మార్కెటింగ్ శాఖ మౌనం వహిస్తోంది. నగర అవసరాలకు రోజుకు 100-150 టన్నుల మిర్చి కావాల్సి ఉండగా, ప్రస్తుతం 40-50 టన్నులకు మించి సరుకు రావట్లేదు. అలాగే మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులు అనూహ్యంగా పెరగడం, దసరా నాటికి ధరలు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు రైతులు ఉల్లిని గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఉల్లికి మరింత డిమాండ్ ఏర్పడింది. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మహారాష్ట్రలోనే నేరుగా ఉల్లి కొనుగోలు చేసి నగరానికి తెప్పిస్తే ధరలు అదుపులో ఉండేవి. కానీ పట్టించుకోలేదు. ఇక్కడి హోల్సేల్ మార్కెట్కు వచ్చిన సరుకులోనే కొంత (థర్డ్ గ్రేడ్) కొనుగోలు చేసి నామమాత్రంగా ఒక్కో రైతుబజార్కు 10 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి మమ అన్పించారు. రైతుబజార్లో కిలో రూ.25 చొప్పున ఒక్కొక్కరికి 2 కేజీలు అందించి 15 రోజుల పాటు సబ్సిడీపై ఇస్తున్న భ్రమలు కల్పించారు. ప్రస్తుతం సబ్సిడీ ఉల్లి విక్రయాలు సైతం నిలిచిపోయాయి. వాటిపైనా ప్రభావం.. మిర్చి, ఉల్లి ధరలు పెరగడంతో ఈ ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. నిజానికి క్యారెట్, క్యాప్సికం, చిక్కుడు వంటివి తప్ప మిగతా కూరగాయలన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అయితే, వ్యాపారులు సమైక్య ఉద్యమాన్ని సాకుగా చూపి, ధరలు పెంచేశారు. ఉద్యమం ప్రారంభం కాకముందు, అంటే.. జూలై 29 నాటి ధరలతో ప్రస్తుత కూరగాయల ధరలు పోల్చి చూస్తే కిలోకు రూ.5-30 పెరుగుదల కన్పిస్తోంది. హోల్సేల్ మార్కెట్ ధరలకు.. రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. రెట్టింపు రేట్లతో వ్యాపారులు వినియోగదారుడి జేబును పిండుకొంటున్నారు. మార్కెటింగ్ శాఖ స్పందించక పోతే.. ఉల్లి, మిర్చి ధరలు కిలో రూ.100కు చేరే అవకాశం లేకపోలేదు. రేపటి నుంచి రూ.35కే ఉల్లి చాదర్ఘాట్: ఉల్లి ధర ఉరుముతుండడంతో మార్కెటింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం నుంచి రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.35కే విక్రయించనున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కల్పనాదేవి తెలిపారు. ఒక్కొక్కరికి కిలో మాత్రమే అందించనున్నట్లు పేర్కొన్నారు. ధర తగ్గే వరకూ ఈ విక్రయాలు కొనసాగుతాయన్నారు. వారు బుధవారం ఉల్లి వర్తకులతో సమావేశమై చర్చలు జరిపారు. రోజూ 60 క్వింటాళ్ల ఉల్లిని సరఫరా చేసేందుకు వారు అంగీకరించారని తెలిపారు. హాస్టళ్లు, మెస్ చార్జీలకూ రెక్కలు సనత్నగర్, న్యూస్లైన్: పెరిగిన కూరగాయల ధరల ప్రభావం బ్యాచిలర్స్పైనా పడింది. కూరల ధరలు కొండెక్కడంతో హాస్టళ్లు, మెస్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా అమాంతం ధరలు పెంచారు. పెరిగిన ధరల పేరుతో.. వినియోగదారులకు భారీగానే ‘వడ్డిస్తున్నారు’. నిన్న మొన్నటి వరకూ రూ.2,800 ఉన్న హాస్టల్ అద్దె ఇప్పుడు రూ.3,200కు చేరింది. ఇక మెస్లలో భోజనం మరింత ప్రియంగా మారింది. చిన్నపాటి మెస్లో కూడా ప్లేట్ మీల్స్ రూ.80కి చేరింది. కర్రీ పాయింట్ సెంటర్లు కూడా ధరలను పెంచేశాయి. నిన్నటి వరకూ రూ.8-10లకు కర్రీ ఇస్తుండగా, ఇప్పుడు రూ.15 వరకూ పెంచేశారు. దీంతో యువత గగ్గోలు పెడుతోంది. రెండుసార్లు పెంచారు.. మాది శ్రీకాకుళం జిల్లా. ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్ ఉంటూ గ్రూప్-2 ప్రిపేర్ అవుతున్నా. ఏడాదిలోపే రెండుసార్లు అద్దె పెంచారు. అదేమంటే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయనే సాకు చెబుతున్నారు. - సునీల్కుమార్, ఎస్ఆర్నగర్ ఎలా బతికేది? మాది కర్నూలు. అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉండి వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నా. వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. హాస్టల్ అద్దెను రూ.2,800 నుంచి 3,000కు పెంచారు. అదేమంటే ధరలు పెరగడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పేది ఒక రకంగా బలమైన కారణమే అయినా.. నాలాంటి సామాన్యులు నగరంలో ఎలా బతికేది? -కాశీం, అమీర్పేట్ -
కొండెక్కిన ఉల్లిధరలు
-
కన్నీళ్లు తెప్పిస్తున్న ‘ఉల్లి’
వంటింట్లో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఇప్పటికే కిలో రూ. 55 పలుకుతుండగా, రానున్న నాలుగు రోజుల్లో రూ.70కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రజల ఉల్లి అవసరాలను తీరుస్తున్న తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో ధరలు తారాజువ్వలా దూసుకెళుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో రవాణా స్తంభించడం, మహారాష్ట్రలో కృత్రిమ కొరత వంటి పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్కు తగిన స్థాయిలో సరఫరా లేక ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రిటైల్ మార్కెట్లో ముందెన్నడూ కిలో రూ. 20 దాట లేదు. కానీ.. ఈసారి హోల్సేల్ మార్కెట్లోనే కిలో రూ.50 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి ఆ ధర కాస్తా రూ. 55కు చేరింది. మహారాష్ట్ర రకం ఉల్లిపాయల విషయానికొస్తే సోమవారం పదికిలోలు హోల్సేల్ మార్కెట్లో రూ. 575 నుంచి రూ.600 పలికింది. మహారాష్ట్ర ఉల్లిపాయలు సైతం ఇంత ఘాటెక్కడం ఇదే ప్రథమం. ఇవి మూడు నెలలపాటు నిల్వ ఉంటాయి. దీంతో ఈ రకం మరింత ఘాటెక్కుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా బస్సురవాణా పూర్తిగా స్తంభించింది. లారీలు కూడా బయల్దేరిన తర్వత ఎంత సేపటికి గమ్యం చేరుకుంటాయో చెప్పలేని పరిస్థితి. దీంతో ఉల్లిపాయల రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల ధరలు మరింత వేడెక్కుతున్నాయి. సమ్మె ముగిసే అవకాశాలు కూడా ఇప్పట్లో కనిపించకపోవడంతో.. ఇంకెంత పెరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉల్లిపోటు.. మిర్చి ఘాటు
కామారెడ్డి/ నిజాంసాగర్, న్యూస్లైన్ : నిత్యావసరాలు, కూరగాయలు, ఉల్లి, పచ్చి మిర్చి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు అడ్డగోలుగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి మార్కెట్లో కిలో ఉల్లి రూ. 50 కి చేరింది. ఎర్రగడ్డ మాత్రం కిలోకు రూ. 40కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో ధర రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నారు. నిజాంసాగర్ ఎల్లారెడ్డి వారాంతపు సంతలలో ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తారు.జిల్లావ్యాప్తంగా చికెన్ రూ. 150 నుంచి రూ.160 వరకు అమ్ముతున్నా రు. శ్రావణ మాసంలో మాంసాహార విని యోగం తక్కువగా ఉంటుంది. అయినా ధరలు భగ్గుమనడం విశేషం. -
ధరల ఘాటు
తణుకు టౌన్, న్యూస్లైన్ : ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ధరలు ఘాటెక్కారుు. ఉల్లి ధర కనీవినీ ఎరుగని రీతిలో కిలో రూ.50కి ఎగబాకింది. గత వారం కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఆదివారం ఏకంగా రూ.80కు చేరి వినియోగదారుల నషాళమెక్కించింది. నెల రోజులుగా తారాజువ్వల మాదిరిగా ఉల్లి ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నారుు. అరుుతే, మిగిలిన కూరగాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. తణుకు మార్కెట్లో టమాటాలు గత వారం కిలో రూ.40కి అమ్మగా, ఈ వారం రూ.20కి, బీరకాయలు రూ.30, వంకాయలు రూ.32, గోరుచిక్కుడు రూ.40, క్యాప్సికంరూ.50, బీన్స్ రూ.60, దొండకాయలు రూ.20, బంగాళా దుంపలు రూ.20, దోసకాయ కిలో రూ.20 చొప్పున పలికారుు. ములక్కాడలు జత రూ.10, పొట్లకాయ రూ.12, అరటి కాయలు జత రూ.10, ఆనపకాయ రూ.10కి విక్రరుుంచారు. -
ఉల్లికిపాటు
సాక్షి, ముంబై: ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్సేల్ మార్కెట్లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు. ‘భారీ వర్షాల వల్ల గత రెండు నెలలుగా ఉల్లి కొరత ఉంది. ప్రతిరోజూ సుమారు 100కుపైగా వచ్చే ఉల్లి లారీలు ప్రస్తుతం 60 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో సరఫరా తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉల్లిగడ్డ ధరలకు రెక్కలొచ్చాయ’ని నవీముంబైలోని ఏపీఏంసీ ఉల్లి టోకు వ్యాపారి మనోహర్ తోత్లానీ సాక్షికి తెలిపారు. శనివారం పరిశీలిస్తే కేవలం 60 లారీలు ఉల్లిని తీసుకుని ఏపీఎంసీ మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ రోజు ధరలు సాధారణ ఉల్లి రూ. 35 వరకు పలుకగా, నాణ్యమైన ఉల్లి రూ. 45 వరకు పలికిందని ఆయన వివరించారు. మరింత పైపైకే... ముంబై, ఠాణే, నవీముంబైలలో నాణ్యమైన ఉల్లిని రూ. 60 నుంచి రూ. 65 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మనోహర్ తోత్లానీ చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గతంలో ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగానే ఉల్లి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పంట వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాల్లో లాసల్గావ్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా నిల్వలు చాలా తగ్గాయని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఎంత తగ్గితే అంత ధరలు పెరిగే అవకాశముందన్నారు. ఇక చిల్లర మార్కెట్లో ఉల్లిని డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముంబై, ఠాణే, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 50 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తుండడం విశేషం. నగరవాసుల మండిపాటు రోజురోజుకు ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వంటకంలో తప్పక ఉపయోగించాల్సిన ఈ ఉల్లిగడ్డ ధరల రెక్కలకు కళ్లెం వేసేందుకు సర్కార్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపించాలన్నారు. సామాన్యుడికి తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా స్టాళ్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో ఉల్లి అమ్మకాలు ముంబై: ఉల్లిగడ్డ ధరలు ఆకాశన్నంటుతుండటంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తక్కువ ధరకు విక్రయించారు. తమ వార్డుల్లోని 16,000 కుటుంబాలకు ఉల్లిగడ్డలు అమ్మామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎమ్మెన్నెస్ పక్ష నేత దిలీప్ లాండే తెలిపారు. రైతుల నుంచి రూ.22కు కేజీ ఉల్లిగడ్డను కొనుగోలు చేసి రూ.25లకి అమ్మామని తెలిపారు. హోల్సేలర్లే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వచేసి పరోక్షంగా ధరలను పెరిగేలా చేస్తున్నారని విమర్శించారు. గురువారం వరకు రూ.30 నుంచి రూ.32 మధ్యలో ఉన్న ఉల్లి ఆదివారం రూ.60లకు ఎగబాకిందని వివరించారు. పెరిగిన ధరల వల్ల రైతులకు ఏమీ లభం చేకూరడం లేదన్నారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైతే వాషి వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ గోడౌన్లపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఉల్లికిపాటు
సాక్షి, ముంబై: ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్సేల్ మార్కెట్లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు. ‘భారీ వర్షాల వల్ల గత రెండు నెలలుగా ఉల్లి కొరత ఉంది. ప్రతిరోజూ సుమారు 100కుపైగా వచ్చే ఉల్లి లారీలు ప్రస్తుతం 60 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో సరఫరా తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉల్లిగడ్డ ధరలకు రెక్కలొచ్చాయ’ని నవీముంబైలోని ఏపీఏంసీ ఉల్లి టోకు వ్యాపారి మనోహర్ తోత్లానీ సాక్షికి తెలిపారు. శనివారం పరిశీలిస్తే కేవలం 60 లారీలు ఉల్లిని తీసుకుని ఏపీఎంసీ మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ రోజు ధరలు సాధారణ ఉల్లి రూ. 35 వరకు పలుకగా, నాణ్యమైన ఉల్లి రూ. 45 వరకు పలికిందని ఆయన వివరించారు. మరింత పైపైకే... ముంబై, ఠాణే, నవీముంబైలలో నాణ్యమైన ఉల్లిని రూ. 60 నుంచి రూ. 65 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మనోహర్ తోత్లానీ చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గతంలో ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగానే ఉల్లి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పంట వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాల్లో లాసల్గావ్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా నిల్వలు చాలా తగ్గాయని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఎంత తగ్గితే అంత ధరలు పెరిగే అవకాశముందన్నారు. ఇక చిల్లర మార్కెట్లో ఉల్లిని డిమాండ్ను బట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముంబై, ఠాణే, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 50 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తుండడం విశేషం. నగరవాసుల మండిపాటు రోజురోజుకు ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వంటకంలో తప్పక ఉపయోగించాల్సిన ఈ ఉల్లిగడ్డ ధరల రెక్కలకు కళ్లెం వేసేందుకు సర్కార్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపించాలన్నారు. సామాన్యుడికి తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా స్టాళ్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో ఉల్లి అమ్మకాలు ముంబై: ఉల్లిగడ్డ ధరలు ఆకాశన్నంటుతుండటంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తక్కువ ధరకు విక్రయించారు. తమ వార్డుల్లోని 16,000 కుటుంబాలకు ఉల్లిగడ్డలు అమ్మామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎమ్మెన్నెస్ పక్ష నేత దిలీప్ లాండే తెలిపారు. రైతుల నుంచి రూ.22కు కేజీ ఉల్లిగడ్డను కొనుగోలు చేసి రూ.25లకి అమ్మామని తెలిపారు. హోల్సేలర్లే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వచేసి పరోక్షంగా ధరలను పెరిగేలా చేస్తున్నారని విమర్శించారు. గురువారం వరకు రూ.30 నుంచి రూ.32 మధ్యలో ఉన్న ఉల్లి ఆదివారం రూ.60లకు ఎగబాకిందని వివరించారు. పెరిగిన ధరల వల్ల రైతులకు ఏమీ లభం చేకూరడం లేదన్నారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైతే వాషి వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ గోడౌన్లపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు.