online shopping
-
అమెజాన్లో షాపింగ్.. కొత్త చార్జీలు
వస్తువు ఏదైనాఇప్పుడు చాలా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. మంచి డిస్కౌంట్లు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ఆ డిస్కౌంట్ల మీదనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కన్ను పడింది. ‘డిస్కౌంట్లు ఊరికే రావు’ అంటోంది.సాధారణంగా చాలా ఈ-కామర్స్ సైట్లలో వస్తువుల కొనుగోలుపై వివిధ బ్యాంకులు తమ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణ తగ్గింపులు ఇస్తుంటాయి. అయితే అమెజాన్లో వీటిని వినియోగించుకోవాలంటే కొంత మొత్తం ఆ ఈ-కామర్స్ కంపెనీకీ ఇవ్వాలి. రూ .500 లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (ఐబీడీ) ఉపయోగించే కొనుగోళ్లకు అమెజాన్ రూ .49 ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టింది.డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు రుసుమా?అవును, మీరు విన్నది నిజమే. కొనుగోలుదారులు డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు అమెజాన్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇలాంటి రుసుమును మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇప్పటికే వసూలు చేస్తోంది. ఈ బ్యాంకు ఆఫర్ల నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చును భరించడానికి ఈ రుసుము సహాయపడుతుందని అమెజాన్ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, ఇది మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి చిన్న సర్వీస్ ఛార్జీ వంటిది.అమెజాన్లో ఏదైనా ఆర్డర్పై మీరు రూ .500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ను వర్తింపజేస్తే, అమెజాన్ మీ మొత్తం బిల్లుకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ .49 జత చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ .5,000 విలువైన వస్తువును కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. మీ బ్యాంక్ మీకు రూ .500 తగ్గింపు ఇస్తుంది. అప్పుడు సాధారణంగా అయితే రూ.4,500 చెల్లించాలి. కానీ ఇప్పుడు, అమెజాన్ రుసుముగా రూ .49 వసూలు చేస్తోంది కాబట్టి మీరు చెల్లించాల్సిన తుది మొత్తం రూ .4,549 అవుతుంది.ఈ రుసుమును ఎవరు చెల్లించాలి?రూ.500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ వినియోగించుకునే వారు.ప్రైమ్ సభ్యులకు కూడా మినహాయింపు లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది.డిస్కౌంట్ రూ.500 లోపు ఉంటే ఈ ఫీజు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఒకవేళ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా లేదా రిటర్న్ చేసినా కూడా రూ.49 ఫీజు రీఫండ్ కాదు. -
వి వాంట్.. డిస్కౌంట్
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. మొబైల్ షాపింగ్కి పెరుగుతున్న ఆదరణఆన్లైన్ షాపింగ్లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.ఆన్లైన్ షాపింగ్కే ఓటు..గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది. ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్లైన్ స్టోర్లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. -
క్విక్ కామర్స్పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్ఫామ్లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్స్టాగ్రామ్లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్ లింక్పై క్లిక్ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్ బుక్ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్ ఓపెన్ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్పై క్లిక్ చేసి రిటర్న్ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్ కనిపించలేదు. మెయిల్ చేసినా స్పందన కరవైంది. హెల్ప్లైన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్కు లింక్లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాటించాల్సిన జాగ్రత్తలుఆన్లైన్ షాపింగ్ కోసం ప్రముఖ వెబ్సైట్లనే వినియోగించాలి.అధికారిక పోర్టల్స్, యాప్లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్లపై క్లిక్ చేయకూడదు.ప్రతి వెబ్సైట్లో ‘కాంటాక్ట్ అజ్’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్సైట్లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్ను నెట్లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్ బుక్ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ అందించి దాన్ని ఓపెన్ చేసేలా చూసుకోవాలి.పార్శిల్ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.మోసం జరిగితే consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ నంబర్ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్ చేయవచ్చు. -
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్గా అమెజాన్ రికార్డ్ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్బస్టర్ సేల్తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
డిజిటల్ లావాదేవీల వైపు రుణగ్రహీతల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్లైన్ షాపింగ్లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్లు లేదా వెబ్సైట్లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు (అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు. డేటా గోప్యత కోసం డిమాండ్ రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు. సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్సైట్లు, యాప్లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెరిగిన చాట్బాట్స్, వాట్సాప్ వాడకం వినియోగదారుల సేవలో చాట్బాట్లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది. -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్కామర్స్ ప్రాధాన్య ఛానల్గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్ను ప్రధాన ఛానల్గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్కు డిమాండ్ను పెంచుతున్నట్టు వివరించింది. -
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్కార్ట్ సీజన్సేల్.. ఆఫర్లు ఇవే..
ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ సేల్లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024లో భాగంగా ఫ్లిప్కార్ట్ 12,000 బ్రాండ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్లో అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్కార్ట్ ఈ సేల్లో భాగంగా తమ కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్ను అందిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్స్టాంట్ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డేఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్లో పేరున్న బ్రాండ్లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్లు, పార్టీ డ్రెస్లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
మీషో కూపన్ల పేరిట సైబర్మోసం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. వివరాలిస్తే అసలుకే మోసం...ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ ‘ట్మాల్’ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్సైట్లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్ల నుంచి యాపిల్కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. కిరాణాకొట్టులోని చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నింటికీ యూపీఐ వాడుతున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు యూపీఐని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు తమ వినియోగదారులకు మరింత సేవలందించేలా ఈ కామర్స్ సంస్థలు మరోఅడుగు ముందుకేసి ఇతర బ్యాంకులతో కలిసి యూపీఐను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లోకి అడుగుపెట్టింది. యాక్సిస్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదార్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? వినియోగదార్లు ఫ్లిప్కార్ట్ యాప్లో, యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా వ్యాపారులు, ఇతరులకు చెల్లింపులు చేసుకోవచ్చు. థర్డ్పార్టీ యూపీఐ యాప్లైన పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే ఈ సేవలు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే..
ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి.. ముందూ వెనక ఆలోచించకుండా నచ్చిన ఐటమ్ బుక్ చేసేస్తుంటారు. ఓ లాటరీ తగిలిందంటే లేదా ఓ ఆఫర్ ఇస్తున్నారంటే ఎందుకు, ఏంటి, ఎలా అన్న కనీస ఆలోచన లేకుండా సంబంధిత లింక్పై క్లిక్ చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తీర ఏదైనా లింక్పై క్లిక్ చేసి సైబర్ సేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ డిజిటల్ రంగంలో పురోగమిస్తోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సామగ్రి వరకు అన్నీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో విక్రయదారులు కస్టమర్లను ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. స్మార్ట్పోన్లు వచ్చినప్పటి నుంచి చదువు ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా వాటిని ఉపయోగించి ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి సైబర్నేరాలకు సంబంధించిన అవగాహనలేక కొందరు నేరస్థుల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన ఒక పాడి రైతు ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేయాలనుకుని సైబర్ నేరస్థులకు చిక్కి మోసపోయిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్బీర్(50) అనే పాడి రైతు ఆవులను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆఫ్లైన్ రేట్లతో పోలిస్తే ఆన్లైన్లో భారీ రాయితీ ఉండడం గమనించాడు. దాంతో ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. ఈ మేరకు తన తండ్రి డబ్బు పోగొట్టుకున్న సంఘటనను తన కుమారుడు ప్రవీణ్ (30) వివరించాడు. ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్బీర్ నిత్యం పర్వీన్ ఫోన్ను ఉపయోగించేవాడు. యూట్యూబ్ వీడియోలను చూసేవాడు. గూగుల్లోని ఓ వెబ్సైట్లో ఆవులను చాలా తక్కువ ధరకు రూ.95,000కు అందజేస్తుందని గ్రహించాడు. ఇది సాధారణ ఆఫ్లైన్ ధరతో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకున్నాడు. ఆన్లైన్లో ఆవులకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆవుల కోసం ఆరాతీస్తున్న విషయాన్ని తెలుసుకున్న సైబర్ సేరస్థులు ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్లో ఆవుల ఫోటోలను పంపడం ప్రారంభించారు. మొదట ఒక్కో ఆవు ధర రూ.35,000 అని పేర్కొన్నారు. నాలుగు ఆవులను కొనుగోలు చేసేందుకు సుఖ్బీర్ ఆసక్తి చూపగా, గోశాల కింద ఆవులను రిజిస్టర్ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చారు. పైగా ధరను రూ.95,000కు తగ్గించారు. దాంతో అది నమ్మి ప్రవీణ్ తండ్రి జనవరి 19, 20 రోజుల్లో మొత్తం రూ.22,999 నగదు వారికి పంపించాడు. స్కామర్లు ముందుగా నిర్ణయించిన దానికంటే మరింత అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆవులను పంపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన సుఖ్బీర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420 కింద ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ఆన్లైన్ మోసాలకు బలవకుండా ఉండాలంటే కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా లింకులపై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. మీకు తెలియని వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే షాపింగ్ చేయడం ఉత్తమం. అడ్రస్ బార్లో https (http కాదు) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఆఫర్లు ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్సైట్ల జోలికివెళ్లొద్దు. ఈ కామర్స్ వెబ్సైట్కు సంబంధించిన లాగిన్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ధర, డెలివరీ డేట్ లాంటి కొన్ని వివరాలు చూసి.. పేమెంట్ చేసేయకూడదు. ఆ ప్రోడెక్ట్ ఎప్పుడొస్తుంది, దాని ఎక్స్ఛేంజ్ పాలసీ, రిటర్న్ పాలసీ లాంటివి కూడా చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే.. అంత మంచిది అని చెబుతుంటారు. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
షాపింగ్ వైపే భారతీయుల చూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ప్లేస్ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ విధానంగా నిలిచింది. ఇన్–స్టోర్ షాపింగ్ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్లైన్ షాపింగ్ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్ రుణ సంస్థ నౌగ్రోత్ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. కుటుంబంతో షాపింగ్.. హోమ్ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్ నుండి షాపింగ్ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్ స్టోర్లో కుటుంబ షాపింగ్ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ సమయంలో.. భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విక్రయ ప్లాట్ఫామ్లలో ప్రత్యేకంగా షాపింగ్ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్లైన్ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్–ఎక్స్ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్లో 11 శాతం మంది ఆన్లైన్ వేదికగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ సేల్స్, ఈ–కామర్స్ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్లైన్లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ సమయంలో మాత్రమే ఆన్లైన్ షాపింగ్ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఈ–కామర్స్తో ముప్పు లేదు.. తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్లో ఎఫ్ఎంసీజీ, రిటైల్ అమ్మకాల్లో ఆఫ్లైన్ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో ఆఫ్లైన్ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ సహాయంతో రిటైల్ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. -
షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే..
Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్లైన్, ఆన్లైన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్కార్డులతో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్కార్డ్తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్లైన్ షాపింగ్పై 5 శాతం క్యాష్బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్లైన్లో షాపింగ్ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లపై 4 శాతం క్యాష్బ్యాక్ను ఈ క్రెడిట్ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్బ్యాక్ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే. అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్బ్యాక్ను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డ్ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్ట్రిప్, కల్ట్ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్ఫామ్స్లో చెల్లింపులపై 4 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్బ్యాక్లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు. -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
‘రహస్య అల్గారిథమ్’ ద్వారా రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్.. ఎలాగంటే..
దిగ్గజ ఆన్లైన్ ఈకార్ట్ ప్లాట్ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. అమెజాన్ ఆన్లైన్ సూపర్స్టోర్ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది. కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్లు, హాలిడే షాపింగ్ సీజన్లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే.. అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు. -
ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్లైన్లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ఆ స్మార్ట్ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారంటే!
భారత్లో రెండు ఈ -కామర్స్ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్లో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు? దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్స్లో సరికొత్త రికార్డ్లను నమోదు అవుతున్నాయి. స్పెషల్ సేల్లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు కొనుగోలు దారుల డిమాండ్ దృష్ట్యా ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్లో కొనుగోలు దారులు మొబైల్, గృహోపకరణాలు (Appliance), లైఫ్స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ►ఫ్లిప్ కార్ట్లో టైర్-2 ప్లస్ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ►ఇక, అదే సైట్లో 1-2 అండ్ 3 టైర్ సిటీస్కు చెందిన కస్టమర్లు మొబైల్స్, అప్లయెన్సెస్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. అమెజాన్లో 9. కోట్ల మంది మరోవైపు అమెజాన్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్ సైట్ని వీక్షించారు. ఆఫోన్ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు అమెజాన్ పోర్టల్లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్లలో స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. ఆ ఫోన్లలో వన్ప్లస్, శామ్ సంగ్, యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్ ప్లస్ ఫోన్ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 75 శాతం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2-3 టైర్ (సిటీస్/టౌన్ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్ఫోన్లు అమ్మినట్లు అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధర, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. నిమిషానికో టీవీ తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్ కోసం ఆర్డర్ పెట్టారు. 2-3 టైర్ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు. అందం మీద ఆసక్తితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్పై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్ను విడుదల చేసింది. బిగ్ బిలియన్ డే సేల్లో ఒకరోజు ముందే షాపింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ సబ్స్క్రైబర్లు గ్రూమింగ్ సంబంధిత ప్రొడక్ట్లతో పాటు ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, మేకప్, స్ప్రే బాటిల్స్ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్రీస్ నివేదించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గత ఏడాదిలో అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు ఫ్లిప్కార్ట్లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్,కోల్కతా, చెన్నై, గూర్ గావ్ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి. -
పండుగల్లో ఆన్లైన్ షాపింగ్.. 81 శాతం మంది
న్యూఢిల్లీ: రానున్న పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు అధిక శాతం వినియోగదారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మరింత ఖర్చు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అమెజాన్ ఇండియా తరఫున నీల్సన్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మెట్రోలు, చిన్న పట్టణాలకు చెందిన 8,159 మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. సర్వేలోని అంశాలు.. ► మెట్రోల నుంచి 87 శాతం మంది, టైర్–2 పట్టణాల (10–40 లక్షల జనాభా ఉన్న) నుంచి 86 శాతం మంది ఈ ఏడాది పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేయనున్నట్టు చెప్పారు. మొత్తం మీద 81 శాతం మంది ఆన్లైన్ షాపింగ్కు మొగ్గు చూపిస్తున్నారు. ►ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది షాపింగ్పై ఎక్కువ ఖర్చు చేస్తామని తెలిపారు. ►పెద్ద గృహోపకరణాల కొనుగోలుకు పండుగ షాపింగ్ కార్యక్రమాల వరకు వేచి చూస్తామని ప్రతి నలుగురిలో ముగ్గురు చెప్పారు. ఈ ఫెస్టివల్ సేల్ కార్యక్రమాలనేవి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు తదితర కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు వీలు కల్పిస్తాయన్నది వారి అభిప్రాయంగా ఉంది. ►స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పండుగల విక్రయ కార్యక్రమాల వరకు ఆగుతామని 76 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది రూ.10,000–20,000 బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు 5జీ ఫోన్ తీసుకుంటామని చెప్పారు. ►76 శాతం మంది లగ్జరీ, విశ్వసనీయమైన సౌందర్య ఉత్పత్తులను పండుగల సందర్భంగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆనందంగా ఉంది.. ‘‘ఈ ఏడాది వినియోగదారులు ఆన్లైన్లో మరింత షాపింగ్ చేసేందుకు సుముఖంగా ఉండడం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్ డాట్ ఇన్ను విశ్వసనీయమైన, ప్రాధాన్య, ఇష్టపడే షాపింగ్ వేదికగా ఉందని తెలుసుకునేందుకు ఆనందంగా ఉంది’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ పేర్కొన్నారు. రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఆన్లైన్ అమ్మకాలు బలహీనంగా ఉంటే, చివరి మూడు నెలల్లో పండుగల వాతావరణంతో విక్రయాలు 15 శాతం వృద్ధి చెందుతాయని వర్తకులు అంచనా వేస్తున్నారు. లాభదాయక పండుగల సీజన్పై బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నట్టు రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. 2023 పండుగల సీజన్ ముందు వందలాది విక్రేతల (ముఖ్యంగా చిన్న వర్తకులు) అభిప్రాయాలను రెడ్సీర్ తన అధ్యయనంలో భాగంగా తెలుసుకుంది. అన్ని విభాగాల్లో పండుగల విక్రయాలు అధిక స్థాయిలో ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘పండుగల సీజన్లో 15 శాతం అధిక అమ్మకాలు నమోదవుతాయనే అంచనాతో ఆన్లైన్ విక్రేతలు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై విక్రయాలు బలంగా ఉన్నా కానీ, ఇంతకంటే అధిక విక్రయాల కోసం విక్రేతులు చూస్తున్నారు’’ అని రెడ్సీర్ స్ట్రాటజీ పేర్కొంది. క్రితం ఏడాది పండుగల సీజన్లో అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా ఉన్న విషయాన్ని పేర్కొంది. విక్రేతల ఆశావహ ధోరణికి అనుగుణంగా తగిన పరిష్కారాలను ఈ కామర్స్ సంస్థలు రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కామర్స్ సంస్థల నుంచి డేటా అనలైటిక్స్, వినియోగ ధోరణలు ఎలా ఉన్నాయి తదితర రూపాల్లో తమకు బలమైన మద్దతు లభిస్తున్నట్టు విక్రేతలు చెప్పారు. విక్రేతల్లో బుల్లిష్ సెంటిమెంట్ నేపథ్యంలో ఆన్లైన్ ప్రకటనల వ్యయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్టు రెడ్సీర్ పేర్కొంది. పండుగ సీజన్ విక్రయాల్లో 40 శాతం వృద్ధి: గోద్రెజ్ అప్లయెన్సెస్ ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 30–40 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల్లో ప్రీమియం ప్రోడక్టుల వాటా 35 శాతంగా ఉందని, దీన్ని 40 శాతానికి పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ సందర్భంగా పలు ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు నంది తెలిపారు. 4 డోర్ల రిఫ్రిజిరేటర్లు, స్టీమ్ వాష్ సదుపాయం గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు, టర్బో చిల్ సిరీస్ ఎయిర్ కండీషనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వారంటీ పొడిగింపు, క్యాష్బ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ప్రీమియం ఉత్పత్తులు మొదలైన అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు నంది వివరించారు. -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్టైమ్ ఫేవరెట్స్గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..! ఇక అంతే సంగతులు..!!
వరంగల్: ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్పై అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. షోరూంలలో కనిపించని వస్తువులు అనేకం ఆన్లైన్ షాపింగ్లో దర్శనమిస్తున్నాయి. అయితే నెట్లో కనిపించే ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలన్నీ నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రచారంలో చెప్పేదొకటి.. ఆర్డర్ ఇవ్వగానే డెలివరీ అయ్యేది మరోటి. పైగా ధరల్లో తేడాలు. దీని గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్లో చాలా తక్కువ ధరలకే వివిధ రకాల ఉత్పత్తులను లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, రెడీమేడ్స్, లేడీస్ యాక్సెసరీస్, కాస్మోటిక్స్, స్మార్ట్ఫోన్లు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్డర్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయా కంపెనీలు వాటిని ఇంటికే నేరుగా సరఫరా చేస్తాయి. ఇంట్లో కూర్చోనే కావాల్సిన వస్తువులను హాయిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చూడడానికి, వినడానికి ఇది ఎంతో బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వస్తువులు ఇంటికి రాగానే వాటిని చూసి అవాకై ్కపోతున్న వారు అధిక శాతం మంది ఉన్నారు. ఆకర్షణలకు లొంగొద్దు.. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చే కంపెనీల్లో నమ్మకమైనవే కాకుండా కొన్ని బోగస్ కంపెనీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక స్మార్ట్ఫోన్కు ధర చెల్లిస్తే ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెప్పారు. తీరా ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్యాక్ను తెరిస్తే బొమ్మ ఫోన్ లేదా రాళ్లు నింపి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే రెడీమేడ్ వస్తువులు ఆర్డర్ ఇస్తే నాసిరకం ఉత్పత్తులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా వారిచ్చిన నంబర్కు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. దీంతో తాము మోసపోయమని గ్రహించిన పట్టించుకునే వారు ఉండరు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని ఉండడం మంచిది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు.. ► సదరు కంపెనీ ఎలాంటి ఉత్పత్తులపై వ్యాపారం చేస్తుందో గమనించాలి. ► కంపెనీకి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువులు, షాపింగ్ మాల్స్లో లభించే వస్తువుల ధరల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో గమనించాలి. ► ఆయా ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్స్, వివిధ రకాల ఆఫర్ల గుర్తించి అవగాహన ఉండాలి. ► బోగస్ కంపెనీల గురించి తరచూ పత్రికల్లోకానీ, పోలీసులు చెబుతుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ► ఆన్లైన్ మోసాలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ► ఎప్పుడైనా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ► ఆన్లైన్ కంపెనీలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. వాటి అడ్రస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే సదరు నంబరుకు ఫోన్ చేయాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్పై కంపెనీల చిరునామా, ఎప్పుడు తయారయ్యాయే? గమనించడంవంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లను నమ్మితే ఇక అంతే.. డిస్కౌంట్లు.. డిస్కౌంట్లు. అప్టు 50 పర్సంట్, 75 పర్సంట్ వరకు తగ్గింపు.. ఒక వస్తువు కొంటే మరోటి ఫ్రీ.. పైగా ఉచిత డోర్ డెలివరీ.. ఇలా ఒకటేమిటి ఆన్లైన్ షాపింగ్లో అన్నీ ఇలాంటి ఆఫర్లే దర్శనమిస్తాయి. బోగస్ ప్రకటనలెన్నో. ఇందులో కొన్ని నిజం కూడా కావొచ్చు.. అయితే ఉద్యోగాలు, ఇంటి పనులతో సమయం చిక్కని వారికి ఆన్లైన్ షాపింగ్ వరమే. కానీ ఆన్లైన్ షాపింగ్లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తగిన సూచనలు పాటిస్తూ, విచక్షణ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి ఆన్లైన్లో కనిపించే ప్రతి ప్రకటన నిజమేననే భ్రమ వీడాలి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆయా కంపెనీలకు ఉన్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడు మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. –సార్ల రాజు సీఐ, కాజీపేట -
ఊరు.. షాపింగ్ జోరు.. ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: భారత్ ఆన్లైన్ షాపింగ్, ఈ–కామర్స్ మార్కెటింగ్లో ద్వితీయశ్రేణి, అంతకంటే తక్కువస్థాయి పట్టణాలు కూడా సత్తా చాటుతున్నాయి. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా కొన్ని సందర్భాల్లో అగ్రశ్రేణి నగరాల కంటే కూడా చిన్న నగరాల్లోని వినియోగదారులు ఆన్లైన్ కొనుగోళ్లలో ముందుంటున్నాయి. ఆన్లైన్ షాపర్స్ ఏడాదికి సగటున 149 గంటలు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్పై కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ రిటైల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి ప్రాధమ్యాలు, ప్రాధాన్యతలు, అలవాట్లు, షాపింగ్ చేసే పద్ధతులపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అధ్యయనం నిర్వహించింది. కన్జూమర్ యాస్పిరేషన్ అండ్ ఈ–కామర్స్ ఇన్ భారత్ పేరిట జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ షాపింగ్కు మొగ్గు ఎందుకంటే... ఆన్లైన్ షాపింగ్ వైపు కస్టమర్లు ఆకర్షితులు కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఆకర్షణీయమైన ధరలు, కలర్, సైజులు మొదలైనవి నచ్చకపోతే రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకొనే సదుపాయం, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల వంటివి ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశీలనలో గుర్తించారు. ఈ అంశాల ప్రాతిపదికన భారత్లో ఈ–కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించడంతోపాటు పెద్ద సంఖ్యలో ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ఆకర్షితులవుతున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యాంశాలివే... ♦ ఆన్లైన్ షాపింగ్కు వారానికి రెండున్నర గంటల సమయాన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోని పౌరులు వెచ్చిస్తున్నారు. ♦ తమ ఆదాయంలో 16% ఆన్లైన్ కొనుగోళ్లకు వారు ఖర్చు చేస్తున్నారు. ప్రథమశ్రేణి నగరాల్లో ఇది 8% గానే ఉంటోంది. ♦ ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్లో అధికంగా కాలక్షేపం చేస్తున్న వారిలో గువాహటి, కోయంబత్తూరు, లఖ్నవూ వంటి ద్వితీయశ్రేణి నగరాల ప్రజలు ముందువరుసలో నిలుస్తున్నారు. ♦ ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరువాసులు వారానికి 4 గంటలపాటు ఆన్లైన్ షాపింగ్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు ♦ గత 6 నెలల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు సగటున రూ. 20 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు. ♦ ఈ విషయంలో ముంబై అత్యధిక సగటు రూ. 24,200 వ్యయంతో తొలిస్థానంలో నిలిచింది. ♦ ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్ ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ♦ దుస్తులు, బెల్ట్లు, బ్యాగ్లు, పర్సులతోపాటు ఎల్రక్టానిక్ పరికరాలను ఎక్కువగా కొంటున్నారు. ♦ నాగ్పూర్లో అత్యధికంగా 81 శాతం మంది ఆన్లైన్లో ఎల్రక్టానిక్ వస్తువులు, పరికరాలు కొన్నారు. -
సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్'..నివేదికలో ఆసక్తికర విషయాలు..
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక వినియోగదారులు ఇంటర్నెట్ను వినోద మాద్యమాలను వీక్షించేందుకే ఉపయోగిస్తున్నారు. వారు వినోదమే ప్రధానం అంటున్నారు. సోషల్ మీడియాపట్ల వారిలో నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లుతోంది. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటం మార్కెట్పై ప్రభావం చూపుతుందన్నది స్పష్టమవుతోంది. ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2022’ నివేదిక భారతీయుల ఇంటర్నెట్ వినియోగ అభిరుచి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు.. ముందు వినోదం.. ఆ తర్వాతే సమాచారం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అత్యధికులు వినోదం కోసమే దానిని వినియోగిస్తున్నారు. మొత్తం వినియోగదారుల్లో 85 శాతం మంది వినోదం కోసమే నెట్ను ఉపయోగిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ గేమ్స్, క్రీడా కార్యక్రమాల వీక్షణం మొదలైన వాటికే ఇంటర్నెట్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాక.. ► వినోదం తరువాత రెండో స్థానంలో అత్యధికులు సమాచార సాధనంగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. 77శాతం మంది వాట్సాప్, ఫోన్కాల్స్, వెబ్సైట్లు, తమ ఆఫీసు వ్యవహారాల కోసం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ► 2022లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో వచి్చన గణనీయమైన మార్పు సోషల్ మీడియాపై ఆసక్తి సన్నగిల్లడం. 2021లో 78శాతం మంది సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ను వినియోగించేవారు. అదే 2022 నాటికి అది 70 శాతానికి పడిపోయింది. ఇప్పటికీ మొత్తం వినియోగదారుల్లో సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ను వినియోగించే వారు మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక వాణిజ్య, వ్యాపార లావాదేవీల కోసం ఇంటర్నెట్ వినియోగించే వారు 52% మంది. 2021 కంటే వాణిజ్య అవసరాల కోసం ఇంటర్నెట్ వినియోగించే వారు 14% మంది పెరిగారు. వీరిలో పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన వారు 65% మంది. ► ఇక దేశంలో ఆన్లైన్ షాపింగ్ పట్ల వినియోగదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 34 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్ను ఉపయోగించే వారు 2021 కంటే 2022లో 19 శాతం మంది పెరిగారు. ► ఇక ఇంటర్నెట్ వినియోగదారుల్లో 61% మంది పట్టణ, 31% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. భారీగా పెరుగుతున్న వినియోగదారులు ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 75.90 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఏదో ఒక రీతిలో దీనిని వినియోగిస్తున్నారు. 2021 కంటే 2022లో ఇంటర్నెట్ వినియోగదారులు 10శాతం పెరిగారు. 2025 నాటికి ఈ సంఖ్య 90 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. చదవండి: వాట్సాప్లో చీటింగ్! -
ఖర్చుకు వెనకాడేది లేదు.. కోరుకున్నది కొనేస్తున్నారు!
ఆన్లైన్ షాపింగ్పై మధ్య వయస్కు ల అధికాసక్తి బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, తదితరాల కొనుగోళ్లకు మొగ్గు కరోనా కాలంలో పెరిగిన ఆసక్తి క్రమంగా అలవాటుగా మారుతున్న వైనం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఓ కొత్త వర్గం కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్పై అధికాసక్తి చూపిస్తున్నారు. నవతరం ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ 35 ఏళ్లకు పైబడిన వారు ఈ తరహా షాపింగ్పై అధికంగా మొగ్గుచూపుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ రకాల బ్రాండెడ్ వస్తువులు మొదలుకుని ఫ్యాషన్ దుస్తులు, ఇతర కొనుగోళ్లలో వీరు ముందున్నట్టు స్పష్టమౌతోంది. వివిధ రకాల యాప్లు, వెబ్సైట్ల వాడకంలో యువతరం ముందున్నా, ఇప్పుడు మధ్య వయస్కు లు కూడా ఈ విషయంలో వారితో పోటీ పడుతున్నారు. కరోనా మహమ్మారి కాలంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోళ్లు ఊపందుకోగా తర్వాతి కాలంలో ఇది మరింత విస్తరించింది. క్రమంగా ఇది అలవాటుగా కూడా మారినట్లు వెల్లడవుతోంది. 2021లో మూడు నుంచి నాలుగు కోట్ల మంది కొత్తగా ఆన్లైన్ షాపర్స్ జాబితాలో చేరగా, అందులో 67 శాతం మంది 35 ఏళ్లకు పైబడిన వారే ఉండటం గమనార్హం. కాగా అందులోనూ అధికశాతం మెట్రో నగరాలకు చెందని చిన్న పట్టణాల మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. వివిధ బ్రాండ్ల దుస్తులు గతంలో అందుబాటులో లేక నిరుత్సాహపడిన వీరంతా, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ద్వారా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ బ్రాండెడ్ వస్తువులపై తమకున్న మోజును, ఇష్టాన్ని చాటుతున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యాంశాలివే... కొత్త ఆన్లైన్ కస్టమర్లు డిజిటల్ విధానాలను గతంలో అంతగా వినియోగించక పోయినా, ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సులభంగా షాపింగ్ చేసే పద్ధతులను అన్వేషిస్తున్నారు ఆన్లైన్లో వివిధ వస్తువులను షాపింగ్ చేస్తున్నపుడు ప్రాంతీయ భాషల్లో వాయిస్, వీడియో అసిస్టెన్స్ సర్విసులను సైతం వీరు ఉపయోగిస్తున్నారు ఈ సెగ్మెంట్ కస్టమర్లకు దగ్గరయ్యేందుకు చిన్న, మధ్యతరహా విక్రయదారుల ద్వారా స్థానికంగా ఆయా ఉత్పత్తులుఅందుబాటులోకి వచ్చేలా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ కామర్స్ కంపెనీలు తమ వంతు కృషి చేస్తున్నాయి తమకు గతేడాది రెండో శ్రేణి నగరాలు, అంతకంటే కిందిస్థాయి ప్రదేశాల నుంచే 80 శాతం ఆర్డర్లు వచ్చినట్టుగా మీషో వెల్లడించింది రాబోయే మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే 50 శాతం ఆదాయం వస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది గతంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్లైన్ కంపెనీలు డిస్కౌంట్లు, ఇతర మార్కెటింగ్ టెక్నిక్లను ఉపయోగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్విసెస్ వంటివి మామూలై పోయాయి. గతంలో ఏవైనా దుస్తులు, వస్తువులు, ఇతర వస్తువులను కస్టమర్లు కొనేలా చేసేందుకు వాటిని వారి చేరువగా తీసుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముడయ్యేలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి రావడంతో వీరు, వారు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఖర్చుకు వెనకాడకుండా తమకు నచ్చి న వస్తువులు కొనేందుకు సిద్ధమౌతున్నారు. - తరుణ్ తావ్డా, ఎండీ, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా -
ఈ–కామర్స్ సైట్ల నుంచే డేటా లీక్.. ఇంటి దొంగల పనే ఇదంతా..!
ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి. భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు. – సాక్షి, హైదరాబాద్ ఇంటి దొంగల పనే.. ఆయా ఈ–కామర్స్ వెబ్సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు. ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్లో నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అప్రమత్తత అవసరం నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్పే, బిగ్ బాస్కెట్, బుక్మై షో, ఇన్స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి! కస్టమర్లను ఆకట్టుకోవడానికే అదంతా!
ప్రస్తుతం జనం ఆన్లైన్ షాపింగ్కు బాగా అలవాటు పడ్డారు. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నీ ఆన్లైన్లోనే కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఆ ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి. (గూగుల్పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్) ఈ కామర్స్ సంస్థల్లో వాస్తవానికి ఉచిత షిప్పింగ్ వంటివి ఏవీ ఉండవు. ఓ వైపు ఉచిత డెలివరీ అంటూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు డెలివరీ చార్జీలు రాబట్టుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు ఎత్తులు వేస్తున్నాయి. త్వరగా ఉత్పత్తుల డెలివరీ కోసం అదనపు చార్జీలు, ఉచిత డెలివరీ కావాలంటే కనీస కొనుగోలు మొత్తం అధికంగా పెంచడం వంటివి చేస్తున్నాయి. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) ఈ కామర్స్ సంస్థల్లో ఫ్రీ డెలివరీ రోజులు పోయాయని కేంబ్రిడ్జ్ రీటైల్ అడ్వైజర్స్ మేనేజింగ్ పార్టనర్ కెన్ మోరిస్ తెలిపారు. ఉత్పత్తి ద్రవ్యోల్బణం, విపరీతమైన షిప్పింగ్ ఖర్చులు ఈ-కామర్స్ సంస్థలకు ఇబ్బందిగా పరిణమించాయని, మాంద్యం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
ఆడంబరాలొద్దు.. ఆదా ముద్దు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలంతో పాటు మనుషుల పద్ధతులు మారుతుంటాయి. ఒకప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే కూడా లెక్కలేసుకునేవారు. అవసరమైన వాటికే ఖర్చు చేసేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువుల్లో ఊహించని వేతనాలు, అందుబాటులోకి వచ్చిన ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్ల కారణంగా అవసరం లేనివాటిని కూడా విచ్చలవిడిగా కొనడం మొదలైంది. కాలచక్రం గిర్రున తిరుగుతున్నట్టే మళ్లీ పాత రోజులొస్తున్నాయి. ఇలాంటి వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రజలు ప్రయత్ని స్తున్నారు. ఆన్లైన్ షాపింగ్లను కట్టడి చేసుకుంటూ.. వీధిచివర దుకాణానికి వెళ్లి మరీ పచారీ సరుకులు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అనే సంస్థ భారత్లో గ్లోబల్ కన్స్యూమర్ ఇన్సైట్స్ పల్స్–2023 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెరుగుతున్న ధరలు, ఆన్లైన్ డెలివరీలో అవకతవకలు, ఆలస్యం వంటి కారణాలు కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. మన దేశంలో 74% మంది.. ప్రపంచవ్యాప్తంగా 50% మంది వినియోగదారులు జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. 12 నగరాలు.. 25 ప్రాంతాలు విశాఖపట్నంతోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్కతా, నాగ్పూర్, జలంధర్, హైదరాబాద్, మీరట్ రాజ్కోట్ మెట్రో నగరాల్లోని 25 ప్రాంతాల్లో 9,180 మంది వినియోగదారుల నుంచి సర్వే సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 57 శాతం మంది పురుషులు కాగా.. 43 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 63 శాతం మంది అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నామని వెల్లడించారు. 75 శాతం మంది వినియోగదారులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్స్, లగ్జరీ వస్తువులను కొనడం మానుకుంటున్నారు. లగ్జరీ, ప్రీమియం, డిజైనర్ ఉత్పత్తులు 38 శాతం, వర్చువల్ ఆన్లైన్ యాక్టివిటీస్ 32 శాతం, కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ 32 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులు (దుస్తులు, పాదరక్షలు) 31శాతం కొనుగోళ్లు పడిపోయాయి. 38 శాతం మంది ఇతరులు కొంటున్నారు కాబట్టి తామూ కొనాలని అనవసర ఖర్చు చేస్తున్నారు. అయితే.. 54 శాతం మంది మాత్రం వస్తువుల్లో నాణ్యత చూస్తున్నారు. ఆఫర్ ఉంటే చూద్దాంలే కొంతకాలం క్రితం ప్రతి వస్తువునూ ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. కూరగాయలు, ఆహారం, కిరాణా సరుకులు, పాలు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టినా ఇంటి వద్దకే చేరేవి. కానీ.. కొంతకాలంగా ఈ డెలివరీకి కూడా చార్జీలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ–కామర్స్ నిర్వాహకులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. నేరుగా డెలివరీ చార్జీలు తీసుకోకుండా కొంత మొత్తం నగదు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే డెలివరీ చార్జీలు ఉండవనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. లేదంటే ఆర్డర్ పెట్టిన సరుకు రావడానికి వారం పది రోజులు వేచి ఉండక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్ స్టోర్లకు బదులుగా ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోళ్లు జరపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, 45 శాతం మంది మాత్రం ఈ–కామర్స్ సైట్లలో ప్రమోషన్, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తున్నారు. 44 శాతం మంది నాణ్యత గల సరుకులను అందించే రిటైల్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. 38 శాతం మంది బ్రాండెడ్ వస్తువులకు బదులు చవకైనవి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకోసం బ్రాండెడ్ వస్తువుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే అలాంటి వస్తువు కోసం వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. సొంత బ్రాండ్లకు డిమాండ్ డబ్బును పొదుపు చేయడం కోసం రిటైలర్ల వ్యక్తిగత బ్రాండ్లను 33 శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. అంటే రిలయన్స్, డీ మార్ట్, మోర్, విశాల్ మార్ట్, క్రోమా, ఫ్లిప్కార్ట్ వంటి కొన్ని భారీ దుకాణాల్లో వారి బ్రాండ్ పేరుతోనే వస్తువులు, దుస్తులు, సరుకులు లభిస్తుంటాయి. ఇవి మిగతా వాటితో పోలి్చతే కాస్త తక్కువకే దొరుకుతుంటాయి. అలాంటి వాటిని కొందరు కొంటున్నారు. మన దేశంలోని వినియోగదారులలో సగం మంది దుకాణంలో షాపింగ్ చేసేటప్పుడు ధరలు పెరిగిన విషయం తెలుసుకుని ఇబ్బందిగా భావిస్తున్నారు. దానికి తోడు భారీ దుకాణాల్లో రద్దీ, బిల్లింగ్ కోసం ఎక్కువ సేపు లైన్లలో నిలబడటం వంటి సమస్యలు 35 శాతం మందిని ఆ దుకాణాలకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి రిటైల్ దుకాణాల్లో వచ్చే ఆరు నెలల్లో వినియోగదారులు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. చిత్రంగా 88 శాతం కంటే ఎక్కువ మంది స్థానికంగా ఉత్పత్తి చేసిన వాటిని కొనాలనుకుంటున్నారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారైన వస్తువులను 87 శాతం మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఆన్లైన్ షాపింగ్లో వినియోగదారులు డేటా గోప్యత విషయంలో ఆందోళన చెందుతున్నారు. వాటి నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్తో ఎక్కువగా విసిగిపోతున్నారు. ఫలితంగా, 41 శాతం మంది వ్యక్తిగత డేటాను అంటే ఫోన్ నెంబర్ను బిల్లింగ్ సమయంలో ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. -
ఇది కదా ఆఫర్లు .. ఫ్లిప్కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా బిగ్ బచత్ ధమాల్ సేల్తో ముందుకు వచ్చింది. మార్చి 3 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్లో 1000 కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్లపై 80 శాతం డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలుపై ఆకర్షణీమైన తగ్గింపుతో వినియోగదారులకు స్పెషల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ను పరిచయం చేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇక పలు రిపోర్ట్ల ప్రకారం.. ఫ్లిప్కార్ట్ ఫర్నీచర్,మ్యాట్రెసెస్, షూర్యాక్స్,వార్డ్రోబ్, పోర్టబుల్ ల్యాప్ట్యాప్ స్టాండ్స్పై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇక కస్టమర్లు బెడ్రూమ్, లివింగ్ రూమ్ పర్నిచర్పై 70 శాతం డిస్కౌంట్, ప్రీమియం ప్రొడక్ట్లపై 60 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. హోమ్ అప్లయెన్సెస్పై 75 శాతం, టీవీలపై 60 శాతం, సమ్మర్ సీజన్ సందర్భంగా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్లిప్కార్ట్ బిగ్ బచత్ సేల్లో ల్యాప్ట్యాప్స్పై 45 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా..యాపిల్, శాంసంగ్, పోకో, రియల్ మీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు ఫుడ్, టాయిస్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, హోమ్ డెకోర్, ఫర్నీషింగ్, కిచెన్ టూల్స్తో పాటు ఇతర హోం ప్రొడక్ట్స్పై ప్రమోషనల్ ఆఫర్స్, బ్యాంక్స్, ఫిన్ టెక్ కంపెనీలు ఇచ్చే ఆఫర్స్ అందుబాటులోకి ఉన్నాయి. -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
బార్లో పరిచయం, టెక్కీకి శఠగోపం
సాక్షి, బనశంకరి: గుర్తు తెలియని వ్యక్తిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఓ టెక్కీ రూ. లక్షల్లో వంచనకు గురయ్యాడు. ఈఘటన బెళ్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... సర్జాపురలో నివాసం ఉంటున్న ఆశీశ్ ఐటీ ఇంజినీర్. గతనె 15న ఇతను బార్కు వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. తన పేరు తుషార్ అలియాస్ డిటోసర్కార్ అని, ఢిల్లీకి చెందిన వాడినని, బంధువులు ఇంటికి వచ్చినట్లు నమ్మించాడు. ఒక్కరోజు తలదాచుకుంటానని.. బంధువులు నగరంలో లేరని, మరో ప్రాంతానికి వెళ్లారని, దీంతో తనకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని మాటలు కలిపాడు. ఒకరోజు ఆశ్రయం ఇవ్వాలని తన కష్టం చెప్పుకున్నాడు. అతని మాటలను నమ్మిన ఆశీశ్ అమాయకంగా ఫ్లాట్కు తీసుకెళ్లాడు. రాత్రి ఫ్లాట్లోనే నిద్రించిన తుషార్ మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి ఉడాయించాడు. ఆశీశ్ ఉదయం నిద్ర లేవగానే తుషార్ కనబడకపోగా ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు. అదేరోజు మధ్యాహ్నం ఆశీశ్ అకౌంట్ నుంచి రూ.1.64 లక్షల నగదు వేరే అకౌంట్కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదే తరహాలో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి దశల వారీగా పదిరోజుల్లో ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లు సుమారు రూ.7.20 లక్షలు కట్ అయింది. మొత్తం రూ.8.84 లక్షలు పోయింది. తన సిమ్ కార్డు దొంగలించిన తుషార్ వేరే మొబైల్కు అమర్చుకుని అందులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమ చేసుకున్నట్లు తెలిసింది. బాధితుడు బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: వాట్సాప్తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
మాటేస్తున్న ఈ-దొంగల ముఠా.. సర్వేలో సంచలన విషయాలు!
సాక్షి, అమరావతి: పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ–కామర్స్ వెబ్సైట్లు బిగ్ బిలియన్ డేస్, షాపింగ్ కార్నివాల్ అంటూ ఏదో ఒక పేరు పెట్టి స్పెషల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇదే అదనుగా సైబర్ దొంగల ముఠా వినియోగదారుల డేటా కొట్టేయడానికి కాచుకు కూర్చుంటోంది. హోమ్ క్రెడిట్ ఇండియా తాజా సర్వే ప్రకారం.. మన దేశంలో 50 శాతంపైగా ప్రజలు షాపింగ్ కోసం ఈఎంఐను అందించే కార్డులను ఇష్టపడుతున్నారు. 25 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ‘ఇప్పుడు కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ అనే ప్రత్యేక ఆఫర్ను ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని ఈ–కామర్స్ సంస్థలు అందిస్తున్నాయి. 10 శాతం మంది దీనిని వినియోగించుకుంటున్నారు. 50 శాతం మంది వాట్సాప్ చాట్ ద్వారా రుణ దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లోన్ అప్లికేషన్ ఫైల్ చేయడానికి చాట్బాట్లు, మొబైల్ బ్యాంకింగ్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలను ఇంట్లోనే కూర్చొని డార్క్ వెబ్ ద్వారా సేకరించి, ఆన్లైన్లోనే డబ్బులు కొట్టేసే మార్గాన్ని దొంగలు ఎంచుకున్నారు. దీనికి ఈ–కామర్స్ సైట్లలో మనం ఇచ్చే బ్యాంకు ఖాతాల వివరాలను వాడుకుంటున్నారు. కాగా, గ్లోబల్ రిటైల్ ఈ–కామర్స్ 2020లో 26.4 శాతం పెరిగింది. సైబర్ నేరగాళ్లు కూడా ఈ పెరుగుదలను సద్వినియోగం చేసుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సైబర్ దొంగలు రిటైల్ వెబ్సైట్లకు నకిలీ రూపాలు సృష్టించి, దుకాణదారులను, కస్టమర్లను దోచుకుంటున్నారు. ఆ సైట్ నిజమైనదిగా నమ్మేలా ఉంటుంది. వాటి ద్వారా ఓ నకిలీ ఆర్డర్ షిప్మెంట్ను కస్టమర్లకు మెయిల్గానీ, ఎస్ఎంఎస్ లింక్గానీ పంపుతారు. తెలియకో, అప్రమత్తంగా లేకో ఆ లింక్పై క్లిక్ చేస్తే.. అక్కడ కస్టమర్లు లాగిన్ అవడానికి ఇచ్చే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దొంగలకు వెళ్లిపోతాయి. వారు కస్టమర్ కార్డులను ఉపయోగించి రిటైల్ సైట్లో షాపింగ్ చేసేస్తారు. ఒక్కోసారి ఏదో వస్తువును ఆర్డర్ పెట్టామని చెప్పి, దానికి నగదు చెల్లించాలంటూ క్యూఆర్ కోడ్లను పంపుతారు. దానిని స్కాన్ చేస్తే చాలు మన బ్యాంకు వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. ఇలా కస్టమర్లనే కాదు ఈ–కామర్స్ నిర్వాహకులను కూడా మోసం చేస్తున్నారు. ఆర్డర్ పెట్టిన ప్యాకేజీ రాలేదని, ఆర్డర్ వచ్చిందిగానీ పెట్టె ఖాళీగా ఉందని, బాక్స్లో రిటైలర్ తప్పు వస్తువును పంపారని ఫిర్యాదు చేసి డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో షాపింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏడాదిగా సైబర్ నేరగాళ్లు ఈ–కామర్స్ సైట్లపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్టు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే గుర్తించింది. ఇలాంటి మోసాలు పెరగడం పట్ల ఇటు వినియోగదారులు, అటు ఈ–కామర్స్ సైట్ల నిర్వాహకులు కూడా ఆందోళన చెందున్నారు. -
మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్లైన్ షాపింగ్పై భారీ ఆఫర్స్
దసరా, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండుగలు వస్తున్నాయంటే చాలు.. షాపింగ్ జోరు మొదలైపోతుంది. ఆఫ్లైన్ అయిన ఆన్లైన్ అయినా.. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించేస్తాయి. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకూ భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు. వరల్డ్ టాప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఈ నెల 15 నుంచి 20 వరకూ రిపబ్లిక్ డే మెగా సేల్స్ నిర్వహించింది. మొబైల్స్, స్మార్ట్ వాచెస్తో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చింది. ఇక ఫ్లిప్కార్ట్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. కేవలం ఆన్లైన్ ప్లాట్ఫామ్సే కాదు.. ఆఫ్లైన్లోనూ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. టూ విలర్ కొనుగోలుదారులకు రూ.5 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది బజాజ్ సంస్థ. అంతేకాదు.. వినియోగదారులకు సులభ వాయిదాలు కూడా అందిస్తోంది. విజయ్ సేల్స్ కూడా మెగా రిపబ్లిక్ డే సేల్ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తోంది. గాడ్జెట్స్, గృహోపకరణాలు వంటి వస్తువులపై 65 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా..? అయితే.. ఇదే మంచి సమయం.. మా షోరూంలో భారీ డిస్కౌంట్స్ లభిస్తాయంటూ రిపబ్లిక్ సేల్స్ను ప్రారంభించింది క్రోమా సంస్థ. ఈ నెల 29 వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్కు మాత్రమే పరిమితం కాలేదు. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, గో ఆసియా సైతం.. టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా కేవలం రూ.1705 రూపాయలకే టికెట్లు విక్రయించింది. డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.1199లకు.. ఇంటర్నేషనల్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.6599లకు అందిస్తోంది గో ఆసియా ఎయిర్ లైన్స్. జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని మెగా సేల్స్, క్లియరెన్స్ సేల్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ప్రకటించే సంస్కృతి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4 వచ్చిందంటే.. అక్కడ షాపింగ్ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోనూ మొదలైపోయింది. రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. -
ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరో వైపు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. పుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart), మింత్రా ( Myntra), జియో మార్ట్ (Jio Mart) కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్లైన్ షాపింగ్లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్లైన్ అలా కుదరుదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం! ఇవే నిబంధనలు... ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్సైట్కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. చదవండి: అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు! -
మెటావర్స్లో అడుగుపెట్టిన ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ కామర్స్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఫ్లిప్వెర్స్ అనే మెటావర్స్ వర్చువల్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్ను ప్రారంభిస్తున్నట్లు (ఇవాళే) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ డీఏఓ (eDAO)తో చేతులు కలిపింది. ప్రస్తుతం, ఈ ఫ్లిప్వెర్స్ ప్రారంభ దశలో ఉన్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫ్లిప్వర్స్తో ఏం చేయొచ్చు ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఇ-కామర్స్ ప్రపంచాన్ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు దారుల్ని ఆకర్షించేలా వారికి కొత్త షాపింగ్ ఎక్స్పీరియన్స్ను అందించనుంది. మరో మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు యూట్యూబ్లో ‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు వీడియోస్ను చూసే ఉంటారు. ఐఫోన్లో మెమోజీ అనే ఫీచర్ను ఉపయోగించి ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనుషుల పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ కూడా అంతే. ఈ ఫ్లిప్వెర్స్లో మీకు నచ్చిన ప్రొడక్ట్ను అలా తయారు చేసి డిస్ప్లేలో పెడుతుంది. మెటావర్స్ సాయంతో డిస్ప్లేలో ఉన్న ప్రొడక్ట్ను సెలక్ట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది ఫ్లిప్వెర్స్ ఈవెంట్ లాంచ్లో ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ..తాము ముందే చెప్పినట్లుగా ..ఫ్లిప్వర్స్ చాలా ప్రత్యేకం. మెటావర్స్ అవతార్ల రూపంలో వర్చువల్ రియాలిటీతో వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, వర్చువల్ షాపింగ్ ద్వారా కొనుగోలు దారులకు నచ్చిన ప్రొడక్ట్ను చెక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుందని పేర్కొన్నారు. -
మరో అదిరిపోయే సేల్..ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవే!
కొనుగోలు దారులకు ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహించింది. తాజాగా దసరా సందర్భంగా ఈ నెల 5 నుంచి 8 వరకు బిగ్ దసరా సేల్ 2022ను నిర్వహించనున్నట్లు తెలిపింది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్లో కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్లిప్కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు, టీవీలపై 75 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం, ఏసీలు 55 శాతం తగ్గింపు ధరతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు 4కే అల్ట్రా హెచ్డీ టీవీలు రూ.17,249 నుంచి ప్రారంభం కానుండగా..వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ సేల్లో టీవీల ప్రారంభ ధర రూ.7199 కాగా, బ్యూటీ, ఫుడ్, టాయ్స్,హోం, కిచెన్ వస్తువుల ప్రారంభ ధరలు రూ.99గా ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. -
అమెజాన్: వారి కోసం నాలుగు గంటల్లో డెలివరీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ –కామర్స్ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు ఆకర్షనీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వీటితో పాటు కస్టమర్ల సర్వీసు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అందిస్తుంది. తాజాగా ప్రైమ్ కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ సభ్యులు దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. ఆర్డర్ ఇచ్చిన రోజే ఉత్పత్తులను డెలివరీ చేసే విధానాన్ని కంపెనీ 2017 నుంచి అమలు చేస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్స్టామార్ట్. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్..అదరహో! ఎలైట్ క్లబ్లోకి ఎస్బీఐ ఎంట్రీ) పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్స్టామార్ట్.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది. (షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?) 3 గంటల వరకు.. ‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ సందేశాలు పంపించింది. జూన్ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్స్టామార్ట్ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘‘స్విగ్గీ ఇన్స్టామార్ట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు. జెప్టో సైతం.. ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్స్టామార్ట్కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సేవలు ఆఫర్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే ప్రశ్నగా పేర్కొన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ పార్సిళ్ల వీడియో వైరల్: మండిపడుతున్న యూజర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సోషల్మీడియాలో మరోసారి హాట్టాపిక్గా నిలిచాయి. వీటి ఆన్లైన్ డెలివరీ పార్సిల్స్కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన యూజర్లు అయ్యో.. నా పార్సిల్ .. నా ఫోన్, నా ల్యాప్టాప్ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో రీట్వీట్టు, కమెంట్లతో హోరెత్తి పోతోంది. విషయం ఏమిటంటే.. రైలు బోగీలోంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ పార్సిల్స్ను, ప్యాకెట్ల,అట్టపెట్టెలను అన్లోడింగ్ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. నిర్లక్క్ష్యంగా, కనీస జాగ్రత్త లేకుండా వాటిని విసిరి పారేస్తున్న వైనం వినియోగదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందుకేనా మా దగ్గర అదనంగా 29 రూపాయలు అప్పనంగా వసూలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు. రకరకాల కమెంట్స్ ట్విటర్లో వైరలవుతున్నాయి. ‘3 లక్షల రూపాయల విలువైన నా ఆసుస్ గేమింగ్ ల్యాప్టాప్ అందులోనే ఉందనుకుంటా’ గోవిందా అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, ఖాళీ పెట్టెల్లాగా అలా విసిరేస్తున్నారేంటిరా బాబూ అని మరొకరు, ఇక ఇవాల్టితో ఆన్లైన్ షాపింగ్ బంద్ ఇంకొకరు కమెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ సమయంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే వీడియోపై అటు అమెజాన్గానీ, ఇటు ఫ్లిప్కార్ట్కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Amazon & Flipkart parcels 😂pic.twitter.com/ihvOi1awKk — Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022 There is my Asus gaming laptop 💻 worth 3lacks I think it's right there 🫣🫣 pic.twitter.com/6Tu12IWwkP — Varun (@Varun11171) August 29, 2022 Mean while #Flipkart 29rs for secured packaging so it doesn't get damage 🤣 pic.twitter.com/8dpUCXAadH — Poco Lover (@occuppymoonNow) August 29, 2022 -
Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు. కొంత మందికే తిరిగి దక్కింది ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో 10 శాతం మంది అవును, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశామని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మొత్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు. కంప్యూటర్, మొబైల్లో పాస్వర్డ్స్ 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు. ఇ కామర్స్ ద్వారా అధిక మోసాలు ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్ అకౌంట్ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్, వెబ్సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం. 18 శాతం మంది క్రెడిట్ కార్డులతో మోసపోయారు. 12 శాతం మందిని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు లూటీ చేశాయి. 8 శాతం మంది డెబిట్ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు. సైబర్ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్ సహాయవాణి 112 నంబరుకు ఫోన్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్ను ఓపెన్ చేయద్దు. ఫోన్కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్లు లేదా షార్ట్ లింక్లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఐదు తులాల బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఐదు తులాల బంగారు నాణేన్ని ఆర్డర్ చేశాడో వ్యక్తి. సీల్డ్బాక్స్లో బిల్ ఇన్వాయిస్ మాత్రమే పంపించిందా దుకాణం. నష్టపరిహారంగా 18 శాతం వడ్డీతో నగదు ఇవ్వాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర (24) 2016 డిసెంబర్ 17న ఆన్లైన్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు చెందిన 50 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్లోని షాపర్స్స్టాప్లో ఆర్డర్ చేశాడు. అందుకోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆరమెక్స్ కొరియర్ ద్వారా బంగారం పంపుతున్నట్లు 2016 డిసెంబర్ 22న మలబార్ గోల్డ్ నుంచి సమాచారం వచ్చింది. కానీ డిసెంబర్ 26న ఇ–కామ్ ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా సీల్డ్బాక్స్ వచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న ఆ కవర్ను వీడియోగ్రఫీ సాయంతో తెరిచి చూడగా, అందులో గోల్డ్ కాయిన్ లేదు. కేవలం రూ.1,53,091కి సంబంధించిన బిల్లు మాత్రమే ఉంది. దీంతో అతను వీడియోను జత చేస్తూ షాపర్స్స్టాప్ హైదరాబాద్, ముంబై ఆఫీసుల్లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో 2017లో హైదరాబాద్లోని వినియోగదారుల ఫోరం–1 కోర్టును ఆశ్రయించాడు. 2019 ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై షాపర్స్స్టాప్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్ధించారు. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇచ్చేంతవరకు 18 శాతం వడ్డీతో ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక రూ.50 వేల నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని, ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!) -
ఇన్స్టా‘గ్రామర్’ తెలుసా..?
ఫోటోలు, వీడియోలు షేరింగ్ కోసం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాగ్రామ్ ఒకటి. నచ్చినవాటిని పోస్ట్ చేస్తూ, నలుగురి మెప్పు పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. షాపింగ్ కోసమైతే ఇప్పుడు ఇదో అతిపెద్ద వేదిక అని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉండగా వీరిలో 30 శాతం మంది 18– 24 ఏళ్ల మధ్య ఉంటే, 32 శాతం మంది 25–32 ఏళ్ల మధ్య వారున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నవారు అందులోని గ్రామర్ గురించి కూడా తెలుసుకుంటే మోసాల బారినపడకుండా ఉండగలం. ప్రయోజనాలు మంచివే.. ∙బ్రాండ్లపట్ల అవగాహనను పెంచుతుంది. కస్టమర్లో నమ్మకాన్ని పెంచుతుంది. ∙అభిమానులను సంపాదించుకోవాలన్నా, కస్టమర్లను చేరుకోవాలన్నా సత్వర మార్గం అందుకు తగిన ఫొటో లేదా వీడియోను షేర్ చేయడం. ఇది చాలా సులువైన ప్రక్రియ. ∙నాణ్యమైన కంటెంట్ను పోస్ట్ చేయడం, ప్రశ్నలు అడగడం, ఫీడ్బ్యాక్ అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించవచ్చు. ఇది ఒక ప్రచార సాధనం కూడా. ఉత్పత్తులు లేదా సేవల కోసం షాపింగ్ చేయడానికి ఫాలోవర్లు, వెబ్సైట్ విజిటర్స్ పెరుగుతారు. ∙కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రచారాలను సృష్టించుకోవచ్చు. ∙ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ∙వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు ట్రోల్ చేయబడే విధంగా వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, స్విమ్సూట్లలో ఉన్న ఫొటోలు, వీడియోలు వంటివి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ∙మీరు షేర్ చేసే ఫొటోలు, వీడియోలపై వాటర్మార్క్లను ఉపయోగించండి. ∙మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే మీ అకౌంట్ కనిపించేలా సెట్టింగ్ చేసుకోవడం మంచిది. హద్దులను సెట్ చేయండి ∙భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తిగత కథనాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు. ∙మనోభావాలను దెబ్బతీసే వాటిని ఎప్పుడూ పోస్ట్ చేయవద్దు ∙జాత్యహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలను నివారించండి. ఇలా సురక్షితం ∙మీ చిరునామా, ఫోన్నంబర్, వ్యక్తిగత వివరాలను మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచురించవద్దు. ఎందుకంటే ఇది వాణిజ్య, సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించబడుతుంది కనుక యాప్స్కి ఇవ్వబడిన యాక్సెస్ అధికారాలు మీకు నిజంగా అవసరమని నిర్ధారించుకున్నాకే ఓకే చేయడం మంచిది. ∙అవసరం లేని యాప్లను అలాగే ఫాలోవర్స్ని కాలానుగుణంగా తొలగించడం మేలు. ∙మీ ఫోన్ లో జిపిఎస్, బ్లూటూత్, పాస్వర్డ్లు, పిన్ లను సెట్ చేయండి. ∙యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ∙ఆఫ్లైన్, ఆన్ లైన్ చర్యలకు, వ్యక్తీకరణలు ఒకే విధంగా పరిగణించాలి. డేటా రక్షణ ∙పెయిడ్ అప్లికేషన్ లను ఉపయోగించండి. అవి సాధారణంగా మాల్వేర్, ట్రాకర్లను బ్లాక్ చేస్తాయి. ∙పాస్వర్డ్లు, ఇ–మెయిల్, ఆన్లైన్ చెల్లింపులకు రెండు రకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. బ్యాంకు ఫోన్ నంబర్–సోషల్ మీడియా ఫోన్ నంబరు విడివిడిగా వాడటం ఉత్తమం. ప్రైవేట్గా ఉండాలంటే.. నేటి ప్రపంచంలో సోషల్ మీడియా లేని జీవితం అసంపూర్ణం అని తెలిసిందే. అయినప్పటికీ, చెడు చేసే ఉద్దేశాలు ఉన్నవారి కారణంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉండటమే పెద్ద లోపంగా భావిస్తున్నారు. అంతేకాదు, మోసగాళ్లను ఎదుర్కోవటానికి మార్గాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మోసాలు ఇవీ.. ∙నకిలీ ఖాతాలను సృష్టించడం, నకిలీ ప్రకటనలను ప్రచురించడం ఇక్కడ చాలా సులభం. స్కామర్లకు ఇదో వరంలా మారింది. వారు చట్టబద్ధమైన బ్రాండ్ల నుండి ఉత్పత్తికి సంబంధించిన అన్ని ఫొటోలను దొంగిలిస్తారు. ఖాతాను సృష్టించిన తర్వాత కేవలం రెండు నిమిషాల్లో వారి నకిలీ ప్రకటనలతో ముందుకు వస్తారు. ∙ఇన్స్టాగ్రామ్ ప్రధానంగా నకిలీ/ప్రతిరూపం/సెకండ్ కాపీ వెబ్సైట్లకు ఒక మార్గంలా ఉపయోగపడుతుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే బదులు, నకిలీ వెబ్సైట్ల సృష్టికి దారి తీస్తారు. వాటి గురించి కొనుగోలుదారుకు తెలియదు. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టే సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు, సమస్యలూ రెండూ ఉన్నాయి. ప్రయోజనకరంగా మార్చుకోవడం, సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. షాపింగ్ స్కామ్లూ ఎక్కువే! ∙బాధితులు ఇన్ స్టాగ్రామ్లో పెద్ద బ్రాండ్ మొబైల్లు, వాచీల కోసం వెతుకుతారు. అవి సాధారణంగా క్లోన్ చేయబడిన లేదా కాపీ ఉత్పత్తులతో అకౌంట్లలో కనిపిస్తాయి. వీటిని ఎంచుకున్నప్పుడు స్కామర్లు తక్షణమే ప్రతిస్పందిస్తారు. ప్రొడక్ట్ ఫొటోలు /వీడియోలను పంపుతారు. బాధితులు అడ్వాన్స్లో 25% బుకింగ్ మొత్తంగా చెల్లిస్తారు. స్కామర్లు బుకింగ్ల నకిలీ స్క్రీన్ షాట్లను పంచుకుంటారు, ట్రాకింగ్ ఐడీలను అందిస్తారు. ఆ తర్వాత, డెలివరీ రోజున మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని అభ్యర్థిస్తారు. డెలివరీ రోజున, డెలివరీ చేసే వ్యక్తితో ఓటీపీని షేర్ చేయమని కోరుతూ మెసేజ్ వస్తుంది. చెల్లించిన తర్వాత, కొంతమంది స్కామర్లు నాణ్యత లేని కాపీ ప్రొడక్ట్స్ను పంపిస్తారు. కొంతమంది స్కామర్లు అసలే ప్రొడక్ట్స్ని పంపించకుండా అకౌంట్ను క్లోజ్ చేస్తారు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
కరోనాతో వీళ్లకు పండగే! ఆన్లైన్ సైట్స్లో బిజీగా జనం!!
భారత్లో ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ కారణంగా ఆన్లైన్లో ఒక్క క్లిక్తో అన్నీ ఇంటికి తెచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారి.. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా అవతరించింది. ఇటీవల లండన్ అండ్ పార్ట్నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్రూం.కో ఇన్వెస్ట్మెంట్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో ఆన్లైన్ షాపింగ్ 175శాతం పెరిగి 2020లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2021లో 22 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. గతేడాది వరల్డ్ వైడ్గా డిజిటల్ షాపింగ్లో అమెరికా తర్వాత భారత్ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా పేరు సంపాదించింది. 51 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారత్ 22 బిలియన్ డాలర్లు, చైనా 14 బిలియన్ డాలర్లు , బ్రిటన్ 7 బిలియన్ డాలర్లతో వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ఇక దేశీయంగా 14 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా బెంగళూరు, 7వ స్థానంలో గురుగ్రామ్, 10వ స్థానంలో ముంబై నిలిచాయి. గురుగ్రామ్ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను, ముంబై 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందాయి. వరల్డ్ వైడ్గా టాప్-5లో బెంగళూరు తర్వాత న్యూయార్క్ సిటీ, శాన్ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్ నగరాలున్నాయి. చదవండి: ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
సిమ్కార్డ్ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్కు రిప్లై ఇచ్చిన వర్ధని.. ఆ తర్వాత
Cyber Crime Prevention Tips: వయసు పైబడిన వారిలో చాలావరకు స్మార్ట్ ఫోన్ల వాడకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్నెట్లో ఆన్లైన్ షాపింగ్తో పాటు, తమకు కావల్సిన సమాచారం కోసం శోధించడమూ పెరిగింది. అనుకోకుండా తెలియని సైట్స్ని లింక్ చేయడం, ఇతర వెబ్సైట్లలో లాగిన్ అవడం వంటివి జరుగుతోంది. దీంతో వారి ఫోన్లకు ఫేక్ మెసేజ్లు, అవసరం లేని సమాచారం చేరుతుంది. దీంతోపాటు సీనియర్ సిటిజన్లు తమ వివరాలను తమకు తెలియకుండానే మోసగాళ్ల చేతికి అందించే అవకాశమూ పెరుగుతోంది. ఇటీవల ఓ సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.80 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఫోన్లో సిమ్కార్డ్ మార్చుకునే క్రమంలో వచ్చిన మెసేజ్కు రిప్లై ఇచ్చింది వర్ధని (పేరు మార్చడమైనది). సందేహం ఉంటే, మరో మెసేజ్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేయమని వచ్చిన మెసేజ్ చూసింది. ఆ మెసేజ్లో ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేయడంతో ప్రాసెసింగ్ ఛార్జీల కోసం రూ.10 బదిలీ చేయడంతో పాటు, అప్లికేషన్ను డౌన్లోడ్ చేయమని అడిగాడు కాలర్. అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి, తన డెబిట్ కార్డ్ నుంచి డబ్బు బదిలీ చేసింది. తర్వాత తన ఫోన్లో కాంటాక్ట్ నంబర్లేవీ కనిపించలేదు. అనుమానం వచ్చి, బ్యాంక్ను సంప్రదిస్తే రూ.80 వేలు మరో ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పడంతో షాక్ అయ్యింది. టార్గెట్ గ్యాంగ్స్ రిటైర్ కాబోతున్నవారిని టార్గెట్ చేసే గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి. వీళ్లు దాదాపు చదువుకుంటున్నవారే అయి ఉంటారు. పిల్లలు విదేశాల్లో ఉండి, వృద్ధ తల్లిదండ్రులు స్వదేశంలో ఒంటరిగా ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. వీరిని టార్గెట్ చేసుకొని మోసం చేసే గ్యాంగ్స్ కొత్తగా పుట్టుకు వస్తుంటాయి. ఒంటరి వృద్ధులకు కావల్సిన సరుకులు తెచ్చివ్వడం, చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, సమయం కేటాయించి కబుర్లు చెప్పడం, మేం ఉన్నామనే ధైర్యం ఇస్తూ కన్సర్న్ చూపడం చేస్తారు. ఈ క్రమంలో పెద్దవాళ్లు నమ్మేస్తారు. మీ ఫోన్ మేం సెట్ చేస్తామని తీసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ చేసి పెడతామని ముందుకు రావడం, ఓటీపీ, కెవైసీ వివరాలు దొంగిలించడం, క్రిప్టో కరెన్సీ పేరిట వంద రూపాయలు పెడితే 5 ఏళ్లలో పది లక్షల రూపాయలు వస్తాయని ఆశ చూపడం.. వంటి రకరకాల మార్గాల ద్వారా వివరాలు రాబడతారు. దీనిద్వారా డిజిటల్ మార్గాన మోసం చేయడానికి పూనుకుంటారు. చాలామంది వృద్ధులకు తమ ఖాతా నుంచి డబ్బులు పోయాయనే విషయం కూడా కొన్ని రోజుల వరకు తెలియదు. మరేం చేయాలి...? డిజిటల్ ప్రపంచం గురించి అవగాహన పెంచుకోవడంతోపాటు మోసపూరిత అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆన్లైన్ వేదికగా జరిగే మోసాలు ఏ తరహాలో ఉంటాయి, వాటి నుంచి తమను తాము రక్షించుకునే విధానాలను తెలుసుకోవాలి. లేదంటే, కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని పెద్దవాళ్లకు సైబర్ ఫ్రాడ్స్కు సంబంధించిన విషయాలపట్ల అవగాహన కల్పించాలి. ముందుగా.. ►ముందుగా షార్ట్ లింక్స్ వస్తాయి. రిటైర్డ్ వ్యక్తుల వివరాలు డార్క్నెట్లో లభిస్తుంటాయి. దీని ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి. మీరు క్లిక్ చేయాలనుకున్న లింక్స్ యుఆర్ఎల్ సరైనదేనా అని ధ్రువీకరించడానికి https://www.unshorten.it/ ద్వారా తెలుసుకోవచ్చు. ►www.isitphishing.org or www.urlvoid.comల ద్వారా అన్ని లింక్లను ధ్రువీకరించుకోవచ్చు. ►ఇ–మెయిల్ ద్వారా కొన్ని షార్ట్ లింక్స్ వస్తుంటాయి. వాటిని క్లిక్ చేయడం, తమ వివరాలను, బ్యాంకు వివరాలను పొందుపరచడం వంటివి చేయకూడదు. ►ఆఫర్ వచ్చిందనో, మనీ బ్యాక్ అనో.. మాటల్లో మభ్యపెట్టి ఓటీపీ, యూజర్నేమ్, పాస్వర్డ్లు తీసుకునేవారుంటారు. వీటికి ఏ మాత్రం స్పందించ కూడదు. ►ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తులు ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయమనడం, మీ వ్యక్తిగత వివరాలను రాబట్టడం చేస్తుంటారు. ఫోన్ మాట్లాడే సమయంలో హెడ్ఫోన్ పెట్టుకొని స్క్రీన్ చూస్తున్నప్పుడు ఫ్రాడ్ జరిగితే విషయం తెలిసిపోతుంది. ►ఉపయోగించే స్మార్ట్ ఫోన్, ల్యాప్ట్యాప్ వంటి పరికరాల్లో ఒరిజనల్ యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేస్తే మోసపూరిత షార్ట్లింక్స్కు అడ్డుకట్ట వేయచ్చు. ►ఆన్లైన్ షాపింగ్, యాప్ల ద్వారా డబ్బు బదిలీ చేసే సమయంలో కొన్ని సాంకేతిక అవాంతరాలు వస్తాయి. ఇలాంటప్పుడు గూగుల్ కస్టమర్కేర్ నెంబర్లకు అస్సలు ఫోన్ చేయకూడదు. 99 శాతం ఆ నంబర్లు మోసపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. ►ఫోన్ మాట్లాడే సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమనడం, ఓటీపీ, యుపిఐఎన్, బ్యాంక్ కార్డ్ సివివి నంబర్లు ఇవ్వమని అడగడం వంటివి చేస్తుంటే మీ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేస్తున్నారని గ్రహించాలి. ►సోషల్ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్ ఖాతాల కోసం రెండు విడి విడి ఫోన్ నంబర్లను ఉపయోగించడం శ్రేయస్కరం. విశ్రాంత జీవనంలో ఉన్న పెద్దలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కుటుంబ సభ్యులు తగిన సమయం కేటాయించుకోవాలి. ఈ డిజిటల్ యుగం గురించి పెద్దలకు అవగాహన కలిగించడాన్ని కుటుంబంలో ఉన్న నవతరం బాధ్యతగా తీసుకుంటే జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయచ్చు. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు
చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏం కావాలన్నా ఏంచక్కా కావాల్సినది ఏదైనా ఇట్టే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయవచ్చు. గతంలోలా ఏం కావాలన్నా మార్కెట్కు పరుగులు తీసే రోజులు పోయాయి. అకౌంట్లో డబ్బులుండాలేగాని రూపాయి నుంచి రూ.లక్షల వరకు విలువ చేసే ఏ వస్తువైనా ఫోన్లో బుక్ చేస్తే చాలు.. ఇట్టే ఇంటి ముంగిట వచ్చి చేరుతుంది. సాక్షి, విజయనగరం: చిన్నారులకు ఆట వస్తువులు.. దుస్తులు.. పాదరక్షలు.. చేతి గడియారాలు.. అలంకరణ వస్తువులు.. టీవీలు.. ఫ్రిజ్లు.. సోపాలు.. వంట సామగ్రి.. చరవాణి.. ఇలా ఏదీ కొనాలన్నా ఆరేడు దుకాణాలకు వెళ్లి వస్తువు నాణ్యత, ధర వ్యత్యాసం ఆరా తీసి కొనేవాళ్లం. ఇదంతా గతం. కాలం మారింది. వేలితో మీటితే మనకు కావాల్సింది మన ఇంటి ముంగిటకొచ్చే అవకాశం వచ్చింది. ఇంట్లో ఉంటూ నచ్చిన వస్తువులు కొనుగోలు చేసే వెసులుబాటును ఈ – కామర్స్ సంస్థలు అందుబాటులోకి తీసుకురావడంతో జిల్లా వాసులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ కొనుగోళ్లు రెండింతలయ్యాయి. అన్ని రకాల బ్రాండ్లు, వస్తు సామగ్రి ఆన్లైన్లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక రోజుల్లో రాయితీలు ప్రకటిస్తుండడంతో ఆర్డర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. చదవండి: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? వైరలవుతోన్న పోలీసుల సమాధానం! కరోనా తెచ్చిన మార్పు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్తో మానవ జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొద టి, రెండవ దశల్లో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో వస్తువుల కొనుగోలుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండేది. మరోవైపు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం వెంటాడేది. ఈ నేపథ్యంలో ఈ – కామర్స్ సంస్థలు అందించే సేవలు కొండంత అండగా నిలిచాయి. అప్పటి వరకు స్మార్ట్ ఫోన్న్ వినియోగించని వారు సైతం కొనుగోలు చేసి ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొందరు మార్కెట్కు వెళ్లకుండా ఇంటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరకులు, కూరగాయలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, శానిటరీ, స్టేషనరీ, గృహోపకరణ సామగ్రి, చెప్పులు, అలంకరణ సామగ్రి, వంటిల్లు సామగ్రి, పిండి వంటలు, ఫర్నిచర్, మందులు, వైద్యపరికరాలు, దుస్తులు ఇలా ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుండటంతో యువతతో పాటు గృహిణులు, అన్నివర్గా ల ప్రజలు ఈ –కామర్స్ వినియోగదారులుగా మారుతున్నారు. వినియోగదారుల ఆదరణను గమనించిన ఈ– కామర్స్ సంస్థలు పండగలు, ప్రత్యేకదినాల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు నెలవారీగా వాయిదాల రూపంలో సొమ్ము చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆహారప్రియులు విభిన్న రుచులు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ముడిసరకులు కూడా ఆన్లైన్లో దొరకడంతో ఎక్కడెక్కడి నుంచో తెప్పించి హోటళ్ల వారు వినియోగిస్తున్నారు. చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్.. రిపోర్టర్ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం ఉపాధి అవకాశాలు రోజులో కొంత సమయం పని చేసుకొని మిగిలిన సమయంలో చదువుకునే వారికి, రోజులో వెసులుబాటు దొరికినప్పుడు పని చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ – కామర్స్ రంగంలో వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒక్క విజయనగరం జిల్లా కేంద్రంలోనే వివిధ ఈ – కామర్స్ సంస్థల పరిధిలో 500 మంది యువత పని చేస్తున్నారు. ఆన్లైన్ వ్యాపారం ఊపందుకోవడంతో జాతీయ రహదారి పక్కనే భారీ గోదాముల్లో సరకు నిల్వ చేసుకుని అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాన్లు, ఆటోల వారికి రోజూ అద్దెలు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలపై డెలివరీ చేసే వారికి ఉపాధి లభిస్తోంది. ఈ వ్యాపారం విస్తరించే కొద్దీ మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి. సమయం, సొమ్ము ఆదా కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచి అవసరమైన అన్ని వస్తువులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నాం. ఇంట్లో నుంచి ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. దీనివల్ల సమయం, శ్రమ, సొమ్ము ఆదా అవుతోంది. ఏ సంస్థలు తక్కువ ధరకు ఇస్తున్నాయో.. నాణ్య త తదితర అంశాలు పరిశీలించే అవకాశం ఎలా గు ఉంది. మాకు నచ్చిన వస్తువలను ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసి పొందగలుగుతున్నాం. – కె.సురేష్, విజయనగరం జిల్లాలో ఈ కామర్స్ సేవలు ఇలా... ►పండగలు, ఆఫర్లు ప్రకటించే సమయంలో సగటున రోజు వారీ ఆర్డర్లు- 8000 నుంచి 9000 వరకు ►సాధారణ రోజుల్లో డెలవరీలు – 5000 పైగానే ►అత్యధికంగా డెలవరీ జరిగే రోజులు – సోమవారం -
అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్లో..
ఆన్లైన్ షాపింగ్ చేసి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తే, వాటి స్థానంలో సబ్బులు, ఇటుక రాళ్లు తెచ్చి చేతుల్లో పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు పరిపాటైపోయాయి. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదులనుభవమే ఎదురైంది. సదరు వ్యక్తి ఆన్లైన్లో ఐ ఫోన్ను ఆర్డర్ చేశాడు. ఐతే ఫోన్కు బదులుగా 2 వైట్ కలర్ ఓరియో క్యాడ్బరీ చాక్లెట్లు ఆర్డర్ ప్యాక్లో ఉండటంతో చూసి లబోదిబోమన్నాడు. ఇంగ్లాండ్కు చెందిన డానియెల్ కారోల్ దాదాపు రూ. 1,05, 000 లక్షల విలువైన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా డెలివరీ అందింది. దానిని ఓపెన్ చేసిన డానియెల్ లోపల ఐ ఫోన్ లేకపోవడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. దాని స్థానంలో వైట్ టాయిలెట్ పేపర్ రోల్తో చుట్టిన 120 గ్రాముల వైట్ ఓరియో చాక్లెట్లు ఉన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో డానియెల్ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. పార్సిల్ తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశాడు. డిసెంబర్ 2న యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ చేశానని, డిసెంబర్ 17న డెలివరీ అందాల్సి ఉండగా అలా జరగలేదని ట్విటర్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన డీహెచ్ఎల్ డెలివరీ సర్వీస్ను సంప్రదించి రిప్లేస్ చేయవల్సిందిగా కోరింది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ Hi Daniel if your are having an issue with your delivery please do DM us with your shipment number and full address so we can check out what has happened. Thanks, Helen https://t.co/HfmWwImQTE — DHLParcelUK (@DHLParcelUK) December 21, 2021 -
Meesho: ‘మీ షో యాప్’ ఫౌండర్ విదిత్ ఆత్రే సక్సెస్ స్టోరీ!
Meesho is the freshest Organization to join the Unicorn Club: కిందపడ్డప్పుడు ‘అయ్యో!’ అనుకుంటారు అందరు. ‘ఎందుకు పడ్డాం?’ అని ఆలోచిస్తారు కొందరు. రెండో కోవకు చెందిన వారు కాస్త లేటయినా ఘాటైన విజయం సాధిస్తారు.... ఇందుకు ఈ ఇద్దరే ఉదాహరణ... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న విదిత్ ఆత్రే ‘ఫోర్ట్స్’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. అలాంటి విదిత్ పవర్ఫుల్ ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ ఏషియా జాబితాలోకి రాడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక కాస్త వెనక్కి వెళితే... చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగాలే చేశాడు విదిత్. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం యాప్ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువ. దిల్లీ కాలేజీలో తన బ్యాచ్మేట్ సంజీవ్ బర్నావాల్ కూడా తనతో పాటే ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే...తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్. ఇండియాలో ఉన్న విదిత్, జపాన్లో ఉన్న సంజీవ్ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్ లోకల్ ఫ్యాషన్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ‘ఫ్యాష్నియర్’తో రంగంలోకి దిగారు. తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్ విజిట్ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్ అయింది. అలా అని ‘చలో బ్యాక్’ అనుకోలేదు. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్ మార్కెట్కు ఉండే ‘వైడ్రేంజ్ ఆప్షన్స్’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. ఆ సమయంలోనే వారి ఆలోచనలు చిన్నవాపారుల చుట్టూ తిరిగాయి. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్కార్ట్...లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్నియర్’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్–మై షాప్) యాప్ను డిజైన్ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై మార్కెట్ ప్లేస్గా పేరు సంపాదించుకుంది. తమ ప్రాడక్స్ను యాడ్ చేయడానికి, వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సులభంగా షేర్ చేయడానికి, సులభంగా యూజ్ చేయడానికి ‘బెస్ట్’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్ల ద్వారా సెల్లర్స్ నుంచి కమీషన్ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి నెల సెల్లర్స్ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటయిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒకటిగా నిలిచింది. విదిత్, సంజీవ్లను రైజింగ్స్టార్లుగా మార్చింది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్నెస్.. -
మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!!
కంచిపట్టుచీరకు కనకపు కాసు, సిల్క్ కుర్తాకు సిల్వర్ కాసు, వెస్ట్రన్ వేర్కు ఆక్సిడైజ్డ్ కాసు లోహమేదైనా... ధరించే దుస్తులు ఏవైనా పండగ రోజున కాసుల పేరు మెడ నిండుగా.. కనుల పండుగలా కమనీయంగా కట్టడి చేస్తుంది. ఎంపిక మీదే సుమా అన్నట్టుగా ఆకట్టుకుంటుంది. బంగారు కాసుల పేరు బామ్మలనాటి డిజైన్ అయినా నేటికి తన హుందాతనాన్ని, లక్ష్మీ కళను తరతరాలకు అందిస్తూనే ఉంది. ఏ వేడుకకైనా నిండుతనాన్ని తీసుకువస్తుంది. ఆధునిక యువతికి వేషధారణకు తగినట్టు సిల్వర్ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తున్నాయి. కొన్ని అఫ్గాన్స్టైల్, మరికొన్ని బొహేమియన్ స్టైల్... అంటూ విదేశీ కాసులు కూడా వినూత్నమైన హారాలుగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! కాసులు సిల్క్ దారాలతో జత కలుస్తున్నాయి, పూసలతో దోస్తీ కడుతున్నాయి. లోహానికి తగిన ధరల్లో వేల రూపాయల నుంచి వందల రూపాయల్లో ఆభరణాల మార్కెట్, ఆన్లైన్ షాపింగ్లో రెడీమేడ్ కాసులు లభిస్తున్నాయి. నూరు కాసులతో ఓ హారం లేదంటే నాలుగు కాసులతో సరిపెట్టుకునే హారమైనా అందమైన డిజైన్లతో నేడు మరింత కళగా కనులకు విందు చేస్తున్నాయి. ఆభరణాల జాబితాలో ఎప్పటికీ నిలిచి ఉండే కాసు హారాలు ఈ దీపావళి పండగకు కొత్త కళను నింపనున్నాయి. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తోనా.. -
ఫోన్లో ఆడుతూ రూ.61,000 విలువ చేసే బొమ్మలను ఆర్డర్ చేసింది
చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు ఎంత ఆహ్లాదభరితంగా ఉంటాయో అలాగే కొన్ని ఇబ్బందికరంగానూ, ప్రమాదకరంగానూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ ఆపరేట్ చేయడం రాని పిల్లలంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాదు ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లతో పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వడంతో ఫోన్లు, ల్వాప్టాప్లతోనే ఆన్లైన్ చదువులకు అలవాటు పడ్డారు. (చదవండి: రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను) దీంతో వాళ్లు ఫోన్లోనూ, ల్యాప్ట్యాప్ల్లోనూ రకరకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి ఏవిధంగా ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారో కూడా చూస్తున్నాం. అంతెందుకు మరికొంత మంది ఏవో యాప్లు డౌన్లోడ్ చేయడంతో చాలా మంది తల్లిదండ్రుల ఫోన్లు హ్యకింగ్కి గురై బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల పోగొట్టుకున్న ఉదంతాలను చూశాం. కానీ ఇక్కడ ఒక తల్లి ముందుగానే పసిగట్టడంతో ఆ సమస్య నుంచి ఆమె సులభంగా బయటపడింది. విషయంలోకివెళ్లితే.....ఎనిమిదేళ్ల పాప వాళ్ల తల్లి ఫోన్లో ఆడుతూ కామార్ట్ అనే ఆన్లైన్ వెబ్సైట్ నుంచి సెలవుల్లో తమ ఫ్యామిలీ టూర్లో ఉల్లాసంగా గడిపేందుకు కావల్సిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్లో కొనుగోలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఏం కొనుగోలు చేసిందంటే బెడ్ ఫ్లోక్డ్ ఎయిర్ మాట్రిసెస్, ఒక దిండు, దుప్పట్లు, వంటగదికి సంబంధించిన గిన్నెలు, ప్యాన్లు, కప్పులు, కత్తిపీటలతో సహ కొనుగోలు చేసింది. అంతేకాదు ఆ ట్రిప్లో వినోదం కోసం, హ్యారీ పోటర్ పుస్తకాల బాక్స్ సెట్ను, కొన్ని హ్యారీ పోటర్-నేపథ్య లెగో, మైక్రోస్కోప్ను ఆర్డర్ చేసేస్తోంది. అంతే కాసేపటి తల్లి తన ఫోన్ చూస్తే 'ఆఫ్టర్ పే' అనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటిది అని చూస్తే తన కూతుర కామర్ట్ ఆన్లైన్ నుంచి రూ.61 వేలు ఖరీదు చేస్తే వస్తువలను ఆర్డర్ చేసినట్టు గుర్తించి వెంటనే ఆ ఆర్డర్ని కేన్సిల్ చేసింది. ఈ మేరకు ఆ బాలిక తల్లి తన కూతురు ఏ విధంగా ఆన్లైన్లో కొనుగోలు చేసింది వంటి వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదంటూ విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) -
ఆన్లైన్ షాపింగ్కే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ షాపింగ్ అప్పుడే మొదలైంది. అయితే కరోనా పూర్తిగా కనుమరుగు కాకపోవడంతో భద్రమైన, సురక్షితమైన షాపింగ్కే 50 శాతం మంది హైదరాబాదీలు మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, స్థానిక స్టోర్ల నుంచి హోం డెలివరీ విధానం ద్వారా షాపింగ్ చేస్తామని 75 శాతం హైదరాబాదీ కుటుంబాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, రౌటర్లు, ఏసీ, హీటర్లు, వాక్యూమ్ క్లీనర్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఎయిర్ ప్యూరిఫైర్లు, వినిమయ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉత్పత్తులు, ఇంటికి మరమ్మతులకు సంబంధించిన కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పండుగ సామగ్రి, వస్తువులు, తినుబండారాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, దుస్తులు, బంధుమిత్రులకు కానుకలు, ఫ్రిజ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అప్లియన్స్లు వంటివి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 10 నగరాల్లోని దాదాపు 2 లక్షల మంది నుంచి సేకరించిన వివిధ అంశాల ఆధారంగా రూపొందించిన ‘లోకల్ సర్కిల్స్ మూడ్ ఆఫ్ ది కన్జూమర్ నేషనల్ సర్వే’లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కుటుంబాల బడెŠజ్ట్పై తీవ్ర ప్రభావం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ దాకా దేశవ్యాప్తంగా వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్ అనూహ్యంగా పెరిగిందని అంచనా వేసింది. మే 30 నాటికి 30 శాతం మేర ఉన్న షాపింగ్, సెప్టెంబర్ ఆఖరుకు 60 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. అయితే గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వే తేల్చింది. గత మూడు వారాలుగా వినియోగదారులు వివిధ ఉత్పత్తులు, సర్వీసుల గురించి ‘ఆన్లైన్ లోకల్ కమ్యూనిటీస్’నుంచి సలహాలు, సిఫార్సులు కోరుతున్న పరిస్థితుల్లో దేశంలోని 10 ప్రధాన నగరాల్లోని కుటుంబాలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయన్న దానిపై లోకల్సర్కిల్స్ అధ్యయనం దృష్టి సారించింది. ఈ నగరాల్లోని కుటుంబాలు ఏయే వస్తువుల కొనుగోళ్ల షాపింగ్కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, పుణే, గురుగ్రామ్, నోయిడాలోని 61 వేల కుటుంబాల్లోని 2 లక్షల మందిపై ఈ సర్వే నిర్వహించారు. షహర్ హమారా హైదరాబాద్లో.. పండుగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ ఎటువైపు మొగ్గుచూపుతుందని అంచనా వేసేందుకు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో నివసించే 4 వేల కుటుంబాలు వాటిలోని 13 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. షాపింగ్ విధానాలు, కేటగిరీ వస్తువులు. ఏ పద్ధతులు, విధానాల్లో షాపింగ్ చేస్తారు? ఎలాంటి కేటగిరీలకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులు కొంటారు? పండుగ సందర్భంగా ఎలాంటి వస్తువులు కొనాలని అనుకుంటున్నారు..? ఏయే వాటికి ఖర్చు చేయబోతున్నారనే అంశాలను పరిశీలించారు. ఇక్కడి సర్వేలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. భద్రమైన, సురక్షిత షాపింగ్కే ప్రాధాన్యమిస్తున్నట్లు 50 శాతం మంది స్పష్టం చేశారు. తమకు అనువైన బడ్జెట్తో, ఆయా వస్తువుల అవసరం.. విలువ ఆధారంగా షాపింగ్ చేస్తామని 38 శాతం, తమవీలు, సౌకర్యాన్ని బట్టి వస్తువులు కొనుగోలు చేస్తామని 12 శాతం వెల్లడించారు. అది కూడా ఆన్లైన్ సైట్లు, యాప్ల ద్వారా మెజారిటీ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని 62 శాతం వెల్లడించారు. వివిధ వినియోగ వస్తువులను కొనేందుకు షాపులు, మార్కెట్లకు వెళతామని 25 శాతం మంది, స్థానికంగా ఉన్న స్టోర్ల ద్వారా, క్యాటలాగ్ ఆన్లైన్ ఆర్డర్ డెలివరీ ద్వారా 13 శాతం కొనుగోలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సర్వే కీలకాంశాలు.. షాపింగ్ చేసేటప్పుడు ఏది ముఖ్యం ►భద్రత 50 శాతం ►బడ్జెట్/విలువ 38 శాతం ►వీలు, అనుకూలతలను బట్టి 12 శాతం ఇష్టమైన వస్తువుల కొనుగోళ్లు? ►ఆన్లైన్ సైట్లు, యాప్ల ద్వారా ఆర్డర్ 62 శాతం ►స్టోర్స్ లేదా మార్కెట్లను సందర్శిస్తామన్న 25 శాతం ►క్యాటలాగ్ ఆన్లైన్, ఆర్డర్ డెలివరీ ఉన్న స్టోర్ల నుంచి 13 శాతం ఏ వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు ? ►స్మార్ట్ఫోన్లు, మొబైల్, టాబ్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, రౌటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏసీ, హీటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, టీవీ. ఫ్రిజ్లు, ఎయిర్ ప్యూరీఫయర్లు వంటివి 75 శాతం ►కేవలం స్మార్ట్ఫోన్లు, ఇతర వినిమయ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉత్పతుతలు 25% మంది ఎలాంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు కొంటారు ? ►స్పెషల్ వస్తువులు, పండ్లు, ఫలాలు, డ్రైఫూట్లు, సంప్రదాయ స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఇతర పదార్థాలు 75 శాతం ►వీటిలో కొన్నింటిని మాత్రమే కొనే వారు 25 శాతం -
ఆహా..ఆన్లైన్ షాపింగ్.. అన్నీ అక్కడే!
సాక్షి, హైదరాబాద్: దసరా..దీపావళి పండుగల వేళ సిటీజనులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. రొటీన్కు భిన్నంగా వీరు కొత్త దుస్తులు, వాహనాలు, ఇతర గృహోపకరణాలు, పిండి వంటలు, డైలీ నీడ్స్ తదితరాలను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జనం ఆసక్తికి అనుగుణంగానే పలు ఆన్లైన్ కంపెనీలు వాటి వ్యాపార ధృక్పథాన్ని మార్చుకున్నాయి. భారీ ఆఫర్లు, ట్రెండీ ఉత్పత్తులు, సత్వర డెలివరీ వంటి అంశాలతో ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’ ♦ పలు ఈ–కామర్స్ సంస్థలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన గంట నుంచి మూడు గంటల్లోనే వస్తువులను వినియోగదారుల చెంతకు చేరుస్తున్నాయి. ♦ దీంతో మార్కెట్కు వెళ్లి షాపింగ్ చేయడం కంటే..ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్తో అనుకున్నది పొందొచ్చనే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. ♦ గ్రేటర్లో కరోనా ప్రభావం తగ్గినా కూడా పండుగ పూట జనం బయటికి వెళ్లడం లేదు. ఉన్నచోటనే ఉంటూ తమకు నచ్చిన దుస్తులు, ఫుట్వేర్, హోం అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ను ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. చదవండి: Huzurabad Bypoll: హుజూరాబాద్కు అమిత్ షా? ♦ షాపింగ్ మాల్స్కు ధీటుగా ఆన్లైన్లోనూ డిస్కౌంట్లు, ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ♦ వాస్తవంగా కరోనా లాక్డౌన్ టైమ్లో ఆన్లైన్ సేల్స్కు మంచి ఆదరణ లభించింది. అదే పంథా ఇప్పటికీ కొనసాగుతోంది. ♦ గతంలో మాదిరిగా చాలా మంది కుటుంబ సమేతంగా వెళ్లి షాపింగ్ చేయడం తగ్గించారు. ♦ ఇంటి వద్దకే అన్ని వస్తువుల డోర్ డెలివరీకి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆన్లైన్కే వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ– కామర్స్ సైట్లతో ఒప్పందాలు ♦ ఆన్లైన్ బిజినెస్ బాగా పెరగడంతో పలు షోరూంలు, మాల్స్, షాపుల నిర్వాహకులు సైతం వారి పంథాను మార్చుకున్నారు. ఈ–కామర్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో ‘టై–అప్’ అవుతున్నారు. ఆన్లైన్ వేదికలుగా వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ♦ ఎమ్మార్పీ కంటే 15 నుంచి 50 శాతం వరకు ఆఫర్తో సేల్ చేసేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఏటా నిర్వహించే ఫెస్టివల్ క్లియరెన్స్ సేల్స్ తరహాలోనే ఉన్న స్టాక్ను ఆన్లైన్లో అమ్మేలా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ♦ చిన్న, పెద్ద వ్యాపారులను డిజిటల్ మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఈ–కామర్స్ సంస్థలు కూడా అఫిలియేటివ్, సెల్లర్ బిజినెస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రూ.100 కోట్లకు పైనే.. ఈ సీజన్లో గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు ఆన్లైన్లో వ్యాపారం జరిగినట్లు వివిధ ఈ కామర్స్ సంస్థల ద్వారా తెలుస్తోంది. పండుగల నేపథ్యంలో భారీ తగ్గింపులు, ఆఫర్ల వల్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఎల్రక్టానిక్ గూడ్స్ను వినియోగదారులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వీటి తర్వాత గ్రోసరీస్ను కూడా పెద్ద ఎత్తున ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు వెల్లడవుతోంది. రోజుకు 20 నుంచి 25 వస్తువుల డెలివరీ దసరా పండుగ సీజన్లో కొనుగోళ్లు బాగా పెరిగాయి. నేను రోజుకు 20 నుంచి 25 ఐటమ్స్ వినియోగదారులకు డెలివరీ చేస్తున్నా. గతంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది మాత్రమే ఉండేవి. – రాకేష్, ఆన్లైన్ సంస్థ డెలివరీ బాయ్, బర్కత్పుర -
సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేస్తే ఇంట్లో కురిసిన డబ్బుల వర్షం
ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేయగా ఫ్రిడ్జ్తో పాటు దాదాపు రూ.కోటి వరకు డబ్బులు ఇంటికి వచ్చాయి. ఈ డబ్బులు చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి చివరకు ఏమైందో ఏమోగానీ ఆ డబ్బులను తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అతడి నిజాయతీని పోలీసులు మెచ్చుకుని అసలు ఫ్రిడ్జ్ విక్రయించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఆ డబ్బుల విషయం చెప్పకుండా ఉంటే కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని ఆయన నిజాయతీ చాటుకుని కోల్పోయాడు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికిచెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో సెకండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేయగా ఆగస్ట్ 6వ తేదీన ఇంటికి వచ్చింది. వచ్చిన ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో ఫ్రిడ్జ్ కింద ఓ స్టిక్కర్ కనిపించగా తొలగించాడు. వెంటనే డబ్బుల కట్టలు బయటకు వచ్చాయి. వందలు.. వేలు కాదు ఏకంగా రూ.96 లక్షల (లక్షా 30 వేల డాలర్లు) నగదు లభ్యమైంది. ఈ నగదు చూసిన అతడు షాక్కు గురయ్యాడు. వెంటనే తేరుకుని సంబరపడ్డాడు. ఆ తర్వాత ఏం ఆలోచించాడో ఏమో.. వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. నగదును తీసుకున్న పోలీసులు ఫ్రిడ్జ్ విక్రయించిన వ్యక్తి ఎవరోనని గాలిస్తున్నారు. అయితే విక్రయించిన వ్యక్తి దొరకకపోతే ఫ్రిడ్జ్ కొన్న వ్యక్తికే ఆ డబ్బు చెందుతుంది. అయితే కొరియా చట్టం ప్రకారం ఆ నగదులో 22 శాతం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటి ఆన్లైన్ సర్వీసుల ఊతంతో దేశీయంగా వినియోగదారులకు సంబంధించిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2020లో ఇది 85–90 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రౌండ్ జీరో 5.0 కార్యక్రమంలో ఆవిష్కరించిన కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ ఆవిష్కరించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారం వార్షిక పరిమాణం ఈ ఏడాది 55 బిలియన్ డాలర్లను తాకనుండగా..2030 నాటికి ఏకంగా 350 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద రిటైల్మార్కెట్గా భారత్ ఆవిర్భవించనుంది. అటు కిరాణా దుకాణాల విక్రయాలు 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని రెడ్ సీర్ పేర్కొంది. ‘సౌకర్యం కారణంగానే ఆన్లైన్ సర్వీసులు వినియోగిస్తున్నామని ప్రస్తుతం 50 శాతం మంది కస్టమర్లు చెబుతున్నారు. అదే కొన్నేళ్ల క్రితం అయితే డిస్కౌంట్ల గురించి ఉపయోగిస్తున్నామని చెప్పేవారు. కోవిడ్ పరిస్థితులే తాజా మార్పులకు కారణం‘ అని రెడ్సీర్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ తెలిపారు. తదుపరి తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. భారత మోడల్ను అంతర్జాతీయంగా కూడాప్రాచుర్యంలోకి తెచ్చే విధమైన కొత్త ఆవిష్కరణలను సృష్టించగలరని ఆయన పేర్కొన్నారు. (Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు) ప్రత్యామ్నాయ కేంద్రంగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని నివేదికవిడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇతర దేశాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలను వేరే దేశాలకు మార్చుకునేందుకు తగు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయన్నారు. భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. తద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక భాగం కావచ్చని కాంత్ తెలిపారు. మరోవైపు, భారీ పెట్టుబడులు అవసరమైన చిప్ పరిశ్రమ భారత్లో ఏర్పడే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు.. సెమీ కండక్టర్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టీవీ మోహన్దాస్ పాయ్ అభిప్రాయ పడ్డారు. నివేదిక ప్రకారం.. 2020-30 మధ్య కొత్తగా జతయ్యే ఆన్లైన్ షాపర్స్లో 88 శాతం మంది ద్వితీయ శ్రేణి తదితర నగరాలకు చెందిన వారై ఉంటారు. ఈ-కామర్స్ వ్యాప్తి చెందే కొద్దీ ప్రత్యేక డెలివరీ సర్వీసుల అవసరం కూడా పెరిగింది. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) -
జాక్ పాట్: ఆపిల్ పండ్లు ఆర్డర్ ఇస్తే..ఐఫోన్ ఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా ఖరీదైన వస్తువులు ఆర్డర్ ఇస్తే.. చీప్ వస్తువులను అందించిన మోసగించిన కథనాల్ని చూశాం. అంతేకాదు లగ్జరీ ఫోన్లకు బదులు, ఇటుకలు, డమ్మీ ఫోన్లు డెలివరీ, ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆపిల్ ఫ్లేవర్ డ్రింక్ ఇచ్చిన వైనాన్ని కూడా చూశాం. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కానీ తాజాగా ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఆపిల్ పళ్లను ఆర్డర్ ఇస్తే.. ఏకంగా ఖరీదైన ఆపిల్ ఐఫోన్ వచ్చింది. తీరిగ్గా విషయం తెలుసుకుని సంతోషంతో ఉబ్బితబ్బివ్వడం అతని వంతైంది. ట్వికెన్హామ్కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఈ అరుదైన జాక్ పాట్ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టనప్పటినుంచి కిరాణా సామాగ్రి నుంచి విలాస వస్తువులుదాకా దాదాపు ప్రతీదీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం అవసరంగా మారిపోయింది. ఈ క్రమంలో బ్రిటన్లో జేమ్స్ ఆన్లైన్లో కొన్ని ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్కు ఆర్డర్ ఇచ్చారు. అయితే పార్సిల్లో పండ్లతో పాటు ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు. కానీ ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. అయితే టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని తెలుసుకుని జేమ్స్ను సూపర్ థ్రిల్ అయ్యాడు. విషయం ఏమిటంటే.. టెస్కో గ్రోసరీ సంస్థ ప్రమోషనల్ క్యాంపేన్లో భాగంగా ఆపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ను గిఫ్ట్గా అతనికి అందించిందన్నమాట. 'సూపర్ సబ్స్టిట్యూట్'లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్పాడ్స్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఊహించని బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ. A big thanks this week to @Tesco & @tescomobile. On Wednesday evening we went to pick up our click and collect order and had a little surprise in there - an Apple iPhone SE. Apparently we ordered apples and randomly got an apple iphone! Made my sons week! 😁 #tesco #substitute pic.twitter.com/Mo8rZoAUwD — Nick James (@TreedomTW1) April 10, 2021 Did you get your apples? — craig jenkins (@craigjenkins05) April 14, 2021 Well that’s one way to boost sales of apples — Jake Russell (@jakerussell47) April 14, 2021 -
బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్
అవుకు(కర్నూలు జిల్లా): సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ షాపింగ్ వినియోగదారులను టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే వారిలో అమాయకులను ఎంచుకుని బురిడీ కొట్టిస్తున్నారు. అవుకు మండలంలో ఓ వ్యక్తిని ఇలాగే మోసం చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగంపేట గ్రామానికి చెందిన చింతా కోటేశ్వరరావుకు గత నెల 12వ తేదీన ఆన్లైన్ షాపింగ్ కంపెనీ నుంచి ఓ పోస్టల్ కవర్ వచ్చింది. అందులో ఉన్న హెల్ప్లైన్ నంబర్ 7477752653కు ఫోన్ చేయగా ‘మీ పేరు మీద 7 లక్షల నగదు బంపర్ ఆఫర్ తగిలింది’ అని నమ్మించారు. ముందుగా ఇన్కంటాక్స్, జీఎస్టీ, నిఫ్ట్ చార్జెస్ కింద నగదును ఎస్బీఐ: 39797916748 అకౌంట్కు జమ చేయాలని చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితుడు గత నెల 18, 19, 21, 25 తేదీల్లో ఐదు విడతలుగా రూ.1,41,500 నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు. ఆ మరుసటి రోజు నుంచి సైబర్ నేరగాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాధితుడు అయోమయంలో పడ్డాడు. వారి నుంచి ఏమైనా సమాచారం వస్తుందని 20 రోజులుగా వేచి చూసినా ఫలితం లేకపోవడంతో సోమవారం అవుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో) ఊర్మిళ జీవితంలో ‘గుడ్ మార్నింగ్’ -
నా సూట్కేస్ నిండా అవే!
‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ వల్ల షాపింగ్ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా షాపింగ్ చేసేయాలనుంది’’ అంటున్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధీ అగర్వాల్. గత ఏడాది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యాం. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్ చేయడం మిస్ అయ్యా. అందుకే ఈ ఇయర్ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్ చేయడం ఇష్టం. ఆన్లైన్ షాపింగ్ చేసీ చేసీ బోర్ కొట్టేసింది. స్టోర్స్ అన్నీ ఓపెన్ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించింది. ఇప్పుడు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నా. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. స్టోర్కి వెళ్లినప్పుడు ఎవరైనా గుర్తుపట్టే చాన్స్ ఉంది. వాళ్ళందరూ నా సినిమాలు చూసి, నచ్చాయి అని చెబుతున్నప్పుడు బావుంటుంది. అలానే ఎక్కడికి వెళ్లినా ఖాళీ సూట్కేస్ తీసుకెళ్తాను. బట్టలు, జ్యూవెలరీ కొనుక్కుంటాను. సూట్కేస్ని వాటితో నింపేస్తాను’’ అన్నారు నిధీ. -
ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని..
సికింద్రాబాద్: ఫేస్బుక్ ప్రేమకు ఓ యువకుడు బలయ్యాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించటంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు. చిలుకలగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యాపారి కుమారుడు వంశీకృష్ణ (21) సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీకృష్ణ తిరుమలగిరిలోని మింత్ర ఆన్లైన్ షాపింగ్ యాప్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్బుక్ ద్వారా వంశీకృష్ణకు సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇరువురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. వంశీకృష్ణ తన ప్రేమకు చిహ్నంగా ఛాతీపై ప్రియురాలి చిత్రాన్ని సైతం టాటూ వేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకునే విషయంలో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. తన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని.. వారు ఒప్పుకోనిదే వివాహం చేసుకోనని యువతి చెప్పేసింది. వంశీకృష్ణ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెస్తుండటంతో అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే విధులకు వెళ్తున్నానని చెప్పి చిలుకలగూడ నుంచి బయలుదేరిన వంశీకృష్ణ అల్వాల్ భూదేవినగర్లోని తన ప్రియురాలి ఇంటికి సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కారణంగానే వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయినా ఇతర కోణాల్లోనూ కేసును విచారిస్తామని రైల్వే ఇన్స్పెక్టర్ కె.ఆదిరెడ్డి తెలిపారు. -
ఆన్లైన్ ‘సెక్యూరిటీ’ కొద్ది మందికే!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ పెద్ద ఎత్తున అధికమైంది. ప్రధానంగా పండుగల సీజన్లో గణనీయంగా పెరిగింది. సైబర్ నేరస్తులు ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకుంటున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ మెకాఫీ మంగళవారం వెల్లడించింది. మెకాఫీ అడ్వాన్స్డ్ థ్రెట్ రిసర్చ్ టీమ్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతి నిముషానికి 419 సైబర్ నేరాలు నమోదయ్యాయి. జనవరి–మార్చితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయడంతో కస్టమర్లు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడుతున్నారు. నేరస్తుల చేతుల్లోకి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చేరుతోంది. ఆన్లైన్ కోనుగోలుదారుల్లో 27.5 శాతం మంది మాత్రమే సెక్యూరిటీ సొల్యూషన్స్ను వినియోగిస్తున్నారు. ఇది సైబర్ నేరస్తులకు వరంగా మారుతోందని మెకాఫీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్ణపూర్ తెలిపారు. ఆన్లైన్ ముప్పుపట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నారు. చదవండి: లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన -
మూడు స్తంభాల ‘సూపర్ షాప్’
కరోనా విజృంభిస్తున్న సమయం.. ఇళ్లల్లోంచి అడుగు బయట పెట్టాలంటే ఆందోళన.. మార్కెట్కు వెళ్లి సరుకులు తెచ్చుకుందామన్నా భయం.. ఇలాంటి విపత్కర సమయాన్ని అవకాశంగా మార్చుకున్నారు ఆ ముగ్గురు యువకులు. తమ గ్రామస్తులకు ఆన్లైన్ ప్లాట్ ఫాంను అందుబాటులో ఉంచి, వారు బుక్ చేసుకున్న సరుకులను హోం డెలివరీ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆ విధంగా అండగా ఉండటంతో పాటు.. వారూ ఉపాధి పొందుతున్నారు.. కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన నారాయణరెడ్డి, నాగూర్బాషా, తిరుమల కొండారెడ్డి బీటెక్ చదివి ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్నారు. ముగ్గురూ కలిసి వినూత్నంగా ఏదన్నా వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. అయితే ఏం చేయాలా.. అని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కరోనా విజృంభించింది. జనం నిత్యావసర సరుకుల కోసం ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు.. ఆ సమయంలో వారికి ఓ ఆలోచన మెరిసింది. ఆ నిత్యావసర సరుకులను వారి ఇళ్లకు తామే సరఫరా చేస్తే ఎలా ఉంటుందని. వెంటనే దానిని ఆచరణలో పెట్టారు. ‘çççసూపర్ షాప్’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. తమ గ్రామస్తులు బుక్ చేసుకున్న నిత్యావసర వస్తువులను ఉచితంగా హోం డెలివరీ చేస్తున్నారు. బుక్ చేసిన 10 నుంచి 15 నిమిషాల్లో సరుకులతో వారి ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. కొమరోలు నుంచి 10 కి.మీ దూరం వరకు ఏ గ్రామానికైనా ఉచితంగా సరకులను చేరవేస్తున్నారు. కిరాణా, ఫ్యాన్సీ షాపులతో ఒప్పందం కొమరోలులోని కిరాణా, ఫ్యాన్సీ షాపులు, రెస్టారెంట్లతో ముందుగానే ఈ యువకులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు కస్టమర్లు కోరిన సరుకులు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ను తక్కువ ధరకే ఆయా షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. తాము కూడా తక్కువ లాభాలు మాత్రమే తీసుకుంటూ ఎక్కువ ప్రయోజనాన్ని కస్టమర్లకే అందిస్తున్నారు. దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే దానికంటే ఆన్లైన్లో వీరి వద్ద కొన్న వస్తువులు రెండు, మూడు రూపాయలు తక్కువకే వస్తుండటం, పైగా డోర్ డెలివరీ చేస్తుండటంతో గ్రామస్తులు వీరిని ప్రోత్సహిస్తున్నారు. అన్నీ తామై.. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల కొనుగోలు దగ్గర్నుంచి.. వాటిని హోం డెలివరీ చేసే వరకూ అన్ని పనులూ ఆ ముగ్గురే తామై చక్కబెడుతున్నారు. సూపర్ షాప్ పేరుతో యాప్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్న తమ సేవలను.. తర్వాత మండలం, ఆ తర్వాత జిల్లాకు విస్తరిస్తామని చెబుతున్నారు. సేవ చేస్తున్నామన్న సంతృప్తి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్ వంటివి విజయవంతం కావని పలువురు చెప్పారు. ఆయినా మేం నిరుత్సాహ పడలేదు. సాహసం చేసి ముందుకు సాగుతున్నాం. సత్ఫలితాలొస్తున్నాయ్.. మున్ముందు ఆన్లైన్ ద్వారా మరిన్ని వస్తువులను సరఫరా చేసే ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మా స్థాయిలో సేవ చేస్తున్నామన్న తృప్తితో పాటు, మా కాళ్లమీద మేం నిలబడ్డామన్న సంతృప్తి మాకుంది. – నారాయణరెడ్డి, నాగూర్బాషా, కొండారెడ్డి -
భవిష్యత్పై బెంగ.. ఆరోగ్యంపై శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పుడు అధిక శాతం మందిని ‘భవిష్యత్ భయాలు’ వెంటాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇది అన్నిచోట్లా విభిన్న రంగాలు, వృత్తుల వారిపై ప్రభావం చూపుతోంది. వృత్తి నిపుణులు మొదలు విద్యార్థులు, సామాన్యుల్లోనూ కోవిడ్ కారణంగా తలెత్తిన అనిశ్చితి, కొనసాగుతున్న సందేహాస్పద పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనుండడంతో ఖర్చుల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కరోనా, సుదీర్ఘ లాక్డౌన్, ఆపై దశలవారీ అన్లాక్ సమయంలో కోవిడ్ కేసుల ఉధృతి పెరగడం వంటివి దేశ ప్రజల జీవితాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రభావితం చేశాయని, వినియోగదారుల మనస్తత్వం, కొనుగోళ్ల తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి వాటితో ప్రయోజనాలున్నా, కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయని పట్టణ ప్రాంత ప్రజలు ఈ అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. (చదవండి: విద్వేషంపై ఉదాసీనత) కరోనా ప్రభావంతో ఉద్యోగం, ఆఫీసు, షాపింగ్, ఫుడ్, రోజువారీ కార్యకలాపాలన్నింటా గణనీయ మార్పులు సంభవించడంతో అందుకు తగ్గట్టు అభిరుచులు, మనస్తత్వాలను మార్చుకునేందుకు, ఈ పరిస్థితికి అలవాటు పడేందుకు వివిధ రంగాల వృత్తి నిపుణులు మొదలు సామాన్యుల వరకు తంటాలు పడుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వత్రా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమైంది. -
అజాగ్రత్తకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, అమరావతి: నిత్య జీవితంలో డిజిటల్ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. నగదు లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి వాటిని మెజారిటీ వ్యక్తులు ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నగదు లావాదేవీలపై ఆధారపడడం కంటే ఈ విధానంలోనే చెల్లింపులు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. లావాదేవీలను చక్కబెట్టే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా అత్యధిక శాతం మంది వినియోగదారులు పట్టించుకోవడం లేదు. నెటిజన్లలో ఏకంగా 52% మంది సైబర్ భద్రతను పట్టించుకోవడం లేదని ఆన్లైన్ మార్కెట్ప్లేస్ సంస్థ ఓఎల్ఎక్స్ వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన ‘ఇంటర్నెట్ బిహేవియర్’ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. – ఆన్లైన్ కార్యకలాపాల సమయంలో నెటిజన్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బయటకు చెప్పకూడని విషయాలను వెల్లడిస్తున్నారు. – సోషల్ మీడియా సాధనాలైన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ వంటి వాటిలో తమ పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని తేలింది. – ఏకంగా 52 శాతం మంది తమ ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత చిరునామా, ఇతర సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. – 26 శాతం మంది బ్యాంక్ లావాదేవీల సమయంలో తమకు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్ట్వర్డ్)లను కూడా నిర్లక్ష్యంగా షేర్ చేస్తున్నారు. – బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, వాటి పాస్వర్డ్లు, యూపీఐ పిన్, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను 22% మంది ఇతరులతో పంచుకుంటున్నారు. – 73 శాతం మంది టరŠమ్స్ అండ్ కండీషన్స్ను (నిబంధనలు–షరతులు), లీగల్ గైడ్లైన్స్ను చదవడంలేదు. వీటిని పరిశీలించకుండానే ఆమోదించడం, స్కిప్ చేయడం వంటివి చేస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే ఆయా ఇంటర్నెట్ సర్వీసెస్ను సైన్ చేసే సమయంలో పూర్తిగా చదువుతున్నారు. – 61 శాతం మంది నెలలో ఐదు కంటె ఎక్కువసార్లు ఆన్లైన్ ద్వారా డబ్బు బదిలీ చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం చేస్తున్నారు. ఇక 37 శాతం మంది మాత్రమే ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను తరచూ మార్చుకుంటున్నారు. – 60 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పట్టించుకోవడంలేదు. – సర్వే కోసం.. 15 నుంచి 55 సంవత్సరాల వయసున్న 7,500 మంది ఇంటర్నెట్ వినియోగదారులను విశ్లేషించినట్లు ఓఎల్ఎక్స్ పేర్కొంది. -
అడ్రస్: అక్కడకు వచ్చి నన్ను పిలవండి !
జైపూర్ : ఆన్లైన్ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్ చేసినా అది మన వద్దకు చేరాలంటే ముందుగా డెలివరీ అడ్రస్ ఇవ్వడం సర్వ సాధారణం. అప్పుడే అది మన ముంగిట్లోకి వచ్చి వాలుతుంది. అప్పుడప్పుడు మనం చేసిన ఆర్డర్లకు బదులు కొన్నిసార్లు వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాలు మచ్చుకు కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రముఖ అన్డౌన్ డెలివరీ సంస్థ ఫ్లిప్కార్ట్కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఫ్లిప్కార్ట్లో వస్తువును ఆర్డర్ చేశారు. అయితే షిప్పింగ్ అడ్రస్ను మాత్రం వినూత్నంగా రాశాడు. (ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో..) రాజస్థాన్లోని కోటాలో డెలివరీ చేయాల్సిన ఈ ప్యాకిజీలో ‘444 చాత్ దేవాలయం. అక్కడికి వచ్చి నన్ను పిలవండి. నేను వస్తాను’. అని రాశాడు. దీనిని ట్విటర్ యూజర్ మంగేష్ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్లో ఉన్న చిరునామా చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అనేకమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ‘ఇండియా అంటే వేరే లెవల్, ఇది ఎంతో సరాదాగా ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ సంస్థ కూడా స్పందించడం విశేషం. ప్యాకేజీపై ఉన్న అడ్రస్ను చూపిస్తూ. ‘ప్రతి ఇల్లు ఓ ఆలయమే.. ఇది సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది’ అనే క్యాప్షన్తో ట్విటర్లో పోస్టు చేసింది. (వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు) Indian eCommerce is different. pic.twitter.com/EewQnPcU5p — Mangesh Panditrao (@mpanditr) July 7, 2020 Taking ‘Ghar ek mandir hai’ to a whole new level! pic.twitter.com/uuDoIYLyId — Flipkart (@Flipkart) July 9, 2020 -
ఈ– కామర్స్ బాటలో గ్రేటర్ వాసులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కోవిడ్ విసిరిన పంజాతో నిత్యావసరాలు సహా అన్ని రకాల గృహ వినియోగ వస్తువుల కొనుగోలుకు సిటీజన్లు ఈ– కామర్స్ బాట పట్టారు. గత మూడు నెలలుగా ఈ వ్యాపారం మూడు నిత్యావసరాలు.. ఆరు అత్యావసరాలు అన్న చందంగా ఈ– సైట్ల వ్యాపారం జోరందుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు నెలలుగా ఈ కామర్స్ సంస్థల అమ్మకాలు సుమారు 43 శాతం మేర పెరిగినట్లు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైటు షాపిఫై సంస్థ తాజా సర్వేలో తేలింది. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా.. ఉప్పు.. పప్పు.. సబ్బు బిల్లా.. అగ్గిపుల్లా తేడా లేకుండా అన్నింటి కొనుగోలుకు గ్రేటర్ సిటీజన్లు ఆన్లైన్ బాట పట్టడం విశేషం. కొనుగోళ్లన్నీ .. కోవిడ్ నేర్పిన పాఠాల నేపథ్యంలో ఇటు వినియోగదారులు అటు చిన్న వ్యాపారులు సైతం ఆన్లైన్ బాట పట్టారు. వినియోగదారులు తమ ఇంటి నుంచి తమకు నచ్చిన.. మనసుకు మెచ్చిన వస్త్రాలు, బొమ్మలు, వజ్రాభరణాలు తదితరాలను ఒక్క క్లిక్తో ఆర్డర్ చేయడం.. ఆర్డర్లను స్వీకరించిన చిన్న దుకాణాల వారు సైతం నిమిషాల్లో కస్టమర్ల ఇంటికి డోర్ డెలివరీ చేయడం ఇట్టే జరిగిపోతోంది. ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ షాపిఫై సంస్థ వినియోగదారుల అభిరుచిపై చేసిన తాజా సర్వే వివరాలను వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా తదితర సంస్థలు కొన్నేళ్లుగా వినియోగదారులు కోరిన పలు నిత్యావసరాలు, రోజువారీగా ఉపయోగించే వస్తువులను వినియోగదారులు ఆర్డరు చేసిన గంటలు.. రోజుల్లోనే డెలివరీ చేస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే చిన్న వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ దుకాణాలు, చిన్నారులు ఆడుకునే వస్తువులు విక్రయించే స్టోర్లు సైతం ఆన్లైన్ మార్కెటింగ్ నిర్వహించే ఈ– కామర్స్ సైట్లతో చేతులు కలపక తప్పని పరిస్థితి నెలకొంది. భౌతిక దూరం.. కష్టతరం.. కోవిడ్ కలకలం, మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంతో పాటు వినియోగదారులు ఒక్కసారిగా ఆయా దుకాణాలకు తరలి వెళ్తే భౌతిక దూరం పాటించడం కష్టతరం. దీంతో తమ రూటు మార్చుకున్నట్లు షాపీఫై సంస్థ తెలిపింది. ఇప్పటికే భాగ్యనగరంతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 20కిపైగా ఈ– కామర్స్ సైట్లు తమ వ్యాపారాలను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే దుకాణాలు, ప్రముఖ ప్రాంతాలు,కూడళ్లలో ఉండే దుకాణాల వారు సైతం ఇదే బాట పట్టాల్సి రావడం విశేషం. మరోవైపు గుండు పిన్ను దగ్గరి నుంచి రోజువారీగా కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, పాదరక్షలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఒకే చోట విక్రయించే మాల్స్కు సైతం జనం తాకిడి.. కోవిడ్ అలజడి పోయే వరకు అంతంతగానే ఉండే అవకాశాలుంటాయని తెలిపింది. చిన్న వ్యాపారాలు సైతం.. గ్రేటర్లో ఇప్పుడు చిన్న దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించే వారు సైతం ఆన్లైన్ బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, బొటిక్స్, వెండి, బంగారు వజ్రాభరణాలు విక్రయించేవారు, గృహవినియోగ వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, వాచీలు, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, వినియోగించే స్టేషనరీ, ఇతర బుక్స్, నిత్యావసరాలు, ఆర్గానిక్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర తినుబండారాలు, బియ్యం, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి.. అన్నిరకాల దుకాణాల యజమానులు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ– కామర్స్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలపడం లేదా.. సొంతంగా తమ వ్యాపారానికి సంబంధించిన సైట్ క్రియేట్ చేసి తమ వద్ద అందుబాటులో ఉన్న వస్తువులను అందమైన ఫొటోలు తీసి సరసమైన ధరలకు, ఆఫర్లతో ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచక తప్పని పరిస్థితి నెలకొంది. తమ సైటు గురించి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ గ్రూపుల్లో ప్రచారం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొందని షాపీఫై అధ్యయనం వెల్లడించింది. కాగా ప్రధాన ఈ– కామర్స్ సైట్లు బ్రాండెడ్ వస్తువులు, వాటి మార్కెటింగ్, డెలివరీకి భారీగా ఫీజులు వసూలు చేయనున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులు సొంతంగా ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకునేందుకు పలు స్టార్టప్ ఈ– కామర్స్ సైట్లతో చేతులు కలిపే అవకాశం ఉందని పేర్కొంది. నయా ట్రెండ్కు నాంది.. తాజా ట్రెండ్తో గల్లీ దుకాణమైనా.. ఢిల్లీలో ఉండే ప్రముఖ బ్రాండ్ వస్తువులను విక్రయించే సంస్థ అయినా ఆన్లైన్ మార్కెటింగ్ మినహా ఇతర ప్రత్యామ్నాయం లేకపోవడం గమనార్హం. నెటిజన్లుగా మారిన గ్రేటర్ సిటీజన్లు ఒక్క క్లిక్తో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ ఇప్పటికే కొనసాగుతుండగా.. తాజా పరిణామాలతో మరింతగా ఈ– కామర్స్ వ్యాపారం పుంజుకోనుంది. పండగలు, ఇతర ప్రత్యేకమైన రోజుల్లో ఈ ట్రెండ్ మరింత విస్తరించనుందని ఈ అధ్యయనం తెలపడం విశేషం. ఈ ఏడాది చివరి వరకు చిన్న వ్యాపారాల ఆన్లైన్ వ్యాపారం ట్రెండ్ జోరందుకుంటుందని షాపిఫై సంస్థ అంచనా వేసింది. -
ఆన్లైన్ 'కరోనా'
కుత్బుల్లాపూర్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ వణికిస్తున్న కరోనా (కోవిడ్ –19) ప్రభావం ప్రత్యక్ష కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అన్ని దేశాలు దాదాపుగా ‘షట్ డౌన్’ దిశగా అడుగులు వేస్తున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్ రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా అన్నింటిలో కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా అప్రమత్తతతో వినియోగదారులు కూడా షాపింగ్ చేయడం, రెస్టారెంట్లకు వెళ్లి గడపడం దాదాపుగా మానేశారు. ఇలాంటి తరుణంలో ఆన్లైన్ సేల్స్ ఊపందుకున్నాయి. పండగలకు, పెళ్లిళ్లకు బట్టలు, నిత్యవసర సరుకులు, మందులు ఇలా అన్నింటినీ బయట తిరగకుండా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు నగరవాసులు. వేరే ఆలోచనే లేదు.. సాధారణ రోజుల్లో ఉండే అమ్మకాల కన్నా కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సేల్స్ దిగ్గజాలు గంతంలో కన్నా అమ్మకాలను గత 20 రోజులలో 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నాయి. ఎక్కువగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రొడక్ట్ డెలివరీలు ఎక్కువగా చేస్తున్నాయి. ఉప్పులు, పప్పులు, సబ్బులు, పేస్టులు ఇలా అన్నింటినీ హోమ్ డెలివరీ డిస్కౌంట్ రేట్లలో ఇస్తుండటంతో ఏమాత్రం అలోచించకుండా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు నగరవాసులు. కోవిడ్–19 స్వీయ నియంత్రణ తరుణంలో కొత్త ఆన్లైన్ కస్టమర్లు కూడా ఇదే స్థాయిలో పెరగడం విశేషం. నిత్యవసర సరుకుల అమ్మకాలలో బిగ్బాస్కెట్, గోపర్స్ వంటి సైట్లు మెట్రో నగరాలలో తమ కస్టమర్లను 100 శాతం వరకు పెంచుకున్నాయి అంటే ఎంత మేర ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థమవుతున్నది. డిస్కౌంట్ లేకున్నా.. మార్కెట్లలోనే కాదు ఆన్లైన్ సైట్లలో కూడా శానిటైజర్, మాస్కులకు మంచి డిమాండ్ ఉంది. ఎంతలా అంటే నిన్నటి వరకు ఆఫర్ పెట్టి మాస్కులను, శానిటైజర్లను అమ్మకాలు సాగించిన ఆన్లైన్ సైట్లు ఇప్పుడు నో స్టాక్ అని చెబుతున్నాయి. శానిటైజర్లు అందుబాటులో లేకపోయినప్పటికీ మాస్క్లు మాత్రం ఆన్లైన్లో కూడా ఎక్కువ ధరలలో లభిస్తున్నాయి. ఈ వస్తువులు ఒక వేళ అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటలలోనే అమ్ముడుపోతున్నాయి. జోరందుకున్న ఔషధాల అమ్మకాలు నిత్యావసర వస్తువులలో అంతర్భాగమైన మెడిసిన్ అమ్మకాలు కూడా ఆన్లైన్లో జోరందుకున్నాయి. పోటీ వ్యాపారంలో నిన్నటి వరకు డిస్కౌంట్లు ఇచ్చి అమ్మకాలు చేసిన వారు ఇప్పుడు ఎంఆర్పీ రేట్లకే అమ్మకాలు చేçస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్లో ఔషధాలు విక్రయించే సైట్లలో ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. డాక్స్ యాప్, 1ఎంజీ, డాక్టర్ సీ వంటి సంస్థలు యాప్ల ద్వారా ఔషధ విక్రయాలను అందుబాటులో ఉంచాయి. అయితే వీటిలో ఔషధాలు కొనుగోలు చేయాలంటే ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. -
వాచ్.. తూచ్..
సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్డీల్లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మూడు చోట్ల నుంచి లీక్కు అవకాశం ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్కు చెందిన బాధితుడు స్నాప్డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్డీల్కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్కాల్స్ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
‘అశ్లీలం’ క్లిక్ చేస్తే బుక్కే!
సాక్షి, సిటీబ్యూరో: మీరు సీరియస్గా బ్రౌజింగ్ చేస్తుండగానో..సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మునిగి ఉండగానో... ‘ఆకర్షించే’ విధంగా పాప్అప్స్ వచ్చాయా..? హఠాత్తుగా మీ మెయిల్ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్ నుంచి ‘ఫొటోలతో’ కూడిన ఈ–మెయిల్ వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి. అవి మిమ్మల్ని నిలువునా బుక్ చేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇది చదవండి... సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. విద్యార్థిగా ఉన్న ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు గోల్మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్సైట్లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటు చేసుకుందని గుర్తించారు. క్రెడిట్, డెబిట్æ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు నెట్ బ్యాంకింగ్కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎర వేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. ఆ వివరాలే కీలకం... ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్లైన్లో స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డుకు చెందిన నెంబర్, సీవీవీ కోడ్లతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్నెట్కు బ్యాంకింగ్కు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటన్నింటితో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సైతం ఎంటర్ చేయాల్సిందే. ఇవి లేకుండా ఆన్లైన్లో డబ్బు కాజేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో ‘అడుగు ముందుకు’ వేసి ‘అశ్లీలం దారి’ పట్టారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. యువకులే టార్గెట్గా సైట్లు... ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల వల్లో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని టార్గెట్గా చేసుకుని ఆకర్షించేందుకు ఇంటర్నెట్లో కొన్ని అశ్లీల వెబ్సైట్లను సైతం నేరగాళ్ళు రూపొందిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్ అప్స్ను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతో పాటు వెబ్సైట్లకు లింక్ చేయడంతో పాటు అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ఆకర్షితులవుతున్న యువత క్లిక్ చేసిన వెంటనే అవి ఓపెన్ అవుతున్నాయి. ఆ తరవాతే అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. ఆ సైట్లోకి పూర్తిగా లాగిన్ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత మొత్తం రుసుం చెల్లించాలంటూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. నేరుగా చేరిపోతున్న వివరాలు... ఆ ప్రకారం ఆయా సైట్లలోకి లాగిన్ కావడానికి, వీడియోలు–ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని అక్కడ ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్ బ్యాంకింగ్కు సంబంధించిన సమాచారాన్ని ‘వినియోగదారులు’ అందులో పూరిస్తున్నారు. ఈ వివరాలన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్సైట్లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి... ఓటీపీ వచ్చే విధంగా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. ఆ యువకుడు వెబ్సైట్లో ఏర్పాటు చేసిన లింకులో దీన్ని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్లైన్లో స్వాహా చేస్తున్నారు. ఈ వివరాలను వినియోగించి వారు తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్లైన్ షాపింగ్ చేసి ‘కార్డు’లకు చిల్లు పెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. అలాంటి వారికి నైతికత ఉండదు ‘ఆన్లైన్ షాపింగ్, చెల్లింపులు చేసేప్పుడు పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోండి. అలాంటి వాళ్లు మీ కార్డులకు సంబంధించిన, ఆన్లైన్ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం అంత కష్టం. అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్సైట్ల వద్ద కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్లు కూడా కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్లలోకి వచ్చి చేయతాయి. ఫలితంగా అవి పాడవటంతో పాటు డేటా మొత్తం క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది.’– సైబర్ క్రైమ్ అధికారులు -
ఆన్లైన్ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు
జగిత్యాల : ఆన్లైన్ షాపింగ్తో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. జాగిత్యాలకు చెందిన కట్ట అరుణ్ కాంత్, వేణుమాధవ్, మొహసిన్లు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా రూ. 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం వస్తువులు సరిగా లేవని అవి తీసేసి వాటి స్థానంలో నకిలీ వస్తువులను ఖాళీ డబ్బాల్లో పెట్టి అమెజాన్కు తిరిగి పంపించారు. కాగా అమెజాన్ ప్రతినిధులు తిరిగి వచ్చిన డబ్బాలను తెరిచి చూడగా నకిలీ వస్తువులు ఉండడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
5 ఏళ్లు.. 10 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించే యోచనలోనే ఉంది. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చిన సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. గత ఆరేళ్లుగా భారత్లో పెట్టుబడులతో కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమని బెజోస్ పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాల్లో శిక్షణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో తమ వంతు తోడ్పాటు అందించాలని భావిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ మొదలు కస్టమర్ సపోర్ట్ దాకా అన్నివిభాగాల్లోకి అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి కొత్త పెట్టుబడులు ఉపయోగపడగలవని వివరించింది. చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్ఎంఈ) లు ఆన్లైన్ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ చేసే మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్ ఇప్పటికే ప్రకటించారు. వ్యాపారులకు వృద్ధి అవకాశాలు .. 2014 నుంచి భారత్లో అమెజాన్ తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుకుంది. గతేడాది హైదరాబాద్లో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేసింది. అమెరికా తర్వాత అమెజాన్ క్యాంపస్లో ఇదే అత్యంత పెద్ద క్యాంపస్. తాజాగా పెట్టబోయే పెట్టుబడులు.. 5.5 లక్షల పైచిలుకు చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు మరిన్ని వృద్ధి అవకాశాలు తెచ్చిపెట్టగలవని అమెజాన్డాట్ఇన్ వెబ్సైట్లో రాసిన ఒక పోస్ట్లో బెజోస్ పేర్కొన్నారు. ‘ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ భారత్పై నాకున్న ఇష్టం మరింత రెట్టింపవుతూ ఉంటుంది. అపరిమితమైన ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలు, భారతీయుల మొక్కవోని దీక్ష నాకు స్ఫూర్తినిస్తుంటాయి‘ అని ఆయన రాశారు. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై కాంపిటీషన్ కమిషన్ విచారణకు ఆదేశించిన తరుణంలో బెజోస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పరిశ్రమ వర్గాలతో బెజోస్ భేటీ.. శుక్రవారంతో ముగిసిన 3 రోజుల భారత పర్యటనలో బెజోస్ పలువురు వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. వీరిలో రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, భారతీ ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తదితరులు ఉన్నారు. చట్టాలకు లోబడే విదేశీ పెట్టుబడులు ఉండాలి: మంత్రి గోయల్ చట్టాలకు లోబడే అన్ని రకాల విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ‘అహ్మదాబాద్ డిజైన్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్కు అమెజాన్ గొప్ప ఉపకారమేమీ చేయడం లేదంటూ తానుచేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అమెజాన్కు వ్యతిరేకంగా మాట్లాడానంటూ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. నిబంధనల మేరకే పెట్టుబడులు ఉండాలని చెప్పాలన్నది తన ఉద్దేశమని గోయల్ చెప్పారు. -
కీలక నిర్ణయం తీసుకున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం..
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం బోస్ రిటైల్ స్టోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 119 రిటైల్ దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఆన్లైన్ షాపింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆడియో, స్పీకర్లు, హెడ్ఫోన్స్ తదితర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో బోస్ రిటైలర్స్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను సృష్టించుకుంది. తమ ఉత్పత్తులను దిగ్గజ కంపెనీలైన బెస్ట్ బై, అమెజాన్లు ఎక్కువ శాతం కొనుగోళ్లు చేశాయని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుతం ప్రజలు ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారన్న విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించలేదు. బోస్ వైస్ ప్రెసిడెంట్ కోలెట్ బ్రూక్ స్పందిస్తూ.. కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనదని, అంతిమంగా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇన్నాళ్లు సహకరించిన తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా సీడీ, డీవీడీ, వినోద వ్యవస్థలకు సంబంధించిన ఉత్పత్తులకు కంపెనీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. కాగా గతేడాది 2019లో యుఎస్ రిటైలర్లు 9,302 స్టోర్లు మూసివేశారని వ్యాపార వర్గాలు తెలిపాయి. కోర్సైట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో 59శాతం రిటైల్ స్టోర్స్ను 2018లో మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం 16శాతం ఉన్న ఆన్లైన్ అమ్మకాలు 2026 నాటికి 25% కి పెరుగుతాయని యుబీఎస్ విశ్లేషకులు తమ పరిశోధనలో అంచనా వేశారు. చదవండి: అమెజాన్ డెలివరీ బాయ్ అఘాయిత్యం కేసులో కొత్త ట్విస్ట్! -
నమ్మేశారో.. దోచేస్తారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆన్లైన్ మోసగాళ్లు మళ్లీ జూలు విదిల్చారు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న కేటుగాళ్లు ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్ల పేరున సరికొత్తగా మోసాలకు తెర తీస్తున్నారు. ఏ మాత్రం ఆశపడినా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా మోసాలు రెండు రోజులుగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్లోనూ శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి తాను రూ.63వేలు నష్టపోయానంటూ ఫిర్యాదు చేశారు. కవర్లతో వల.. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వారి పేరున మోసగాళ్లు ముందుగా ఓ కవర్ పంపిస్తున్నారు. అందులో పేరు, అడ్రస్ కూడా సరిగ్గా ఉంటున్నా యి. ఈ కవర్లో ఓ కూపన్ పెడుతూ అందులో ఓ కోడ్ను ఉంచుతున్నారు. స్క్రాచ్ చేసి చూస్తే కొన్ని లక్షలు బహుమతి గెలుచుకున్నట్లు వ స్తుండడంతో అమాయకులు వారి వలలో పడిపోతున్నారు. బహుమతి వచ్చిందన్న తొందరలో కొందరు కవర్లో పేర్కొన్న నంబర్లకు ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్లతో పాటు ఓటీపీలు కూడా చెప్పేస్తుండడంతో దుండగులు చాలా సులభంగా డబ్బులు దోచేస్తున్నారు. మెసేజీలు, ఫోన్కాల్స్ రూపంలో కూడా ఈ మోసాలు జరుగుతున్నాయి. అడ్రస్ ఎలా సంపాదిస్తున్నారు..? ఇన్నాళ్లూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ల రూపంలో ఈ తరహా మోసాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు కేటుగాళ్లు మరో అడుగు ముందుకు వేసి అడ్రస్లు కూడా కనుగొని ఏకంగా కవర్లే పంపిస్తున్నారు. అంత కచ్చితంగా అడ్రస్లు వారికి ఎలా తెలుస్తున్నాయో అంతుపట్టడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరి వివరాలకూ భద్రత ఉండడం లేదన్నది సత్యం. అందులోనుంచే వీరు అడ్రస్లు సంపాదిస్తూ ఇలా సరికొత్త దోపిడీకి తెర తీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక యాప్ల వినియోగానికి అంతా సొంత వివరాలను అప్పగించేస్తున్నారు. అనుమతి అడిగిన ప్రతి సారీ ‘అలోవ్’ ఆప్షన్ను ఇష్టానుసారం క్లిక్ చేసి పడేస్తున్నారు. ఈ ఆతృతే అక్రమాలకు మూలమవుతోంది. పలు సైట్లకు, యాప్లకు వినియోగదారులు ఇస్తున్న సొంత వివరాలను ఆధారంగా చేసుకుని దొంగలు గురిచూసి కొడుతున్నారు. మొదటిసారి కాదు.. జిల్లాలో ఈ తరహా మోసాలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు లక్కీడ్రా ల్లో మోటారు బైక్లు ఇస్తామంటే చాలా మంది నమ్మేశారు. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటే వారినీ విశ్వసించి మోసపోయారు. మె సేజీలకు, ఫోన్కాల్స్కు కూడా వారి వలలో పడిపోయారు. దీనిపై పోలీసులు ఎంతగా అ వగాహన కల్పిస్తున్నా అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలపై జా గ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా నంబర్, ఓ టీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్పీ గ్రీవెన్స్సెల్లో సూచించారు. -
చేతిలో ఫోన్ ఉంది కదా అని షాపింగ్ చేస్తే
ప్రపంచం కుగ్రామం అయిపోంది. ఇంటికి.. ఒంటికి కావాల్సిన, అవసరమైన అత్యాధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. వేల కిలో మీటర్ల దూరంలోని షాపుల్లో ఉన్న ఇలాంటి నచ్చిన..మెచ్చిన వినిమయ వస్తువులు ఇంటి ముగింటకే వచ్చేస్తున్నాయి. అయితే ఈ లావాదేవీల తర్వాత మోసాలు పొంచి ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ కోసం పేరు, చిరునామా, మొబైల్ ఫోన్ నంబర్లు, మెయిల్ అడ్రస్లు ఇస్తున్నాము. వీటి ఆధారంగా కొందరు మోసగాళ్లు ఆన్లైన్లోకి వచ్చేస్తున్నారు. మీరు ఫలాన ఆన్లైన్ షాపింగ్ సంస్థ నుంచి ఆర్డర్ తీసుకున్నారు.. అందులో సదరు కంపెనీ లక్కీ డ్రా నిర్వహించడంతో మీకు బహుమతులు వచ్చాయంటూ నమ్మకంగా చెబుతున్నారు. నిజంగానే ఆ కంపెనీ నుంచి ఆర్డర్ తీసుకుని ఉండడంతో వీరు చెప్పేదాన్ని బట్టి మోసగాళ్లు కాదు.. ఇదంతా నిజమే అనిపిస్తోంది. ఇలా మోసపోవడంలో అత్యధికులు విద్యావంతులే ఉండడం గమనార్హం. సాక్షి, నెల్లూరు: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా.. బజారుకెందుకు ఆన్లైన్లో షాపింగ్ చేసుకుందామనుకునే వారిని ఆన్లైన్ మోసగాళ్లు తెలివిగా మోసం చేస్తున్నారు. కొందరు లాటరీల పేరుతో మోసం చేస్తే.. ఇంకొందరు వస్తువులకు బదులు రాళ్లు.. రప్పలు పంపించి మోసాలు చేస్తున్నారు. వారి మోసానికి బలైపోయి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలో విద్యావంతులే ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకొని లక్షలు పొగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మార్కెట్లోకి అత్యాధునిక వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో షాపింగ్ కూడా అర చేతికిలోకి రావడంతో కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్యాష్ ఆన్ డెలివరీతో ఆర్డర్ ఇచ్చిన వస్తువులు నేరుగా ఇంటికే చేరడానికి పేరు, చిరునామా, ఫోన్ నంబరు, మెయిల్ అడ్రస్ ఇచ్చేస్తున్నాము. ఆన్లైన్ షాపింగ్ పూర్తయి తర్వాత ఒకటి.. రెండు రోజులకు వారి ఫోన్ నంబర్స్కు సదరు ఆన్లైన్ కంపెనీ పేరుతో ముందు మేసేజ్ వస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో వస్తువులు కొనుగోలు చేసినదాన్ని బట్టి వారి ఫోన్కు మెసేజ్ పంపుతారు. ఆ మెసేజ్లో మీరు షాపింగ్ చేసినందుకు మీ ఫోన్ నంబర్ లక్కీడిప్లో ఎంపికైందని, రూ.50 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయంటూ మెసేజ్ పెడతారు. వెంటనే వారికి ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చి మాటలు కలుపుతారు. అంతకు ముందే అదే ఆన్లైన్ షాపింగ్ కంపెనీ పేరుతో వస్తువులు కొనుగోలు చేసి ఉండడంతో ఇది నిజమే అని నమ్ముతాం. ఇదిగో మీకు వచ్చిన గిప్ట్ కూపన్ చూడండి వాట్సాప్కు పంపిస్తారు. ఆ వస్తువులు వద్దని చెబితే అయితే అంత నగదు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తామంటూ నమ్మిస్తారు. నగదు మీ ఖాతాలో వేయాలంటే ముందుగా ఎస్టిమేషన్ చార్జీలు, జీఎస్టీ, ఎక్స్ట్రా చార్జీలకు నగదు పంపిస్తే చాలు గిఫ్ట్ మొత్తం మీ ఖాతాలో వేస్తామని నమ్మించి వారి బ్యాంక్ ఖాతాలోకి నగదు వేయించుకుంటున్నారు. వారు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వకుండా రోజు ఒత్తిడి పెంచి నగదు వేయించుకుని మోసగాళ్లు మాయమవుతున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటూ కూపన్ ముంబయి కేంద్రంగా.. ముంబాయి కేంద్రంగా ఓ ముఠా ఆన్లైన్లో షాపింగ్ చేసే వారి పోన్ నంబర్లు పట్టుకొని ఇలాంటి తరహా మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫోన్కు మెసేజ్ పెట్టడం, ఫోన్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. అన్ని భాషలు వచ్చిన వ్యక్తులు ఆ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ముఠాల్లో మహిళలు ఉండడం విశేషం. తెలుగు మాట్లాడే వారికి తెలుగు భాష వచ్చిన వారితోనే ఫోన్ చేయిస్తున్నారు. అవతలి వారి రెస్పాన్స్ను బట్టి మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇదిగో గిఫ్ట్ వాహనం అంటూ కొత్త కార్లు వాట్సాప్ మెసేజ్లు పెట్టి మోసం చేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటూ కూపన్ కూడా పెడుతున్నారు. రూపేశ్ జా ఫోన్ నంబర్ 9667071295 ఫోన్ ద్వారా చీటింగ్ చేస్తున్నారు. ఆ మోసగాళ్లు కార్పొరేషన్ బ్యాంక్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. మోసపోయేది.. విద్యావంతులే! ఆన్లైన్ చీటర్స్ చేతిలో విద్యావంతులే మోసపోతున్నారు. ఆన్లైన్ షాపింగ్పై మోజుతో షాపింగ్ చేసుకుంటున్న వారినే టార్గెట్ చేస్తూ ఇలాంటి మోసాలు చేస్తున్నారు. వైద్యులు, టీచర్స్, ఇంజినీర్లు కూడా ఇలాంటి మోసాల బారిన పడుతుండడం గమనార్హం. ఇటీవల నెల రోజుల వ్యవధిలో మోసపోయిన బాధితులు సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చాలా మంది కూడా ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోయి పరువుకు వెరసి వెలుగులోకి తేవడం లేదు. ఇలాంటి మోసాలపై జాగ్రతగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అనేక మోసాలు.. ఇవిగో ఉదాహరణలు ►నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఆపిల్ కంపెనీ ‘ఎయిర్ పాడ్స్’ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ సెట్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.18,500. అయితే అతనికి వచ్చిన ఆర్డర్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే బాక్స్ నిండా ‘లక్కముద్ద’ను పంపించారు. దీనిపై సదరు యువకుడు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి సరిపెట్టారు. ►నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేసే ఒక యువతి ఆన్లైన్లో షాపింగ్ చేసింది. ఆమె ఫోన్కు రెండు రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది. మీ ఫోన్ నంబర్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని, రూ.15 లక్షల విలువైన మహీంద్ర ఎక్స్యువీ 500 కారు ఇస్తామని మెసేజ్ పెట్టారు. అనంతరం ఫోన్లో మాటలు కలపడంతో ఆ యువతి కారు వద్దని చెప్పడంతో దానికి సమాన విలువ మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాలో వేస్తామంటూ చెప్పారు. అయితే అందులో 5 శాతం నగదు ట్రాన్స్ఫర్ చార్జీస్ వేయాలంటూ చెప్పి రూ.30 వేలు వారి బ్యాంక్ ఖాతాలో వేయించుకున్నారు. ఆపై జీఎస్టీ చార్జీలంటూ మరో రూ.51,500, ఇంకోసారి ఇతరత్రా చార్జీల పేరుతో రూ.35 వేలు, రూ. 20 వేలు ఇలా దాదాపు రూ.1.5 లక్షల వరకు బ్యాంక్ ఖాతాలో వేయించుకున్నారు. ఆపై నగదు పంపిస్తామంటూ ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. ఈ కారు లాటరీలో వచ్చిందంటూ పంపిన ఫోటో ►నగరంలో ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు కూడా ఇదే తరహాలో మోసపోయాడు. ఆ వైద్యుడు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయడంతో అతని ఫోన్కు అదే తరహాలో మెసేజ్ వచ్చింది. ఆయన కూడా దాదాపు రూ.8 లక్షల వరకు వారి బ్యాంక్ ఖాతాలో వేసి మోసపోయాడు. రూ.15 లక్షల నగదు బహుమతి వచ్చిందంటూ పంపిన మెసేజ్ అయితే ఆ వైద్యుడికి మాత్రం రూ.కోటి విలువైన కారు, పలు ఖరీదైన వస్తువులు వచ్చాయంటూ బురిడి కొట్టించి నగదు కాజేశారు. డాక్టర్ అయి ఉండి కూడా ఆ మోసగాళ్ల మాయలో పడిపోయాడు. -
ఆన్లైన్ షాపింగ్ జబ్బే..!
బెంగళూరు: డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగం కారణంగా 2024 యేడాదికల్లా ఆన్లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తించింది. ఆన్లైన్ షాపింగ్ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ అభిప్రాయపడింది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్వో గుర్తించినట్టు గార్టనర్ నిర్వహించిన అధ్యయనం చెప్పింది. -
ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపారు..
కోల్కతా : ఆన్లైన్లో శాంసంగ్ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రెండు రాళ్లను ప్యాక్ చేసి కస్టమర్కు పంపిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా ఎంపీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము ఆన్లైన్లో వారం కిందట శాంసంగ్ మొబైల్ ఫోన్కు ఆర్డర్ చేశారు. తీరా తన ఇంటికి వచ్చిన పార్సిల్ను ఓపెన్ చేయగా శాంసంగ్కు బదులు రెడ్మి ఫోన్ బాక్స్ కనిపించింది. బాక్స్ను తెరిచిచూడగా రెండు మార్బుల్ రాళ్లు ఉండటంతో షాక్ అవడం ఎంపీ వంతయింది. ఈకామర్స్ సంస్థ చేసిన నిర్వాకంపై ఎంపీ స్ధానిక ఇంగ్లీష్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుపై తక్షణమే చర్యలు చేపడతామని మాల్ధా పోలీస్ చీఫ్ అలోక్ రజోరియా తెలిపారు. మరోవైపు తనకు ఎదురైన అనుభవాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఎంపీ చెప్పారు. -
భలే మంచి 'చెత్త 'బేరము
ప్రస్తుతం అంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, దీనివల్ల ఇళ్లల్లో పెద్దపెద్ద కార్ట్టన్లు, పేపర్ బ్యాగ్ల రూపంలో కొత్తరకం చెత్త తయారవుతోంది. దీనికి తోడు ఇంట్లో రోజువారి వ్యర్థాలు అదనంగా ఉండనే ఉంటాయి. అయితే ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు ఇంట్లోని చెత్తను కూడా సొమ్ము చేసుకునే మార్గాలు ఉన్నాయి! అంతేకాదు.. ఇంట్లోని పొడిచెత్తను కూడా ఆన్లైన్ ద్వారా వదిలించుకోవచ్చని అంటున్నాయి కొన్ని స్టార్టప్ కంపెనీలు. రీసైక్లింగ్ చేయదగిన చెత్తనంతటినీ కస్టమర్ల ఇంటికి వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తామని చెబుతున్న కొన్ని ఆన్లైన్ గార్బేజ్ సంస్థల వివరాలు మీకోసం. ద కబాడీవాలా కబాడీవాలా ఒక స్థానిక చెత్తను సేకరించే ఆన్లైన్ డీలర్. దీనిని అనురాగ్ అస్తీ, కవీంద్ర రఘువంశీ అనే ఇద్దరు కలిసి ప్రారంభించారు. వీరు తమ యాప్ ద్వారా స్థానికంగా ఉన్న ఇళ్లనుంచి చెత్తను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు పంపుతారు. ముఖ్యంగా కబాడీవాలా.. న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు, లోహ వస్తువులు, పుస్తకాలు, ఇనుము వంటి వాటిని ఇంటి యజమానులకు కొంత మొత్తంలో డబ్బులచెల్లించి సేకరిస్తుంది. అయితే వీరు తీసుకున్న చెత్తను ఎక్కడకి తీసుకెళ్తున్నారు? దానిని ఏంచేస్తున్నారో ప్రతీది కస్టమర్లకు తెలుసుకునే విధంగా లైవ్ ట్రాక్ సిస్టం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కబాడీవాలా సేకరిస్తున్న చెత్త కార్యక్రమం వల్ల.. 10వేల చెట్లను రక్షించబడడమేగాక, 2.5 లక్షల లీటర్ల ఆయిల్, 13.8 మిలియన్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం కబాడీవాలా భోపాల్, ఇండోర్, ఔరంగాబాద్, రాయ్పూర్లలో సేవలందిస్తోంది. వెబ్సైట్: www.thekabadiwala.com జంక్ కార్ట్ జంక్ కార్ట్ను ఢిల్లీకిచెందిన నీరజ్ గుప్తా, శైలేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్, శుభం షా అనే ముగ్గురు కలిసి 2015లో ప్రారంభించారు. వీరు కూడా అన్ని రీసైక్లింగ్ వస్తువులను సేకరిస్తారు. ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్, పేపర్, పుస్తకాలు, గ్లాస్ వంటి వాటిని సేకరిస్తారు. చెత్త ఇచ్చిన వారికి పేటిఎం వాలెట్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అయితే ఎవరైనా కస్టమర్లు తమ చెత్త అమ్మగా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలు, జంక్ ఆర్ట్లకు దానం చేయాలనుకుంటే...జంక్ కార్ట్లోని ఒక ఆప్షన్ ద్వారా దానం చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. మనం ఆన్లైన్లో ఒక వస్తువును కొనడానికి ఎలా ఆర్డరు ఇస్తామో అలానే జంక్ కార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ఆర్డరు ఇస్తే వారే వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారి వెబ్సైట్లో ఏ చెత్తను ఎంతరేటుకు తీసుకుంటారో వివరాలు పొందుపర్చారు, వీటి ద్వారావారు చెత్తను కొంటారు. వెబ్సైట్: www.junkart.in కర్మ రీసైక్లింగ్ మనకు ఏదైనా చెడుగాని, కష్టాలుగాని ఎదురైనప్పుడు మన కర్మ ఇంతేలే అనుకుంటాం. ఈ కర్మనే ఆధారం చేసుకుని చెత్తను పారేసి మీరు మెరుగుపడండి అంటూ ఓ స్టార్టప్ చెబుతోంది. అదే కర్మ రీసైక్లింగ్. మనింట్లో పేరుకు పోయిన చెత్తను పారవేసి మన కర్మను మరింత మెరుగు పరుచుకోవచ్చనే థీమ్తో అమీర్ జైరీవాల, అక్షత్ అనే ఇద్దరు ఈ పేరు మీదుగా చెత్తను సేకరిస్తున్నారు. అయితే వీరు మామూలు చెత్తను కాదు... ఎలక్ట్రానిక్ చెత్తను మాత్రమే సేకరిస్తారు. అదీ కూడా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు సేకరిస్తారు. వాటిలో ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ వాటిని చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. అయితే వీరు మన దగ్గర ఉన్న ఫోన్లు కానీ ల్యాప్ట్యాప్గాని కొనాలంటే అది ఏ బ్రాండ్కు చెందినది, ఇంకా ఆయా వస్తువు గురించి కొన్ని రకాల చిన్నపాటి ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే వారు మనం అమ్మదల్చుకున్న ఫోనుకు ఎంత మేర ధర చెల్లిస్తారో చెబుతారు. కస్టమర్కు కర్మ వారు ఇచ్చిన ధర ఓకే అయితే వారు దానిని తీసుకుని సర్సీస్ సెంటరుకు పంపిస్తారు. ఇలా దాదాపు 3 వేల స్మార్ట్ఫోన్ మోడళ్లను వీరు రీసైక్లింగ్కు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో కర్మసేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.karmarecycling.in ఎక్స్ట్రా కార్బన్ ఈ–వేస్ట్ను సేకరించే సంస్థే ఎక్స్ట్రా కార్బన్. గురుగ్రాంకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ. ఈ సంస్థను 2013లో ప్రారంభమైంది. సంవత్సరానికి 6 వేల టన్నుల ఈ–వేస్ట్ను ఎక్స్ట్రా కార్బన్ సేకరిస్తుంది. ఉత్తర భారతదేశంలోని 9 నగరాల్లో 41 వేలమంది ఎక్స్ట్రా కార్బన్ కస్టమర్లు ఉన్నారు. ఎక్స్ట్రా కార్బన్ సంస్థను ప్రారంభించిన మొదటేడాదిలోనే రూ.70లక్షలను సంపాదించడం విశేషం. వెబ్సైట్: http://extracarbon.com స్క్రాప్ ట్యాప్ ఇది హైదరాబాద్కు చెందిన సంస్థ. ‘‘జీరో వేస్ట్ హీరో’’ అనే నినాదంతో స్క్రాప్ ట్యాప్ ప్రారంభమైంది. దీనిలో ముఖ్యంగా ఐదుదశల్లో చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేస్తారు. చెత్త అమ్మేవారు, కొనే వారికి మధ్య ఒక మంచి వారధిగా స్క్రాప్ట్యాప్ వ్యవహరిస్తుంది. చెత్తను సేకరించి దానిని డిజిటల్ వేయింగ్ మిషన్ ద్వారా కొలిచి, ధరను నిర్ణయిస్తారు. ఆ తరువాత ఆ ధర కస్టమర్కు నచ్చితే దానిని రీసైక్లింగ్ యూనిట్కు పంపిస్తారు. వీరు వెబ్సైట్ ద్వారానే గాక వాట్సప్ నంబరు ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. స్క్రాప్ట్యాప్ ఇళ్లనుంచే గాక చిన్న చిన్న పరిశ్రమల నుంచి కూడా చెత్తను సేకరిస్తుంది.– పోకల విజయ దిలీప్, సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ వెబ్సైట్: http://scraptap.in -
డబ్బుల్లేకున్నా.. షాపింగ్ చేయొచ్చట
ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఆఫర్లు ఊరిస్తుంటాయి. కానీ ఎకౌంట్లో ఫండ్స్ చూస్తే.. సారీ ఈ రోజు కాదు అంటాయి. అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఓ వైపు నచ్చిన వస్తువు తక్కువ ధరకే ఊరిస్తుంటే.. మరోవైపు బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ కనిపించి తెగ బాధపెడుతుంది. అలాంటప్పుడు డబ్బులతో పని లేకుండా షాపింగ్ చేసే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది. ఎగిరి గంతేస్తాం. కానీ అదేలా సాధ్యం అనుకుంటున్నారా. అయితే ఒక సారి ఈ టిక్టాక్ వీడియో చూడండి. మీకే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోలో ఈ సమస్యకు.. పరిష్కారం చూపించాడో యువకుడు. ‘వెబ్డెవలప్మెంట్కు సంబంధించి టిక్టాక్లో ఇంతవరకూ ఒక్క వీడియోను కూడా చూడలేదు.. అయితే దీని గురించి నేనేం నిరాశ చెందటం లేదు’ అనే మాటలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. తర్వాత ఆ వ్యక్తి తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా.. జీరో బ్యాలెన్స్గా చూపిస్తుంది. తర్వాత ఆ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్కు సంబంధించి వెబ్పేజ్ ఒపెన్ చేసి.. బ్యాక్ఎండ్కి వెళ్లి ఎమౌంట్ దగ్గర తనకు కావాల్సినంత సొమ్ము యాడ్ చేస్తాడు. తర్వాత ఆన్లైన్లో తనకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తాడు. వీడియో ప్రారంభంలో హూడీతో కనపడిన వ్యక్తి చివర్లో తలపై స్కార్ఫ్ ధరించి ఉండటం మనం గమనించవచ్చు. I have not seen anything on TikTok that touched webdev... until today. I am not disappointed. pic.twitter.com/0NxKH2enrr — Tierney Cyren 📍 Build 💖 (@bitandbang) April 14, 2019 ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇలా చేయడానికి వీలవుతుందో లేదో తెలీదు గానీ నెటిజన్లు మాత్రం దీన్ని తెగ్ లైక్ చేస్తున్నారు. వీరి వరస చూస్తే ఓ తెలుగు సిమాలో బ్రహ్మానందం.. ‘ఈ టెక్నిక్ తెలీక ఇన్నేళ్ల నుంచి అనవసరంగా ఎన్ని షూస్ డబ్బులిచ్చి కొన్నానో మాష్టారు’ అనే డైలాగ్ గుర్తొస్తుంది. -
కెమెరా బుక్ చేస్తే.. రాళ్లొచ్చాయ్!
వనపర్తి: ఆన్లైన్ షాపింగ్ ఎప్పటికైనా ప్రమాదమని మరోసారి రుజువైంది. జిల్లాకేంద్రంలోని భగత్సింగ్నగర్ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్ కంపెనీ డిజిటల్ కెమెరాను ఫ్లిప్కార్డు ఆన్లైన్ షాపింగ్లో కొనుగోలు చేశాడు. అయితే సోమవారం ప్లిప్కార్డు నుం చి ఇన్స్టాకార్డు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా యాదిసాగర్కు ఓ పార్సిల్ వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్ను ఇంటికి తెచ్చి తెరిచి చూస్తే.. అందులో రెండు నల్లని రాళ్లు కనిపించాయి. ఒక్కసారిగా నివ్వెరపోయిన బాధితుడు కొరియర్ను ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్కార్డు బాక్స్తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేస్తాం కాని.. íఫ్లిప్కార్డు సంస్థ టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి విషయం చెప్పాలని సూచించారని బాధితుడు పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువ విలువగల వస్తువులు వచ్చిప్పుడే.. పార్సిల్లో రాళ్లు, మట్టిపెల్లలు వస్తుంటాయి. ఫ్లిప్కార్డు సంస్థ టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే.. మరో వారం రోజుల్లో పొరపాటు ఎక్కడ జరిగిందో విచారణ చేస్తామన్నట్లు బాధితుడు వివరించారు. -
లవర్స్కి ‘లైన్’ వేశారు!
వలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడానికిసిద్ధమయ్యారు. దీంతో ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్ల నిర్వాహకులు వారికి ‘లైన్’వేస్తున్నారు. విభిన్న గిఫ్ట్లతో ప్రేమికుల మదిని దోచుకోనున్నారు. సిటీలోని పలురెస్టారెంట్లు, పబ్స్ నిర్వాహకులు ప్రేమికుల కోసం ఎన్నో వెరైటీ కార్యక్రమాలకుసన్నద్ధమవుతున్నారు. ఫొటో ఆర్ట్ ఫర్ లవర్స్ ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్ లగ్జరీ గ్రూప్’ వాళ్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రపంచం మొత్తం మీద ఎవరైనా సరే తమకు నచ్చిన ఫొటోని ‘www.handpaintedstories.com’ వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ఆ ఫొటోను ఆర్ట్గా గీసి తిరిగి వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తారు. అంతే కాదు ఫొటోకు సంబంధించిన స్టోరీని కూడా పోస్ట్ చేస్తారు. ఇది లవర్స్కి ప్రత్యేకమనే చెప్పాలి. తక్కువ ధరల్లో చక్కటి గిఫ్ట్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్లలో కళ్లు జిగేల్మనిపించే గిఫ్ట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.99 నుంచి మనసుకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ కొడితే చాలు మనచేతిలో ఉంటాయి. కపుల్స్ డిన్నర్ సిటీలోని పలు హోటల్స్ కపుల్స్ కోసం డిన్నర్ను ప్లాన్ చేస్తున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ‘పార్క్ హయత్, ది హ్యాత్, తాజ్బంజారా, తాజ్కృష్ణా, దసపల్లా’ లాంటి అనేక హోటల్స్ డిన్నర్ థీమ్ను ఏర్పాటు చేశాయి. షాపింగ్ అదుర్స్ అమ్మాయిల కోసం టాప్స్, జ్యువెలరీ, రింగ్స్, అబ్బాయిల కోసం వాచెస్, హ్యాండ్ జ్యువెలరీస్, నెక్ జ్యువెలరీస్ ప్రస్తుతం సిటీలోని షాపింగ్ మాల్స్లో హల్చల్ చేస్తున్నాయి. షాపర్స్ స్టాప్, సిటీసెంటర్, అన్లిమిటెడ్, మ్యాక్స్ వంటి ప్రధాన షోరూంలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పబ్స్లో అలనాటి గీతాలు సిటీలోని పలు రెస్టారెంట్స్తో పాటు పబ్స్ కూడా కపుల్స్ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పబ్స్లో వైట్డ్రస్లో కపుల్స్ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు పాటలతో బ్యాండ్ కపుల్స్ కోసం అలనాటి పాటలను పాడుతూ వారిని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. స్పెషల్ రోజెస్ ఫర్ లవర్స్ విభిన్న రకాల, కలర్స్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. సిటీకి చెందిన సోనాల్ అగర్వాల్ ‘ఫ్లవర్వలీ’ పేరుతో రోజా పూలు విక్రయిస్తున్నారు. రోజా పూలతో పాటు టెక్నాలజీ ప్రింటెడ్ రోజెస్ అన్నీ సిటీలో, ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
సెల్ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బుబిళ్ల వచ్చింది
కృష్ణరాజపురం : ఆన్లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. వేలాది రూపాయలు వెచ్చించి ఆన్లైన్ షాపింగ్లో ఖరీదైన మొబైళ్ల తదితర వస్తువులకు ఆర్డర్ చేస్తే ఇటుకలు,రాళ్లు, సబ్బులు వస్తున్నాయి. అయినా వినియోదారులు ఆన్లైన్ లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా వంచకులు అమాయకులకు వల వేస్తున్నారు. అలాంటిదే ఈ ఘటన. ఉత్తరహళ్లికి చెందిన వెంకటేశ్ కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో పేటీఎం ద్వారా రూ.85వేల విలువ చేసే స్యామ్సంగ్ మొబైల్ కొనుగోలు చేశారు. మంగళవారం డెలివరీ బాయ్ పార్సిల్ అందించి వెళ్లిపోయిన అనంతరం ఆతృతగా, ఆనందంగా మొబైల్బాక్స్ తెరచిచూసిన వెంకటేశ్కు.. బాక్స్లో మొబైల్కు బదులు రూ.5 విలువ చేసే సబ్బు ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. తానుమోసపోయినట్లు గుర్తించి సుబ్రహ్మణ్యపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
తగ్గించుకుందాం అధనపు భారం!
హిమాయత్నగర్: కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బడ్జెట్ మన చేతుల్లోనేఉంచుకోవచ్చు. పొదుపు మంత్రం పాటిస్తే అ‘ధన’పు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులకు చెక్ పెట్టేయొచ్చు. ఇందుకోసం సేవింగ్స్ స్కీంలపై దృష్టి పెట్టడం, రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్స్ కొనడం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చెయ్యడం.. ఇలా పొదుపు సూత్రాలను పాటిస్తే సరి. వీటిని ఎలా చేయాలనేది మాత్రం సరైన స్పష్టత లేక సతమతమవుతుంటారు. అలాంటి చిట్కాలు ఇవిగో... ఆన్లైన్ షాపింగ్తో కొంత పొదుపు ముందుగా ఆన్లైన్ షాపింగ్ సైట్లను పరిశీలించాలి. వాటిలో మనం తీసుకోవాల్సిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో చూడాలి. గూగుల్ సెర్చ్లో మనకు కావాల్సిన వస్తువు ధర ఎంత అని సెర్చ్ చేస్తే.. అమెజాన్లో ఎంత, ఫ్లిప్కార్డ్లో ఎంత, టాటా క్లూస్లో ఎంత అనేది తెలుస్తుంది. ధర ఒక్కటీ తక్కువుండటం మాత్రమే కాదు షిప్పింగ్ చార్జీ ఎంత వసూలు చేస్తున్నదీ చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. క్రెడిట్ కార్డుతోనూ ఆదా.. వాడుతున్న క్రెడిట్ కార్డును బట్టి నెలలో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కిరాణా సరుకులు, ఇంధనంపై 5 శాతం వరకు, మూవీ టికెట్లు, రెస్టారెంట్లలో విందులపై 20 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంది. లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి.. కిరాణా, నిత్యావసర వస్తువుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలి. ముందుగా ఇంట్లోకి కిరాణా సామగ్రి ఏమేమి కావాలన్న జాబితా లేకుండా షాపింగ్ చేయొద్దు. షాపింగ్కు వెళ్లేటప్పుడు కచ్చితంగా లిస్ట్ తయారు చేసుకుని వెళ్లాలి. తప్పకుండా ఆ లిస్ట్ కే కట్టుబడాలి. సమయం ఉంటే నెల సరుకులు కొనే ముందు సమీపంలోని సూపర్ మార్కెట్లు లేదా సాధారణ కిరాణా షాపుల్లో ధరల వ్యత్యాసం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. గుల్ల చేసే మొబైల్ బిల్లు.. చాలా మందికి మొబైల్ బిల్లు విషయంలో కంట్రోల్ ఉండదు. పోస్ట్ పెయిడ్ అయితే అడ్డే ఉండదు. పొదుపు చేయాలంటే ముందు చేయాల్సింది పోస్ట్పెయిడ్కు గుడ్బై చెప్పేయడమే. ప్రీపెయిడ్కు మారాలి. ఆఫర్ల సమయంలోనూ.. ఏడాదికోసారి వస్త్రాలను కొనుగోలు చేయడంతోనూ ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అది కూడా ఆఫర్ల సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది. పండగలకు ముందు ఆన్లైన్లోనూ, బయట కూడా షాపుల్లో భారీ ఆఫర్లు ఉంటాయి. అప్పుడు కొనుగోలు చేయడంవల్ల కనీసం 30 శాతమైనా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. 10 నుంచి 50శాతం రాయితీ ఇస్తాం.. ఈ మధ్య అందరూ ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డారు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఓ వెబ్సైట్ని రూపొందించాం. ‘సెలబ్రేట్’ అనే వెబ్సైట్ నుంచి ఏదైనా షాపింగ్ చేస్తే 10 నుంచి 50శాతం రాయితీ ఇస్తున్నాం. – జీవన్చౌదరి, వెబ్సైట్ రూపకర్త బ్యాంకు ఖాతాలోనూ కిటుకులు.. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ కంటే అదనంగా ఉంచడం వల్ల వడ్డీ రాబడి తక్కువే వస్తుంది. కనుక ఆటో స్వీప్ సదుపాయం పెట్టుకోవాలి. దీంతో కనీస నగదు నిల్వకు మించి ఉన్న నగదు డిపాజిట్గా మారిపోతుంది. దీనిపై 7శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వాయిదా మంచిదే.. ఏదైనా వస్తువు కొనాలని అనిపిస్తే వెంటనే కొనొద్దు. దాన్ని ఒక నెల వాయిదా వేయండి. ఈ మధ్యలో అది అవసరమా లేదా అని ఆలోచించండి. నెల గడిచిన తర్వాత మరోసారి ఆ వస్తువు కావాలని అనిపిస్తే కొనండి. ఆన్లైన్ షాపింగే బెస్ట్.. నాకు నచ్చిన డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ ఆన్లైన్లోనే కొంటుంటా. ఎందుకంటే ఆన్లైన్లో చాలా చాలా ఆఫర్స్ ఉంటున్నాయి. బయట వాటికన్నా చాలా తక్కువ ధరల్లో నచ్చినవి దొరుకుతున్నాయి. అందుకే బయట షాపింగ్ చేయకుండా ఆన్లైన్ షాపింగ్నే ఇష్టపడుతున్నా.– నిహారిక కాసుల, స్టూడెంట్ -
ఈ సారి షాపింగ్ 'పండగే'!
గతేడాది ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ సమయంలో ప్రమోద్ రూ.33,000 రూపాయిల మొబైల్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పాత మొబైల్ ఫోన్ ఎక్సేంజ్పై అదనంగా రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేయడాన్ని చూశాడు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.3,000 పెట్టి పాత మొబైల్ కొని దాన్ని ఎక్సేంజ్కు పెట్టాడు. ఆ మొబైల్కు ఈ కామర్స్ సంస్థ రూ.5,000 విలువ కట్టింది. అప్ఫ్రంట్ డిస్కౌంట్ కింద రూ.3,000 తగ్గింపు లభించింది. బ్యాంకు కార్డుపై మరో 10 శాతం డిస్కౌంట్ లభించింది. ఇతర తగ్గింపులు కూడా పోను చివరికి ఆ మొబైల్ను ప్రమోద్ కేవలం రూ.20,000కే సొంతం చేసుకున్నాడు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఈ కామర్స్ సంస్థలు నిర్వహించే షాపింగ్ ఫెస్టివల్స్లో తక్కువ ధరలకే ఉత్పత్తులను ఎలా సొంతం చేసుకోవచ్చన్నది ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటీఎం సంస్థలు ఈ నెల 10– 15 తేదీల మధ్య భారీ ఎత్తున విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు వచ్చే నెలలో దీపావళికి ముందు మరోసారి పెద్ద ఎత్తున ఫెస్టివల్ సేల్స్ కూడా నిర్వహించనున్నాయి. ఈ అమ్మకాల సందర్భంగా మంచి డీల్స్ కచ్చితంగా ఉంటుంటాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది పండుగల షాపింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదైన విక్రేతలు అంచనా వేస్తున్నారు. ‘‘ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత పోటీ మరింత తీవ్రతరం అయింది. అంతర్జాతీయ బ్రాండ్లు తక్కువ ధరలకే మార్కెట్లో పెద్ద వాటాను ఆక్రమించనున్నాయి’’ అని క్యాష్కరో డాట్ కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ పేర్కొన్నారు. మొబైల్స్ ఒక్కటే కాదు... గత కొన్నేళ్లుగా ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్ను గమనిస్తే... ఎక్కువ ఆఫర్లు స్మార్ట్ఫోన్లపైనే ఉంటుండేవి. దీనికి కారణం ఆన్లైన్లో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తులు స్మార్ట్ఫోన్లు కావడమే. కానీ, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఈ సారి ఆఫర్లను మరిన్ని విభాగాల్లోని ఉత్పత్తులపైనా అందించనున్నాయి. ‘‘వినియోగదారులు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (మన్నికైన ఉత్పత్తులు)పై తగ్గింపులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై డిస్కౌంట్ కోరుకుంటున్నారు. ఈ విభాగంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో స్మార్ట్ఫోన్లపై మార్జిన్లు చాలా తగ్గిపోయాయి’’ అని కంపేర్రాజా, కూపర్రా జా సంస్థల అధినేత రోహిత్చుగ్ చెప్పారు. స్మార్ట్ఫోన్లపై ఎలానూ డిస్కౌంట్లు ఉంటాయి. కాకపోతే ఈ సారి సేల్స్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్పై అధిక డిస్కౌం ట్లను ఆశించొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్యాష్బ్యాక్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు, అదే సమయంలో కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకునేందుకు ఈ కామర్స్ సంస్థలు మార్కెటింగ్ సంస్థలకు కొంత కమీషన్లు చెల్లిస్తుంటాయి. యూజర్లను తమ వెబ్సైట్కు మళ్లించడం అవి చేస్తుంటాయి. క్యాష్కరో డాట్ కామ్, గోపైసా డాట్కామ్ తదితర సంస్థలు ఇదే పనిచేస్తుంటాయి. అయితే ఇవి కస్టమర్లకు తమకు వచ్చే కమీషన్లో కొంత తిరిగి ఇవ్వడం అదనపు ఆకర్షణ. ‘‘క్యాష్ బ్యాక్ ఎంతన్నది ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. 2 శాతం నుంచి 35 శాతం వరకు ఉండొచ్చు. మా కమీషన్లో 70–80 శాతాన్ని తిరిగి వినియోగదారులకు బదిలీ చేస్తాం’’ అని క్యాష్కరో ఫౌండర్ స్వాతి భార్గవ తెలిపారు.ఈ క్యాష్ బ్యాక్ను తదుపరి లావాదేవీ కోసం వినియోగించుకోవచ్చన్నారు. కొన్ని సంస్థలయితే ఈ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. మార్కెటింగ్ అఫిలియేట్ సంస్థలు డీల్స్ ప్రచారం విషయంలో ఈ కామర్స్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఈ సంస్థల పోర్టళ్లను పరిశీలిస్తే కూపన్ కోడ్స్ కనిపిస్తాయి. వీటిని ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై వినియోగించడం ద్వారా, అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. తగ్గింపు అవకాశాలు ధరలను వివిధ పోర్టళ్లలో ఏవిధంగా ఉన్నదీ చూపించేందుకు కొన్ని పోర్టళ్లు ఉన్నాయి. ప్రైస్దేఖో డాట్ కామ్, కంపేర్రాజా, మైస్మార్ట్ప్రైస్, బైహట్కే, స్మార్ట్పిక్స్ సంస్థలన్నీ ఈ సేవలు అందించేవే. ఏ ఏ పోర్టళ్లలో ఫలానా ప్రొడక్ట్ ధర ఎంతున్నది, క్రెడిట్/డెబిట్ కార్డులపై ఏదైనా తగ్గింపు ఆఫర్లున్నాయా? అన్నవి చూపిస్తాయి. ఒక్క పేజీలోనే అన్ని డీల్స్ను చూసి నిర్ణయం తీసుకునే సౌకర్యం ఉంటుంది. యాప్స్లో ప్రత్యే క డీల్స్ అన్నవి గతంలోనే ఎక్కువగా ఉండగా, ఈ సారి తగ్గిపోనున్నాయి. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు వాటిని వెబ్సైట్లలోనే చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థలు గుర్తించడమే ఇందుకు కారణమని రోహిత్చుగ్ తెలిపారు. -
జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా?
డిజిటల్ మార్కెటింగ్, ఈ– కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. నిజానికి ఆన్లైన్లో మనం చూసే వెబ్సైట్లలో చాలా వరకు నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ బ్రౌసింగ్ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ అందిస్తాం. చౌకగా ల్యాబ్టాప్ పంపిస్తామనే ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఒక్కటే మీ డిటైల్స్తో కూడిన ఫామ్ను పూరించి తమకు అందించడమే తరువాయి. వారం రోజుల్లో సెలక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ మీ ఇంటికి పంపిస్తామనే ప్రకటనలతో అమాయకుల డబ్బులు కాజేసి బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు. సాక్షి, హైదరాబాద్: తెలియని వ్యక్తికి ఏ కంపెనీ ఉచితంగా గిఫ్టూ ఇవ్వదు. కానీ కొందరు ఇదేం పట్టించుకోక సదరు కంపెనీకి తమ వ్యక్తిగత డాటాను చేరవేస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలను తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్ జరుగుతుందని నమ్మించి.. ఆ తర్వాత మీ ప్రొడక్ట్ రెడీగా ఉంది కానీ కస్టమ్స్ చార్జీలు పంపించండని చెబుతారు. ప్రొడక్ట్ విలువను బట్టి కస్టమ్స్ చార్జీలను నిర్ణయిస్తామంటారు. వినియోగదారుడు పూర్తిగా నమ్మితే గాని ఖాతా వివరాలను షేర్ చేయరు. ఖాతా వివరాలను పంపిన తర్వాత మీ ప్రొడక్ట్ వ్యాల్యూ లక్ష రూపాయలు అని, మీరు కేవలం పదిశాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని చెబుతారు. సదరు వ్యక్తి డిపాజిట్ చేసిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్ లభించదు. సదరు వినియోగదారుడు తాను మోసపోయానని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్న మొత్తం ఒక్కోసారి లక్షల్లో కూడా ఉండటం గమనార్హం. ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆన్లైన్ ఫ్రాడ్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టిన విషయం విదితమే. దీనిపై ఇప్పటికే అనేక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ httpr://www.abnhpm.gov.in/ని పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్లు డిజైనింగ్తో సహా రూపొందించారు. ఆయా నకిలీ వెబ్సైట్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫొటోలు పెట్టడంతో పాటు.. రూ.1000 నుంచి రూ. 2000 ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ జనాలను మోసం చేసే మెసేజ్ పొందుపరిచారు. అంతేకాదు, ‘పేదలకు చేరేలా ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయమని’ వినియోగదారులను నకిలీ వెబ్సైట్లు ట్రాప్ చేస్తున్నాయి. తెలిసీ తెలియక చాలామంది అమాయకులు వారు కోరిన మొత్తాన్ని చెల్లించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గిజ్చ్టిట్చ ppలో కూడా ఆయుష్మాన్ భారత్ పేరిట నకిలీ వెబ్సైట్లు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు. డబ్బులు వసూలు చేస్తే అది నకిలీదే.. ‘ఆయుష్మాన్ భారత్’ పేరిట ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏదైనా వెబ్సైట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే దాన్ని కచ్చితంగా నకిలీ వెబ్సైట్గా ప్రజలు పరిగణించాలి. కొన్ని సైట్లు డబ్బులు ఏమీ అడగకుండానే ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ వెల్లడించారు. ఈ స్కీమ్కు సంబంధించి కేవలం 1455 నంబర్ మాత్రమే ఉందని, ఇతర నంబర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా..? ఇలాంటిదే మరో ఫేక్ వెబ్సైట్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అదే జియో వెబ్సైట్ ఆన్లైన్. చిత్రంలో కనిపిస్తున్న వెబ్సైట్ను చూశారు కదా. ఈ వెబ్సైట్లోకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులన్నీ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది. ఇంత తక్కువ ధరకు సాధ్యమేనా..? రూ.24,999 విలువైన జియో ల్యాప్టాప్ను కేవలం రూ.599కే అందించడం సాధ్యమా. విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్టాప్ ఇప్పటి వరకు మార్కెట్లోకే రాలేదు. ఇది నకిలీదని.. మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం మనకు తప్పకుండా రావాలి. ఇవే కాకుండా ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్సైట్లకు చెందిన పలు యాడ్స్ ఇప్పుడు ఫేస్బుక్లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఏమరుపాటుగా ఉండటం మన బాధ్యత. తస్మాత్ జాగ్రత్త. -
ఆన్లైన్ షాపింగా.. అవి క్లిక్ చేయొద్దు..
కలెక్టరేట్: పండగల సీజన్ వచ్చేసింది. ఆన్లైన్లో పలు రకాల వెబ్సైట్లు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లతో ఆకర్షిస్తుంటాయి. ఇటీవల ఆన్లైన్ షాపింగ్ చాలామందికి క్రేజీగా మారింది. బిజీలైఫ్లో సమయం లేక నట్టింట్లో కూర్చుని షాపింగ్ చేస్తుంటారు. పలు కంపెనీలు ఇస్తున్న ఈఎంఐ ఆఫర్స్ కోసం ఆన్లైన్ షాపర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లు సరికొత్త ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఆన్లైన్ వినియోగదారులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఫామ్జాకింగ్తో పారాహుషార్... సాధారణంగా ఆన్లైన్ షాపింగ్ పండగల సమయాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో హ్యాకర్స్ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఆన్లైన్ షాపర్స్ను మాయ చేసి పేమెంట్ వివరాలను దొంగిలించే క్రమంలో హ్యాకర్లు రకరకాల ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. తాజాగా వారు అనుసరిస్తున్న వ్యూహాల్లో ’ఫామ్జాకింగ్’ ఒకటి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టాన్ వెల్లడించిన వివరాల ప్రకారం దసరా, దీపావళి పండగల రద్దీని పురస్కరించుకొని హ్యాకర్లు ఆన్లైన్ షాపర్స్గా మారి ‘ఫామ్జాకింగ్’ దాడులకు పాల్పడబోతున్నారు. ఈ ప్రమాదకర హ్యాకింగ్ దాడి నుంచి ఏ విధంగా బయటపడవచ్చనే దానిపై నార్టాన్ సెక్యూరిటీ రీసెర్చర్లు కొన్ని కీలక సూచనలు చేశారు. ఇలా తస్కరణ... ’ఫామ్జాకింగ్’లో భాగంగా హ్యాకర్లు ఓ ప్రమాదకర జావా స్క్రిప్ట్ను ఈ–కామర్స్ వెబ్సైట్లకు సంబంధించిన చెక్ అవుట్ వెబ్ పేజీలలో లోడ్ చేస్తారు. దీంతో ఈ పేజీలలో ఎంటర్ కాగానే నగదుకు సంబంధించిన వివరాలు హ్యాకర్ల సర్వర్స్లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్ ఉచ్చులో బ్రిటిష్ ఎయిర్వేస్, టికెట్ మాస్టర్ వంటి ప్రముఖ వెబ్సైట్లు చిక్కుకున్నాయి. పర్యవసానంగా 3.8 లక్షల యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పాస్వర్డ్స్ ముఖ్యం... ’ఫామ్జాకింగ్’ దాడుల నుంచి ఆన్లైన్ అకౌంట్లను కాపాడుకునే క్రమంలో శక్తిమంతమైన, విభిన్నమైన పాస్వర్డ్లను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే పాస్వర్డ్లో అప్పర్కేస్, లోయర్ కేస్ సింబల్స్ ఇంకా నెంబర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన పాస్వర్డ్ను మల్టీపుల్ అకౌంట్లకు ఉపయోగించవద్దు. అవి క్లిక్ చేయొద్దు... పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్ లేదా అటాచ్మెంట్స్ను ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదే సమయంలో ర్యాండమ్ లింక్స్పై క్లిక్ చేయొద్దు. సైబర్ నేరగాళ్లు మీ మిత్రులకు చెందిన ఈ–మెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా మాలీషియస్ లింక్స్ను పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెబ్ లింక్పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం మంచిది. వైర్లెస్ కనెక్షన్స్తో జాగ్రత్త... కొత్త నెట్వర్క్ కనెక్టెడ్ డివైస్ను ఇన్స్టాల్ చేస్తున్నపుడు డీఫాల్ట్ పాస్వర్డ్ను కొత్త పాస్వర్డ్తో అప్డేట్ చేసుకోవాలి. ఇదే సమయంలో మీ వైర్లెస్ కనెక్షన్లను శక్తిమంతమైన పాస్వర్డ్లతో ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంతో మంచిదని రీసెర్చర్స్ సూచిస్తున్నారు. -
సెల్ బుక్ చేస్తే సబ్బు వచ్చింది
కాళేశ్వరం(మంథని): టీవీలో ప్రకటన చూసి సెల్ఫోన్ కోసం ఆర్డర్ ఇవ్వగా, దాని బదులు సబ్బు రావడంతో మోసపోయానని ఓ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ అంకం రాజబాపు టీవీలో ఓ కంపెనీకి సంబంధించి 4జీ సెల్ఫోన్ ప్రకటన చూశాడు. దాని విలువ రూ.3,390 ఉన్నట్లు చెప్పగా, వెంటనే స్క్రీన్పై ఉన్న 04067037189 నంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది రోజులకు పార్శిల్లో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. అందులో వచ్చిన సెల్ఫోన్ 20 రోజులకే సాఫ్ట్వేర్ పోయింది. సెల్ఫోన్కు ఆ కంపెనీ సంవత్సరం వారంటీ ఇవ్వగా బాధితుడు స్క్రీన్పై ఉన్న 04067037189 నంబర్కు ఫోన్ చేయగా, మరో 9560942125, 9650755884 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఆ నంబర్లకు కాల్ చేయగా సిబ్బంది సూచన మేరకు సాఫ్ట్వేర్ పాడైన ఫోన్ను తిరిగి కంపెనీ అడ్రస్, ఫోన్ ఫొటోలు తీసి ఆయా నంబర్లకు వాట్సప్లో పంపాడు. 15 రోజుల తర్వాత కంపెనీ స్టిక్కరింగ్తో పార్శిల్ వచ్చింది. విప్ప చూడగా సబ్బు ఉండటంతో అవాక్కయ్యాడు. మళ్లీ అవే నంబర్లకు ఫోన్ చేయగా పొరపాటు జరిగిందని, మళ్లీ కంప్లేంట్ తీసుకుంటున్నామని సిబ్బంది చెప్పారు. రెండు రోజుల క్రితం మళ్లీ పార్శిల్ రాగా విప్పి చూడటంతో ఘడి డిటర్జెంట్ సబ్బు వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. మళ్లీ ఆయా నంబర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని వాపోయాడు. టీవీలో, ఆన్లైన్లో వస్తువుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి మోసం చేస్తున్నారని, సైబర్ క్రైం పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అంకం రాజబాపు కోరుతున్నాడు. -
షాపింగ్ ఎక్కువగా చేసేది అబ్బాయిలే!!
న్యూఢిల్లీ : షాపింగ్ అంటే అమ్మాయిలని, అమ్మాయిలంటే షాపింగ్ అంటూ చమత్కారాలు చేస్తూ ఉంటారు. కానీ షాపింగ్ ఎక్కువగా చేసేది అమ్మాయిలు కాదట. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్ చేస్తారట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా? అతిపెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ షాపింగ్ వెబ్సైట్లైన మింత్రా, జబాంగ్ల సీఈవో అనంత్ నారాయణన్. 55 శాతం అబ్బాయిలే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్ సమిట్ మైండ్ రాక్స్లో మాట్లాడిన నారాయణన్.. ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అబ్బాయిలే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దనే స్మార్ట్ఫోన్లు కలిగి ఉండటమని పేర్కొన్నారు. షాపర్ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్సైట్ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది. అయినప్పటికీ, అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు. మింత్రాలో 55 శాతం డిమాండ్ టాప్ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్ లేదు, ఒకవేళ యాక్సస్ కల్పిస్తే, పట్టణ ప్రజలు అనుసరించే ట్రెండ్నే గ్రామీణ ప్రాంత ప్రజలు ఫాలో అవుతారని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రెండ్స్ భారత్కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్ ఫ్యాషన్ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు. -
ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి దిగ్గజాలు...
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో దేశీ ఆన్లైన్ షాపింగ్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న దిగ్గజ ఈ–కామర్స్ సంస్థలు తాజాగా ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను కొనేయడమో లేదా పెట్టుబడులు పెట్టడమో, వాటాలు తీసుకోవటమో చేసే పనిలో పడ్డాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలతో పాటు బిగ్బాస్కెట్, స్విగ్గీ వంటి సంస్థలూ బరిలోకి దిగడంతో ఆన్లైన్ ఫార్మా రంగంలో పోటీ మరింత తీవ్రం కానుంది. దేశీయంగా ఔషధాల అమ్మకాలు 2020 నాటికల్లా 55 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం 2017లో రూ. 1,19,641 కోట్ల (17.5 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూన్లో రూ.10,215 కోట్ల (1.49 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు దేశీయంగా అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 8.6 శాతం అధికం. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఫార్మాలో పెద్దగా డిస్కౌంట్ల ఊసుండదు. దీంతో మార్జిన్లు భారీగానే (సుమారు 20–30 శాతం దాకా) ఉంటాయి. కొన్ని స్టార్టప్లు డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆన్లైన్ ఫార్మసీలు ప్రారంభించినప్పటికీ... ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ అంశాలే ఈ–కామర్స్ దిగ్గజాలను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మా సంస్థలతో అమెజాన్ చర్చలు ప్రస్తుతం దేశీయంగా మెడ్ప్లస్, 1ఎంజీ, మెడ్లైఫ్, ఫార్మీజీ, మైరా, అపోలో, నెట్మెడ్స్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మెడ్ప్లస్ వంటి 3–4 సంస్థలతో అమెజాన్ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశీయంగా రెండో అతి పెద్ద ఫార్మసీ చెయిన్ అయిన మెడ్ప్లస్పై అమెజాన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెడ్ప్లస్కు ఆన్లైన్ ఫార్మసీతో పాటు దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే... ఈ స్టోర్స్ని అమెజాన్ డెలివరీ సెంటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించవచ్చు. అమెజాన్ నిర్దిష్టంగా ఎంత మేర వాటాలు కొనుగోలు చేసేదీ తెలియనప్పటికీ.. మెడ్ప్లస్తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెడ్ప్లస్లో వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడికి దాదాపు 90% వాటాలున్నాయి. 2006లో ప్రారంభమైన మెడ్ప్లస్.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. మెడ్ప్లస్ ఆదాయాలు 2014–15లో రూ. 1,361 కోట్లు, 2015–16లో రూ. 1,726 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్లలో లాభాలు రూ. 7–9 కోట్లుగా ఉన్నాయి. మెడ్లైఫ్పై ఫ్లిప్కార్ట్ దృష్టి.. అమెజాన్కు పోటీదారైన దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా ఆన్లైన్ ఫార్మాలో ప్రవేశించేందుకు చకచకా పావులు కదుపుతోంది. అల్కెమ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు నిర్వహించే మెడ్లైఫ్ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పేర్లు వెల్లడించనప్పటికీ.. రెండు భారీ ఈ–కామర్స్ సంస్థలతో చర్చలు జరిపినట్లు, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు మెడ్లైఫ్ వర్గాలు పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. ఇక ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న బెంగళూరు సంస్థ స్విగ్గీ .. ఔషధాల డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఈ–ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. అటు ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్బాస్కెట్ సంస్థ.. కొత్తగా ఫార్మాను కూడా తమ లిస్టులో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐవోసీడీ ఆందోళన.. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏఐవోసీడీ ఆగస్టు 1 నుంచి 14 దాకా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ తమ డిమాండ్లను పట్టించుకోకపోయిన పక్షంలో రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే షాపులు తెరిచేలా వర్క్–టు–రూల్ విధానాన్ని అమలు చేస్తామని ఏఐవోసీడీ హెచ్చరిస్తోంది. ఇందులో 8.5 లక్షల మంది కెమిస్టులు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉన్నారు. పిల్ప్యాక్ కొనుగోలుతో అమెజాన్ సంచలనం.. అమెరికాలో పిల్ప్యాక్ అనే ఆన్లైన్ ఫార్మా కంపెనీని దాదాపు 1 బిలియన్ డాలర్లకు అమెజాన్ కొనుగోలు చేయడం అక్కడి ఫార్మా మార్కెట్ను కుదిపేసింది. ఈ డీల్ వార్తతో అమెరికా ఫార్మసీ/డ్రగ్స్టోర్ పరిశ్రమ మార్కెట్ క్యాప్ ఏకంగా 13 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఇలాంటి భారీ సంచలనాన్నే భారత్లోనూ పునరావృతం చేసేందుకు అమెజాన్ కసరత్తు చేస్తోంది. నిజానికి అమెజాన్కి ఆన్లైన్ ఫార్మా వ్యాపారం కొత్తేమీ కాదు. 1998లో డ్రగ్స్టోర్డాట్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ, 2000లో టెక్నాలజీ సంస్థలు కుదేలవడంతో.. ఇది మూతబడింది. ఆకర్షణీయమైన భారత మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమెజాన్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. -
ఆన్లైన్ మోసం: ఫోన్కు బదులు నాపరాయి
-
ఆన్లైన్ కొనుగోళ్లను పారదర్శకం చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో కొనుగోళ్లను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుస్తామని కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలిపారు. వినియోగదారులకు ఆన్లైన్ షాపింగ్ పరంగా ఎదురవుతున్న సమస్యల విషయమై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు ఆమోదం అనంతరం ఈ కామర్స్ నియంత్రణకు సమగ్రమైన నిబంధనలను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ‘‘సాధారణ షాపింగ్ పరంగా లేని సమస్యలు ఆన్లైన్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం’’ అని రామ్విలాస్ పాశ్వాన్ అన్నారు. డిజిటల్ చెల్లింపులు, తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెప్పారు. -
సెల్ఫోన్ ఆర్డర్ చేస్తే...సబ్బు బిల్లలు వచ్చాయి
-
ఆన్లైన్లో విజృంభిస్తున్న నకిలీ దందా!
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు, 4జీ వినియోగం పెరగడంతో ఆన్లైన్ అమ్మకాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్లో అమ్మేవాటిలో చాలా వరకు నకిలీ ఉత్పత్తులు ఉన్నట్టు వెల్లడయింది. సాధారణంగా పండుగ సమయంలో ఈ–కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్లతో హోరెత్తిస్తుంటాయి. రాయితీలు ఇచ్చి అమ్మే వస్తువుల్లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? అనే విషయమై ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన పరిశోధనలో విస్తపోయే వాస్తవాలు తెలిశాయి. చాలామంది తయారీదారులు, విక్రేతలు ఆన్లైన్లో నకిలీ సరుకులను అంటగడుతున్నట్టు తేలింది. ఐటీ చట్టంలోని లోపాలను వాడుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనట. అంతేకాక 40 శాతం దుస్తులు నకిలీ కంపెనీలవేనని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మీరట్లోని బ్రహ్మపురి ఏరియాలో పోలీసులు జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటిని ఫ్లిప్కార్ట్, షాప్క్లూస్, స్నాప్డీల్ వంటి ప్రముఖసైట్లలో విక్రయిస్తున్నారు. రూ.170–200 వరకు ధర ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450–500కు అమ్ముతున్నారు. ఏకంగా 50–60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. మనీలాండరింగ్కు, కొన్ని రకాల మోసాలకు కూడా కంపెనీలు ఆన్లైన్ను వాడుకుంటున్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. -
పల్లెలకు ఆన్లైన్ ‘లింక్’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ షాపింగ్.. ఈ రోజుల్లో ఎవ్వరికీ పరిచయం అక్కర్లేదు. కానీ, మెట్రో, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ–షాపింగ్ను పల్లెలకూ తీసుకెళ్తోంది లింక్ స్టోర్. ఆఫ్లైన్లో స్టోర్ను ఏర్పాటు చేసి ఆన్లైన్ షాపింగ్లో సహకరించడమే దీని ప్రత్యేకత. ఒక్క ఫ్యాషన్, అపెరల్స్ వంటి షాపింగ్కే పరిమితం కాకుండా... మందులు, ట్రావెల్ టికెట్లు కూడా బుకింగ్ చేసుకునే వీలుంటుందీ స్టోర్లో. సంస్థ ప్రారంభం, విస్తరణ గురించి లింక్ స్టోర్ ఫౌండర్ శ్రీరామ్ జూలూరు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశా. తరవాత అమెజాన్, ఉబర్ వంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. విధుల్లో భాగంగా తెలిసిందేంటంటే పేరుకే పెద్ద ఆన్లైన్ సంస్థలు గానీ.. గ్రామాలు, పల్లెల నుంచి ఆర్డర్లు తక్కువగా ఉంటున్నాయని! ఆయా ప్రాంతాలకు ఆన్లైన్ సేవలను విస్తరించాలనే యోచనలో భాగంగానే లింక్ స్టోర్కు బీజం పడింది. మిత్రులు అనిరుధ్ రాయపోలు, అరుణ్ తేజ బుక్కాపారపుతో కలసి... రూ.2 లక్షల పెట్టుబడితో కృష్ణా జిల్లాలోని తిరువూరులో జనవరి 2016లో లింక్స్టోర్ను ప్రారంభించాం. ఏపీ, తెలంగాణల్లో 450 స్టోర్లు.. షాపింగ్ కోసం అమెజాన్, మందుల కోసం నెట్మెడ్స్, ట్రావెల్ సేవల కోసం వయా.కామ్తో ఒప్పందం చేసుకున్నాం. 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో లింక్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 450 లింక్ స్టోర్లున్నాయి. ప్రతి స్టోర్కూ ఒప్పంద సంస్థల అనుమతి తప్పనిసరి. స్టోర్కు వచ్చిన కస్టమర్ అడిగిన ఉత్పత్తి, ధరలను బట్టి రకరకాల బ్రాండ్లు, ఆఫర్లు, గ్యారంటీ, ఇతరత్రా అంశాలను వివరిస్తాం. కస్టమర్ ఎంపికను బట్టి ఉత్పత్తులు ఇంటికి డెలివరీ అయ్యాక.. నగదు తీసుకుంటాం. డెలివరీ బాధ్యత ఒప్పంద సంస్థలదే. లింక్ స్టోర్లో రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కస్టమర్లకు ముందే ఆయా ఉత్పత్తుల గురించి వివరిస్తాం గనక. మా మొత్తం విక్రయాల్లో రిటర్న్స్ వాటా 1 శాతం కంటే తక్కువే. రూ.లక్షకే ఫ్రాంచైజీ; 100 చ.అ.ల్లో స్టోర్.. ఆన్లైన్ వ్యాపారంపై ఆసక్తి, ఇంటర్నెట్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.లక్ష ఖర్చవుతుంది. ఇందులో రూ.20 వేలు ఫీజు. మిగిలిన మొత్తాన్ని స్టోర్ డిజైనింగ్, కంప్యూటర్, టీవీ వంటి ఉపకరణాల కొనుగోలు కోసం వెచ్చిస్తాం. ప్రతి నెలా వచ్చిన మొత్తంలో 10% రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో స్టోర్ 100–150 చ.అ.ల్లో ఉంటుంది. ఒప్పంద సంస్థలు, లింక్ స్టోర్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ స్టోర్ను డిజైన్ చేస్తాం. ఒప్పంద సంస్థలకు లింక్స్టోర్ నుంచే ఆర్డరొచ్చిందని ఎలా తెలుస్తుందంటే.. ఫ్రాంచైజీ తాలూకు కంప్యూటర్, మొబైల్లో లింక్స్టోర్ ట్రాకింగ్ టూల్స్, ప్లగ్గిన్స్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తాం. ప్రతి స్టోర్కు ఒప్పంద సంస్థల ఐడీ ఉంటుంది. దీంతో ఏ స్టోర్ నుంచి ఆర్డరొచ్చిందో తెలిసిపోతుంది. నెలకు రూ.8 కోట్ల జీఎంవీ..: ప్రతి ఉత్పత్తి అమ్మకంపై ఒప్పంద సంస్థ నుంచి కమీషన్ తీసుకుంటాం. మొబైల్స్పై 3%, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 4%, ఫ్యాషన్ ఉత్పత్తులపై 15% వరకుంటుంది. ప్రస్తుతం లింక్ స్టోర్ల నుంచి రోజుకు 1,000 ఆర్డర్లొస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 3.5 లక్షల ఆర్డర్లను పూర్తి చేశాం. నెలకు మా ఒప్పంద సంస్థలకు రూ.8 కోట్ల గ్రాస్ మర్చండేస్ వ్యాల్యూ (జీఎంవీ) చేసి ఇస్తున్నాం. ఇందులో 95% జీఎంవీ ఒక్క అమెజాన్దే. కమీషన్ రూపంలో లింక్ స్టోర్ ఆదాయం నెలకు రూ.30 లక్షల వరకుంటుంది. ఒక్కో స్టోర్ ఫ్రాంచైజర్ నెలకు రూ.30–40 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మెట్రో, డీమార్ట్, వాల్మార్ట్లతో ఒప్పందం.. వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీ, తెలంగాణల్లో 1,000 లింక్ స్టోర్లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. వారం రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్, కేరళలో లింక్ స్టోర్లను ప్రారంభించనున్నాం. ఇప్పటికే 50 స్టోర్లను ఫ్రాంచైజీ తీసుకున్నారు. మరో 2 నెలల్లో తమిళనాడు, కర్ణాటకకు విస్తరించనున్నాం. త్వరలోనే లింక్ స్టోర్లలో ఫిజికల్గా గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించాం. ఇందుకోసం మెట్రో, డీమార్ట్, వాల్మార్ట్లతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో విజయవాడ కేంద్రంగా 15 స్టోర్లను ప్రారంభిస్తాం. బీమా, మనీ ట్రాన్స్ఫర్ విభాగాల్లోనూ సేవలందిస్తాం. 2018 ముగింపు నాటికి రూ.15 కోట్ల నిధులను సమీకరించాలని లకి‡్ష్యంచాం. -
‘అమెజాన్’ను ఆటాడించారు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అమెజాన్కు ఆర్డర్ ఇచ్చిన వస్తువులు చేతికందినా ఖాళీ బాక్స్లు, తెల్లపేపర్ వచ్చిందంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్కు ఈ–మెయిల్ ఫిర్యాదు చేసి కొత్త ప్రొడక్ట్ తీసుకోవడమేగాక వీటిని ఓలెక్స్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన వస్తువు ధ్వంసమైందంటూ డబ్బులు రీఫండ్ చేయించుకుంటున్నారు. ఇలా అమెజాన్కు దాదాపు రూ.12 లక్షలకుపైగా నష్టం కలిగించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిల కథనం ప్రకారం...సికింద్రాబాద్ సైనిక్పురికి చెందిన సిమ్సన్ గుణశేఖర్, జాన్ అరుల్ ప్రకాశ్ చిన్ననాటి స్నేహితులు. 2014 లో గుణశేఖర్ అమెజాన్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా చేరాడు. వస్తువులు రాలేదు, ధ్వంసమయ్యాయి, వస్తువుల స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చాయంటూ పంపిన మెయిల్స్ను చూసి డబ్బు తిరిగి చెల్లించడం, వస్తువులు తిరిగి పంపించడం చేసేవాడు. మోసపూరితంగా సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మంచి మార్గమని భావించిన గుణశేఖర్ అదే కంపెనీలో పనిచేస్తున్న జాన్ అరుల్ ప్రకాశ్కు పథకాన్ని వివరించాడు. దీంతో 2016 అక్టోబర్లో జాన్ అరుల్ జాన్ క్రిస్గా అమెజాన్.ఇన్లో నకిలీ యూజర్ ఐడీ సృష్టించి యాపిల్ ఐఫోన్ 5ఎస్కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ ప్రొడక్ట్ చేతికి అందిన తర్వాత పథకం ప్రకారం ‘ప్రొడక్ట్ మా చేతికి అందలేదు. దీంతో డబ్బులు తిరిగి చెల్లించాలం’టూ రిజిస్టర్ మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయడంతో అతడిచ్చిన బ్యాంక్ ఖాతాకు తిరిగి డబ్బులు చెల్లించారు. 2017 మేలో మరో కస్టమర్ అకౌంట్తో జాన్ అరుల్ లెనోవా ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ వస్తువు రాలేదంటూ తిరిగి పంపించాలంటూ మళ్లీ మెయిల్ పెట్టడంతో రెండోసారి కూడా ల్యాప్టాప్ చేతికి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న గుణేశేఖర్ తన సోదరుడి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ సెల్ఫోన్ చేతికందినా, దానిస్థానంలో తెల్ల పేపర్ వచ్చిదంటూ మళ్లీ సెల్ఫోన్ పంపాలంటూ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి అందుకున్నాడు. ఇలా గుణశేఖర్ ఐదు అర్డర్లు ఇచ్చి మూడు రీప్లేస్మెంట్, ఒక రీఫండ్ అమౌంట్, జాన్ అరుల్ పది ఆర్డర్లు ఇచ్చి ఎనిమిది రీప్లేస్మెంట్లు, ఒక రీఫండ్ అమౌంట్ పొందారు. ఈ ప్రొడక్ట్లను ఓలెక్స్ వెబ్సైట్లో 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. -
కొనుగోళ్ల వేటలో ఫ్లిప్కార్ట్
బెంగళూరు: తాజాగా పెద్ద ఎత్తున నిధులు సమీకరించిన ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్... తన కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. పోటీ సంస్థ అమెజాన్ను దీటుగా ఎదుర్కొనే క్రమంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం, ఇతరత్రా సంస్థల కొనుగోళ్లపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, సేవల సంస్థ అర్బన్ క్లాప్, ఫర్నిచర్ రిటైలింగ్ సంస్థ అర్బన్ ల్యాడర్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. వీటితో పాటు బీమా, వెల్త్ మేనేజ్మెంట్ రంగాల్లోని కొన్ని స్టార్టప్ సంస్థలనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ టికెటింగ్ సంస్థ బుక్మైషోలోనూ వాటాల కొనుగోలు కోసం ఫ్లిప్కార్ట్ చర్చలు జరుపుతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ డీల్ ప్రకారం బుక్మైషో విలువను దాదాపు 500–700 మిలియన్ డాలర్ల మేర లెక్కగడుతున్నట్లు సమాచారం. మారుతున్న వ్యూహం.. ఫ్లిప్కార్ట్ గతంలోనూ పెట్టుబడులు పెట్టడం, కంపెనీలను కొనుగోళ్ళు చేయడం వంటి లావాదేవీలు జరిపినప్పటికీ.. ప్రస్తుత వ్యూహం మారుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 2014–15 ప్రాంతంలో ఫ్లిప్కార్ట్.. వెంచర్ క్యాపిటల్ సంస్థ తరహాలో ఇన్వెస్ట్ చేసింది. ఆ రెండేళ్లలో ఫ్యాషన్ రిటైలర్ మింత్రా, ట్రక్కింగ్ మార్కెట్ప్లేస్ బ్లాక్ బక్, అడ్వరై్టజింగ్ టెక్నాలజీ స్టార్టప్ యాడ్ ఈక్విటీ వంటి దాదాపు పన్నెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమో, కంపెనీలను కొనుగోలు చేయడమో జరిపింది. అయితే, ఈ లావాదేవీలన్నీ కూడా నేరుగా ఫ్లిప్కార్ట్ వ్యాపారాన్ని పెంచేవి కాకుండా.. కేవలం ఆర్థికపరమైన పెట్టుబడులుగానే జరిగాయి. కానీ ప్రస్తుతం నేరుగా తమ వ్యాపారానికే దోహదపడేటువంటి భారీ, వ్యూహాత్మక డీల్స్పై మాత్రమే ఫ్లిప్కార్ట్ దృష్టి సారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం సంస్థ భారీగానే వెచ్చించదల్చుకుంది. ఇటీవల సెప్టెంబర్లో కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన ఫైలింగ్స్ ప్రకారం.. కొనుగోళ్లు, గణనీయమైన పెట్టుబడుల కోసం కేటాయింపులను సుమారు రూ.8,000 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. గతంలో ఇది రూ. 3,000 కోట్లకే పరిమితమైంది. ఫ్లిప్కార్ట్ కొత్త వ్యూహం చూడబోతే... గడిచిన దశాబ్దకాలంగా భారీ చైనా ఇంటర్నెట్ కంపెనీలు అనుసరించిన విధానాల్లాగానే కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. చిన్న స్థాయి పోటీ సంస్థలను కొనేయడం, భారీ ఇంటర్నెట్ స్టార్టప్స్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయడంలాంటివి ఇలాంటి వ్యూహాలే. ఫ్లిప్కార్ట్ ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారిస్తోంది. పరిమాణంపరంగా దిగ్గజ స్థాయికి ఎదగడం ద్వారా పుష్కలంగా నిధులున్న అమెజాన్ వంటి దిగ్గజాల నుంచి పోటీ తీవ్రమైనా.. తట్టుకుని నిలబడగలిగేలా పటిష్టం కావడం ఒక వ్యూహం. కాగా, అదే సమయంలో మార్కెట్లో పెనుమార్పులు చోటుచేసుకున్నా ప్రధాన వ్యాపారం దెబ్బ తినకుండా కాపాడుకోవడం మరో వ్యూహంగా తెలుస్తోంది. 4 బిలియన్ డాలర్ల నిధులు.. 2007లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఫ్లిప్కార్ట్ 20 పైగా కంపెనీలను కొనుగోలు చేయడమో లేదా ఇన్వెస్ట్ చేయడమో జరిగింది. 2014 ఏకంగా 330 మిలియన్ డాలర్లు పెట్టి మింత్రాను కొనుగోలు చేయడం అతి పెద్ద డీల్. ఈ ఏడాది తొలినాళ్లలో మరో పోటీ సంస్థ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్నాప్డీల్ను కూడా సుమారు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు యత్నించింది. అయితే, వేల్యుయేషన్స్, డీల్ స్వరూపంపై విభేదాలతో ఇది కుదరలేదు. 15 బిలియన్ డాలర్ల దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో అమెరికన్ దిగ్గజం అమెజాన్కి దీటైన పోటీ ఇచ్చేలా ఫ్లిప్కార్ట్ కొన్నాళ్ల క్రితమే 3 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించింది. సాఫ్ట్బ్యాంక్ గ్రూప్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఈబే, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైనవి ఇన్వెస్ట్ చేశాయి. తమ దగ్గర దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలున్నట్లు ఫ్లిప్కార్ట్ ఆగస్టులో వెల్లడించింది. అయితే, మార్కెట్ మందగమనం నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఫ్లిప్కార్ట్ ఇతరత్రా డీల్స్పై దృష్టి సారించాల్సి ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫ్లిప్కార్ట్కి చెందిన పేమెంట్స్ యాప్ ఫోన్పే.. మరో పోటీ సంస్థ పేటీఎం, అమెజాన్ పేతో పోటీపడుతోంది. ఫ్లిప్కార్ట్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ అటు పేటీఎంలో కూడా ఇన్వెస్టర్ కావడం గమనార్హం. -
పేలిన ‘రెడ్మీ నోట్-4’
కర్ణాటకలో ఘటన మండ్య (కర్ణాటక): ఎంతో ముచ్చటపడి కొన్న స్మార్ట్ఫోన్ ఆ యువకుడికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అప్పుడే ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఇంటికి వచ్చిన మొబైల్ ఫోన్ ఆన్ కాకపోవడంతో దానిని సంబంధిత షోరూంకి తీసుకెళ్లాడు. టెక్నీషియన్ దానిని ఆన్చేస్తుండగా ఫోన్లోంచి పొగలు రావడంతో ఫోన్ను బయటకి విసిరేయడంతో అది పేలింది. ఈ సంఘటన మండ్య నగరంలో ఆర్పీ రోడ్డులోని మొబైల్ షోరూంలో శనివారం జరిగింది. ఒక యువకుడు రెడ్మీ నోట్ 4 మొబైల్ను ఆన్లైన్లో కొనుగోలుచేశాడు. శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న కొరియర్లోంచి మొబైల్ను బయటకుతీసి ఆన్చేయగా అది ఆన్కాలేదు. దీంతో యువకుడు ఆ ఫోన్ సర్వీసింగ్ చేసే షోరూం వద్దకు తీసుకెళ్లి ఆన్చేసి ఇవ్వాలని కోరగా, సిబ్బంది దానిని ఆన్చేస్తుండగా ఫోన్లోంచి పొగలొచ్చాయి. దీంతో దుకాణంలో ఉన్నవారు కంగారుపడి మొబైల్ను బయటకి విసరడంతో అది పెద్దగా శబ్దంచేస్తూ పేలింది. స్క్రీన్ వైపు బాగానే ఉన్నా వెనుక వైపు మొత్తం కాలిపోయినట్లయింది. -
ఫోన్ ఆర్డర్ చేస్తే.. బట్టల సబ్బులొచ్చాయి..!
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ వెబ్సైట్ నుంచి బ్రాండెడ్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ ఉద్యోగి పార్సిల్ తెరచి చూసి అవాక్కయ్యారు. వేల రూపాయలు పోసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. డిటర్జెంట్ సబ్బులు పార్శిల్లో వచ్చాయని సోషల్మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. దేశ రాజధానిలో ఉద్యోగం చేసే చిరాగ్ ధావన్ కొద్ది రోజుల క్రితం అమెజాన్ వెబ్సైట్ నుంచి ఓ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేశారు. సోమవారం పార్శిల్ ఆఫీస్కు వచ్చినా.. దాన్ని ఓపెన్ చేయకుండా అలానే ఉంచి ఇంటికి వచ్చిన తర్వాత తెరచి చూశారు. బాక్సులో బట్టల సోప్స్ ఉండటంతో నివ్వెరపోయిన ఆయన ఫేస్బుక్లో జరిగిన ఉదంతాన్ని షేర్ చేశారు. ధావన్ పోస్టుకు భారీ స్పందన వచ్చింది. వేలాది మంది ఆ పోస్టును లైక్ చేయడంతో పాటు షేర్ చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన అమెజాన్ తన ఆర్డర్ను రీ ప్లేస్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ధావన్ బుధవారం తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. -
లెనొవొ నుంచి కే8 నోట్
ధర రూ. 12,999– రూ. 13,999 న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనొవొ తాజాగా తమ కొత్త స్మార్ట్ఫోన్ కే8 నోట్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 12,999 నుంచి రూ.13,999 దాకా ఉంటుందని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్డాట్ఇన్లో ఆగస్టు 18 నుంచి ఇది అందుబాటులో ఉంటుందని లెనొవొ ఇండియా ఎంబీజీ కంట్రీ హెడ్ సుధిన్ మాథుర్ తెలిపారు. మిగతా దేశాలన్నింటికన్నా ముందుగా భారత్లోనే ఈ ఫోన్ను ఆవిష్కరించినట్లు ఆయన వివరించారు. కె సిరీస్ స్మార్ట్ఫోన్లు భారత్లో ఇప్పటిదాకా 85 లక్షల పైచిలుకు విక్రయించినట్లు మాథుర్ వివరించారు. కె8 నోట్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ మెమరీ వెర్షన్ రేటు రూ. 12,999గాను, 4జీబీ ర్యామ్.. 64 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 13,999గాను ఉంటుంది. 5.5 అంగుళాల డిస్ప్లే, 2.3 గిగాహెట్జ్ 10 కోర్ ప్రాసెసర్, 13 ఎంపీ+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఈ ఫోన్లో ప్రత్యేకతలు. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
వర్చువల్ క్రెడిట్ కార్డుతో ఉపయోగం ఎంత? టెక్నాలజీ వల్ల ప్రజల జీవనం సులభతరం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు సరళతరమయ్యాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ సమయంలో మోసాలను ఎదుర్కోవడానికి వర్చువల్ క్రెడిట్ కార్డులు బాగా దోహదపడతాయి. ఆన్లైన్ పేమెంట్ వర్చువల్ క్రెడిట్ కార్డు అనేది ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ పేమెంట్ సొల్యూషన్. వీటిని ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్లో షాపింగ్ చేసేటప్పుడు భద్రత గురించి భయపడాల్సిన పనిలేదు. లావాదేవీలు పూర్తి సురక్షితం. కార్డు కంపెనీలు ప్రైమరీ క్రెడిట్ కార్డుకు యాడ్ ఆన్ కార్డును జారీ చేస్తాయి. వర్చువల్ కార్డు కూడా ఒకరకంగా అలాంటిదే. వర్చువల్ క్రెడిట్ కార్డును కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించగలం. ఇది కొంత మొత్తంతో ప్రిలోడెడ్గా వస్తుంది. వర్చువల్ కార్డుకు నిర్దిష్ట కాలమంటూ ఉంటుంది. తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. దీన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల మాదిరి చేతితో పట్టుకోలేం. అంటే ఫిజికల్ రూపంలో ఉండదు. కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉపయోగించడానికి వీలుగా వీటిని జారీచేస్తారు. సైబర్ మోసాలపై భయంలేదు.. కార్డు కంపెనీలు ప్రధాన క్రెడిట్ కార్డు ఆధారంగా వర్చువల్ కార్డును జారీ చేస్తాయి. దీనికి కార్డు నెంబర్, సీవీవీ, ఎక్స్పైరీ నెంబర్ వంటివి ఉంటాయి. వీటి ఆధారంగా ఆన్లైన్లో లావాదేవీ నిర్వహిస్తాం. లావాదేవీ నిర్వహించేటప్పుడు మన ప్రైమరీ కార్డు వివరాలను ఉపయోగించం కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. సైబర్ మోసాల గురించి భయపడాల్సిన పనిలేదు. అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లకు వర్చువల్ కార్డుల వినియోగం ఉత్తమమైన మార్గం. ఆఫర్ చేస్తున్న బ్యాంక్లు ఇవీ... ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పలు సంస్థలు వర్చువల్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. డెబిట్ కార్డుకు వర్చువల్ కార్డును తీసుకోవచ్చు. వర్చువల్ కార్డు మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించుకోకపోతే.. మిగిలిన అమౌంట్ ప్రైమరీ కార్డుకు వచ్చి చేరుతుంది. ఒకవేళ లావాదేవీ ఫెయిల్ అయితే అప్పుడు పూర్తి మొత్తం మళ్లీ రిఫండ్ వస్తుంది. -
ఆన్ లైన్ షాపింగ్ తో హ్యాపీగా లేరా? అయితే....
ముంబై : ఏ షాపుకి వెళ్లాల్సినవసరం లేకుండానే, ఇంట్లోంచే వస్తువులను కొనుకునే విధంగా ఆన్ లైన్ షాపింగ్ వచ్చి మన నట్టింట్లో వాలింది. ఒక్క సర్వీసులే కాదు, బంపర్ డిస్కౌంట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఇటీవల ఆన్ లైన్ షాపింగ్ లో భారీ ఎత్తున్న మోసాలు పెరిగిపోతున్నాయి. ఫోన్ కొంటే రాళ్లు రావడం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై కన్జ్యూమర్ కోర్టుకెళ్లినా.. నష్టపరిహారం చేతికొచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఆన్ లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్(ఓసీఎంసీ) ఏర్పాటైంది. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వద్ద కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టిస్ దీన్ని ఏర్పాటుచేసింది. పైలెట్ ఫేస్ కింద ఈ సెంటర్ ఈ-కామర్స్ సెక్టార్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తోంది. ఈ-కామర్స్ సెంటర్లో తలెత్తే ప్రతి ఫిర్యాదును ఇది పర్యవేక్షిస్తోంది. కన్జ్యూమర్ కోర్టులలో కేసుల గుట్టను తగ్గించి, వినియోగదారుల, వ్యాపారాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు ఈ సెంటర్ కు అంకురార్పణ జరిగినట్టు తెలిసింది. ఈ రూ.1కోట్ల ప్రాజెక్టుకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫండ్స్ కల్పిస్తోంది. దీనికి కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టిస్ చైర్ ప్రొఫెసర్ అశోక్ ఆర్ పాటిల్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. 2016 డిసెంబర్ లో దీన్ని ప్రారంభించారు. రిపోర్టు ప్రకారం 74.9 శాతం వినియోగదారులకు అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 ఉన్నట్టే తెలియదని, 78 శాతం రెస్పాడెంట్లు సమస్యల పరిష్కారం చాలా కష్టంగా ఉందని భావిస్తున్నట్టు వెల్లడైందని పాటిల్ తెలిపారు. అడ్వకేట్లు, పార్టీల కోరిక మేరకు వినియోగదారుల వివాద పరిష్కార ఫోరమ్ లు తీర్పులను వాయిదా వేస్తూ ఉంటాయని పాటిల్ చెప్పారు. వినియోగదారుల వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ఈ-కామర్స్ సంస్థలకు వ్యతిరేకంగా రెండేళ్ల పైలెట్ ప్రొగ్రామ్ ను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇది ఏ సమయంలోనైనా, ఎక్కడి సమస్యనైనా వెనువెంటనే పరిష్కరిస్తుందని తెలిపారు. తమ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ త్వరగా సెటిల్ మెంట్ కుదర్చడంతో పాటు ఇరు పక్షాలకు అనుకూలంగా వ్యవహరించేలా చూస్తుందని పాటిల్ చెప్పారు. వినియోగదారుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సెటిల్ మెంట్ కుదర్చడం కొంత కష్టంతో కూడుకుంటుందని, వారు ఈ-కామర్స్ కంపెనీల నుంచి నష్టపరిహారాలను ఆశిస్తుంటారని పేర్కొన్నారు. వాలంటరీగా కేసులను టేకప్ చేసి, వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని పాటిల్ చెప్పారు.. -
అమెజాన్ గోడౌన్లో భారీ చోరీ
కొత్తూరు(శంషాబాద్): ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ గోడౌన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న అమెజాన్ కంపెనీ గౌడౌన్లో 36 ల్యాప్ టాప్లు సహా మరొకొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయని నిర్వాహకులు గుర్తించారు. యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆన్లైన్ షాపింగ్లో వారిదే హవా!
బెంగళూరు: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో ఆడవారి కంటే మగవారి శాతమే ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ అధికారికంగా వెల్లడించింది. 2016 ఏడాదికిగానూ జరిగిన ఆన్లైన్ అమ్మకాలలో పురుషుల వాటా 60 శాతం ఉండగా, మహిళల వాటా 40 శాతంగా ఉంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 15తేదీ వరకు పది కోట్ల మంది జరిపిన ఆన్లైన్ కొనుగోళ్ల ప్రకారం ఈ వివరాలను ఫ్లిప్కార్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫెవరెట్ బ్రాండ్స్ గా శాంసంగ్, లెనోవో, శాన్డిస్క్, రెడ్ మి నిలిచాయి. 80 శాతం యూజర్లు కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఐటమ్స్ ఆర్డర్ చేశారని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా 25 నుంచి 34 ఏళ్ల వయసు వారు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే కేటగిరిలో ఉన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు కూడా 15శాతం కొనుగోళ్లలో భాగస్వాములుగా ఉండటం కలిసొచ్చే అంశమని సంస్థ అధికారులు చెప్పారు. మగవారు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, పర్సనల్ ఆడియో, ఫుట్వెర్, లైఫ్ స్టైల్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేశారు. టైర్ 2, టైర్ 3 నగరాలలో ఆన్ లైన్ విక్రయాలు భారీగా ఊపందుకున్నాయి. -
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధాని ఢిల్లీయే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ... ఆన్లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధానిగా వర్ధిల్లుతోంది. తమ ఈ కామర్స్ ప్లాట్ఫామ్పై షాపింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) నుంచే ఉంటున్నారని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఆ తర్వాత బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నట్టు ‘ఫ్లిప్ట్రెండ్స్ 2016’ నివేదిక రూపంలో తెలిపింది. వెల్లూర్, తిరుపతి, బళ్లారి, జోర్హట్, కొట్టాయమ్ ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్యా పరంగా టైర్–3 పట్టణాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2016లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వారిలో 60 శాతం మంది పురుషులేనట. ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్సనల్ ఆడియో, పాదరక్షలు, లైఫ్స్టయిల్ ఉత్పత్తులను వీరు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇక 2016లో ఎలక్ట్రానిక్ యాక్ససరీలు, మొబైల్స్, మహిళల వస్త్రాలు, పురుషుల పాదరక్షలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎక్కువ శాతం అమ్మకాలు జరిగాయి. 50 శాతం లావాదేవీలు ఖరీదైన ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్కు సంబంధించినవేనని... నోకాస్ట్ ఈఎంఐ, పాత వస్తువులతో మార్పిడి ఇందుకు వీలు కల్పించాయని ఫ్లిప్కార్ట్ వివరించింది. విద్యుత్ను ఆదా చేసే బల్బ్లు, వాల్ స్టిక్కర్లు, సెల్ఫీ స్టిక్స్, ప్రింటర్ఇంక్, స్లిమ్మింగ్ బెల్ట్లు, కండోమ్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, మస్సాజర్, బీపీ మెషిన్లు, హుక్కా మెషిన్లు, హుక్కా ఫ్లావర్ల అమ్మకాలు కూడా జరిగాయని తెలిపింది. -
అనంతలో సైబర్ నేరం...కేసు నమోదు
అనంతపురం : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతుంటే అనంతపురంలో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...పట్టణానికి చెందిన ఇషాక్ బాషా అనే వ్యక్తి ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కార్డు నుంచి అతనికి తెలియకుండా రూ.66 వేల ఆన్లైన్ షాపింగ్ జరిగింది. దీనిపై బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆన్లైన్ మోసాలపై తమకు అవగాహన లేదన్నట్టుగా బ్యాంక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆన్లైన్ షాపింగ్.. ఐఏఎస్ భార్యకు నోటీసులు
భోపాల్: ఆన్లైన్లో అతిగా షాపింగ్ చేసిన ఓ ఐఏఎస్ అధికారి భార్యకు మధ్యప్రదేశ్ ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు. స్వల్ప వ్యవధిలోనే సుమారు రూ. 10 లక్షల విలువచేసే అన్లైన్ షాపింగ్ చేసినందుకుగాను ఆమె నోటీసులు అందుకున్నారు. ఐఏఎస్ అధికారి సన్నిహితులు మాత్రం 'ఆమె కంపల్సీవ్ బయ్యింగ్ డిసార్డర్తో బాధపడుతున్నారని, ఇలాంటి డిసార్డర్ ఉన్నవారు షాపింగ్ విషయంలో తమను తాము నియంత్రించుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తుంటారు' అని చెబుతున్నారు. కొనుగోలుదారుల ఆన్లైన్ షాపింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందేలా ఆదాయపన్ను శాఖవారు ఓ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా ఆమె జరిపిన ఆన్లైన్ షాపింగ్ వివరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయపన్నును విడిగా దాఖలు చేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి భార్య ఇప్పటివరకు నోటీసులపై స్పందింలేదని తెలిపారు. -
ఆన్లైన్ క్లిక్ రూ.25,000 కోట్లు..
♦ పండుగల సీజన్లో అమ్మకాల హవా ♦ గతేడాది కంటే 25% అధికం ♦ డిస్కౌంట్లతో కంపెనీల రె‘ఢీ’ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షరాలా 25,000 కోట్లు.. ఈ పండగల సీజన్లో భారతీయ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్కు ఖర్చు చేయబోయే మొత్తమిది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరగబోతోందంటే ఈ-కామర్స్ కంపెనీలు ఏ స్థాయిలో డిస్కౌంట్లు, ఆఫర్లతో రెడీగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బహుశా! ఈ సీజన్ కంపెనీలకు అధిక లావాదేవీల సీజన్గా నిలుస్తుందని అసోచామ్ అంచనా వేస్తోంది. 2015 పండగల సీజన్లో భారతీయ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్కు రూ.20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత సీజన్లో 25 శాతం వృద్ధి ఉంటుందని అసోచాం సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఈ సందర్భంగా తెలిపారు. 25-40 ఏళ్ల మధ్య ఉన్న 2,500 మంది వృత్తి నిపుణులపై అసోచాం సర్వే నిర్వహించింది. 60 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేయనున్నట్టు వెల్లడించారు. దుకాణాల ముందుండే క్యూ లైన్లను తప్పించుకోవడానికే ఆన్లైన్ను ఎంచుకోనున్నట్టు వారు చెప్పారు. కీలకం కానున్న డిస్కౌంట్లు..: లాభదాయక డీల్స్, డిస్కౌంట్లుండే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపినట్టు అసోచాం తన సర్వేలో వెల్లడించింది. దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు మొదలు మొబైల్స్, ల్యాప్ట్యాప్స్, టెలివిజన్లపై ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా కంపెనీలు ఈసారి పొరపాట్లు జరగకుండా చూడాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. సర్వేలో వాహన, బయోటెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా సేవలు, ఐటీ, మీడియా, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందినవారు పాల్గొన్నారు. హైదరాబాద్సహా 10 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. -
ఆన్లైన్ షాపింగ్కి ఓ అడ్డా!
పరిపరిశోధన ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక దేశంలో ఆన్లైన్ షాపింగ్ విస్తృతం అవుతోంది. అనేక వెబ్సైట్లు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్కుఏ సైట్ ఉత్తమమైనది? అంటే... ఎందులో మంచి ఆఫర్లు ఉంటే అది బెస్ట్ అని చెప్పవచ్చు.ఆన్లైన్ షాపింగ్కు అవకాశం ఇస్తున్న వెబ్సైట్లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని. మరి అన్నింటినీ తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, ఆ సైట్లను క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ను వెదుక్కొవడం కొంచెం కష్టమైన పనే! ఆన్లైన్ షాపింగ్కు అవకాశం ఇచ్చే అన్ని వెబ్సైట్లను గుర్తు పెట్టుకోవడమూ కొంచెం కష్టమైన పనే. ఆడవాళ్లకి ఈ కష్టం లేకుండా చేయడానికే ఉంది క్లిప్డాట్ఇన్ (జుజీఞ.జీ). ఆన్లైన్షాపింగ్కు సంబంధించి అన్ని వెబ్సైట్లనూ ఒకచోటికి కూర్చిపెట్టింది ఈ సైట్. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు అన్ని ఇ-కామర్స్ వెబ్సైట్లను ఇది ఒకచోటికి చేర్చింది. వాటన్నింటినీ హోమ్పేజ్లో డిస్ప్లే చేసింది. ఈ సైట్లోకి లాగిన్ అయితే చాలు... ఎంచక్కా వాటన్నింటిపైనా ఒక లుక్ వేయవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేసేయవచ్చు. దీనివల్ల చాలా సౌకర్యం ఉంటుంది. ఒక వెబ్సైట్నుంచి టక్కున మరో వెబ్సైట్లోకి మారడానికి... పక్కపక్క విండోల్లో ఒక్కోసైట్ను ఓపెన్ చేసుకొని పోల్చిచూసుకోవడానికి క్లిప్డాట్ఇన్ అవకాశం ఇస్తుంది. అలాగే కావాల్సిన క్యాటగిరీ సైట్లను ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వస్త్రాలు, గృహావసరాలకు తగినట్టుగా సైట్లను ఎంచుకోవచ్చు. ఆన్లైన్షాపింగ్లో కొత్త అనుభవాన్ని పొందాలంటే ఒకసారి క్లిప్డాట్ఇన్ను క్లిక్ చేసేయండి మరి! -
ఇదో రకం దొంగతనం..
ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకై వస్తువులను బుక్ చేసి మోసపోయే వారు కొందరైతే ఆ కంపెనీ ఉద్యోగులను ఆర్డర్ పేరుతో ఇంటికి రప్పించి వారి వద్ద ఉన్న బ్యాగ్ను కాజేస్తున్న ఓ కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, డీఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కొడుకు సురేష్ (26) కొద్ది రోజులుగా వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఇతను మొదట ఆన్లైన్లో వస్తువులను తప్పుడు చిరునామాతో బుక్ చేసేవాడు. వారు ఆర్డర్ తీసుకుని వచ్చాక తాను ఇంటిపైన ఉన్నానని పార్శిల్ తీసుకుని రావాలని ఉద్యోగికి చెప్పేవాడు. ఇతని మాయమాటలు నమ్మిన ఉద్యోగులు వారి బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్లేవారు. ఈ లోగా కిందనే ఉన్న సురేష్ కంపెనీ ఉద్యోగి బ్యాగ్ను ఎత్తుకుపోయేవాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్కాలనీలో నాప్టాల్, షాపింగ్జోన్ అనే ఆన్లైన్ సంస్థల ఉద్యోగులను బ్యాగ్లను ఎత్తుకుపోయాడు. ఆ ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు సురేష్ నుంచి రూ.2 లక్షల 20వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!
• ఆన్లైన్ సంస్థల రాయితీలు, కూపన్ల వివరాలందిస్తున్న బక్కర్ • బక్కర్తో ఈ-కామర్స్లకు నెలకు రూ.75 లక్షల వ్యాపారం • నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరణ కూడా • 3 నెలల్లో రూ.6 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో కో-ఫౌండర్ వెన్నెల మిర్యాల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వీకెండ్స్లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్కు చేరుకోవడానికో క్యాబ్ కావాలి! రిటర్న్లో రెస్టారెంట్లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్లైన్లో షాపింగూ చేసేయాలి!! ...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్లైన్లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు దొరుకుతాయ్. కానీ, ఒక్కో దానికోసం బోలెడంత సమయం వృథా. అసలు రాయితీలందించే యాప్లన్నీ ఒకే వేదికగా ఉంటే!! ఆ కిక్కే వేరు కదూ...! ఇదిగో అచ్చం ఇలాంటి యాపే ‘‘బక్కర్’’. ఈ యాప్ విశేషాలు, సేవల గురించి వెన్నెల మిర్యాల ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నేను, రవనీత్ సింగ్, నిఖార్ అగర్వాల్ ముగ్గురం ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్. బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ అంశాన్ని ఎంచుకోవాలనే విషయంపై బాగా ఆలోచించాం. ఆ సమయంలో మాకెదురైన అనుభవాన్నే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అదే బక్కర్ యాప్గా మారింది. అదెలాగంటే.. మీం వీకెండ్స్లో ఫుడ్యాప్ల ద్వారా రాయితీలపై ఆహారాన్ని తెప్పించుకొని తినేవాళ్లం. అయితే తక్కువ ధరకు, నాణ్యమైన ఫుడ్ ఏ సంస్థ ఆఫర్ చేస్తుందోనని తెలుసుకునేందుకు ఆన్లైన్లో గంటల కొద్దీ వెతికేవాళ్లం. ఆ సమయంలో మేం గ్రహించిందేంటంటే.. ఆన్లైన్లో రాయితీలను వెతికేందుకు ఎంత సమయం వృథా అవుతుందోనని! ‘‘ప్రతీ సంస్థకూ ఓ యాప్ ఉంటుంది.. రాయితీలూ ఉంటాయ్’’ కానీ, అవన్నీ ఒకే వేదికగా అందుబాటులో లేవని కూడా తెలిసింది. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకొని రూ.2 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా గతేడాది డిసెంబర్లో క్రూగ్జియో ల్యాబ్స్ ప్రై.లి. పేరిట సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాపే ‘బక్కర్’! వినియోగదారులకు లాభపడేలా.. కంపెనీలకు తగిన మార్కెట్ చూపించేలా వివిధ సంస్థల యాప్లు, వాటికి ప్రత్యామ్నాయాలు, రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లనూ అందించే సంస్థలు.. ఇలా అన్నింటికీ ఒకే వేదికగా పొందే వీలు కల్పించడమే బక్కర్ పని. 4 విభాగాలు.. 22 సంస్థలు.. బక్కర్ యాప్లో లాగినయ్యాక.. కావాల్సిన సేవలను ఎంచుకోవాలి. వెంటనే ఆయా సేవలందిస్తున్న సంస్థలు, ధరలు, రాయితీల వివరాలొస్తాయి. నేరుగా అక్కడి నుంచే వాటిని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాబ్స్, ఈ-కామర్స్, విమానాలు, కూపన్లు... నాలుగు విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఫుడ్పాండా, స్విగ్గీస్, సాసోస్, ఓలా, ఉబర్, పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, గ్రాబ్ఆన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి 22 సంస్థలు మాతో భాగస్వామ్యమయ్యాయి. నెలకు 50 వేల మంది బక్కర్ను వినియోగించుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో 5 లక్షల యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా యాప్ నుంచి జరిగే ప్రతి కొనుగోలు మీద 7-10 శాతం కమీషన్ కింద ఆయా సంస్థలు చెల్లిస్తాయి. నెలకు రూ.75 లక్షల జీఎంవీ.. ప్రస్తుతం నెలకు రూ.9-10 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. బక్కర్ ద్వారా మా భాగస్వామ్య సంస్థలకు నెలకు రూ.75-80 లక్షల వ్యాపారం (జీఎంవీ) జరుగుతుంది. ఆగస్టులో రెండింతల వృద్ధిని చేరుకోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరించనున్నాం. 6 నెలల్లో హోటల్స్, ట్రావెల్ (బస్సు, రైళ్లు) విభాగాలకు విస్తరించాలనేది లక్ష్యం. రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి.. ‘‘సీడ్రౌండ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో కోటి రూపాయల నిధులను సమీకరించాం. 50కే వెంచర్స్, సింగపూర్, సిలికాన్వ్యాలీకి చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. బెంగళూరు, ముంబైకి చెందిన పలువురు వీసీ)సంస్థలతో మాట్లాడుతున్నాం. మరో 3 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం’’ అని వెన్నెల వివరించారు. -
ఆన్లైన్కూ ఆదా మార్గాలు!
♦ సెర్చ్ నుంచి చెల్లింపు వరకూ అంతా పొదుపు మంత్రం ♦ కూపన్లు, వ్యాలెట్లతోనూ డిస్కౌంట్ల వర్షం ♦ సందర్భాన్ని బట్టి కూడా తగ్గింపు ధరలు ♦ కొనే ముందు కాస్తంత రీసెర్చ్ చేస్తే చాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : ఆన్లైన్ షాపింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకేనేమో!! కంపెనీలు సైతం ఇపుడు డిస్కౌంట్లు తగ్గించేస్తున్నాయి. దేశంలోని వినియోగదారులంతా ఇంటర్నెట్ షాపింగ్కు అలవాటుపడ్డారని, ఇపుడు వారు ఉత్పత్తుల్లో నాణ్యత, కొనుగోళ్లలో సౌఖ్యం మాత్రమే చూస్తున్నారని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలు చెబుతున్నాయి. అందుకే తాము డిస్కౌంట్లు తగ్గిస్తున్నా అమ్మకాలు మాత్రం తగ్గటం లేదని అవి చెబుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ జోరందుకోవటంతో ఇపుడు అరచేతిలోనే షాపింగ్ జరిగిపోతోంది. సరే!! అవసరం ఉన్నా, లేకున్నా కనిపించింది కొనేయటం చాలామందే చేస్తున్నారు. మరి కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కాస్త ఆదా చేసుకునే పద్ధతులేంటి? అవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... తక్కువ ధర ఎక్కడుంది? ఉదాహరణకు స్టోర్లకు వెళ్లేవారు జీన్స్ ప్యాంట్ కొనాలనుకుంటే ఎక్కడ తక్కువ ధరకు మంచి ఉత్పత్తులు దొరుకుతాయో కనుక్కుంటారు. షాపులోనూ వీలైతే బేరమాడతారు. ఆన్లైన్కు వచ్చేసరికి ఇవన్నీ మరిచిపోతారు. అలాం టివారు ఆన్లైన్లోనూ అదే చేస్తే బెటర్!. ఎలాగంటే... ఉదాహరణకు క్రోమ్ బ్రౌజర్లో ఈ కామర్స్ సైట్లో జీన్స్ ప్యాంట్ చూస్తున్నారు. ధర రూ.1999. సరిగ్గా అదే కంపెనీ అదే మోడల్ జీన్స్ ప్యాంట్ తక్కువధరకు ఏ సైట్లో విక్రయిస్తోందో ‘బైహట్కే.కామ్’ క్షణాల్లో చెప్పేస్తుంది. క్రోమ్ ఎక్స్టెన్షన్గా బైహట్కే అందించే ప్లగ్ ఇన్ను ఇన్స్టాల్ చేసుకుంటే సరి. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే నోటిఫికేషన్ రూపంలో తక్కువ ధర ఎక్కడున్నదీ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. జంగ్లీ డాట్ కామ్, మైస్మార్ట్ ప్రైస్ డాట్ కామ్, షాప్ మానియా డాట్ కామ్, ప్రైస్ బాబా వంటి పోర్టళ్లు సైతం ఒక ఉత్పత్తి ఎక్కడెక్కడ ఎంత ధరలో ఉన్నదీ తెలియజేస్తున్నాయి. డిస్కౌంట్ కూపన్లు వెతకండి... ఆన్లైన్లో కొనుగోలు మొత్తం పూర్తయి... బిల్లు చెల్లించేటపుడు మీ దగ్గర కూపన్లేమైనా ఉంటే వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కొంటున్న సైట్లకు సంబంధించి కూపన్లేమైనా లభిస్తున్నాయేమో ముందే చూడాలి. కొనుగోళ్లను ప్రోత్సహించడానికి, తక్కువ సమయంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకునేందుకు ఈ కామర్స్ సైట్లు పోటా పోటీగా ఆఫర్లు ఇస్తుంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈబే సంస్థ 365 రోజులూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటుంది. ఒకవేళ ఎలాంటి కూపన్లు కనిపించకుంటే... ప్రత్యేకంగా డిస్కౌంట్ కూపన్లను అందించే కూపన్ దునియా వంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. గూగుల్లో కాస్త శోధిస్తే మంచి కూపన్ పట్టుకోవడం ఏమంత కష్టం కాదు. పండుగల బొనాంజా పండగ రోజుల్లో కొనడం కూడా ఆదా చేసుకునే మార్గాల్లో ఒకటి. ఆఫ్లైన్ సంస్థల మాదిరిగానే దసరా, దీపావళి, నూతన సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం, వాలంటైన్స్ డే, గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ తదితర రోజుల్లో ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి. ధర తగ్గినప్పుడే కొంటారా..? మనం కొంటున్నపుడు గనక ఒక వస్తువు ధర ఎక్కువుందని మనం భావిస్తే... దాన్ని తగ్గాకే కొనొచ్చు. ఉదాహరణకు రమేష్కు శామ్సంగ్ అల్ట్రా యూహెచ్డీ టీవీ కొనాలని కోరిక. అన్నింటి కంటే ఫ్లిప్కార్ట్లో తక్కువగా రూ.80,999 ఉంది. కానీ రమేష్ బడ్జెట్ 70 వేలే. అప్పుడు రమేష్ ఏం చేశాడంటే... చీపాస్ డాట్ ఇన్ సైట్కు వెళ్లి ఫ్లిప్కార్ట్ సైట్లోని ఉత్పత్తికి సంబంధించిన పేజీ యూఆర్ఎల్ను పేస్ట్ చేశాడు. ప్రైస్ అలర్ట్ పెట్టుకున్నాడు. నెల రోజుల తర్వాత పండుగ ఆఫర్లో భాగంగా అదే టీవీ ధరను ఫ్లిప్కార్ట్ రూ.66 వేలకు అందిస్తోందంటూ రమేష్కు చీపాస్ నుంచి మెయిల్ వచ్చింది. మనం కూడా ఇలా చేయొచ్చు కదా! అలాగే, జంగ్లీ, మైస్మార్ట్ ప్రైస్ వంటి సైట్లలోనూ కొనాలనుకుంటున్న ఉత్పత్తిని ఎంపిక చేసుకుని ‘ప్రైస్ అలర్ట్’ సెట్ చేసుకుంటే ధర తగ్గినప్పుడు తెలియజేస్తుంది. కొత్త మెయిల్ ఐడీతో కొనేస్తే సరి ఎంత మంది కస్టమర్లుంటే అంత పెద్ద సంస్థ అనే గుర్తింపు వస్తుంది. అందుకే ఈ కామర్స్ పోర్టళ్లు కొత్తగా నమోదైన కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 20 నుంచి 30 శాతం వరకు, కొన్ని 50 శాతం వరకు కూడా డిస్కౌంట్ ఇస్తుంటాయి. తగ్గింపు పొందాలంటే కొత్త మెయిల్ ఐడీతో కొత్త కస్టమర్ అవతారం ధరించాల్సిందే. ఓఎల్ఎక్స్, క్వికర్ చంద్రశేఖర్ నెల క్రితమే ముచ్చటపడి బజాజ్ వీ బైక్ కొన్నాడు. రూ.72వేలు అయింది. నెల తర్వాత ఓ రోజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్కు చిన్న గీత పడలేదు. శేఖర్కు సైతం చిన్న గాయం కాలేదు. కానీ, బైక్ వల్లే ఇలా జరిగిందని శేఖర్లో అనుమానం మొదలైంది. దీంతో 60వేలకే వీ బైక్ అంటూ క్వికర్లో క్లిక్ మనిపించాడు. అదే రోజు ఓ తెలివైన కుర్రాడు చంద్రశేఖర్ చేతిలో రూ.58 వేలే పెట్టి ఆ బైక్ను సొంతం చేసుకున్నాడు. కొన్న కుర్రాడి లాజిక్ ఏంటో తెలుసా... ‘నిజంగా ఇది లక్కీ బైక్. అందుకే ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు’ అనుకున్నాడు. రూ.14వేలు ఆదా చేసుకున్నాడు. ఈ రోజుల్లో వాడినవే కాదు. వాడనివి కూడా ఓఎల్ఎక్స్, క్వికర్లో తక్కువ ధరకు లభిస్తుంటాయి. తరచి చూస్తే, కొంచెం సమయం వెచ్చిస్తే ఆన్లైన్ షాపింగ్లో ఆదా చేసుకునే మార్గాలు బోలెడు ఉన్నాయి. వ్యాలెట్ వాడితే తగ్గుతుంది పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, ఎయిర్టెల్ మనీ, వొడాఫోన్ ఎం పెసా ఇలా వ్యాలట్ సేవలు అందించే సంస్థలు చాలానే ఉన్నాయి. ఐఆర్సీటీసీలో రైలు టికెట్ కొంటే రూపాయి తగ్గింపు రాదు. కానీ, టికెట్ ధరను చెల్లించేటప్పుడు మొబీక్విక్ లేదా పేటీఎం నుంచి డబ్బులు చెల్లిస్తే ప్రమోషన్లలో భాగంగా ఆయా సైట్లు తగ్గింపు ఇస్తుంటాయి. వ్యాలెట్ సైట్లను చూస్తే ఆఫర్ల గురించి తెలుస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డుతో షాపింగ్! ఈ కామర్స్ పోర్టళ్లు తరచుగా వివిధ బ్యాంకుల సహకారంతో తమ వినియోగదారులకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఆయా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 5 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంటాయి. కాకపోతే దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. మీరు రూ.50వేల వస్తువు కొంటే 10 శాతం క్యాష్బ్యాక్ అన్నారు కదా అని రూ.5వేలు వెనక్కి రాదు. షరతులుగా... ముందే గరిష్టంగా ఎంత డిస్కౌంట్ ఇస్తారో చెబుతారు. అదే లభిస్తుందని గుర్తుంచుకోవాలి. కార్ట్లో ఉంచితే కలిసొస్తుంది! ఉదాహరణకు అమెజాన్ సైట్లో ఫిలిప్స్ కంపెనీ హెడ్సెట్ ధర రూ.489 ఉంది. ధర ఫర్వాలేదనుకున్న మహేందర్ సైట్లోకి లాగిన్ అయి హెడ్సెట్ను షాపింగ్ కార్ట్కు యాడ్ చేసుకున్నాడు. కొనే లోపే నెట్ డిస్కనెక్ట్ అయింది. ఓ వారం తర్వాత అమెజాన్ నుంచి వచ్చిన మెయిల్ చూసి మహేందర్ ఎగిరి గంతేశాడు. వారం కిందట కొనాలనుకున్న ఫిలిప్స్ హెడ్సెట్పై 20% డిస్కౌంట్ను అమెజాన్ ఆఫర్ చేసింది. ఈ కామర్స్ పోర్టళ్లలోని కార్ట్లలో పెండింగ్లో ఉన్న వస్తువులను విక్రయించుకునేందుకు కొన్ని సంస్థలు అప్పుడప్పుడు ఇలా డిస్కౌంట్ను ఇస్తుంటాయి. కార్ట్కు యాడ్ చేసుకుని కొనకుండా వేచి చూస్తే తెలుస్తుంది. -
యాడ్రోబ్.. మన దుకాణం!
♦ ఒకే వేదికగా వర్తకులు, కస్టమర్లకు సేవలు ♦ గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకూ కొనే వీలు ♦ హైదరాబాద్లో షురూ; వచ్చే నెల్లో వరంగల్కు ♦ 2016-17లో మొత్తం 10 పట్టణాలకు విస్తరణ ♦ రూ.30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి ♦ - ‘సాక్షి’తో యాడ్రోబ్ ఫౌండర్ ఎండీ రాజిరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇపుడు ఆన్లైన్ షాపింగంటే తెలియనివారు లేరు. మరి పెద్దపెద్ద ఆన్లైన్ సంస్థల మధ్య చిన్న దుకాణాలు వెబ్సైట్ తెరవటం... కస్టమర్లను ఆకర్షించడం తేలికేమీ కాదు. వెబ్సైట్, సాఫ్ట్వేర్, పేమెంట్ గేట్వే, డెలివరీ వ్యవస్థ.. ఇలా చాలా పనులుంటాయి. గల్లీలోని చిన్న చిన్న కిరాణ దుకాణాలదారులు, స్థానిక వర్తకులకు ఇవన్నీ అయ్యే పనికాదు. అయితే వాళ్లకూ అందుబాటు ధరల్లోనే ఈ అవకాశాన్నిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యాడ్రోబ్. సంస్థ గురించి మరిన్ని వివరాలను దాని వ్యవస్థాపక ఎండీ రాజిరెడ్డి కే శిరెడ్డి ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ఆన్లైన్లో అమ్మే ఏ వస్తువైనా ఆఫ్లైన్ నుంచే రావాలి. కానీ ఆఫ్లైన్లో వస్తువులమ్మే వారంతా ఆన్లైన్కు రాలేకపోతున్నారు. దీన్నే వ్యాపారంగా చేసుకుని నా భార్య ప్రనూషతో కలసి యాడ్రోబ్ను ఆరంభించా. రూ.కోటి పెట్టుబడితో గత అక్టోబర్లో సంస్థను ప్రారంభించాం. యాడ్రోబ్ అంటే... ఆఫ్లైన్ సంస్థలను, కస్టమర్లను అనుసంధానించేదే యాడ్రోబ్. ఇందులో యాడ్ అంటే అడ్వటైజ్మెంట్, రోబ్ అంటే అల్మరా అని అర్థం. అంటే మనం ఎలాగైతే అల్మరాలో ముఖ్యమైన వస్తువులను దాచుకొని అవసరమైనప్పుడల్లా బయటికి తీసి వాడుకుంటామో... అలాగే యాడ్రోబ్లో సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. వినియోగదారులు కొనొచ్చు. ఒకే వేదికగా ఇద్దరికీ సేవలు.. ♦ వర్తకుల విషయానికొస్తే.. యాడ్ రూపంలో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. చార్జీలు అద్దె రూపంలో ఉంటాయి. ప్రస్తుతం మా సంస్థలో వెయ్యి మంది వెండర్స్ నమోదయ్యారు. ఇందులో 100 మంది సొంతంగా యాప్ను వినియోగించుకుంటున్నారు. ♦ కస్టమర్ల విషయానికొస్తే.. యాడ్రోబ్లో గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ వందకు పైగా కేటగిరీలున్నాయి. వీటి ద్వారా సుమారు 4 వేలకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఫుడ్ తప్ప అన్ని ఉత్పత్తులనూ ఆర్డరిచ్చిన 24 గంటల్లో డెలివరీ చేస్తాం. అది కూడా పూర్తి ఉచితంగా. ఇప్పటివరకు 5వేల మంది కస్టమర్లు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మా వద్ద రిటర్న్ పాలసీ లేదు. ఎక్స్చేంజ్ మాత్రం ఉంటుంది. రూ.30 కోట్ల వరకూ నిధుల సమీకరణ.. గ్రోత్ క్యాపిటల్ కోసం నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే ముంబైకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. రూ.30 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నారు. పూర్తి వివరాలు మరో ఆరు నెలల్లో వెల్లడిస్తాం. ఈ ఇన్వెస్టర్ గతంలో నాలుగైదు బిలియన్ డాలర్లు స్టార్టప్ సంస్థల్లో పెట్టారు. ప్రస్తుతం మా సంస్థలో 18 మంది ఉద్యోగులున్నారు. రెండు నెలల్లో స్థానికంగా 5 వేల మంది వర్తకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఐఓఎస్, విండోస్ వెర్షన్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. తొలి ఏడాది రూ.3 కోట్ల టర్నోవర్ లక్ష్యం.. ప్రస్తుతం నెలకు 1,500 లావాదేవీలు చేస్తున్నాం. నెలకు సుమారు రూ.20-25 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. తొలి ఏడాది రూ.3 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నాం. లక్ష జనాభా ఉన్న ప్రతి పట్టణానికీ విస్తరించాలని నిర్ణయించాం, 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశంలోని 10 పట్టణాలకు విస్తరిస్తాం. తొలి విడతగా డిసెంబరుకల్లా విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, వరంగల్కు విస్తరిస్తున్నాం. వచ్చే నెలలో వరంగల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ప్రతి పట్టణంలో రూ.8-10 లక్షల పెట్టుబడి పెడతాం. యాడ్రోబ్ సేవల్లో కొన్ని ప్రత్యేకమైనవి.. ♦ ప్రతి వర్తకునికి ఒక్కో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఇందులో వర్తకుడి పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, గూగుల్ మ్యాప్నూ అందిస్తుంది. ♦ కొనుగోలులో ఏమైనా సందేహాలుంటే పక్కనే పుష్ టు కాల్, పుష్ టు మెయిల్ అనే ఆప్షన్లుంటాయి. వీటిని క్లిక్ చేస్తే సంబంధిత వెండర్కు నేరుగా కనెక్ట్ అవుతారు. ♦ జియో ఫెన్సింగ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే.. మనం ఉన్న చోటు నుంచి ప్రతి 5 కి.మీ.లను ఒక జియోగా గుర్తిస్తారు. ఈ పరిధిలో ఉన్న బెస్ట్ ఆఫర్లు అన్ని కేటగిరీల్లోనూ క్షణాల్లో మన ముందు డిస్ప్లే అవుతాయి. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రాత్రి ఆర్డర్.. పొద్దున్నే డెలివరీ..!
డ్రాప్ షిప్పింగ్ విధానంతో 4 గంటల్లో డెలివరీ * 200 నగరాల్లో 5 వేల మంది వర్తకులతో ఒప్పందం * ఈ ఏడాది రూ.400 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి * ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సైబర్ప్లేస్.కామ్ ఫౌండర్, సీఈఓ ఉర్వేష్ గోయల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇపుడు ఆన్లైన్ షాపింగ్ గురించి తెలియని వారెవరూ లేరు. తె లిసినవారిలో ఆన్లైన్ షాపింగ్ చేయనివారూ ఉండరు. కాకపోతే ఈ షాపింగ్లో చిక్కల్లా డెలివరీనే. డెలివరీకి కనీసం రెండు రోజుల నుంచి గరిష్టంగా వారం పదిరోజులు కూడా పడుతుండటమే దీన్లో అసలైన సమస్య. దీనికి పరిష్కారం గానే... ఇపుడు చాలా సంస్థలు ఒకరోజులో డెలివరీకి శ్రీకారం చుడుతున్నాయి. కాకపోతే ఈ డెలివరీ ఎక్కువ కిరాణా సరుకులు, కూరగాయలకే పరిమితమవుతోంది. దీంతో మొబైల్ ఫోన్లకూ ఇలాంటి ఎక్స్ప్రెస్ డెలివరీని పరిచయం చేయటానికి శ్రీకారం చుడుతోంది హైదరాబాదీ స్టార్టప్ సైబర్ప్లేస్. డ్రాప్ షిప్పింగ్ విధానంతో కేవలం 4 గంటల్లో ఆర్డర్ను డెలివరీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందీ సంస్థ. 2008లో ప్రారంభమైన సైబర్ప్లేస్.కామ్ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి సంస్థ ఫౌండర్, సీఈఓ ఉర్వేష్ చంద్ర గోయల్ మాటల్లోనే.. ’’2004 వరకు అమెరికాలో స్ప్రింట్ టెలికాంలో డెరైక్టర్గా పనిచేశా. తర్వాత ఇండియాకు తిరిగొచ్చి హైదరాబాద్లో కన్వర్జెన్స్ కార్పొరేషన్లో డెరైక్టర్గా చేరా. ఆ సమయంలో దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న స్మార్ట్ఫోన్ల విక్రయం నన్ను ఆకట్టుకుంది. ఆన్లైన్ ద్వారా కేవలం స్మార్ట్ఫోన్లనే విక్రయించాలని నిర్ణయించుకొని రూ.2 కోట్లతో 2008లో హైదరాబాద్ కేంద్రంగా సైబర్ప్లేస్ ఈ సొల్యూషన్స్ను ప్రారంభించా. డ్రాప్షిప్పింగ్తో 4 గంటల్లో... కస్టమర్లిచ్చిన ఆర్డర్ను త్వరగా డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ఆయా నగరాల్లో గోదాములు ఏర్పాటు చేసుకుంటాయి. ఇందులో సరుకుల్ని నిల్వ చేసుకొని డెలివరీ చేస్తుంటాయి. దీనికోసం భూమి కొనుగోలు, ముందస్తుగానే ఉత్పత్తుల కొనుగోళ్లు, అదనపు ఉద్యోగుల నియామకం, నిర్వహణ వంటివి చేయాలి. దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే తొలిసారిగా డ్రాప్షిప్పింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానంలో నేరుగా దగ్గర్లోని వ్యాపారి నుంచి కస్టమర్కి వస్తువు చేరిపోతుంది. డెలివరీలో వస్తువు డ్యామేజీ సమస్య ఉండదు. నాణ్యమైన వస్తువులు తక్కువ సమయంలో కస్టమర్ల ఇంటికి చేరిపోతాయి. దీనికోసం దేశంలోని 200 నగరాల్లో 5 వేల మంది స్థానిక వర్తకులతో ఒప్పందం చేసుకుంటున్నాం. ఇప్పటికే 100 మందితో ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 2-5 మంది వర్తకులున్నారు. 3 లక్షల మంది కస్టమర్లు...: సైబర్ప్లేస్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్, ట్యాబ్లెట్స్, వాటి యాక్ససరీలు మాత్రమే అన్ని బ్రాండ్లవీ లభిస్తాయి. ధర రూ.4 వేల నుంచి రూ.65 వేల మధ్య ఉంటుంది. ఈ ఏడాది ఎక్స్క్లూజివ్ బ్రాండ్లతో విస్తరిస్తాం. బ్లూడార్ట్, ఈకామ్ ఎక్స్ప్రెస్, గో జావాస్, గతి, ఆరామెక్స్ వంటి 8 లాజిస్టిక్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 3 లక్షల మంది కస్టమర్లకు సేవలందించాం. రోజుకు రూ.4 కోట్ల వ్యాపారం లక్ష్యం దేశవ్యాప్తంగా అన్ని పిన్కోడ్లలో సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వ్యాపారం బాగుంది. ఇక్కడి నుంచి 60% ఆర్డర్లున్నాయి. మొత్తం వ్యాపారంలో 95% వాటా స్మార్ట్ఫోన్లదే. ప్రస్తుతం రోజుకు రూ.20 లక్షల వ్యాపారం చేస్తున్నాం. దీన్ని రూ.4 కోట్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. గతేడాది రూ.100 కోట్ల టర్నోవర్కు చేరుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 100 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాదిలో మరో 100 మందిని నియమించుకుంటాం. సెప్టెంబర్ నుంచి ట్రిపుల్ ఐటీ, ఐఐఐఎంల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి. ఈ ఏడాది ఐపీఓ... రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల మార్కెట్ పెరుగుతోంది కనక ఈ ఏడాది 1,200 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నాం. మేరీజేబ్ వ్యాలెట్ పేరిట పేమెంట్ గేట్వే సొల్యూషన్ సేవలకూ విస్తరించాం. సీడ్ ఫండింగ్లో భాగంగా గ తంలో రూ.2 కోట్లు నిధులను సమీకరించాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రూ.400 కోట్ల పెట్టుబడులపై దృష్టి సారించాం. ఒకరిద్దరు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఈ ఏడాది ముగిసేలోగా పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని ఉర్వేష్ గోయల్ వివరించారు. -
ట్యాబ్ కొంటే సబ్బు బిళ్ల పంపారు
యడ్లపాడు (గుంటూరు): ఆన్లైన్ షాపింగ్లో ట్యాబ్ బుక్ చేసుకుంటే సబ్బు బిళ్ల చేతికి వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా యడ్లపాడు రాజీవ్గాంధీ సెంటర్కు చెందిన టైలర్ భాస్కర్ ఫిబ్రవరి 16న సోలో కంపెనీ ట్యాబ్ను స్నాప్డీల్ ద్వారా బుక్ చేశాడు. అది సరిగ్గా నాలుగు రోజులకు చిలకలూరిపేట బ్లూడార్ట్ కొరియర్ సెంటర్కు వచ్చింది. అదే నెల 21న బ్లూడాట్ సెంటర్లో రూ.4వేలు డబ్బులు చెల్లించిన భాస్కర్ అక్కడే బాక్స్ తెరిచి చేసి చూశాడు. అంతే... అందులో డిటర్జెంట్ సబ్బు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సబ్బుతో పాటు ఇయర్ ఫోన్, బ్యాటరీ ఉన్నాయి కానీ ట్యాబ్ లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కొరియర్ వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో యడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారమంటూ పూసల దండలు..!
♦ రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వేల మందికి టోకరా ♦ ‘సాక్షి మీడియా’ సమాచారంతో ఘరానా మోసగాడి గుట్టురట్టు సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ సైట్స్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించడం.. టెలీకాలర్లతో ఫోన్లు చేయించడం.. మూడు గ్రాముల బంగారం అంటూ ఎర వేయడం.. వేల మంది నుంచి రూ.వందల్లో వసూలు చేయడం.. ఈ పంథాలో రెండేళ్లుగా భారీ మొత్తంలో దోచుకుంటున్న ఘరానా నేరగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూ.4 కోట్లకుపైగా లావాదేవీలు నెరపిన ఇతగాడి వ్యవహారం ‘సాక్షి మీడియా’ ఇచ్చిన సమాచారంతో తమ దృష్టికి వచ్చిందని సంయుక్త పోలీస్ కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరభద్రరావు 2012లో బంజారాహిల్స్లో ప్లానెట్ ఐ ట్రేడర్స్ సంస్థను స్థాపించాడు. దీని రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టిఫీషియల్ నగలతో పాటు ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తులు విక్రయిస్తామని పేర్కొన్నాడు. అయితే సంపాదన అద్దెలు, జీతాలకే సరిపోకపోవడంతో వ్యాపారాన్ని ‘విస్తరించాలని’ నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్ నుంచి నంబర్లు సేకరించి.. ప్రజలకు టోకరా వేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసిన వీరభద్రరావు 30 మంది టెలీకాలర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఓఎల్ఎక్స్, క్వికర్ వెబ్సైట్ల నుంచి కొన్ని మొబైల్ నంబర్లు సేకరించే వాడు. ఒక్కో నంబర్ను ఎక్సెల్ షీట్లో పొందుపరచడం ద్వారా ఆ సిరీస్లో ఉన్న వెయ్యి నంబర్లు సృష్టించేవాడు. వీటిని కంప్యూటర్ ఆధారంగా పనిచేసే సర్వర్లో డేటాబేస్గా నిక్షిప్తం చేసి.. గేట్ వేలతో అనుసంధానించే వాడు. ఒక్కో గేట్వేలో 32 సిమ్కార్డులను పెట్టుకోవచ్చు. సర్వర్ ఆధారంగా పని చేసే గేట్వేలు డేటాబేస్లో ఉన్న నంబర్లలో ఒకదాని తర్వాత మరోదానికి చొప్పున ఆటోమేటిక్గా కాల్స్ చేసేవి. అలా వెళ్లిన కాల్స్ టెలీకాలర్స్కు కనెక్ట్ కావడంతో వారు అవతలి వ్యక్తులతో సంప్రదింపులు జరిపేవారు. బంగారమంటూ పూసల దండలు.. లక్కీ డ్రాలో మీ సెల్ నంబర్కు రూ.6 వేల విలువైన మూడు గ్రాముల బంగారం తగిలిందంటూ టెలీకాలర్లు చెప్పేవారు. ఆకర్షితులైన వారితో దీన్ని క్లైమ్ చేసుకోవడానికి రూ.600, పోస్టల్ చార్జీల నిమిత్తం రూ.42 చెల్లించాలంటూ చెప్పేవాడు. అంగీకరించిన వారికి చార్మినార్ ప్రాంతంలో కొన్న రూ.20 విలువైన పూసల దండల్ని పార్సిల్ చేసి పంపేవాడు. ఈ పార్సిల్స్ను వీపీఎల్ పద్ధతిలో పంపడంతో వినియోగదారులు సంబంధిత పోస్టాఫీసులకు వెళ్లి రూ.642 చెల్లించి తీసుకునేవారు. రూ. 4 కోట్లకు పైగా వసూలు... రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వేల మందిని వీరభద్రరావు ఇలా మోసం చేశారు. ఈ మొత్తం రూ.4 కోట్ల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇతడి వ్యవహారాలపై ‘సాక్షి మీడియా’ బుధవారం సీసీఎస్కు సమాచారం ఇచ్చింది. బి.శ్రీకాంత్ నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్, ఇన్స్పెక్టర్ డి.శంకర్రాజు, ఎస్సై డి.ప్రశాంత్ బృందం కాల్సెంటర్పై దాడి చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు గేట్వేలు, సిమ్కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐటీ యాక్ట్తో పాటు టెలిగ్రాఫిక్ యాక్ట్ కిందా కేసు నమోదు చేశారు. -
స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. బండరాయి
కాశిబుగ్గ: ఆన్లైన్ షాపింగ్లో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుందని ఎంతో ఆశపడి ఫోన్ బుక్ చేస్తే.. ప్యాకింగ్లో రాయి వచ్చింది. వరంగల్ నగరం కాశిబుగ్గ తిలక్రోడ్డు నివాసి కుసుమ సురభి ఈనెల 22న స్నాప్డీల్లో రూ.1,700 ధరకే మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు చూసి ఆ ఫోన్ బుక్ చేసింది. బుధవారం కొరియర్ బాయ్ అడ్రస్ ప్రకారం ఇంటికి రావడంతో సురభి రూ.1,700 చెల్లించి ప్యాకెట్ తీసుకుంది. తీరా కవర్ సీల్ తీసి చూడగా.. ప్యాకింగ్లో చార్జర్ వైర్తో పాటు బండరాయి వచ్చింది. కొరియర్ బాయ్ను నిలదీయగా.. తాను కేవలం కొరియర్ బయ్నేనని, తిరిగి కంపెనీకి సమాచారం ఇవ్వండని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. బాధితురాలు కంపెనీకి ఫోన్ ద్వారా పలు మార్లు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేదు. -
ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్కు అంతర్జాతీయ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా వెబ్సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్మ్యాన్. శ్రీధర్కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం. కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి. అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్డేకు... అమెరికా నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు. ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?.. ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు * అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి * కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్... * గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు * ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్. అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం.... ఆన్లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే... * ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే. * ప్యాకేజ్కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే. * గిఫ్ట్గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది. * పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి. * ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు. * అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ. * దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి. కస్టమ్స్ గుర్తిస్తే...? ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్మ్యాన్తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది. కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా? సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు. నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్లో సంప్రదించవచ్చు. వస్తువు ట్రాక్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి కొరియర్కూ సొంత వెబ్సైట్ ఉంది. కన్సైన్మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్షిప్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్కు చెందిన ఐపీఎస్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే... ఏ కొరియర్నైనా ట్రాక్ చేయటానికి... https://www.17track.net/en https://www.aftership.com/ అంతర్జాతీయ పోస్టల్ను ట్రాక్ చేయటానికి... http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm -
ఆన్లైన్ అలర్ట్
జాగ్రత్త ఆన్లైన్ షాపింగ్ను మీరు ఎక్కడ చేసినా ఇంటర్నెట్ మధ్యలో డిస్కనెక్ట్ కాకుండా చూసుకోవాలి.ఒకవేళ మొబైల్ ద్వారా చేసేట్టయితే వెబ్సైట్లలో కంటే యాప్స్లోంచి చేయడం మంచిది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఇలా అన్ని ఆన్లైన్ మార్కెట్ల యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని వాటి నుంచి చేస్తే కొనుగోలుకు ఎక్కువ సమయం కూడా పట్టదు.విష్లిస్ట్ ముఖ్యం.. పండుగకు ఏమేమి కొనాలనుకుంటున్నారో, ఎంత ధర దానికి వెచ్చించగలరో ముందుగానే ప్లాన్ వేసుకోండి. అలా అయితే మీకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఆన్లైన్ ప్రాడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడమే అత్యుత్తమం.షాపింగ్కు ఇంట్లోని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను మాత్రమే ఉపయోగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ పేమెంట్ను పబ్లిక్ ఇంటర్నెట్ కేఫుల నుంచి చేయకండి. -
‘గ్రేట్’ ఫెస్టివల్కు గూగుల్ గుడ్బై
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటీఎం వంటి ఆన్లైన్ షాపింగ్ సంస్థల జోరు నేపథ్యంలో ‘గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్’ను (జీవోఎస్ఎఫ్) ఈ ఏడాది నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. అమెరికాలో సైబర్ మండే తరహాలో వివిధ ఉత్పత్తులపై కొనుగోలుదారులకు భారీ డిస్కౌంటు ఆఫర్లు అందించేలా భారత్లో గూగుల్ 2012లో జీవోఎస్ఎఫ్ను ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం పలు ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి డీల్స్ను ప్రకటిస్తూనే ఉన్నాయి. భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని, అటు కొనుగోలుదారులు కూడా అంత సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి లేదని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ నితిన్ బవన్కులె ఒక బ్లాగులో వ్యాఖ్యానించారు. అందుకే జీవోఎస్ఎఫ్ను నిలి పివేయాల్సిన తరుణం వచ్చినట్లు చెప్పారు. 2012లో జీవోఎస్ఎఫ్ ప్రారంభమైనప్పుడు 90 రిటైలర్లు విక్రయాలు చేపట్టగా, 2013లో ఆ సంఖ్య 240కి , గతేడాది 550కి చేరింది. -
ఆన్లైన్లో ‘ఖరీదు’ చేద్దామా..!
నేటి తరానికి చెందిన ఐటీ ఉద్యోగి మాధవీ గణేషన్కి ఆన్లైన్ షాపింగ్ అంటే మహా క్రేజీ. ఇంటిలోని కిరాణ వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొంటుంది. కానీ ఖరీదైన వస్తువుల విషయానికి వస్తే వెనుకంజ వేస్తోంది. దీనికి కారణం ‘ఆన్లైన్లో దొరికే లగ్జరీ వస్తువులపై పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే. లగ్జరీ వస్తువుల విషయంలో కొంతమంది ఆన్లైన్ రిటైలర్లు మోసాలకు పాల్పడుతున్నారని, అసలుదా, నకిలీదా అన్నది గుర్తుపట్టడం కష్టం’ అని అంటున్నారామె. ఒక్క మాధవినే కాదు చాలా మంది లగ్జరీ వస్తువుల విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారట. ఖరీదైన వస్తువులకు సంబంధించిన వివరాలను, వాటి సమీక్షలను తెలుసుకోవడానికే ఆన్లైన్కు పరిమితమవుతున్నారని, చివరకు వస్తువు కొనే సరికి నేరుగా షోరూంకు వెళ్ళి కొంటున్నారట. తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉందని, ఇది 2020 నాటికి 12 శాతానికి చేరుతుందని రీసెర్చ్ సంస్థ మెకిన్సే అంచనా వేస్తోంది. కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే ఆన్లైన్లో కూడా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో లగ్జరీ వస్తువులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం.. ఇవి గమనించండి.. ఈ-కామర్స్ కంపెనీల రిటర్న్ పాలసీ, డిస్క్లైమర్ను పూర్తిగా వినియోగదార్లు చదవాలి అని రిటైల్ నిపుణులు కలిశెట్టి నాయుడు సూచించారు. ధ్రువీకరణ, డెలివరీ హామీ, కస్టమర్ కేర్ నంబరు ప్రముఖంగా ఉన్నదీ లేనిదీ కస్టమర్లు గమనించాలి. విక్రయిస్తున్న బ్రాండ్స్ వివరాలు, ఉత్పత్తుల ఫొటోలు, కస్టమర్ల కామెంట్లు, రేటింగ్స్, తాజా ఫ్యాషన్ తీరు, డిజైనర్ల గురించిన సమాచారం ఉంటే ఆ వెబ్సైట్కు విశ్వసనీయత ఉంటుంది. తాము ఏకైక అధికారిక రిటైలర్ అని ఏదైనా వెబ్సైట్ ప్రకటించుకున్నట్టయితే ఆ బ్రాండ్ ఉత్పత్తులు మరేదైనా వెబ్సైట్లో లభిస్తున్నాయా లేదా పరిశీలించండి. బ్రాండ్ అధీకృత వెబ్సైట్ అయితే నడుస్తున్న సీజన్ కలెక్షన్ను గుర్తించవచ్చు. ప్రయోజనం ఏమిటంటే.. సాధారణంగా లగ్జరీ వస్తువులకు సంబంధించిన షోరూంలు పెద్ద పెద్ద నగరాలు, పట్ణణాలకే పరిమతమవుతాయి. దీనివల్ల మీకు వీటిని కొనాలని ఉన్నా అవి అందుబాటులో ఉండవు. అదే ఆన్లైన్లో అయితే ఎక్కడి నుంచైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. మీకు నచ్చిన సమయంలో కొనే వెసులుబాటు ఉంటుంది. ఇక లగ్జరీ షోరూంల నిర్వహణ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. సాధారణంగా లగ్జరీ షాపులు సంపన్నులు అధికంగా ఉండే ఖరీదైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు అమ్ముతున్న వస్తువులకు తగ్గట్టుగా షాపును సుందరంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఈ వ్యయాలన్నీ మన నుంచే ముక్కు పిండి వసూలు చేస్తారు. అదే ఆన్లైన్లో అయితే ఈ ఖర్చులేమీ ఉండవు. దీనితో చౌకగా ఈ వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం దొరుకుతుంది. సాధారణంగా బ్రాండెడ్ షోరూంతో పోలిస్తే ఆన్లైన్లో 10 శాతం తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు లభిస్తాయని ఆన్లైన్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఉత్పాదన నకిలీదైతే.. మీరు స్వీకరించిన ఉత్పాదన నకిలీదైతే కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పాదనను వెనక్కి తీసుకుంటాయి. వెనక్కి తీసుకోకపోతేనే అసలు సమస్య. కంన్సూమర్ ఫోరంలో ఆ వెబ్సైట్పై ఫిర్యాదు చేయవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను నలుగురికి తెలియజేయండి. గౌరవానికి భంగం కలుగుతుందన్న భయంతోనైనా ఆ వెబ్సైట్ నుంచి మీ డబ్బులు మీకు రావొచ్చు. నకిలీది కాబట్టి బ్రాండ్లు ఈ విషయంలో ఏమీ సహాయం చేయవు. అందుకే బ్రాండ్స్కు చెందిన సొంత వెబ్సైట్లు లేదా పాపులర్ వెబ్సైట్ల ద్వారా షాపింగ్ చేయడం ఉత్తమం. ధర విషయంలో.. కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు 80 శాతం వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుంటాయి. లగ్జరీ బ్రాండ్ల విషయంలో ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. బ్రాండ్ షాపులో లేదా ఆ బ్రాండ్ వెబ్సైట్లో ఉన్న ధర కంటేతక్కువకే అమ్మితే ప్రామాణికతను పరిశీలించాలి అని క్లాసిక్ పోలో తెలంగాణ పంపిణీదారు గుండుబోయిన శ్రీకాంత్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రెడీమేడ్స్ విషయంలో 4 నెలలకోసారి కొత్త సరుకు మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు పాత సరుకుపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. సరుకును కొన్న వ్యాపారి ఆన్లైన్ విక్రేతలు లేదా రిటైలర్లకు కొంత ధర తగ్గించి విక్రయిస్తారు’ అని వివరించారు. భారత్లో ధరపై నియంత్రణ లేదు. స్టాక్ చాలా మిగిలిపోతే కంపెనీలు భారీగా డిస్కౌంట్ ఇవ్వడం సహజం. కానీ లగ్జరీ వస్తువుల విషయంలో డిస్కౌంట్ అనేది అంత ఎక్కువ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తనిఖీ చేయండి.. ఆన్లైన్లో ఉత్పాదన స్వీకరించగానే ట్యాగ్, డస్ట్ బ్యాగ్, వారంటీ కార్డ్ను పరిశీలించండి. బ్రాండెడ్ గూడ్స్ ముఖ్యంగా లగ్జరీ ఉత్పత్తులు ఇవి లేకుండా విక్రయించవు. కొన్ని బ్రాండ్లు ఉత్పత్తి లేదా ప్యాక్పై ఒక కోడ్ను ముద్రిస్తాయి. ఈ కోడ్ ఆధారంగా అసలుదా, నకిలీదా ట్రాక్ చేయవచ్చు. విక్రయానంతర సేవను ఈ బ్రాండ్లు ఆఫర్ చేస్తాయి. ఇవేవీ లేవంటే మీరు నకిలీ ఉత్పాదనను కొన్నారన్న మాట. దుస్తులైతే వస్త్రం, కుట్లు (స్టిచ్చింగ్) ఎలా ఉన్నాయో గమనించాలి. వినియోగదార్లు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవాలి. మార్కెట్ ప్లేస్ విధానంతో.. సాధారణంగా లగ్జరీ బ్రాండ్లు చాలామటుకు సొంత ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారానే విక్రయిస్తున్నాయి. సొంతంగా ఈకామర్స్ వెబ్సైట్స్ లేకపోతే మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ఈ-కామర్స్ కంపెనీలతో చేతులు కలిపిన రిటైల్ విక్రేతలే ఉత్పత్తులను సరఫరా చేయడాన్ని మార్కెట్ ప్లేస్ విధానం అంటారు. ఇలాంటి సమయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రిటైల్ సంస్థలు మోసాలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలుదా నకిలీదా అన్ని గుర్తుపట్టలేనంతగా వీటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ రిటైల్ సంస్థలను బ్లాక్లిస్ట్లో పెడుతున్నాయి. అందుకే మీరు ఆర్డరు ఇచ్చే ఆన్లైన్ రిటైల్ సంస్థ ఎంత నమ్మకమైనదన్న విషయం కూడా ఇక్కడ ముఖ్యమే. -
ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్లైన్లో
కూరగాయల నుంచి కిరాణా సామాను వరకూ.. త్వరలోనే ‘పెప్పర్టాప్’లో మాంసాహారం కూడా.. 10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్లు కూడా.. మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవ్నీత్ సింగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఇపుడు ఆన్లైన్ షాపింగ్లో దొరకనిదంటూ ఏదీ లేదు! గుండు సూది నుంచి ఆకాశయానం వరకూ ప్రతి ఒక్కటీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే తమ ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా విక్రయించాలంటేనే మాత్రం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. వెబ్సైట్ డిజైనింగ్.. సాఫ్ట్వేర్ అభివృద్ధి.. పేమెంట్ గేట్ వే.. డెలివరీ వ్యవస్థ.. ఇలా చాంతాడంత పనుంటుంది. ఒక మోస్తరు వ్యాపార సంస్థలకైతే ఇది పెద్ద భారం కాకపోవచ్చు. కానీ, గల్లీలోని చిన్న చిన్న కిరాణా దుకాణాలూ ఆన్లైన్లో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే... ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇలాంటి దుకాణాలకు వేదికను సృష్టించింది గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న పెప్పర్టాప్. కోడిగుడ్లు, కూరగాయల నుంచి మొదలుపెడితే ఇంట్లోకి అవసరమయ్యే కిరాణా సామాను వరకూ ప్రతి ఒక్కటీ ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేయవచ్చంటున్నారు పెప్పర్టాప్ సహ వ్యవస్థాపకుడు నవ్నీత్ సింగ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... గుర్గావ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐదేళ్లు.. ఆ తర్వాత లాజిస్టిక్ కంపెనీలో ఏడాది కాలం పనిచేశాక.. వ్యాపారం మీద ఉన్న ఇష్టంతో సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆన్లైన్ షాపింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో.. ఫ్యాషన్ వస్తువులో కాకుండా ఇంటి పక్కనే ఉన్న కిరాణా సామాను కూడా ఆన్లైన్లోకి తీసుకురావాలని భావించా. నా ఆలోచన మీద నమ్మకంతో కంపెనీ ప్రారంభించక ముందే 2013 నవంబర్లో సెకోయా క్యాపిటల్ 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో కో-ఫౌండర్ మిలింద్ శర్మతో కలసి 2014 డిసెంబర్లో గుర్గావ్ కేంద్రంగా పెప్పర్టాప్.కామ్ను ప్రారంభించాం. త్వరలోనే మాంసాహార ఉత్పత్తులూ.. ప్రస్తుతం పెప్పర్టాప్లో కోడిగుడ్ల నుంచి మొదలుపెడితే డ్రైఫ్రూట్స్, సేంద్రియ ఆహార ఉత్పత్తులు, పూజ సామాన్లు, పండ్లు, కూరగాయలు, పెట్ ఉత్పత్తులు, బేబీ కేర్, జుట్టు, చర్మ సౌందర్య ఉత్పత్తుల వంటివి సుమారు 1,500 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇందులో 220 కిరాణా దుకాణాలు, 3 వేల మంది కస్టమర్లు రిజిస్టరయి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి 500-700 దుకాణాలకు, 5-7 వేల మంది కస్టమర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే పెప్పర్టాప్లో మాంసాహార ఉత్పత్తులనూ విక్రయిస్తాం. 10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల సమీకరణ... పెప్పర్టాప్ ప్రారంభమై 10 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 47.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. సీడ్ రౌండ్లో 1.2 మిలియన్ డాలర్లు, ఆ తర్వాత సిరీస్-ఏలో ఈ ఏడాది ఏప్రిల్లో 10 మిలియన్ డాలర్లు, సిరీస్-బీలో భాగంగా ఇటీవలే 36 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఇందులో స్నాప్డీల్, సెకోయా ఇండియా, సైఫ్ పార్టరన్స్ సంస్థలు సమష్టిగా పెట్టుబడులు పెట్టాయి. మరో నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్ల పెట్టు బడులను సమీకరించనున్నాం. ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం... పెప్పర్టాప్ మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20 శాతం వరకూ ఉంది. రోజుకు హైదరాబాద్ నుంచి 15 శాతం ఆర్డర్లొస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రూ.6-7 వేలొస్తున్నాయి. ఆర్డరిచ్చిన రెండు గంటల్లోపు వస్తువులను డెలివరీ చేస్తాం. ప్రతి ఆర్డర్ మీద 7-8 శాతం చార్జీ కిరాణా దుకాణ యజమానిపై పడుతుంది. ప్రస్తుతం 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న పెప్పర్టాప్లో ఆరు నెలల్లో 5,000 మందిని నియమించుకుంటాం. 75 నగరాలకు విస్తరణ... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో సేవలందిస్తున్న పెప్పర్టాప్ వచ్చే మార్చి నాటికి దేశంలోని 75 నగరాలకు విస్తరించనుంది. ‘‘కంపెనీని ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 30-40 ఆర్డర్లొచ్చేవి. కానీ, ఇప్పుడది 1,500-1,700కు చేరింది. వారాంతాల్లో అయితే ఏకంగా 40 వేల ఆర్డర్లొస్తున్నాయి. మొత్తం వ్యాపారంలో మొబైల్ ఆర్లర్లే ఎక్కువ. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా 85 శాతం, ఐఓఎస్ నుంచి 10 శాతం ఆర్డర్లొస్తున్నాయి. మిగతావి వెబ్సైట్ నుంచి వస్తున్నాయి. -
బ్యాంకు ఖాతాలో సొమ్ము మాయం
♦ కార్డు పునరుద్ధరణ పేరుతో దగా ♦ రూ.50వేలతో ఆన్లైన్ షాపింగ్ ♦ లబోదిబోమంటున్న బాధితుడు తిరువూరు : ‘మీ బ్యాంకు ఏటీఎం కార్డు కాలం చెల్లిపోయింది, పునరుద్ధరణకు కార్డు నంబరు, పిన్ నంబరు చెప్పండ’ని వచ్చిన ఫోన్కాల్కు స్పందించిన ఓ ఉపాధ్యాయుడు రూ.50వేలు కోల్పోయిన ఉదంతం తిరువూరులో మంగళవారం వెలుగుచూసింది. మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోనారావు భార్య శాంతి పేరుతో తిరువూరు ఆంధ్రాబ్యాంకు శాఖలో ఖాతా ఉండగా, మూడు రోజులుగా ఆ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డును పునరుద్ధరించుకోవాలని ఫోన్కాల్స్ వస్తున్నాయి. హిందీలో వస్తున్న ఫోన్కాల్స్ అర్థంకాకపోయినా తమ ఏటీఎం కార్డు గడువు తీరిందని నమ్మిన ఉపాధ్యాయుడు సోమవారం కార్డునంబరు, పిన్నంబరును ఆగంతకుడికి తెలియజేశారు. అనంతరం ఏటీఎంకు వెళ్లి నగదు బ్యాలెన్సు పరిశీలించగా రూ.50వేలు డ్రాచేసినట్లు గుర్తించారు. రూ.2వేల చొప్పున 25సార్లు ఆన్లైన్ షాపింగ్ ద్వారా సొమ్ము డ్రా చేసినట్లు గమనించి కోనారావు దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఖాతాలోని సొమ్ము అపహరణకు గురైనట్లు గుర్తించి బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం దినపత్రికల్లో ఇలాంటి సంఘటనలపై వార్తలు వెలువడుతున్నా... తాము కూడా మోసపోయామని వాపోతున్నారు. అవసరం తీరాక కోనారావు బ్యాంకు ఏటీఎం కార్డు పునరుద్ధరణకు వివరాలు కావాలని పదే పదే ఫోన్కాల్స్ చేసిన ఆగంతకుడు తన అవసరం తీరిన తర్వాత ఫోన్ నంబరును నిలిపివేశాడు. సోమవారం ఒక్కరోజే సుమారు 50సార్లు కాల్స్చేసి, ఖాతాదారును కంగారుపెట్టిన ఆగంతకుడు హుటాహుటిన నగదు డ్రా చేసుకున్నాడు. తమకు కాల్స్ వచ్చిన నంబరుకు డయల్ చేయడానికి ప్రయత్నించిన కోనారావుకు ఆ నంబరు మనుగడలో లేదని సమాధానం రావడంతో హతాశులయ్యారు. బ్యాంకునుంచి నగదు విత్డ్రా చేసినపుడు ఫోన్కు అలర్ట్ వచ్చే సదుపాయం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు ఆ సదుపాయం వినియోగించుకోపోవడంతో జరిగిన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు. -
త్వరలో ఫేస్బుక్లోనూ ఆన్లైన్ షాపింగ్!
శాన్ఫ్రాన్సిస్కో: ఇప్పటి వరకు చాటింగ్, ఉచిత కాల్స్కే పరిమితమైన ఫేస్బుక్..తర్వలోనే మరో కొత్త సేవను అందుబాటులో తేనుంది. ఆన్లైన్లో వస్తువులు కొనేలా ఒక కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఫేస్బుక్ మెసేంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ గురువారం వెల్లడించారు. ఈ సర్వీసుకు ‘ఎం’ అని నామకరణం చేశామని తెలిపారు. ‘ఫేస్బుక్ మేసేంజర్లో ‘ఎం’ సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేయడానికి మా వంతు సాయం అందిస్తాం. రెస్టారెంట్స్లో టేబుల్ బుకింగ్, ప్రయాణాలకు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం’ అని డేవిడ్ తెలిపారు. ఫేస్బుక్ మెసేంజర్ను ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
ఇక ఐఆర్సీటీసీ రూపేకార్డ్తో షాపింగ్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ యూని యన్ బ్యాంక్ ప్రీ పెయిడ్ కార్డ్తో ఇక నుంచి మరిన్ని సర్వీసులకు చెల్లింపులు జరపవచ్చని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకూ రైల్వే బుకింగ్లకు మాత్రమే పరిమితమైన ఈ కార్డ్తో ఇక నుంచి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆన్లైన్ షాపింగ్ల్లో చెల్లింపులు చేయవచ్చని ఐఆర్సీటీసీ సీఎండీ ఎ.కె. మనోచా తెలిపారు. -
ఆ ‘టచ్’... మాకొదిలేయండి!
కస్టమర్లతో టచ్లో ఉండే సేవలే నొలారిటీ ప్రత్యేకత ♦ రూ.10 లక్షల పెట్టుబడితో ఆరంభమై... అంతర్జాతీయ స్థాయికి... ♦ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అధికం దీని కస్టమర్లే ♦ మూడేళ్లలో బిలియన్ డాలర్ల సంస్థగా మారాలని లక్ష్యం ♦ ఇప్పటికే 24.5 మిలియన్ డాలర్ల సమీకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ప్రసన్నం చేసుకోవటానికి వారితో ఆత్మీయంగా మాట్లాడటమనేది మునుపటి పద్ధతి. మరి, ఇప్పటి ఆన్లైన్ షాపింగ్లో ఇది సాధ్యమా? ఔనంటోంది నొలారిటీ క్లౌడ్ కమ్యూనికేషన్. ఎందుకంటే కంపెనీల తరఫున కస్టమర్లతో ప్రతి సందర్భంలోనూ టచ్లో ఉండే పనిని ఈ సంస్థే చేస్తోందిపుడు. వారి సెల్ఫోన్లకు నేరుగా గ్రీటింగ్ మెసేజ్లు.. వెల్కం ఎస్ఎంఎస్లు పంపటం, అప్పుడప్పుడు వారికి కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తోంది. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నొలారిటీ కథ ఇదిగో... అంబరీష్ గుప్తా ఐఐటీ కాన్పూర్లో డిగ్రీ పూర్తి చేశాక.. సిలికాన్వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో మూడేళ్లు పనిచేశారు. 2004లో ఇండియాకి తిరిగొచ్చి ‘ఇన్వెంటికా’ పేరుతో ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు. ఆఫ్లైన్లోనే కష్టంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆన్లైన్లో చేయటమంటే మాటలు కాదన్న విషయం తెలియడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఆ వ్యాపారం పోతేపోయింది. కానీ గుప్తాకు అక్కడొక ముఖ్యమైన విషయం తెలిసింది. అదేంటంటే.. వ్యాపారంలో కస్టమర్లకు, కంపెనీలకు ఉండే అనుబంధం. మరి ప్రతి ఒక్క కస్టమర్ను గుర్తుపెట్టుకుంటూ.. సరైన సమయంలో సరైన విధంగా రెస్పాండ్ కావాల్సిన అవసరమూ తెలిసొచ్చింది. ఇదంతా టెక్నాలజీతోనే సాధ్యమని భావించిన గుప్తా... మళ్లీ అమెరికా వెళ్లి ఎంబీఏలో చేరారు. చదువుతూనే క్లౌడ్ టెక్నాలజీని శోధించారు. కొన్ని జాబ్ పోర్టల్ సంస్థల దగ్గరికెళ్లి వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకొని... ఎలాంటి హార్డ్వేర్ సపోర్ట్ లేకుండా క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వెల్కం మెసేజ్లు పంపించేవారు గుప్తా. వాళ్లేమో ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోయేవారు. దీన్నెందుకు కస్టమర్లకు మళ్లించకూడదనే ఆలోచన అక్కడే పుట్టింది. అదిగో... 2009లో నొలారిటీ క్లౌడ్ కమ్యూనికేషన్ పుట్టింది అలాగే. నొలారిటీ కూడా మీ కంపెనీ ఉద్యోగే.. నొలారిటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వెబ్ అప్లికేషన్కు, కాలర్కు మధ్య అనుసంధానకర్త. అంటే కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సోషల్ వెబ్సైట్లలో లైకులు, పోస్టులు, కామెంట్లు.. ఇలా ప్రతి దాన్నీ తీసుకొని సంబంధిత మార్కెటింగ్, సేల్స్ వంటి సంబంధిత విభాగానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నొలారిటీ కూడా మీ కంపెనీ ప్రతినిదే. కాకపోతే ఇది పూర్తిగా క్లౌడ్లో పనిచేసే వర్చుకల్ కమ్యూనికేషన్. గంటకు 10 లక్షల ఫోన్ కాల్స్ను ప్రాసెస్ చేయడం నొలారిటీ ప్రత్యేకత. రాజకీయ పార్టీలూ కస్టమర్లే.. ఈ-కామర్స్, రియల్టీ, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా 20 రంగాలకు చెందిన 65 దేశాల్లోని 12 వేలకు పైగా కంపెనీలు నొలారిటీ క్లౌడ్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 100కు పైగా కంపెనీలూ దీని కస్టమర్లే. ఇండియాతో పాటు ఆఫ్రికా, దుబాయ్, సింగపూర్, ఫిలిప్పీన్స్, టర్కీ, మలేషియా దేశాలు... హెచ్యూఎల్, లాక్మే, మహింద్రా హాలిడేస్, ఎల్అండ్టీ, ఏసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్, ట్వీటర్, కుష్మన్ వేక్ఫీల్డ్ వంటి బడా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. నొలారిటీ సేవల్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలూ వినియోగించుకుంటున్నాయి. ఢిల్లీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బిజూ జనతాదళ్ పార్టీలు ఓటర్లకు ఎస్ఎంఎస్ రూపంలో క్యాంపెయినింగ్ చేశాయి. రెండేళ్లలో భారీగా విస్తరణ..: రూ.10 లక్షల సొంత పెట్టుబడితో ప్రారంభమైన నొలారిటీ ఇప్పటివరకు 24.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఏటా కంపెనీ వార్షిక టర్నోవర్ రెండింతలవుతోంది. 2017 ముగింపు నాటికి బిలియన్ డాలర్ల క్లబ్లో చేరాలన్నది కంపెనీ లక్ష్యం. కంపెనీలో 550 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ మిస్డ్ డయల్, వర్చువల్ యాడ్ నంబర్, క్లిక్ 2 కాల్, సూపర్ టోల్ ఫ్రీ నంబర్, క్లౌడ్ ఐవీఆర్ వంటి ఎన్నో రకాల క్లౌడ్ సేవలందిస్తోంది. వీటిలో సూపర్ రిసెప్షనిస్ట్, స్మార్ట్ ఐవీఆర్, సూపర్ కాన్ఫరెన్స్ ప్రధాన సేవలు. ఇదీ... మా ప్రత్యేకత ఇటీవలే స్పీచ్ రికగ్నేషన్ టెక్నాలజీ సేవల్ని ప్రారంభించాం. దీంతో.. కంపెనీ కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వ్యక్తి ఆడా? మగా? వయసెంత? తన మూడ్ ఎలా ఉంది? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. అవన్నీ సంబంధిత యాజమాన్యానికి క్షణాల్లో చెప్పేస్తాం. ఆరు నెలల్లో వీడియో టెక్నాలజీ సేవల్ని తేబోతున్నాం. సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నొలారిటీకి విదేశాలతో పాటు దేశంలో గుర్గావ్, ముంబై, బెంగళూరుల్లో ఆఫీసులున్నాయి. రెండేళ్లలో 30-40 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశ, విదేశాల్లో విస్తరించనున్నాం. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తాం. చైనా, ఆఫ్రికా, టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, ఈజిప్ట్ దేశాల్లోనూ విస్తరించనున్నాం. - ‘సాక్షి’తో అంబరీష్ గుప్తా, సీఈఓ -
ఈ-కామర్స్ లావాదేవీలపైనా జీఎస్టీ!
న్యూఢిల్లీ : ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ఈ-కామర్స్ కంపెనీలను కూడా చేర్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ-కామర్స్ లావాదేవీల్లో సరఫరా చేసే చోటు(ప్లేస్ ఆఫ్ సప్లై)కు సంబంధించిన నిబంధనలను కేంద్ర రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. దీనివల్ల ఆన్లైన్ షాపింగ్ను పన్ను చట్రంలోకి తీసుకురావడం సులువవుతుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్టీలో ఈ నిబంధనలు చాలా కీలకమని కూడా చెప్పారు. ఎక్కడైతే వస్తువులను కస్టమర్కు డెలివరీ చేస్తారో ఆ గమ్యం(డెస్టినేషన్) ఆధారంగా పన్ను విధించనున్నట్లు ఆయన వివరించారు. వస్తువుల సరఫరా ఒకే రాష్ట్రం పరిధిలో(ఇంట్రా-స్టేట్) జరుగుతోందా... ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయా(ఇంటర్ స్టేట్) అనేది కూడా ఈ నిబంధనలవల్ల సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది. కాగా, జీఎస్టీ అమలు నిబంధనలు రూపొందించనున్న కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ).. ముసాయిదా(డ్రాఫ్ట్)ను సిద్ధం చేసిన తర్వాత ఈ-కామర్స్ పరిశ్రమ వర్గాల నుంచి దీనిపై సలహాలు, సూచనలు కోరనున్నట్లు సీబీఈసీ సభ్యుడు వీఎస్ కృష్ణన్ చెప్పారు. దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.33 వేల కోట్లు)గా అంచనా. కాగా, జీఎస్టీ అమలుకు అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్టీని అమలు చేయాలనేది కేంద్రం ప్రణాళిక. -
ఆన్లైన్ మోసం
పెదవాల్తేరు: బ్యాంకు అధికారినని చెప్పి ఫోన్లో ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకుని.. దర్జాగా రూ.10 వేల విలువైన ఆన్లైన్ షాపింగ్ చేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీకాలనీకి చెందిన సిహెచ్ అప్పారావు రిటైర్డ్ ఉద్యోగి. అతనికి స్టేట్బ్యాంక్లో ఖాతా ఉంది. ఈనెల 11న మధ్యాహ్నం 85810 58891 నంబరు నుంచి అప్పారావుకు ఫోన్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. ‘మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాల’ని తెలిపి ఆధార్ కార్డు నంబర్ అడిగాడు. తర్వాత ఏటీఎం కార్డుపై ఉన్న పదహారు అంకెలు చెప్పమన్నాడు. ఏటీఎం కార్డు మరో వైపు ఉన్న చివర మూడు అంకెలు తెలపాలని అడగ్గా అప్పారావు నంబర్లు చెప్పారు. ఏటీఎం కార్డు నంబర్ చెప్పగానే అతను ఫోన్ కట్ చేశాడు. పది నిమిషాలకే మోబి క్విక్ ఆన్లైన్ షాపింగ్లో రూ.9999 చెల్లించినట్టు అప్పారావు ఫోన్కు సందేశం రావడంతో అవాక్కయ్యాడు. వెంటనే తనతో మాట్లాడిన వ్యక్తి నంబర్కు డయల్ చేయగా ఆ నంబర్ పనిచేయలేదు. దీంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బురిడీ కొట్టించి ఆన్లైన్ షాపింగ్
నాగర్కర్నూల్ (మహబూబ్నగర్): ఖాతాదారులను బురిడీ ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నాగర్కర్నూల్లో బయట పడింది. వివరాలు.. 'ఢిల్లీ భారతీయ స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఏటీఎం సెక్యూరిటీ కోసం కార్డు పైన ఉండే నంబర్ల వివరాలు చెప్పండి' అంటూ ఈ నెల 1న ఖాతాదారులకు ఫోన్ వచ్చింది. ఆ నంబర్ల సహాయంతో మోసగాళ్లు షాపింగ్ చేయటంతో ఖాతాదారుల జేబుకు చిల్లుపడింది. మలిశెట్టి శేఖర్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.45 వేలు, గోపాల్కృష్ణ, మరో వ్యక్తి (పేరు తెలియదు) ఖాతా నుంచి రూ.55వేలు మాయమైంది. ఆ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదు. తెలిసిన వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మీ షాపింగ్ మీ ఇష్టం..!
► కోరుకున్నట్టు వస్త్రాలు, నగలకు ‘బుజ్జు.కామ్’ ► అవసరాలు, అభిరుచుల మేరకు కస్టమైజ్డ్ తయారీ ► యూకే, సింగపూర్, కెనడాలకూ త్వరలో విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ షాపింగ్ అంటే అందరికీ సరదానే. కాకపోతే ఆన్లైన్లో ఉన్న వస్త్రాలు, నగల వంటి వాటిలో మనకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కస్టమైజ్డ్ నగల కోసం బ్లూస్టోన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లున్నా అవి ఆభరణాలకే పరిమితం. కాకపోతే హైదరాబాదీ స్టార్టప్ ‘బుజ్జు.కామ్’లో మాత్రం.. మన అవసరాలు, అభిరుచులను చెప్పేస్తే వస్త్రాలు, నగలు అన్నీ కస్టమైజ్డ్వి పొందొచ్చు. అంతేకాదు. మన అవసరాలు, అభిరుచులు చెబితే వాటిని బట్టి మనకు ఎలాంటి నగలు, వస్త్రాలు సెట్ అవుతాయో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తరవాత వాటిని డిజైన్ చేయించుకోవచ్చు. బుజ్జు.కామ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నరేంద్ర రెడ్డి మాటల్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ గురించి మరిన్ని వివరాలు... అందంతో పాటు పరిపూర్ణమైన వస్త్రాలు, నిండైన ఆభరణాలు ఉంటేనే మహిళలకు నిజమైన సౌందర్యం వస్తుందనేది నా అభిప్రాయం. అందుకే మన కట్టు, బొట్టును విదేశీయులూ గౌరవిస్తారు. ఈ సౌందర్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకే ఏడాదిన్నర క్రితం రూ.1.2 కోట్ల పెట్టుబడులతో బుజ్జు.కామ్ను ప్రారంభించాం. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలుదారుల అభిరుచి, అవసరాల మేరకు ట్రెండ్కు తగ్గట్టుగా డిజైన్ చేసివ్వడమే ‘బుజ్జు.కామ్’ ప్రత్యేకత. కొనుగోలు చేసిన ఉత్పత్తులను బంధుమిత్రులు, స్నేహితులతో పంచుకొని వారి చేత కూడా షాపింగ్ చేయిస్తే వారికి బజ్ పాయింట్లు ఇచ్చి.. వారు ఆ తరవాత చేసే కొనుగోళ్లలో డిస్కౌంట్లు ఇస్తాం. ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ గిఫ్ట్లను కూడా అందజేస్తాం. విస్తరణ బాటలో.. ఈ ఏడాది ముగింపు నాటికి సింగపూర్, కెనడా, యూకే దేశాల్లోనూ బుజ్జు.కామ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి సారించాం. త్వరలోనే బుజ్జు.కామ్లో పిల్లలు, పురుషుల దుస్తులు, పాదరక్షలను కూడా విక్రయిస్తాం. ఎక్స్క్లూజివ్ డిజైన్లు.. మన దేశంతో పాటు అమెరికాలో కూడా బుజ్జు.కామ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 10 వేల మంది, అమెరికాలో 4 వేల మంది రిపీటెడ్ కస్టమర్లున్నారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో మహిళలకు సంబంధించిన చీరలు, చుడీదార్లు, డిజైనర్ వస్త్రాలతో పాటు ఆభరణాలనూ కొనుగో లు చేసే వీలుంది. పోచంపల్లి, గద్వాల్, కొత్తకోట, నారాయణగిరి, ధర్మవరం, ఉప్పాడ, కేరళ, కల కత్తా, కాంచీపురాలకు చెందిన వస్త్రాలు మా సైట్లో లభిస్తాయి. ఇతర షాపింగ్ సైట్లతో పోలిస్తే బుజ్జు.కామ్లో 50% ధర తక్కువగా ఉంటుంది. వస్త్రాలు, నగల తయారీదారులతో నేరుగా ఒప్పందం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమయింది. ఎక్స్క్లూజివ్ డిజైన్లను అందించేందుకు ఆప్కో, పోచంపల్లి సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం. -
ఫోన్ ఆర్డర్ చేస్తే.. మామిడిపండ్లు వచ్చాయి!
-
క్లిక్ చేస్తే సూపర్ మార్కెట్
ఆన్లైన్...ఆన్లైన్....ఏ నోట విన్నా ఇదే మంత్రం. స్మార్ట్సిటీలో ప్రజలంతా స్మార్ట్గా మారిపోతున్నారు. పాత అభిరుచులు మారిపోతున్నాయి. కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇపుడు మార్కెట్కు వెళ్లి షాపింగ్ ఎక్స్పీరియన్స్ను ఎంజాయ్ చేయాల్సిన పనిలేదు...ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చునో లేదా నయా హస్తభూషణం సెల్ఫోన్నో క్లిక్ చేసి ‘హలో బజార్’ అని పలకరించేయవచ్చు. కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ ఇంట్లో కూర్చునే షాపింగ్ చేసుకోవచ్చు. మరి మన సిటీలో ఈ ఆన్లైన్ షాపింగ్ ఎలా ఉంది....ఓ లుక్కేద్దామా...! మార్కెట్లో బజార్కి వెళ్లి కావాల్సిన వస్తువులన్ని కొనుగోలు చేసుకొని ఇంటికి తిరిగొచ్చే సరికి కనీసం 2 నుంచి 3 గంటలు సమయం పడుతుంది. సిటీలో పెరగుతున్న జనాభా, వాహనాల సంఖ్య వలన ఇంట్లో కావాల్సిన వస్తువుల కోసం బజార్కి వెళ్లి వచ్చే సరికి చాలా సమయం వృధా అవుతుంది. దాంతో పాటు రోడ్డు మీద వాహనాల రణగోణ ధ్వనులు, అస్తవ్యస్థ జీవనంలో మార్కెట్కి వెళ్లి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చినట్లే. ఇలాంటి సమయంల్లో ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్ని నేరుగా ఇంటికే వచ్చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కచ్చితంగా వస్తుంది. అలాంటి వారికోసమే ఆన్లైన్ బజార్లు వారి ముంగిటకు వచ్చాయి. ప్రస్తుతం సిటీలో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ గ్రోసరీకి డిమాండ్ బాగా పెరిగింది. ఏడాది క్రితం వరకు ఆన్లైన్ బజార్ అంటే తెలియని వారు ఇప్పుడు ఆన్లైన్ బజార్ తప్ప మరోదాని గురించి ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో సిటీలో కిరణా, నిత్యవసర వస్తువుల హోం డెలివరీ సదుపాయాలు పెరిగాయి. ఇంట్లో కావాల్సిన సబ్బుల నుంచి పప్పులు, ఉప్పులు వరకు, కరివేపాకు నుంచి కాయగూరల వరకు, పౌడర్ నుంచి పెర్ఫ్యూమ్ వరకు, ఇండియన్ బనానా నుంచి ఫారిన్ ఫ్రూట్స్ వరకు ఇలా అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ముంగిట్లోకి వచ్చేస్తున్నాయి. నాలుగు నుంచి 6 గంటల్లో.. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న ఆన్లైన్ సూపర్ మార్కెట్ స్టోర్స్, అలానే ఇతర ఆన్లైన్ ప్రొడక్ట్ సైట్స్ సుమారు 20 వరకు ఉన్నాయి. ఇందులో ఫుడ్ ఐటెమ్స్ నుంచి కిరాణా సరుకుల వరకు అన్నింటిని హోం డెలివరీ చేస్తున్నారు. అయితే కిరాణా సామాన్లు ఉదయం వేళల్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత 4 నుంచి 6 గంటల్లో నేరుగా ఇంటికి తీసుకొచ్చి వాటిని అందిస్తూ మనీ తీసుకుంటారు. అలానే 12 గంటల తర్వాత అయితే మరుసటి రోజు హోం డెలివరీ చేస్తున్నారు. ఫ్రూట్స్, ఫుడ్ ఐటెమ్స్ అయితే గంట నుంచి రెండు గంటల్లో కావాల్సిన చిరునామాకు తీసుకొచ్చి అందిస్తారు. ప్రస్తుతం సిటీల్లో నిత్యవసర సరుకులను కొనుగోలు చేసేవారిలో కనీసం 20 శాతం మంది ఆన్లైన్ బజార్ ద్వారా వారికి కావాల్సిన వస్తువులు బుక్ చేసి తెచ్చుకుంటున్నట్టు అంచనా. 3 వేల రకాల సరుకులు బిజినెస్ చేస్తున్నాం.... మేం ఆన్లైన్ సూపర్ మార్కెట్ ప్రారంభించి 9 నెలలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రజల్లో దీని మీద బాగా అవగాహన పెరగడంతో ఎక్కువగా ఆన్లైన్లో వారికి కావాల్సిన సరుకులు వివరాలు బుక్ చేసుకొని తెప్పించుకుంటున్నారు. సుమారు 3000 రకాల సరుకులు మేం ఆన్లైన్ ద్వారా కస్టమర్స్కి అందిస్తున్నాం. మా సైట్లో ఇప్పుడు సుమారు వెయ్యి మంది వరకు సబ్స్క్రైబ్ అయిన వారు ఉన్నారు. వీరంతా నేరుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని సరుకులు తెప్పించుకుంటారు. రోజుకి 3000 వరకు హోం డెలివరీ ద్వారా సరుకు అమ్ముతున్నాం. మేం లోకల్గా ఉన్న రిటైలర్స, సూపర్ మార్కెట్స్తో డీల్ పెట్టుకొని రకరకాల ప్రొడక్ట్స్ని కష్టమర్స్కి అందిస్తున్నాం. - ఏ.ఎన్.రెడ్డి, హలో బజార్ మేనేజింగ్ డెరైక్టర్ అన్ని రకాల ఫ్రూట్స్ పంపిణీ.. మేం ఇటీవలే ఆన్లైన్ ఫ్రూట్స్ హోం డెలివరీ బిజినెస్ స్టార్ చేశాం. అయితే మార్కెట్లో ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నా వాటిలో ఫ్రెషన్నెస్తో ఉన్నవి చాలా తక్కువ. అందుకే కావాల్సిన ఫ్రూట్స్ని నేరుగా కస్టమర్ వద్దకే చేర్చేందుకు ఫ్రూట్ బాక్స్ సైట్ని స్టార్ట్ చేశాం. ఈ సైట్లో నేరుగా కావాల్సిన ఫ్రూట్స్ని బుక్ చేసుకుంటే వారి ఇంటికి తీసుకెళ్లి అందిస్తాం. అలానే పార్టీ స్టైల్, డయాబిటిక్, కిడ్స్, ఆఫీస్ లకు ప్రత్యేకంగా ఫ్రూట్ బాక్స్లను డిజైన్ చేసి అంందుబాటులో ఉంచుతున్నాం. ఈ ప్యాకేజీలు కూడా నేరుగా బుక్ చేసుకోవచ్చు. మేం కస్టమర్స్కి హెల్దీ ఫ్రూట్స్ని మాత్రమే అందిస్తాం. దేశవాళీ ఫ్రూట్స్ నుంచి విదేశీ ఫ్రూట్స్ వరకు అన్ని రకాలు అందుబాటులో ఉంచుతున్నాం. - మాధురి, ఫ్రూట్ బాక్స్ మేనేజింగ్ డెరైక్టర్ -
ఆన్లైన్లో జాగ్రత్త సుమా!
తక్కువ ధరకు వస్తోంది కదా అని శ్రీనివాస్ ఆన్లైన్లో ల్యాప్టాప్ కొన్నాడు. రెండునెలలు వాడాక బాగా స్లోగా ఉండటంతో హార్డ్వేర్ నిపుణుడైన స్నేహితుడికి చూపించగా... దాన్లో నాసిరకం విడిభాగాలున్నట్లు చెప్పాడు. కంపెనీ సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్లి చూపిస్తే అది ఆథరైజ్డ్ డీలర్ వద్ద కొన్నది కాదని, వారంటీ ఇవ్వలేమని చెప్పేశారు. నచ్చకుంటే తిరిగి పంపడానికి ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన గడువు అప్పటికి పూర్తయిపోవటంతో చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు.సుకుమార్ది మరో కథ. ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. ఫోన్ బాగానే ఉంది. వారం రోజులు వాడాక మోజు తీరింది. నచ్చకపోతే తిరిగి పంపడానికి కంపెనీ ఇచ్చిన గడువింకా ఉండటంతో వెనక్కి పంపేశాడు. కంపెనీ తిరిగి తీసుకుని.. డబ్బులు ఆన్లైన్లోనే వెనక్కిచ్చేసింది. సుకుమార్కు మొబైల్ పంపిన కంపెనీ (సెల్లర్) నిజానికి పక్కాగా ఒరిజినల్ వస్తువులు పంపేదే. కానీ సుకుమార్ తిరిగి పంపేయటంతో ఆన్లైన్ కంపెనీ నిబంధనల ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ వస్తువు వాడేసింది కావటంతో పూర్తి ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. నష్టపోవటం సెల్లర్ వంతయింది. ఇవండీ ఆన్లైన్ కథలు... నిజానికివన్నీ చిన్నచిన్న సమస్యలే. తక్కువ మందికి పరిమితమైనవే. కానీ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఈ-కామర్స్ రంగంపై వీటి ప్రభావం మాత్రం తక్కువేమీ కాదు. ఈ-కామర్స్ బూమ్ను ఆసరా చేసుకుని కొందరు విక్రేతలు నాసిరకం ఉత్పత్తులను, కొత్తగా మార్చిన పాత ఉత్పత్తులను అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు ప్రొడక్టులో లోపంలేకున్నా.. నచ్చలేదంటూ వెనక్కిచ్చేస్తున్నారు. ప్యాక్లో రాళ్లు వచ్చాయనేవారు కొందరైతే... విడిభాగాలను మార్చేసే కస్టమర్లు మరికొందరు. ఇవన్నీ ఈ-కామర్స్ రంగం ముందున్న సవాళ్లు. రిటర్న్స్ పాలసీ మారాలా? ఉత్పత్తికి ఏదైనా నష్టం వాటిల్లినా, లోపమున్నా వెనక్కిచ్చి కొత్తది పొందొచ్చు. డబ్బులూ వెనక్కి పొందొచ్చు. ప్రొడక్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. విభాగం, ఈ-కామర్స్ కంపెనీనిబట్టి కస్టమర్లు 7-30 రోజుల్లో ఉత్పత్తులను వెనక్కి పంపే వీలుంది. కస్టమర్ల డబ్బులకు రక్షణ కల్పించేందుకే ఈ-కామర్స్ కంపెనీలు రిటర్న్స్ పాలసీని పాటిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే విక్రేతలు ఆ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే ఆన్లైన్ కంపెనీలు విక్రేతలకు చెల్లింపులను నిలిపివేస్తాయి. ఎలక్ట్రానిక్స్లోనే అధిక నకిలీలు... అంతర్జాతీయ బ్రాండ్ల పేరిట నాసిరకం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఈ నకిలీల వాటా 5 శాతంతో రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇది 2015లో రూ.5,600 కోట్లకు చేరుకుంటుందని ఈ మధ్య టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా చెప్పారు. నియంత్రణ లేకపోవటంతో ఇవి ఆన్లైన్లోకి చొరబడుతున్నాయి. ఉదాహరణకు రవికిరణ్ అనే కార్పొరేట్ ఉద్యోగి అలీబాబాకు చెందిన అలీ ఎక్స్ప్రెస్.కామ్లో రూ.6,500 విలువగల లెనోవో స్మార్ట్ఫోన్ బుక్ చేశారు. ఆయనకు నకిలీది రావటంతో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. విక్రేత ఆ ఫోన్తో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాడు. ఆన్లైన్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అధీకృత రిటైలర్ల వద్ద కొంటే సమస్యలుండవని సిరి కమ్యూనికేషన్స్ ప్రమోటర్ ఎం.చిరంజీవి, టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. మోసాల ప్రభావం ఇదీ... కొందరు కస్టమర్లు విడిభాగాలను మార్చి, ఉత్పత్తి బాగులేదన్న కారణంతో తిరిగి పంపేస్తారు. ఐటీ ఉత్పత్తుల విక్రయాల్లో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటివి చేస్తుండటంతో ఐటీ ఉత్పత్తుల దుకాణాలు అధికంగా ఉన్న అమీర్పేట, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ-రిటైలర్లు నో చెబుతున్నారు. ఆన్లైన్ వల్ల తమ అమ్మకాలు పడిపోయాయని, అందుకే తామూ ఆన్లైన్లోకి వెళ్లామనేది వ్యాపారి హమీద్ మాట. ఆన్లైన్ ధరల పోటీని తట్టుకోవడానికి ఒకోసారి విడిభాగాలను మారుస్తున్నట్లు అంగీకరించారాయన. ‘‘ఒరిజినల్ 2జీబీ ర్యామ్ రూ.2,500, హార్డ్ డిస్క్ 1 టీబీది రూ.4 వేల దాకా ఉంటుంది. వీటిని మార్చకపోతే మరీ తక్కువ ధరకు అమ్మటం కష్టం’ అన్నారాయన. మరో వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ... ‘‘డెల్ ఐ3 3541 మోడల్ డీలర్ ధర రూ.29,500. హైదరాబాద్లోని గ్రే మార్కెట్ వ్యాపారులకు రూ.23 వేలకే వస్తోంది. వారు ఆన్లైన్లో తక్కువ లాభానికే అమ్ముతున్నారు’’ అని చెప్పారు. తాము ఒరిజినల్ వస్తువులు విక్రయిస్తున్నా 10 శాతంపైగా వస్తువులు వెనక్కి రావడంతో ఆన్లైన్కు గుడ్బై ెప్పేశామని మొబైల్ వ్యాపారి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘ల్యాప్టాప్లు 7వేల వరకూ అమ్మితే 1500 వరకూ తిరిగొచ్చేశాయి. వీటిలో అధికం అమీర్పేట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చినవే. అందుకే ఆన్లైన్కు గుడ్బై చెప్పేశాం’’ అన్నారాయన. సీటీసీకి చెందిన 80 శాతం మంది వ్యాపారులు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ నుంచి తప్పుకున్నట్లు మరో వ్యాపారి నిజాముద్దీన్ చెప్పారు. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
ఆన్లైన్ షాపింగ్లో జాగ్రత్త...
వినియోగదారుల దినోత్సవంలో జేసీ భరత్గుప్త సూచన చిత్తూరు(సెంట్రల్): ఆన్లైన్ షాపింగ్లో విని యోగదారులు జాగ్రత్త వహించాలని జేసీ భరత్గుప్త కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ భవనంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ- కామర్స్ పై అవగాహన, అసత్య ప్రకటనలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ఆన్లైన్లో కొనుగోలుదారులను కొన్ని కంపెనీలు దగా చేస్తున్నాయన్నారు. దీని పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యారంటీ కలిగిన నాణ్యమైన వస్తువులనే కొనాలని, వాటిలో లోపాలు ఏర్పడితే వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించుకుని నష్టపరిహా రం పొందాలన్నారు. జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొని మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలన్నారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు వి.ఉషాదేవి మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు జింక్ ఫుడ్స్ వాడకాన్ని తగ్గించాలన్నారు. జిల్లా స్థాయి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ-కామర్స్ పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ విజేతలకు జేసీ భరత్గుప్తా ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు ఆయన ఈ-కామర్స్ ఆన్లైన్ షాపింగ్పై విశ్లేషణ అనే అంశంపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, పీవీకేఎన్ కళాశాల అధ్యాపకుడు దండపాణిరెడ్డి, పౌరసరఫరాల శాఖ సిబ్బంది అశోక్, కృష్ణకుమార్, శిరీషా పాల్గొన్నారు. -
హ్యాపీ ‘ఆన్లైన్’ షాపీ
పండగ సీజన్ వచ్చిందంటే దుస్తులు, ఇతర వస్తువులు కొనడానికి ఆపసోపాలు పడాల్సి వస్తుంది. షాపింగ్కి వెళ్లి, దుకాణాలన్నీ కాళ్లరిగేలా తిరగాలి. నచ్చిన వస్తువులు, దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కొనుక్కుని తిరిగి రావాలి. గ్రామీణులైతే షాపింగ్ కోసం దూరాభారమైనా, ఖర్చులు భరించి సమీపంలోని పట్టణాలకు వెళ్లాలి. ఈ కష్టాలన్నింటికీ ఇప్పుడు చక్కని పరిష్కారం దొరికింది. అదే ఆన్లైన్ షాపింగ్.. ముంగిట్లో వ్యాపార ప్రపంచం దర్శనం. పిఠాపురం :ఆన్లైన్ షాపింగ్పై ఇప్పుడు గ్రామీణులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్లల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ పొంది ఒక్క క్లిక్తో ప్రపంచంలోని ఏ వస్తువునైనా కొనేస్తున్నారు. గుండు సూది నుంచి గృహాల వరకు ఒకేచోట ప్రత్యక్షం కావడంతో కోరిన వస్తువును ఇంటికి తెచ్చుకుంటున్నారు. డబ్బు, శ్రమను ఆదాచేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ విధానం పట్టణాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు గ్రామాల్లోనూ సెల్ఫోన్, కంప్యూటర్ల వినియోగదారులు పెరిగారు. సెల్ఫోన్లలోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో యువత ఎంచక్కా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అలాగే పాత వస్తువులు అమ్ముకోవాలన్నా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనాలు ఆన్లైన్ షాపింగ్ వల్ల సమయం కలిసి వస్తుంది. దుకాణాల వెంట తిరగనక్కరలేదు. ప్రయాణ ఖర్చులు, అవస్థలూ తప్పుతాయి. ఇంటి వద్దే ఉండి కంప్యూటర్లోనో, సెలఫోన్లోనో నెట్ ఆన్చేసి వెబ్సైట్లలోని వస్తువులను చూసుకోవచ్చు. ఇంటిల్లిపాదీ చూసి నచ్చిన వస్తువును ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ శాతం కంపెనీలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. దీనివల్ల బహిరంగ మార్కెట్లో కంటే ఆన్లైన్లో వస్తువులు చౌకగా లభిస్తున్నాయి. క్రెడిట్, లేదా డెబిట్ కార్డులు ఉపయోగించి వస్తువులను కొనుక్కోవచ్చు. త్వరగా ఇంటికి వస్తాయి కూడా. కొన్ని కంపెనీలు ఉచిత డెలీవరి సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వస్తువులో లోపాలు తలెత్తితే మార్చుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి. స్నాప్డీల్, ప్లిప్కార్ట్, అమోజన్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్లైన్ వ్యాపారంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అనర్థాలు లేకపోలేదు ఆన్లైన్ షాపింగ్పై అవగాహన ముఖ్యం. వాటి గురించి తెలి యకుండా షాపింగ్ చేస్తే డబ్బు వృథాగా పోతోంది. నాసిరక వస్తువులు ఇంటికి వస్తాయి. మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఆన్లైన్లో షాపింగ్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ముందుగా నమ్మకమైన సైట్ను ఎంచుకోవాలి. చిన్న వస్తువులు, తక్కువ ధర ఉండే వాటిని కొనడం ప్రారంభించాలి. అలవాటై ఆ కంపెనీపై నమ్మకం వచ్చే వరకు అప్రమత్తత అవసరం. కొనే వస్తువు పూర్తి వివరాలు చూసుకుని బయటి మార్కెట్లో ధరతో పోల్చి చూడాలి. వారంటీ, గ్యారంటీ వివరాల విషయంలో జాగ్రత్త పాటించాలి. వస్తువు కొనే ముందు ఒకటికి రెండుసార్లు కంపెనీ గురించి తెలుసు కోవాలి. మరమ్మతులకు గురైతే ఆ కంపెనీలు ఏయే చర్యలు తీసుకుంటాయో ముందుగా తెలుసుకోవాలి. కొన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత రిపేరైతే ఆ కంపెనీల షాపులు దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మోసం జరుగుతున్నట్టు గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలి. -
క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్ట్
విదేశీయుల కార్డులే లక్ష్యం నైజీరియా దేశస్తుడి హస్తం ఖమ్మం క్రైం: నకిలీ క్రెడిట్ కార్డులతో ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ, కార్డుదారుల డబ్బును కాజేస్తున్న ముఠాను ఖమ్మం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వివరాల ను ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం... విలాసవంత జీవితం కోసం.. రాజస్థాన్కు చెందిన కునాల్ శర్మ అలియాస్ సునీల్ ఆశూజైన్, కుష్వంత్ వ్యాస్ అలియాస్ కల్ఫేష్ జైన్, మహీంద్ర సింగ్ రావ్ అలియాస్ మాలి, బవర్లాల్ చున్నీలాల్ మాలి కొంతకాలం ముంబైలో ఉద్యోగం చేశారు. ఈ నలుగురూ అక్కడ స్నేహితులయ్యూరు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఈ నలుగురు యువకులు.. ఎలాగైనా లక్షల రూపాయలు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం అక్రమ మార్గంలోనైనా వెళ్లేందుకు సిద్ధమయ్యూరు. ఈ క్రమంలోనే వీరికి నైజీరియన్ దేశస్తుడు పరిచయమయ్యూడు. అతడు అప్పటికే నెట్ ద్వారా క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్నాడు. అతడు ఈ ‘విద్య’ను వారికి నేర్పించాడు. క్లోనింగ్ ముఠాగా ఏర్పాటు.. ఈ నలుగురు యువకులు క్లోనింగ్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రధానంగా విదేశస్తుల క్రెడిట్ కార్డులనే క్లోనింగ్ చేసేవారు. విదేశస్తుల పేర్లు, వారి బ్యాంక్ క్రెడిట్కార్డుల నంబర్లను నైజీరి యన్ సేకరించి ఈ ముఠాకు పంపేవాడు. ఆన్లైన్ ద్వారా సేకరించిన క్రెడిట్ కార్డుల నెంబర్ల ఆధారంగా, మేగ్నట్ వీల్తో కూడిన స్క్రాచింగ్ మిషిన్ ద్వారా నకిలీ (క్లోనింగ్) క్రెడిట్ కార్డులను ఈ ముఠా తయారుచేసేది. ఇవి అచ్చంగా అసలు కార్డుల్లాగానే ఉంటారుు. వాటిపై ఫొటోలు మాత్రం ఈ నలుగురివి ఉంటారుు. ఆన్లైన్, ఆఫ్లైన్లో షాపింగ్.. ఈ కార్డుల ద్వారా వీరు ఆన్లైన్, ఆఫ్లైన్లో షాపింగ్ చేసేవారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఎవరో ఒకరికి అమ్మేవారు. ఆ డబ్బుతో జల్సాగా గడిపేవారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ కారు కూడా కొన్నారు. వీరు తమ అక్రమ ఆదాయంలో కొంత మొత్తాన్ని నైజీరియన్కు ‘వాటా’గా ఇస్తుంటారు. విదేశీయుల కార్డులే ఎందుకంటే.. విదేశీయుల కార్డులను మాత్రమే క్లోనింగ్ చేసేందుకు ఓ కారణముంది. రాత్రి, పగటి వేళలు మనకూ, విదేశాలకు పూర్తి భిన్నంగా ఉంటారుు. మనకు ఇక్కడ పగలు.. (కొన్ని) విదేశాలలో రాత్రి అవుతుంది. అలాగే, అక్కడ వారికి రాత్రి వేళ.. మనకు ఇక్కడ పగలుగా ఉంటుంది. ఈ ముఠా సభ్యులు మన దేశంలో పట్టపగలు మాత్రమే షాపింగ్ చేస్తుంటారు. క్రెడిట్ కార్డును స్క్రాచ్ చేయగానే.. ఎప్పుడు, ఎక్కడ షాపింగ్ చేసిందీ.. వెంటనే, కార్డుదారుడి సెల్కు మెసేజ్ వెళుతుంది. సదరు షాపు ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. ఈ మెసేజ్ వెళ్లేసరికి కార్డుదారులు నిద్రలో ఉంటారు. కాబట్టి, వారు దానిని చూసుకుని వెంటనే స్పందించే అవకాశాలు తక్కువ. అందుకే, ఈ ముఠా కేవలం పగటి వేళలోనే షాపింగ్ చేస్తుంటుంది. ఇలా పట్టుబడింది.. గత నెల 27న రాజస్థాన్ నుంచి ఈ ముఠా కారులో ఖమ్మం చేరుకుని, గాంధీచౌక్లోగల బడ్జెట్ హోటల్లో గది అద్దెకు తీసుకుంది. 28వ తేదీన ఈ ముఠాలోని కునాల్ శర్మ అనే యువకుడు.. స్టేషన్ రోడ్డులోని బిగ్-సి మొబైల్ షాపులో రెండు సెల్ ఫోన్లు కొన్నాడు. నకిలీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లించాడు. ఆ కార్డు స్క్రాచ్ చేయగానే కార్డుదారుడి సెల్ ఫోన్కు మెసేజ్ వెళ్లింది. తమిళనాడుకు చెందిన ఆ కార్డుదారుడు విదేశంలో ఉంటున్నాడు ఈ యువకుడు కార్డు స్క్రాచ్ చేసే సమయూనికి అతడు (విదేశీయుడు) తమిళనాడులోనే ఉన్నాడు. తన ఖాతా నుంచి 20వేల రూపాయలతో ఖమ్మంలోని మొబైల్ షాపులో సెల్ ఫోన్లు కొన్నట్టుగా అతడి సెల్కు మెసేజ్ వచ్చింది. అతడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వేగంగా స్పందించి, ఆ కార్డు స్క్రాచ్ చేసిన షాపునకు ఫోన్ చేసి, ఆ కొనుగోలుదారుడిని అక్కడే ఆపేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారమివ్వాలని కోరారు. ఈ షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేంత వరకు ఆ కొనుగోలుదారుడిని (కునాల్ శర్మ)ను మాటల్లోకి దింపి అక్కడే ఉండేలా చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరు హోటల్ గదికి వెళ్లేసరికి మిగతా ముగ్గురు కారులో పరారయ్యూరు. వన్ టౌన్ సీఐ రమణమూర్తి, సీసీఎస్ ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆ కారును వెంటాడి పట్టుకున్నారు. అందులోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కారు, ల్యాప్టాప్, నకిలీ క్రెడిట్ కార్డులు, వీటి తయూరీకి ఉపయోగించే స్క్రాచింగ్ మిషన్, వివిధ బ్యాంకుల పేరుతోగల ఏటీఎం కార్డులు స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో సీఐలు రమణమూర్తి, అంజలి, ఎస్ఐలు సత్యనారాయణరెడ్డి, కరుణాకర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ షాపింగ్కు ఎం-కామర్స్ దన్ను
స్మార్ట్ఫోన్ల జోరే కారణం... ముంబై: పరుగులు తీస్తున్న ఆన్లైన్ షాపింగ్(ఈ-కామర్స్) రంగాన్ని స్మార్ట్ఫోన్లు మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లనున్నాయి. స్వల్పకాలంలోనే ఎం-కామర్స్(మొబైల్స్ ద్వారా ఆన్లైన్ కొనుగోళ్లు) ఆదాయాలు పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో 70 శాతానికి చేరనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం(ట్రాఫిక్) ఇప్పటికే పర్సనల్ కంప్యూటర్ల ట్రాఫిక్ను మించిపోయిందని.. ఇదంతా స్మార్ట్ఫోన్ల వినియోగం దూసుకెళ్తుండటమే కారణమని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ చెప్పారు. దీంతో ఎం-కామర్స్ మార్కెట్ అనూహ్యంగా పెరగనుందని.. దీంతో ఈ-కామర్స్ కంపెనీలు తదనుగుణంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయన్నారు. ‘మొబైల్/ట్యాబ్లెట్ నెట్ యూజర్లు భారత్లో ప్రస్తుతం 12 కోట్లు కాగా... పీసీల్లో నెట్ వినియోగిస్తు న్న వారి సంఖ్య 10 కోట్లుగా ఉందని అంచనా. మాకు వస్తున్న ఆర్డర్లలో దాదాపు 60 శాతం వరకూ ఇప్పుడు మొబైల్స్ ద్వారానే నమోదవుతున్నాయి. ఇది అంతకంతకూ వేగం పుంజుకుంటోంది. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ వాటా 75 శాతానికి చేరొచ్చని భావిస్తున్నాం’ అని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ పేర్కొన్నారు. ఫ్యాషన్ రిటైలర్ మింత్రా డాట్కామ్ కూడా తమ ఆదాయాల్లో 70% ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎం-కామర్స్ ద్వారానే ఉండొచ్చని పేర్కొంది. ఆన్లైన్ రిటైల్(ఈ-టెయిలింగ్) పరిశ్రమ మార్కెట్ విలువ ప్రస్తుతం 3 బిలియన్ డాలర్లుకాగా, ఇందులో ఎం-కామర్స్ వాటా 30 శాతంగా ఉందని టెక్నోపాక్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అంకుర్ బిసేన్ చెప్పారు. 2020 కల్లా ఈ-టెయిలింగ్ పరిశ్రమ 32 బిలియన్ డాలర్లకు ఎగబాకనుందని.. దీనిలో ఎం-కామర్స్ వాటా 40%కి చేరవచ్చనేది ఆయన అంచనా. ఈ-కామర్స్ పరిశ్రమ క్రమంగా మొబైల్ కామర్స్గా రూపాంతరం చెందుతోందని కూడా పేర్కొన్నారు. తమ ఆర్డర్లలో ఏడాది క్రితం మొబైల్స్ ద్వారా 10% నమోదుకాగా, ఇప్పుడిది 50 శాతాన్ని మించిందని ఫ్లిప్కార్ట్ సీనియర్ డెరైక్టర్ మౌసమ్ భట్ చెప్పారు. నవంబర్లో 25 వేల కోట్ల విదేశీ నిధులు న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నవంబర్లో నికరంగా రూ. 25,500 కోట్లు(4.1 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు మొత్తం విదేశీ పెట్టుబడులు 40 బిలియన్ డాలర్లను తాకాయి. కాగా, నవంబర్లో ఎఫ్పీఐలు ఈక్విటీలకు రూ. 13,753 కోట్లను(2.23 బిలియన్ డాలర్లు) కేటాయించగా, మరోవైపు రూ. 11,723 కోట్ల(1.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. -
గూగుల్ గ్రేట్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా నిర్వహించే గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) వచ్చే నెల 10-12 తేదీల్లో జరగనున్నది. ఈ ఆన్లైన్ షాపింగ్ పెస్టివల్కు ప్రాధాన్యత భాగస్వామిగా ఆదిత్య బిర్లా మనీ మైయూనివర్శ్ వ్యవహరిస్తుంది. విదేశాల్లో సైబర్ మండే పేరుతో ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి భారత వెర్షన్గా జీఓఎస్ఎఫ్ను నిర్వహిస్తున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఈ 72 గంటల షాపింగ్ ఫెస్టివల్లో 450కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయని వివరించింది. రూ.299 స్పెషల్ సెక్షన్ను అందిస్తున్నామని, దీంట్లో భారీ డిస్కౌంట్లకు వస్తువులను అందిస్తామని, రవాణా చార్జీలు ఉచితమని, వస్తువు అందిన తర్వాతనే నగదు చెల్లించే ఫీచర్ ఉందని వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకూ ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నామని, ఈ పోటీలో గెలుపొందిన వారు 14 నిమిషాల పాటు ఉచితంగా (రూ.2.5 లక్షల విలువైనవి) షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
షాపర్స్ ఎక్స్ప్రెస్
గడప దాటకుండా అనుకున్న వస్తువును తలుపు తట్టేలా చేస్తున్నఆన్లైన్ షాపింగ్కు నెటిజన్లు ఎప్పుడో దాసోహమయ్యారు.అదే అనుకున్న వస్తువును అనుకూలమైన ధరకు లభిస్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది. వినియోగదారునికి ఆదాయాన్ని ఆదా చేసుకునే దారిని చూపిస్తోంది ‘షాపర్స్ ఎక్స్ప్రెస్’. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనల్లోంచి పుట్టిన ఈ షాపింగ్ సైట్.. వినియోగదారుడి ఖర్చు తగ్గిస్తూ ఆన్లైన్లో ఎక్స్ప్రెస్లా దూసుకుపోతోంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని బీటెక్ ఈసీఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మందడపు జీవన్, థర్డ్ ఇయర్ స్టూడెంట్ కొండా మురళీధర్.. స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ విద్యార్థులుగా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న ఈ యంగ్ తరంగ్ల ఆలోచన ఆన్లైన్ షాపింగ్పై పడింది. ఇంట్లో రోజువారీ కొనుగోళ్లు, మార్కెట్లో ఊరిస్తున్న డిస్కౌంట్లు.. ఆన్లైన్లో జరుగుతున్న బిజినెస్.. ఇవన్నీ గమనించారు. వీటన్నింటినీ లింకప్ చేస్తే ఖర్చు తగ్గించే మార్గం కనుగొన్నారు. అందుకోసం ‘షాపర్స్ ఎక్స్ప్రెస్’ వెబ్సైట్ను రూపొందించారు. http://shoppersexpress.inలో రిజిస్టర్ చేసుకుంటే చాలు సరసమైన ధరకు మీరు కోరుకున్న సరుకు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు కొసరుగా కొంత మొత్తాన్ని తిరిగి పొందవచ్చు కూడా. కొంత మాకు.. కొంత మీకు.. షాపర్స్ ఎక్స్ప్రెస్లో రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడి నుంచి మీరు అన్ని రకాల ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో లాగిన్ కావొచ్చు. ఇందులో దాదాపు 200 వరకు సైట్లలో కొనుగోళ్లు దర్జాగా చేసుకోవచ్చు. అమెజాన్, మెంత్రా, జబాంగ్, డొమినోస్, కేఎఫ్సీ వంటి జనాదరణ కలిగిన వెబ్సైట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ రీచార్జ్ మొదలుకొని మనీ ట్రాన్స్ఫర్ దాకా, దుస్తులు, గాడ్జెట్స్ కొనుగోళ్లు.. ఒకటేమిటి నిత్యావసర సరుకులూ ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నుంచి ఆన్లైన్లో మీ ఇంటికి రప్పించొచ్చు. ఈ సైట్ ద్వారా షాపింగ్ చేస్తే రిటైలర్లు.. షాపర్స్ ఎక్స్ప్రెస్కు కొంత క మీషన్ ఇస్తారు. ఇలా వచ్చిన మొత్తంలోనుంచి నామమాత్రంగా కొంత తీసుకుని మిగిలిన అమౌంట్ను వినియోగదారునికి బదిలీ చేయడం షాపర్స్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకత. రిటర్న్ అమౌంట్ చిన్నమొత్తం అయితే మీ మొబైల్లో రీచార్జ్ చేయిస్తారు. అదే కాస్త పెద్ద మొత్తమైతే నేరుగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అనతి కాలంలోనే.. వెబ్సైట్ రూపొందిన మూడు నెలల్లోనే3,500 మంది పేర్లు నమోదు చేసుకొని షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్లో 10 వేల మంది ఈ సైట్కు ఫాలోవర్స్ ఉన్నారు. మిత్రుల పరిచయాల ద్వారా ట్రిపుల్ ఐటీ, బిట్స్, సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థల్లో సైట్ ప్రచారం బాగా జరిగింది. రానున్న రోజుల్లో సైట్ విస్తృతం చేసి అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తామంటున్నారు ఈ యంగిస్థాన్లు. మిగల్చడమే లక్ష్యం.. ప్రతి ఒక్కరి షాపింగ్ ఖర్చులో కొంతైనా ఆదా చేయడమే మా షాపర్స్ ఎక్స్ప్రెస్ లక్ష్యం. చిన్నపాటి స్టార్ట్ అప్ను ప్రారంభించాం. కానీ, మూడు నెలల్లోనే ఎంతో ఆదరణ పొందింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏటా రూ.40 వేల వరకూ ఖర్చు చేస్తుంటారు. మా వెబ్సైట్ ద్వారా షాపింగ్ చేస్తే కనీసం రూ.4 వేలు మిగుల్చుకోవచ్చు. పిజ్జా మొదలుకొని ఇతర వస్తువులు మా సైట్ ద్వారా కొనుగోలు చేస్తే కాస్తో కూస్తో మిగులుతుందనే అభిప్రాయం చాలా మందికి వచ్చింది. - జీవన్, రూపకర్త టార్గెట్ లక్ష మంది మా ఇద్దరికీ వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాం. దీన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచన ఉంది. కస్టమర్ల సంఖ్య లక్షకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కేవలం విద్యార్థులే కాదు.. ఎవరైనా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరికీ మేలు జరిగే లక్ష్యంతోనే దీన్ని తీసుకొచ్చాం. - మురళీధర్, రూపకర్త ప్రజెంటేషన్: జె.రాజు/రామ్మోహన్ -
ఆన్లైన్ షాపింగ్ కోసం ఒక అడ్డా!
కూల్ సైట్ ఆన్లైన్ షాపింగ్కు అవకాశం ఇస్తున్న వెబ్సైట్లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని. మరి అన్నింటినీ తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, ఆ సైట్లను క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ను వెదుక్కోవడం కొంచెం కష్టమైన పనే! ఈ కష్టాన్ని లేకుండా చేయడానికే ఉంది క్లిప్డాట్ఇన్ (klip.in). ఆన్లైన్షాపింగ్కు సంబంధించి అన్ని వెబ్సైట్లనూ ఒక చోటికి కూర్చిపెట్టింది ఈ సైట్. దాదాపు అన్ని ఇ-కామర్స్ వెబ్సైట్లను ఇది ఒకచోటికి చేర్చింది. వాటన్నింటినీ హోమ్పేజ్లో డిస్ప్లే చేసింది. ఎంచక్కా ఈ సైట్లోకి లాగిన్ అయితే చాలు... వాటన్నింటిపైనా ఒక లుక్ వేయవచ్చు. ఆన్లైన్షాపింగ్ చేసేయవచ్చు. దీని వల్ల చాలా సౌకర్యం ఉంటుంది. ఒక వెబ్సైట్నుంచి టక్కున మరో వెబ్సైట్లోకి మారడానికి... పక్కపక్కవిండోల్లో ఒక్కోసైట్ను ఓపెన్ చేసుకొని పోల్చిచూసుకోవడానికి క్లిప్డాట్ఇన్ అవకాశం ఇస్తుంది. కావాల్సిన క్యాటగిరీ సైట్లను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వస్త్రాలు, గృహవసరాలకు తగినట్టుగా సైట్లను ఎంచుకోవచ్చు. మరి ఆన్లైన్షాపింగ్లో కొత్త అనుభవాన్ని పొందాలంటే ఒకసారి క్లిప్డాట్ఇన్ను క్లిక్ చేసేయడమే! ఫ్లికర్ నుంచి అఫీషియల్ ఐపాడ్ ఆప్ భలే ఆప్స్ నెటిజన్లు ముఖ్యంగా బ్లాగర్లు విస్తృతంగా ఉపయోగించే ఫ్లికర్ ఇమేజ్ హోస్టింగ్, వీడియో షేరింగ్ వెబ్సైట్ నుంచి ఎట్టకేలకు అధికారిక ఐపాడ్ అప్లికేషన్ కూడా విడుదలైంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ మొబైల్ ఫోన్లకు అధికారిక ఆప్లను ఇదివరకే తీసుకొచ్చిన ఫ్లికర్ తాజాగా ఐపాడ్కూ ఆప్ను విడుదల చేసింది. సింపుల్ డిజైన్తో, ఎడమవైపు చక్కని ఐకాన్ బార్తో ఫోటోల బ్రౌజింగ్కు ఎక్కువ స్థలం ఉండేలా ఈ ఆప్ రూపొందింది. ఫ్లికర్ అకౌంట్ల నుంచి లేదా ఫ్లికర్ 1టీబీ స్టోరేజీ నుంచి సైతం ఏ ఫొటోనైనా నేరుగా బ్రౌజ్ చేసుకునేందుకు దీనితో వీలు కావడం విశేషం. ట్యాబ్లెట్ ఫొటోగ్రఫీ పెద్దగా ఆసక్తికరం కాకపోయినా.. నేరుగా ఫొటోలు క్లిక్ చేసి ఫ్లికర్ అకౌంట్లో సేవ్ చేసుకునేందుకు వీలయ్యేలా కెమెరా ఇంటర్ఫేస్ కూడా దీనిలో ఉంది. తాజా ఖగోళ సమాచారానికి నాసా ఆప్ భలే ఆప్స్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసే తాజా చిత్రాలు, వీడియోలు, వార్తల గురించి తెలుసుకునేందుకు, అంతరిక్షానికి సంబంధించిన కొత్త సంగతులు, ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వివరాలు, పరిశోధనల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడే వినూత్న మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ ఆప్తో ఇంకా... నాసా మిషన్ల తాజా సమాచారం, ప్రయోగాలు, నాసా టీవీ లైవ్, థర్డ్ రాక్ ఇంటర్నెట్ రేడియో వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నాసా తాజా వార్తలు, ఫేస్బుక్ పోస్టులు, ట్వీట్లు కూడా ఈ ఆప్ ద్వారా అందుతాయి. ఆన్ డిమాండ్ పద్ధతిలో అవసరమైన వీడియోలనూ చూసేందుకు అవకాశం ఉంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ డివైస్లపై పనిచేసే ఈ ఆప్ పూర్తిగా ఉచితం. -
ఫ్లిప్కార్ట్ భారీ రియల్టీ డీల్
30 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న ఈ కామర్స్ దిగ్గజం ఏటా రూ. 300 కోట్ల కిరాయి న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్.. తాజాగా భారీ రియల్టీ డీల్కు తెరతీసింది. తమ కార్యకలాపాల కోసం బెంగళూరులో 30 లక్షల చ.అ. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి ఏటా రూ. 300 కోట్ల అద్దె చెల్లించనుంది. ఇందుకు సంబంధించి బెంగళూరుకి చెందిన రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేసింది. 90 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని ఈ డీల్ విషయంలో తోడ్పాటు అందించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అనుజ్ పురి తెలిపారు. దేశీయంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ మార్కెట్ రికవరీ బాట పడుతోందనడానికి ఈ డీల్ నిదర్శనమని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావడానికి దాదాపు ఏడాది పైగా పట్టిందని పురి చెప్పారు. మొత్తం 10 మంది డెవలపర్లను షార్ట్లిస్ట్ చేసి, చివరికి ఎంబసీ గ్రూప్ను ఎంపిక చేసినట్లు వివరించారు. అయితే, దీనిపై స్పందించడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించింది. స్నాప్డీల్, అమెజాన్ తదితర షాపింగ్ సైట్లతో పోటీపడేందుకు ఫ్లిప్కార్ట్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులను కూడా తీసుకోనుంది. చ.అ.కు నెలకు రూ. 90 అద్దె.. 30 లక్షల చ. అ. ఆఫీస్ స్థలాన్ని ఫ్లిప్కార్ట్కు దశలవారీగా లీజుకు అందచేస్తామని ఎంబసీ గ్రూప్ సీఎండీ జితు విర్వానీ తెలిపారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్కి అద్దె నెలకు చ.అ.కు రూ. 90గా ఉంటుందని విర్వానీ పేర్కొన్నారు. 24 నెలల్లో ప్రాథమికంగా 15 లక్షల చ.అ. స్థలాన్ని అందచేస్తామన్నారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో 32.5 లక్షల చ.అ.కు పెంచే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’ పేరిట ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్తో కలిసి ఎంబసీ గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఈ ఆఫీస్ స్పేస్ ఉంటుంది. -
లడ్డూ లాంటి ఆఫర్..
చెప్పుల నుంచి వజ్రాభరణాల దాకా అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నా.. ఈ లావాదేవీలపై సందేహాల కారణంగా ఈ-కామర్స్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎయిర్లాయల్ అనే సంస్థ అటు షాపింగ్ కంపెనీలను ఇటు కొనుగోలుదారులను అనుసంధానించే పనిలో పడింది. ఇందుకోసం లడ్డూ పేరుతో ప్రత్యేక యాప్ను తెచ్చింది. దీని ద్వారా వివిధ సంస్థల యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని, కొంత సేపు ఉచితంగా ట్రై చేసి చూడొచ్చు. ఇందుకు గాను కస్టమర్లకు కొంత మొత్తం రివార్డు లభిస్తుంది. ఇది సదరు కస్టమరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వాలెట్లో జమవుతుంది. ఇతర మిత్రులను రిఫర్ చేసినా కూడా కొంత మొత్తాన్ని ఎయిర్లాయల్ కస్టమర్ ఖాతాలో జమ చేస్తుంది. ఫోన్ టాక్టైమ్ లేదా డీటీహెచ్ రీచార్జ్ కోసం దీన్ని వాడుకోవచ్చు. -
పోషకాలు ఎక్కడికీ పోవిక!
వాయనం ఎక్కువగా ఉడికించినా, వేయించినా కాయగూరలు పోషకాలను కోల్పోతాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఆవిరి మీద ఉడికించిన ఆహారం బలవర్థకంగా ఉంటుందని చెబుతారు. అయితే అది ఆచరణలో కాస్త కష్టమైన పని. ఆ కష్టాన్ని తగ్గించడానికి వచ్చినవే ఈ స్టీమర్లు. కుకింగ్ స్టీమర్లుగా పిలిచే ఈ యంత్రాలను పలు కంపెనీలు తయారు చేశాయి. ఆకారం, పరిమాణం, మోడల్ని బట్టి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. కాయగూరలు, మాంసం, గుడ్లు, మొక్కజొన్నలు... ఇలా వేటినైనా సరే, ఉడకబెట్టేసుకోవచ్చు. అరలు అరలుగా గిన్నెలు ఉండటం వల్ల ఒకేసారి రెండు మూడు రకాలు ఉడికించుకోవచ్చు. అంత అవసరం లేదనుకునేవారికి ఒకే గిన్నె ఉండేవి కూడా లభిస్తున్నాయి. ఉడికించాలనుకున్న వాటిని యంత్రానికున్న గిన్నెల్లో పెట్టి, కరెంటు కనెక్షన్ ఇచ్చి, స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఆవిరి విడుదలై చక్కగా ఉడికిపోతాయి. ఎంత ఉడకాలి అన్నదాన్ని బట్టి హీట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అన్ని అరల్లోని వాటికీ ఒకే వేడి అవసరం లేదనుకుంటే, ఏ అరకు ఆ అర వేర్వేరుగా వేడిని సెట్ చేసే సదుపాయమూ ఉంటుంది. గిన్నెల్ని శుభ్రం చేసుకోవడమూ తేలికే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే దీన్ని ఇంట్లో ఉంచుకు తీరాల్సిందే! (వివిధ ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఉన్న ధరల్ని ఇచ్చాం. షాపుల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది) -
ఫ్లిప్ కార్ట్ లోకి 6 వేల కోట్లు!
బెంగళూరు: భారతదేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీగా నిధులను పెంచింది. ఆన్ లైన్ వ్యాపారంలో విపరీతమైన పోటి తలెత్తిన కారణంగా కొత్త ఇన్వెస్టర్ల గ్రూప్ తో పెట్టుబడులపై ఓ అవగాహన కుదుర్చుకోవడంతో సుమారు ఒక బిలియన్ (6 వేల కోట్లు) నిధులను సమీకరించుకుంది. అయితే నూతన ఫండ్ హోల్డింగ్ ను గోప్యంగా ఉంచింది. తాజా నిధుల ప్రవాహంతో మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ విలువ 7 బిలియన్ డాలర్ల(42 వేల కోట్లు)కు చేరుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నూతన ఇన్వెస్టర్లలో టైగర్ మేనేజ్ మెంట్ అండ్ నాస్పర్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ, ఎక్సెల్ పార్టనర్, డీఎస్టీ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, సొఫినా లు ఉన్నారు. కస్టమర్ కు మెరుగైన సేవలందించుటకు కొత్తగా సమకూర్చుకున్న నిధులను ఆన్ లైన్, మొబైల్ సర్వీసెస్, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్ సేవలందిస్తోంది. -
ఆన్లైన్ స్టోర్స్లో పెట్టుబడుల ‘క్లిక్’
జోరే కారణం.. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం జోరు, ఖర్చుచేసే మధ్యతరగతి వర్గాలు పెరుగుతుండటం... యువత ఆన్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతుండటంతో భారత్లోనూ ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది. ప్రస్తుతం దేశీ ఈ-కామర్స్ మొత్తం మార్కెట్ విలువ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇందులో ఈ-రిటైలింగ్ పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,000 కోట్లు)గా ఉంది. ఇది 2018 నాటికి ఏడింతలకు పైగా ఎగబాకి 22 బిలియన్ డాలర్లకు చేరవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. అపార అవకాశాలు... ఈ-కామర్స్ మార్కెట్ను మరీ ఎక్కువచేసి చూపుతున్నారన్న వాదనలు ఉన్నప్పటికీ.. స్టార్టప్లలో పెట్టిన పెట్టుబడులను ప్రస్తుతం వాటి వ్యాపారాలు, వేల్యుయేషన్స్తో పోలిస్తే చాలా చౌకగానే భావించవచ్చని కలారి క్యాపిటల్ అనే వీసీ సంస్థ అంటోంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిలియన్ డాలర్ల(రూ.6,000 కోట్లు) ఆదా య మైలురాయిని అధిగమించగా... ఢిల్లీకి చెందిన మరో ఈ-రిటైలింగ్ అగ్రగామి స్నాప్డీల్ కూడా ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల అమ్మకాల మార్కును అందుకోనుంది. గతేడాది ఈ-కామర్స్ పరిశ్రమ 50 కోట్ల డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఏడాది పెట్టుబడులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. భారత్లోని టాప్-15 ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్ 4.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా మింత్రాను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసిన డీల్లో ఇన్వెస్టర్లకు 5-10 రెట్ల లాభాలు వచ్చినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, కొందరు విశ్లేషకులు మాత్రం మార్కెట్తో పోలిస్తే ప్రస్తుతం కంపెనీల వేల్యుయేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని భిప్రాయపడుతున్నారు. అన్లిస్టెడ్ సోషల్నెట్వర్కింగ్ అప్లికేషన్(యాప్) వాట్స్యాప్ను ఫేస్బుక్ ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంత ఎక్కువ వేల్యుయేషన్కు భారీగా యాక్టివ్ వినియోగదారుల సంఖ్య, భవిష్యత్తులో మరింత వ్యాపార విస్తరణకు అవకాశమే కారణం. ఇప్పుడు మన ఈ-కామర్స్ కంపెనీల వేల్యుయేషన్స్ పెరగడానికి ఇలాంటి అంశాలే దోహదం చేస్తున్నాయనేది నిపుణులు మాట. విస్తరిస్తున్న వ్యాపారం.. ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్బాస్కెట్ రూ.240 కోట్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లు(రూ.6,000 కోట్లు) ఉంటుందని తాజా అంచనా. టీవీ, ఆన్లైన్ షాపింగ్స్టోర్ నాప్తోల్ కూడా సుమారు రూ. 240 కోట్లను ప్రైవేటు ఈక్విటీ(పీఈ)/వెంచర్క్యాపిటల్(వీసీ) ఫండ్స్ నుంచి సమీకరించాలని భావిస్తోంది. ఫ్లిప్కార్ట్లో డీఎస్టీ గ్లోబల్ అనే పీఈ సంస్థ ఫ్లిప్కార్ట్లో తాజాగా 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే టైగర్ గ్లోబల్, నాస్పెర్స్, ఐకోనిక్ క్యాపిటల్ ఫ్లిప్కార్ట్లో వాటాదారులుగా ఉన్నాయి. సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్న దేశీ ఈ-కామర్స్ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతోంది. అత్యంత ఆకర్షణీయమైన స్టార్టప్ పరిశ్రమగా నిలుస్తున్న ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజూ కనీసం రెండు కొత్త ఈ-రిటైలింగ్ వెంచర్లు పుట్టుకొస్తుండటమే దీనికి నిదర్శనం. అత్యుత్తమ పనితీరు, ఆదాయాల జోరున్న ఆన్లైన్ రిటైల్ కంపెనీల్లో డాలర్లను మరింతగా కుమ్మరించేందుకు ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ ముందుకొస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల వేల్యుయేషన్స్(విలువ) కూడా అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. ఆయా కంపెనీలపై ఆన్లైన్ కస్టమర్లు ఉంచుతున్న భరోసాయే దీనికి దోహదం చేస్తోంది. -
కూపన్లతో చౌకగా షాపింగ్..
ఏవో కొన్ని మినహా.. సాధారణంగానే బైటి షాపులతో పోలిస్తే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చౌకగా వివిధ రకాల ఉత్పత్తులను అమ్ముతుంటాయి. ఈ రేట్లపై మరికాస్త డిస్కౌంటు పొందే మార్గాల్లో కూపన్లు కూడా ఒక మార్గం. కూపన్నేషన్డాట్ఇన్, కూపన్దునియాడాట్కామ్ లాంటి వెబ్సైట్లు తమ సైటు ద్వారా షాపింగ్ చేసే వారికి ఇటువంటి సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ వెబ్సైట్లలో కూపన్ కోడ్స్ ఉంటాయి. వీటిని కాపీ చేసి.. మనం కొనుగోలు చేస్తున్న వెబ్సైట్లోకి వెళ్లి, షాపింగ్ చేసే వస్తువు దగ్గర కూపన్ కోడ్ అని రాసి ఉన్న చోట పేస్ట్ చేయాలి. దీంతో ఆయా ఉత్పత్తులపై అదనంగా మరికాస్త డిస్కౌంటు లభిస్తుంది. అయితే, ఈ కూపన్లు ఏయే ఉత్పత్తులకు, ఎప్పటిదాకా వర్తిస్తాయో చూడాలి. -
ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న డిమాండ్
-
ఆకర్షిస్తున్న ఆన్లైన్ షాపింగ్
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్... తదితర అంశాలు ఆనలైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. ఈ అంశాల కారణంగా వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని క్యాష్బ్యాక్, కూపన్ల సైట్ క్యాష్కరోడాట్కామ్ తెలిపింది. ఈ సంస్థ 3,200 మంది ఆన్లైన్ షాపర్లపై నిర్వహించిన ది ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..., దరలు తక్కువగా ఉండడం, ఇంట్లో ఉంటూనే షాపింగ్ చేసే వీలుండడం.. వంటి అంశాలు కూడా ఆన్లైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. క్యాష్బ్యాక్ ఆఫర్ తమను ఆకర్షించిందని సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది చెప్పారు. భారీ డిస్కౌంట్ల కారణంగా ఆన్లైన్ షాపింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని 27 శాతం మంది పేర్కొన్నారు. తక్కువ ధరల కారణంగా ఆన్లైన్ షాపింగ్కు ఆకర్షితులవుతున్నామని 25 శాతం మంది వివరించారు. సౌకర్యం దృష్టికోణంలో ఇంటర్నెట్ ద్వారా షాపింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నామని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని 16 శాతం మంది, నచ్చకపోతే వస్తువులు తిరిగి ఇచ్చే విధానం బావుండటంతో 10 శాతం మంది ఆన్లైన్ షాపింగ్కు జై కొడుతున్నారు. 40 శాతం మంది సగటున ఏడాదికి రూ.10,000 చొప్పున ఆన్లైన్ షాపింగ్ చేస్తుండగా, దాదాపు 10 శాతం మంది సగటున ఏడాదికి రూ.50,000 చొప్పున షాపింగ్ చేస్తున్నారు. వస్తువును ఎంచుకునేందుకు ధర అంశానికి ప్రాధాన్యత ఇస్తామని 30 శాతం మంది, వస్తువు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండడంతో భారత ఇ-కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది. సమీప భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య 20 కోట్లకు సులభంగానే చేరుతుంది. 2013లో భారత ఇ కామర్స్ మార్కెట్ 33 శాతం వృద్ధితో రూ.62,967 కోట్లకు చేరిందని అంచనా. -
దుకాణం: ఆన్లైన్ షాపింగ్ భయాలు !
భారత జనాభా 120 కోట్లు. సంఖ్యలో రెండో స్థానం. అక్షరాస్యత కూడా మరీ తక్కువేం కాదు. కానీ... ఇండియాలో జరిగే ఆన్లైన్ షాపింగ్ మాత్రం చాలా తక్కువ. ఎందుకు? కారణాలు అనేకం. భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు...! అయితే వీటిల్లో వాస్తవం ఎంత? ఆన్లైన్ షాపింగ్ మొదటి ఉపయోగం... కాలు బయటపెట్టాల్సిన అవసరం ఉండదు. పెరుగుతున్న పనివేళలు, ప్రయాణ సమయాలు, ట్రాఫిక్ల నుంచి తప్పించుకునే పెద్ద అవకాశం ఇది. షాపింగ్ చేయడం ఒక వినోదమే గానీ ప్రతి వస్తువు కొనుగోలులో అలాంటి ఆనందమే ఉండదు. మాల్కు వెళ్లి బట్టలు కొనడం ఆనందమే గాని, కొట్టుకు వెళ్లి నూనె కొనడం ఎవరికి ఆనందం చెప్పండి. అందుకే ఆన్లైన్ షాపింగ్కు ఆదరణ మొదలైంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఇంకా చాలామందిలో ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిఉన్నాయి. భయాలు ఆన్లైన్లో డబ్బు చెల్లించడంపైన ఇండియాలో ఇప్పటికీ చాలామందికి భయాలున్నాయి. క్రెడిట్ కార్డు వివరాలు, బ్యాంకు వివరాలు అందులో నమోదు చేస్తాం కాబట్టి భవిష్యత్తులో మన కార్డుకు లేదా అకౌంట్కు భద్రత ఉంటుందా? డబ్బు కట్టాక వస్తువు మనకు రాకపోతే ఏం చేయాలి? ఎవరినడగాలి? ఒకవేళ అది వచ్చినా ఆ వివరాలతో మనకు సంబంధం లేనివి మన అకౌంట్లో డబ్బులు తీసుకుని అంటగట్టేస్తారా? వీటన్నింటికీ ఒకటే సమాధానం. నమ్మకమైన వెబ్సైట్లలో షాపింగ్ చేస్తే ఈ భయాలు ఏవీ ఉండవు. మీ ఆర్థిక లావాదేవీ సమాచారం వారి దగ్గర భద్రపరుచుకోరు. ట్రాన్షాక్ష న్స్ అన్నీ అకౌంట్ టు అకౌంట్ కాబట్టి మీ సొమ్ము ఎక్కడికీ పోదు. ట్రాన్షాక్షన్ ఫెయిలైనా కొన్ని రోజుల్లో మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఈ విషయంలో మీకు సాయం చేయడానికి అటు వెబ్సైట్ కాల్సెంటర్/బ్యాంకు వాళ్లు పూర్తి సాయం చేస్తారు. మీ వస్తువు ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం కావచ్చునేమో గాని బుకింగ్ మీకు చేరకపోవడం అంటూ ఉండదు. ఏ వస్తువు కొన్నా అది ఎపుడు, ఎలా వస్తుందన్న వివరాలన్నీ మీకు అందుబాటులో ఉంచుతారు. అనుమానాలు వస్తువుల నాణ్యత ఉత్పత్తి చేసే కంపెనీని బట్టి ఉంటుంది. ప్రముఖ కంపెనీ వస్తువులు ఉదా: ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మీరు బయట దుకాణాల్లో కొంటే ఎంత నాణ్యతగా ఉంటాయో ఆన్లైన్ స్టోర్లలో కొన్నా అంతే నాణ్యతగా ఉంటాయి. కొన్ని లోకల్ ఉత్పత్తులు లేదా బ్రాండ్ లేని వస్తువులు కొనేటపుడు మాత్రం... బాగా పేరుమోసిన ఆన్లైన్ స్టోర్లలోనే కొనాలి. టీవీలో ప్రకటనల్లో వచ్చేవన్నీ ఫేమస్ అని, టీవీల్లో రానివి ఫేమస్ కాదని మీరు భావించొద్దు. నమ్మకమైన వెబ్సైట్స్ను తెలిసిన వారి ద్వారానో లేదా గూగుల్లో టాప్ 10, టాప్ 20 సైట్స్ అని వెతికి గాని తెలుసుకోవచ్చు. అప నమ్మకాలు ఆన్లైన్లో కొంటే ధర ఎక్కువనీ, వస్తువు పాడైనది వస్తే తిరిగి పంపలేమనీ, వస్తువు ఇంటికి రాదనే భయాలు వదిలేయండి. ఇపుడున్న టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పు చేసి అంత సులువుగా తప్పించుకునే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆన్లైన్లో కొంటే అసలు ధర తెలుస్తుంది. మీరు ఒకటీవీ కొనాలనుకుంటే ఆ టీవీ మోడల్ తెలుసుకుంటే అది బయట ఎంత ఉందో, ఏ సైట్లో ఎంత ధర ఉందో సులువుగా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ప్రముఖ కంపెనీ టీవీ అయితే ఎక్కడ కొన్నా మీకు నాణ్యతలో తేడా ఉండదు. తక్కువ ధర ఉన్న వెబ్సైటు ఏదైనా కనపడితే మీరు కనుక్కున్న నమ్మకమైన సైట్ల జాబితాలో అది ఉంటే అక్కడ కొనేయడమే. భారీ ఉపయోగాలు: ఆన్లైన్లో వినియోగదార్ల సంఖ్య పెంచుకోవడానికి ఆయా నిర్వహకులు లాభం కాస్త తగ్గించుకుని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రతి వస్తువుపై ఇస్తున్నారు. ఉప్పు పప్పు మొదలుకొని బంగారం వరకు అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఆన్లైన్ షాపింగ్లో అతి వేగంగా అమ్ముడవుతున్నవి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్త్రీల దుస్తులు, ఇమిటేట్ జువెలరీ ఉన్నాయి. బయట కొనడానికి మొహమాటపడే రొమాంటిక్ లో దుస్తులు, కండోమ్లు వంటివి ఆన్లైన్లో విపరీతమైన వృద్ధిని నమోదుచేస్తున్నాయి. బయటషాపింగ్కు, ఆన్లైన్ షాపింగ్కు ఒక పెద్ద తేడా ఉంది. ఎంత పెద్ద షాపింగ్ మాల్కు వెళ్లినా మీకు అక్కడ దొరికే మోడల్స్ కంటే ఎక్కువ మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక్కడయితే ఒకదాన్నుంచి ఇంకో స్టోరుకు మధ్య దూరం ఒక్క క్లిక్. అదే మీరు ఒక షాపింగ్ మాల్లో నచ్చకపోతే ఇంకోదానికి వెళ్లాలంటే....గంటలు వృథా, ప్రయాస!