parineeti chopra
-
ఓటీటీకి ఓకే
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతీ చోప్రా డిజిటల్ ఎంట్రీ ఖరారైపోయింది. హిందీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్కు ఓకే చెప్పారామె. తాహిర్ రాజ్ బాసిన్, అనూప్ సోనీ, జెన్నిఫర్ వింగెట్, చైతన్య చౌదరి ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.‘రంగ్ దే బసంతి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి సినిమాలకు రైటర్గా, ‘కుర్భాన్, అంగ్లీ’ సినిమాలకు దర్శకుడిగా పని చేసిన రెన్సిల్ డి. సిల్వా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా, సప్నా మల్హోత్రా ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. సిమ్లా నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ‘‘నా తొలి వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పరిణీతి. -
పరిణితి చోప్రా సరికొత్త లుక్స్.. ఫొటోస్ తో చిచ్చురేపుతుందిగా !
-
యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అందుకే యానిమల్ రిజెక్ట్ చేశాపరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్సినిమాకాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్జోత్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్ఫ్లిక్స్లో రిలీజైంది.చదవండి: విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్ -
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
మాల్దీవుస్లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు చివరికీ ఏడడుగులు వేశారు.(ఇది చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)ఇటీవల తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా పరిణితీ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త రాఘవ్తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by @parineetichopra -
ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్ రెండేళ్ల క్రితం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అదంతా ఆయన ఒక యాడ్ కోసం చేసుంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ దుస్తులు గురించి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్' అనే సినిమాతోనే పరిణీతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో కూడా నటించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్వీర్ సింగ్ ఒంటి మీద దుస్తులు కూడా ఉంచుకోడని చెప్పి షాకిచ్చింది.అలాంటి సమయంలో కూడా దుస్తులు వేసుకోడు'రణవీర్తో నాకు మంచి స్నేహం ఉంది కాబట్టి అతను చేస్తున్న పనులకు నేను కూడా బాగా అలవాటు పడ్డాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ దుస్తులతో వచ్చి ఈరోజు ఇదే లుక్ అంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. అబ్బా.. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. నేను ఇతరుల మేకప్ వ్యాన్లోకి సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ ఉన్న వ్యాన్లోకి వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించి అతని అనుమతి తీసుకుంటాను. దానికి కూడా కారణం ఉంది. తను నిద్రపోతూ ఉంటాడో లేదా వాష్రూమ్లో ఉంటాడో అని కాదు.. బట్టలు వేసుకున్నాడో లేదా అని తెలుసుకుని వెళ్తాను. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ, బట్టలు లేకుండా ఎదురుగానే నిలబడి ఉంటాడు. కానీ, అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు. అలాగే సమాధానం ఇస్తాడు.' అని పరిణీతి సెట్లో అనుభవాలు పంచుకుంది.ఒకసారి రొమాంటిక్ సీన్ చేస్తుంటే..దుస్తులు లేకుండా చూస్తే రణవీర్ ఏమాత్రం ఫీల్ అవ్వడు.. కానీ, ఆ సమయంలో మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే.. తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు కదా.. అలాంటప్పుడు ఎందుకంత బాధ అని చెబుతాడు. ఒకసారి రొమాంటిక్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండానే రణవీర్ సెట్లో కనిపించాడు. ఇలాంటి సీన్లో నాకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్లో ఉన్నట్లు కనిపించాలని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడు. నేను ఆయన రూమ్లోకి వెళ్లిన ప్రతీసారి బట్టలు లేకుండానే కనిపించేవాడు. నా ముందే కాదు.. తను పబ్లిక్లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద విషయం కాదు. అని పరిణీతి చెప్పింది. రణవీర్, పరిణీతి చోప్రాల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే ఇవన్నీ చెబుతున్నట్లు ఆమె పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు తాను చేసినందుకు రణవీర్ పెద్దగా పట్టించుకోడని కూడా తెలిపింది. తాజాగా అమర్ సింగ్ చంకీలా సినిమాలో పరిణీతి మెప్పించిన విషయం తెలిసిందే. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్లో ఉదయపూర్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
బ్లాక్ అండ్ వైట్ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి. తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్లో భాగంగా పరిణితి బ్లాక్ అండ్ వైట్ చీరలో గ్లామరస్ లుక్లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్బ్లౌజ్ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి. చాలా సింపుల్గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. View this post on Instagram A post shared by @parineetichopra (చదవండి: గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్పోర్ట్కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
సింగర్ అవతారమెత్తిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా సినీ ప్రియులకు సుపరిచితమైన పేరే. గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ముద్దుగుమ్మ సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ భామ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్గా అలరించిన పరిణీతి ప్రస్తుతం సింగర్గా మారిపోయింది. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టూడియోలో పాట పాడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. పరిణీతి తన ఇన్స్టాలో రాస్తూ.. 'నాకు సంగీతం ఎప్పటికీ సంతోషకరమైన ప్రదేశం. నా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకేసారి రెండు కెరీర్లు చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. అందుకే ఇక్కడ నాకు తెలియని వాటిని నేర్చుకోవడం, నాలో భయాలన్నింటినీ తొలగించుకుని.. నా తొలి గానం ప్రారంభించా. దీనికోసం నేను ఉత్తమ సంస్థతో చేతులు కలిపా. ఈ ఏడాది మొత్తం మీ కోసం కొన్ని అద్భుతాలు సృష్టించబోతున్నా. మీరు కూడా దీని కోసం నాలాగే ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ వీడియోలో పరిణీతి పాడిన ఈ పాట'మాన కే హమ్ యార్ నహీ' అనే పాట ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన 2017 రొమాంటిక్ మూవీ 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలోనిది. అయితే పరిణీతి ఇంతకుముందే మనోజ్ ముంతషిర్ రాసిన దేశభక్తి పాట 'తేరి మిట్టి' మహిళా వర్షన్ను అలపించింది. ఈ సాంగ్ అక్షయ్ కుమార్, పరిణీతి నటించిన 2019 యుద్ధ చిత్రం 'కేసరి'లో ప్రదర్శించారు. అంతే కాకుండా 35 ఏళ్ల బాలీవుడ్ భామ తన డిస్కోగ్రఫీలో 'మత్లాబి యారియన్' ట్రాక్ను కూడా కలిగి ఉంది. ఈ పాట మిస్టరీ థ్రిల్లర్ 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' అనే చిత్రంలోనిది. ఇందులో పరిణీతి, అవినాష్ తివారీ, అదితి రావ్ హైదరీ నటించారు. కాగా.. గతేడాది సెప్టెంబర్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన పరిణీతి.. తన పెళ్లి పాట 'ఓ పియా' కూడా పాడింది. కాగా.. ప్రస్తుతం ఆమె 'అమర్ సింగ్ చమ్కిలా' అనే చిత్రంలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra -
తలకిందుల భంగిమలో అనసూయ.. పెళ్లి జ్ఞాపకాల్లో స్టార్ హీరోయిన్
తలకిందులుగా యాంకర్ అనసూయ పోజులు చీరలో క్యూట్నెస్తో చంపేస్తున్న ఈషా రెబ్బా సెల్ఫీ మోడ్లో బంగార్రాజు భామ దక్షా నగర్కార్ ఆకు పచ్చని చీరలో మత్తెక్కిస్తున్న పూజాహెగ్డే పెళ్లి జ్ఞాపకాల్లో హీరోయిన్ పరిణీతి చోప్రా పింక్ డ్రస్లో మెరిసిపోతున్న మెగా డాటర్ నిహారిక జిమ్ వర్కౌట్ లో బిజీబిజీగా బిగ్బాస్ బ్యూటీ దివి బికినీలో హీరోయిన్ పూనమ్ బజ్వా పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
Birthday Special: ట్రెండీ లుక్స్లో పరిణీతి చోప్రా.. బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
Parineeti Chopra: ట్రెండింగ్లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా రేర్ ఫోటోలు
-
Parineeti Chopra: పెళ్లయ్యాక తొలిసారి ర్యాంప్వాక్ చేసిన పరిణీతి చోప్రా (ఫొటోలు)
-
పెళ్లై నెల కాలేదు..
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గత కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంది. ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్ధాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినిమాల కన్నా.. ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా ఆమె మారింది. దీంతో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తుంది.(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీలు,రెస్టారెంట్లు అంటూ ఎంజాయ్ చేశారు. అలా పలుమార్లు కెమెరాల కంట కనిపిస్తూ ట్రెండ్ అయ్యారు. ఇలా వారిద్దరూ వైరల్ అయ్యాక కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత పరిణితి చోప్రా హానీమూన్ ప్లాన్ను గ్రాండ్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు.కానీ ఎవరూ ఊహించిని విధంగా భర్త లేకుండానే మాల్దీవుల వెకేషన్కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. కానీ ఆమె ఈ వెకేషన్కు తన మరదలతో వెళ్లినట్లు ఆమె ఇలా చెప్పుకొచ్చింది. 'నేను హానిమూన్కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్' అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి అంటూనే పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra -
ఆస్కార్ రేసులో...
ఆస్కార్ రేసులో హిందీ చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ రాణిగంజ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఇంజనీర్ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్ సింగ్ గిల్గా అక్షయ్ కుమార్ నటించారు. ఇక 96వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్గా ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం యూనిట్ దరఖాస్తు చేసిందని బాలీవుడ్ టాక్. ఇదే తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో నిలిచి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్ రాణిగంజ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? నామినేషన్ దక్కించుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్లు స్పెషల్ ఎట్రాక్షన్గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్లో అక్షయ్ కుమార్తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
పెళ్లిలో ఆలియా భట్ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్ లీలా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్ఫిట్లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్గా, పేస్టల్ కలర్స్లో నేచురల్గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్ఫిట్లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
Parineeti Chopra-Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా,రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు
-
పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ లీలా ప్యాలెస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరిగిన వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. (ఇదీ చదవండి: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?) ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. దీంతో ఈ ఫోటోలను వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో వారి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేయనున్నారు. ఈ వేడుకకి ఇరు కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్ల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు కొత్త జంట రాగ్నీతీ (రాఘవ్, పరిణీతి)లను ఆశీర్వదించారు. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్లో వివాహ రిసెప్షన్ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ లీలా ప్యాలెస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్లో వివాహ రిసెప్షన్ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్కు మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది. సంగీత కచేరీకి హాజరు పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident) -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్పూర్లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్లో ఎట్రాక్షన్గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రితియా జ్యువెల్స్ను శనివారం బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ట్రెడిషినల్ నగలు అంటే ఎంతో ఇష్టమని వాటిని ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటానని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కాంతి దత్, ప్రీతమ్ జుల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ కాగా.. తాజాగా పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!) 2013లో ఆమె నటించిన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ పదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను తలుచుకుంటూ ఇన్స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. పరిణీతి తన ఇన్స్టాలో రాస్తూ.. అవును నిజమే.. కాలం ఎగురుతుంది! దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం. అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను ఇంకా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు.' అంటూ పోస్ట్ చేశారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్పుత్లతో పాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మ నటించారు. (ఇది చదవండి: 17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by @parineetichopra -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్లో గ్రాండ్గా రిసెప్షన్ బాష్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్
స్టార్ హీరోయిన్ పెళ్లి అంటే హడావుడి మాములుగా ఉండదు. బ్యాచిలర్ పార్టీ, షాపింగ్, ప్రిపరేషన్.. ఇలా చాలా పనులతో బిజీగా ఉంటారు. అయితే కొందరు మాత్రం మ్యారేజ్ కి ముందు దేవుడు-పూజలు లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా అలానే కాకపోతే ఈమెకు తోడు కాబోయే భర్త కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి దైవభక్తిలో మునిగి తేలుతుండటం విశేషం. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) హీరోయిన్ పరిణితీ చోప్రా.. హిందీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి పేరు తెచ్చుకుంది. గతేడాది ఓ రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ.. ప్రస్తుతం మరో రెండు మూవీస్లో నటిస్తోంది. ఓవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మేలో ఆప్ పార్టీ నాయకుడు రాఘవ చద్దాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాలేజీ రోజుల నుంచే వీళ్లిద్దరూ లవ్లో ఉన్నప్పటికీ నిశ్చితార్థంతో వీళ్ల రిలేషన్ బయటపడింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ల పెళ్లి గురించి గాసిప్స్ వచ్చాయి. అయితే కొన్నిరోజుల ముందు మాత్రం తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 25న వెడ్డింగ్ జరగనుంది. దానికంటే ముందే పరిణితీ.. కాబోయే భర్త రాఘవ్ చద్దాతో కలిసి ఉజ్జయిని వెళ్లింది. మహంకాళేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. వాటిపై మీరు ఓ లుక్ వేసేయండి. (ఇదీ చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) Wedding soon? #ParineetiChopra and #RaghavChadha offer prayers at Ujjain’s Mahakaleshwar Temple 🙏🏻 #Pinkvilla pic.twitter.com/kPPnyH10Gv — Pinkvilla (@pinkvilla) August 26, 2023 आप सांसद राघव चड्ढा और उनकी मंगेतर, अभिनेत्री परिणीति चोपड़ा ने उज्जैन के महाकाल मंदिर में पूजा की 🙏🙏#raghavchadha #parineetichopra#mahakal pic.twitter.com/JPXsRGUxfg — Jahnvi Sharma (@Jahnvish999) August 26, 2023 -
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొత్త అవతారం!
న్యూఢిల్లీ: ఇతర బాలీవుడ్ తారల బాటలో పరిణీతి చోప్రా సైతం అడుగులు వేస్తున్నారు. తాజాగా వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ క్లెన్స్టాలో ఇన్వెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ ద్వారా ఈ అంశాన్ని పేర్కొన్నప్పటికీ పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. వెరసి బ్యూటీలో 82ఈ, క్లాతింగ్లో ఎడ్ ఏ మమ్మా, మేకప్ విభాగంలో కే బ్యూటీ బ్రాండ్ల ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకున్న దీపికా పదుకొణే, అలియా భట్, కత్రినా కైఫ్ బాటలో పరిణీతి చోప్రా సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో పునీత్ గుప్తా ప్రారంభించిన డీటూసీ స్టార్టప్ క్లెన్స్టా.. వాటర్లెస్ పర్సనల్ హైజీన్ ప్రొడక్టును తయారు చేస్తోంది. ఇతరులెవరూ రూపొందించని ప్రొడక్టును తయారు చేస్తున్న క్లెన్స్టా బ్రాండులో ఇన్వెస్టర్గా, భాగస్వామిగా చేరినందుకు ఉత్సాహపడుతున్నట్లు ఈ సందర్భంగా ఇన్స్ట్రాగామ్ ఖాతాలో పరిణీతి చోప్రా పేర్కొన్నారు. -
కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన బాలీవుడ్ నటి
-
అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!
ఆమె బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత నెలలో ఈమెకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుబోతుంది. అలాంటి ఆమె.. ఇప్పుడు సడన్ గా ఓ చోట ప్రత్యక్షమైంది. కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా బ్యూటీ? బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలుసు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేసరి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'చమ్కీలా' అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో కలిసి 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) రాఘవ్తో పెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రాకు పెళ్లి కుదిరింది. గత కొన్నేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా, బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. గత నెలలో అంటే మే 13న వీళ్లకు నిశ్చితార్థం జరిగింది. దీనికి కొన్ని రోజుల ముందు మాత్రమే.. ఈ జంట గురించి న్యూస్ బయటకొచ్చింది. త్వరలో రాజస్థాన్ లో వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. గోల్డెన్ టెంపుల్లో త్వరలో పెళ్లి చేసుకోనున్న పరిణీతి-రాఘవ్.. శనివారం ఉదయం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ని కనిపించారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవాలయంలో రాఘవ్-పరిణీతి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్కి అక్క?) -
మీ పెళ్లికి పిలుస్తారా?.. లిఫ్ట్లో హీరోయిన్కు ఆసక్తికర ప్రశ్న!
బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతకుముందే చాలాసార్లు రెస్టారెంట్, ఎయిర్పోర్టుల్లో జంటగా కెమెరాల కంటికి చిక్కారు. మే 13న దిల్లీలోజరిగిన పరిణీతి చోప్రా నిశ్చితార్థం వేడుకలో సోదరి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. (ఇది చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్కు హాజరైన పరిణితీ అభిమానులతో ముచ్చటించారు. పరిణితీ చోప్రాను ఉద్దేశించి మీ పెళ్లి ఎప్పుడు మేడం? మమ్మల్ని పిలుస్తారా? అంటూ ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు నవ్వుతోనే సమాధానమిచ్చింది. మరొకరు ప్రశ్నిస్తూ.. మీ పెళ్లి జీవితం ఎలా ఉంది? అని అడగ్గా.. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు' అంటూ పరిణితీ సమాధానమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. అయితే వారితో మాట్లాడుతుండగా పరిణీతి చోప్రా లిఫ్ట్ లోపల ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) View this post on Instagram A post shared by @varindertchawla -
ఓవల్లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్లోని ఓవల్లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా ) ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) View this post on Instagram A post shared by 😍 PARINEETI ADDICTED 😍 (@parineetigalaxy) -
ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో పలుమార్లు కెమెరాలకు చిక్కారు. వీరి రిలేషన్షిప్పై ఎన్నిసార్లు అడిగినా స్పందించని ఈ లవ్బర్డ్స్ ఎంగేజ్మెంట్ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ వీడియో ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పరిణీతి తల్లి రాఘవ్ గురించి చెబుతూ.. అతను చాలా మంచివాడని, తండ్రి తర్వాత పరిణీతిని రాఘవ్ చాలా బాగా చూసుకోగలడన్న నమ్మకం తమకు సంపూర్తిగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పరిణీతి ఎమోషనల్ కాగా, రాఘవ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా?
Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి. ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్వర్త్ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి, నికర ఆస్తులు చాలా తక్కువ. చిన్న ఇల్లు, పాత కారు.. రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు. సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు. ఇక కార్ల విషయానికి వస్తే.. రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ మాత్రమే. ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు. పరిణీతి నెట్వర్త్ రూ. 60 కోట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్వర్త్ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by @parineetichopra ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
గ్రాండ్గా పరిణీతి- రాఘవ్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కపుర్తలా హౌస్ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్ మ్యాచ్లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by @parineetichopra చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే.. -
Parineeti Chopra : పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు
ఎంగేజ్మెంట్ రోజునే ఓ నాయకుడి పార్టీ కూడా ఘన విజయం సాధించడం అనేది అత్యంత అరుదైన సందర్భం. అలాంటి అరుదైన ఘటన ఆప్ నేత దక్కించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్లో ఆప్ నాయకుడు రాఘవ్ చద్ధా, నటి పరిణీతి చోప్రాతో ఎంగేజ్మెంట్ శనివారం జరిగనుంది. ఇదే రోజు ఆయన పార్టీ కూడా భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో తనకు ఈ రోజు మరింత ప్రత్యేకమని ఆనందంగా చెబుతున్నారు రాఘవ్ చద్దా. ఈ ఫంగ్షన్కి దంపతుల కుటుంబ సభ్యులు, సన్నిహితుల తోసహా 150 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకకు పరిణీతి కజిన్ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కూడా హాజరుకానున్నారు. సరిగ్గా ఈ రోజే జలంధర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ మేరకు రాఘవ్ చద్దా ట్విట్టర్ వేదికగా..ఈ రోజు నాకు మరింత ప్రత్యేకమైనది మాత్రమే గాక మంచి జ్ఞాపకం కూడా. నా తల్లి ఇల్లు లాంటి జలంధర్లో ఈ రోజు ఆప్ మంచి ఘన విజయ సాధించింది. అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, మే 10 జరిగిన జలంధర్ లోక్సభ ఉపఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగింది. ఆప్లోకి మారిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ రింకూ కాంగ్రెస్కు చెందిన కరమ్జిత్ కౌర్పై 58 వేల ఆధిక్య ఓట్లతో విజయం సాధించారు.అని ట్వీట్ చేశారు. అయితే ఈ కరమ్జిత్ కౌర్ ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్రలో మరణించిన సంతోష్ చౌదరి భార్య. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని అపూర్వమైనది అని పేర్కొన్నారు. అంతేగాదు పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం మంచిగా పని చేయడం వల్లే తాము గెలిచామని అన్నారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేము రాజకీయాల్లోకి వచ్చి పనిచేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతాం. మేము మా పని చేశాం, తమ వెంట ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచాయన్నారు. అలాగే పంజాబ్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మరింతగా కష్టపడతాం అని భగవంత్ మాన్ అన్నారు. (చదవండి: ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్) -
ఎంపీతో ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ ఇల్లు
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు తమ రిలేషన్షిప్ను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం)ఢిల్లీలో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పరిణీతి చోప్రా ఇంటిని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం.. పరిణీతి-రాఘవ్ల ఎంగేజ్మెంట్కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో రాఘవ్ పవన్ సచ్దేవా రూపొందించిన డిజైనర్ డ్రెస్లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అవుట్ఫిట్లో కనిపించనుంది. -
ఎంపీతో హీరోయిన్ పరిణీతి ఎంగేజ్మెంట్.. అతిథులకు ఆహ్వానం
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు జంటగా పలుమార్లు కెమెరాకు చిక్కారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది. చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్దేవ్ సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 13న రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుందట. ఇరు కుటుంసబభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు,సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అత్యంత సన్నిహితులైన 150మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇక ఎంగేజ్మెంట్ కోసం వీరిద్దరూ ముంబై నుంచి మంగళవారం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరారు. నిశ్చితార్థం అనంతరం ఈ ప్రేమజంట తమ రిలేషన్ను అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: ప్రభాస్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ -
ఐపీఎల్ మ్యాచ్లో ప్రేమజంట
-
స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్న భామ ఈనెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈనెల 13న ఈ ప్రేమజంట దిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్లో తెగ చర్చ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్లోనే వివాహాబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు. (ఇది చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్) ఈసారి ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పంజాబ్లోని మొహాలి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు ఈ ప్రేమజంట హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్-ముంబయి జట్లు తలపడ్డాయి. కాగా.. గతంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో పరిణీతి ముంబయిలోని ఓ రెస్టారెంట్లో కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్ బర్డ్స్కు ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) View this post on Instagram A post shared by Arvind Kejriwal Fans (@arvindkejriwalaap.fc) -
పెళ్లికి సిద్ధమైన పరిణీతి చోప్రా.. మే 13న నిశ్చితార్థం? (ఫొటోలు)
-
ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్లో చక్కర్లు కొడుతోంది. (ఇది చదవండి: ఎంపీతో హీరోయిన్ డేటింగ్.. నిశ్చితార్థం డేట్ ఫిక్స్!) తాజాగా ఈ ప్రేమజంట ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అలాగే వీరి పెళ్లి అక్టోబర్లో జరిగే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వీరిద్దరూ గతంలో కలిసే చదువుకున్నారని.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసిందని టాక్ వినిపిస్తోంది. కాగా.. ప్రస్తుతం పరిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్.. ఎంపీతో స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాలు డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించకపోయినా కలిసి జంటగా పలుమార్లు మీడియాకు చిక్కారు. ఇక ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరిస్తూ రీసెంట్గా ఎయిర్పోర్ట్లో కనిపించిన పరిణీతి చోప్రా చేతికి ఉంగరంతో కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. ఇక పరిణీతి-రాఘువ్ చద్దాలు పెళ్లికి అంతా సిద్దమయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ నెలలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. -
ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ నిజం చేస్తూ ఈ జంట చాలాసార్లు ముంబయి, దిల్లీ విమానాశ్రయాల్లో కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్కు మరింత బలం చేకూర్చాయి. అయితే వీరిద్దరి రిలేషన్షిప్పై ఆప్ ఎంపీ సంజీవ్ ఆరోరా విషెస్ కూడా చెప్పారు. అయితే త్వరలోనే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వారి వద్ద నుంచి అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ముంబయి ఎయిర్పోర్ట్లో పరిణీతి చోప్రా కనిపించింది. ఆ వీడియోలో పరిణీతి చోప్రా చేతికి ఉంగరం కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. ఆమె వేలికి ఉంగరం కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు. కాగా.. పరిణీతి, రాఘవ్ల కుటుంబాలకు కూడా కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎంపీతో హీరోయిన్ డేటింగ్.. నిశ్చితార్థం డేట్ ఫిక్స్!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు తమ ప్రేమను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో పరిణీతి-రాఘవ్ల నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్స్ వాయిదా వేసుకున్న పరిణీతి పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. ఈనెల 10న వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టని పరిణీతి-రాఘవల్లు రీసెంట్గా ముంబైలోని ఓ రెస్టారెంట్ డిన్నర్ డేట్కి వెళ్లి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ ఈవెంట్కి కూడా జంటగా కలిసొచ్చారు.దీంతో రాఘవ్- పరిణీతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎంగేజ్మెంట్ అనంతరం తమ రిలేషన్ను అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. -
రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్మెంట్ వైరల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు. అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్మెంట్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్గా.. ఆల్ది బెస్ట్ కూడా చెప్పాడు. దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి! చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్.. -
ముంబయిలో వాలిపోయిన లవ్ బర్డ్స్.. త్వరలోనే ఎంగేజ్మెంట్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట ఓ రెస్టారెంట్ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడగా.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అంతే కాకుండా మరో ఎంపీ సైతం వీరిద్దరి రిలేషన్ను నిజం చేస్తూ ట్వీట్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన పరిణీతి చోప్రా అభిమానులు సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. అయితే వీరిద్దరి రిలేషన్పై ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. తాజాగా పరిణామాలతో ఈ లవ్ బర్డ్స్ అందరూ అనుకుంటున్నట్లుగానే డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి జంటగా కనిపిస్తున్నారు. మరోసారి పరిణీతి, రాఘవ్ చద్దా ఆదివారం ఉదయం ముంబయి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. ఎయిర్పోర్ట్లో ఈ జంట కలిసి వెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట విమానాశ్రయంలో నవ్వుతూ కమెరాల కంటికి చిక్కారు. ఢీల్లీ నుంచి బయలు దేరి నేరుగా ముంబయిలో వాలిపోయారు. (ఇది చదవండి: ఆప్ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్) త్వరలోనే పరిణీతి-రాఘవ్ నిశ్చితార్థం? తాజా నివేదికల ప్రకారం పరిణీతి, రాఘవ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే తమ రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పరిణీతి, రాఘవ్ కుటుంబాలు ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు తేదీని కూడా ప్రకటించే అవకాశముంది. WATCH | Amid wedding buzz, #RaghavChadha and #ParineetiChopra got spotted at Mumbai airport today pic.twitter.com/gih5a79Yrw — Bollywood Buzz (@BollyTellyBuzz) April 2, 2023 -
పొలిటీషియన్ తో ప్రేమలో పడిన పరిణీతి ?
-
పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రలో హాట్టాపిక్ నిలిచింది. కొంతకాలంగా తెరపై పెద్ద వినిపించిన ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆప్ పార్టీకి చెందిన యంగ్ పొలిటిషియన్ రాఘవ చద్దాతో పరిణీతి ప్రేమలో మునిగితేలుతుందంటూ కోద్ది రోజులుగా నెట్టంట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటివలె ఇద్దరు జంటగా డిన్నర్ డేట్కు వెళ్లి మీడియా కంట పడ్డారు. దాంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు అప్పటి నుంచి వీరి ప్రేమ, పెళ్లి రూమర్స్ బి-టౌన్తో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పార్లమెంట్ సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన రాఘవ చద్దాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పలు రాజకీయ అంశాలతో పాటు పరిణీతి చోప్రా గురించి విలేకర్లు ప్రశ్నించారు. ఇటీవల మీ ఇద్దరి ఫొటోలు వైరలయ్యాయి.. ఏంటీ సార్ ఏమైన శుభవార్త ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి రాఘవ చద్దా ముసిముసి నవ్వుతూ ‘రాజకీయ అంశాల గురించి అడగండి. కానీ.. పరిణితీ చోప్రా గురించి అడగోద్దు’ అంటూ సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్ ఇక దీనిపై మీరు స్పందించాల్సిందే అని విలేకరి అడగ్గా.. ‘సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ పార్లమెంటులోకి నడిచారు రాఘవ చద్దా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఇక త్వరలోనే రాఘవ చద్దా-పరిణితిలు పెళ్లి ప్రకటన రానుందా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణీతి పెళ్లి స్పందిస్తూ తన సహానటీనటులు, స్నేహితులంత పెళ్లి పీటలు ఎక్కారని, వారిని చూస్తుంటే తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం తాను సింగిల్ అని, వరుడు కావాలంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. Hehe! @raghav_chadha 🤭 That smile. Aap mujhse rajneeti ke sawal kariye, Parineeti ke nahi kariye. Video zaroor dekhiye! pic.twitter.com/CJhsUNkhP3 — Mohak🇮🇳 (@mohak_kohli) March 24, 2023 -
ఆప్ నేతతో స్టార్ హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డ్ దక్కింది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం పరిణితీ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పరిణీతి ఆప్ పార్టీకి చెందిన పొలిటిషియన్తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ చద్దా అనే వ్యక్తితో కలిసి ముంబయిలో కెమెరాలకు చిక్కింది. నగరంలోని ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాల కంటపడ్డారు. దీంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. పరిణితీ, రాఘవకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. గతంలో పరిణితీ చోప్రాపై చాలా సార్లు డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కాగా.. ప్రస్తుతం పరిణీతి తదుపరి చిత్రం చమ్కిలాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరిణీతితో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నారు. పరిణీతి చివరిసారిగా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, నీనా గుప్తా నటించిన ఉంఛాయి చిత్రంలో కనిపించింది. -
Beauty: నాది డ్రై స్కిన్.. ఇలా చేయడం వల్లే అందంగా: హీరోయిన్
Parineeti Chopra- Beauty Tips: పొడి చర్మం కారణంగా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది అమ్మాయిలు. అలాంటి వాళ్లు ఈ టిప్స్ పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. తన తల్లి చెప్పిన చిట్కాలు పాటించి ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటానని చెబుతోంది. పరిణీతి పంచుకున్న బ్యూటీ టిప్స్ ఆమె మాటల్లోనే.. ‘నాది డ్రై స్కిన్. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. మంచినీళ్లు బాగా తాగుతాను. రాజూ పొద్దున్నే అలోవెరా జెల్ను మొహానికి అప్లయ్ చేస్తాను. ఈ కిటుకు మా అమ్మ చెప్పిందే. అలోవెరా కాకుండా మాయిశ్చరైజర్ను కూడా వాడతా. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్!’ అని పరిణీతి చోప్రా పేర్కొంది. కాగా మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, టాలీవుడ్ నటి మీరా చోప్రాల కజిన్ పరిణీతి. హర్యానాలో వ్యాపార కుటుంబంలో జన్మించిన పరిణీతి.. ఇంగ్లండ్లో ఉన్నత విద్యనభ్యసించింది. 2009లో ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్గా జాయిన్ అయింది. ఈ క్రమంలో లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్తో నటిగా తెరంగేట్రం చేసింది. ఇష్క్జాదేతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న కోడ్ నేమ్ తిరంగా, ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కోడ్ నేమ్ తిరంగా. రిబు దాస్ గుప్తా అనే బెంగాలీ దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. అక్టోబర్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరింకే, థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవారు ఈ శుక్రవారం ఎంచక్కా ఇంట్లోనే సినిమా చూసేయండి మరి! చదవండి: బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్లు -
సేమ్ టు సేమ్.. లవ్లో పడ్డారు కదూ!
తాను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో కొందరి పరిస్థితి. ఎవరైనా ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్న డ్రెస్ వేసుకుంటే వారి మధ్యలేదో ఉందంటూ లేనిపోనివి సృష్టించేస్తున్నారు. ప్రేమపక్షులు అంటూ ముద్రవేస్తున్నారు. తాజాగా హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్ ఉమర్ రియాజ్, హీరోయిన్ పరిణీతి చోప్రా లవ్లో పడ్డారంటూ నెట్టింట కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే టీషర్ట్స్ వేసుకున్నారని, ఇది ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవునవును, ఇద్దరి టీషర్ట్స్ ఒకేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉదంటూ మరికొందరు దానికి వంత పాడుతున్నారు. ఉమర్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకు వేసి ఇద్దరి ఫొటోలను ఎడిటింగ్ చేసి మరీ పోస్ట్ చేస్తుండటం గమనార్హం. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం చేశారని తెలుస్తోంది. కాగా గతంలో ఉమర్ బిగ్బాస్ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్తో లవ్లో ఉన్నాడంటూ రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే! Exclusive & Confirm #UmarRiaz Dating #ParineetiChopra 😍😍❤️ 1. Umar Riaz & Parineeti Chopra Wear Same White T-Shirt ❤️ pic.twitter.com/JUyTiUasbi — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 2. #UmarRiaz & #ParineetiChopra Wear Same Black T-shirt ❤️ pic.twitter.com/RSd14MlXnx — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 8. #UmarRiaz & #ParineetiChopra Together At Jammu ❤️ pic.twitter.com/zX74Jf9szW — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ట్విటర్ అకౌంట్ పేరు మార్చిన చిరంజీవి.. రామ్చరణ్ స్పెషల్ వీడియో వైరల్ -
హీరోయిన్ కాకముందు అనుష్క దగ్గర పనిచేశా: పరిణీతి చోప్రా
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టర్కీలో ప్రకృతిని ఆస్వాదిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జర్నీ, సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టింది. అనుష్క శర్మ తన లేడీ క్రష్ అన్న పరిణీతి 'బ్యాండ్ బాజా బారత్' సినిమా ఇంటర్వ్యూల కోసం అనుష్క డేట్స్ తానే చూసుకున్నానని తెలిపింది. ఆ సమయంలో అనుష్కకు పీఆర్గా పని చేసిన తాను కేవలం మూడు నెలల్లో ఆమెతో కలిసి నటించే స్థాయికి ఎదిగాను అని చెప్పుకొచ్చింది. అలా 'లేడీస్ వర్సెస్ రికీ బహల్'లో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నానని వెల్లడించింది. దీనిపై స్పందించిన అనుష్క బిగ్ హగ్ అంటూ బదులిచ్చింది. ఇక 2021 తనకు ఎంతో స్పెషల్ అంటోంది పరిణీతి. నెల రోజుల వ్యవధిలోనే రిలీజైన మూడు సినిమాలు(సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా, ద గర్ల్ ఆణ్ ద ట్రైన్) విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. మున్ముందు కూడా మంచి పాత్రలే చేయాలనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె రణ్బీర్ కపూర్ 'యానిమల్' సినిమాలో నటిస్తోంది. "My lady crush from the industry has to be @AnushkaSharma. I love the way she dresses. I love the life she lives. I love her ideals and everything. So Anushka is goals." - @ParineetiChopra ❤🌸!! Parineeti's via Instagram stories. pic.twitter.com/0HFNKZnL6x — Anushka Sharma FG📸 (@AnushkasharmaFG) April 22, 2019 చదవండి: ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్ -
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్
Parineeti Chopra: సినిమా నటులు అంటేనే పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోవాలి. ఏ క్యారెక్టర్ చేసినా శక్తి వంచన లేకుండా ఫర్ఫామెన్స్ చూపించాలి. అప్పుడే తమ పాత్రలకు న్యాయం చేయగలుగుతారు. నేటితరం హీరో, హీరోయిన్లకు ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే పాత్రలకు తగ్గట్లుగా తమ శరీరాన్ని, మైండ్సెట్ని మార్చుకుంటున్నారు. లావు పెరగాలని, తగ్గాలని నెలల పాటు డైటింగ్ చేస్తున్నారు. నల్లగా కనిపించడానికి రోజుల తరబడి ఎండలో నిలబడినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఓ పాత్ర కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నారట. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. సినిమాలోని కథ ప్రకారం తన పాత్రకి అనుకోకుండా అబార్షన్ జరగటం.. కొన్ని రోజులు అదే షాక్ లో ఉండే సీన్లను అత్యంత సహజంగా తెరకెక్కించటం కోసం తానీ పని చేసినట్లు చెప్పారు. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గుడిసెలో ఈ సీన్లు మూడు రోజులు షూట్ చేశారని చెప్పారు. ఆ ప్రాంతం మొత్తం మరికిగా ఉండేదని.. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లినా..స్నానం చేయకుండా నేరుగా షూటింగ్ కు వచ్చానని.. సీన్ బాగా రావాలన్న ఉద్దేశంతో ఇలా చేశానని పరిణీతి చెప్పుకొచ్చింది. చదవండి: కిస్ సీన్.. కట్ అంటే కట్ అంతే: హీరోయిన్ -
కిస్ సీన్.. కట్ అంటే కట్ అంతే: హీరోయిన్
రోజులు మారాయి. సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే ముక్కున వేలేసుకొని వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. లిప్లాక్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి. బాలీవుడ్లో ఇప్పుడు ప్రతి సినిమాలోనూ చుంబన దృశ్యం తప్పనిసరి అయిపోయింది. అయితే, ముద్దు సీన్లు తీయడం కూడా అంత ఈజీ కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు నటీనటులు ఇద్దరు మానసికంగా సిద్ధం కావాలి. అది కేవలం నటనలో భాగంగానే భావిస్తూ ముద్దు పెట్టుకోవాలనే సూత్రాన్ని పక్కాగా పాటించాలి. లిప్ కిస్ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫిలింగ్ కలుగుతుందో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా వివరించింది. ‘రొమాంటిక్ సీన్స్ కూడా సాధారణ సీన్లాగే అనిపిస్తుంది. కిస్ సీన్స్ చిత్రీకరణ సమయంలో కట్ అంటే కట్ అంతే. అంతకు మించి ఎలాంటి ఫీలింగ్ కలగదు. జస్ట్ సినిమా కోసమే అలా చేస్తాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి ఫిలింగ్స్ ఉండవు’అని పరిణీతి చెప్పుకొచ్చింది. పరిణీతి చోప్రా.. 'లేడీస్ వర్సెస్ రికీ భాల్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇటీవల సైనా అనే సినిమాతో వచ్చింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం చిత్రం ‘సైనా’. అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చదవండి: Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం షారుక్, సల్మాన్లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
Saina Movie: ‘సైనా’ మూవీ రివ్యూ
టైటిల్: సైనా జానర్: బయోపిక్ నటీటులు: పరిణీతి చోప్రా, మానౌవ్ కౌల్, ఇషాన్ నఖ్వీ, మేఘనా మాలిక్, సుబ్రజ్యోతి బరాత్, అంకుర్ విశాల్ తదితరులు నిర్మాతలు: భూషణ్కుమార్, కృష్ణన్ కుమార్, సుజయ్ జైరాజ్, రాశేష్ దర్శకత్వం: అమోల్ గుప్త సంగీతం: అమాల్ మాలిక్ సినిమాటోగ్రఫీ: పీయూష్ షా విడుదల తేది : మార్చి 26, 2021(ఏప్రిల్ 23న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది) భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా పరిణీతి చోప్రా కీలక పాత్రలో అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైనా’. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 50% అక్యూపెన్సీతో రన్ అవ్వడంతో సైనాకు కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇప్పడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు‘సైనా’లో కొత్తగా ఏం చూపించారు? సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి మెప్పించిందా? రివ్యూలో చూద్దాం. కథ ఒక చిన్న పట్టణంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బాలిక సైనా నెహ్వాల్(పరిణీతి చోప్రా)కు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. తల్లి కూడా కుమార్తె ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంది. సైనాను ఎలాగైనా బాడ్మింటన్ ప్లేయర్ని చేయాలనుకుంటారు. డబ్బులు అంతగా లేకున్నా ట్రైనింగ్ కోసం ఓ కోచ్ వద్దకు పంపిస్తారు. ఒకానొక దశలో కాక్స్ కొనడానికి డబ్బులు లేకుంటే తన తండ్రి ఫీఎఫ్ లోన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? స్టార్ ప్లేయర్గా ఎదిగే క్రమంలో ఎలాంటి ఆటుపోటులు ఎదురయ్యాయి? కష్టకాలంతో తనకు తోడుగా నిలిచిందెవరు? ఆట కోసం వ్యక్తిగత జీవితంలో సైనా కోల్పోయిందేంటి? తన విజయంలో కోచ్ పాత్ర ఏ మేరకు ప్రభావితం చేసిందనేదే మిగతా కథ. నటీనటులు సైనా పాత్రలో పరిణీతి చోప్రా పరకాయ ప్రవేశం చేసింది. అసలైన బ్యాడ్మింటన్ ప్లేయర్లా కనిపించడానికి పరిణీతి పడిన కష్టం అంతా తెరపై కనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా, సహజసిద్దంగా చేసింది. సైనా తల్లిగా మేఘనా మాలిక్ అద్భుతంగా నటించారు. తండ్రిగా సుబ్రజ్యోతి ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇక ఈ సినిమాలో పరిణీతి తర్వాత బాగా పండిన మానవ్ కౌల్ది. సైనా కోచ్ రాజన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సైనా బాయ్ఫ్రెండ్ పారుపల్లి కశ్యప్ పాత్రలో ఇషాన్ నఖ్వీ ఉన్నంతలో బాగానే నటించారు. సైనా చిన్నప్పటి పాత్ర చేసిన పాప నైషా కౌర్ కూడా అద్భుతంగా నటించింది. విశ్లేషణ ప్రముఖుల జీవిత చరిత్రను తెరపై చూపించడం కత్తిమీద సాము లాంటిదే. వారి జీవితాన్ని వెండితెరపై ఎంత భావోద్వేగభరితంగా చూపించారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు అమోల్గుప్త సఫలమయ్యాడనే చెప్పాలి. స్టార్ బాడ్మింటన్గా ఎదగడానికి సైనా పడిన కష్టాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రథమార్థంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా సైనా చిన్నప్పుడు కోచింగ్కు తీసుకెళ్లడానికి తల్లి పడే ఆరాటం, షటిల్ కొనడానికి తండ్రి అప్పు చేసే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కోచ్ రాజన్, సైనాల మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి. ఫస్టాప్ అంతా సైనా బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన విషయాలు చూపించిన దర్శకుడు.. సెకండాఫ్లో కూడా దాన్నే కంటిన్యూ చేయడం కాస్త ప్రతికూల అంశమే. అలాగే కశ్యప్తో ప్రేమ వ్యవహారాన్ని కూడా అంతగా చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమాకు మరో బలం అమాల్ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. పీయూష్ షా సినిమాటోగ్రాఫి అద్భుతమనే చెప్పాలి. బాడ్మింటన్ కోర్టును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. గేమ్ సన్నివేశాలను భావోద్వేగభరితంగా, ఉద్విగ్నంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఎన్ఐఏ ఏజెంట్గా పరిణీతి చోప్రా
ఏజెంట్గా ఓ కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. ఈ ఆపరేషన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. దర్శకుడు రిబుదాస్ గుప్తా, హీరోయిన్ పరిణీతి చోప్రా కాంబినేషన్లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా పరిణీతి, రిబు కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లనుందని బాలీవుడ్ తాజా సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపిస్తారట. ఓ కోవర్ట్ ఆపరేషన్తో దోషులను చట్టానికి అప్పగిస్తారట. మరి... ఈ ఆపరేషన్ను పరిణీతి ఎలా డీల్ చేశారన్నది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: నన్ను వజ్రాల నెక్లెస్తో అలంకరించినందుకు థ్యాంక్స్: సన్నీలియోన్ కంగనాను అలా చూసి నిర్ఘాంతపోయిన వృద్ధురాలు.. -
సోషల్ హల్చల్: పూల్లో నిఖిత, ఆడుకుంటున్న రితికా
► అడవులను కాపాడేందుకు కలిసి పని చేద్దామంటున్న దియా మీర్జా ► భుజాన బ్యాగుతో ఎక్కడికో బయల్దేరినట్లు పోజిచ్చిన నిధి అగర్వాల్ ► పారిపోతున్నట్లు పోజిస్తూ కొంటెగా లుక్కిచ్చిన దీపికా పదుకొణె ► బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న శ్రీనిధి శెట్టి ► అరేబియా సముద్ర తీరాన పూల్లో ఈత కొడుతున్న నికిత శర్మ ► ప్రకృతికి దగ్గరగా వెళ్లండి అని పిలుపునిస్తోన్న మల్లికా షెరావత్ ► నన్ను ఒంటరిగా వదిలేస్తే ఇంతే సంగతులు అంటూ సెల్ఫీ దిగిన పరిణీతి చోప్రా ► ఉంగరాల జుట్టుతో ఆడుకుంటున్న రితికా సింగ్ ► మండేకి రెడీగా లేనంటున్న అదితి రావు హైదరీ View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
అరె.. అచ్చం 'సైనా'లానే ఉంది కదూ..
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తీస్తున్నచిత్రం ‘సైనా’. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా సైనా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్న పరిణీతి తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సైనా నెహ్వాల్తో పాటు పరిణీతి కూడా ఉన్న ఫోటో కొలేజీని సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ ఫోటోలో ఇద్దరూ ఒకేలా కనిపించడం విశేషం. శరీరాకృతి, డ్రెస్సింగ్, హెయిర్స్టయిల్ సహా సైనా మెడలోని చెయిన్తో సహా అచ్చం సైనాలానే పరిణీతి కనిపిస్తోంది. దీంతో సైనాకు కార్బన్ కాపీలా ఉంది, గ్రేట్ వర్క్ అంటూ పరిణీతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన జీవితంలో నటిగా ఒక్కసారైనా ఇలాంటి పాత్ర పోషించినందుకు ఎంతో థ్రిల్లింగ్గా ఉందని పరిణీతి పేర్కొంది. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్ ప్లేయర్గా తన ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ ఇటీవలె పరిణీతి ఓ వీడియోను పంచుకుంది. ఇందులో తాను బ్యాడ్మింటన్ నేర్చుకొని సైనాలాగే మారడానికి ఎంత కష్టపడిందో వివరించింది.ఈ పాత్ర కోసం పొద్దున్నే నిద్రలేచి కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని. కేవలం లుక్స్ పరంగానే కాకుండా సైనాలాగా ఆడటంలో మెరుగులు నేర్చుకోకపోతే ఎప్పటికీ ఈ పాత్రకు న్యాయం చేయలేను అనిపించేది. ఒక్కోసారి అసలు నేను ఈ రోల్ చేయగలనా లేదా అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి' అని పరిణీతి పేర్కొంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. చదవండి : (బ్యాడ్మింటన్కు టెన్నిస్కు తేడా తెలీదా?) (నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి) -
జొమాటో వివాదం: ఈ ఘటన సిగ్గుచేటు అంటున్న హీరోయిన్
-
సోషల్ హల్చల్: చూసీ చూడంగానే నచ్చేశారే..
► చూసీ చూడంగానే నచ్చేశావే అంటోన్న మోనాలియన్స్ ► సెల్ఫీకి పోజిస్తోన్న కలర్ఫుల్ చిలక స్వాతి దీక్షిత్ ► పచ్చందనమే.. పచ్చందనమే పాట గుర్తు చేస్తోన్న అరియానా గ్లోరీ ► నో ఫిల్టర్ అని చెప్తోన్న పరిణీతి చోప్రా ► ఐపీఎల్ హోస్టింగ్కు రెడీ అవుతున్న చౌదరి నేహా ► మన్మథ బాణాలు విసురుతున్న అనన్య పాండే ► క్లాసిక్ సెల్ఫీ దిగిన మాధురి దీక్షిత్ ► చీర కట్టుకోవడమంటే ఇష్టమంటోన్న విద్యాబాలన్ ► ఇది శ్రీముఖి నిన్నటి లుక్కు, కానీ చూసేవాళ్లకు ఇప్పటికీ కిక్కు ► పొట్టి బట్టల్లో హీటెక్కిస్తున్న వర్షిణి ► గంధపు చీరలో అందాలు పరుస్తోన్న వితికా శెరు ► ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్న అదితి శర్మ ► ఖాకీ రంగు దుస్తుల్లో బాలీవుడ్ బాంబ్ సన్నీలియోన్ ► అందాలను దాచేస్తూ అబ్బాయిలకు వల వేస్తోన్న పాయల్ రాజ్పుత్ ► ఎండకు మరింత మెరిసిపోతున్న నభా నటేశ్ ► ప్రియా ప్రియా నవ్వొద్దే.. నీ నవ్వుల్లో మమ్మల్ని బంధించొద్దే అని ప్రియా ప్రకాశ్ వారియర్ను చూసి పాడుకుంటున్న కుర్రకారు View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Aditi Sharma (@officialaditisharma) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్
సాక్షి, బెంగళూరు: ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకు జొమాటో డెలివరీ బాయ్ తనపై పిడిగుద్దులు కురిపించాడంటూ బెంగళూరు మహిళ హితేషా చంద్రానీ తీసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళే తనను తిట్టి, చెప్పులతో కొట్టి అవమానించిందని సదరు డెలివరీ బాయ్ కామరాజ్ మీడియాకు తెలిపాడు. కాస్త ఆలస్యంగా వెళ్లినందుకు ఆర్డర్ తీసుకుని డబ్బులివ్వకుండా నెట్టివేసిందని ఈ క్రమంలోనే ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం కారిందని డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. ఆమెపై తను చేయి చేసుకోలేదని, అన్యాయంగా తనను కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు మహిళకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం డెలివరీ బాయ్ మాటల్లో నిజమున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఈ వివాదంపై స్పందించింది. దయచేసి ఈ విషయంలో నిజానిజాలేంటో నిగ్గు తేల్చి ప్రజలముందుంచండని జొమాటో యాజమాన్యాన్ని కోరింది. "ఒకవేళ అతడు అమాయకుడైతే(నేనైతే అతడు ఏ పాపం ఎరుగడనే నమ్ముతున్నా) ఆ యువతిని శిక్షించండి. ఈ ఘటన నిజంగా అమానవీయం, సిగ్గుచేటు, గుండె తరుక్కుపోతోంది. దయచేసి ఈ విషయంలో నేనేమైనా సాయం చేయగలనేమో చెప్పండి" అని అభ్యర్థిస్తూ ట్వీట్ చేసింది. కాగా ఈ వివాదంలో డెలివరీ బాయ్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా గురువారం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతడు గత 26 నెలలుగా జొమాటోలో పని చేస్తున్నాడు. తను అందించిన సేవలకు గానూ 4.75/5 రేటింగ్ పొందాడు. మరి ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలోనూ #JusticeForKamraj హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. Zomato India - PLEASE find and publicly report the truth.. If the gentleman is innocent (and I believe he is), PLEASE help us penalise the woman in question. This is inhuman, shameful and heartbreaking .. Please let me know how I can help.. #ZomatoDeliveryGuy @zomato @zomatoin — Parineeti Chopra (@ParineetiChopra) March 14, 2021 చదవండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్ ‘ఆ గాయం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.. ఆమే స్వయంగా’ -
ఆసక్తి రేపుతున్న ‘సైనా’ ట్రైలర్
ముంబై: బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘దారిలో వెళ్లటం ఒకటైతే దారి చూపటం అనేది మరొకటి.. నువ్వు ఆ రెండో దానిపై దృష్టి సారించాలి’ అని సైనాకు తన తల్లి చెప్పే డైలాగ్తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చిన్నతనంలో సైనా బ్యాడ్మింటన్ అకాడమీలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒలింపిక్స్ మెడల్ గెలిచి వరల్డ్ నంబర్ వన్గా నిలిచే వరకు ఆమె కెరీర్లోని పలు అంశాలను కళ్లకు కట్టినట్లు ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు. చైనా వాల్ను బద్ధలు కొడతా.. అంటూ సైనా చెప్పే మరో డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. SAINA🏸🙏🏻 This women's day I am proud to bring to you - SAINA🏸🙏🏻 In cinemas 26th March. Watch the trailer now - https://t.co/Egh5NSWJyI@NSaina #AmoleGupte #ManavKaul @eshannaqvi #BhushanKumar @deepabhatia11 @Sujay_Jairaj @raseshtweets #KrishanKumar @AmaalMallik — Parineeti Chopra (@ParineetiChopra) March 8, 2021 ‘ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ముందుకు ‘సైనా’ మూవీ టైలర్ను తీసుకురావటం పట్ల చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడే ట్రైలర్ చూడండి’ అని హీరోయిన్ పరిణీతీ చోప్రా ట్వీటర్లో పేర్కొంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. -
18 ఏళ్లకే ఫస్ట్ కిస్.. డేటింగ్ మాత్రం..
పరిణీతి చోప్రా ముఖ్య పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’. ఓటీటీలో ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ముఖ్య విషయాలను పంచుకుంది ఈ భామ. తనకి 18 ఏళ్లు ఉన్నప్పుడే ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నానంటూ తన ఫస్ట్ కిస్ గురించి ఓపెన్ అప్ అయ్యింది. జీవితంలో తొలి ముద్దు ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. తన లైఫ్లోనూ ఆ ఫస్ట్ కిస్ చాలా స్పెషల్ అని తెలిపింది. అయితే ఇప్పటివరకు తానెప్పుడూ డేట్కు వెళ్లలేదని,వాటిపై పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదని పేర్కొంది. డేట్ అంటే..'ఇంటికి వచ్చేశెయ్..కలిసి భోం చేద్దాం, ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ చిల్ అవుదాం' అని అంటానని పరిణితి తెలిపింది. తన ఫస్ట్ క్రష్ మాత్రం ఎప్పటికీ హీరో సైఫ్ అలీ ఖాన్ అని, ఆయనను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కాగాఇంతకుముందు అధిక బరువు కారణంగా చాలా ట్రోలింగ్కి గురయ్యానని, అవకాశం వస్తే తన జీవితంలో ఆ అధ్యాయాన్ని చెరిపివేస్తానని పేర్కొంది. అధిక బరువుతో అనారోగ్యం కూడా వస్తుందని, అందుకే ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పింది. కొన్ని చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ పరిణితి ఎమోషనల్ అయ్యింది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినా..నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పరిణితి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవలే ఆమె నటించిన ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ నెట్ఫ్లిక్స్లో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆమె నటించిన సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా బయోపిక్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి : (అందుకే సుశాంత్తో సినిమా చేయలేదు..) ('అజయ్ దేవ్గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?') View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఎల్లో డ్రెస్లో యమ హాట్గా ఉన్న బ్యూటీస్
♦ ఈ డ్రెస్లో శ్రీముఖిని చూసి అనాల్సిందే "ఎల్లో ఎల్లో బ్యూటిఫెల్లో" ♦ సండే ఫండే అంటూ కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీ దిగిన ప్రియాంక చోప్రా ♦ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలిసినందుకు గాల్లో తేలిన అషూ రెడ్డి ♦ బేబీ బంప్తో ఫొటోకు పోజిచ్చిన హరితేజ ♦ చిరునవ్వుతో డే స్టార్ట్ చేసిన దేత్తడి హారిక ♦ బ్లాక్ అండ్ వైట్లో మెరిసిపోతున్న సమంత ♦ తండ్రికి బర్త్డే విషెస్ తెలిపిన రకుల్ ప్రీత్ సింగ్ ♦ కాస్మొపాలిటన్ అంటోన్న పరిణతీ చోప్రా ♦ ఎరుపు రంగు హ్యాట్, మోనాల్ సో క్యూట్.. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
నాదైన టచ్ ఇవ్వాలనుకున్నా: బాలీవుడ్ బ్యూటీ
‘ఏదైనా హిట్ చిత్రం రీమేక్లో నటించినప్పుడు ఆ సినిమాలోని నటీనటుల పర్ఫార్మెన్స్ను ఒరిజినల్లో చేసినవాళ్లతో పోల్చడం సహజం. అందుకే ఈ విషయాన్ని ఓ ఛాలెంజ్లా తీసుకున్నాను’’ అంటున్నారు పరిణీతీ చోప్రా. పరిణీతి ముఖ్య పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’. హాలీవుడ్ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్ పోషించిన పాత్రను హిందీలో పరిణీతి చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ – ‘‘ఈ రీమేక్ అంగీకరించే ముందు నా పర్ఫార్మెన్స్ను ఎమిలీతో పోలుస్తారేమో.. ఆమె చేసినట్టు నేను చేయగలనా? లేదా అనే ఆలోచనలు నా మనసులోనుంచి తీసేశాను. ఆ బరువును మెదడుకి ఎక్కించుకోదలుచుకోలేదు. ఈ పాత్రకు నాదైన టచ్ ఇవ్వాలనుకున్నాను. ఒరిజినల్కు మ్యాచ్ చేయాలని చాలా బాగా చేశాను. ట్రైలర్కి మంచి స్పందన లభిస్తోంది. మా రీమేక్ను ఎప్పుడెప్పుడు ఆడియన్స్కు చూపించాలా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ రీమేక్ను చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ చిత్రం ఈ నెల 26న నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. చదవండి: రాధేశ్యామ్: ఇక్కడ ఒకరు.. అక్కడ ఇద్దరు -
అమ్మతోడు... ఆమె అలా చేస్తుందనుకొలేదు!
బాలీవుడ్ అందాల నటి పరిణీతి చోప్రాకు ఇష్టమైన పుస్తకాలో ఒకటి...ది గర్ల్ ఆన్ ది ట్రైన్. ‘ది న్యూయార్క్ టైమ్స్ ఫిక్షన్ బెస్ట్ సెల్లర్స్’లో మొదటి స్థానంలో నిలిచిన ఈ పుస్తకం 34 దేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఈ సైకాలాజికల్ థ్రిల్లర్ సంక్షిప్త పరిచయం... 30 సంవత్సరాల రేచల్ వాట్సన్ కొన్ని కారణాల వల్ల భర్త టామ్తో విడాకులు తీసుకుంటుంది. ఆ బాధలో డిప్రెషన్లోకి వెళుతుంది. తాగుడుకు బానిసగా మారుతుంది. ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఆమె పని లోకల్ ట్రైన్లో రోజూ పోవడం, రావడం. తాను ఇంకా ఉద్యోగం చేస్తున్నానని భ్రమ కలిపించడం కావచ్చు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఖాళీగా ఇంట్లో కూర్చోలేకపోవడం కావచ్చు...కారణం ఏదైతేనేం ఆమె రోజూ రైలుప్రయాణం చేస్తూనే ఉంది. ఒకరోజుకు ఇంకోరోజుకు మధ్య కొత్త వ్యక్తులు, కొత్త మాటలు, కొత్త జీవితాలు. రేచల్ ప్రయాణించే రైలు మాజీ భర్త టామ్ ఇంటి మీదుగా వెళుతుంది. ఆ ఇంటికి రెండు, మూడు ఇండ్ల పక్కన ఒక జంటను చూసి ‘అబ్బ! ఎంత ముచ్చటైన జంట’ అనుకుంటుంది. వాళ్ల పేరేమిటో తెలియదు. తానే ఇద్దరికి కల్పిత పేర్లు పెడుతుంది. అమ్మాయి పేరు: జెస్ (అసలు పేరు: మేఘన్) అబ్బాయి పేరు: జాసన్ (అసలు పేరు: స్కాట్) ఒకరోజు మందు మత్తులో ఉన్న రేచల్, ఒక వ్యక్తితో మేఘన్ సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతడు స్కాట్ కాదు. ఎవరో? కట్ చేస్తే... మేఘన్ అదృశ్యమైపోతుంది. ఎవరు మాయం చేశారు? అసలు బతికి ఉందా? రేచల్ అనుకున్నట్లు వారిది బంగారుజంట కాదు. జెస్ అసలు పేరు మేఘన్. మేఘన్కు చాలామంది మగాళ్లతో ఎఫైర్ ఉంటుంది. ఇక స్కాట్ విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో ఒక అభద్రతలో ఉంటాడు. మేఘన్పై పెత్తనం చేయాలని చూస్తుంటాడు. రేచల్ మాజీ భర్త టామ్, అతని రెండో భార్య అనా ఇంట్లో మేఘన్ బేబిసిట్టర్. మేఘన్ అదృశ్యం గురించి మాట్లాడడానికి స్కాట్ను కలుస్తుంది. మేఘన్ ఫ్రెండ్గా తనను పరిచయం చేసుకుంటుంది. మేఘన్ ఒకవ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని తాను చూసినట్లు చెబుతుంది. ఎవరా వ్యక్తి? అనే శోధనలో ఆ వ్యక్తి సైకియాట్రిస్ట్ డా.కమల్ అని తెలుస్తుంది. పోలీసులు డా.కమల్ను పిలిచి విచారిస్తారు. తనకు మేఘన్కు ఎలాంటి సంబంధం లేదని, ఆమె తన పేషెంట్ మాత్రమే అని చెబుతాడు డాక్టర్. కానీ రేచల్, స్కాట్ ఆయన మాటలు నమ్మరు. ఒకరోజు టామ్ జిమ్బ్యాగ్లో సీక్రెట్ ఫోన్ చూసి ఆశ్చర్యపోతుంది అతడి భార్య అనా. ఆ ప్రీ–పెయిడ్ ఫోన్ మేఘన్ కోసమని తెలిసి ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు కథ ఏమిటంటే, భార్యకు తెలియకుండా టామ్ మేఘన్తో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె గర్భం దాల్చుతుంది. ‘అబార్షన్ చేసుకో...’ అంటాడు టామ్. అందుకు ఆమె నిరాకరిస్తుంది. గట్టిగా అరుస్తుంది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని లోకానికి తెలియజేస్తానని హెచ్చరిస్తుంది. నిజం బయటకు రాకుండా ఉండడానికి మేఘన్ను టామ్ హత్య చేస్తాడు. టామ్ దుర్మార్గాన్ని అంతం చేయడానికి ఒకప్పటి ప్రత్యర్థులు రేచల్, అనా ఒక్కటవుతారు. టామ్ను హత్య చేస్తారు. ఆత్మరక్షణ కోసమే తాము టామ్ను చంపామని చెబుతారు. మద్యం మానేసి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తుంది రేచల్. ముగ్గురు మహిళలు...రేచల్, అనా, మేఘన్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవల ఉంటుంది. మై ఫెవరెట్ బుక్: ది గర్ల్ ఆన్ ది ట్రైన్ రచన: పాలో హాకిన్స్ -
ఏజెంట్ పరిణీతి
అండర్కవర్ ఆపరేషన్ కోసం రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. రిబూ దాస్ గుప్తా దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కమిట్ అయ్యారు ఈ బాలీవుడ్ బ్యూటీ. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్గా కనిపిస్తారు పరిణీతి. ఓ భారీ ఆపరేషన్ కోసం తన టీమ్తో కలసి ఓ మిషన్ మీద పాకిస్తాన్ వెళ్తారట. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నారట. పరిణీతీ, దర్శకుడు రిబూ దాస్ గుప్తా కాంబినేషన్లో తెరకెక్కనున్న రెండో చిత్రమిది. ఇటీవలే వీరు ‘ఏ గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా చేశారు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. -
మూడు పువ్వులు... ఆరు కాయలు
బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా హీరోయిన్గా ప్రవేశించి ఈ నెల 9తో తొమ్మిదేళ్లయింది. ‘లేడీ వర్సెస్ రిక్కీ బాల్’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. రెండో సినిమా ‘ఇష్క్ జాదే’లో ‘మే పరేషాన్ పరేషాన్’ అని హీరో అర్జున్ కపూర్ తో ఆడి పాడి కుర్రకారుని పరేషాన్ చేశారు. పరిణీతి తొలి సినిమా ఎంట్రీనే యశ్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థతో జరిగింది. ఒకేసారి మూడు చిత్రాలు చేసే విధంగా పరిణీతీతో ఒప్పందం కుదుర్చుకుంది యశ్ రాజ్ సంస్థ. ఆమె కెరీర్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. నిజానికి యశ్ రాజ్ సంస్థలో పీఆర్ (పబ్లిక్ రిలేషన్) గా చేరారు పరిణీతి. ఎక్కువ మేకప్ వేసుకోవాల్సి వస్తుందని నటనను ఇష్టపడలేదు. అయితే కజిన్ ప్రియాంకా చోప్రాను ఆదర్శంగా తీసుకుని నటి అయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో ఆమె ‘ఇష్క్ జాదే, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘మేరీ ప్యారీ బిందు’, ‘గోల్మాల్ ఎగైన్’, ‘నమస్తే ఇంగ్లాండ్’, ‘కేసరి’ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. -
సైనాలానే ఉందే!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో పరిణీతీ చోప్రా లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన సైనా నెహ్వాల్ ‘అచ్చు నాలానే ఉందే’ అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్ సాధన చేశారు. బ్యాడ్మింటన్లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్కు రానుంది. -
‘సైఫ్ను ప్రేమిస్తున్నాను.. కరీనాకు తెలుసు’
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఈ రోజు(గురువార) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆమె 33 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నటి పరంగా ఆమెకు బోలేడు మంది అభిమానుల ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తను మాత్రం ఓకే ఒక హీరోకు పిచ్చి ఫ్యాన్ అని చెబుతున్నారు. అతనెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్. అవును.. సైఫ్ను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కానీ దూరంగా ఉంటూనే ఇవ్వన్ని చేసేదాన్నని, ఎప్పుడూ అతనికి చెప్పలేదని పేర్కొన్నారు. చదవండి: అందుకే సుశాంత్తో సినిమా చేయలేదు.. పరిణీతి 2019లో నటించిన ‘జబారియా జోడి’ ప్రమోషన్ కోసం నటుడు సిధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘ది కపిల్ శర్మ షో’కు వచ్చారు. వధువు కుటుంబం నుంచి బలవంతంగా కట్నం కోరే వ్యక్తుకలను అపహరించి పెళ్లిళ్లు జరిపే వ్యాపారాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా నిర్వహిస్తుంటాడు. అయితే సిద్ధార్త్నే కిడ్నాప్ చేసి అతనిని బలవంతంగా పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో పరిణీతి నటించారు. ఈ సందర్భంగా హోస్ట్గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ.. నిజ జీవితంలో ఒక వ్యక్తిని అపహరించడానికి అవకాశం ఇస్తే తాను ఎవరిని అపహరిస్తానని పరిణీతిని అడిగారు. చదవండి: ఎఫ్2' సినిమాకు కేంద్ర అవార్డు ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ప్రశ్న కొంచెం క్లిష్టంగా ఉంది. ఒకరిని కలవడానికి నాకు అవకాశం రాకపోతే, అలాగే నేను అతన్ని కిడ్నాప్ చేయవలసి వస్తే అది ‘సైఫ్ అలీ ఖాన్.’ అది కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నేను సైఫ్ను చాలా ప్రేమిస్తున్నానని కరీనాకు ఇప్పటికే చెప్పాను. ఆమె దానితో సరే అన్నారు.. నేను అతన్ని ఎత్తుకెళ్లడం నాకు ఇష్టం లేదు. కేవలం దూరం నుంచే ప్రేమిస్తాను’ అని పేర్కొన్నారు. కాగా 2014లో సైఫ్తో నటించేందుకు పరిణీతికి చాలా దగ్గర అవకాశం వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు ఫైనల్ అవ్వలేదు. ఇక ముందైనా ఇద్దరు కలిసి సినిమాలో నటించే అవకాశం రావాలని ఆశిద్ధాం View this post on Instagram Back in October for Mr. Bachchan’s diwali party, I wore a saree for the first time at a public event and the response was, lets just say, good (blushing!) 😊 I think people who thought of me as someone who only dressed casual or sporty changed their minds. Even I did. I always had a mental block that sarees were only for moms or brides. I was wrong! Now I am so happy to convert my new found love for sarees into a professional association. Wanted to partner with someone who shared my thought of making sarees exciting for each and every girl and woman out there!!! Happy to announce that I’m the brand ambassador of @julahaasarees and an active supporter of their cool initiative #MySareeMyWay that encourages women to express themselves through their drapes. Their exquisite range of floral sarees and my personal favourites are now available on their website for you to style your way https://julahaasarees.com/. ADD THEM TO YOUR CLOSET GIRLS! 🥻 A post shared by Parineeti ⭒ (@parineetichopra) on Mar 7, 2020 at 10:37pm PST -
అందుకే సుశాంత్తో సినిమా చేయలేదు..
ముంబై: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, వికాస్ బల్ తదితరులతో కలిసి తాను నిర్మించిన ‘హసీ థో ఫసీ’ సినిమాలో తొలుత సుశాంత్ సింగ్ రాజ్పుత్నే హీరోగా ఎంపిక చేశామని ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ అన్నాడు. అయితే పెద్ద బ్యానర్లో అవకాశం రావడంతో అతడు ఈ మూవీని వదులుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప తాము అతడిని కావాలని పక్కకు పెట్టామన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశాడు. అయితే హీరోయిన్ పరిణీతి చోప్రా వల్లే సుశాంత్కు బడా నిర్మాణ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బంధుప్రీతి కారణంగానే సుశాంత్ వంటి ప్రతిభ గల నటులకు అన్యాయం జరుగుతుందంటూ అతడి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ కూడా సుశాంత్తో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదంటూ పలువురు కామెంట్లు చేశారు. (చదవండి: సాయం చేయండి: మోదీకి పాయల్ ట్వీట్) ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జర్నలిస్టుతో మాట్లాడిన దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్.. ‘‘నిజానికి సుశాంత్ హసీ థో ఫసీ సినిమా చేయాల్సింది. అతడిని హీరోగా అనుకోగానే, హీరోయిన్ కోసం వెదుకులాట మొదలుపెట్టాం. అలా పరిణీతి చోప్రాను సంప్రదించాం. అయితే అప్పటికి సుశాంత్ టీవీ నటుడిగా ఉండటంతో ఆమె ఈ ఆఫర్ను తిరస్కరించింది. సీరియల్ నటుడితో కలిసి పనిచేయలేనంది. అప్పుడు మేమే తనకు అర్థమయ్యేలా చెప్పాం. సుశాంత్ కాయ్ పో చే, పీకే వంటి సినిమాలు చేస్తున్నాడని, మన సినిమా విడుదలయ్యే సమయానికి తనొక వెండితెర నటుడిగా ఉంటాడని చెప్పాం. అయితే అప్పటికే తను శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమా చేస్తోంది. నాకు తెలిసి తనే సుశాంత్ గురించి యశ్రాజ్ ఫిల్మ్స్తో మాట్లాడి ఉంటుంది. అప్పుడు వాళ్లు అతడిని పిలిచి.. ‘‘నువ్వు మా సినిమాలో నటించవచ్చు కదా. ఆ సినిమా వదిలెయ్’’అని చెప్పారు. అప్పుడు తను వాళ్లవైపే మొగ్గుచూపాడు’’అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పరిణీతి చోప్రా- సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో హసీ థో ఫసీ తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. 2016లో తాను సుశాంత్కు మరో ఆఫర్ ఇచ్చానని, అయితే ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదని తెలిపాడు. ఇదిలా ఉండగా.. నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
చిన్న బ్రేక్
‘‘వ్యక్తిగత, వృత్తి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ చిట్చాట్ సెషన్స్తో తమ ఫాలోయర్స్, ఫ్యాన్స్కు దగ్గరగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండటం అనేది కొంచెం ఒత్తిడితో కూడుకున్న పనే అని కొందరు స్టార్స్ అంటున్నారు. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇటీవల పలువురు తారలు ‘డిజిటల్ డిటాక్స్’ (సోషల్ మీడియాకు దూరంగా ఉండటం) సూత్రం ఫాలో అవుతున్నారు. కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నాం. ‘డిజిటల్ డిటాక్స్’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమానికి బ్రేక్ ఇచ్చిన స్టార్స్, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ యాక్టివ్గా ఉంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ కలుద్దామని చెప్పి డిజిటల్కి దూరమైపోయారు త్రిష. ‘‘నా మైండ్కు కాస్త ఉపశమనం కావాలి. ఇది డిజిటల్ చికిత్స అనుకోవచ్చు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీటర్కి చిన్న బ్రేక్ ఇచ్చారు త్రిష. ఇటీవలే ‘టిక్టాక్’లో కూడా త్రిష ఎంట్రీ ఇచ్చారు. మరో హీరోయిన్ యామీ గౌతమ్ ‘‘నా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకోవాలనుకోవడం లేదు’’ అని డిజిటల్ డిటాక్స్ను ఉద్దేశించి మాట్లాడారు. మరో బ్యూటీ పరిణీతీ చోప్రా ‘‘నా కోసం నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి. అందుకే కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఈ క్వారంటైన్ టైమ్ని నా కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటాను’’ అన్నారు శ్రియా పిల్గోన్కర్. రానా నటించిన ‘హాథీ మేరీ సాథీ’ (తెలుగులో ‘అరణ్య’) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారియర్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డీ యాక్టివేట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘మానసిక ప్రశాంతత కోసమే నా ఇన్స్టా అకౌంట్ను డీ యాక్టివేట్ చేశాను. లైక్లు, షేర్లు వంటివి నాలో ఒత్తిడిని పెంచాయనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు నేను తిరిగి ఇన్స్టాలోకి వచ్చాను. భవిష్యత్లో కూడా కావాలనుకుంటే కొన్ని రోజులు నా అకౌంట్ను డీ యాక్టివేట్ చేస్తాను’’ అన్నారు ప్రియాప్రకాశ్ వారియర్. డీయాక్టివేట్ ట్వీటర్లో నెగటివిటీ పెరిగిపోయిందని తన అకౌంట్ను డీ యాక్టివేట్ చేశారు సోనాక్షీ సిన్హా. నెగటివిటీ, అసభ్యపదజాలంతో కూడిన కామెంట్స్ ఎక్కువైపోయాయని, అందుకే ట్వీటర్ నుంచి వైదొలుగుతున్నానని అన్నారు బాలీవుడ్ నటుడు సాకిబ్ సలీమ్. ‘బద్రీనాథ్కి దుల్హనీయా, ధడక్’ చిత్రాలను తెరకెకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు శశాంక్ కేతన్ తన ట్వీటర్ అకౌంట్ను డీ యాక్టివేట్ చేశారు. ‘‘సోషల్ మీడియా వల్ల రియల్ వరల్డ్ ఫేక్ వరల్డ్లాగా, ఫేక్ వరల్డ్ రియల్ వరల్డ్గా కనిపిస్తోంది’’ అంటున్నారు కృతీసనన్. -
బయటపెట్టండి.. బయటపడండి!
శ్రుతిహాసన్లో ఏదో కోల్పోయిన భావన ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కారణం... డిప్రెషన్ మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే... నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట.. మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి.. డిప్రెషన్ నుంచి బయటపడండి.. శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్ను తరిమికొట్టారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. వాళ్లకంటే బలమైనదాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ. ప్రతి సెకనూ నరకమే ‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్లో తన కెరీర్ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు. ‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను. డాక్టర్ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు. ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి ‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్. అయితే ఏంటి? గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు. ఆ టైమ్లోనే డాక్టర్ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా. మూడేళ్ల మానసిక ఒత్తిడి చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్. రోజుకి పదిసార్లు ఏడ్చాను మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి. -
జైలు కాదు.... మనందరి మేలు
కరోనా వైరస్ను నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని కొందరు ఇబ్బందిగా ఫీల్ అవ్వడాన్ని తప్పుపడుతున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ఈ విషయం గురించి పరిణీతి మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ వల్ల ఇంట్లోనే తాము జైలు జీవితాన్ని గడపుతున్నామనే భావనలో కొందరు ఉంటున్నారు. లాక్డౌన్ అనేది వారి జీవితాలను కాపాడటం కోసమేనని వారు తెలుసుకోవాలి. మీకు (లాక్డౌన్ను ఇబ్బందిగా ఫీలయ్యేవారిని ఉద్దేశిస్తూ) 21 రోజుల లాక్డౌన్ అనేది జైలు కాదు...మనందరి మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న ఓ మంచి నిర్ణయం. బాధ్యత గల పౌరులుగా మనందరం ప్రభుత్వాలకు సహకరించాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సమస్యకు త్వరలోనే సరైన పరిష్కారం దొరకాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. -
పరిణీతి అవుట్ నోరా ఇన్
హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ నుంచి కథానాయిక పరిణీతీ చోప్రా తప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. అభిషేక్ దుధియా దర్శకత్వంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, రానా, ప్రణీత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఇందులో గూఢచారిగా పరిణీతి చోప్రా నటించాల్సింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలోకి నోరా ఫతేహీ వచ్చారని టాక్. ఈ నెల 12 తర్వాత జరిగే ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నోరా. ఎన్టీఆర్ ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ వంటి స్పెషల్ సాంగ్స్తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు నోరా. ఇంకా కిక్ 2, లోఫర్ చిత్రాల్లోనూ ప్రత్యేక పాటలకు కాలు కదిపారు. హిందీలోనూ స్పెషల్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఇటీవల కొన్ని హిందీ చిత్రాల్లో కీలక పాత్రలకు సై అంటున్నారు. తాజాగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో గూఢచారిగా నటించడానికి సిద్ధమయ్యారామె. ఈ చిత్రం ఆగస్టు14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి పరిణీతీ ఎందుకు తప్పుకున్నారంటే ‘సైనా’ చిత్రంతో బిజీగా ఉండటం వల్లే అని బాలీవుడ్ టాక్. ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నాక ఆమె స్థానంలోకి పరిణీతి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
బాలీవుడ్ లేడీస్
టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్తో ఫైట్ చేస్తే, హీరోతో హీరోయిన్ డ్యూయెట్ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ జనరేషన్లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్ టేస్ట్ అనుకోవచ్చు. బాలీవుడ్లో లీడ్ క్యారెక్టర్స్కి సై చెప్పి, లీడింగ్ లేడీస్ అయిన తారల విశేషాలు... సక్సెస్ సక్సేనా... తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. ‘ధడక్’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్ సక్సేనా పైలెట్ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు. కానీ గుంజన్ తన కలను సీరియస్గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్గా చరిత్రలో నిలిచిపోయారు. తను విహరించిన ఫ్లైట్ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్. జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్ గేమ్ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్ని సీరియస్గా తీసుకున్నారు. పైలెట్గా ట్రైనింగ్ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్ అయ్యారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. టీనా.. కెటీనా అయింది కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం. మూఢ నమ్మకాల మీద సెటైరికల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్ క్యారెక్టర్స్లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట. డబుల్ ధమాకా పరిణీతీ చోప్రా హీరోయిన్గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్ సినిమాల వరకూ చేశారు. కెరీర్లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ ఆడుతూ గాయపడ్డారు కూడా. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్ లేడీ. రిబ్బు దాస్ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా. నెట్లో పడతాడా? ‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్ఫ్రెండ్ కావాలి. నాకొక బాయ్ఫ్రెండ్ కావాలి...’ అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్ఫ్రెండ్ దొరికే వరకూ డేటింగ్ యాప్స్ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ను వడకడుతున్నారు. మరి డేటింగ్ యాప్స్లో ఆమె వేసిన నెట్లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్ యాప్స్ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అబిర్సేన్ గుప్త దర్శకుడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్ సినిమాలో ఉన్న హీరోయిన్ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్ సినిమాలకు ప్యారలల్గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చేంత మార్కెట్ వారికి ఏర్పడాలని ఆశిద్దాం. – గౌతమ్ మల్లాది ∙దిశా పటానీ -
ఉప్పునీటిలో చెరకు తీపివి
సినీ సెలబ్రిటీలు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం అన్నది శీతాకాలం చలిగా ఉంటుందన్నంత వాస్తవం. కోపం వస్తే ఒకరిని ఒకరు దూషించుకోవడం కూడా అంతే సహజం. అయితే ఇది కోపం సంగతి కాదు. కవిత్వం సంగతి! ఇటీవలే జన్మదినం జరుపుకున్న ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను పరిణీతి చోప్రా ప్రశంసల కవిత్వంతో ముంచెత్తారు. జన్మదినం జరుపుకున్నందుకు కాదు ఆ ప్రశంసలు. సానియా అంటే తనకెంత ఇష్టమో చెప్పే ప్రశంసలు. ‘‘అవాస్తవంలో వాస్తవానివి. ఉప్పు నీటిలో తీపి చెరకువి’’ అంటూ ఆమెపై పొగడ్తలు కురిపించారు పరిణీతి. సానియా పుట్టినరోజు పండుగను ఇలా తియ్యటి మాటలతో తన ఇన్స్టాగ్రామ్లో సెలబ్రేట్ చేశారు.‘‘నువ్వంటే చాలా ఇష్టం. అబద్ధమనే సముద్రంలో వాస్తవానివి నువ్వు, భూమి మీద జన్మించిన దేవతవు నువ్వు, స్వయంశక్తితో ఎదిగావు, తెలివైనదానివి, నెమ్మదస్తురాలివి, సరదాగా ఉంటావు. నవ్వుతూ నవ్విస్తావు. నేను నిన్ను చాలా ఇష్టపడటానికి కారణం, నువ్వు నన్ను నన్నుగా చూశావు’ అంటూ సాగింది ఆ కవిత్వం. -
మా జాగ్రత్తలు ఫలించలేదు
‘సైనా’ చిత్రానికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తా ‘సైనా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలి సిందే. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధాకపూర్ను ఎంపిక చేశారు. చిత్రీకరణ కూడా ప్రారంభించారు. శ్రద్ధాకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ప్రాక్టీస్ సమయంలో గాయపడటం, డేట్స్ క్లాష్ అవ్వడం.. ఇలా పలు కారణాలతో ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్నారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా పచ్చజెండా ఊపారు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. చిత్రీకరణ మొదట్లోనే పరిణీతి చోప్రా గాయపడటం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. ‘‘బ్యాడ్మింటన్ సాధనలో భాగంగా గాయపడకూడదని నేనూ, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు వహించాం. కానీ, మా జాగ్రత్తలు ఫలించలేదు. నేను గాయపడ్డాను. కోలుకొని త్వరలో చిత్రీకరణలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. -
గాయపడ్డ హీరోయిన్.. మెడకు బ్యాండేజ్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్... ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్ ఆడేందుకు మళ్లీ సిద్ధమైపోతాను అని పరిణీతి ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు. మెడకు బ్యాండేజ్తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పరిణీతి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇష్క్జాదే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన పరిణీతి.. శుద్ధ్ దేశీ రొమాన్స్, దావత్-ఏ-ఇష్క్, నమస్తే ఇంగ్లండ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన కేసరి, జబరియా జోడి సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా.. ప్రస్తుతం ఆమె సైనా షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్ను తీసుకోగా.. ఇతర సినిమాల కారణంగా కాల్షీటు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ అవకాశం పరిణీతి వరించింది. కాగా పరిణీతి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రో కజిన్ అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Dude. Me and the entire team of Saina have been taking so much care that I shouldn't get an injury, but shit happens. Will rest it as much as I can before I can start playing badminton again. 🙏 #SainaNehwalBiopic A post shared by Parineeti Chopra (@parineetichopra) on Nov 15, 2019 at 4:33am PST -
వాళ్లే నా సోల్మేట్స్: హీరోయిన్
‘వాళ్లే నా ఆత్మబంధువులు. నా స్నేహితులు. నా పిల్లలు. నా సర్వస్వం’ అంటూ బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా తన సోదరులపై ఉన్న ప్రేమ చాటుకున్నారు. తన కంటే చిన్నవాళ్లే అయినా వారెంతో పరిణతితో ఆలోచిస్తూ తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ భాయ్ దూజ్ వేడుక(భగినీ హస్త భోజనం)లో తన తమ్ముళ్లు సహజ్, శివాంగ్తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముళ్లతో కలిసి దిగిన ఫొటోను పరిణీతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నాలాగా ఉండమని చెబుతాను.. బాయ్ దూజ్ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ.. ‘నాకంటే చిన్నవాళ్లు అయినంత మాత్రాన నేను వాళ్లను గారాబం చేయను. నిజం చెప్పాలంటే వాళ్లే నాపై ఎక్కువ ప్రేమ కురిపిస్తారు. నాకు వాళ్లంటే ఎంతో ఇష్టం. నా జీవితం గురించిన మొత్తం విషయాలు వాళ్లకు తెలుసు. మా మధ్య దాపరికాలు ఉండవు. నాకు ప్రతీ విషయంలోనూ సలహాలు ఇస్తారు. నాకంటే గొప్పగా ఆలోచిస్తారు. ఒకవేళ నేను వాళ్లకు ఏదైనా చెప్పాల్సి వస్తే నాలాగే సంతోషంగా ఉండమని చెబుతాను. ఎన్ని బాధలు ఉన్నా.. కఠిన పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానాన్ని ఎంజాయ్ చేయమని మాత్రమే సలహా ఇస్తాను అని పేర్కొన్నారు. అదే విధంగా వేసవి కాలం సెలవుల్లో కెన్యాలో ఉండే తమ బామ్మ వాళ్ల ఇంటికి వెళ్లడం తమకు ఉన్న మధుర ఙ్ఞాపకాలు అని.. అక్కడ పార్కుల్లో తిరుగుతూ అందరం తెగ సందడి చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కాగా సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో ఒత్తిడి తట్టుకోలేక తాను డిప్రెషన్కు గురైనట్టు పరిణీతి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. View this post on Instagram The loves of my life! #HappyRakhi ❤️❤️❤️ @thisissahajchopra @shivangchopra99 A post shared by Parineeti Chopra (@parineetichopra) on Aug 26, 2018 at 5:59am PDT -
మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!
మంచి భర్త దొరకాలంటే తన అక్కలాగే కఠిన ఉపవాసాలు చేయాలని బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా అన్నారు. గురువారం కార్వా చౌత్(ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు) సందర్భంగా పలువురు బాలీవుడ్ తారామణులు తమ భర్తల కోసం ఉపవాస దీక్ష చేశారు. వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. తన భర్త నిక్ జోనస్తో కలిసి జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైన పిగ్గీ చాప్స్ అక్కడే ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా తమ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నిక్ జోనస్ సైతం భార్యతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ... ‘ నా భార్య భారతీయురాలు. తను హిందువు. అన్నింట్లోనూ అసమానమైనది. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు ఎన్నో విషయాలు వివరించింది. తనపై నాకున్న ప్రేమ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు అంటూ ప్రియాంకను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ క్రమంలో అందమైన జంట అంటూ ప్రియానిక్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రియాంక చెల్లెలు పరిణీతి చోప్రా కూడా అక్కాబావల ఫొటోలపై స్పందించారు. ‘ తను ఎప్పటినుంచో ఉపవాసాలు చేసింది. పరిపూర్ణమైన భర్తను పొందాలంటే ఇలాంటివి తప్పవని నిరూపించింది! నిజానికి భర్త కోసం ఉపవాసం చేయడం తనకు ఇదే మొదటిసారి!! మరి నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. కాగా మెట్లాగాలో చూపులు కలిపిన ప్రియాంక చోప్రా- నిక్ జోనస్లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రియాంక నటించి, నిర్మాతగా వ్యవహరించిన.. ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా విడుదల కాగా.. పరిణీతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్ జరుపుకొంటోంది. డిస్నీ ఫ్రోజెన్-2 సిరీస్లో చోప్రా సిస్టర్స్ ఎస్లా, అన్నా పాత్రలకు గాత్రదానం చేశారు. ఈ మూవీ నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram My wife is Indian. She is Hindu, and she is incredible in every way. She has taught me so much about her culture and religion. I love and admire her so much, and as you can see we have fun together. Happy Karva Chauth to everyone! A post shared by Nick Jonas (@nickjonas) on Oct 17, 2019 at 9:10pm PDT Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use . -
‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’
తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అన్నారు. ఒకనాకొక సమయంలో తన దగ్గర కనీస అవసరాలకు కూడా డబ్బు లేకుండా పోయిందని జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. మంగళవారం ఓ వెబ్సైట్తో ఆమె మాట్లాడుతూ...‘ 2014 నుంచి 2015 మధ్య కాలంలో ఏడాదిన్నర పాటు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నా. నేను నటించిన దావత్-ఎ-ఇష్క్, కిల్ దిల్ సినిమాలు సరిగ్గా ఆడలేదు. నా జీవితంలో అది చాలా కఠినమైన సమయం. ఒక్కసారిగా అవకాశాలు తగ్గి చేతుల్లో డబ్బుల్లేని పరిస్థితి. కొత్తగా ఇల్లు కొన్నాను. పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టాను. తీరా సమయానికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా జీవితంలో అదే అతిపెద్ద కుదుపు. రోజుకు పదిసార్లు గుక్కపట్టి.. గుండెపగిలేట్లుగా ఏడ్చేదాన్ని. అన్నం కూడా సహించేది కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండేదాన్ని’ అని తాను అనుభవించిన వేదన గురించి పరిణీతి పంచుకున్నారు. సాంత్వన చేకూర్చారు.. ‘ఓ గదిలో నన్ను నేను బంధించుకునేదాన్ని. సరిగ్గా నిద్రపట్టేది కాదు. వారాల కొద్దీ ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపేదాన్ని. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అయితే నా సోదరుడు సహజ్, నా స్టైలిస్ట్ సంజనా బాత్రా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. మానసిక ఆందోళనలో కూరుకుపోయిన నాకు సాంత్వన చేకూర్చారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకునేలా నన్ను ప్రోత్సహించి.. మామూలు మనిషిగా మారేందుకు తోడ్పడ్డారు’ అని పరిణీతి తన ఆప్త మిత్రుల గురించి చెప్పుకొచ్చారు. డిప్రెషన్కు మనిషి ప్రాణాలు తీసే శక్తి ఉంటుందని.. కాబట్టి మన వాళ్లు ఎవరైనా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే నిరంతరం వారిని గమనిస్తూ..కాపాడుకోవాలని సూచించారు. కాగా పరిణీతి... గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ అన్న సంగతి తెలిసిందే. ఇష్క్ జాదే సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ భామ...ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బొద్దుగా ఉన్నావంటూ వచ్చిన ట్రోల్స్కు పాజిటివ్గా స్పందించి ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గి పలువురికి ప్రేరణగా నిలిచారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్తో బిజీబిజీగా గడుపుతున్నారు. -
ప్రయాణం మొదలైంది
కథానాయిక పరిణీతి చోప్రా రైలు ప్రయాణం చేస్తున్నారు. అదితీరావ్ హైదరీ, కృతీకల్హారీ ఈ ప్రయాణంలో పరిణీతి చోప్రాకు తోటి ప్రయాణికులు. ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ఏ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేయలేదు. ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే హాలీవుడ్ సినిమా హిందీ రీమేక్ మూవీ కోసం తోటి ప్రయాణికులుగా తోడయ్యారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మేజర్ షూటింగ్ లండన్లో ప్లాన్ చేశారు. ఓ మిస్సింగ్ పర్సన్ కేసులో చిక్కుకున్న ఓ వివాహిత ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. పౌలా హాకిన్స్ ఫేమస్ నవల ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ ఆధారంగా అదే టైటిల్తో 2015లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’
‘నా ఇష్టసఖి, నా జీవితానికి వెలుగు అయినటువంటి ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ హాలీవుడ్ స్టార్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురువారం 38వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఇటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పుట్టినరోజు వేడుకలను భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా, సోదరి పరిణితి చోప్రాతో ఫ్లోరిడాలో సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఈ క్రమంలో తన భర్త నిక్ జోనస్ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ వీడియోను షేర్ చేశాడు. అంతేగాక జో జోనాస్, సోఫియా టర్నర్ వివాహంలో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రత్యేక సందేశం రాశాడు. ఇందులో ప్రియాంక గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా జోనస్ కుటంబం నుంచి కూడా ప్రియాంకకు శుభాకాంక్షలు అందాయి. అటు నిక్ తల్లి డెనిస్ మిల్లర్ జోనస్ పూర్వం ప్రియాంకతో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. అందమైన అమ్మాయికి అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపింది. నిక్ తండ్రి పాల్ కెవిన్ జోనస్ కోడలుగా తన కుటుంబంలోకి ప్రియాంక అడుగు పెట్టడం చాలా సంతోషమని, నీ రాకతో నిక్తో పాటు కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయిందంటూ ప్రశంసించాడు. ఇక మూడేళ్లుగా బాలీవుడ్కు సెలవిచ్చిన ప్రియాంక తాజగా ‘ద స్కై ఇజ్ పింక్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram She's looking🔥🔥🔥😫😍 @priyankachopra Via @nickjonas #MrandMrsJonas . . . . . #nickyanka #prick #priyanka #nick #bollywood #hollywood #picnic #nyc #joejonas #priyankachopra #nickjonas #picnic #jophie #jsisters #jobros #ny #cannes #CANNES2019 #PCatCANNES #peecee #piggychops #quantico #TSIP #desigirl #jonasbrothers #ifIcouldtellyoujustonething A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage) on Jul 18, 2019 at 8:38pm PDT -
ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు
యాక్టర్స్ జర్నీలో హిట్లు, ఫ్లాప్లు సహజం. కానీ, వారి కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారి ఎంతో కొంత ఆందోళన చెందుతుంటారు కొందరు హీరోహీరోయిన్లు. ఈ విషయంపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? అని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను అడిగినప్పుడు...‘‘ఒక సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమా ఆడుతుందా? లేదా? అనే విషయం నాకు తెలిసిపోతుంది. కానీ, అన్నివేళల మన ఊహ నిజం కాకపోవచ్చు. అందుకే ఆడియన్స్ నిర్ణయం కోసం ఎదురుచూడాలి. సినిమాల గురించి ఆడియన్స్ను మించిన విమర్శకులు లేరని నా అభిప్రాయం’’ అన్నారు పరిణీతి. మరి షూటింగ్ లొకేషన్లో సినిమా రిజల్ట్ని గెస్ చేయగలరా మీరు? అన్న ప్రశ్నను ఆమె ముందు ఉంచితే..‘‘కొన్ని సార్లు తెలిసిపోతుంది. కానీ నటిగా నా పాత్రకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. దానిపైన ఎక్కువగా ఫోకస్ పెడతాను. అందుకోసం ప్లాన్స్ వేస్తాను. ఇక సినిమా రిజల్ట్ను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు’’ అన్నారు పరిణీతి. ప్రస్తుతం ‘ద గాళ్ ఆన్ ది’ ట్రైన్ సినిమా కోసం ఆగస్టులో లండన్ వెళ్లనున్నారీ బ్యూటీ. అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ ను సెప్టెంబర్లో స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారామె. -
‘మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది’
‘ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీమ్ వావ్! నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. లవ్ యూ ఇషా. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది! నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. గర్ల్స్నైట్లో ఈ అమ్మాయిలు. అలియా ఈ ఇంతటి ఎంజాయ్మెంట్ను నువ్వు మిస్సయిపోయాం! లవ్ యూ ఆల్ లేడీస్! అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన బెస్టీ ఇషా అంబానీ పిరమాల్ ఇంట్లో కజిన్ పరిణీతి చోప్రా, రాధికా మర్చంట్ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ప్రియాంక ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి అంటూ లక్షల సంఖ్యలో లైకులు కొడుతున్నారు నెటిజన్లు. కాగా ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ- నీతాల ఏకైక కుమార్తె ఇషా అంబానీ వివాహం పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్తో గతేడాది డిసెంబరు 12న జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా ఇషా పరిణయం నిలిచింది. వివాహానంతం ఇషా, ఆనంద్ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. అరేబియా సముద్రం ఒడ్డున గల విలాసవంతమైన బంగ్లాను రూ.450 కోట్లు పెట్టి పిరమాల్ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్కు వెడ్డింగ్ గిఫ్ట్గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్ పిరమాల్ ఈ ఖరీదైన భవనాన్ని బహూకరించారు. ఇక ఈ ఇంటిలోనే ఇషా తన ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చారు. ఎంతో విలాసవంతమైన ఈ బంగ్లాను చూసి ముగ్ధురాలైన ప్రియాంక.. మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఇషాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. View this post on Instagram Making home made ice cream! Thank you to the hostess with the mostest. @_iiishmagish love u! Your home is amazing! I wish you love and laughter always. Here’s to many more girls nights!❤️💋 @aliaabhatt u Missed the madness by minutes! Love all u ladies! A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Apr 28, 2019 at 3:19pm PDT -
చుక్కలాంటి చక్కనమ్మ!
చక్కనమ్మ చిక్కకపోతే కష్టమే...లాంటి కామెంట్స్ను సీరియస్గా తీసుకొని, ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గి సన్నబడి ఆశ్చర్యంలో ముంచెత్తింది పరిణీతి చోప్రా. తాజాగా బాలీవుడ్ సినిమా ‘కేసరి’లో జీవనిగా మెరిసిన చోప్ర రేపోమాపో తెలుగు సినిమాల్లో కూడా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పక్కా యాక్షన్ సినిమాలో నటించాలని ఉంది’ అంటున్న పరిణీతి మనసులో మాటలు... అలా చేశాను! మూడురోజులు వార్తల్లో లేకపోతేనే ‘ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే’ అని గుసగుసలాడుకునే ఇండస్ట్రీ మనది. అలాంటిది ఆ మధ్య పదినెలలు బ్రేక్ తీసుకునేసరికి ఎన్నో గాసిప్స్ వినిపించాయి. అవకాశాలు లేక తీసుకున్న విరామం కాదు అది. నిజం చెప్పాలంటే... నా కెరీర్ గురించి సింహావలోకనం చేసుకోవడానికతీసుకున్న విరామం. ఎలాంటి పాత్రలు నాకు నప్పుతాయి, ఏవీ కావు అనే దాని గురించి విశ్లేషించుకున్నాను. ఈ విషయంలో ఆదిత్యచోప్రా, మనీష్శర్మ సహకరించారు. ఫిట్నెస్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.ఇప్పుడు నేను ఛార్జ్ కావడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి ఆ విరామమే కారణం. చబ్బీగా ఉంటేనే ఇష్టపడే అభిమానులకు బరువు తగ్గడం నచ్చలేదు అనుకోను. నా బరువులో మార్పే కాని వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు కదా! మిక్సింగ్! ఫిట్నెస్ అంటే ప్రతిరోజూ, ప్రతిపూటా మనల్ని మనం సవాలు చేసుకోవడం. ఈ సవాలులో మజా అనుభవించకపోతే వర్కవుట్స్ అంటేనే బోర్కొడుతుంది. అందుకే ఎప్పుడూ ఒకేరకమైన వర్కవుట్స్ కాకుండా మిక్స్ చేస్తుంటాను. నా విషయానికి వస్తే గంట నుంచి రెండు గంటల వరకు డ్యాన్స్ చేస్తాను. స్విమ్మింగ్ చేస్తాను. కేరళ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు సాధన చేస్తాను. పాడుతా తీయగా... సినిమా చూశాం అంటే చూశాం అన్నట్లు కాకుండా ఆ సినిమాలో నుంచి ఏదో ఒక విషయంలో మనం ఇన్స్పైర్ కావాలి. ఫలానా స్కర్ట్ ధరించాలనో, ఫలనా హెయిర్స్టైయిల్ ఫాలో కావాలనో, ఇలాంటి గుణాలున్న వ్యక్తిని జీవితభాగస్వామిగా ఎంచుకోవాలనో... ఇలా ఏదైనా కావచ్చు.కామెడీ సినిమాలో నటించాలనే కోరిక ‘గోల్మాల్’తో తీరినా మంచి యాక్షన్ సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉంది.మ్యూజిక్ అంటే మొదటి నుంచి ఆసక్తి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే రోజుల్లో కూడా ఫస్ట్ఫ్లోర్లో అటు ఇటూ నడుస్తూ పాడేదాన్ని. మ్యూజిక్ను సీరియస్గా తీసుకుంటాను. ఎన్నో పాటలు పాడాలని, లైవ్ షోలు చేయాలనే కోరిక ఉంది. -
ట్రైనింగ్ స్టార్ట్
బ్యాడ్మింటన్ గ్రౌండ్లోకి దిగి చెమటోడుతున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ఇదంతా ‘సైనా’ బయోపిక్ కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘సైనా’ అనే చిత్రం సంగతి తెలిసిందే. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పరిణీతీ చోప్రా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి వర్కౌట్ చేస్తున్నాను. రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు సైనా ఆడిన మ్యాచ్లను చూశాను. సిల్వర్ స్క్రీన్పై సైనాలా ఆడేందుకు అవి నాకు చాలా ఉపయోగడతాయి. మంచి టీమ్ దొరికింది. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను’’ అని పేర్కొన్నారు పరిణీతీ చోప్రా. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ముందుగా సైనా బయోపిక్ కోసం శ్రద్ధాకపూర్ను తీసుకున్నారు. కానీ శ్రద్ధా డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆమె తప్పుకున్నారు. -
పిన్నిని అయ్యాను.. ఇక శాశ్వతంగా ఇక్కడే!
‘ నేనిప్పుడు పిన్నినయ్యాను!!! ఇజ్జూను చూస్తుంటే తినేయాలని అన్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి నా చేతిని తినేందుకు తనకు అనుమతినిచ్చాను. సానియా నీ కుమారుడిని శాశ్వతంగా నా దగ్గరే పెట్టుకోనా’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తనయుడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరిణీతి ఒళ్లో కూర్చుని ఆమె చేతిని ఆత్మీయంగా తాకుతున్న ఇజహాన్ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. ‘మీరిద్దరు చాలా క్యూట్గా ఉన్నారు’ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చిన నెటిజన్లు 5 లక్షలకు పైగా లైకులు కొట్టారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంకో టెర్రరిస్టు పుట్టాడు. భవిష్యత్తులో ఇలాంటి వారి వల్ల దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి’ అని విషం చిమ్మారు. కాగా గతేడాది అక్టోబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్ మాలిక్ అతడికి ఇజహాన్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడికి సంబంధించిన ఫొటోలను సానియా తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. View this post on Instagram I’m a khaala now!!!! Izzu is edible and I want to eat him, but for now I’m allowing him to eat my hand 💋💋 @mirzasaniar Can I keep this child foreverrrrrr 😍😍 A post shared by Parineeti Chopra (@parineetichopra) on Apr 1, 2019 at 5:49am PDT -
శ్రద్ధా కపూర్ ఔట్.. పరిణితీ ఇన్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’.. విభిన్న చిత్రాల దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైనా బయోపిక్ కోసం కొంత కాలం గ్రౌండ్ వర్క్ చేసిన శ్రద్ధాకపూర్... బ్యాడ్మింటన్లో శిక్షణ కూడా తీసుకున్నారు. లుక్స్ పరంగా కూడా సైనా నెహ్వాల్కు దగ్గరగా ఉండే శ్రద్ధాకపూర్... స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందనే క్యూరియాసిటీ కూడా జనాల్లో పెరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగ్యూ జ్వరం సోకండంతో గతేడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఉన్న శ్రద్దకు ‘సైనా’చిత్రానికి డేట్స్ కుదరటం లేదు. దీంతో తన కారణంగా ఈ సినిమా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ద తప్పుకున్నారు. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2020లో విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం.. శ్రద్ద స్థానంలో మరో హీరోయిన్ పరిణీతి చోప్రాను తీసుకున్నారు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3D’, ‘భాగి 3’ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. -
శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ కేసరి. ‘బ్యాటిల్ ఆఫ్ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజుర్ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణితీ చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మా బావ వజ్రం
గతేడాది డిసెంబర్లో ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ల వివాహం ఎంత సందడిగా జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ పెళ్లి సమయంలో ప్రియాంకా చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రాకు ‘జూతా చుపాయి’గా సందడిలో నిక్ 5 లక్షల రూపాయలను ఇచ్చినట్లు బాగా ప్రచారం జరిగింది. జూతా చుపాయీ అంటే.. పెళ్లి కొడుకు పాద రక్షలను మరదలు దాచేస్తుంది. అవి కావాలంటే బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అప్పుడు పెళ్లి కొడుకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. పరిణీతీకీ నిక్ 5 లక్షలు ఇచ్చారని బాలీవుడ్లో చెప్పుకున్నారు. ‘‘ఆయన ఎంత విలువైన బహుమతి ఇచ్చారో మీకు తెలీదు. నిక్ మమ్మల్ని షాక్కు గురి చేశారు’’ అని పెళ్లి వేడుకలప్పుడు పరిణీతి ట్వీట్ చేశారు. ఇటీవల ఈ విషయం గురించి ఓ టీవీ షోలో పెదవి విప్పారామె. ‘‘జూతా చుపాయి అప్పుడు మా బావ నిక్ ఓ ట్రేని తీసుకురమ్మని తన బంధువులకు సైగ చేశారు. అందులో ఉన్న డైమండ్ రింగ్స్ను మాకిచ్చారు. అంత విలువైన బహుమతిని ఊహించలేదు. దాంతో అంతా షాక్ అయ్యారు. నిక్ ఈజ్ బెస్ట్. మా అక్కకు మంచి భర్త దొరికాడు. మంచి వ్యక్తి’’ అని బావని పొగిడారు పరిణీతి. అంటే ‘మా బావ వజ్రం’ అని చెబుతున్నట్లే కదా. -
బ్యాచిలరెట్ పార్టీ
ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పెళ్లి మూడ్లో ఉన్నారు. రీసెంట్గా న్యూయార్క్లో ‘బ్రైడల్ షవర్’ వేడుక జరుపుకున్న ఆమె తాజాగా తన గాళ్స్ గ్యాంగ్తో కలసి ‘బ్యాచిలరెట్ పార్టీ’కి సిద్ధమయ్యారు. పెళ్లి ఫిక్సయ్యాక అబ్బాయిలు బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటారు కదా. అమ్మాయిలు చేసుకునే పార్టీని ‘బ్యాచిలరెట్ పార్టీ’ అంటారు. ఈ పార్టీలో ప్రియాంక కజిన్ సిస్టర్ పరిణితీ చోప్రా కూడా జాయిన్ అయ్యారు. నెదర్ల్యాండ్స్లోని అమస్టర్డ్యామ్లో ‘బ్యాచిలరేట్ పార్టీ’ జరుపుకున్నారు. నిక్ జానస్తో ప్రియాంకా చోప్రా వివాహం డిసెంబర్ 1న జోద్పూర్లో జరగనుంది. అక్కడి మెహరంగ్ ఫోర్ట్లో ఈ నెల 29న సంగీత్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని సమాచారం. పార్టీలు, పెళ్లి పనులు చేసుకుంటున్నారు కానీ ‘ప్రియానిక్’ వేడుకల తేదీలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. -
పెళ్లిలో రూ. 37 కోట్లు డిమాండ్ చేసింది!
కాబోయే బావగారిని ఏకంగా 37 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఆయనేమి తక్కువ తిన్నాడా? ఆమె అడిగినంతా ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడు. పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ‘జూతా చురానా’ ఆట ఆడతారు. పెళ్లి కొడుకు చెప్పులను మరదళ్లు దొంగిలించి దాచేస్తారు. డబ్బులు ఇస్తేనే చెప్పులు తిరిగిస్తారు. ఉత్తరాది పెళ్లి వేడుకల్లో ఈ ఆట తప్పసరిగా ఉంటుంది. డబ్బుల గురించి పెళ్లికి ముందే నిక్ జొనాస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ‘బాలీవుడ్ హంగామా’ తో పరిణీతి చెప్పింది. ‘మా బావగారిని 5 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 37 కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేశాను. అలాగే అని చెప్పి 10 డాలర్లు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారు. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అయితే నేను ఎంత అడిగినా ఇస్తారు. ఎందుకంటే నేను ఆయన ప్రియమైన మరదలిని’ అంటూ చెప్పుకొచ్చింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రియాంక, నిక్ పెళ్లి జరగనుందని సమాచారం. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుపుతారట. పెళ్లికి 200 మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని అనుకుంటున్నారట. ఆగస్టు 18న ప్రియాంక, నిక్ నిశ్చితార్థం జరిగింది. -
‘తను ఆ మాట చెప్పగానే ఏడ్చేశాను’
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్లు.. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్లలో క్రేజీ కపుల్. పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లవ్బర్డ్స్ తమ ప్రేమ విషయాన్ని మొదట తనకే చెప్పారని ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ ఆరోజు అక్క(ప్రియాంక చోప్రా) బర్త్డే. ఉదయం 3 గంటలకు తన మిస్స్డ్ కాల్ ఉంది. వెంటనే తనకి వీడియో కాల్ చేశాను. అప్పుడే తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. దాంతో నాకు స్పృహ తప్పినంత పనైంది. అంతలోనే నిక్ కూడా కాల్లో జాయిన్ అయ్యాడు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఇద్దరూ ఒకేసారి నాకు చెప్పారు. తమ ప్రేమ గురించి నాకే మొదటగా చెప్పామన్నారు. నేను ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఆనందంతో ఏడ్చేశాను. వారిద్దరు చూడముచ్చటైన జంట’ అంటూ అక్కా బావలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పరిణీతి చోప్రా. అంతేకాకుండా.. ‘నిక్ ఎంతో పరిణతి కలిగిన వ్యక్తి. తను అక్కను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పెద్దమ్మ అంగీకారం కోసం చాలా కాలం ఎదురుచూశాడు. అంతా సవ్యంగా జరిగింది. ప్రస్తుతం అందరం హ్యాపీగా ఉన్నాం. మా అక్కని జాగ్రత్తా చూసుకోవాలంటూ తనని ఎప్పుడూ ఆటపట్టిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ కొంటె మరదలు పిల్ల. -
‘నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’
హీరో, హీరోయిన్లు బయట ఎక్కడైనా జంటగా కనిపిస్తే వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు. అంతటితో ఆగక పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రచారమే బాలీవుడ్ నటులు పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ల విషయంలో జరుగుతోంది. ప్రచారంతో ఊరుకోక ‘ఇంతకూ మీరిద్దరు వివాహం ఎప్పుడు చేసుకుంటారం’టూ నెటిజన్లు వీరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల అత్యుత్సాహానికి తగ్గట్టుగా పరిణితీ ‘నాకు డేట్స్ ఖాళీ లేవు’.. అంటే అర్జున్ కపూర్ ఏకంగా ‘నేనింకా చిన్న పిల్లవాడిని పెళ్లీడు రాలేదంటూ’ సమాధానమిచ్చారు. ఇంతకు విషయం ఏంటంటే ప్రస్తుతం అర్జున్ కపూర్, పరిణీతి జంటగా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ బ్రైడ్స్ మ్యాగజైన్ ఫొటో షూట్లో పాల్గొని.. నూతన దంపతులుగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ‘వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారం’టూ ఓ ఆంగ్ల మీడియా కథనాల్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్, పరిణీతి కాస్తా వెరైటీగా స్పందించారు. What an amazing moment for @ParineetiChopra ! Congratulations on this amazing opportunity of sharing the cover with me !!! 👏 These newcomers I tell u...u say hi & they come sit on ur lap !!! Bachpan se godh mein utha ke chal Raha hoon tumhe... lucky girl !!! @bridestodayin Clothing : @falgunishanepeacockindia Jewellery by : @hazoorilaljewellers Editor : @nupurmehta18 Photographer : @errikosandreouphoto Fashion Editor : @ayeshaaminnigam Fashion Stylist : @shauryaathley HMU (for Arjun) : #YogeshPathare and @aalimhakim Hair Assisted by : @arsalan4331 HMU (for Parineeti) : @danielbauermakeupandhair Producer : #AnomalyProductions A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 1, 2018 at 4:38am PDT ఈ విషయం గురించి పరిణీతి ‘నో...అర్జున్ కపూర్ నన్ను క్షమించు. నాకు డేట్లు ఖాళీగా లేవు. నా మేనేజర్ను సంప్రదించు’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా అర్జున్ కపూర్ ‘నేనింకా చిన్నపిల్లాడినే. పెళ్లికి తొందరేం లేదు. పరిణీతి.. నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్ సంభాషణ, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం పరిణీతి, అర్జున్ జంటగా ‘ఇషక్జాదే’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంతో పాటు ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. -
పిశాచిలా ఉన్నావ్.. మీరు సరిగా చూడలేదు!
‘ఏంటా హెయిర్ స్టయిల్.. పిశాచిలా, భూతంలా కన్పిస్తున్నావ్.. అసలెవరైనా జుట్టుకు ఎరుపు రంగు వేసుకుంటారా’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అయితే పరిణీతి మాత్రం... ‘ ఎరుపు రంగు అని ఎవరు చెప్పారు. అది బర్గండి’ అంటూ కూల్ ట్వీట్తో తనను ట్రోల్ చేసిన వాళ్లకు టిట్ ఫర్ టాట్ ఇచ్చారు. అసలు విషయమేమిటంటే... ప్రస్తుతం ‘నమస్తే ఇంగ్లండ్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న పరిణీతి... తన తదుపరి సినిమా ‘జబరియా జోడి’ కోసం కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకున్నారట. ఆ సినిమా నిర్మాత రుచికా కపూర్ సలహా మేరకు.. బర్గండి కలర్తో డై చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి పరిణీతి హెయిర్ స్టైల్ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన పరిణీతి.. ‘ఇదివరకు ఎప్పుడు ప్రయత్నించని పని చేయాలనుకున్నాను. రుచికా సలహా మేరకు ఇలా ట్రెండీగా తయారయ్యాను. కానీ ఇష్టమైన హెయిర్ స్టైల్ మెయింటేన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఈరోజు నాకు ఆ ఓపిక వచ్చేసిందంటూ’ వ్యాఖ్యానించారు. కాగా ఇలా విచిత్రమైన స్టైల్స్తో పరిణీతి నెటిజన్ల చేతికి చిక్కడం ఇదేమి కొత్త కాదు. BURGUNDY! 🐙🍇🧞♀️ pic.twitter.com/7RioMQlsfF — Parineeti Chopra (@ParineetiChopra) August 31, 2018 -
క్లాస్కి వెళ్తున్నాను!
క్యారెక్టర్కి అనుగుణంగా మారిపోవడం పరిణీతీ చోప్రాకు చాలా ఇష్టం. అందుకే సినిమా సినిమాకు వ్యత్యాసం చూపించడానికి ట్రై చేస్తుంటారామె. తన లేటెస్ట్ సినిమా ‘జబరియా జోడీ’లో బిహారీ అమ్మాయిగా కనిపించనున్నారు. దాని కోసం భోజ్పురీ భాష నేర్చుకుంటున్నారట. భోజ్పురీ భాష సరిగ్గా పలకడం కోసం ఒక ట్యూటర్ని కూడా పెట్టుకున్నారు పరిణీతి. కొత్త భాష నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘యాక్టర్స్గా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రకరకాల పాత్రల్లో కనిపించడం మా అదృష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చాలెంజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం ట్రైనింగ్ (భోజ్పురీ భాష నేర్చుకోవడం గురించి) చాలా సరదాగా నడుస్తోంది. చిన్న చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వదలుచుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు పరణీతి. -
కునుకు కరువాయె...
నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్స్క్రీన్పై ఎగ్జామ్స్ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్లో వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్ ఎక్కడో తెలుసా? కేరాఫ్ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్ రామ్కి కూడా నిద్ర నహీ. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్గా నైట్షూట్స్లో పాల్గొన్నారు. కానీ తెలుగు సినిమా కోసం కాదు. కోలీవుడ్ సినిమా కోసం. కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్లో కార్తీ, బాలీవుడ్లో అజయ్దేవగన్ సినిమాల షెడ్యూల్స్లో పాల్గొని అలసిపోయారు. కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్ షూట్స్లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ చివరి రోజు తల్లి సెట్స్కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్ కంప్లీటైన వెంటనే అజయ్ దేవగన్æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్కు యస్ చెప్పారు హృతిక్ రోషన్. ‘సూపర్ 30’లో ఆయన బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నైట్ షూట్లో పాల్గొంటూ హృతిక్ డే టైమ్లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమా కోసం లండన్లో టైమ్కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్ షా దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ నైట్ టైమ్లో జరుగుతోంది. ఫోర్ డేస్ బ్యాక్ సాంగ్ను కూడా షూట్ చేశారు. నిద్ర లేకుండా వర్క్ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్ ఈజ్ వర్షిప్’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్ గురూ.సినిమా అంటే నైన్ టు సిక్స్ జాబ్ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా? ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి తల్లితో రకుల్, అనూ ఇమ్మాన్యుయేల్, హృతిక్ -
ఐపీఎల్ 2018: పరిణీతి చోప్రా షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : ఐపీఎల్ 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటీనటులు అలరించబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం రణ్వీర్ సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్లు స్టేజీపై తమ ప్రదర్శన ఇవ్వాల్సిఉంది. ఇప్పటికే గాయం కారణంగా రణ్వీర్సింగ్ ఐపీఎల్ ప్రారంభ వేడుకల నుంచి తప్పుకోవడంతో హృతిక్ రోషన్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభ వేడుకలకు ఒక్క రోజు ముందు ఐపీఎల్ నిర్వాహకులకు పరిణీతి చోప్రా షాక్ ఇచ్చారు. విరామం లేని షూటింగలతో బిజీగా ఉండటంతో ఈ మెగా ఈవెంట్లో చేయబోయే ప్రదర్శనకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదని వివరించారు. ప్రదర్శనకు సరిగా ప్రాక్టీస్ లేకుండా పాల్గోనడం తనకు నచ్చదని అందుకే ప్రారంభవేడుకల్లో ప్రదర్శన చేయబోనని ఈవెంట్ ప్రొడ్యూసర్లకు ఈ బాలీవుడ్ బ్యూటీ చెప్పేసిందని సమాచారం. మరీ ఐపీఎల్ నిర్వాహకులు పరిణీతి చోప్రా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. పరిణీతి పాల్గోనకపోతే ఈ వేడుకకి గ్లామర్ తగ్గిపోతదనే ఆలోచనలో ఐపీఎల్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో అలరించేది వీరే..!
ముంబై : ఐపీఎల్ 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వచ్చే నెల 7న జరుగబోతున్న 11వ సీజన్ ఆరంభ వేడుకల్లో యంగ్ బాలీవుడ్ యాక్టర్స్ అలరించబోతున్నారు. రణ్వీర్ సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్లు స్టేజీపై తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ఇక తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య జరుగనుంది. గత రెండేళ్లుగా ఐపీఎల్కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ప్రారంభ వేడుకలకు మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ నటులతో పాటు మ్యాచ్ జరుగుతున్న ఇరుజట్ల కెప్టెన్లు మాత్రమే పాల్గొననున్నారు. ఆరంభోత్సవం రోజే తొలి మ్యాచ్ జరుగుతుండటం, మరుసటి రోజు మ్యాచ్లకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బీసీసీఐ మిగతా కెప్టెన్లకు పాల్గొవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో గౌతమ్ గంభీర్(ఢిల్లీ డేర్డెవిల్స్), రవిచంద్రన్ అశ్విన్(కింగ్స్ ఎలవెన్ పంజాబ్), దినేశ్ కార్తీక్ (కోల్కత్తా నైట్రైడర్స్), విరాట్ కోహ్లీ(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), డేవిడ్( సన్రైజర్స్ హైదరాబాద్), స్టీవ్ స్మిత్(రాజస్తాన్ రాయల్స్) హాజరుకావడం లేదు. అయితే ఒక రోజు ముందే కెప్టెన్ల ప్రసంగాన్ని రికార్డు చేసి వేడుకల సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే ఈ సారి ఐపీఎల్ ప్రారంభ వ్యయాలను మాత్రం రూ.30 కోట్ల నుంచి రూ.20 కోట్లకు తగ్గించారు. -
ఎక్కడున్నావ్ పరీ?! ఎలా ఉన్నావ్ పరీ?!
సరిగ్గా రెండు రోజుల క్రితమే పరిణీతి చోప్రా మాల్దీవుల్లోని తన ‘జాలీడేయింగ్’ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లోని పరిణీతి ముఖంలో.. ఆ దీవుల్లోని అందమంతా ప్రతిఫలించింది. ఏదో పొలిటికల్ సంక్షోభం. ‘అయ్యో! మన పరిణీతి ఎలా ఉందో’ అని అభిమానులు కలవరపడటం మొదలుపెట్టేశారు. ట్వీటర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ వీలైతే అక్కడ.. బీ సేఫ్ పరీ, టేక్ కేర్ పరీ.. అని పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే అటువైపు నుంచి, అంటే... పరిణీతి వైపు నుంచీ రెస్పాన్స్ ఏమీ రాలేదు. దాంతో వీళ్ల కంగారు మరింత ఎక్కువైంది. ‘ఎక్కడున్నావ్ పరీ.. ఎలా ఉన్నావ్ పరీ.. ఒక్క పోస్టు పెట్టి వెళ్లిపో పరీ’ అని ప్రాధేయపడుతున్నారు. ఎమర్జెన్సీలో పరిస్థితులు ఊహించని విధంగానే ఉంటాయి. అయితే.. ఏ దేశమైనా అలాంటి పరిస్థితుల్లో విదేశీ టూరిస్టుల భద్రతను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ముందు వాళ్లనే విమానం ఎక్కించి పంపించేస్తుంది. పరిణీతి కూడా నేడో రేపో ఇండియా వచ్చేయొచ్చు. బహుశా ఇప్పుడు ఇండియాకు వచ్చే దారిలో కూడా ఉండి ఉండొచ్చు. కనుక ఆమె ప్రాణాలను తమ అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న ఫ్యాన్స్... ఆ టెన్షన్ వదిలేసి, విదేశీయానాన్ని విజయవంతంగా ముగించుకుని వస్తున్న పరిణీతి శుభాకాంక్షల్ని సిద్ధం చేసుకోవచ్చు. -
కేసరికి జోడీగా..
పాత్రల పరంగా వైవిధ్యం చూపించే హీరోల లిస్ట్లో అక్షయ్ కుమార్ పేరు ఉంటుంది. ‘ప్యాడ్మ్యాన్’లో సమాజానికి మేలు చేసే వ్యక్తిగా, బల్బీర్ సింగ్ బయోపిక్ ‘గోల్డ్’ సినిమాలో హాకీ ప్లేయర్గా, సంగీత దర్శకుడు గుల్షన్కుమార్ బయోపిక్లో టైటిల్ రోల్లో... ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేస్తున్నారు అక్షయ్కుమార్. ఇక, ‘2.0’లో అయితే ‘క్రౌమ్యాన్’ క్యారెక్టర్లో కనిపించనున్నారు. పక్షుల మనుగడ కోసం రోబోటిక్ టెక్నాలజీ వాడే వ్యక్తి పాత్రలో డిఫరెంట్ లుక్లో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా మరో డిఫరెంట్ రోల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్షయ్. ఆ చిత్రం పేరు ‘కేసరి’. ఇప్పటికే విడుదలై అక్షయ్ లుక్ ఆకట్టుకుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ చరిత్రలతో జరిగిన పెద్ద యుద్ధాలలో ఓ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో కథానాయికగా పరిణీతీ చోప్రాను ఎంపిక చేశారు. ‘‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందానికి థ్యాంక్స్’’ అన్నారు పరిణీతీ చోప్రా. -
ప్చ్.. గ్లామర్ తగ్గుతోంది!
కెమెరా.. యాక్షన్.. రోలింగ్... ఈ పదాలను పదే పదే చెప్తున్నారు కానీ ప్యాకప్ అనే మాట మాత్రం అంత ఈజీగా చెప్పడం లేదట బాలీవుడ్ దర్శకుడు దిబాకర్ బెనర్జీ. రోజుకి ఆల్మోస్ట్ 16 గంటలకు పైగా షూటింగ్ జరుపుతున్నారట. ఇలా ఏదో ఒక రోజు అయితే పర్వాలేదు కానీ కంటిన్యూస్గా నాలుగు రోజులుగా లొకేషన్లో ఇదే జరగడంతో డీలా పడిపోయారట హీరోయిన్ పరిణీతి చోప్రా. ‘షాంఘై, బాంబే టాకీస్’ వంటి హిందీ చిత్రాలను రూపొందించిన దిబాకర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. అర్జున్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, పరిణీతి కార్పొరేట్ అమ్మాయి రోల్ చేస్తున్నారు. ‘‘షూటింగ్ లొకేషన్లో ఆల్రెడీ 16 గంటలు గడిచిపోయాయి. ఇంకా ప్యాకప్ చెప్పలేదు. నాలుగు రోజుల నుంచి సరిగా నిద్రపోలేదు. నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసుగా... గ్లామర్ తగ్గిపోతుంది’’ అని పేర్కొన్నారు పరిణీతి. అదండీ సంగతి. అందమైన అమ్మాయికి ఆ మాత్రం బెంగ ఉండదంటారా. -
ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు : హీరోయిన్
గోల్ మాల్ ఎగైన సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యూనిట్ సభ్యులు సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ కాళీ సమయాల్లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా హ్యాపీగా ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన వీడియోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన హీరోయిన్ పరిణితీ చోప్రా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. క్రికెట్ ఆడుతుండగా దర్శకుడు రోహిత్ శెట్టి తనను మోసం చేసి అవుట్ చేశాడని కామెంట్ చేసిన పరిణితీ చీటర్ చీటర్ చీటర్ అంటూ స్మైలీస్ ను జత చేసి ట్వీట్ చేసింది. నిజానికి ఆ సమయంలో రోహిత్ అవుట్ అయినా.. పరిణితీ అవుటైనట్టుగా చెప్పటంతో ఆమె సరదాగా ఈ కామెంట్స్ చేసింది. రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గోల్ మాల్ ఎగైన అక్టోబర్ 20న రిలీజ్ అయి ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. When Rohit sir cheated and got me out!!!! Cheater cheater cheaterr 😍🤣😍 #RohitShetty pic.twitter.com/jPGkA1IyOX — Parineeti Chopra (@ParineetiChopra) 18 November 2017 -
ప్యారీ పరిణీతీ... టిప్స్ చెప్పవా?
...అనడుగుతున్నారట సోనాక్షీ సిన్హా! ఇంతకీ, ఏం టిప్స్ అడుగుతున్నారు? అంటే... వెయిట్ లాస్ టిప్స్ అట! ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? సోనాక్షి బొద్దుగా ఉన్నా... బీటౌన్ ప్రేక్షకుల అభిమానం బాగుంది కదా! అనే సందేహం రావొచ్చు. అయితే... మరింత స్లిమ్ముగా అవ్వాలని సోనాక్షి సీరియస్గా నిర్ణయం తీసుకున్నారట! ఎందుకంటే... ఎవరికీ తెలీదు. బట్, సల్మాన్ఖాన్ ‘దబాంగ్–3’ షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు స్లిమ్ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్లీ... హీరోయిన్ కాక ముందు సోనాక్షీ సిన్హా ఇంత కంటే బొద్దుగా ఉండేవారు. ఒక్కసారి హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాక చాలా బరువు తగ్గారు. అటువంటప్పుడు, ఓల్డ్ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు కదా! పరిణీతి చోప్రాను టిప్స్ అడగడం ఎందుకు? అంటే... ఒకప్పుడు పరిణీతి కూడా సోనాక్షిలా బొద్దుగా ఉండేవారు. గత రెండేళ్లలో బాగా బరువు తగ్గారు. ‘గోల్మాల్ ఎగైన్’లో పరిణీతిని చూసిన సోనాక్షి సర్ప్రైజ్ అయ్యారట! అందుకే, ఆమెను టిప్స్ చెప్పమని అడుగుతున్నారట! ‘దబాంగ్–3’లో సోనాక్షి ఎంత స్లిమ్ముగా కనిపిస్తారో... వెయిట్ అండ్ సీ!! -
ఛాన్స్ దొరికితే ఆయన అన్ని సినిమాల్లో నటిస్తా!
ముంబయి : ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె లేటెస్ట్ గోల్మాల్ అగెయిన్. ఆ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఆమె తన అభిమానం చాటుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. రోహిత్ ఛాన్సిస్తే ఆయన ప్రతి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నటీనటులతో పాటు సిబ్బందిని రోహిత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, అందుకే రోహిత్ అంటే తనకెంతో గౌరవమని పరిణీతి చోప్రా అన్నట్లు సమాచారం. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కరీనా కపూర్లు గోల్మాల్ ఫ్రాంచైజీలతో సందడి చేశారు. ప్రస్తుతం తనకు గోల్మాల్ లేటెస్ట్ మూవీలో నటించే అవకాశం కారణంగా సంబరాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. రోహిత్ తెరకెక్కించే సినిమాల్లో పనిచేయాలన్నది పరిణీతి కోరిక. అలాంటిది రోహిత్ 'గోల్మాల్ అగెయిన్'లో ప్రధానపాత్ర ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా పరిణీతి భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గోల్మాల్ తాజా సిరీస్ షూటింగ్ ముగియడంతో పరిణీతి ఏదో కోల్పోయినట్లుగా కాస్త దిగాలుగా కనిపిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. -
క్రికెటర్తో నటి ప్రేమాయణం గాల్లోనే....
సాక్షి, ముంబై: ఓ షర్మిలా ఠాగూర్-మన్సూర్ అలీ పటౌడీ, ఓ సంగీత బిజ్లానీ-అజారుద్దీన్, ఓ అనుష్క-విరాట్ కోహ్లీ.. ఇలా బాలీవుడ్ ప్యార్లో బోల్డయిన క్రికెటర్లు బోలెడంత మంది. ప్రేమ కథల్లో తేలినవి కొన్నయితే.. తెలీకుండా పోయినవి మరికొన్ని. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా క్రికెటర్తో ప్రేమాయాణం నడిపిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా-క్రికెటర్ హర్థిక్ పాండ్యాల మధ్య ఏదో నడుస్తుందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం వారి మధ్య రీసెంట్ గా జరిగిన ట్విట్టర్ సంభాషణే. అసలేం జరిగిందంటే... ఓ సైకిల్ ఫోటోను పోస్ట్ చేసిన పరిణితి.. అమేజింగ్ పార్టనర్తో ఫర్ఫెక్ట్ ప్రయాణం కోరుకుంటున్నట్లు... ఓ సందేశం ఉంచింది. దీనికి వెంటనే స్పందించిన క్రికెటర్ హర్ధిక్ బహుశా ఇది బాలీవుడ్ క్రికెట్ లింకులో రెండోదేమో అంటూ ఓ రిప్లై ఇచ్చాడు. దానికి పరిణితి తానేం సమాధానం చెప్పలేనంటూ దాటవేసింది. అంతే అప్పటి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమాయణం నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసేసింది. ఇక వ్యవహారం బాగా ముదిరిపోవటంతో పరిణితి ఓ ట్విట్టర్ వీడియోలో తన సందేశం ఉంచింది. జియోమీ కొత్త ఫోన్ 5ఎక్స్ ప్రచారంలో భాగంగానే తాను పార్టనర్ ట్వీట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చుకుంది. అయితే అలాంటప్పుడు హర్దిక్ ‘క్రికెట్-బాలీవుడ్‘ అంటూ ట్వీట్ ఎందుకు చేశాడంటూ మరికొందరు ఆ అనుమానాలను అలాగే కొనసాగిస్తుంటే.. ఇంకొందరేమో ఆ యాడ్ లో బహుశా ఇద్దరూ కలిసి నటిస్తారేమోనని చెబుతున్నారు. ఆ సంగతి ఏమోగానీ ప్రస్తుతం గోల్ మాల్ 4 చిత్రంలో పరిణితి నటిస్తోంది. For all those who are curious about the on going rumours. Here's the real story behind my new partner -
మాంచెస్టర్ ఘటనపై స్పందించిన హీరోయిన్
ముంబై : మాంచెస్టర్ బాంబు దాడి ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ట్విట్టర్లో స్పందించింది. ఉగ్రవాది జరిపిన దాడిని ఖండించింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆమె నివాళులర్పించింది. తాను మాంచెస్టర్ నగరంలో మూడేళ్లు ఉన్నానని, ఎంతో స్నేహపూర్వకమైన, అద్భుతమైన నగరమని చోప్రా తెలిపింది. అలాంటి ప్రశాంతమైన నగరంలో ఈ ఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నానని పరిణీతి పేర్కొంది. ఈ నెల 22న అమెరికన్ గాయకురాలు అరియానా గ్రాండె షోలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 22 చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకంలో సుమారు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 16 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Cant believe what happened in Manchester.It was my home for 3 years,truly the friendliest and most loving city. #manchesterattack — BINDU (@ParineetiChopra) 30 May 2017 -
ఆ నటివి పచ్చి అబద్ధాలు: స్కూల్మేట్ మండిపాటు
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా మరోసారి చిక్కుల్లో పడింది. తాను చదువుకునే రోజుల్లో తమది పేద నేపథ్యమని, అప్పట్లో తమ కుటుంబానికి కారు కూడా ఉండేది కాదని పరిణీత పచ్చి అబద్ధాలు చెప్పిదంటూ స్కూల్మేట్గా భావిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. గతంలో లావుగా ఉన్న ఓ స్నేహితురాలిని సోషల్ మీడియాలో విమర్శించడంతో నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఆమె తాను చదువుకున్న రోజుల గురించి అన్నీ అబద్ధాలే చెప్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత నెలలో పరిణీత చోప్రా, హీరో అక్షయ్కుమార్ కలిసి ముంబైలోని ఓ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిణీత మాట్లాడుతూ తాను స్కూల్లో ఉన్నప్పుడు తనది పేద నేపథ్యమని, పాఠశాలకు వచ్చేందుకు తనకు కారు కూడా ఉండేది కాదని, కాబట్టి సైకిల్ మీద తాను స్కూల్కు వచ్చేదానినని చెప్పింది. సైకిల్ మీద వస్తుంటే తనను తోటి విద్యార్థులు వేధించేవారని, అలాంటి వేధింపులే తనను శక్తివంతంగా మార్చాయని చెప్పుకొచ్చింది. అయితే, ఆమెతోపాటే ముంబై అంబాలాలోని సీజేఎం (కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మెరీ) పాఠశాలలో చదివిన కన్నూ గుప్తా పరిణీత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ’సిగ్గుపడు పరిణీత.. బాగా కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఈ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నావు. సెలబ్రిటీలు అంటే ఇలాగే ఉంటారేమో. కారు లేదు, డబ్బు లేదంటూ కల్పిత కథలు చెప్తారేమో. నేను కూడా ఆమె చదివిన స్కూలోనే చదివాను. ఆమె తండ్రికి కారున్న సంగతి నాకు గుర్తే. అంతేకాకుండా ఆరోజుల్లో స్కూలుకు సైకిల్ మీద రావడమంటే చాలా గొప్పే. సైకిల్ లేనివాళ్లు కూడా చాలామంది ఉండేవాళ్లు. సీజేఎంలో చదివిన నా స్నేహితులకు ఆమె అబద్ధాలు ఇంకా బాగా అర్థమవుతాయి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంబాలాలో పరిణీత ఇరుగుపొరుగువారు కూడా ఆమె చెప్పినవి చాలావరకు అబద్ధాలేనని ఈ పోస్టు మీద కామెంట్లు చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంధువులుగా అప్పటికే వారికి మంచి పేరు ఉండేదని, వారు మంచి స్థితిమంతులేనని అంటున్నారు. స్కూలు రోజుల నుంచి పరిణీత ఇలాగే అసంబద్ధంగా వ్యవహరించేదని మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలని కోరినా పరిణీత ఇప్పటివరకు మౌనంగా ఉంది. -
అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రేమలో అగ్రనటి!
ప్రియాంక చోప్రా కజిన్ సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న పరిణీత చోప్రా గురించి బాలీవుడ్లో వదంతులకు లోటు లేదు. ఆమె గతంలో దర్శకుడు మనీష్ శర్మతో డేటింగ్ చేసినట్టు రూమర్స్ గుప్పుమన్నాయి. మనీష్ శర్మ తెరకెక్కించిన లేడిస్ వర్సెస్ రికీ బల్, శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాల్లో పరిణీత తళుక్కమంది. ఆ తర్వాత మనీశ్తో బ్రేకప్ అయిందని, ఆ డిప్రెషన్లో బరువు పెరిగిందని, కానీ, మళ్లీ తనకు తానే స్ఫూర్తి తెచ్చుకొని.. ఫిట్గా, స్లిమ్గా తయారైందని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. ఇప్పుడా కథనాలు పక్కనపెడితే ‘ఫిలింఫేర్’ మ్యాగజీన్ తాజాగా ప్రచురించిన ఓ రూమర్ మాత్రం హల్చల్ చేస్తోంది. అదేమిటంటే పరిణీత చోప్రా మళ్లీ ప్రేమలో పడిందట. ఈసారి ఓ అసిస్టెంట్ డైరెక్టర్తో ఆమె ప్రేమలో మునిగిపోయిందని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ప్రస్తుతం ఆ అసిస్టెంట్ డైరెక్టర్తో ఈ అమ్మడు రహస్యంగా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నదని, తమ రిలేషన్షిప్ గురించి ఇప్పుడే మీడియాకు తెలియకుండా వివరాలు గోప్యంగా ఉంచుతున్నదని ఆ మ్యాగజీన్ చెప్పుకొచ్చింది. ఈ రూమర్స్ సంగతి ఎలా ఉన్నా.. పరిణీతి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సరసన ‘మేరి ప్యారీ బిందు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తొలిసారి గొంతు సవరించుకొని పాట కూడా పాడింది. అంతేకాకుండా రోహిత్ శెట్టీ ‘గోల్మాల్’ సిరీస్లోనూ అజయ్ దేవ్గణ్ సరసన నటిస్తోంది. -
ఆ హీరోయిన్ పాట వింటూ.. గురక పెట్టారు!
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా తొలిసారి గొంతు సవరించుకుంది. 'మేరి ప్యారి బిందు' సినిమా కోసం ఆమె తొలిసారి పాట పాడింది. 'మానకే హమ్ యార్ నహి' అంటూ ఆమె మధురంగా ఆలపించిన పాటకు శ్రోతలు, బాలీవుడ్ ప్రముఖుల నుంచి జేజేలు లభిస్తున్నాయి. ఆమె సింగింగ్ టాలెంట్ను అందరూ వేనోళ్ల కొనియాడుతుండగా.. 'గోల్మాల్-4'లో ఆమె సరసన హీరోగా నటిస్తున్న అజయ్ దేవ్గణ్ మాత్రం ఒక విచిత్రమైన పోస్టు పెట్టారు. పరిణీత పాటను వింటూ తామంతా గురకపెట్టి నిద్రపోయామంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. 'మానకే హమ్ యార్ నహీని పాటను మాతో బలవంతంగా వినిపించడం ఇది పదోసారి. అయినా పాటను ఇష్టపడుతున్నాం. గ్రేట్ జాబ్ పరిణీత' అంటూ అజయ్ ఓ ఫొటో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో పరిణీత మొబైల్ ఫోన్లో తన పాట వినిపిస్తుండగా అజయ్, దర్శకుడు రోహిత్ శెట్టీ సహా యావత్ చిత్ర బృందమంతా గాఢనిద్రలోకి జారుకున్నట్టు కనిపిస్తున్నారు. రోహిత్ శెట్టీ కామెడీ ధమాకా అయిన 'గోల్మాల్-4' కోసం అజయ్తో ఈసారి పరిణీత చోప్రా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తుషార్ కపూర్, అర్షద్ వార్సీతోపాటు టబూ కూడా నటిస్తున్నది. This is the 10th time today we are being forced to see #MaanaKeHumYaarNahin, but still loving it! Great job @ParineetiChopra! A post shared by Ajay Devgn (@ajaydevgn) on Mar 28, 2017 at 1:13am PDT -
హీరోయిన్ వీడియోపై వెల్లువెత్తిన ఆగ్రహం!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీత చోప్రా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయింది. ఆమె ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేరి ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తున్న ఈ భామ తాజాగా దుబాయ్లో షూటింగ్ పాల్గొంటున్నది. దుబాయ్ బీచ్లో విహారిస్తున్న వీడియోను ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే, బీచ్లో విహరిస్తున్న ఆమెకు ఎండ తగలకుండా గొడుగు ఎత్తులో పట్టుకొని.. ఎక్కడికి వెళ్లితే అక్కడి ఆమె అసిస్టెంట్ వెళ్లడం కనిపించింది. అంతేకాదు ఆ అసిస్టెంట్ మూడు బ్యాగులు మోస్తున్నాడు. అందులో ఒక బ్యాగు పరిణీత చోప్రా హ్యాండ్బ్యాగ్ కూడా ఉంది. అంత బరువును మోస్తూ కూడా ఆమె ఎక్కడికి వెళితే.. అక్కడికి వెళ్తూ గొడుగు పట్టుకున్న అతని దీన స్థితి నెటిజన్ల కదిలించింది. అంతే ఈ భామ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. గతంలో లావుగా ఉన్న ఒక స్నేహితురాలిని ఎగతాళి చేస్తూ వీడియో పెట్టి కూడా పరిణీత చోప్రా ఇలాగే అభాసుపాలైంది. ఆమె చెప్పే ఆదర్శాలన్నీ ఉత్తవేనని, కానీ ఆచరణమాత్రం దారుణంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 'ఆ గొడుగు వందకిలోల బరువు ఉండి ఉంటుంది' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, గొడుగు పట్టుకున్న ఆయన మీ సహనటుడా అంటూ మరొకరు ఎద్దేవా చేశారు. -
ఆ జోడీ సరదా స్టెప్పులకు జనం ఫిదా!
-
ఆ జోడీ సరదా స్టెప్పులకు జనం ఫిదా!
సముద్ర తీరంలో సరదా స్టెప్పులు వేస్తూ తీసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారిపోయింది. పెట్టిన వెంటనే ఈ వీడియోను లక్షకుపైగా మంది చూడటం గమనార్హం. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, సొట్టబుగ్గల సుందరి పరిణీతి చోప్రా సరదాగా స్టెప్పులు వేశారు. ‘గజబ్ కా హై దిన్’ అనే బ్యూటీఫుల్ పాటకు ఎలాంటి రిహార్సల్ లేకుండా సహజంగా డ్యాన్స్ చేశారు. సముద్రం ఒడ్డున ఈ పాటకు తగ్గట్టు వారి డ్యాన్స్ సహజంగా అమరిపోవడం.. అక్కడి షూటింగ్ స్టాప్ను విస్మయ పరిచింది. ఇదే రికార్డ్ చేస్తే సరిపోతుంది కదా అనే కామెంట్లు వినిపించాయి. ఈ వీడియోను ఆయుష్మాన్ ఖురానా శనివారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. కాసేపటికే ఈ వీడియో వైరల్గా మారిపోయింది. ’కయామత్ కయామత్ తక్’ సినిమాలో ఆమిర్ ఖాన్, జుహీ చావ్లా జోడీ ‘గజబ్ కా హై దిన్’ పాటకు నర్తించగా.. ఇప్పుడు వారిని మరిపించేలా ఆయుష్మాన్, పరిణీతి స్టెప్పులు వేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న ’మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ఆయుష్మాన్, పరిణీతి జోడీగా నటిస్తున్నారు. హర్రర్ నవలా రచయితగా ఆయుష్మాన్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ప్రియాంక చోప్రా నాకు స్ఫూర్తి
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(34) ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడు నటుడు టామ్ హిడిల్ స్టన్ తో కలిసి వేదికను పంచుకొని మరోసారి తళుక్కుమంది. మరోవైపు అమెరికాలోని క్వాంటికో సీరియల్-2 లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రియాంక ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అద్భుతంగా రాణిస్తారని, ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆమె ఎప్పుడూ తనకు చాలా అందంగా కనిపిస్తారని అందుకే ప్రియాంక తనకు ఇన్స్పిరేషన్ అని మరో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో ఎర్రరంగు గౌనులో తళుక్కుమని సినీ విమర్షకుల ప్రశంసలందుకున్నారని ప్రియాంకను ప్రశంసించారు. పరిణీతి ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు సినిమాలో నటిస్తున్నారు. తదుపరి సినిమా తకదుమ్ కి సన్నద్ధమవుతున్నానని తెలిపింది. తను మొదటి సారి సినిమాలో పాట పాడబోతున్నానని పరిణీతి వెల్లడించారు. -
శ్రీదేవి కుమార్తెను కలవలేదు
ముంబై: ప్రిన్స్ మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించడం లేదని తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే పరిణీతి ఈ ఆఫర్ను అంగీకరించలేదని చెప్పాడు. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన పరిణీతి నటించడం లేదని ఇంతకుముందే వార్తలు వచ్చినా మురుగదాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీదేవి కుమార్తె జాహ్నవి నటించనుందని వచ్చిన వార్తలపైనా మురుగదాస్ స్పందించాడు. ఈ సినిమా కోసం పరిణీతిని అడిగాము కానీ, జాహ్నవిని ఎప్పుడూ సంప్రదించలేదని చెప్పాడు. జాహ్నవిని కలిసినట్టు వచ్చిన వార్తలు అవాస్తమని తెలిపాడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా అకీరా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ నటించారు. -
గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్
టాలీవుడ్లో దాదాపు యంగ్ హీరోలు అందరి సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఓ గోల్డెన్ చాన్స్ కొట్టేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఈ ఢిల్లీ చిన్నది సొంతం చేసుకుందని టాక్. నిజానికి ఈ సినిమాలో మహేష్ పక్కన బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించాల్సి ఉంది. కానీ, ఎందుకోగానీ ఈ ప్రాజెక్టు నుంచి పరిణీతి తప్పుకొందట. దాంతో దర్శక నిర్మాతలు రకుల్ ప్రీత్ను సంప్రదించగా.. మహేష్ పక్కన అనగానే ఎగిరి గంతేసి ఆమె ఒప్పుకొందని అంటున్నారు. ఇప్పటికే టెస్ట్ షూట్ కూడా అయ్యిందని, ఇక ఆమెను ఓకే చేయడం ఒక్కటే తరువాయని సినిమా వర్గాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హారిస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రధానంగా ముంబై మహానగరంలో షూటింగ్ జరుపుకొనే ఈ సినిమాకు దాదాపు రూ. 90 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. -
దేశీ లుక్లో హాట్గా..!
ఏంటమ్మాయ్.. రోజు రోజుకీ బొద్దుగా తయారవుతున్నావ్? అని గతంలో ఎవరైనా పరిణీతీ చోప్రాను ప్రశ్నిస్తే.. ‘ఏం అమ్మాయిలు బొద్దుగా ఉంటే చూడరా? నా శరీరం, నా ఇష్టం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అవకాశాలు ఆవిరయ్యేసరికి చక్కనమ్మ సన్నబడక తప్పలేదు. బొండుమల్లి సన్నజాజిలా మారితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. పరిణీతికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. చిక్కినాక ఆఫర్లు పెరిగాయట. ప్రస్తుతం ‘మేరీ ప్యారీ బిందు’లో నటిస్తున్నారామె. ఇది కాకుండా ఓ ఐటమ్ సాంగులోనూ కనిపించనున్నారు. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్ హీరోలుగా నటిస్తున్న ‘డిషూమ్’లో పరిణీతి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ముంబైలోని మెహబూబా స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో పరిణీతి దేశీ లుక్ హాట్గా ఉంటుందని సమాచారం. పరిణీతి కాస్టూమ్స్ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు. ఈ బ్యూటీ చేస్తున్న తొలి ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ చూడాలంటే వచ్చే నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేశ్బాబుకు జంటగా పరిణితిచోప్రా
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబుతో బాలీవుడ్ బ్యూటీ పరిణితిచోప్రా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్కు చెందిన సూపర్స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ల నుంచి అజిత్, సూర్య, కార్తీల వరకూ పలువురి చిత్రాలు టాలీవుడ్ తెరపై వెలిగిపోతుంటాయి. వీరి చిత్రాల అనువాదపు హక్కులు కూడా కళ్లు తిరిగే స్థాయిలో ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే రజనీకాంత్ తాజా చిత్రం తెలుగులో 34 కోట్లకు అమ్ముడు పోయిందన్నది సినీవర్గాల టాక్. ఇక తెలుగు చిత్రాలు తమిళంలోకి అనువాదం అయినా అంతగా లాభాలను అర్జించడం లేదు. అయితే ఇటీవల ద్విభాషా చిత్రంగా విడుదలైన బాహుబలి చిత్రం తమిళంలో కూడా విశేష ప్రజాదరణ పొందింది. ఇది ఒక్క కారణం కాదు టాలీవుడ్ స్టార్ హీరోలకు తమిళంలోనూ తమ ఇమేజ్ను పెంచుకోవాలన్న కోరిక చాలా కాలంగానే ఉంది. అలా బాహుబలి ముందంజ వేసినా తాజాగా మహేశ్బాబు తమిళసినీ ప్రేక్షకులకు నేరు చిత్రాల హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆయన ఇక్కడి సూపర్ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ను ఎంచుకున్నారు. తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న పాట చిత్రీకరణతో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్ తయారవుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంతోష్శివన్ చాయాగ్రహణం, హరీష్జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ మహేశ్బాబు సరసన నటించే హీరోయిన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇలియానా,శ్రుతిహాసన్ పేర్లు చక్కర్లు కొట్టాయి.అయితే దర్శకుడు ఏఆర్.మురుగదాసన్ బాలీవుబ్ బ్యూటీ పరిణీతి చోప్రాను మహేశ్బాబుతో రొమాన్స్ చేయించడానికి సిద్ధం అయ్యారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ చిత్రం ద్వారా పరిణితిచోప్రా తొలిసారిగా దక్షిణాది చిత్ర సీమకు దిగుమతి అవుతున్నారన్నమాట. -
సాహసానికి మారుపేరు గీతా టాండన్
ముంబై: ఆమె పేరు గీతా టాండన్. ఆమెను ఎన్ని విధాలుగానైనా అభివర్ణించవచ్చు. సాహసానికి మారుపేరు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వెన్నుచూపని ధీర వనిత. జీవన పోరాటంలో అలుపెరగని ఓ తల్లి. కుల్లు సమాజం కుళ్ల బొడిచినా వ్యక్తిత్వం కోల్పోని మహిళా మణి. ప్రపంచ స్ఫూర్తిదాయక కథలకు ఆమె జీవన గమనం ఏ మాత్రం తీసిపోదు. కెరీర్ పరంగా చెప్పాలంటే ఆమె ఓ సినిమా స్టంట్ విమెన్. చెన్నై ఎక్స్ప్రెస్లో దీపికా పదుకునే, సింఘమ్లో కరీనా కపూర్ చేసిన సాహసాలు గీతా టాండన్ చేసినవే. హీరోయిన్లు ఎత్తైన భవనాల నుంచి దూకడం, దగ్ధమవుతున్న కారును గాజు తలుపులు బద్దలు కొడుతూ దూకించడం, పర్వతాల్లో మోటార్ బైకుపై స్టంట్ చేయడం మనం బాలివుడ్ సినిమాల్లో చూసే ఉంటాం. అవన్నీ తెరముందు కనిపించకుండా గీతా టాండన్ చేసినవే. ముఖ్యంగా ఆమె దీపికా పదుకొనేతోపాటు కత్రినా కైఫ్, బిపాసా బసు, పరిణీతి చోప్రాలకు వివిధ సినిమాల్లో స్టంట్ విమెన్గా చేశారు. చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తాను జీవన పోరాటంలో చేసిన సాహసాల ముందు ఈ సాహసాలు ఓ లెక్కా అని ఆమె ఎప్పుడూ చెబుతారు. ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన 29 ఏళ్ల గీతా టాండన్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆలనాపాలనా చూసుకునే వారు లేకపోవడంతో పదవ తరగతి వరకు చదివిన టాండన్కు దగ్గరి బంధువులు 15వ ఏటనే పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆమె జీవితం అంధకారమైపోయింది. తాగి తందనాలాడే భర్త రోజు కొట్టే వాడు. సెక్స్ కోసం హింసించేవాడు. ఆ బాధలు భరించలేక ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి పారిపోయారు. కొన్ని రోజులపాటు గురుద్వార్లో తలదాచుకున్నారు. అట్లుతోమి బతుకుదామనుకున్నారు. ఓ ఇంట్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఎంతో మంది ఆమెను వ్యభిచారం వత్తిలోకి దించేందుకు ప్రయత్నించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మసాజ్ సెంటర్లో జీతం ఎక్కువ ఇస్తారని మిత్రులు చెబితే అందులో చేరారు. అక్కడికెళ్లాక తెలిసింది. మసాజ్ ముసుగులో జరిగేదంతా వ్యభిచారమేనని. అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డు పక్కన రోజుకు ఎనిమిది గంటలు రొట్టెలు చేసే పనికి కుదిరారు. కాస్త జీవనం కుదుటపడింది. జీవితాన్ని మరింత మెరగుపర్చుకోవాలనుకున్నారు. పిల్లలను మంచి చదువులు చదివించాలనుకున్నారు. చిన్నప్పుడు నేర్చుకున్న డాన్స్ అనుభవంతో సినిమాలో ఎక్స్ట్రా డాన్సర్గా పని చేయాలనుకున్నారు. చివరకు స్టంట్ విమెన్గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో ఆమె మీద తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మహేష్కు జోడిగా అలియా
బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు చేయబోయే నెక్ట్స్ సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన మహేష్, ఆ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగు, తమిళ్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా నార్త్ బ్యూటిని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటి పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందటూ ప్రచారం జరిగింది. అయితే సౌత్ సినిమాలో నటించేందుకు పరిణీతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆమెను పక్కన పెట్టేశారు చిత్రయూనిట్. తాజాగా క్యూట్ హీరోయిన్ అలియా బట్ను మహేష్కు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. గజిని, తుపాకీ లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మురుగదాస్, మహేష్ సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్ అనిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. -
కష్టాలు ఎదురైనా సాధించేశాను: హీరోయిన్
ముంబై: లావుగా ఉందంటూ ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. ఆ తర్వాత సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆమె మీద ఎన్నో విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. బికినీ వేసుకుని సినిమాల్లో దర్శనమివ్వడానికి సన్నబడేందుకు కసరత్తులు చేసిందని ఎంతో మంది ఆమె మీద వ్యాఖ్యలు చేశారు. అయినా ఆమె అనుకున్నది మాత్రం సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ఆమె బాటలో నడుస్తున్నారట. స్వయంగా ఈ విషయాన్ని పరిణీతి వెల్లడించింది. కష్టాలు ఎదురైనా తాను అనుకున్నది ప్లాన్ చేసినట్లు పక్కాగా జరగడంతో ఈ విషయంలో విజయం సాధించినట్లు అభిప్రాయపడింది. గతంలో చాలా మంది మహిళలు స్థూలకాయం కారణంగా సమస్యలు ఎదుర్కొవడాన్ని గమనించాను. అయితే ప్రస్తుతం తనను కలిసిన కొందరిలో చాలా స్పష్టమైన మార్పును గమనించినట్లు పేర్కొంది. ఆమె లాగానే తాము కూడా సన్నగా అవ్వాలని అమ్మాయిలు ప్రయత్నాలు మొదలెట్టారని, ఈ విషయంపై కొందరు తనతో మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం కోసం చాలా శ్రమించిన విషయాన్ని అభిమానులతో పాటు చాలా మంది గుర్తించారని, అందుకే తనదారిలో నడుస్తున్నవారికి ధన్యావాదాలు చెప్పింది.బరువు తగ్గడానికి ఏ చిట్కాలు పాటించాలని అడుగుతుంటే చాలా గర్వంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె 'మేరీ ప్యారీ బిందు' షూటింగ్ లో బిజిబిజీగా ఉంటోంది. -
మహేశ్బాబుతో పరిణీతీ చోప్రా!
ఈ సమ్మర్ సీజన్లో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉన్న సినిమా - మహేశ్బాబు ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండడంతో హీరో మహేశ్బాబు బిజీ బిజీ. ఈ నెల 24న తిరుపతిలో ఈ సినిమా పాటల్ని విడుదల చేసేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి బృందం సన్నాహాలు చేస్తోంది. మే నెలలో సినిమా రిలీజ్. ఒకపక్క ఈ వ్యవహారం సాగుతూ ఉండగానే మహేశ్బాబు తరువాయి చిత్రానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు కృష్ణానగర్ కబురు. పరిణతి చెందిన దర్శకుడు - పరిణీతి హీరోయిన్ ఇంతకీ, మహేశ్బాబు తరువాత సినిమా ఏమిటి? దర్శకుడెవరు? ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్కు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది! ప్రముఖ నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్.వి. ప్రసాద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో మహేశ్బాబు సరసన ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ నటించనున్నారు. ఆమె ఎవరో కాదు... ప్రస్తుతం అందరి నోటా హాట్ టాపిక్కైన ప్రియాంకా చోప్రా కజిన్ పరిణీతీ చోప్రా అని బోగట్టా. అయిదేళ్ళ క్రితం హిందీ చిత్రం ‘లేడీస్ వర్సెస్ రికీ బెహ్ల్’ (2011)తో పరిచయమై ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకొన్న చరిత్ర పరిణీతిది. అలాగే, ఆ వెంటనే ‘ఇషక్జాదే’ (2012)తో ప్రత్యేక ప్రశంసగా జాతీయ అవార్డు, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీ తో ఫసీ’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆమెను మహేశ్బాబు సరసన నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆమిర్ఖాన్ హిందీ ‘గజినీ’తో ఉత్తరాదినా పేరున్న మురుగదాస్ తన స్క్రిప్ట్తో 27 ఏళ్ళ పరిణీతిని మెప్పించారట! సినిమా చేయడానికి అంగీకరించిన ఈ నార్త్ హీరోయిన్ త్వరలోనే లాంఛనంగా ఆ విషయాన్ని ప్రకటిస్తారట! తండ్రి పుట్టినరోజున ప్రారంభం? ది ఇలా ఉండగా, ఈ చిత్రానికి మరో స్టార్ ఎట్రాక్షన్ కూడా ఉంది. సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మణిరత్నం తీసిన ‘రోజా’, ‘ఇరువర్’ (ఇద్దరు), ‘దిల్ సే’ నుంచి ‘అశోక’, ‘కాలాపానీ’, ‘ఉరిమి’ తదితర చిత్రాలకు వెన్నెముకగా నిలిచింది ఈ జాతీయ అవార్డు విజేతే. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్లు, మహేశ్బాబు తండ్రి సూపర్స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31వ తేదీన లాంఛనంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరపాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల కథనం. -
కోలీవుడ్కు పరిణితి చోప్రా
దక్షిణాది చిత్రపరిశ్రమలోకి ఉత్తరాది భామల దిగుమతి అప్రతిహంగా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అనుష్క, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా చాలా మంది ఉత్తరాది బ్యూటీస్ దక్షిణాదిని ఏలుతున్నారు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా దక్షిణాది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తారలే. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా చేరనుందని సమాచారం. ఈ అమ్మడిని ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దక్షిణాదికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జాణ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు, దర్శకుడు మురుగదాస్ సంప్రదింపులు జరిపి ఆమెను అంగీకరింపజేసినట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ అగ్ర దర్శకుడు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా తమిళం, తెలుగు భాషల్లో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్బాబుతో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయించనున్నారట. అందులో ప్రధాన భామగా పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. దక్షిణాది చిత్రాల్లో నటి ంచాలన్న తన చిరకాల కోరిక టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబుతో కలసి నటించడం ద్వారా నెరవేరబోతున్నందుకు పరిణితి చోప్రా తెగ సంబరపడిపోతోందట. ఇక ఇతర బ్యూటీస్ కీర్తీసురేష్, సాయి పల్లవి ఇప్పటికే ఎంపికైనట్లు తెలిసింది.ఇందులో మహేష్బాబుకు ఎస్జే.సూర్య విలన్గా మారనున్నారని తెలిసింది. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
కోలీవుడ్కు పరిణితి చోప్రా
దక్షిణాది చిత్రపరిశ్రమలోకి ఉత్తరాది భామల దిగుమతి అప్రతిహంగా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అనుష్క, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా చాలా మంది ఉత్తరాది బ్యూటీస్ దక్షిణాదిని ఏలుతున్నారు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా దక్షిణాది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తారలే. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా చేరనుందని సమాచారం. ఈ అమ్మడిని ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దక్షిణాదికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జాణ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు, దర్శకుడు మురుగదాస్ సంప్రదింపులు జరిపి ఆమెను అంగీకరింపజేసినట్లు పరిశ్రమ వర్గాల మాట. ఈ అగ్ర దర్శకుడు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా తమిళం, తెలుగు భాషల్లో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్బాబుతో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయించనున్నారట. అందులో ప్రధాన భామగా పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. దక్షిణాది చిత్రాల్లో నటి ంచాలన్న తన చిరకాల కోరిక టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబుతో కలసి నటించడం ద్వారా నెరవేరబోతున్నందుకు పరిణితి చోప్రా తెగ సంబరపడిపోతోందట. ఇక ఇతర బ్యూటీస్ కీర్తీసురేష్, సాయి పల్లవి ఇప్పటికే ఎంపికైనట్లు తెలిసింది.ఇందులో మహేష్బాబుకు ఎస్జే.సూర్య విలన్గా మారనున్నారని తెలిసింది. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
'అది చోప్రాల రక్తంలోనే ఉంది'
సడన్గా సన్నగా మారి అందరి దృష్టినీ ఆకర్షించిన బాలీవుడ్ అందం పరిణీతి చోప్రా.. తన తదుపరి చిత్రం 'మేరీ ప్యారీ బిందు' కోసం ఓ పాట పాడుతున్నారు. ప్రియాంకా చోప్రా ఇదివరకే ఇన్ మై సిటీ, ఎక్సాటిక్ లాంటి ఆల్బమ్స్లో ప్రొఫెషనల్ సింగర్స్కి ఏమాత్రం తీసిపోకుండా పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్క బాటలోనే పరిణీతి కూడా గొంతు సవరించింది. దీనిపై పరిణీతి మాట్లాడుతూ.. 'నేను పాడుతున్నానని తెలియగానే ఇంట్లోవాళ్లంతా ఎగ్జైట్ అయ్యారు. మేమంతా బాగా పాడగలమన్న విషయం అందరికీ తెలిసిందే. పాడటం చోప్రాల రక్తంలోనే ఉన్నట్టుంది.. అందుకే మా వాళ్లంతా చాలా సంతోషంగా ఫీలయ్యారు' అంటూ చెప్పుకొచ్చింది. మరి ప్రియాంకలానే ఆల్బమ్స్ వరకు వెళ్తారా అంటే.. ప్రస్తుతానికి సినిమాల్లో పాడాలనుకుంటున్నాను, మిగిలినవి ఆ తర్వాత చూద్దాం అని ముగించింది ఇష్క్ జ్యాదే స్టార్ పరిణీతి చోప్రా. -
ఇది జీవితకాల సెల్ఫీ!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ సెల్ఫీని తన అభిమానుల కోసం షేర్ చేశారు. హాలీవుడ్ నటి సల్మా హయక్తో కలిసి తీసుకున్న 'సెల్ఫీ ఆఫ్ ఎ లైఫ్టైమ్' అని ఆయన అభివర్ణించారు. ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన అక్షయ్ కుమార్.. అక్కడ సల్మాతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీచర్లను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ఇదే విషయాన్ని అక్షయ్ తన ట్వీట్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్తో పాటు బాలీవుడ్ నటీ నటులు పరిణీతి చోప్రా, అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఎప్పటినుంచో హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్కానెగీతో కలిసి ఫొటో తీయించుకోవాలనుకున్న పరిణీతి కల కూడా అనుకోకుండా నెరవేరింది. ఆ ఫొటో తీయించుకుంటుంటే.. మధ్యలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా అందులో దూరిపోయారు. దీనికి పరిణీతి కూడా మంచి కాప్షన్ పెట్టింది. ''రబ్ నే బనా దీ జోడీ.. నేను, మాథ్యూ ఫొటో తీసుకున్నాం. కానీ ఫొటోబాంబ్ (అనుకోకుండా ఒక ఫొటోలో వేరేవాళ్లు రావడం)! అభిషేక్, అక్షయ్ దూరారు'' అని తెలిపింది. Selfie of a lifetime... Honouring all the Teachers around the World, #TeachersMatter in Dubai! @salmahayek pic.twitter.com/Py89zgc6y1 — Akshay Kumar (@akshaykumar) March 13, 2016 Rab ne bana di jodiiiii .. Me and @McConaughey !!! But photobombed !!! @juniorbachchan @akshaykumar pic.twitter.com/77RQnjsWW9 — Parineeti Chopra (@ParineetiChopra) March 13, 2016 -
అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్?
ప్రియాంకా చోప్రా టాప్ హీరోయిన్. కజిన్ బాటలో తాను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పరిణీతి చోప్రా కృషి చేస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి నటిస్తే, కచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్ ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారట. ‘మిసెస్ కిల్లర్’ టైటిల్తో క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. -
మహేష్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ
శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల కలెక్షన్లు సాధ్యం చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత భారీగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న రాజకుమారుడు, ఆ సినిమాలో ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. వేసవి కానుకగా మేలో బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మరోభారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు ప్రిన్స్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గతంలో ప్రీతిజింటా, నమ్రతా శిరోద్కర్, బిపాషాబసు, లిసారే, అమృత రావ్ లాంటి బాలీవుడ్ భామలతో జోడీ కట్టిన మహేష్, ఈసారి పరిణీతి చోప్రాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు'
ముంబై: బాలీవుడ్ ఫ్యాన్స్ ఆమె ప్రస్తుతం చేస్తున్న పనులపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. కొన్నిరోజుల కిందటి వరకు చాలా లావుగా ఉందని, అన్ని పాత్రలకు ఆమె సెట్ అవ్వదని విమర్శలున్నాయి. అయితే కఠిన వ్యాయామాలతో చెమటోడ్చి మరీ శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా బాలీవుడ్ చిన్నది పరిణీతి చోప్రా వార్తల్లో ఎక్కిన విషయం తెలిసిందే. ఏంటి సైజ్జీరో శరీరాకృతి కోసం కష్టపడుతుందా.. అసలు పరిణీతి ఏం చేయాలనుకుంటుంది అని బాలీవుడ్ చెవులు కొరుక్కుంది. సన్నబడ్డాక పరిణీతి చోప్రా 'బిల్ట్ దట్ వే' హాట్హాట్ ఫొటోషూట్తో కనువిందు చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తాను మాత్రం సన్నబడటం కంటే శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆమె సన్నబడటంపై చాలా విమర్శలొచ్చాయి. దీంతో ఈ అమ్మడు ఆ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాను బికినీ వేయడం కోసం సన్నగా అవ్వలేదని, శారీరకంగా ధృడంగా మారడాలనికి చాలా కష్టపడ్డాడని వివరించింది. ఆరోగ్యం కోసం తాను స్విమ్మింగ్, జిమ్, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్సింగ్ ఇలా తన చేతనైన అన్ని కళలతోనూ కాస్త కుస్తిపట్టీ మరి అనుకున్నఫలితాన్ని సాధించుకుంది. అయితే, పరిణీతి కేవలం బికినీ లాంటివి ధరించడం కోసమే సన్నబడిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయాన్ని బయటపెట్టింది. తాను స్కిన్ షో చేయడం కోసం ఈ వర్క్ అవుట్స్ చేయలేదని, అవి చాలా వికృత విమర్శలు అని కొట్టిపారేసింది. సన్నబడటం వేరే విషయం.. తాను మాత్రం స్టామినాను పెంచుకొని శరీరం మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను అని ఇటీవల జరిగిన స్టార్డస్ట్ అవార్డ్స్ వేడుక సందర్భంగా చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. -
స్టార్లు పాడితే... లోకమే ఆడదా..!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటంటే... హీరోలూ, హీరోయిన్లూ గొంతు విప్పి పాటలు పాడడం. తెలుగు చిత్రసీమలోనూ, హిందీ చిత్రసీమలోనూ ఈ కల్చర్ ఎక్కువైపోయింది. లేటెస్ట్గా ఈ వారంలో... సింగర్స్ అవతారమెత్తిన ఓ ముగ్గురు స్టార్స్ గురించి డీటైల్స్... గొంతు సవరించిన బన్నీ అల్లు అర్జున్ డ్యాన్సులు బాగా చేస్తారు. ఫైట్లు ఇరగదీస్తారు. మరి... ఆయన సాంగ్ సింగితే ఎలా ఉంటుంది? నిజంగానే మరికొన్ని రోజుల్లో ఆయన పాడిన పాటను మనం వినబోతున్నాం. యస్.. ఈ స్టయిలిష్ స్టార్ పాట పాడేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రం రూపొందు తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ స్వరాలందిస్తున్నారు. మామూలుగా తాను ఏ సినిమాకి పాటలందించినా ఆ సినిమాలో నటించే హీరోతోనో, హీరోయిన్తోనో పాట పాడించడానికి ట్రై చేస్తారు తమన్. చిన్న ఎన్టీఆర్, రవితేజ, శ్రుతీహాసన్ వంటి తారలు తమన్ ట్యూన్స్కు పాడారు. ఇప్పుడు అల్లు అర్జున్తో పాడించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ‘‘బన్నీ లాంటి బెస్ట్ డ్యాన్సర్కి ట్యూన్స్ తయారు చేయడం సవాల్గా అనిపించింది’’ అని ఈ సందర్భంగా తమన్ పేర్కొన్నారు. చెన్నైలోని రికార్డింగ్ థియేటర్లో అల్లు అర్జున్ పాడగా ఓ పాటను రికార్డ్ చేశారు. బన్నీ భలేగా పాడారట. మార్చిలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సో... సింగర్గా బన్నీ గొంతు వినడానికి మరెన్నో రోజులు లేదన్నమాట. పరిణీతి పాడుతుందోచ్! బాలీవుడ్లో సింగర్స్గా ఆకట్టుకున్న కథానాయికలు చాలామందే ఉన్నారు. సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్, ఆలియా భట్లతో పాటు మన దక్షిణాది బ్యూటీ శ్రుతి కూడా హిందీలో పాడి, భేష్ అనిపించుకున్నారు. ప్రియాంకా చోప్రా ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్తో గాయనిగా ఫేమస్ అయిపోయారు. సింగర్స్ అవతారమెత్తిన కథానాయికల జాబితాలో ఇప్పుడు పరిణీతి చోప్రా చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మేరీ ప్యారీ బిందు’. సంగీత దర్శక ద్వయం సచిన్- జిగర్ ఈ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మనా కీ హమ్ యార్ నహీ...’ అనే పాటను పరిణీతితో పాడించాలనుకున్నారట. ఈ బ్యూటీని అడగ్గానే.. ఓకే చెప్పేశారు. వాస్తవానికి పరిణీతి గాయకురాలిగా శిక్షణ కూడా పొందారు. అయితే, ఇప్పటివరకూ ఆమె సినిమాలకు పాడలేదు. ‘‘పాడాలని చాలామంది దర్శకులు, సంగీత దర్శకులు అన్నారు. కానీ, ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు కుదిరింది’’ అని పరిణీతి పేర్కొన్నారు. త్వరలో ఆమె పాడగా ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. అంజలి నోట... తమిళ పాట... పదహారణాల తెలుగమ్మాయి అంజలి ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు మరోవైపు నటనకు అవకాశం ఉన్న ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘చిత్రాంగద’ ఒకటి. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్కి ‘యార్ నీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి స్వామినాథన్ పాటలు స్వరపరుస్తున్నారు. ఓ పాటను అంజలితో పాడించాలనుకుంటున్నారట. అంజలి వాయిస్ ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇక, పాడితే ఎంత ముద్దుగా ఉంటుందో? అంజలి పాడనున్న తొలి పాట ఇదే అవుతుంది. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. వివిధ ప్రాంతాలతో పాటు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరిపారట. హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అంజలి పాట కచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర యూనిట్ భావన. -
నా నుంచి ఆశించడం తప్పు కాదు: పరిణితి
ముంబై : ఇటీవలే ఫుల్ ఫిట్నెస్తో అందరూ కళ్లింతలు చేస్కుని తనవైపు చూసేలా చేసిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా.. మహిళల శరీర ఆకృతికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వనితల శరీరాకృతిని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మహిళలన్ని అగౌరవరవపరిచేలా వారి శరీరాకృతి గురించి మాట్లాడటం అనాగరికం కూడా' అంటూ చోప్రా చిరుకోపాన్ని ప్రదర్శించింది. అయితే నిజంగానే శరీర ఆకృతి ఎవరికివాళ్లకు అసౌకర్యంగా అనిపిస్తే మార్చుకోవడంలో తప్పు లేదని, కంఫర్ట్ గా ఉండే హక్కు ఆడవారికీ ఉందని చెప్పుకొచ్చారు. మగువల సొంపులపై వ్యంగ్యంగా మాట్లాడొద్దంటూ హెచ్చరికలూ చేశారు. 'నేనంటి సినీనటిని. ప్రేక్షకులు టికెట్ కొనిమరీ సినిమాలు చూస్తారు. నేను ఎలా కనబడితే బాగుంటానో అలా కనబడాలని ప్రేక్షకులు కోరుకోవటంలో తప్పులేదు. కాబట్టే షేప్ విషయంలో నాకు సలహాలు, విమర్శలు తప్పవు' అని ప్రేక్షకులపట్ల కాస్త పరిణితితో మాట్లాడింది పరిణితి. ఇంతకీ ఇండస్ట్రీని ఊపేసిన న్యూ లుక్ రహస్యం ఏమని అడిగితే.. బరువు తగ్గేందుకు ఎలాంటి డైట్ ఫాలో కాలేదని, బరువు తగ్గడం చాలా తేలికని మనసులో భావించి.. జిమ్, స్విమ్మింగ్, ట్రెడ్ మిల్, కిక్ బాక్సింగ్, స్ట్రెచింగ్, డ్యాన్స్ వగైరా చేయటం వల్లే న్యూ లుక్ సాధ్యమైందని చెప్పింది. -
సైజ్ తగ్గాలని కాదు ఫిట్నెస్ కోసమే!
ముంబై: కఠిన వ్యాయామాలతో చెమటోడ్చి.. శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా ఈ మధ్య బాలీవుడ్ చిన్నది పరిణీతి చోప్రా వార్తల్లో ఎక్కింది. దీంతో ఏంటి సైజ్జీరో శరీరాకృతి కోసం కష్టపడుతున్నారా? అంటే అదేమీ లేదని ఈ భామ చెప్తోంది. సన్నబడటం కంటే శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తానని అంటోంది. బాలీవుడ్లో అడుగుపెట్టిన నాటినుంచి బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మగానే పరిణీతి చోప్రా పేరు తెచ్చుకుంది. తన తోటితారామణులు సన్నగా మెరుపుతీగలా ఉండటానికి ప్రాధాన్యమిస్తున్నా.. తను మాత్రం బొద్దు అందాలతో ఆఫర్లు తెచ్చుకుంది. ఈ మధ్య ఈ అమ్మడి వేగం తగ్గింది. చేతిలో పెద్దగా ఆఫర్లు కూడా లేవని టాక్. దీంతో తను కూడా కాస్తా చెమటోడ్చి.. తోటి హీరోయిన్ల మాదిరిగానే సన్నబడిందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను పరిణీతి కొట్టిపారేసింది. 'అవి చాలా వికృత విమర్శలు. సన్నబడటం వేరే విషయం. నేను మాత్రం స్టామినాను పెంచుకొని శరీరం మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను' అని స్టార్డస్ట్ అవార్డ్స్ వేడుక సందర్భంగా ఆమె తెలిపింది. సన్నగా ఉండటం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యమని తెలిపింది. ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడి వ్యాయామాలు చేసినందుకు ఇప్పుడు ఫలితం కనిపించడం ఆనందం కలిగిస్తోందని ఈ భామ చెప్పింది. అన్నట్టు సన్నబడ్డాక పరిణీతి చోప్రా 'బిల్ట్ దట్ వే' హాట్హాట్ ఫొటోషూట్తో కనువిందు చేసింది. -
నవమాసాల కష్టం!
బాలీవుడ్ నాయికలు తీగలా, సన్నగా ఉంటారు. ఎంత సన్నగా ఉంటే అంత ఫాలోయింగ్ తెచ్చుకోగలుగుతారు. ఒకప్పుడు బొద్దుగానే ముద్దనిపించిన పరిణీతి ఇప్పుడేం చేశారంటే... ‘‘నాలుగేళ్ల క్రితం బొద్దుగా, పిల్ల తరహాలో ఉన్న ఒక అమ్మాయి ఈ ప్రపంచం (సినిమా రంగం)లోకి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి ఎలా ఉండాలనుకుందో, నాలుగేళ్ల తర్వాత దానికి దగ్గరగా మారిపోగలిగింది’’ అని పరిణీతి చోప్రా తన గురించి తాను పేర్కొన్నారు. ‘ఇషక్జాదె’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమై, మొదటి సినిమాతోనే బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకోగలిగారు పరిణీతి చోప్రా. బాలీవుడ్ కథానాయికలు తీగలా, సన్నగా ఉంటారు. ఎంత సన్నగా ఉంటే అంత ఫాలోయింగ్ తెచ్చుకోగలుగుతారు. కానీ, పరిణీతి చోప్రా బొద్దుగా ఉండటంతో మొదటి సినిమా వరకే ముద్దు అనిపించారు. ఆ తర్వాత ‘సన్నబడితే బాగుంటుంది’ అనే కామెంట్స్ వినాల్సి వచ్చింది. కొంతమంది ప్రత్యక్షంగా... మరికొంతమంది పరోక్షంగా పరిణీతిని విమర్శించారు. ఆ మాటలు ఈ బ్యూటీ మీద పని చేశాయో లేక కథానాయికగా రాణించాలంటే తగ్గక తప్పదనుకున్నారో ఏమో.. పరిణీతి తగ్గే పని మీద పడ్డారు. ఏకంగా తొమ్మిది నెలలు కష్టపడి, ఎక్సర్సైజ్లతో యమా తగ్గారు. ఒళ్ళు తగ్గిన తర్వాత ప్రత్యేకంగా ఓ ఫొటోషూట్ చేయించు కున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్లో పెట్టారు. దాంతో పాటు తన అభిప్రాయాలనూ పంచుకున్నారు. ‘‘ఈ ఫొటోషూట్ నాకు ప్రత్యేకం. ఆత్మన్యూనతాభావం నుంచి బయటపడిపోయా. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయిగా నన్ను నేను గర్వంగా ఆవిష్క రించుకుంటున్నా. ఎవరైనా అసాధ్యం అనుకుంటే అప్పుడు నన్ను సవాల్గా తీసుకోండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీ లాంటి వ్యక్తినే. ఇప్పుడు అనుకున్నది సాధించా. మీరు కూడా సాధిస్తారు’’ అని పేర్కొన్నారు పరిణీతి చోప్రా. అంతే కాదు... తాను దిగిన ఒక్కో ఫొటో గురించి ఒక్కో కామెంట్ కూడా పెట్టారు. పరిణీతి తాజా ఫొటోలు కనువిందైతే, ఆ వ్యాఖ్యలు ఆమె ఆత్మ విశ్వాసాన్ని తెలియజేశాయి. -
'సల్మాన్ తో నటించడం లేదు'
ముంబై: తనపై వచ్చిన పుకార్లను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొట్టిపారేసింది. అలీ అబ్బాస్ జాఫార్ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సుల్తాన్'లో సల్మాన్ఖాన్కు జోడీగా పరిణీతి జతకట్టినట్లు వదంతులు వినిపించాయి. అయితే, తాను ఆ మూవీలో నటించడంలేదని ఆదివారం తన ట్విట్టర్ లో పరిణీతి పోస్ట్ చేసి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టేసింది. తన నెక్స్ట్ మూవీ వివరాలను త్వరలో వెల్లడిస్తానంటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. 'లేడీ వర్సెస్ రికీ బహల్’ తో 2011లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతీ చోప్రా ‘ఇష్క్జాదే’ , ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ మొదలైన సినిమాలలో హీరోయిన్గా తన ప్రతిభ చాటుకున్నారు. ఈ అమ్మడు చివరగా గతేడాది విడుదలైన 'కిల్ దిల్'లో తెరపై కనిపించింది. కండల వీరుడు సల్మాన్ 'సుల్తాన్' మూవీలో మల్లయోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ ఈ మూవీకి హీరోయిన్ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. Guys, I am not doing Sultan, please put all rumours and speculations to rest and let me announce my next film when the time is right. — Parineeti Chopra (@ParineetiChopra) December 6, 2015 -
యుప్ టివి ఇండియాకు వచ్చేసింది
-
రెండు టీ షర్టులు పది లక్షలా!
అది ఇండోనేషియాలోని జకార్తాలో గల షాపింగ్ మాల్. ఏదో షూటింగ్ నిమిత్తం అక్కడికెళ్లిన పరిణీతి చోప్రా ఆ మాల్కి వెళ్లారు. పర్సు నిండా డబ్బులు, క్రెడిట్ కార్డులు పెట్టుకుని ఆమె ఆ షాపింగ్ మాల్లోకి వెళ్లారు. ఒక షాప్కి సంబంధించిన అద్దాల తలుపుల్లోంచి రంగు రంగుల టీ షర్టులు కనిపించాయి పరిణీతికి. దాంతో ఆ షాప్లోకి ఎంటరయ్యారు. ఓ రెండు టీ షర్టులు సెలక్ట్ చేసుకున్నారు. వాటి విలువ ఎంతో తెలుసా? అక్షరాలా పది లక్షల రూపాయలు. ఏంటీ... రెండు టీ షర్టులు పది లక్షలా? అని ఆశ్చర్యపోతున్నారా! నిజం కాదు అనుకుంటున్నారా? ఇది నిజంగా నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని పరిణీతియే ఫేస్బుక్ ద్వారా స్వయంగా పేర్కొన్నారు. ఈ వార్తను పూర్తిగా చదవనివాళ్లు ఎంత డబ్బుంటే మాత్రం పది లక్షలు పెట్టి రెండు టీ షర్టులు కొంటారా? అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా చదివితే... ఇండోనేషియా పది లక్షల కరెన్సీ మనకు ఐదువేల రూపాయలతో సమానం అని పరిణీతి పేర్కొన్న విషయం తెలుస్తుంది. -
పది కిలోలు తగ్గడానికి పది లక్షలు!
‘‘పరిణీతి చోప్రా ఒంటిపై కత్తి పడింది.. అందుకే అలా అయిపోయారు’’ అని బాలీవుడ్లో తెగ చెప్పుకుంటున్నారు. దానికి కారణం ఈ బ్యూటీ సన్నబడటమే. పరిణీతి కొంచెం బొద్దుగా ఉంటారనే విషయం తెలిసిందే. ‘ఇలా అయితే కష్టమే. కొంచెం తగ్గమ్మా’ అని వాళ్లూ వీళ్లూ సూచించడంతో పరిణీతి కూడా తగ్గితేనే బెటరనుకున్నారు. దాంతో పది కిలోలు వరకూ తగ్గేశారామె. ఈ తగ్గుదల వెనక ఉన్న రహస్యం సర్జరీ అన్నది పలువురి వాదన. కానీ, ఆస్ట్రియాలో పాల్గొన్న ‘డిటాక్స్ ప్రోగ్రామ్’ వల్లనే పరిణీతి సన్నబడ్డారట. సర్జరీ అవసరం లేకుండా బరువు తగ్గించే ప్రోగ్రామ్ ఇది. అయితే, ఆ ట్రీట్మెంట్కి శరీరం తట్టుకుంటుందో లేదో కొన్ని పరీక్షలు చేసి, ఆ తర్వాత మొదలుపెడతారట. 15 నుంచి 30 రోజుల పాటు జరిగే ఈ కోర్స్కి అయ్యే ఖర్చు ఐదు నుంచి పది లక్షల రూపాయలని సమాచారం. ఈ కోర్స్లో భాగంగా ఇచ్చే డైట్ని ఆరు నెలలు పాటించాలట! వాళ్లు సూచించిన వర్కవుట్లు చేయాలట. పరిణీతి ఇవన్నీ కరెక్టుగా ఫాలో అయ్యి, తాను అనుకున్నట్లు బరువు తగ్గేశారు. ‘పది కిలోలు తగ్గడానికి పది లక్షలు ఖర్చు పెట్టిందా? బాగా డబ్బులున్నట్టున్నా’యని కొంతమంది చెప్పుకుంటున్నారట. -
అతనంటే కోపం కాదు... ఆమె అంటే ఇష్టం లేక!
బాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్ అంటే సల్మాన్ ఖానే. ఆయన సరసన హీరోయిన్ చాన్స్ అంటే స్టార్ హాదాకు షార్ట్ కట్గా భావిస్తారు. అలాంటి అవకాశం తలుపు తడితే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు కూడా. కానీ పరిణీతి చోప్రా మాత్రం ఆయన సినిమాలో చేయనని తెగేసి చె ప్పారట. ఆ సినిమా మరేదో కాదు... ‘సుల్తాన్ ’. విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యశ్రాజ్ ఫిలింస్ ద్వారానే పరిణీతి బాలీవుడ్లో అడుగుపెట్టారు. అయినా సరే ఆదిత్యా చోప్రా ఇచ్చిన ఆఫర్కు పరిణీతి చోప్రా ‘నో’ చెప్పేశారు. ఎందుకనుకుంటున్నారా? ‘సుల్తాన్’ చిత్రం కోసం ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. దీని కోసం ఆదిత్యా చోప్రా అన్వేషణ మొదలుపెట్టారు కూడా. చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించారు. ఆ లిస్ట్లో దీపికా పదుకొనే, కృతీ సనన్, కంగనా రనౌత్ల పేర్లు ఉన్నాయి. వాళ్లు బిజీగా ఉండడంతో ఫైనల్గా అనుష్కా శర్మ, పరిణీతి చోప్రాలను సంప్రతించారట. అనుష్క శర్మ మాటేమో గానీ పరిణీతి చోప్రా మాత్రం ‘నో’ చెప్పారట. అనుష్కాశర్మ పక్కన సెకండ్ హీరోయిన్గా చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్ను కాదనుకున్నారట. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ హీరో అయినా, తనకు లైఫ్నిచ్చిన ఆదిత్యా చోప్రా నిర్మాత అయినా సరే ఆమె ఒప్పుకోలేదంటే అనుష్కా శర్మతో ఆమె సంబంధాలు ఎంతగా చెడిపోయాయో ఊహించుకోవచ్చు. -
సానియా మీర్జాగా...!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాగా పరిణీతి చోప్రా నటించనున్నారా? ఆ చాన్స్ ఉందని బాలీవుడ్లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఫర్హాన్ అక్తర్ నటించిన ‘బాగ్ మిల్కా బాగ్’, ప్రియాంకా చోప్రా చేసిన ‘మేరీ కోమ్’ వంటి బయోపిక్స్ విజయం సాధించాక అగ్ర నటుల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ అందరూ ఈ తరహా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకురాలు ఫరాఖాన్ ఇప్పుడు సానియా మీర్జా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సానియాకి మాత్రం తన జీవితం ఆధారంగా సినిమా వస్తే ఓకేనట. అయితే, టైటిల్ రోల్ను పరిణీతి చోప్రా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. మరి... నిజంగానే సానియా జీవితం వెండితెరకొస్తుందా? ఒకవేళ వస్తే, అందులో సానియాగా ఎవరు నటిస్తారు? తదితర ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
పరిణీతి చోప్రా.. ఏడ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఉన్నట్టుండి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టింది. నీరజ్ ఘేవన్ దర్శకత్వంలో వచ్చిన 'మసాన్' సినిమా చూసి ఆమె కన్నీరు ఆపుకోలేకపోయిందట. థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నానని పరిణీతి చెప్పింది. బుధవారం రాత్రి బాలీవుడ్ హీరో హీరోయిన్లు కొందరి కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న మసాన్ సినిమాకు 4.5 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాలో రిచా ఛద్దా, విక్కీ కౌశల్, సంజయ్ మిశ్రా, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. కేన్స్ చలన చిత్రోత్సవంలో కూడా అవార్డులు సాధించింది. సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, గడిచిన మూడు రోజులుగా బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజ్కుమార్ హిరానీ, కబీర్ ఖాన్, షబనా ఆజ్మీ, దియా మీర్జా.. ఇలా ప్రతి ఒక్కళ్లూ ఈ సినిమాను ప్రశంసిస్తూనే ఉన్నారు. రిచా ఛద్దా చాలా అద్భుతంగా చేసిందని, విక్కీ నటన చూసి కదిలిపోయానని, ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని పరిణీతి చెప్పింది. -
ధోనీ భార్యగా పరిణీతి చోప్రా?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితగాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రంలో ధోనీ భార్య పాత్ర పోషించే కీలక అవకాశం పరిణీతి చోప్రాకు దక్కిందని సమాచారం. పరిణీతి కంటే ముందు చిత్ర దర్శక నిర్మాతలు ఈ పాత్ర కోసం ఆలియా భట్, శ్రద్ధా కపూర్, కీర్తి సానన్లను సంప్రదించారట. అయితే, వారెవరూ పాత్రకు తగిన న్యాయం చేయలేరని భావించడంతో, తాజాగా పరిణీతిని సంప్రదించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎంఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ’ పేరిట నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ధోనీ భార్య సాక్షీ రావత్ పాత్రకు పరిణీతి అతికినట్లుగా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. పరిణీతి కూడా ఈ సినిమా చేసే విషయంలో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారట. -
ఎందుకలా జరిగిందంటే...
ముంబై : సల్మాన్ఖాన్ ఒక్కసారి మాట ఇస్తే ఇక ఆ మాటకు తిరుగు ఉండదు. సరే, ఇదేదో బానే ఉంది గాని, ఆయన 'ఇచ్చిన మాట' పరిణితిచోప్రాకు ఇబ్బందికరంగా మారింది. విషయం ఏమిటంటే... సల్మాన్ఖాన్ తన సొంత బ్యానర్ 'సల్మాన్ఖాన్ ఫిల్మ్స్' పై 'జుగల్బందీ' సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమీర్శర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాలో సైఫ్ ఆలిఖాన్ నటించనున్నారు. ఆయన సరసన హీరోయిన్గా పరిణితిచోప్రాను అనుకున్నారు. ఈ సినిమా తన కెరీర్ను ఎక్కడికో తీసుకువెళుతుందని ఆమె కూడా ఆశ పడింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజా వార్త ఏమిటంటే, పరిణితిచోప్రా స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించనున్నారు. సల్మాన్ సినిమాలో నటించలేనంత బిజీగా ఉందా చోప్రా? ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమీ లేదని అర్థమవుతుంది. మరోవైపు ఫెర్నాండేజ్ డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీలో ఉంది. అయినప్పటికీ జుగల్బందీలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? దీనికి కారణం సల్మాన్ఖాన్. తన నిర్మాణ సంస్థలో అవకాశం ఇస్తానని అప్పుడెప్పుడో సల్మాన్, ఫెర్నాండేజ్కు ప్రామిస్ చేశాడట. తన మాట కాస్త లేటుగా గుర్తుకువచ్చి చోప్రాను తప్పించాడట. వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ...'జుగల్బందీ' లో ఫెర్నాండేజ్ నటించడానికి కారణం...సల్మాన్ మాటకు గౌరవం ఇవ్వడంతో పాటు, ఈ మ్యూజికల్ డ్రామా స్క్రిప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చడం. పాపం పరిణితి! -
ఆమె రంగూన్ వెళ్లడం వల్లే...
సల్మాన్ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వచ్చింది అనేదానిపై రోజుకో పేరు వినిపించింది. దీపిక పడుకొనె, కంగనా రనౌత్ల పేర్లు కాస్త గట్టిగానే వినిపించాయి. డేట్ ఇష్యూ వల్ల తాను ‘సుల్తాన్’లో నటించడం లేదని కంగానా తేల్చేసింది. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’లో కంగనా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యత ‘సుల్తాన్’కు ఇవ్వకపోవడం, పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే దర్శక,నిర్మాతలు వేరే హీరోయిన్ను ఎంచుకోవాల్సి వచ్చిందట. గమనించాల్సిన విషయం ఏమిటంటే, సల్మాన్ఖాన్ ‘బజ్రంగి బైజాన్’ సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం వచ్చినా... ఏవో కారణాల వల్ల ఆ సినిమా చేయనంది కంగనా. ‘సుల్తాన్’ సినిమాలో కంగనా కాదు... దీపిక పడుకొనె హీరోయిన్ అనుకునేలోపు ఇప్పుడు కొత్తగా పరిణితి చోప్రా పేరు వినిపిస్తోంది. పెద్దగా హిట్లు లేని చోప్రాకు సల్మాన్ సరసన నటించే అవకాశం రావడం వింతే అంటున్నారు. ‘సుల్తాన్’ సినిమాను యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ నుంచే బాలీవుడ్లోకి ప్రవేశించింది పరిణితి. పెద్ద ప్రాజెక్ట్ల్లో... రేపు షూటింగ్ అనగా కూడా పేర్లు మారుతుంటాయి. చూద్దాం మరి... చోప్రాకు ఎంత అదృష్టం ఉందో!