Right to vote
-
ఓటర్ ఐడీ మాత్రమే సరిపోదు: ఢిల్లీ ఎన్నికల సంఘం
ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ఓ ప్రకటన వార్తల్లోకెక్కింది.ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2025 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అయితే ఇదే సమీక్షలో సీఈవో కీలక ప్రకటన చేశారు. కేవలం ఓటర్ ఐడీ(Voter ID) ఉన్నంత మాత్రన ఓటు హక్కు వర్తించబోదని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోందంటే.. కేవలం ఒక్కచోటే ఓటర్గా నమోదు అయ్యి ఉండి.. ఓటర్ తుది జాబితాలో పేరు ఉండి.. ఓటర్ స్లిప్ అందినప్పుడే మాత్రమే ఓటు హక్కువేయడానికి ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్(Voter Slip)తో పాటు ఓటర్ ఐడీని కూడా పోలింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. కేవలం ఓటర్ ఐడీ అనే కాదు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్టు.. ఇలా 11 రకాల ఐటీ కార్డు కార్డుల్లో ఏదైనా ఓటర్స్లిప్తో పాటు తీసుకెళ్లి ఓటేయొచ్చు.అలాంటి వాళ్ల ఓటు హక్కును మీరూ తొలగించొచ్చు..ఒక ఓటరు చిరునామా శాశ్వతంగా మార్చినా లేదంటే ఓటర్ చనిపోయినా వాళ్ల ఓటు హక్కుపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తొచ్చు. అయితే ఆ అభ్యంతరాలను లేవనెత్తేది.. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండాలి.ఇందుకోసం ఫారం-7ను అప్లై చేయాలి. ఆపై సదరు ఓటర్కు, అలాగే ఫిర్యాదు చేసినవాళ్లకు నోటీసులు వెళ్తాయి. అదే ఓటరు మరణించిన సందర్భమైతే..స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతారు. నోటీసులు అందుకున్న ఓటరు సకాలంలో స్పందించకపోతే.. ఆ ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.ఓటర్లను జల్లెడ పట్టి.. తొలుత అక్టోబర్ 1, 2024 తేదీదాకా 18 ఏళ్లు నిండినవాళ్లు ఓటర్గా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీదాకా బూత్ లెవల్(Booth Level) ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్లుగా నమోదు చేసుకోనివాళ్లను గుర్తించారు. అడ్రస్లు మారినవాళ్లు, చనిపోయినవాళ్లు, డూప్లికేట్లు(Duplicate) కార్డులను ఏరిపారేశారు. అక్టోబర్29వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ను రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టి.. డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసింది. ఇప్పుడు జనవరి 1, 2025 తేదీతో 18 ఏళ్లు పూర్తైన వాళ్లు ఓటర్గా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం పేర్కొంది.అయితే.. అప్డేషన్, మార్పులు చేర్పులు లాంటి నిరంతర ప్రక్రియ యధావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త ఓటర్లుగా రిజిస్టర్ కావాలనుకుంటే ఫారం 6ను నింపి సంబంధిత డాక్యుమెంట్లతో బూత్ లెవల్ ఆఫీసర్ను సంప్రదించాలని.. మార్పులు, తొలగింపుల కోసం ఫారం-8, ఫారం-7లను సబ్మిట్ చేయాలని సూచించారు.తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు కోసం..ఇదిలా ఉంటే.. వేర్వేరు చోట్ల ఓటర్గా నమోదు చేసుకుని ఉన్నా.. లేకుంటే ఎక్కువ ఓటర్ కార్డులు కలిగి ఉన్నా పీపుల్స్ రెప్రజెంట్ యాక్ట్ 1950 సెక్షన్లు 17, 18 కింద శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలే ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతేకాదు.. ఓక్లా నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం తప్పుడు డాక్యుమెంట్ల సమర్పించిన ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయని ఢిల్లీ ఎన్నికల సంఘం(Delhi Election Commission) తెలిపింది.ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి👉🏻: ఆయన ఆలయాలను కూల్చమంటున్నాడు! -
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మరోసారి ఫ్యాన్ సునామీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత (పాజిటివ్) పోటెత్తింది. ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లే కనిపించారు. వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కొన్ని కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తమ్మీద గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ పోలింగ్ నమోదు 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎండల ప్రభావం తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేసింది.నిర్దేశించేది మహిళలు, గ్రామీణ ఓటర్లే..పోలింగ్ సరళిపై ఇండియాటుడే ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ సోమవారం రాత్రి టీవీలో చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో తాను విస్తారంగా పర్యటించానని.. మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న సెఫాలజిస్ట్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే యాక్సి మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా దీనిపై ఏకీభవించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. రోడ్లు గురించి కాకుండా ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయన్నదే ప్రామాణికంగా తీసుకుని 80 శాతం మంది మహిళలు ఓటు వేస్తారని తెలిపారు.ఇంటింటి అభివృద్ధిని ప్రతిబింబించిన పోలింగ్ సరళి..నవరత్నాల పథకాలను గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికలను పెత్తందారులు – పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా బడుగు, బలహీన వర్గాలు భావించడం వల్లే భారీగా పోలింగ్ నమోదైందని పేర్కొంటున్నారు. -
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ అర్హులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలు ఫేజ్ 4మొత్తం లోక్సభ సీట్లు: 96రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు: 10పోటీలోని మొత్తం: 1,717మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,81,196పోటీలో ఉన్న మహిళలు: 170గ్రాడ్యుయేట్లు: 1,010కోటీశ్వరులు: 476అభ్యర్థులపై ఉన్న కేసుల సంఖ్య: 360 -
పులివెందులకు చేరుకున్న సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. తన సతీమణి వైఎస్ భారతమ్మతో కలిసి సాయంత్రం 6.15 గంటలకు భాకరాపురంలోని స్వగృహానికి ఆయన చేరుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య భాకరాపురంలోని 138 పోలింగ్ బూత్లో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరుతారు. -
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట పూర్తిస్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 83శాతం ఓటింగ్ లక్ష్యంగా.. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్ పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్కుమార్ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు. 1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్కుమార్ మీనా చెప్పారు. ప్రశాంత పోలింగ్కు పటిష్ట భద్రత డీజీపీ హరీశ్కుమార్ గుప్తా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల వివరాలు.. -
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
తమ భవిష్యత్ను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజల్లో నిర్లిప్లత కనిపిస్తుంటుంది. చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించరు. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 70 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు! పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ మరీ తక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మరింత మందిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఓటరు స్లిప్లపై క్యూఆర్ కోడ్లు ముద్రిస్తోంది. పోలింగ్ బూత్ ఎక్కడుంది మొదలుకుని ఓటింగ్కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ కోడ్ సాయంతో ఇట్టే తెలుసుకోవచ్చు. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం ఓటర్ స్లిప్లపై ఉండే క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే చాలు.. ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెబుతుంది. అక్కడికెలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో క్యూఆర్తో కూడిన ఓటర్ స్లిప్ల కారణంగా ఓటింగ్ బాగా పెరిగినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికార మనోజ్కుమార్ మీనా వెల్లడించారు. బెంగళూరు టీచర్స్ కాలనీ అసెంబ్లీ స్థానంలో 2020లో 66 శాతం నమోదైన పోలింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతానికి పెరిగిందన్నారు. ‘‘చాలామంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భవనాలెక్కడున్నదీ తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్యూఆర్ కోడ్ దీనికి పరిష్కారం. ఈ లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 80 శాతానికి పైగా ఓటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఓటర్ స్లిప్లు పంపిణీ చేశాం’’ అని ఆయన వివరించారు. డిజిటల్ ఓటర్ స్లిప్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్లను ‘ఓటర్ హెల్ప్లైన్’ యాప్ ద్వారా డిజిటల్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కలి్పంచడం విశేషం. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది డెస్క్ వరకు ఫోన్లను తీసుకెళ్లి ఈ డిజిటల్ ఓటర్ స్లిప్ను చూపించేందుకు అనుమతించారు. భవిష్యత్లో ఎన్నికలు మరింత డిజిటల్గా మారనున్నాయనేందుకు ఇది మరో సంకేతం. ఆకర్షించే ఏర్పాట్లు ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ విడత చాలా రాష్ట్రాల్లో థీమ్ ఆధారిత పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందితో కూడిన కేంద్రాలు, 30 ఏళ్లలోపు వయసున్న అధికారులతో యూత్ పోలింగ్ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో వారి ఇళ్లను పోలిన పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలింగ్ కనాకష్టంగా 50 శాతం దాటుతుండటం తెలిసిందే. ఇలా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలకు బృందాలను పంపించి ఓటర్లలో చైతన్యానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయం కూడా తీసుకుంటోంది. బూత్ వద్ద చాంతాడంత క్యూలు చూసి అంతసేపు లైన్లో ఉండాలా అని చాలామంది అనుకుంటారు. దీనికి విరుగుడుగా పోలింగ్ బూత్ వద్ద క్యూను ఇంటి నుంచే మొబైల్లో తెలుసుకునేలా యాప్లను ఈసీ అభివృద్ధి చేసింది. ఆ బూత్ల సమీపంలో వాహనాల పార్కింగ్ వసతులున్నాయా, లేదంటే సమీపంలో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు వంటి సమాచారం కూడా వాటిలో అందుబాటులోకి తెచి్చంది. నడవలేని వృద్ధుల కోసం ఈ యాప్ల నుంచి వీల్చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అర్హతలు, అఫిడవిట్లో సమాచారం, వారిపై ఏవైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా? ఆస్తులు, అప్పులు తదితర పూర్తి సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తతంగమే ఉండేది. సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దాని పరిస్థితేమిటో తెలిసేది కాదు. ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు అందులో పేరుంటే ఓటు హక్కు వచ్చినట్టు తెలిసేది! ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికల సంఘం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. సేవలు, విధులను దాదాపుగా డిజిటలీకరించింది. తద్వారా పాదర్శకతను పెంచే దిశగా కృషి చేస్తోంది. ఓటరుగా నమోదు మొదలుకుని తప్పొప్పులు, చిరునామా సవరణలు, ఓటు బదిలీ దాకా ఇప్పుడన్నీ కూర్చున్న చోటినుంచి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అంతేనా?! ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, అక్కడికెలా వెళ్లాలి, అభ్యర్థులు, వారి ఆస్తులు, కేసుల వివరాల వంటివన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదులు కూడా ఆన్లైన్లోనే చేసేయవచ్చు. ఇలా గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నికల సంఘం తీసుకొచి్చన డిజిటల్ మార్పులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఓసారి తెలుసుకుందాం...ఎల్రక్టానిక్ పోస్టల్ బ్యాలెట్ (2016)ఎన్నికల విధుల్లో ఉండే సరీ్వస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లను ఎల్రక్టానిక్ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఎల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్గా పిలుస్తారు.ఓటర్ హెల్ప్లైన్ యాప్ (2019)తమ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడో ఈ యాప్తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరునూ పరిశీంచుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉందన్నది ఎప్పడికప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి.ఎరోనెట్ (2018) ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ నెట్వర్క్ సంక్షిప్త రూపమే ఎరోనెట్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడి సదుపాయాలు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్ నెట్వర్క్ను ఈసీ రూపొందించింది. ఎన్వీఎస్పీ లేదా ఓటర్ హెల్ప్లైన్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్గా పని చేస్తుంటుంది.సి–విజిల్ యాప్ (2018)ఎన్నికల నియమావళిని అభ్యర్థులు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేస్తున్నా; ఓటర్లను ధన, వస్తు రూపంలో ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫొటో, వీడియో రుజువులను లొకేషన్ జియోట్యాగ్ చేసి అప్లోడ్ చేయవచ్చు.సక్షమ్ ఈసీఐ యాప్ (2023)గతంలో దీన్ని పర్సన్స్ విత్ డిజెబుల్డ్ యాప్ (పీడబ్ల్యూడీ)గా పిలిచేవారు. దివ్యాంగులు ఇందులో అభ్యర్థుల సమాచారం, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి? ఫిర్యాదుల నమోదు, బూత్ వరకు వెళ్లేందుకు సాయం కోరడం తదితర సేవలను పొందవచ్చు. అబ్జర్వర్ యాప్ (2019)ఎన్నికల పరిశీలకులు (సాధారణ, పోలీసు, వ్యయ) ఈ యాప్ ద్వారా తమ నివేదికలను ఫైల్ చేయవచ్చు. సి–విజిల్ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ ఉందన్నది ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులు చూడవచ్చు. అవసరమైతే స్క్వాడ్ను పిలవడం తదితర టాస్క్లను నిర్వహించుకోవచ్చు.గరుడ యాప్ (2020)బూత్ స్థాయి అధికారుల కోసం తెచి్చన యాప్. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫొటోల అప్లోడింగ్కు వీలు కల్పిస్తుంది.నో యువర్ క్యాండిడేట్ (2022)అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, వారిపై క్రిమినల్ కేసులు తదితర పూర్తి సమాచారం లభిస్తుంది.ఓటర్ టర్నౌట్ యాప్ (2019)పోలింగ్ నాడు దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎలా ఉందో ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.క్యాండిడేట్ నామినేషన్ యాప్ (2020)అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ యాప్ ద్వారా డిజిటల్గానే దాఖలు చేయవచ్చు. అఫిడవిట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేసి, సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.ఈ–ఎపిక్/డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు (2021) ఎలక్షన్ ఫొటో ఐడీ కార్డ్ (ఎపిక్) ఎంతో ముఖ్యమైనది. భౌతిక కార్డు లేని వారు ఈ–ఎపిక్ను ఈసీ పోర్టల్ నుంచి మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ చూపించి కూడా ఓటు వేయవచ్చు.నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ) (2015) ఈ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, నియోజకవర్గాలు, వాటి పరిధిలో పోలింగ్ కేంద్రాల సమచారం తెలుసుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో), ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ల వివరాలు కూడా ఇక్కడే లభిస్తాయి. ఎన్వీఎస్పీ ఆధునీకరణ (2019) ఓటర్లకు కావాల్సిన సేవలన్నింటికీ ఏకీకృత పోర్టల్గా www.nvsp.in పేరుతో ఈసీ దీన్ని అభివృద్ధి చేసింది. తర్వాత ఠి్టౌ్ఛటట.్ఛఛిజీ.జౌఠి.జీnకు అనుసంధానం చేసింది. ఐటీ నెట్వర్క్ (2019) దేశవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు తాలూకు తాజా ఫలితాలు తెలుసుకునేందుకు ఎన్నికల సిబ్బంది కోసం తీసుకొచి్చన నెట్వర్క్. 2019 ఎన్నికల కౌంటింగ్కు ముందు దీన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, రిటరి్నంగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఐటీ సదుపాయం ద్వారా తాజా సమాచారం తెలుసుకుని డిజిటల్ తెరలపై ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఆధార్తో అనుసంధానం (2022) ఓటర్ జాబితాలో కచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎపిక్లతో ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. 4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్యరాష్ట్రంలో లోక్సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు. 15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు. పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించంరాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసేశారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. -
‘మహా’ ఎన్నికల్లో మన ఓటర్లు
కెరమెరి(ఆసిఫాబాద్): ఇటు తెలంగాణ.. అటు మ హారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం జిల్లా ఆసిఫా బాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు వచ్చే కెరమెరి మండలంలోని 15 గ్రామాలకు చెందిన ఓటర్లు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తారు. పరంధోళి, నోకేవాడ, భోలాపటార్, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో 2,485మంది ఓటర్లు ఉన్నారు. పరంధోళి పోలింగ్ కేంద్రం(పరంధోళి, తండా, కోటా, శంకర్లొద్ది, ముకదంగూడ)లో 1,367 మంది ఓటర్లు ఉండగా.. నోకేవాడ(మహారాష్ట్ర పోలింగ్ కేంద్రం)లో మహరాజ్గూడ ఓటర్లు 370, భోలాపటార్(¿ోలాపటార్, గౌరి, లేండిగూడ) 882, అంతాపూర్ పోలింగ్ కేంద్రం(నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్)లో 978మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి సుదీర్ మునగంటీవార్, కాంగ్రెస్ నుంచి ప్రతిభా థానోర్కర్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు వేసి ఊరుకుంటారా? ‘వన్ నేషన్..వన్రేషన్’లో భాగంగా ఒక ఓటరు ఒకేవైపు ఓటు వేయాలని ఇటీవల ఆయా గ్రామాల్లో అధికారులు అవగాహన కల్పించారు. అయితే చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్కు శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా, మే 13న ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్కు పోలింగ్ జరుగుతుంది. అయితే రెండువైపులా ఓటుహక్కు వినియోగించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. -
ఎన్నికల పాఠం
కోనసీమ జిల్లా: వంద శాతం పోలింగ్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది. 6వ తరగతి నుంచి.. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పొందుపర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసుకునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్ 326, విశ్వజనీన వయోజన ఓటుహక్కు గురించి వివరించారు. ► 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 8వ తరగతిలో మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం? పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగించిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయాలను వివరించారు. ► 9వ తరగతిలో ‘ఎన్నికల రాజకీయాలు’ అనే చాప్టర్లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్యర్థులు నామినేషన్ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన చేపట్టారు. -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గతేడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని చెప్పారు. తుది జాబితా ప్రచురణకు ముందు 2 నెలల పాటు ప్రధానంగా 18–19 ఏళ్ల వయసున్న వారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరం కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులను గవర్నర్ అందజేశారు. ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలలక్ష్మి, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావులకు పురస్కారాలను అందజేశారు. ఈఆర్వోలైన నెల్లూరు మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్డీసీ రామలలక్ష్మి, భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏఈఆర్వోలైన కోడుమూరు మండలం తహశీల్దార్ జయన్న, మైదుకూరు తహశీల్దార్ అనురాధ, గిద్దలూరు తహశీల్దార్ సీతారామయ్య, మరో 23 మంది బీఎల్వోలను, సీఈవో కార్యాలయానికి చెందిన ఎస్వో శ్రీనివాసరావు, ఏఎస్వో సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని గవర్నర్ సత్కరించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అందరం దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు రాజ్భవన్వర్గాలు గురువారం తెలిపాయి. -
Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్ జెండర్ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను https://electoralsearch.eci.gov.in/లో చూడొచ్చన్నారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు. ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల అక్టోబర్లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు, ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి పారదర్శకంగా జాబితా జనవరి 2022 నుంచి తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి వంద శాతం ఆధారాలను సేకరించిన తరువాతే సవరణ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సమయంలో 21,18,940 ఓటర్లను తొలగించగా కేవలం 13,061 కేసుల్లో మాత్రమే నిబంధనలు పాటించలేదని, వాటిని నిబంధనలకు అనుగుణంగా సవరించామని పేర్కొంది. సున్నా ఇంటి నెంబర్పై 2,51,767 ఇళ్లు, ఒకే ఇంటి నెంబర్పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 1,57,939 ఇళ్లను గుర్తించి ఆగస్టు, సెప్టెంబర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సవరణ చేసినట్లు తెలిపింది. జీరో నెంబర్ ఇంటి కేసులను 97 శాతం సవరణ చేయగా పది కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్యలో 98 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. ఓట్ల తొలగింపు, డూప్లికేటు ఓట్లు, మరణాలు, చిరునామా మార్పు లాంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి 14,48,516 ఫిర్యాదులు రాగా అందులో 5,64,497 కేసులు అర్హత ఉన్నవిగా గుర్తించి వాటిని తొలగించినట్లు పేర్కొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరే పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపు, చేర్పులకు దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలా బల్క్గా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఓట్లు వేరువేరు చోట్ల నమోదైన కేసులను గుర్తించి వాటిని సవరించామని, ఈ విధంగా విశాఖలో 26,000 ఓట్లను సవరణ చేయగా, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లను సవరించినట్లు తెలిపింది. నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. వారికి ఇంటివద్దే ఓటు హక్కు 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పది రోజులు ముందు దాకా.. ఎన్నికల వరకు ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఎన్నికల తేదీకి పది రోజుల ముందు వరకు అందిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సందేహాలు, ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్కుమార్తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం
అలంపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ప్రతి సారి ఓటర్లు పెరుగుతున్నారు. అందుకు అనువుగా పోలింగ్ శాతం పెరుగుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం జోరు ప్రచారాలతో ఓటర్లలలో అవగాహన కల్పిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యంతో ముందుకు వస్తున్నారు. కానీ పోలింగ్ మాత్రం వంద శాతానికి దూరంగా ఉంటుంది. దీంతో గెలుపోటములపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంటుంది. 2009 సార్వత్రిక ఎన్నికల 1,88,678 మంది ఓటర్లు ఉండగా 1,29282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,10,047 మంది ఓటర్లు ఉండగా 1,58,069 మంది ఓటు హక్కు వినియోగించకోవడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,17, 157 మంది ఓటర్లు ఉండగా 1,79,683 మంది, 2023 ఎన్నికల్లో 2,37,938 మంది ఓటర్లు ఉండగా 1,96,307 మంది తమ ఓటు హక్కును వి నియోగించుకున్నారు. ఇదిలాఉండగా, 2009లో 59,396 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో 51,978 మంది, 2018లో 37,474 మంది, 2023 ఎన్నికల్లో 41,631 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 శా తం మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం ప్రచారం మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇది చదవండి: జిల్లాలో 06 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే! -
ఓటర్ల సంఖ్య పెరిగినా.. పోలింగ్ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి అర్హులైన ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, ఆ మేరకు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్ శాతం తగ్గింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లకు గాను 2,32,59,256 మంది (71.34%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,62,98,482 మంది పురుషులకు గాను 1,15,84,728 మంది, 1,63,01,634 మంది మహిళలకు గాను 1,16,73,722 మంది, 2,677 మంది థర్డ్ జెండర్ ఓటర్లకు గాను 806 మంది ఓటేశారు. గురువారం నాటి పోలింగ్కు సంబంధించిన తుది గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శుక్రవారం రాత్రి విడుదల చేశారు. అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదు కాగా..పాలేరు (90.89 శాతం), ఆలేరు (90.77 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా యాకుత్పురలో 39.64 శాతం నమోదైంది. మలక్పేట (41.32 శాతం), చారి్మ నార్ (43.27 శాతం) ఆపై స్థానాల్లో ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమనార్హం. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 1.86 శాతం పోలింగ్ తగ్గింది. 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లుండగా, 2.05 కోట్ల మంది ఓటేశారు. అయితే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగి 3.26 కోట్లకు చేరుకోగా, 2.32 కోట్ల మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కారణంగానే.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం 26.78 లక్షల మంది ఎక్కువగా ఓటేసినా, పోలింగ్ శాతం మాత్రం తగ్గింది. -
రాష్ట్రంలో కాంగ్రెస్దే విజయం: భట్టి
మధిర: రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలనే ఆకాంక్షతో ఓటర్లు కాంగ్రెస్కు ఓటు వేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని.. సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్ల కాలంలో వనరులు, సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశారని భట్టి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ తూ.చ. తప్పక అమలు చేస్తామని చెప్పారు. -
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
Oath To Vote: ఓటుతో దుమ్ము రేపుదాం
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలు "ఓత్ టు వోట్" (OATH TO VOTE) నినాదం ఏమిటంటే.. 'ఓటు హక్కు కలిగిన ఓటరు ఈ వెబ్ సైట్ https://o2v.sakshi.com/?utm_source=sakshio2v కు లాగిన్ అయి తమ ఓటు హక్కును 2023 ఎన్నికలలో తప్పకుండా వినియోగించుకుంటామని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) ద్వారా ప్రమాణం చేయాలి. అంతేకాదు ఆ ప్రమాణానికి సంబంధించి ప్రమాణపత్రం కూడా ఇమెయిల్ రూపంలో వెంటనే పొందవచ్చు.' ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోక పోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాలతోపాటు మన జీవితాలూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ‘‘ఏం ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా?’’ ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్న అని గుర్తించండి. ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. ‘ఓత్ టు వోట్’ ద్వారా మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. -
ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయిన పక్షంలో ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి (ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరున్న వారికి) సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఒకవేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటరు గుర్తింపు నిర్థారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (సీఈఓలకు) లేఖ రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి.. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాల్లో (కింద జాబితాలో చూడవచ్చు) ఏదో ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలివే.. – ఆధార్కార్డు – ఉపాధి హామీ జాబ్ కార్డు – బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ – కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు – డ్రైవింగ్ లైసెన్స్ – పాన్కార్డు – రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎనీ్పఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు – భారతీయ పాస్పోర్టు – ఫోటో గల పెన్షన్ పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు – ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు – కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ) -
భారత్లో భారీగా పెరిగిన ఓటర్లు..
న్యూఢిల్లీ: మన దేశంలో ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడింది. అయితే ఈ ఓటర్లలో దాదాపుగా మూడో వంతు మంది ఓటుకి దూరంగా ఉండడం ప్రజాస్వామ్యంలోనే విషాదకరం. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పట్నుంచే కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాలు పన్నుతోంది. మొట్టమొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 45.67% ఓటింగ్ నమోదైంది. 1957 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 19.37 కోట్లు ఉంటే 47.44% మంది ఓటు వేశారు. 2009 నాటికి ఓటర్ల సంఖ్య భారీగా 71.7 కోట్లకు పెరిగినప్పటికీ ఓటింగ్ శాతం 58.21 మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.20 రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటే 67.40శాతం మంది తమ ఓటు హక్కు -
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, అమరావతి: ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల అస్త్రం ఓటు హక్కని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారందర్నీ ఓటర్లుగా నమోదు చే యించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 3.03 లక్షల మంది ఓటర్ల నమోదుతో పాటు, మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాశాల విద్య కమిషనర్ పి.భాస్కర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదా వరి జిల్లాల కలెక్టర్లు కేవీఎన్ చక్రధర్బాబు, ఎం.హరినారాయణ, ఎ.మల్లికార్జున, పి.ప్రశాంతి, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్.హరేంద్ర ప్రసాద్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్కుమార్లతో పాటు ఏఆర్వోలు, బీఆర్వోలకు గవర్నర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. -
ఓటు వలస వెళుతుందా? రిమోట్ ఓటింగ్పై పెరుగుతున్న రాజకీయ వేడి
ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది. ఎందుకీ ఆర్వీఎంలు ? వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. ఆర్వీఎంలు ఎలా పని చేస్తాయి ? ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న వారిని రిమోట్ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్ రీడర్ (సీసీఆర్) ద్వారా స్కాన్ చేసి గుర్తిస్తారు. అప్పుడు ఆర్వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రం డిస్ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్ వివరాలన్నీ రిమోట్ కంట్రోల్ యూనిట్లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్ స్లిప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్వీఎంలు ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ ► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది. ► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు. ► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్ బూత్లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు. ► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు ► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి. ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు ► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం ► ఈవీఎంలకు సవరించిన వెర్షన్గా రూపొందించిన ఆర్వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం ► ఎన్నికల్లో ఎన్ని రిమోట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం ► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది. రాజీవ్ కుమార్, సీఈసీ ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్ బూత్లున్న ప్రతిచోటా పోలింగ్ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా రిమోట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు. జగ్దీప్ చొకార్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ సహ వ్యవస్థాపకుడు ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్వీఎం అవసరం ఏమొచ్చింది..? జైరామ్ రమేష్, కాంగ్రెస్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్!
సాక్షి, నల్గొండ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన యువకుడు కుడుముల కళ్యాణ్రెడ్డి తనకు తొలిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు. పోలింగ్ సమయం దగ్గర పడిన క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. అప్పటికే సమయం 6.08 గంటలు అయ్యింది. ఓటర్ స్లిప్పుతో పోలింగ్ కేంద్రంలోని వెళ్తుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు అనుమంతిచలేదు. సమయం ముగిసినందున ఓటు వేయడం కుదరదని తేల్చిచెప్పారు. తనకు మొదటిసారి ఓటు వచ్చిందని అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు నిరాశతో వెనుదిరిగాడు. ఒక్కరికి రెండు ఓట్లు! మునుగోడు : అధికారుల తప్పిదాల వల్ల ఒక్క ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు వచ్చింది. దీంతో వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మునుగోడులోని పలు బూత్లలో ఒకే ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు ఓటరు లిస్టులో ముద్రించారు. మునుగోడులోని బూత్ నంబర్ 155లో క్రమ సంఖ్య 902లో కట్ట పవిత్రకు ఓటు హక్కు ఉన్నట్లు ఓటరు లిస్టులో ఉంది. అదే ఓటరు పేరు తిరిగి 903 క్రమ సంఖ్యలో కూడా ఉండటంతో ఆ యువతి ఓటు వేసేందుకు అభ్యంతరం వ్యక్తమైంది. చివరికి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ బూత్ ఏజెంట్లతో మాట్లాడి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. అదే గ్రామంలోని పందుల పవన్కు 155 బూత్లోని 927 క్రమ సంఖ్యలో ఓటు హక్కు ఉంది. అదే యువకుడికి బూత్ నంబర్ 152లో కూడా ఉండటంతో అతడు ఏ బూత్లో ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు. -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఐదో బ్లాక్లో మంగళవారం రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్భవన్ నుంచి వెబినార్ ద్వారా హాజరైన గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిన విషయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని, వారంతా ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పౌరులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంటూ.. దీనిని మరింత సులభతరం చేసేందుకు అనేక రకాల వినూత్న చర్యలను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆధార్తో ఫొటో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానించడం ద్వారా పేరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదు కాకుండా నివారించేందుకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు నిర్వహించిన విస్తృత ప్రచార అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లలో 50 శాతం మంది యువతే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ మాట్లాడుతూ.. ఓటర్లలో 50 శాతం మంది యువత ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్లు ఏర్పాటు చేసి అర్హత గల వారందరికీ అవగాహన కల్పించి ఓటర్లుగా నమోదు చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45,950 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర పంపిన వీడియో సందేశాన్ని సమావేశంలో ప్రదర్శించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అందరితో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు కార్తికేయ మిశ్రా, ఎ.సూర్యకుమారి, నాగలక్ష్మి, నెల్లూరు ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధరబాబు, వైఎస్సార్ జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, విధాన పరిషత్ ద్వైవార్షిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డిలకు సీఈవో విజయానంద్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 13 మంది ఏఈఆర్వోలు, 13 మంది బూత్ స్థాయి అధికారులకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్షన్ అధికారులకు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎస్ఎల్ఏ టీం సిబ్బందికి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ అందించారు. -
న్యూయార్క్లో డ్రీమర్స్కు ఓటు హక్కు
న్యూయార్క్: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్ నగరం డ్రీమర్స్కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ న్యూయార్క్ నగర కౌన్సిల్ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. -
పెళ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రానికి..
కుప్పం: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్ జరుగుతున్న ఆర్ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. -
AP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది. Live Updates TIME: 5:00PM అనంతపురం: అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్స్ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. Time 4:00 PM ►నెల్లూరు జిల్లా: కోట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆర్డీఓ మురళీకృష్ణ పరిశీలించారు. సాయంత్రం 4 గంటలవరకు 56.3 శాతం పోలింగ్ నమోదు. ►పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం జెడ్పీటీసీ ఎన్నికలో సాయంత్రం 4 గంటల వరకు 65.2 శాతం పోలింగ్ నమోదు. ► గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలం వేల్పూర్ లో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పారా హైమావతి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఓటర్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో ఓటర్ ను ప్రభావితం చేస్తున్న హైమావతిని పోలీసులు బయటికి పంపించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ► తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెంలో 4గంటలకు నమోదైన పోలింగ్ శాతం 73.64%. ► ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 4 గంటలకు 72.23% పోలింగ్ నమోదు. Time 3:00 PM ► కర్నూలు జిల్లా జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలకు 57.33 శాతం పోలింగ్ నమోదు. ► నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ ఎన్నికలో 3 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు ► పశ్చిమగోదావరి జిల్లా: సాయంత్రం 3 గంటల వరకు నుగొండ మండలం జడ్పీ, ఎంపీటీసీ 59.97 శాతం పోలింగ్ శాతం. ► కృష్ణా జిల్లా జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పెడన జడ్పీటీసీ 61.20 శాతం జి.కొండూరు జడ్పీటీసీ 54.92 శాతం విస్సన్నపేట జడ్పీటీసీ 44.49 శాతం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఆగిరిపల్లి (మం) ఈదర-1: ఎంపీటీసీ 74.88 శాతం గన్నవరం (మం) చినఅవుటుపల్లి - ఎంపీటీసీ 60.90 శాతం నూజివీడు (మం) దేవరకుంట - ఎంపీటీసీ 67.69 శాతం నాగాయలంక (మం) పర్రచివర - ఎంపీటీసీ 57.62 శాతం ముదినేపల్లి (మం) ముదినేపల్లి-2: ఎంపీటీసీ 49.23 వణుదుర్రు ఎంపీటీసీ 56.59 శాతం పెనుగంచిప్రోలు (మం) కొనకంచి- ఎంపీటీసీ 67.62 శాతం Time: 2:00 PM ► ప్రకాశం జిల్లా: పిసి పల్లి మండలం మురుగమ్మి ఎంపీటీసీ స్థానంలో ఇప్పటివరకు 78% పోలింగ్ నమోదు నమోదైంది. ► విశాఖ జిల్లా : ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున సందర్శించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది. ► నెల్లూరు జిల్లా: సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానాన్నికి జరుగుతున్న పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ► తూర్పుగోదావరి జిల్లా: ♦ ఎటపాక మండలం 12 ఎంపీటీసీ స్థానాలకు 2 గంటలకు 69.4% శాతం పోలింగ్ నమోదైంది. ♦ వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 71% ఓటింగు నమోదు. ♦ కపిలేశ్వరపురం మండలం వాక తిప్ప నాగులచెరువు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 2 గంటలకు పోలింగ్ శాతం 55.90% ఓటింగు నమోదు. ♦ సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానాలు సంబంధించి 2గంటలకు పోలింగ్ శాతం 60.6% ఓటింగు నమోదు. ♦ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ముగిసిన పోలింగ్ .వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 72% పోలింగ్ నమోదు. Time: 1.25 PM ►గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ పరిశీలించారు. ► కృష్ణాజిల్లా: మధ్యాహ్నం 1 గంట వరకు జి.కొండూరు జడ్పీటీసీలో 43.7 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీలో 36 శాతం, పెడన జడ్పీటీసీ 48 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూలు: జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 50.18 శాతం పోలింగ్. ► పశ్చిమగోదావరిజిల్లా: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం12 గంటల వరకు పెనుగొండ జడ్పీటీసీలో 39.63 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.25 PM 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పరిశీలించారు. Time: 11.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లా: ఉదయం 11 గంటలకు జడ్పీటీసీ పోలింగ్ శాతాలు.. జి.కొండూరు జడ్పీటీసీ-28.18 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ- 16 శాతం, పెడన జడ్పీటీసీ-26.80 శాతం నమోదైంది. Time: 10.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. Time: 9.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణాజిల్లా: ఉదయం 9 గంటలకు జీ.కొండూరు జడ్పీటీసీ పోలింగ్లో 10 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ పోలింగ్లో 8.5 శాతం, పెడన జడ్పీటీసీ పోలింగ్లో 10.24 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూల్ జిల్లా: కృష్ణగిరి మాండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్లో 9 గంట వరకు 18.94 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రల వద్ద ఎన్నికల అధికారులు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. Time: 7.20 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. Time: 7.00 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మంగళవారం 954 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ► ఈ పోలింగ్లో 8,07640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ (రీ) పోల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. -
కాసేపట్లో కౌంటింగ్..
-
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
ఈ ‘పరిషత్’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు
సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది. -
ఓటు హక్కు లేదా..? ఇలా నమోదు చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నెల 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ ఓటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ ఓటర్ల జాబితా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఓటు హక్కు పొందలేకపోయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు ఈ నెల 6, 7, 27, 28 వ తేదీలలో డిసెంబర్లో రెండు రోజుల పాటు అధికారులు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రంగారెడ్డి మాడ్గుల మండలంలోని 33 గ్రామపంచాయతీలలో 35,245 మంది ప్రస్తుత ఓటర్లు ఉండగా, అందులో 18,738 మంది పురుష ఓటర్లు, 16,500 మహిళ ఓటర్లు, 7 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మండలంలో గ్రామాల్లో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ పరిధిలో బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు నేరుగా వెళ్లి నమోదు.. ఓటరు నమోదు, మార్పుల, చేర్పులు, అభ్యంతరాలపై పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు. పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసుకోవచ్చు. జాబితాలో అభ్యంతరాలుంటే తెలపవచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో నమోదై ఉన్నట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. తాను కోరుకున్న చోటుకు తమ పేరు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా.. డిసెంబర్ 15వ తేదీ లోపు ఓటరుగా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోదల్చినవారు ముందుగా ఠీఠీఠీ.ఛ్ఛి్టౌ్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి ఆప్లోడ్ చేయాలి. వీటిని సంబం«ధిత అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15 న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి పేరు నమోదు చేసుకునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ఆధార్కార్డు ఉండాలి. దరఖాస్తు ఫారాలను పూరించి ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి మండలంలోని 50 పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించాం. వారు ప్రతి పోలింగ్బూత్లో అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నమోదు, సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్పులు, చేర్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాçస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యత గుర్తించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకోసం తమతమ పేర్లు నమోదు చేసుకోవాలి. -
కిన్నౌర్లో ఓటేసిన కురువృద్ధుడు
సిమ్లా: స్వతంత్ర భారతావనిలో తొలి ఓటర్ 104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి హిమాచల్ప్రదేశ్లోని మండి పార్లమెంటరీ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్లో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లా కల్పా పోలింగ్ స్టేషన్లో ఓటేసేందుకు చక్రాల కుర్చీలో వచ్చిన నేగికి రెడ్కార్పెట్ పరిచి, కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్గన్ మేళతాళాలతో స్వాగతం పలికారు. దేశాభివృద్ధికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేగి కోరారు. మొట్టమొదటిసారిగా ఆయన 1951లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1917లో జన్మించిన ఆయన స్కూల్ టీచర్గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలో 1952 ఫిబ్రవరిలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నికల ప్రక్రియ కష్టమని భావిస్తూ అధికారులు ఐదు నెలలు ముందుగానే అక్టోబర్ 1951లోనే ఎన్నికలు జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న నేగి కల్పా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఉదయం 7 గంటలకు ఓటు వేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు..
సాక్షి, కరీంనగర్: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్లోని థర్మల్ కాగితం 1500ల కాగితపు స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 వోల్టు బ్యాటరీతో పని చేసే వీవీప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసింది. తెలిపేందుకు వీవీ ప్యాట్లోని డిస్ప్లేలో ఓటరు స్లిప్ కనిపిస్తుంది. అయితే ఇందులో 100వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్ రోజున జరిగే మాక్ పోలింగ్ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే ప్రతీ పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 1400 మందికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి అన్న మాట. చదవండి: ఈటల రాజేందర్ను చిత్తు చిత్తుగా ఓడించండి: హరీశ్ వీళ్లు అభ్యర్థులే కానీ ఓట్లేసుకోలేరు ఎన్నికల బరిలో నిలిచారు.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు..తమకే ఓటేయాలని ఊరూరా తిరుగుతున్నారు కానీ ఎన్నికల రోజున మాత్రం ఓటు వేయలేరు. వారి ఓటు వారే వేసుకోలేని పరిస్థితి అన్న మాట. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి జిల్లా అయినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటు లేదు. హైదరాబాద్లో ఉంది. ఇక రిజిస్టర్డు పార్టీల్లో అలీ మన్సూర్ మహ్మద్ (అన్న వైఎస్సార్ కాంగ్రెస్) నిజామాబాద్ జిల్లావాసి. కన్నం సురేశ్కుమార్(జె స్వరాజ్ పార్టీ)ది మేడ్చల్ జిల్లా. కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ(యు) శాయంపేట వాసి. లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ)ది సూర్యపేట జిల్లా. చదవండి: మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..? స్వతంత్ర అభ్యర్థుల్లో ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, కోట శ్యామ్కుమార్ది కరీంనగర్. ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ మండలం కాగా కుమ్మరి ప్రవీణ్ది కొత్తపల్లి మండలం కమాన్పూర్. గుగులోతు తిరుపతిది సైదాపూర్. గంజి యుగంధర్ది పర్వతగిరి. బుట్టెంగారి మాధవరెడ్డి, సీపీ సుబ్బారెడ్డి, చెలిక చంద్రశేఖర్, కంటే సాయన్నది మేడ్చల్. చిలుక ఆనంద్ జూలపల్లి. పిడిశెట్టి రాజుది కోహెడ. లింగంపల్లి శ్రీనివాస్రెడ్డిది శంకరపట్నం మండలం కాచారం. వేముల విక్రమ్రెడ్డిది ధర్మపురి మండలం జైనలో ఓటు హక్కు ఉంది. మొత్తంగా 30 మంది అభ్యర్థుల్లో 20 మంది వారి ఓటు వారికే వేసుకోలేరు. -
అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ
‘అయ్యయ్యో, వద్దమ్మా.. ఈ మధ్యనే ఓటు అర్హత వచ్చింది.. తొలిసారి ఓటు హక్కు వినియోగిస్తున్నా..డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ’ ఇదీ తొలిసారి టుహక్కు వచ్చిన యువత మనోగతం సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కు. పరిపాలకులను ఎంచుకునే అరుదైన అవకాశం అరుదుగా వస్తుంటుంది. అలాంటి వజ్రాయుధమైన ఓటును యువతకు బీరు, బిర్యానీ, క్రికెట్ కిట్లు, సెల్ఫోన్లు తదితర ప్రలోభాలను ఎరవేసి కొనేందుకు రాజకీయనాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ, తాము మాత్రం అలా కాదని నేటితరం యువత కుండబద్దలు కొడుతోంది. డబ్బు, ప్రలోభాలకు నేటియువత లొంగదని, సుపరిపాలన అందించేవారికి పట్టం కట్టడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇటీవల ఓటు హక్కు వచ్చిన కొందరు యువతను ‘సాక్షి’ కదిలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలిసారిగా తమకు ఓటు హక్కు వచ్చిందని, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. సమర్థులు, ప్రయోజకులకే తాము ఓటేస్తామని చెప్పారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగ్గా వాడితే, అద్భుతాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విధిగా ఓటు వేసే మధ్యవయస్కులు, సీనియర్ సిటిజన్లు కూడా నాయకుల తలరాతలు మార్చేది.. యువత ఓటింగే కీలకమని అభిప్రాయపడుతున్నారు. -
Tirupati Lok Sabha Bypoll 2021: ఈవీఎంలలో తీర్పు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పారదర్శకంగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 2వ తేదీ ఈ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ఆరింటిలో మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. మొత్తం ఓటర్లు 17,10,699 మంది ఉండగా 10,99,814 ఓట్లు (64.29 శాతం) పోలయ్యాయి. పురుషులు 5,43,450 మంది, మహిళలు 5,56,341 మంది, ఇతరులు 23 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్ల కంటే 12,891 మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ అన్ని సెగ్మెంట్లలోను మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీటిలో తిరుపతి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలోను మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పథకంలోను మహిళలకు పెద్దపీట వేయడం, మహిళలు అన్ని రంగాల్లోను ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఆర్థికసాయం చేయడంతో పాటు, ప్రతి పేద మహిళ పేరుతో ఇంటి స్థలం కేటాయించడం వంటి చర్యలతో మహిళల ఓట్లు తమకే పడ్డాయని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళిని చూసిన తరువాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నిస్తేజంగా ఉన్నారు. -
ఓటేస్తే చంపేస్తాం..!
సాక్షి, తిరుపతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకోనివ్వకుండా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత ఊరు ఊరందూరులో పెత్తందార్లు అడ్డుకున్నారు. ఎస్టీ, ఎస్టీలే లక్ష్యంగా బొజ్జల సుధీర్రెడ్డి అనుచరులు శనివారం పోలింగ్ కేంద్రం వద్ద రచ్చ చేశారు. ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో విలీనం చేసినందుకు పోలింగ్ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారు. గ్రామ కట్టుబాట్లను పాటించాలని హెచ్చరించి మధ్యాహ్నం వరకు ఎవరూ పోలింగ్లో పాల్గొనకుండా కాపు కాశారు. కాగా, ఈ విషయాన్ని కొందరు ఓటర్లు ‘సాక్షి’ దృష్టికి తేవడంతో ప్రతినిధి బృందం ఊరందూరు ఎస్సీ కాలనీకి చేరుకుని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసుల సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీలను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెలుగు చూడటం తెలిసిందే. మాకు నచ్చిన పార్టీకి ఓటు వేశాం: ఊరందూరు దళితులు సాక్షి, పోలీసుల సహకారంతో మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మాకు నచ్చిన పార్టీకి చెందిన నాయకుడికి ఓటు వేసినందుకు ఆనందంగా ఉంది. -
కొటియాలో ఒడిశా ఆంక్షలు
సాలూరు: పరిషత్ ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని సాకుగా చూపుతూ కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఎమ్.అక్తర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు బుధవారం ప్రత్యేక బలగాలతో కొటియా గ్రామాలకు చేరుకున్నారు. గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పట్టుచెన్నేరులో రహదారులపై రాళ్లు అడ్డంగా వేసి దారిని దిగ్బంధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానానికి నేరెళ్లవలస సంత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా అడ్డుకోవడంతో సీఐ అప్పలనాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్వో మధుసూదనరావు నేరెళ్లవలస చేరుకున్నారు. ఒడిశా బలగాలు వారికి 144 సెక్షన్ ప్రతిని చూపించాయి. దీనిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పోలింగ్ స్టేషన్లో వివాదం కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్లో ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు బుధవారం పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఆంధ్రా అధికారులకు చెప్పారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు దీనిపై పాలకొండ ఆర్డీవో, సీతంపేట ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో.. కౌశల్యాపురం పాఠశాల వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఒడిశా అధికారులతో పీవో మాట్లాడి గురువారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
రాష్ట్రంలో తొలిసారి ఓటు వేయనున్న గవర్నర్ దంపతులు
సాక్షి, అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు రాష్ట్రంలో తొలిసారి బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. రాజ్భవన్ సమీపంలో ఉన్న సీవీఆర్జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు బుధవారం ఉదయం 11 గంటలకు ఓటు వేస్తారని గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
90.61 లక్షల మంది ‘పుర’ ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు. ► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది. ► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది. ► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది. ► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది. ► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది. ► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది. ► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే. -
కొండలు, గుట్టలు దాటి.. 8 కిలోమీటర్లు నడిచి..
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత గ్రామంగా గుర్తించిన సాలూరు మండలం ఒడిశా సరిహద్దు సంపంగిపాడు పంచాయతీ ఎన్నికల పోలింగ్లో గిరిశిఖర గ్రామాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పంచాయతీలోని దిగువరూడ, కాగరూడ, గాడివలస, కొంకమామిడి, గాలిపాడు గిరిశిఖర గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ సుమారు 8 కిలోమీటర్లు నడిచి దళాయివలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంతో శ్రమపడి ఓటుహక్కు వినియోగించుకున్న గిరిశిఖర గ్రామాల వారు ఆదర్శంగా నిలిచారు. ఈ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు 485 ఓట్లకుగాను 297 (61 శాతం) పోలయ్యాయి. సంపంగిపాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. వైఎస్సార్సీపీ అభిమాని బుడియా చంద్రయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. గతంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, ఘర్షణలు నమోదైన గ్రామాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. 4 దశల్లో 13,133 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 6,254 తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, 8,555 సమస్యాత్మక ప్రాంతాలు, 983 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్నట్లు గుర్తించారు. పోలీస్ సిబ్బంది, హోంగార్డులు కలిపి 89,100 మంది ఉండగా రోజువారీ శాంతి భద్రతల విధులు, ట్రాఫిక్, ఇతర బాధ్యతలకు సిబ్బందిని కేటాయించిన అనంతరం మిగిలిన వారికి ఎన్నికల విధులు నిర్దేశించారు. పోలింగ్ స్టేషన్ల బందోబస్తులో భాగంగా 1,122 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ పార్టీలో ఒక అధికారి, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఒక్కో టీమ్లో ఒక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉండేలా మొత్తం 257 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. 143 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక పోలీస్ అధికారితోపాటు ఐదుగురు సిబ్బంది ఉండేలా 199 మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 61 స్ట్రాంగ్ రూమ్స్ భద్రతా టీమ్లు, ఎస్పీ రిజర్వ్ 9 పార్టీలు, అడిషనల్ ఎస్పీ 9 పార్టీలతోపాటు అవసరమైన మేరకు ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తారు. బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు ఎన్నికలను బహిష్కరించాలని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్లోని గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఒక పోలీస్ అధికారితోపాటు నలుగురు సిబ్బంది చొప్పున బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పేరుతో ఒక అధికారి, ఐదుగురు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక టీమ్లను నియమించారు. ప్రత్యేక గస్తీకి ఏరియా డామినేషన్ టీమ్స్ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. -
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంవల్ల తనలాగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించనున్నారు. 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని తెలుపనున్నారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆమె కోరనున్నారు. -
బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ
సాక్షి, హిమాయత్నగర్: అందరం కలిసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేద్దాం.. ఓటుతో నచ్చిన వాళ్లను వేగంగా ఎంచుకుందాం.. హైదరాబాద్ను బెస్ట్ సిటీగా మార్చుకుందాం. ట్రాఫిక్ రూల్స్ లాంటివి పక్కాగా ఫాలో అవ్వాలి. అంటే కొద్దిగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో చేస్తున్న అభివృద్ధి మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకోండి. ఓటుకు నచ్చిన వారిని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకుందాం. డెవలప్మెంట్ సో బెటర్ ఓటు అనేది మన హక్కు. ఈ నగరానికి చెందిన ఒక పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోవడం నాతో పాటు మనందరి బాధ్యత. ఈ బాధ్యత మన నగరం, రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం. హైదరాబాద్లో చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్(మౌలిక రంగం) కూడా బాగా డెవలప్ అయింది. మన రోడ్లు, మన ఫ్లై ఓవర్లు, మన హైవేలు ఓ పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయి. వ్యక్తిగతంగా, పౌరులుగా మనందరం కలిసి కట్టుగా ఉండి నీటి వనరులను కాపాడుకోవాలి. మన చెరువులు, మూసీనది.. ఇవన్నీ నగర భవిష్యత్కి ఎంతో ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవాలి. చెరువుల్ని ఆక్రమించడం, వాటిని చెత్తతో నింపేయడం లాంటి విషయాలను గట్టిగా వ్యతిరేకించాలన్నది నా అభిప్రాయం. – ఆనంద్ దేవరకొండ, సినీనటుడు -
15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. అదే రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రోజు అర్ధరాత్రిలోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన వారందరికీ సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అయితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7నే వెలువడిన దృష్ట్యా.. ఆ ఎన్నికలకు మాత్రం 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఓటర్లుగా నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందన్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికల్లోనూ 9వ తేదీ వరకు ఓటరుగా నమోదైన వారికి ఓటు హక్కు అవకాశం ఉంటుంది. అనుబంధ ఓటర్ల జాబితాల తయారీ ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎక్కడికక్కడ గ్రామాల వారీగా 2019 డిసెంబరు 22న గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. అయితే, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొత్త ఓటర్ల జాబితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 2019 డిసెంబరు 22 తర్వాత కొత్తగా నమోదైన వారి వివరాలతో పాటు ఈ నెల 7వ తేదీ నాటికి ఓటరుగా నమోదైన వారి పేర్లను కూడా కలిపి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుబంధ ఓటర్ల జాబితాలను తయారుచేస్తోంది. వీరందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు కూడా వేర్వేరుగా అనుబంధ జాబితాలను తయారుచేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పోలింగ్కు లక్షన్నరకు పైగా బ్యాలెట్ బాక్స్లు.. ఇదిలా ఉంటే.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో.. పెద్ద సంఖ్యలో బ్యాలెట్ బాక్స్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున బ్యాలెట్ బాక్స్ల కొరత తలెత్తకుండా ఉండేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులు వాటిని తెప్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం 1,05,732 బ్యాలెట్ బాక్సులు ఉండగా.. దాదాపు 60 వేల బాక్సులిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. అలాగే, దాదాపు 20 వేల బాక్సులిచ్చేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ముందుకొచ్చాయన్నారు. మరోవైపు.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రెండింటికీ లక్షకు పైగా.. సర్పంచి ఎన్నికలకు లక్షన్నర దాకా బ్యాలెట్ బాక్సుల అవసరం ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. దీంతో బ్యాలెట్ బాక్సుల పరంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదని అధికారులు భావిస్తున్నారు. -
ఏపీలో ఓటు హక్కు పొందిన గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు పొందారు. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో గవర్నర్, ఆయన సతీమణి ఓటు కోసం దరఖాస్తు చేయగా.. నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాయమణి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ గవర్నర్ దంపతులకు ఓటరు కార్డును అందచేయనున్నారు. -
ఓటు యాంత్రికం కాదు.. బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటు అనేది యాంత్రికంగా ఉపయోగించుకునే హక్కు కాదని, ప్రజాస్వామ్యం మనుగడకు అది అత్యంత బలమైన ఆయుధమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఓటరుగా చేరడానికి యువత ముందుకు రావాలని, అర్హులను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదయ్యాక ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన పదో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే హక్కులతో పాటు విధుల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు ద్వారా మన ప్రజాస్వామ్య దేశాన్ని దృఢంగా, అజేయంగా నిలిపేందుకు వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం 2020 ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, ఫిబ్రవరి 14న తుది జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవడం మన బాధ్యత, కర్తవ్యమని గవర్నర్ వెల్లడించారు. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న అదనపు డీజీపీ రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప గ్రామీణ ప్రాంతాల ఓటర్లలోనే ఎక్కువ చైతన్యం ఆధునిక సాంకేతికతను జోడించి ఎన్నికలు నిర్వహించడంలో మనదేశం ప్రపంచంలో ఎన్నో దేశాలకంటే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న భావన ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా ఏర్పడాలన్నారు. అక్షరాస్యత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలోనూ ఇలాంటి చైతన్యం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కె.రక్షణనిధి, జేసీ–2 మోహన్కుమార్, సబ్కలెక్టర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం గత సార్వత్రిక ఎన్నికలు, ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటు హక్కుపై చైతన్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 29 మంది అధికారులకు గవర్నర్ అవార్డులు, ప్రసంశా పత్రాలను అందజేశారు. అదనపు డీజీపీ ఎ.రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తదితరులు అవార్డులు అందుకున్నారు. -
సార్వత్రిక ఓటుహక్కు ప్రదాత అంబేడ్కర్
‘‘ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశాలను ఎవరికీ కూడా నిరాకరించకూడదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినంత మాత్రానే ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల చేత కూడా ఆ ప్రభుత్వం నిర్వహించబడాలి’’ అని బాబాసాహెబ్ అన్న మాటలకు సరిగ్గా నిండా నూరేళ్ళు. మాంటెగ్ చెమ్స్ఫర్డ్ కమిటీ నియమించిన సౌత్ బరో బృందం ముందు హాజరైన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1919లో భారత ప్రజలందరి పక్షాన ఈ ప్రకటన చేశారు. అంబేడ్కర్ రాజకీయ జీవితంలో ఇదే మొట్టమొదటి కార్యాచరణ. భారత ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్పైన ఏర్పాౖటెన మాంటెగ్ చెమ్స్ఫర్డ్ కమిటీ అధ్యయనం తర్వాత మరింత అవగాహన కోసం లార్డ్ సౌత్ బరో అధ్యక్షతన ఒక బృందాన్ని నియమించారు. ఆ బృందం అనేక మందిని సంప్రదించి ఒక నివేదికను రూపొందించింది. ఒక అంటరాని యువకుడుగా 1913లో అమెరికాకు వెళ్ళిన అంబేడ్కర్, 1917 మార్చిలో బొంబాయి తిరిగి వచ్చేనాటికి ఒక గొప్ప ప్రజాస్వామికవాదిగా, హక్కుల నాయకుడిగా తనను మలుచుకున్నట్టు మనకు కనిపిస్తాడు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తోన్న సమయంలో కూతవేటు దూరంలో ఉన్న హర్లెంలో నల్లజాతి పునరుజ్జీవనోద్యమం పురుడుపోసుకుంటున్నది.. నల్లజాతి బానిసత్వం కన్నా, అంటరానితనం అత్యంత అమానుషమైనదనే విషయాన్ని కూడా ఆయన గ్రహించారు. దీనితో పాటు, అంబేడ్కర్ గురువు జాన్ డ్యూయి మార్గదర్శకత్వం కూడా అంబేడ్కర్ను గొప్ప ప్రజాస్వామ్య వాదిగా రూపుదిద్దుకోవడానికి తోడ్పడింది. జాన్డ్యూయి 20వ శతాబ్దంలో ప్రజాస్వామిక తాత్వికవేత్త. తనవద్ద విద్యను అభ్యసించడం వల్ల అంబేడ్కర్కు ప్రజాస్వామ్యమంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడింది. వీటికి తోడుగా, అప్పటికే మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా అంబేడ్కర్ను ఒక గొప్ప నాయకుడిగా రూపుదిద్దుకోవడానికి కారణాలయ్యాయి. 19వ శతాబ్దంలో జ్యోతీరావు ఫూలే సాగించిన కుల వివక్ష వ్యతిరేక పోరాటం అంబేడ్కర్ను ప్రభావితం చేసింది. అందుకే అంబేడ్కర్ జ్యోతీరావుఫూలేను తన గురువుగా కూడా ప్రకటించుకున్నారు. జ్యోతీరావు ఫూలే ఆచరణ, సిద్ధాం తాలతో సామాజిక న్యాయం కోసం నడుంబిగించిన కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహుమహారాజ్ 1902లోనే బ్రాహ్మణేతర వర్గాలందరికీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రకటించి, అమలు చేశారు. అంటరాని కులాలకోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈ అంశాలు కూడా అంబేడ్కర్కు ఎంతో ధైర్యాన్నీ, శక్తినీ అందించాయి. ఆయన చిన్ననాటి నుంచి అనుభవించిన అనేకానేక అనుభవాల సారం, సామాజిక పరిస్థితుల కలబోత ప్రపంచదేశాల ఎదుట అంబేడ్కర్ను గొప్ప దార్శనికుడిగా నిలిచేలా చేసింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంద ఏళ్ళ కిందట అమెరికాలో విద్యను అభ్యసించి. తన వ్యక్తిగత జీవితంకోసం కాకుండా, తాను జన్మించిన సామాజిక వర్గం విముక్తి కోసం సమరం ప్రారంభించడం సౌత్బరో కమిటీతోనే ప్రారంభం అయ్యింది. అయితే అప్పటికే మహారాష్ట్రలో అంటరానికులాల వివక్షపై మహర్షి వి.ఆర్.షిండే నాయకత్వంలో 1906లో ‘డిప్రెస్డ్ క్లాస్ మిషన్’ను ప్రారంభించారు. 1918లో వి.ఆర్.షిండే ఆధ్వర్యంలో బరోడా సంస్థానాధీశుడు సాయాజిరావు గైక్వాడ్ అధ్యక్షతన అఖిల భారతీయ అసృ్పశ్య నివారక్ పరిషత్ సదస్సు జరిగింది. అయితే ఈ సంస్థలు ఏవీ కూడా సౌత్బరో కమిటీ ముందు తమ వాదనలను వినిపించలేదు. అంబేడ్కర్ వ్యక్తిగతంగానే సౌత్ బరో కమిటీ ముందు అంటరానికులాల రాజకీయ హక్కులను మొదటిసారిగా వినిపించారు. ‘కొంకణ్ ప్రాంతంలో అందరూ నడిచే దారుల్లో అంటరాని వాళ్ళు వెళ్ళకూడదు. ఎవరైనా ఆధిపత్య కులాల వ్యక్తి ఎదురుపడితే, తమ నీడ ఆయన మీద పడనంత దూరం జరగాలి అని, ఇది ఒక కేవలం ఒక దృష్టాంతం మాత్రమేనని అంబేడ్కర్ వివరించారు. 1909లో అమలులోకి వచ్చిన చట్టం వల్ల కొన్ని కులాలకు అధికారంలో భాగస్వామ్యం వచ్చిందనీ, ముస్లిలకు ప్రత్యేక ఓటింగ్ విధానమే అమలులోకి వచ్చింది, కానీ, తరతరాలుగా సమాజంలో నుంచి వెలివేతకు గురైన అంటరాని కులాలు ఏనాడూ ఈ సమాజంలో భాగం కాలేకపోయాయనీ అంబేడ్కర్ కమిటీ ముందు వివరిం చారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం కో–ఆప్ట్ చేస్తే సరిపోతుందని కొందరు చేసిన వాదనను అంబేడ్కర్ తిరస్కరించారు. ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలి తప్ప, ఇతర కులాల సభ్యులు నియమించడం ప్రజాస్వామ్యం కాబోదనీ, దాని వల్ల ఆయా కులాలకు అనుకూలంగా ఈ ప్రజాప్రతినిధులు మారే ప్రమాదం ఉంటుందనీ, లేదా వారికి అనుకూలంగా ఉండేవారు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే ప్రమాదాన్ని ఆనాడే అత్యంత స్పష్టంగా అంబేడ్కర్ వాదించారు. సౌత్బరో కమిటీ ముందు అంబేడ్కర్ మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉంచారు. 1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్ వాదించారు. 3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్ కోరారు. అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్ను చేసిన పాపాన పోలేదు. 1919లో ప్రారంభమైన ఆయన రాజకీయ హక్కుల పోరాటం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగంతో ఒక దశకు చేరింది. ఒకవైపు అంటరాని కులాల హక్కుల కోసం పోరాడుతూనే రెండో వైపు భారత ప్రజ లందరి తరఫున రాజ్యాంగ సభలో గళమెత్తి, అప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో అమలులో లేని సార్వజనీన ఓటింగ్ హక్కును రాజ్యాంగంలో చేర్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఉద్దండులు అందరికీ ఓటింగ్ హక్కును వ్యతిరేకించారు. చివరకు అందరికీ ఓటింగ్ హక్కును అందించిన మహనీయుడిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు. దళిత ప్రజాప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలన్న అంబేడ్కర్ తొలి పోరాట నినాదం ఇంకా అసంపూర్తిగానే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటిన అంబేడ్కర్ లోతైన దార్శనికత నేటి రాజకీయాల్లో ఎంత కీలకమైనదో రుజువవుతూనే ఉన్నది. సపరేట్ ఎలక్టోరేట్ విధానం లేకపోవడం వల్ల నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదు. రాజకీయ పక్షాలను, ఆధిపత్య కులాల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు మాత్రమే ఎన్నికవుతున్నారు. ఇప్పటికింకా ఈ రోజు దళిత సమాజం ముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఏదైనా ఉందీ అంటే అది సపరేట్ ఎలక్టోరేట్ విధానం కోసం పోరాడటమే. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
మహిళలే... మహరాణులు
సాక్షి, తూర్పు గోదావరి : ప్రతీ ఓటు కీలకంగా భావించే పంచాయతీ పోరులో మహిళలు ప్రధాన భూమిక పోషించనున్నారు. అధికంగా ఓటుహక్కు కలిగి ఉండటం ద్వారా అభ్యర్థి జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లలో అధికంగా మహిళలు 14,102 మంది ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరిదే పైచేయి. 50 శాతం పంచాయతీల్లో అతివలే అందలమెక్కనున్నారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న ఊహాగానాలు నేపథ్యంలో రిజర్వేషన్లపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లాలో 1,072 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కుల,గణన పూర్తి చేసి ఓటరు జాబితాలను సిద్ధం చేసింది. జిల్లాలోని పంచాయతీల్లో మొత్తం 32,52,069 మంది ఓటర్లుండగా పురుషులు 16,18,930 మంది, మహిళలు 16,33,032 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే 14,102 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరి ఓట్లు అధికంగా ఉన్నాయి. పంచాయతీ పోరులో ప్రతి ఓటూ ముఖ్యమైనదే...దీంతో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేయనున్నారు. 50 శాతం పంచాయతీల్లో మహిళలు అందలమెక్కనున్నారు. 12,514కు పెరిగిన పోలింగ్ కేంద్రాలు సాధారణంగా వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేవారు. ఈ మేరకు గత పంచాయతీ ఎన్నికల్లో 1,007 పంచాయతీల్లో ఎన్నికల కోసం 11,434 పొలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1072 పంచాయతీల్లో ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేశారు. తాజా నిబంధనల మేరకు వార్డులో 650 ఓట్లు దాటితే మరొక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అలాగే వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మూడో వంతు ఉన్నా, పంచాయతీకి దూరంగా రెండు నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న వాటికి అదనంగా మరొక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 11994 వార్డులకుగాను అధికారులు 12,514 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లపై జోరుగా చర్చలు సుప్రీంకోర్టు సూచనమేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీ, వార్డుల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులు కసరత్తు చేయనున్నారు. ఓసీ జనరల్, ఓసీ లేడీ, బీసీ జనరల్, బీసీ లేడీ, ఎస్సీ జనరల్, ఎస్సీ లేడీ, ఎస్టీ జనరల్, ఎస్టీ లేడీ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గతంలో పంచాయతీ, వాటిలోని ఆయా వార్డులు ఏ సామాజిక వర్గాలకు రిజర్వయ్యాయి, ఇప్పుడు ఏ సామాజిక వర్గాలకు రిజర్వవుతాయనే విషయమై గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావాహులు గ్రామాల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ వారితో లోపాయికారీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. -
ఓటెత్తిన బాలలు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : ఓటుహక్కు వినియోగించేందుకు బారులు తీరారు. ఓటర్ల జాబితా చూసి ఎన్నికల అధికారి ఓట్లు అందించారు. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయడంతో ప్రక్రియ ముగిసింది.. ఇటీవలే ఎన్నికలు ముగిశాక.. మళ్లీ ఈ ఎన్నికలేమిటా?.. అనుకుంటున్నారు కదూ.. ఇవి సార్వత్రిక ఎన్నికలు కావు.. వాటిని తలపించేలా నిర్వహించిన విద్యార్థి నాయకుని ఎన్నికలు. తెర్లాం మండలం నందబలగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు శుక్రవారం హెచ్ఎం విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగానే నందబలగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు ఎన్నికలు జరిగాయి. ప్రతి తరగతి నుంచి ఒకరిని, పాఠశాలకు సంబంధించి ఒక నాయకుడిని ఎన్నుకొనేందుకు సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేయించడం, నామినేషన్ల ఉప సంహరణ, ఓటర్ల జాబితా (హాజరు రిజిస్టర్)ల ప్రచురణ, అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం, బ్యాలెట్ పేపరు తయారు, బెండకాయ మార్క్తో అభ్యర్థుల గుర్తుపై బ్యాలెట్పై ఓటుముద్ర వేయడం వంటి ప్రక్రియలన్నీ విద్యార్థులతో చేయించారు. ఇదంతా పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల మాదిరిగా నిర్వహించడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ తరగతి, పాఠశాల నాయకులను ఎన్నుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్లను లెక్కించి విజేతల వివరాలు ప్రకటించి, విద్యార్థి నాయకులతో ప్రమాణం చేయిస్తామని పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు వేయడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఇదే పద్ధతిలో ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులంతా తమ సహకారం అందిస్తున్నారని హెచ్ఎం తెలిపారు. -
స్వేచ్ఛగా ఓటెత్తారు!
తిరుపతి రూరల్: దళితులు, గిరిజనులు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సైతం స్వేచ్ఛగా వినియోగించుకోలేని దుస్థితి రామచంద్రాపురం మండలంలో కొన్ని గ్రామాల్లో ఉంది. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దళిత, గిరిజనులను బలవంతంగా బయటకు పంపించి, టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేసుకున్నారు. వీడియో పుటేజీల ద్వారా గుర్తించిన ఎన్నికల కమిషన్, రీ–పోలింగ్కు ఆదేశించింది. ఆదివారం జరిగిన రీపోలింగ్లోనూ దొంగ ఓట్లు ద్వారా కుయుక్తులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. కానీ ఆధికారులు ముందు అవి ఫలించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నియోజకవర్గం పరిధిలోని దళితులు, గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమ్మపల్లి, ఎన్ఆర్ కమ్మపల్లిలో దొంగ ఓట్లు.. ఇద్దరి అరెస్ట్ రిగ్గింగ్, రీసైక్లింగ్ ద్వారా దొంగచాటుగా ఓట్లు వేసుకునే తమ సంస్కృతి అధికారుల ముందు సాగకపోవడంతో టీడీపీ శ్రేణులు దొంగఓట్లకు తెగబడ్డారు. కమ్మపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన మునిచంద్రనాయుడు, ఎన్ఆర్ కమ్మపల్లిలో యుగంధర్నాయుడును ఎన్నికల అధికారులు గుర్తించారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారని వారిని పోలీసులకు పట్టించారు. రాత పూర్వకంగా ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయటంతో మునిచంద్రనాయుడు, యుగంధర్నాయుడుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఐజీ, తిరుపతి, చిత్తూరు ఎస్పీలు రీ–పోలింగ్ సందర్భంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలూ చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. డీఐజీ క్రాంతిరాణాఠాటా, చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలు స్వయంగా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎన్ఆర్కమ్మపల్లి, కమ్మపల్లిలో రచ్చచేసేందుకు ప్రయత్నించిన యువకులను అక్కడి నుంచి తరిమేశారు. భద్రత మధ్య ఓటింగ్కు దళితులు, గిరిజనులు దళితులు, గిరిజనులను టీడీపీ శ్రేణులు ఓటింగ్కు రాకుండా బెదిరిస్తున్నారనే ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. దళితవాడల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు వారిని తీసుకువచ్చి, ఓటింగ్ చేయించి, తిరిగి వారు ఇళ్లకు చేరేంతవరకు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. 25 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని వారు ఆనం దం వ్యక్తం చేశారు. -
దళితులకు ఓటు హక్కు కల్పించాలన్నదే నాలక్ష్యం
తిరుపతి తుడా: కొన్నేళ్లుగా ఓటుకు దూరంగా ఉన్న దళితులకు ఆ హక్కును కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేసినట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో దళితులను ఓటు వేయనీయకుండా టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడడంతో, దానిపై పోరాటం చేసిన చెవిరెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం.. రీపోలింగ్కు ఆదేశించడం తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రగిరి నియోజ కవర్గంలోని వెంకట్రామాపురం, ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. వెంకట్రామాపురం పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ను పరిశీలించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దళితులు ఏళ్ల తరబడి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఎలాగైనా ఈఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో పోరాటం చేసినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్చి 11న జరిగిన ఎన్నికల్లో మరోసారి దళితులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఆ వివరాలు పరిశీలించిన ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించడం దళిత గిరిజనుల విజయమన్నారు. తనకు ఓటు వేయాలని పోరాటం చేయలేదని, ఓటు హక్కు విలువ వారికి తెలియాలనే ఇంతవరకు తీసుకువచ్చానని అన్నారు. కుప్పం బాదూరు, కాలేపల్లిలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, అక్కడ కూడా రీపోలింగ్ కోసం తెలుగుదేశం నాయకులు రీపోలింగ్కు కోరితే అందుకు తాను ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి, తిరుపతి/తిరుపతి మంగళం/సాక్షి, అమరావతి: అక్కడ దళితులు తమ ఓటు హక్కును పాతికేళ్ల తర్వాత వినియోగించుకున్నారు. ఈవీఎంలు అంటే ఏమిటో తెలియని వారు ఆదివారం జరిగిన రీ పోలింగ్లో తమకు ఇష్టమొచ్చిన వారికి ఓటు వేసి ఎంతో పరవశించిపోయారు. అనంతరం పోలీసులు వారిని బందోబస్తు మధ్య ఇళ్లకు చేర్చారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి దొరికిపోయారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మొత్తంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ బూత్లలో ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తి వారి పల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్కి పాల్పడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెళ్లటంతో సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కాలేపల్లి, కుప్పం బాదూరులో కూడా రీపోలింగ్ నిర్వహించింది. చెవిరెడ్డి పోరాటం ఫలితంగా.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోరాటం కారణంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే దళితులు, గిరిజనులు ఓటు వేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఊరుకు దూరంగా ఉన్న వీరందరినీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు పోలీసులు రక్షణ కల్పించారు. తిరిగి వారు ఇళ్లకు చేరుకునేందుకు కూడా రక్షణగా నిలిచారు. అనంతరం వారంతా ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. ‘మాకు తెలిసి ఓటు వేసింది లేదు. ఎప్పుడు వెళ్లినా.. వేలుపై చుక్కపెట్టి పంపేస్తారు. వారే ఓట్లు గుద్దుకునే వారు. ఓటు ఎలా వెయ్యాలో తెలీదు. ఇన్నేళ్ల తరువాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉంది’ అని ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళా ఓటర్లు చెప్పారు. కాగా, వీరికి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచెయ్యాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అనేకమంది అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చారు. ఆ తరువాత గత నెల 11న ఎన్నికల సమయంలో దళిత, గిరిజనులను పోలింగ్ కేంద్రానికి రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం, రిగ్గింగ్ చేసుకోవటంతో చెవిరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఎన్నికల సంఘం స్పందించి రీపోలింగ్కు ఆదేశాలు జారీచేసింది. బెదిరింపులు.. ప్రలోభాలు కాగా, చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో రీపోలింగ్ జరుగుతున్న కమ్మపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మునిచంద్రనాయుడు ఆదివారం ఓ వృద్ధురాలి ఓటు వేసేందుకు యత్నించారు. కలెక్టర్ ఆదేశాలతో గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇదే పోలింగ్ కేంద్రం వద్ద మరో టీడీపీ నేత జయచంద్రనాయుడు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉంటే.. రిగ్గింగ్కు అవకాశం ఉండదని గ్రహించిన టీడీపీ శ్రేణులు కమ్మపల్లి, వెంకట్రామాపురం దళితుల చేత ప్రమాణాలు చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మెజారిటీ తగ్గితే ఎవ్వరూ తిరగలేరని హెచ్చరించారు. ఏడుచోట్లా భారీ భద్రత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఏడు రీపోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించారు. అదే విధంగా డీఐజీ క్రాంతిరాణా టాట పర్యవేక్షణలో ప్రతి కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. అలాగే, ప్రతీచోటా 250 మంది రిజర్వుడు, ఏపీఎస్పీ, పోలీసులతో భద్రతా ఏర్పాట్లుచేశారు. అభ్యర్థుల కదలికలపై కూడా నిఘా ఉంచారు. మరోవైపు.. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, చంద్రగిరి ఆర్వో మహేష్కుమార్ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షించారు. మొత్తంగా రీ పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. 89.29 శాతం పోలింగ్ ఇదిలా ఉంటే.. గత నెలలో జరిగిన పోలింగ్ శాతంతో పోల్చితే ఆదివారం జరిగిన రీపోలింగ్లో పోలింగ్ శాతం తగ్గింది. ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 5,451 మంది ఓటర్లు ఉంటే.. గత నెలలో 4,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన రీ పోలింగ్ సందర్భంగా 4,867 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన 1.13 శాతం ఓటింగ్ తగ్గింది. ఎండ తీవ్రంగా ఉన్నా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. దళితులు ఎంతో సంతోషించారు : పెద్దిరెడ్డి రీపోలింగ్ జరుగుతున్న వెంకట్రామాపురం పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీ పోలింగ్ సందర్భంగా ఎన్.ఆర్ కమ్మపల్లిలో దళితులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవటం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ప్రతి ఎన్నికల్లో వారి ఓట్లను రిగ్గింగ్ చేసేవారన్నారు. భారీ బందోబస్తు మధ్య తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తంచేశారని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో 120–130 స్థానాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను కొట్టిపారేశారు. బెట్టింగ్స్ కోసమే ఆయన సర్వేలని చెప్పారు. దళితులు స్వేచ్ఛగా ఓటు వేశారు : చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు పంచాయితీలో రీపోలింగ్ ద్వారా దళితులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. రీపోలింగ్ నిర్వహించిన సరళిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్ళకు వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కుతో వారి కళ్ళల్లో ఆనందం చూశానన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓటువేశారన్నారు. రీపోలింగ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడంలేదని చెవిరెడ్డి చెప్పారు. ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునేవాళ్లు.. ఎన్నికలు వచ్చాయంటే లైన్లో రావటం.. వేలిపై సిరా వేసుకోవటం వరకే మాకు తెలుసు. వేలిపై సిరా గుర్తు వేసుకోగానే మీ ఓటు వేసేశాం వెళ్లిపోండి అనేవారు. ఓటింగ్ అంటే అంతే అనుకునే వాళ్లం. ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునే వారు. గుర్తులపై ముద్ర వేయటం, నొక్కితే గుర్తుల వద్ద లైటు వెలగటం అనేవి మాకు తెలీదు. రీపోలింగ్ పుణ్యామా అని మా ఓటు మేం వేసుకున్నాం. – దేశమ్మ, ఎన్.ఆర్ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం బతికుండగా నా ఓటు నేను వేస్తాననుకోలేదు ఎన్నికల్లో మా ఓటు మేం వేసుకున్నదే లేదు. ఎవరో మా ఓటు వేసుకునే వారు. అడిగే ధైర్యం కూడా లేదు. నా ఓటు నేను వేసుకోకుండానే చచ్చిపోతాననుకున్నా. కానీ, మా బాధను అర్థం చేసుకున్న మహానుభావుడు రీపోలింగ్ పెట్టించాడు. అధికారులు, పోలీసులు ధైర్యం చెప్పారు. దీంతో స్వేచ్ఛగా నచ్చిన పార్టీకి ఓటు వేసుకున్నాం. – మంగమ్మ, ఎన్.ఆర్ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం రీపోలింగ్ ప్రశాంతం : ద్వివేది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం జరిగిన రీ–పోలింగ్ స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో ఓట్లు వేయని దళితులు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఆదివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా రీ–పోలింగ్లో ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంటుందని, కానీ.. ఇక్కడ అలా జరగలేదన్నారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 90.42 శాతం ఓటింగ్ నమోదైతే.. ఆదివారం 1.13 శాతం తగ్గి 89.29 శాతం నమోదయ్యిందన్నారు. -
హాట్సాఫ్ వాట్సాప్
సార్వత్రిక ఎన్నికల్లో నేడు చివరి విడతగా 59 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బిహార్ (8 స్థానాలు), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్ (13), పశ్చిమ బెంగాల్ (9), ఛండీగఢ్ (1), ఉత్తర ప్రదేశ్ (13), హిమాచల్ ప్రదేశ్ (4) రాష్ట్రాలలోని ఆయా నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హవినియోగింక్కును చుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో గత ఎన్నికలతో పోలిస్తే అనేక స్థానాలలో ఓటు వేసిన మహిళల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించగా.. ఇవాళ్టి ఎన్నికలు కూడా పూర్తయ్యాక జరిగే విశ్లేషణలో పురుష ఓటర్లను మించి మహిళా ఓటర్లు లెక్క తేలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందుకు కారణం.. మహిళల్లో నిరక్షరాస్యత శాతం తగ్గడం, స్త్రీ సాధికారత ప్రయత్నాలు పెరగడం, ఎన్నికల కమిషన్ ప్రచారం మొదలైనవి ప్రధానమైనవి కాగా.. టెక్నాలజీ పరంగా చూస్తే, వాట్సాప్ అందుబాటులోకి రావడం.. మహిళల్లో ఓటు వేయాలన్న చైతన్య కలగడానికి కీలకమైన అంశంగా దోహదపడిందని ‘షి ది పీపుల్.టీవీ’ వ్యవస్థాపకురాలు, ‘ది బిగ్ కనెక్ట్–సోషల్ మీడియా అండ్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తక రచయిత్రి అయిన శైలీ చోప్రా అంటున్నారు. ‘‘గతంలో ఓటు వెయ్యడం అనేది మహిళ జీవితంలో ఒక రోజుతో పూర్తయ్యే ప్రస్తావన. వాట్సాప్ వచ్చాక ఓటు విలువ, ఓటు వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగి (వాట్సాప్ గ్రూపుల్లో), మహిళలకది తమ జీవితంలోని ఒక ముఖ్యమైన బాధ్యత అన్న స్పృహను కలిగించింది. పర్యవసానమే.. మహిళల ఓట్లు.. పురుష ఓట్లను మించిపోడం’’అని చెబుతున్న శైలీ, గ్రామీణ ప్రాంతాలలో సైతం వాట్సాప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా, మహిళల అభీష్టానుసారం మాత్రమే గెలుపోటములు ఉంటాయని శైలీ చోప్రా చెబుతున్న దానిని బట్టి అర్థమౌతోంది. -
చెవిరెడ్డితోనే చంద్రగిరి అభివృద్ధి
సాక్షి, పాకాల: ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వదిన సునీతమ్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం మండలం లోని శంఖంపల్లి, శంఖంపల్లి హరిజనవాడ, పులివర్తివారిపల్లి, పులివర్తివారిపల్లి ఎస్సీ కాలనీ, తాటిమాకులపల్లి, ఆదినపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రజాస్వామికంగా ఎవరి ఓటు ను వారే వినియోగించుకునేందుకు వచ్చిన మంచి అవకాశమన్నారు. ఎవరికీ భయపడకుం డా ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిత్యం దళితుల అభ్యున్నతికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముందుం టారని, కార్యకర్తలకు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ముందుండి సమస్యను పరిష్కరించే వ్యక్తి ్డత్వం ఉండే నాయకుడని గుర్తు చేశారు. ఈ నెల 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తున్నారని, తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి మరొక్కసారి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్లకు అండగా ఉంటాం రామచంద్రాపురం: మండలంలోని ఎన్ఆర్ కమ్మపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామాపురం గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప శుక్రవారం ప్రచారం చేశారు. అగ్రవర్ణాల వారు తమపై దాడికి పాల్పడుతున్నారని దళితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ భయపడకండి అండగా ఉంటా మని, ఓటును నిర్భయంగా వినియోగించుకోండని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 60 సం వత్సరాలు గడుస్తున్నా ఓటు వేయకపోవడం బాధాకరమన్నారు. ఆదివారం జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు దామోదర్రెడ్డి, యోగానందరెడ్డి, గోపీచౌదరి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెవిరెడ్డితోనే చంద్రగిరి అభివృద్ధి రామచంద్రాపురం: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్ సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రీపోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని గెలిపించాలని కోరారు. -
రెండో విడత పరిషత్ పోరు ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: పరిషత్ పోరులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విడతలోనూ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 85.33 శాతం పోలింగ్ నమోదు కాగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 69.89 శాతం పోలింగ్ జరిగింది. ఏడు జిల్లాల్లో పోలింగ్ 80 శాతం దాటగా, ఒక్క ములుగు జిల్లా మినహా అన్నిచోట్లా 70 నుంచి 80 శాతం మధ్యలో ఓటింగ్ నమోదైంది. మొత్తమ్మీద రెండో విడత పరిషత్ ఎన్నికల్లో 77.63 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో భాగంగా 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,083 మంది, 179 జెడ్పీటీసీ స్థానాల్లో 805 మంది (ఏకగ్రీవమైన ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు మినహాయించి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడత పరిషత్ ఎన్నికల కోసం 10,371 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 862 బూత్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెబ్కాస్టింగ్ నిర్వహించింది. ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి, జిల్లాల్లోని కార్యాలయాల నుంచి వెబ్ కాస్టింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. నక్సల్ ప్రభావిత ప్రాబల్యం ఉన్న 218 ఎంపీటీసీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించారు. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో కొంత మంది తమ ఓట్లు గల్లంతయాంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
పాత ప్రాదేశిక సభ్యులకే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో గెలిచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. మూడు విడతల్లో సాగుతున్న పరిషత్ ఎన్నికలు ఈనెల 14న ముగుస్తుండగా, ఈ నెల 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, 27న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాత సభ్యులకు ఓటింగ్ అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ హక్కును కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను కూడా కలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతూ కొత్తగా ఎన్నికవుతున్న పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై మొదటివారంలోనే మొదలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కొత్త సభ్యులు ఓటు వేసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. అదీగాకుండా ఈ స్థానాలకు జరుగుతున్న వి ఉప ఎన్నికలు కాబట్టి, పాత సభ్యులే ఓటేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. అంతకు ముందే కొండా మురళీధర్రావు కూడా తన ఎమ్మెల్సీ సీటును వదులుకున్నారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామాలిచ్చిన 6 నెలల్లోగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండడంతో ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థ ల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకే ఓటు హక్కు లభించనుం దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 5తో ముగియనుందని పేర్కొన్నారు. దీనికి నెల రోజులకు ముందుగా (మే 31న) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో ఓటు హక్కు వారికే లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసింది. ఈ సందర్భంగా సీఈఓ విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గం ఖాళీ అయితే, ఖాళీ అయిన తేదీ నుంచి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ అయి వరుసగా జూన్ 10, 16, 21 నాటికి ఆరు నెలల కాలం పూర్తవుతుందన్నారు. ఈ మూడు స్థానాలకు సంబంధించి న్యాయ స్థానాల్లో ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. దీంతో జూలై 5 వరకు పదవీ కాలం ఉన్న ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఓటు హక్కు పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా లు మే 27న రానుండగా, గెలిచిన కొత్త సభ్యుల పదవీ కాలం జూలై 5 తర్వాత ప్రారంభం కానుండటంతో అంతకు ముందే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించే ఆస్కారం లేదన్నారు. మిగతా స్థానాలకు త్వరలో ఎన్నికలు.. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని సీఈఓ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రతినిధులపై కోర్టు కేసులున్నా.. వారు ఓటేసేందుకు అర్హులేనన్నారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
1,86,17,091 మంది ఓటేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లకు గాను 1,86,17,091 (62.69 శాతం) మంది ఓటేశారు. 1,49,19,751 మంది పురుష ఓటర్లలో 93,73,320 (62.82శాతం) మంది, 1,47,76,024 మంది మహిళా ఓటర్లలో 92,42,193 (62.55శాతం) మంది, 1,504 మంది ఇతర (ట్రాన్స్జెండర్) ఓటర్లలో 232(15.43శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికంగా నమోదు కావడంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన 14 లోక్సభ స్థానాల్లో పురుష ఓటర్లే స్వల్ప ఆధిక్యతను సాధించారు. రాష్ట్రస్థాయిలో సగటున స్త్రీ, పురుషుల ఓటింగ్ నిష్పత్తి సమానంగా నమోదు కావడం గమనార్హం. ఇందూరులో పోటెత్తిన మహిళా ఓటర్లు నిజామాబాద్ స్థానంలో మొత్తం 10,61,124 ఓట్లు పోలవ్వగా, అందులో 4,73,673 మంది పురుషులు, 5,87,447 మహిళలు, నలుగురు ఇతరులున్నారు. పురుషుల ఓటింగ్ 64.22 శాతం, మహిళల ఓటింగ్ 72.06 శాతం నమోదైంది. పురుషుల కంటే 1,13,774 మహిళా ఓట్లు అధికంగా పడ్డాయి. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి ధర్మవురి అరవింద్ పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన రైతన్నలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్సభ స్థానంలో 5,58,352 (68.49%) మంది పురుషులు, 5,88,108 (70.38%) మంది మహిళలు ఓటేయడంతో ఇక్కడి ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మే 23న లోక్సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
రాష్ట్రంలో పోలింగ్ 62.69%
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్ నమోదైంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది. వేసవి ఎండల తీవ్రత వల్ల పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు బయటకు రాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్ జరిగింది. -
ముఖం చాటేసిన వలస ఓటర్లు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలను వలస ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. గడిచిన అసెంబ్లీ, సర్పంచ్ల ఎన్నికల వేళ ఓటు వేసేందుకు గ్రామాలకు పోటెత్తిన ఓటర్లు ఈ మారు ముఖం చాటేశారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీపెద్దగా పోలింగ్లో పాల్గొనేందుకు వారు కదల లేదు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో నియోజకవర్గ నేతలు పట్టింపు లేని ధోరణితో పాటు ఎండలు ఠారెత్తించడంతో వలస ఓటర్లు కీలకంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తీవ్రంగా పడిపోయింది. ఆర్థికంగా భారమవుతుందనే... తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి సందడేదీ కనిపించలేదు. ఎక్కడా రోడ్లు కిక్కిరిసిపోలేదు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ లేదు. పార్లమెంట్ అభ్యర్థులెవరూ వలస ఓట్లు లక్ష్యంగా పనిచేయ లేదు. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం ఆర్ధికంగా భారమవుతుందన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు కొంత చొరవ చూపినా, నియోజకవర్గ నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గ్రామాలకు తేవడంలో విఫలమయ్యారు. దీనికి తోడు ఎండల ప్రభావం కొంత పడింది. దీంతో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే మహబూబ్నగర్, జహీరాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్కర్నూల్, ఖమ్మం, మహబూబాబాద్ల పార్లమెంట్ల పరిధిలో పోలింగ్ శాతం పూర్తిగా పడిపోయింది. నాగర్కర్నూల్లో 57.12 శాతం, మహబూబ్నగర్లో 64.99 శాతం, ఆదిలాబాద్ 66.76 శాతం, పెద్దపల్లి 59.24 శాతం, జహీరాబాద్లో 67.80 శాతం, ఖమ్మంలో 67.96 శాతం, మహబూబాబాద్లో 59.90 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పాటే గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో అధికంగా ఉన్న వలస కార్మికులను రప్పించడంలో ప్రధాన పార్టీలన్నీ పోటీ పడ్డాయి. ఉత్తర తెలంగాణలోని సుమారు 25 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గల్ఫ్ ఓటర్ల ప్రభావం బాగా ఉండటంతో ఆ దేశాలకు వెళ్లి మరీ వారిని రప్పించారు. కానీ ఈ ఏడాది ఏపార్టీ కూడా వారిని పట్టించుకోలేదు. దీంతో నిజామాబాద్ జిల్లాలో 54.20 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిన చాలాచోట్ల అభ్యర్థుల జాతకాలు మారిపోగా, ఇప్పుడు తగ్గిన పోలింగ్ ఎవరి జాతకాలను మారుస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు రద్దీ..ఇప్పుడంతా ఖాళీ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ వలస ఓట్లే లక్ష్యంగా పనిచేశాయి. నియోజకవర్గ నేతలు వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని గ్రామాలకు రప్పించడంలో తీవ్రంగా శ్రమించాయి. వారిని రప్పించేందుకు వాహన, భోజన వసతిని కల్పించాయి. దీనికి తోడు హైదరాబాద్లో నివసిస్తున్న వలస ఓటర్లు స్వచ్ఛందంగా తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దీంతో టోల్ప్లాజాలన్నీ వాహనాల రద్దీతో కిక్కిరిశాయి. ఒక దశలో ఈసీ జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం కదిలొచ్చి టోల్ వసూళ్లను రద్దు చేసింది. ఇక ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడిపింది. రైళ్లు సైతం గ్రామాలకు తరలే ఓటర్లతో నిండాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదైంది. వలస ఓటర్లు అధికంగా ఉండే ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 85.99 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 79.42 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో 82.04 శాతం, సంగారెడ్డి జిల్లాలో 81.94 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 83.37శాతం పోలింగ్ జరిగింది. తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగానూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. -
ఇవేమి ఏర్పాట్లు?
నవీపేట (బోధన్): పోలింగ్ కేంద్రాలలో కనిపించిన లోపాలను ఎన్నికల కమిషన్ సవరించాలని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి కవిత పేర్కొన్నారు. నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలసి ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక లోపాలతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పారు. ఈవీఎం ప్యాట్లపై నంబర్లు లేకపోవడం, పోలింగ్ సిబ్బందికి ఈ విషయమై ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, పోలింగ్ కేంద్రాలలో రాకపోకలకు ఒకే ద్వారం ఉండటం తదితర సమస్యలు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిజామాబాద్ ఎన్నికలలో 12 ఈవీఎంలను వాడటంతో ఈ ఎన్నిక ప్రత్యేకమైనదన్నారు. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగించాలని ఈసీకి విన్నవించినా ఆరింటి వరకే అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలలో పోలింగ్ శాతం తగ్గిందని, పట్టణ ఓటర్లు బయటకు వచ్చి, ఓటేయాలని కోరారు. 45 నిమిషాలు క్యూలోనే.. కవిత అత్తగారి ఊరైన పోతంగల్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటేయడానికి వచ్చి 45 నిమిషాలు క్యూలోనే నిల్చున్నారు. మొదటి ఓటు వేయాలని ఉదయం 7.30 గంటలకు కుటుంబసభ్యులతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అవి పనిచేయకపోవడంతో పోలింగ్ కేంద్రం బయటే నిరీక్షించారు. 8.45 గంటలకు లోపాన్ని సవరించాక మొదటి ఓటును కవిత వేశారు. తరువాత భర్త అనిల్కుమార్, మామయ్య రాంకిషన్రావ్, అత్తయ్య, మరిది ఓటేశారు. -
ఓటు విశ్వాసాన్ని కాపాడతాం
సాక్షి,కృష్ణా : సార్వత్రిక సంగ్రామం రసవత్తరంగా మారింది. తొలి విడత పోలింగ్ గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించాయి. మరో వైపు ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రంగం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తొలి సారిగా అధిక సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో హామీలు గుప్పించి మోసం చేసిన నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. విలువలున్న నేతలనే ఎన్నుకుని ఓటుపై ఉన్న విశ్వాసం కాపాడతాం అని చెబుతున్నారు. ప్రతిఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించండి ఓటు వజ్రాయుధం. సమాజాన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నూరుశాతం ఓటింగ్ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మోసగించే నేతలను దూరంగా ఉంచాలి. నిజాయితీతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. –జంపాన శ్రీనివాసగౌడ్, సామాజిక కార్యకర్త దేశ పౌరులుగా మన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది దేశపౌరుల చేతిలో వజ్రాయుధం లాంటిది. నిజాయితీపరుడు, ప్రజలకు నిస్వార్థసేవలు చేస్తాడని విశ్వసనీయత కలిగిన వ్యక్తులను తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపడం ద్వారా విలువలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఓటుహక్కు వినియోగించుకోలేనివారు దేశపౌరులుగా ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు? తప్పనిసరిగా ఓటువేయాలి. –బచ్చు శేషగిరిరావు, నాగాయలంక ఓటును అమ్ముకోకండి... ఓటును అమ్ముకోవద్దని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశా. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అమ్ముకోవటం సరైంది కాదు. ప్రజలు చైతన్య వంతులు కావాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఐదేళ్లపాటు ఉండే ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వాలి. హామీలతో మోసం చేసేవారిని నమ్మవద్దు. – వైవీ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త, గుడివాడ మన భవిష్యత్ మన చేతుల్లో.. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి. రాజ్యాంగం మన పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించింది. దేశ ప్రగతిని మార్చే ఓటు అనే ఆయుధం మన చేతుల్లోనే ఉందని మరువకండి. ప్రజల అవసరాలను తీర్చే వారిని గుర్తించి వారికే ఓటు వేయండి. సాధారణంగా ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ఐదేళ్లు ప్రజలను పట్టించుకోరు. ఇప్పటి వరకు ఇదే రాజకీయాలను చూస్తున్నాం. మీ ప్రాంతంలో అలాంటివి జరిగితే ఇప్పుడు ఓటు కోసం వచ్చే వారిని నిలదీయండి. – బొప్పన విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సరియైన నిర్ణయం తీసుకోండి ఐదేళ్లకు పాలకులను ఎన్నుకుంటాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలపై దాని ప్రభావం ఉంటుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. అందువలన ఓటు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకుండా ఇబ్బంది. ప్రసుత్తం ఎన్నికల రసవత్తరంగా ఉన్నాయి. మార్పు అవసరం. –వడ్లమన్నాటి ప్రసాద్, సింగరాయపాలెం నైతిక విలువలకు ప్రాధాన్యం విలువలతో రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. హామీల పేరుతో మోసగించే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల రాగానే మన చుట్టూ తిరుగుతున్న నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడతాం. మాట ఇచ్చిన తప్పని నేతలను ఎన్నుకోవాలి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. –విస్సంశెట్టి కోటేశ్వరరావు, పెదగొన్నూరు -
పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులు పార్లమెం టు ఎన్నికల్లో వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా గురువారం (నేడు) ‘పెయిడ్ హాలిడే’ (వేతనాలతో కూడిన సెలవుదినం)గా ప్రకటిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి విభాగం ఈనెల 1వ తేదీన జీవో జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని నిబంధనలకు అనుగుణంగా కార్మిక కమిషనర్ కూడా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. దుకాణాలతో పాటూ, ఐటీ, ఐటీఈ ఎస్ (ఔట్ సోర్సింగ్) కంపెనీలు కూడా ఏప్రిల్ 11ను పెయిడ్ హాలిడేగా ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటించకుండా లేదా సంస్థలను మూసివేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారికి, లేబర్ కమిషనర్కు లేదా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు ఫిర్యాదులు అందిన పక్షంలో వాటిని తీవ్రంగా పరిగణిస్తారు. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఈవో రజత్ కుమార్ హెచ్చరించారు. -
వలస ఓటర్లు ఓటేస్తారా?
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిన వలస ఓటర్లు ఈ మారు ఎంతమేర ప్రభావం చూపుతారన్నది ప్రస్తు తం ప్రధానాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది వరకు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల్లో ఉన్న వలస ఓటర్లు ఉన్నారు. వీరు సొంత గ్రామాలకు తరలివచ్చి ఏ మేరకు ఓటు వినియోగించుకుంటారన్నది కీలకం కానుంది. ప్రస్తుతం వలస ఓటర్లను పోలింగ్బూత్కు రప్పించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులు కొంత మేర చొరవ చూపగా, ఇతర పార్టీ లు వారిని పట్టించుకున్న దాఖలాల్లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఉత్సాహం ఈసారి వలస ఓటర్లలో కనిపించకపోవడంతో ఈ ప్రభావం గెలుపోటములపై ఏమాత్రం ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. అప్పుడైతే పోటెత్తారు.. ఇప్పుడేమిటో? డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, తాజా పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఆ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారడంతో వలస ఓటర్ల లెక్క లు తీసి వారికి సకల సౌకర్యాలు సమకూర్చి పార్టీలు పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చాయి. నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, వికారాబాద్, కొల్లాపూర్, మెదక్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు పెద్ద సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉండటంతో వారిని రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సు వసతి కల్పించి తీసుకొచ్చారు. దీనికి తోడు హైదరాబాద్లో సెటిలైన ఓటర్లు తమ పల్లెలకు తరలి ఓటు వినియోగించుకున్నారు. మొత్తంగా 25 లక్షల మంది వలస ఓటర్లు పోలింగ్లో పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 85 నుంచి 94శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పార్టీలు వలస ఓటర్లపై పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ఒక్క అధికార పార్టీ మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మెజార్టీ ఎంత ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. భారీ మెజార్టీ రావాలంటే అందుకు తగ్గట్టే పోలింగ్ శాతం పెరగాలని, వలస ఓటర్లపై దృష్టి పెట్టాలని అభ్యర్థులను ఆదేశించింది. -
మీ ఓటు వీర జవాన్లకే!
ఔసా(మహారాష్ట్ర)/చిత్రదుర్గ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో ఉగ్రవాదుల పని పట్టిన వీర జవాన్లకు తమ ఓటుహక్కును అంకితం చేయాలని తొలిసారి ఓటేయబోతున్న యువజనులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ తొలి ఓటును వీర జవాన్లకు అంకితమిస్తారా? పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అంకితమిస్తారా? ఏ ఎన్నికల్లో ఎవరికి తొలి ఓటు వేశారో ఎన్నటికీ మరచిపోరు’ అని అన్నారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. స్వాతంత్య్రం రావడానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తే అసలు పాకిస్తాన్ అనే దేశమే పుట్టేది కాదని అన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలకడం ఎంత వరకు సబబమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాక్ పల్లవి.. కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని అన్నారు. ఉగ్రవాదుల సొంత గడ్డకు చొచ్చుకెళ్లి వారిని మట్టుపెట్టడమే బీజేపీ ప్రతిపాదించిన నవ భారత్ విధానమని చెప్పారు. సాయుధ బలగాల అధికారాల్లో కోత విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని, పాక్ కూడా ఇదే కావాలని అన్నారు. అలా అయితే భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిని మాత్రమే నిజాయతీతో చేసిందని చురకలంటించారు. ఇటీవల జరిగిన వరస ఐటీ దాడుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల నుంచే పెట్టెల కొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా చౌకీదారునే దొంగ అంటున్నారని, కానీ ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. చాన్నాళ్ల తరువాత తనతో వేదిక పంచుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనకు తమ్ముడు లాంటి వారని అన్నారు. భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ మళ్లీ తలదూర్చకుండా గట్టిగా దెబ్బకొట్టాలని మోదీని ఉద్ధవ్ కోరారు. ఉగ్రవాదుల్లో భయం పుట్టించాం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన మరో ర్యాలీలో మోదీ మాట్లాడారు. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదుల్లో భయం పుట్టిందని, పాకిస్తాన్లో అధికారంలో ఉన్న వారిని పీడకలలు వెంటాడాయన్నారు. వైమానిక దాడుల తరువాత ప్రపంచం మొత్తం భారత్కు మద్దతుగా నిలిస్తే కాంగ్రెస్–జేడీఎస్లు దుఃఖంలో మునిగాయన్నారు. అధికారం, స్వప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. పటిష్ట ప్రభుత్వం రావాలంటే ఆలోచించి ఓటేయాలని యువతను కోరారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటైతేనే శక్తిమంతమైన భారత్ సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. -
చలో ఆంధ్రా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు ఓటు హక్కు కలిగి ఉన్నారన్నమాట. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. అలాగే ఏప్రిల్ 12 నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ఇస్తున్నారు. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీలోని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఫోన్లకు సందేశాలు పంపుతూ అప్రమత్తం చేస్తున్నారు. కొందరైతే స్వయంగా కలసి ఓటేసేందుకు ఊరికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచిత రవాణా, భోజనం... సెలవుల కారణంగా కొందరు మాత్రమే ఊరెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వారిని పార్టీలు రకరకాల తాయిలాలు ఆశజూపి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. మరునాడే రాలేనివారికి చార్జీలు పొందే సదుపాయం అదనం. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పి స్తున్నారు. ఇక అన్నింటికీ మించి ఓటుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘డబుల్’ఎలా వీలవుతుంది?... దశాబ్దాలుగా ఏపీలో, తెలంగాణలో వేర్వేరు దశల్లో పోలింగ్ జరుగుతూ వస్తోంది. రెండు దశల మధ్య తగినంత సమయం ఉండటంతో చాలా మంది ‘‘ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..’’అన్న ధోరణిలో ఓట్లేసేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా వీరు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగించారు. పోలింగ్కు తగినంత సమయం ఉండటంతో ఇది సాధ్యమైంది. ఈ దఫా కూడా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఉండటంతో వీరికి డిమాండ్ పెరిగింది. 18.5 లక్షల డబుల్ ఓట్లు.. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదావు 18.5 లక్షల డబుల్ ఓట్లున్నాయి. అంటే ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటరు లిస్టులో వీరి పేరుంది. వీటిని బోగస్ ఓట్లుగా గుర్తించి కొట్టేయాలని హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. దీనికి ఏపీ ఎన్నికల సంఘం నిరాకరించింది. అవి బోగస్ ఓట్లు కావని, రెండు చోట్ల ఉన్నవి కాబట్టి, వాటిని డబుల్ ఓట్ల కింద పరిగణిస్తామని కోర్టుకు సమాధానమిచ్చింది. దీం తో వారి ఓట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఈసారి తెలంగాణలో డిసెంబర్లోనే శాసన సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో వీరందరికి ఏపీలో రెండోసారి ఓటు వేసేందుకు అవకాశం వచ్చిందన్నమాట. -
600 మందికి ఒక పోలింగ్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లాపరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నందున ఒక్కో పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 600 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్బూత్లు ఏర్పాటు చేయాలని సూచించింది.27న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించి, 30న అన్ని జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఆ జాబితా ఆధారంగా వచ్చే నెల 7న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ ఆదేశించారు. ఈ పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ వచ్చే నెల 20లోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. జిల్లా సీఈవోలు, జిల్లా సహాయ ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ను ఇచ్చారు. మండలాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భవనాలను ఎంపీడీవోలు, ఇతర అధికారులు పరిశీలించి, అక్కడున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది అంచనా వేయాలని ఎస్ఈసీ సూచించింది. -
థర్డ్ జెండర్ కీలకం
వివక్ష.. విస్మరణ నుంచి రాజ్యాధికారం దిశగా ట్రాన్స్జెండర్లు అడుగులు వేస్తున్నారు. భారత ఎన్నికల్లో థర్డ్ జెండర్ల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కేవలం ఓటర్లుగానే కాదు అభ్యర్థులుగానూ పోటీ పడుతున్నారు. భారత ఎన్నికల సంఘం 1994లో ట్రాన్స్ జెండర్లను థర్ట్ జెండర్లు (ఇతరులు)గా గుర్తించి ఓటు హక్కు కల్పించడంతో వారికి ఎన్నికల్లో ప్రాతినిథ్యం మొదలైంది. అంతకు ముందు ట్రాన్స్ జెండర్లను మహిళల కిందనే పరిగణిస్తూ వారి వివరాలను ఓటర్ల జాబితాలో పేర్కొనేవారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2009 నుంచి ఎన్నికల సంఘం థర్ట్ జెండర్ కాలమ్ను ఓటరు లిస్టులో ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య కచ్చితంగా లేదుగానీ.. 3,760 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లాల వారీగా ఇలా.. శ్రీకాకుళం జిల్లాలో 247 మంది ట్రాన్స్ జెండర్స్ ఓటర్లుగా నమోదయ్యారు. విజయనగరం జిల్లాలో 118 మంది, విశాఖ జిల్లాలో 158 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 384 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 364 మంది ఇతరుల కేటగిరీలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు. కృష్ణా జిల్లాలో 294 మంది, గుంటూరు జిల్లాలో 421 మంది, ప్రకాశం జిల్లాలో 149 మంది, నెల్లూరు జిల్లాలో 338 మంది, కడప జిల్లాలో 296 మంది, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 443 మంది, అనంతపురం జిల్లాలో 204 మంది, చిత్తూరు జిల్లాలో 344 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. రాహుల్పై పోటీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలపవచ్చని వీరు భావిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సోనమ్ కిన్నర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రాతినిథ్యం వహించిన అమేథి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తమిళనాడులోని మధురై నుంచి శరత్కుమార్కు చెందిన సముతువ మక్కల్ కట్చీ పార్టీ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ భారతి, ఆర్కే నగర్ నుంచి దేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2017లో ఉత్తరాఖండ్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజనీ రావత్ రాయపూర్ నుంచి, 2012లో ఆయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి గుల్షన్ బిందో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిందో 22 వేల ఓట్లు సాధించారు. తెలంగాణలో ‘చంద్రముఖి’ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ తొలిసారిగా పోటీకి దిగారు. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ముమ్మర ప్రచారం నిర్వహించారు. ‘తమ్ముడూ!, నీ ఓటు నాకే వెయ్యాలి. మమ్నల్ని మనుషులుగా గుర్తించాలి’ అంటూ ఆమె ఓట్లు అభ్యర్థించింది. చరిత్ర సృష్టించిన షబ్నం మౌసీ భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన ట్రాన్స్ జెండర్గా షబ్నం మౌసీ చరిత్ర సృష్టించారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని సోహగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో షబ్నం మౌసీ స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ట్రాన్స్ జెండర్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2008 ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలి ట్రాన్స్ జెండర్ మేయర్ ఛత్తీస్గడ్లోని రాయిగఢ్ మునిసిపల్ కార్పొరేషన్కు 2015లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ మధు కిన్నార్ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను కాదని.. ప్రజలు మధు కిన్నార్కే మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి మహవీర్ గురుజీ కంటే 4 వేల ఓట్ల మెజారిటీని సాధించిన కిన్నార్ దేశంలోని తొలి ట్రాన్స్ జెండర్ మేయర్గా చరిత్ర సృష్టించారు. మనుషులమేనని గుర్తించాలి మనుషులందరూ చూడటానికి ఒకేలా ఉన్నా భావాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. స్త్రీగా ఉంటే ఎలా ఉంటుందోనని పురుషులు, మగవారిగా ఉంటే ఎలా ఉంటుందోనని మహిళలు అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనలు రావడానికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్స్. ఈ హార్మోన్స్ విపరీత ప్రభావానికి లోనైనప్పుడు అది వాస్తవ రూపం దాల్చడానికి యత్నించడం సహజం. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకోవడం లేదు. ఏపీలో మేము 51 వేల మంది ఉన్నాం. బాగా చదువుకున్నప్పటికీ అటు ప్రభుత్వాలు, ఇటు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలివ్వడం లేదు. నేను ఇగ్నోలో బీసీఏ పూర్తి చేశాను. నాలా ఎంతోమంది ఉన్నారు. ఉపాధి కోసం రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు మా ఓట్లు కూడా కీలకం కాబట్టి మా గురించి ఆలోచించే వారికే మద్దతు ఇస్తాం. – తమన్నా సింహాద్రి, విజయవాడ – యసోరా -
సర్వర్ డౌన్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కు. ఐదేళ్ల పాలనపై తీర్పు చెప్పడానికి ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా.. నీ ఓటు ఉందా? పోయిందా? అనే ప్రశ్నతోనే పలకరింపులు మొదలవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓటు వేద్దామని ఉత్సాహంగా ఎదురు చూస్తే ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమైంది. ప్రతిపక్షానికి మద్దతుదార్లు, సానుభూతిపరులన్న అనుమానం ఉన్నవారి ఓట్లను తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఇంకెవరో మాయగాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వేలాది ఓట్లపై వేటు వేసింది. విషయం తెలుసుకుని ఓటర్లు నిర్ఘాంతపోతున్నారు. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అందులో తమ పేరు కనిపించక లబోదిబోమంటున్నారు. మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుందామంటే సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో ఆన్లైన్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది. మరోవైపు ఓట్ల నమోదు గడువు ఇక రెండు రోజులే మిగిలి ఉండడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారికీ దక్కని ఓటు హక్కు ఓటర్ల జాబితాను పరిశీలించడానికి, అందులో పేరు లేకపోతే మళ్లీ ఓటు హక్కు పొందడానికి చాలామంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఎన్నికల సంఘం సర్వర్ మొరాయిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఓటు ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కొత్త ఓటును నమోదు చేసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. ఉదయం నుంచి ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఓటు నమోదు చేసుకోలేకపోతున్నామని జనం వాపోతున్నారు. కొన్నిజిల్లాల్లో సైట్ ఓపెన్ అవుతోందని కానీ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారిగా సర్వర్ డౌన్ అవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు నిండినవారు దాదాపు 19 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో చాలామంది ఇంకా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నా సాంకేతిక సమస్యల వల్ల ఫలితం లేకుండాపోతోంది. ఓటు హక్కు పొందాలని ఆసక్తి చూపిస్తున్నా ఆన్లైన్లో సాంకేతిక అవరోధాలు ఎదురవుతుండడంతో జనం నిరాశకు గురవుతున్నారు. గడువు పెంచాలని విజ్ఞప్తులు ‘‘ఓటు ఉందో లేదో వెంటనే చూసుకోండి, కొత్తగా ఓటరు నమోదుకు మార్చి 15వ తేదీ వరకే గడువు ఉంది, ఈలోగా నమోదు చేసుకోకపోతే పోలింగ్ తేదీన వచ్చి ఓటు లేదంటే మేము ఏమీ చేయలేం’’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన హెల్ప్లైన్కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. దీంతో చాలామంది ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసి చెప్పండంటూ నేరుగా పత్రికా కార్యాలయాలకే ఫోన్లు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సర్వర్ పనిచేయడం లేదని, తక్షణమే సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఓటు నమోదుకు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం వీలుకాకపోతే, వెంటనే ఫారం–6 పూర్తి చేసి, సంబంధిత బూత్ లెవల్ అధికారికి(బీఎల్ఓ) గానీ, తమ కార్యాలయంలో గానీ అందజేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఓటు నమోదుకు తప్పని తిప్పలు విజయనగరం జిల్లాలో ఓటర్ నమోదుకు దరఖాస్తులు వెల్లువలా రావడంతో బుధవారం ఎన్నికల సంఘం వెబ్సైట్ చాలాసేపు స్తంభించిపోయింది. ఓటర్ నమోదుకు ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో ఇప్పటికే భారీ సంఖ్యలో ఓట్లను రద్దు చేశారు. ఓటరు నమోదుకు ఆన్లైన్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్ స్తంభించిపోతోందని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి చెప్పారు. ‘1950’కు ఫిర్యాదు చేసినా... శ్రీకాకుళం జిల్లాలో ఓటు నమోదుకు ఆన్లైన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫారం–6 నింపి, అప్లోడ్ చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. జిల్లాలోని పలువురు ప్రజలు బుధవారం ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆన్లైన్లో ఫారం–6 నింపుతుండగా, ఫోటో అప్లోడ్ చేస్తుండగా సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్లోడ్ కావడం లేదు. దీనిపై ‘1950’కు ఫిర్యాదు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. మీ–సేవా కేంద్రాల వద్ద జనం బారులు వైఎస్సార్ జిల్లాలో సర్వర్ పనిచేయక ఓటర్ల నమోదుకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల దరఖాస్తులు చేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో ఓపికగా నిల్చుని, చివరకు చేసేది లేక వెనక్కి వచ్చారు. జిల్లా కేంద్రమైన కడపలో చాలామంది దరఖాస్తు చేసుకోవాలని వచ్చినా సర్వర్ పనిచేయకపోవడంతో వెనుతిరిగారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది దరఖాస్తు చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా మీ–సేవతోపాటు ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ కేంద్రాల్లో సర్వర్ సమస్యతో అవస్థలు పడ్డారు. ఫారం–6 ఎవరికి సమర్పించాలో.. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ–సేవ, ఇంటర్నెట్ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. రాత్రి పది గంటల తర్వాత మాత్రమే సైట్ ఓపెన్ అవుతోంది. వివరాలు అప్లోడ్ అయ్యేలోగా కట్ అయిపోతోంది. మళ్లీ మొదటి నుంచీ చేసుకోలేక జనం మిన్నకుండి పోతున్నారు. ఇంకోవైపు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఫారం–6 దరఖాస్తులను సమర్పించాలో తెలియడం లేదని జనం అంటున్నారు. రెండురోజులుగా పెండింగ్లోనే దరఖాస్తులు కృష్ణా జిల్లాలో ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సర్వర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. జిల్లావ్యాప్తంగా రోజుకు 2000లకు పైగా ఫారం–6 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో 4,000 దరఖాస్తులు పెండింగ్లో ఉండడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు కర్నూలు జిల్లాలో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు సర్వర్ చిక్కులు వచ్చాయి. దరఖాస్తులను అప్లోడ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. మంగళవారం సర్వర్ కొంత మెరుగ్గా ఉండగా బుధవారం మొండికేసింది. తమకు అసలు ఓటు హక్కు వస్తుందా రాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్యను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా.. ఒత్తిడి పెరిగినందున పనిచేయడం లేదని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేదు ‘‘ఓటర్ల నమోదు ప్రక్రియకు గడువు దగ్గర పడుతోంది. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్లు పనిచేయక జనం ఇబ్బందులు పడుతున్నారు. మీ–సేవా కేంద్రాలకు వెళ్లి, చాలాసేపు నిరీక్షించినా ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోలేక తిరిగి రావాల్సి వస్తోంది. ఈ సమస్య బుధవారం మరింత ఎక్కువగా ఉంది’’ – జి.ప్రదీప్కుమార్, రాజానగరం, తూర్పు గోదావరి జిల్లా -
ఓటు హక్కుపై వైఎస్ జగన్ కీలక సూచనలు
-
ఓటు హక్కుపై వైఎస్ జగన్ కీలక సూచనలు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా ఎన్నికల నగారా మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఓటు హక్కు విషయంలో కీలకమైన సూచనలు చేశారు. ఇటీవల ఆంధ్ర ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ గురికావడం.. అధికార టీడీపీ ఓట్ల తొలగింపునకు యత్నిస్తుందనే ఆరోపణలు వస్తున్న వేళ ఆయన ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఓటు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుందని చెప్పారు. ఓటు లేని వాళ్ళు ఆన్లైన్లో ఫామ్-6 నింపి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఎమ్మార్వో ఆఫీసులో గానీ, బుత్ లెవల్ అధికారిని గానీ సంప్రదించాలని సూచించారు. ప్రతి ఓటు కీలకమైందని పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పని అబద్దం, చేయని మోసం, వేయని డ్రామా ఉండదని.. అవన్నీ ఎల్లో మీడియాలో కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ శ్రేణులు యుద్దం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదని.. ఎల్లో మీడియాతో కూడా అని వ్యాఖ్యానించారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
సాక్షి, మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటుగా ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మౌలిక సదుపాయాలు సాధించుకోవడంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువ ఉందన్నారు. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేని పక్షంలో నోటా వినియోగించుకోవచ్చునని చెప్పారు. క్రిమినల్ చరిత్ర తెలియజేయాల్సిందే... తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా అఫిడవిట్లో పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసిందని ఇంతియాజ్ తెలిపారు. బాహుబలిలా.... ఎన్నికల ఓటింగ్ యంత్రాల అవగాహనలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి బాహుబలి సినిమాతో పాటుగా మిసిసిపి మషాలా అనే ఇంగ్లిష్ సినిమాలోని అంశాలను ప్రస్తావించారు. కెన్యాలోని ఒక నియంత నాయకుడు అయితే ఆ పాలన ఎలా సాగుతుందోననే అంశాలతో మిసిసిపి మషాలా సినిమాలో చూపించారని అప్పుడు ఓటు విలువ తనకు తెలిసిందని చెప్పారు. మొదటి సారిగా వివి ప్యాట్ల వినియోగం ఓటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ వేర్ (వీవీ ప్యాట్)ను మన రాష్ట్రంలో మొదటి సారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని, ఈవీఎంలో ఓటరు ఎవరికి ఓటు వేశారో ఈ ప్యాట్లో ఏడు సెకన్ల పాటు ఓటరుకు కనిపిస్తోందని చెప్పారు. ఫారం–7 కింద 25 కేసులు నమోదు చేశాం.. జిల్లా పరిధిలో ఒకరి పేరుతో ఉన్న ఓటును తొలగించమని కొంత మంది ఫారం–7 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విధంగా దరఖాస్తు ఎవరు చేశారనే విషయంపై విచారణ జరుగుతుంది. తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై జిల్లాలో 25 కేసులు నమోదు చేశాం. విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామని సదస్సు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సదస్సులో తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.గురుప్రకాష్, తహసీల్దార్ లలిత, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. -
నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికలు
-
నేడు ‘పంచాయతీ’ తుది పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న రెండో విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బుధవారం పంచాయతీ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ను ఎన్నుకుంటారు. పోలింగ్ విధుల నిర్వహణకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల సేవలనువినియోగిం చుకుంటున్నారు. రూ.1.95 కోట్ల నగదు స్వాధీనం మూడో విడత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీతో పాటు ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. మంగళవారం వరకు రూ.1.95 కోట్ల మేర నగదు, దాదాపు రూ.65 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెలవు లేదా వెసులుబాటు.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని (హైదరాబాద్ మినహా) పబ్లిక్, ప్రైవేట్ అండర్ టేకింగ్స్, పారిశ్రామిక, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సంస్థల యాజమాన్యాలు స్థానికంగా ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఆయా సంస్థలు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకునేందుకు వీలుగా మరో సెలవు రోజును పనిదినంగా పరిగణించవచ్చునని సూచించింది. అది సాధ్యం కాకపోతే ఓటు వేసేందుకు వీలుగా ఓటింగ్ సమయాల్లో 3 గంటల పాటు వెసులుబాటు కల్పించవచ్చునని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ ఉత్తర్వులిచ్చారు. -
నవతరం..నడకెటు?
నిరుద్యోగమే ప్రధానాంశం భారత్లోనూ, అటు ఇండోనేసియాలో కూడా నిరుద్యోగమే ఎన్నికల్లో అతి పెద్ద అంశంగా మారబోతోంది. భారత్లో నిరుద్యోగం 20 ఏళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. మన దేశంలో దాదాపుగా రెండు కోట్ల మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవాతో యువతరం బీజేపీ వైపే ఉంది. ఈసారి ఆ స్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ‘మిలీనియల్స్’లో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి నెలకొంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే నిరుద్యోగం అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. అటు ఇండోనేసియాను నిరుద్యోగం పీడిస్తోంది. నిరుద్యోగం జాతీయ సగటు 5 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జొకో విదోదో ఈ సమస్య పరిష్కారానికి మళ్లీ పారిశ్రామీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇస్తున్నారు. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో యువతరాన్ని ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నారు. మిలీనియల్స్.. 1982 నుంచి 2001 మధ్య పుట్టినవారిని మిలీనియల్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం అందరి దృష్టి వీరి మీదే ఉంది.. ఎందుకంటే.. ఆసియాలో ఈ ఏడాది రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో జరగనున్న ఎన్నికలలో వీరు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఇలా భారత్, ఇండోనేసియాలో 50 కోట్ల మంది ‘మిలీనియల్స్’ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ దేశాలను నడిపించే నేతలెవరో తీర్పు చెప్పనున్నారు. భారత్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యనున్న వారి సంఖ్య 26 శాతానికి పెరిగింది. 40 కోట్ల మందికిపైగా ‘మిలీనియల్స్’ మన దేశంలో ఓటు హక్కు కలిగిఉంటే, ఇండోనేసియాలో 7.9 కోట్ల మంది వినియోగించుకోబోతున్నారు. వీరంతా ఎవరికి ఓటు వేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఎందుకంటే ఈ తరం ఓటర్లు ఎవరి ప్రభావానికీ లోనుకాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తిమంతులు. అందుకే వారిని ఆకర్షించడం పార్టీలకు పెద్ద సవాల్గా మారింది.ఎన్నికలంటే కులం, మతం వంటివి అగ్రస్థానంలో ఉంటాయి. ఈ యువ ఓటర్లను ఆకర్షించేవి మాత్రం ఆర్థికాంశాలే అనేది విశ్లేషకుల భావన. నిరుద్యోగం తీర్చేవారివైపే యువతరం..? 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారు గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారని పలు పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’(సీఎస్డీఎస్) చేసిన సర్వేలో యువ ఓటర్లలో బీజేపీ పట్టు కోల్పోతోందని తేలింది. ఏ ప్రభుత్వమైతే ఉద్యోగాల కల్పన దిశగా స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తామన్న నమ్మకాన్ని కలగజేస్తుందో వారికే యువతరం ఓటు వేయనుందని ఆ సర్వే చెబుతోంది. గుజరాత్ సహా ఇటీవల జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారిని ఆకర్షించేలా వ్యూహాలు పన్నడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్న అంచనాలు ఉన్నాయి. రామమందిర నిర్మాణం, హిందూత్వకార్డు వంటి అంశాల కంటే ఆర్థికపరమైన అంశాలకే నేటి తరం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అది గ్రహించిన బీజేపీ ప్రభుత్వం చమురు ధరల్ని తగ్గించడం, జీఎస్టీలో 28 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో వస్తువుల్ని 12 శాతం శ్లాబులోకి తీసుకురావడం వంటి చర్యల్ని తీసుకుంటోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే సత్తా ఉన్న 40 కోట్ల మంది ‘మిలీనియల్స్’ ఈసారి ఏ పార్టీకి అండగా ఉంటారో, ఎవరిని అందలం ఎక్కిస్తారో? అన్నది ఆసక్తికరంగా మారింది. స్వీయనిర్ణయం గలవారు.. మిలీనియల్స్లో ఎక్కువ మంది ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడ్డవారు. సొంతంగా ఆలోచనలు చేయగలిగిన శక్తి కలిగినవారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆయా అంశాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారే. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా తమకంటూ అభిప్రాయాలను కలిగి ఉన్నవారు. మిలీనియల్స్లో అత్యధికులు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారే. కల్పిత వార్తలే అడ్డంకి... యువ ఓటర్లు సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక కాలం గడుపుతారు. ‘మిలీనియల్స్’ రోజుకు సగటున 5 నుంచి 6 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు, విస్తృతంగా విషయ పరిజ్ఞానాన్ని కూడా నేటి తరం పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను నకిలీ వార్తలు వరదలా ముంచెత్తుతూ ఉండటంతో ఏది అసలు, ఏది నకిలీ తేడా తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. రాజకీయ పార్టీలకు తమ పార్టీల పట్ల జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం అతి పెద్ద సమస్యే. కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంతో ఫేస్బుక్ ఎన్నికల్ని ప్రభావితం చేయగలదన్న ఆందోళనలు అన్ని పార్టీల్లోనూ నెలకొన్నాయి. ‘మిలీనియల్స్’ను ఆకర్షించాలంటే సోషల్ మీడియా ప్రచారం ఒక్కటే సరిపోదు, కల్పిత వార్తలను కూడా తిప్పి కొట్టాలి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అదే పెద్ద అడ్డంకిగా మారనుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ ప్రచార సెల్ఫి బోర్డు
సాక్షి, నిర్మల్: ఎప్పటిలాగే ఇప్పుడూ ఓటేసిండ్రు. కానీ.. ఈసారి గత రికార్డులు బద్దలు కొట్టేసిండ్రు. ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారో.. మరో రెండు రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ.. జిల్లాలో శుక్రవారం నమోదైన పోలింగ్ శాతంతో ఓటరన్న మా త్రం గెలిసిండు. అంతేకాదు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండు. జిల్లా అధికారు లు పడ్డ శ్రమకు తగ్గట్లుగా ఫలితం వచ్చింది. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. గత ఎన్నికల్లో 74శాతం మాత్రమే నమోదైంది. నాలుగున్నరేళ్ల తరువాత జరిగిన జిల్లా ఓటర్లు అధికారుల అంచనాలకు దగ్గరగా వచ్చారు. ఈ సారి 90శాతం ఓటింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేశారు. ఈ క్రమంలో గత ఎన్నికలను మించి ఓటింగ్ శాతం నమోదైంది. స్వచ్ఛందంగా వచ్చి... పొద్దున 7గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఏ పార్టీ అభ్యర్థులు, నాయకులు చెబితేనో తాము రాలేదని.. తమ హక్కును వినియోగించుకునేందుకే వచ్చామని అధిక సంఖ్యలో ఓటర్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల తీరు మారినట్లు కనిపించింది. సామాజిక మాధ్యమాలు, మీడియా, అధికారులు చేసిన ప్రచారం ప్రభావం చూపించింది. అధిక శాతం ఓటర్లు స్వచ్ఛందంగానే వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఈవీఎంలు మొరాయించినా.. క్యూ లైన్లు భారీగా ఉన్నా.. గంటల పాటు ఓపికతో నిల్చుని ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు దివ్యాం గ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం గమనార్హం. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకురావడానికి ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని, వీల్చైర్లను ఏర్పాటు చేసింది. కొంతమంది దివ్యాంగులు వీటిని ఉపయోగించుకున్నారు. చాలామంది స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పల్లెలు ఆదర్శం.. ప్రజాస్వామ్యం కలిపించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పల్లె ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పట్టణ ప్రాంతాల కంటే జిల్లాలోని పల్లెలలోనే పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. పలు గ్రామాల్లో 95శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దాదాపు ప్రతీ గ్రామంలో 75శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. పట్టణాల్లో మాత్రం చాలా పోలింగ్స్టేషన్లలో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. కానీ చాలా పోలింగ్స్టేషన్లలో 70శాతంలోపు పోలింగ్ కావడం కనిపించింది. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, పెంబి, దస్తురాబాద్, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, సిరికొండ, నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, దిలావర్పూర్, నర్సాపూర్(జి), ముథోల్ నియోజకవర్గంలోని కుభీర్, తానూర్ తదితర మండలాల్లో ఇబ్బందికమైన పరిస్థితులను దాటుకోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం వరకు వరసల్లో నిల్చుని ఓటు వేసి వెళ్లారు. లేచింది మహిళాలోకం.. స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లాగా పేరున్న నిర్మల్లో ఎన్నికల్లోనూ మహిళాలోకం ఓటెత్తింది. ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు జిల్లాలోని ఏ పోలింగ్ స్టేషన్ల్లో చూసిన మహిళ ఓటర్లే ఎక్కువగా కనిపించారు. ఓపికగా వచ్చి గంటల పాటు వేచి ఉండి మరీ మహిళామణులు ఓట్లు వేసి వెళ్లారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 1,14,178 మంది ఉండగా 95,375మంది మహిళలు ఓట్లు వేశారు. అలాగే ముథోల్ నియోజకవర్గంలో మొత్తం 1,10,705మంది ఓటర్లు ఉండగా శుక్రవారం 94,027మంది ఓటర్లు వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 94,944 ఉండగా 79,836మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా మొత్తంలో 3,19,827 మహిళ ఓటర్లు ఉండగా, 2,69,238 మంది ఓటు వేశారు. జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్లో ప్రత్యేకంగా పూర్తిగా మహిళ సిబ్బందితో మోడల్ పోలింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రమకు తగ్గ ఫలితం... గత మూడు నెలలుగా జిల్లా అధికారులు చేసిన కృషికి తగ్గట్లుగా పోలింగ్ శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జేసీ భాస్కర్రావుతో పాటు రిటర్నింగ్ అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. మూడు నెలలుగా ఓటర్ల నమోదు, పరిశీలన, జాబితాలను విడుదల, మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం, వీటిపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యా ట్లపై పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఓటర్లకు అవగాహన కల్పించారు. పల్లె ఓటర్లకు అర్థమయ్యేలా సాంస్కృతిక బృందాల ద్వారా కళాజాత కార్యక్రమాలనూ చేపట్టారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జేసీ, ఎస్పీ, వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ పాల్గొని రన్ ఫర్ ఓట్, వాక్ ఫర్ ఓట్ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ అనే ప్రచార సెల్ఫీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కలెక్టర్ ప్రశాంతి, జేసీ భాస్కర్రావు ఈ సారి జిల్లాలో ఓటింగ్ శాతం 90కి పెంచాలన్న లక్ష్యంతో పనిచేశారు. వీరితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడానికి ఎస్పీ శశిధర్రాజు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో సమష్టి కృషితో 80.52 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంలో సఫలమయ్యారు. గల్లంతు కావడంతోనే... జిల్లాలో అధికారులు నిర్ణయించుకున్న 90శాతం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా ఉండింది. కా నీ.. వందలాది ఓట్లు గల్లంతు కావడమే ఈ లక్ష్యా న్ని చేరుకోలేకపోవడానికి కారణమైంది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ మూడు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో నుంచి గల్లంతయ్యాయి. ఇందులో ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేసే ఓటర్లవే ఉండటం గమనార్హం. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల పేర్లే కనిపించకుండా పోయాయి. ప్రధానంగా పట్టణాలైన నిర్మల్, భైంసాలో వందల సంఖ్యలో ఓట్లు కనిపించలేదు. ఖానాపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కూడా గల్లంతయ్యాయి. ఆ యా చోట్ల సంబంధిత ఓటర్లు రెవెన్యూ అధికారు ల వద్దకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యింది. తమ వద్ద గత ఎన్నికల్లో ఇచ్చిన ఓటర్ కా ర్డు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటు లేకపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు. ఎలాగూ జాబితాలో ఉంటుంది కదా.. అన్న నమ్మకంతో పోలిం గ్ కేంద్రాలకు వెళ్తే ఓటు లేకపోవడం విస్మయం కలిగించిందని వారు వాపోయారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం చర్చించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లోపాలతోనే చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
ఓటు @ రూ.10 వేలు!
సాక్షి, హైదరాబాద్: ఓ పోస్టల్ బ్యాలెట్ అక్షరాలా రూ.10 వేలకు అమ్ముడుపోతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోస్టల్ఓట్లపై గురిపెట్టారు. కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను అభ్యర్థులు రంగంలో దింపి దొరికిన కాడికి గుంపగుత్తగా పోస్టల్ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము కోరిన అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్లో ఓటేసి చూపిస్తే ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. డబ్బు, ఖరీదైన బ్రాండ్ల మద్యం ఆఫర్ చేస్తున్నారు. విధుల్లో ఉద్యోగులు, పోలీసులు.. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్ అధికారులు, 37,556 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్ అధికారులు మొత్తం కలిపి 1,50,023 మం ది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల రోజు బందోబస్తు, భద్రత పర్యవేక్షణలో పాల్గొనే రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలను కలుపుకుని మొత్తం సుమారు 2 లక్షల మంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. పోలింగ్ రోజు స్వస్థలాల్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు లేకపోవడంతో ఎన్నికల సంఘం వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సంఘం సరఫరా చేసింది. ఈ నెల 7న రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుకు 24 గంటల ముందు వరకు సంబంధిత నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెల్లో పోస్టల్ బ్యాలెట్లను వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గతంలో కొందరు అభ్యర్థులు కేవలం పోస్టల్ ఓట్ల మెజారిటీలో గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏర్పడితే గట్టెక్కేందుకు పోస్టల్ ఓట్ల సహాయపడవచ్చని భావించి అభ్యర్థులు భావిస్తున్నారు. -
పోలింగ్ స్లిప్ పై గూగుల్మ్యాప్!
సాక్షి, పెద్దపల్లిఅర్బన్: జిల్లావ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసేలా అవగాహన ర్యాలీలు, ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై వివిధ సంస్థల ద్వారా కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందిస్తున్నారు. ఓటుహక్కు వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన సందేశ పత్రాన్ని ఓటర్లకు అందజేస్తున్నారు. గ్రామాల్లో ఓటుహక్కు వినిచయోగించుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంపై అధికారులు ఆలోచనలోపడ్డారు. ఇందులో భాగంగా పోలింగ్ స్లిప్పుల్లో కొత్తగా మార్పులు చేపట్టారు. పోలింగ్ స్లిప్ మీద ఓటరు ఫొటోతో పాటు వెనకాల బూత్కు వెళ్లే దారి, చిరునామా, గూగుల్మ్యాప్ ప్రింట్చేశారు. పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ తేదీని ముద్రించారు. తేలికగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 6,17,726 మంది ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం 804 పోలింగ్ స్టేషన్ల వివరాలు గూగుల్ మ్యాప్తో అనుసంధానం చేశారు. పోలింగ్శాతం పెరిగేలా.. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా నమోదవుతోంది. చదువుకున్నవారు, మేధావులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్ నమోదవడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారాన్ని చేపట్టడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014లో ఓటింగ్ శాతం మెరుగైనప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. స్పందించిన అధికారులు కారణాలను అన్వేషించి కొత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో పెరిగిన ఓటింగ్.. 2009 ఎన్నికల్లో మంథనిలో 2,02,756 ఓటర్లుండగా 1,50,881 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,25,755 ఓటర్లుండగా 1,59,384 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,04,981 మంది ఓటర్లుండగా 1,19,051 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మంథనిలో 2,10,161 ఓటర్లుండగా 1,69,898 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,20,926 ఓటర్లుండగా 1,11,674 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,22,354 మంది ఓటర్లుండగా 1,39,394 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కావడం విశేషం. అంటే 2009లో మంథనిలో 74.40, పెద్దపల్లి 70.60, రామగుండం 58.08, 2009లో మంథనిలో 81.02 పెద్దపల్లి 75.97, రామగుండం 61.91గా నమోదైంది. మంథనిలో చైతన్యం.. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కంటే మంథని నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మారుమూల ప్రాంతంకావడం, పోలింగ్ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉన్నప్పటికీ, మావోయిస్టుల ప్రభావాన్ని సైతం అధిగమించి ఓటింగ్లో పాల్గొని మిగితా వారికి ఆదర్శంగా నిలిచారు. 2009లో 74.40 శాతం, 2014లో 81.02 శాతం ఓటింగ్ నమోదుచేసి రికార్డు సృష్టించారు. 2009లో 58.08, 2014లో 61.91 శాతం ఓటర్లు పోలింగ్లో పాల్గొనగా రామగుండం అట్టడుగునా నిలిచింది. యూత్పై ప్రత్యేక దృష్టి.. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్కు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారిపై దృష్టిని కేంద్రీకరించారు. 18 నుంచి 35 ఏళ్ల యువతను పోలింగ్ కేంద్రానికి రప్పించేలా టెక్నాలజీ సహాయాన్ని తీసుకుంటున్నారు. గూగుల్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్లు ప్రింట్చేసి ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో 1,64,009 మంది యువత ఓటుహక్కును కలిగి ఉన్నారు. వీరిలో పురుషులు 88,076 మంది కాగా యువతులు 75,933 మంది ఉన్నారు. -
ఓటేయకపోతే ప్రశ్నించలేరు!
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడంలో నిర్లిప్తత ప్రదర్శించే యువత రేపు ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని ఎలా ప్రశ్నించగలదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సీ) సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడారు. ‘అక్కడి దాకా ఎందుకు... ఓటువేయని వాణిజ్య, వ్యాపార వర్గాలవారు నైతికంగా ప్రభుత్వాల నుండి సానుకూల విధానాలను ఎలా ఆశించగలరో చెప్పండి’అని ప్రశ్నించారు. ‘ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచి, తరువాత కేంద్రమంత్రి కూడా అయ్యారు. అంటే, ఈ దేశ ప్రజల తలరాతను రాసే నిర్ణయాలు తీసుకునే యంత్రాంగంలో ఒక భాగమయ్యారు. ఒక్క ఓటు కూడా విలువైనదే. అందుకే యువతీయువకులను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను ... అన్నివర్గాలను తప్పనిసరిగా ఓటేయండని ప్రాధేయపడుతున్నాం. కుంటిసాకులు చెప్పి పట్టణ, నగరాల్లోని ఎగువ మధ్య తరగతివారు, చదువుకున్నవారు, సంపన్న వర్గాలవారు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు వేసే ఓటు అందరి బాగు కోసం ఉద్దేశించినది. యువతగా భవిష్యత్తులో ఎక్కువపాత్ర మీదే కదా, మీ నుంచే కొత్త తరం నాయకులు, ఆదర్శ నాయకులు పుట్టుకు రావాలి కదా !’’అని అన్నారు. ‘‘మీలో ఎంత మందికి ఓటు ఉంది, చేతులెత్తండి.’’అన్నప్పుడు కొద్దిమంది మాత్రమే చేతులెత్తడంతో ఆయన కొంత నిరుత్సాహపడ్డారు. జనవరిలో ఓటు నమోదు చేసుకోవచ్చు... ‘కొత్తవారికి ఓటు హక్కు నమోదు చేయడానికి ఎంతో కృషి చేశాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. గడువులు కూడా పొడిగిస్తూ ఎన్నోసార్లు అవకాశం కల్పించాం. ఫరవాలేదు. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. వచ్చే జనవరిలో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదుకండి. గత సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 19వ తేదీల మధ్య దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. వీరు రేపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలరు కూడా. ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పరిఢవిల్లాలంటే ఇటువంటి మార్పు, ఈ చైతన్యం పెద్దఎత్తున రావాలి.’’అని రజత్కుమార్ ఉద్బోధించారు. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’బటన్ అయినా నొక్కితే, మీ నియోజకవర్గ అభ్యర్థికి మెజారిటీ తగ్గి, తన మీద ప్రజల విశ్వాసం తగ్గిపోతున్నదని తెలుసుకుని జాగ్రత్తపడతారని, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల్లో కూడా మంచివారిని వడగట్టడం కోసం, వారెటువంటివారో ఓటర్లు తెలుసుకోవడం కోసం నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా పత్రికల్లో, వార్తా చానల్లో ఒకటికి మూడుసార్లు బాగా కనిపించేలా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు సి.ఎ.అరుణ్ లుహరుకా, ఉపాధ్యక్షుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాంపులకు నిధులేవి..
సాక్షి, నేలకొండపల్లి: ఓటు హక్కు కలిగిన ప్రతీ దివ్యాంగుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు లను ఏర్పాటు చేస్తున్నారు. వీల్చైర్లలో తీసుకొచ్చి, తీసుకెళ్లటానికి రవాణా సౌకర్యం కల్పించనున్నది. డీజెబుల్ ఫ్రెండ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అయితే ర్యాంపుల ఏర్పాటుకు నిధుల కొరత వెం టాడుతోంది. పంచాయతీల్లో నిధులు లేక అందినకాడికాల్లా అప్పులు తెచ్చి ర్యాంపులు నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 28,553 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 5630 మంది, మధిర 6055 మంది, వైరా 4679, సత్తుపల్లిలో 5289 మంది, పాలేరులో 6900 మంది ఉన్నారు. వీరిలో నడవలేని వారు, చెవిటి వారు, మాట రాని వారిని గుర్తించారు. అటువంటి వారి ని ఇంటి వద్ద నుంచి పోలింగ్ కేంద్రం వరకు, ఓటేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి ఇంటి వరకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వీల్ చైర్లను వికలాంగుల సంక్షేమ శాఖ, వైద్యారోగ్యశాఖల నుంచి సేకరిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేశాక ఇంటికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ లేకుండా ఓటు వేసేందుకు ప్రత్యేక వసతులు, పోలింగ్ కేంద్రానికి రాకపోకలు సులువుగా ఉండేలా వీల్చైర్లను సిద్ధం చేసింది. అంధ ఓటర్లు ఎన్నికల గుర్తును గుర్తించేందుకు బ్రెయిలీ సహాయకులు, వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాంపుల ఏర్పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ నిధులు వినియోగించి నిర్మించాలి. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిధు లు రాగానే అందించే ఏర్పాట్లు చేస్తారు. ముందు గా దివ్యాంగుల ప్రయోజనాల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి. –బి.రవికుమార్,ఎంపీడీఓ, నేలకొండపల్లి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పోలింగ్ కేం ద్రాల్లో ర్యాంపులు, వీల్చైర్లు అందుబాటులోకి తెస్తున్నాం. వీటిన్నంటిని జిల్లా నోడల్ అధికారి ఏర్పాట్లు చేస్తారు. అయితే అన్ని మండలాల ఎంపీడీఓ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తారు.దివ్యాంగులు ఇంటి నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా వాహనాలు సమకూరుస్తున్నాం. –దశరథ్, పాలేరు రిటర్నింగ్ అధికారి వసతులు కల్పించాలి దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించు కునేలా ఎన్నిల సంఘం చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవి ఆచరణలో చూపా లి. ఓటుకు కోసం ఎలా తీసుకెళ్లాతారో అలాగే ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల దివ్యాంగులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. –బట్టపోతుల ప్రకాషం, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి, నేలకొండపల్లి -
పోస్టల్ బ్యాలెట్పై పట్టింపేది?
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తోన్న ఎన్నికల కమిషన్.. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఓట్లపై మాత్రం దృష్టి సారించడం లేదు. వీరికోసం పోస్టల్ బ్యాలెట్ విధానం అమలులో ఉన్నా అందులోని లోటు పాట్ల కారణంగా చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కేవలం 30 శాతం లోపే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల కమిషన్ నివేదికల ద్వారా వెల్లడైంది. ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తే తప్పకుండా తాము ఉపయోగించుకుంటామని, ఆ విధానంలో సమస్యల కారణంగానే పోస్టల్ బ్యాలెట్పై నమ్మకం పోయిందని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటు మరికొందరు ఉద్యోగులు పోస్టల్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఓటేయలేకపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఎలా... ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఓటు వేసేందుకు ముందుగా ఎన్నికల కమిషన్ ఫారం నంబర్–12ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను జతచేసి జిల్లా ఎన్నికల అధికారి లేదా సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి లేదా తన విభాగాధిపతికి పంపించాలి. ఈ ఫారం నంబర్లో పేర్కొన్న ఉద్యోగి తన ఓటుకు సంబంధించిన వివరాలు.. ఓటర్ ఐడెంటిటీ నంబర్, అడ్రస్, ఫొటో, ఉద్యోగ గుర్తింపు కార్డు ఎన్నికల అధికారి పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ను పోస్ట్ ద్వారా ఫారంలో పేర్కొన్న ఇంటి అడ్రస్కు పంపిస్తారు. సదరు ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లో తన ఓటుకు వినియోగించుకుని తిరిగి మళ్లీ రిటర్నింగ్ అధికారికి పోస్టు ద్వారానే పంపించాల్సి ఉంటుంది. జాప్యమా.. విధాన లోపామా.. పోస్టల్ బ్యాలెట్ విధానంలోని లోపాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్నికలకు వారం రోజుల ముందు ఈ విధానం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఫారం నంబర్–12 పూర్తి చేసి పంపించినా పోస్టల్ బ్యాలెట్ తమ చేతికి రాలేదని కొంతమంది.. తాము పంపిన పోస్టల్ బ్యాలెట్ చేరిందో లేదో కూడా తెలియదని మరికొంత మంది చెబుతున్నారు. ఇలా పోస్టల్ ద్వారా కాకుండా తాము ఎన్నికల విధులు నిర్వర్తించే రోజే తమ రిపోర్టింగ్ అధికారి కార్యాలయంలోనే పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ చేరడం కూడా తేలికవుతుందంటున్నాయి. టీచర్లే అధికం.. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారిలో అధిక శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉంటున్నారు. దాదాపు 70 శాతం మంది టీచర్లు ఈ విధానం ద్వారా ఓట్లు వేస్తున్నట్లు ఈసీ నివేదికల్లో వెల్లడైంది. అయితే వీరు పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో ముందస్తుగానే ఉంటుండటంతో ఫారం–12, తదితరాలన్ని పూర్తి చేసి ఎన్నికల అధికారికి చేరవేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఇటు పోలీస్శాఖలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటోంది కేవలం 12 శాతం మంది మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డులతో కలిపి మొత్తం 66 వేల మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో బందోబస్తులో విధులు నిర్వర్తించనున్నారు. పోస్టల్ బ్యాలెట్పై అవగాహన కల్పిస్తే వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బంది ఉన్నతాధికారులను కోరుతున్నారు. 2014లో 30% రాష్ట్ర విభజన జరిగినా 2014 ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 30 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ నివేదికలో స్పష్టమైంది. అంతకుముందు 2009 సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కేవలం 26 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వలస పోయిన ఓటు
గల్ఫ్ కార్మికుల అంశం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ప్రచారాస్త్రంగా మారనుంది. ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంది. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంఖ్య 13 లక్షలని అంచనా. ఈ ఓట్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల గత విధానాల వల్లే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని టీఆర్ఎస్ విమర్శిస్తోంటే.. గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, వారి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పి నాలుగేళ్లలో పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తానికి ‘వలస ఓట్ల’ను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు వల విసురుతున్నాయి. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరిలో 80 శాతానికిపైగా కార్మికులు ఎలాంటి నైపుణ్యం లేకుండా కేవలం కూలీ పనుల కోసమే వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో సంపాదనపై ఆశతో వెళ్తున్న వీరిని దళారీలు దోచుకుంటున్నారు. మిగతా సమయాల్లో ఎలాగున్నా ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు గల్ఫ్ కార్మికుల సమస్యలు, వారి కుటుంబాలపై గురిపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ దేశాల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాన్ని మేనిఫెస్టోలో చూపించే యత్నం చేస్తోంది. గత శుక్రవారం టీపీసీసీ ప్రతినిధి బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించింది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడి మన వలస కార్మికులపై వరాల జల్లు కురిపించడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎంపీ కవిత.. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన, చేయబోయే ప్రవాసీ కార్యక్రమాలను వివరించారు. వైఎస్ హయాంలోనే గల్ఫ్ బాధితులకు మేలు గల్ఫ్ కార్మికుల కష్టాలను గుర్తెరిగిన మనిషిగా, వారి సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం, ఓ మంత్రిని నియమించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అక్కడి కార్మికుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. వైఎస్ తన ప్రభుత్వ హయాంలో.. గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 200 కుటుంబాలకు ఈ సాయం అందింది. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణాలను గుర్తించి.. పలువు రికి 30–50 శాతం రాయితీ రుణాలను పంపిణీ చేసిన వైఎస్ ప్రభుత్వం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టింది. గల్ఫ్ దేశాల్లో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తే చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను స్వరాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవ చూపింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి వైఎస్ హయాంలో జారీ అయిన జీవోలను.. ఆపై వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాడు వైఎస్ తీసుకున్న చర్యలను ఇప్పటి రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో చేర్చాలని కార్మికులు కోరుతున్నారు. మేనిఫెస్టోలపై గంపెడాశలు తమ ప్రయోజనాల కోసం స్పందించే రాజకీయ పక్షాలపై బాధిత కుటుంబాలు ఆశ పెట్టుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్లతో ప్రత్యేక గల్ఫ్ ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయలేదు. కానీ, 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లను ఎన్ఆర్ఐ సెల్కు కేటాయించింది. గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ దేశాల్లో మరణించిన దాదాపు 1,200 మంది కార్మికుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంతోపాటు, వారి ఇళ్ల వరకు పంపించినట్లు అధికార పార్టీ చెబుతోంది. తమ పట్ల సానుకూలంగా ఉండే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు అంటున్నాయి. ఎన్ఆర్ఐల ఓట్లు కీలకం ప్రవాస భారతీయులు తమ ఓటు హక్కును విదేశాలలోనే ఉండి స్వదేశంలో జరిగే ఎన్నికలో ఉపయోగించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రాక్సీ ఓటింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది, రాజ్యసభ సైతం దీనికి ఆమోద ముద్రవేస్తే.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ఆర్ఐల ఓట్లు కీలకమవుతాయి. ఈ ప్రయత్నాలతో.. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుందనే ధీమాతో ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాల వల్ల కార్మికుల ఓట్లే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఓట్లతో లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. గల్ఫ్ కార్మికుల డిమాండ్లు ఇవీ - గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ కార్మికుల లెక్క తేల్చడానికి కేరళ ప్రభుత్వ తరహాలో ప్రత్యేక సర్వే నిర్వహించాలి. దాని ఆధారంగా గల్ఫ్ వలస కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలి. కేరళ మాదిరిగానే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. - ఏజెంట్ల బారినపడి మోసపోయిన బాధితులకు స్వయం ఉపాధి కింద రాయితీ రుణాలు ఇవ్వాలి. లైసెన్స్లేని ఏజెంట్ల వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. - కార్మికులకు ఉచిత శిక్షణనిచ్చి.. నైపుణ్యాలు అలవర్చుకున్నాకే వీసా ప్రక్రియను ప్రారంభించాలి. - గల్ఫ్లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం అధునాతన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్లో మరణించిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వం చొరవ చూపడంతో పాటు కార్మికులకు రావాల్సిన జీతభత్యాలను ఇప్పించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. - గల్ఫ్ వెళ్లిన కార్మికులకు ఉచిత బీమా సౌకర్యం, గల్ఫ్ నుంచి ఇళ్లకు చేరిన వారికి పింఛన్లు ఇవ్వాలి. గల్ఫ్ దేశాల్లో కార్మికులకు లేబర్ కోర్టులలో న్యాయపరమైన సలహా, సేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. -
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు. 34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్కు చూపించాం. – 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం. – అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు. – ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి. – ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు. పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు.. గెలిచేట్టు..
ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన యంత్రాంగం.. పోలింగ్ రోజు ప్రతి ఓటు పడేలా చూసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కారణం ఏదైనా.. దివ్యాంగులు పోలింగ్కు దూరంగానే ఉండిపోతున్నారు. అందుకోసమే ఈసారి ప్రత్యేకించి పోలింగ్ ప్రక్రియలో దివ్యాంగులు, వృద్ధులను భాగస్వాముల్ని చేసే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులతో పాటు వృద్ధులు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారి ఈ వినూత్న ప్రయోగానికి తాజాగా ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాలు వేదిక కానున్నాయి. వయోభారం, అంగవైకల్యంతో పోలింగ్ స్టేషన్కు రావడానికి ఇబ్బంది పడే ఓటర్లను ఆటో రిక్షాల ద్వారా తరలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,572 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూత్లను అనుసంధానిస్తూ 19,044 లొకేషన్లలో వీటిని వృద్ధులు, దివ్యాంగుల సేవల కోసం అందుబాటులో ఉంచుతారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఈ ఆటోల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీల్చైర్లను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ట్రైసైకిళ్లను సేకరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీచేసింది. దివ్యాంగ ఓటర్లు 4 లక్షల పైనే.. తెలంగాణలో ‘సదరం’ రికార్డుల ప్రకారం 18 ఏళ్లు నిండిన దివ్యాంగులు 7 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరిలో ఓటుహక్కు కలిగిన వారు 4,12,098 మంది ఉన్నారు. ‘సదరం’ రికార్డుల ద్వారా ఇంకా దివ్యాంగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పోలింగ్ బూత్ల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ కూడా నడుస్తోంది. దివ్యాంగులకు కల్పించే సౌకర్యాల విషయమై ప్రతి జిల్లా కేంద్రంలోనూ హెల్ప్లైన్లనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ‘వాదా యాప్’ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తేనున్నారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా ఓటింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మ్యాపింగ్ పూర్తి! దివ్యాంగ ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ల మ్యాపింగ్ ప్రక్రియ 70 శాతం వరకు పూర్తయింది. ఇది మొత్తం పూర్తయితే తదనుగుణంగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులు ఏ సమయంలో ఓటెయ్యడానికి వస్తారో తెలుసుకుని ఆ సమయంలో వాహన సౌకర్యం కల్పిస్తారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల వీల్చైర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో చిన్నపాటి ర్యాంపు నిర్మించి, అక్కడ వీల్చైర్ను ఉంచుతారు. అంతకుముందు పోలింగ్ బూత్ వరకు వారిని తరలించేందుకు ఆటోలు, ఇతర రవాణా వాహనాలను వినియోగిస్తారు. అలాగే, మహిళల కోసం పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది. ఇంకా దివ్యాంగ ఓటర్లను ఓటు వేయించే దిశగా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అంబాసిడర్లుగా నియమించింది. వీరిలో సినీ నటి అభినయశ్రీ, అంధ క్రికెటర్లు మహేంద్ర, మధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆంజనేయులు, టీవీ యాంకర్ సుజాత, గాయకురాలు శ్రావ్య, శాస్త్రవేత్త బాబూ నాయక్ దివ్యాంగుల్లో ఓటు చైతన్యం కోసం వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఐదు రకాల గుర్తింపు కార్డులు దివ్యాంగులను మొత్తం ఐదు రకాలుగా విభజించారు. ఈ మేరకు గుర్తింపు కార్డులను తయారు చేస్తున్నారు. వీటిని నవంబర్ నెల చివరి నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి దివ్యాంగులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్డులను బట్టి దివ్యాంగులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ ఐదు రకాల రంగులతో కూడిన దివ్యాంగుల ఓటర్ల జాబితాను ఎన్నికల సిబ్బందికి కూడా అందచేస్తారు. దీనివల్ల ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులు ఏ కేటగిరీ వారో గుర్తించి, వెంటనే వారికి తగిన సౌకర్యం కల్పిస్తారు. - కాళ్లు, చేతులు లేనివారు వీరిని ‘లోకోమోటర్’గా వ్యవహరిస్తారు. వీరిని గుర్తించేందుకు వీలుగా ఎరుపు రంగు (రెడ్) గుర్తింపు కార్డు జారీ చేస్తారు. - అంధులు కంటి చూపు లేని వారిని గుర్తించేందుకు ఆరెంజ్ కార్డు కేటాయించారు. - మానసిక వికలాంగులు వీరిని గుర్తించేందుకు పర్పుల్ కార్డులను జారీ చేస్తారు. - బధిరులు: వినికిడి లోపం గల వీరి కోసం నీలి రంగు (బ్లూ) కార్డు అందచేస్తారు. వీరితో సంజ్ఞల భాషలో మాట్లాడేందుకు వీలుగా పోలింగ్ సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, ఈ లోపం గల ఓటర్లకు 15 అంశాలతో కూడిన ఒక కరపత్రాన్ని రూపొందించి అందచేస్తారు. - మల్టిపుల్ డిసేబిలిటీ ఒకటి కంటే ఎక్కువ వైకల్యలోపాలు గల వారిని పర్పుల్ రంగు కార్డు ద్వారా గుర్తిస్తారు. అంధుల కోసం ఓటరు కార్డు మలక్పేటలోని బ్రెయిలీ ప్రెస్లో అంధుల కోసం దాదాపు 50 వేల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించారు. ఇటువంటి గుర్తింపు కార్డుల ముద్రణ దేశ ఎన్నికల చరిత్రలోనే తొలి ప్రయత్నమని అంటున్నారు. ఇటీవల నగర పర్యటనకు వచ్చిన ఎన్నికల ప్రధాన అధికారి రావత్ వీటిని పరిశీలించారు. అలాగే, అంధులు ఆయా పార్టీల చిహ్నాలను గుర్తించేందుకు వీలుగా కూడా ప్రత్యేక బ్యాలెట్ను తయారు చేసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ బ్యాలెట్ ద్వారా అంధులు ఎవరికి ఓటు వేయాలో సులభంగా గుర్తించగలుగుతారని బ్రెయిలీ ప్రెస్ ఎడిటర్ జి.వెంకటేశ్వర రావు (అంధుడు) తెలిపారు. దాదాపు రూ.90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నార్వే దేశం నుంచి బ్రెయిలీ ముద్రణ యంత్రాన్ని కొనుగోలు చేసి ముద్రణ పనులు మొదలు పెట్టినట్లు వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రతీ రోజూ 20 వేల కార్డులను ముద్రించవచ్చని ఆయన అంటున్నారు. ఓటెయ్యడమెంతో ‘సరళ’ం దివ్యాంగులను ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్వేతామహంతి చెప్పారు. ఈ జిల్లాలో దివ్యాంగుల కోసం ‘సరళ్’ పేరుతో ఆమె ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి దివ్యాంగుడు పోలింగ్ నాడు ఓటేసేలా చూడటం, ఓటింగ్లో వారినీ భాగస్వాముల్ని చేయాలనే లక్ష్యాలతో ‘సరళ్’కు శ్రీకారం చుట్టినట్టు ఆమె చెబుతున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు పొందిన, పొందని దివ్యాంగులను కూడా గుర్తించి ఓటుహక్కు కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,709 మంది దివ్యాంగులను గుర్తించారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న దివ్యాంగులను గుర్తించే పని కూడా పూర్తయిందని, ఇక వారి చేత ఓటెయ్యించడమే మిగిలిందని శ్వేతా హమంతి ‘సాక్షి’కి చెప్పారు. ‘‘దివ్యాంగులకు సహకరించేందుకు వలంటీర్లను నియమిస్తాం. వికలాంగ సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. 3,600 మంది దివ్యాంగులకు ఇంటి నుంచి వాహన సౌకర్యం కల్పించాలని నిర్ణయించా’మని చెప్పారు. ఇన్పుట్స్: డి.వెంకటేశ్వర్రెడ్డి, సిలివేరు యాదగిరి, ఎన్.వెంకటేశ్వర్లు -
సీపీఎస్ను రద్దు చేసే వారికే మద్దతు
సంగారెడ్డి జోన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో అనేక సమస్యలతోపాటు పీఆర్సీపై ఏళ్ల తరబడి పోరాటం చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో ఒక్క రోజులో 43 శాతం పీఆర్సీని, 9 నెలల బకాయిలని సాధించుకోగలిగామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో నవంబ ర్ 6 వరకు మాత్రమే ఓటర్ నమోదుకు గడువు విధించారని, దానిని మరో పక్షం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరామన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న క్రమంలో గతంలో అనేక పర్యాయాలు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్క నియోజకవర్గంలో వందకు మించి అవకాశం కల్పించాలేదన్నారు. ఈ సారి ఆన్లైన్లో ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వారం ముందుగానే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొండల్రెడ్డి, కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ముజాహిదిపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామానికి ఏ పాలకుడూ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నది పక్కనే ఉన్నప్పటికీ గ్రామంలోని చెరువు ఎడారిలా మారిందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నా.. తాము గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నామని పేర్కొన్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం చేతకానప్పుడు ఓటు అడిగే హక్కు లేదని నినదించారు. -
ఇక రెండేసి రాష్ట్రాల్లో ఓటు కుదరదు
సాక్షి, అమరావతి: ఇక నుంచి రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా స్పష్టం చేశారు. ఇటీవల పుణేలో, న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలను నిర్వహించిందని ఆయన సోమవారం సచివాలయంలో ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తున్నామని వెల్లడించారు. పుణేలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఓటర్లను అనుసంధానం చేసే ఈఆర్వో నెట్ను రూపొందించిందని, దీని ద్వారా ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే మరో రాష్ట్రంలో ఓటు లేకుండా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండేసి రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన ఓటర్లకు ఆంధ్రప్రదేశ్లోనే ఓటు హక్కు ఉంటుందని, తెలంగాణలో ఉండదని, అలాగే హైదరాబాద్లో ఉన్నవారికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటుందని, వారికి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు ఉండేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజకీయ కారణాలతో ఓట్లు తీసేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని, ఓటు హక్కు లేకపోతే ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు కొనసాగుతోందని, ఓటర్గా నమోదు చేసుకునేందుకు గడువును నవంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.49 కోట్ల ఓటర్లున్నారని వెల్లడించారు. ఇప్పుడు సాగుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు. -
వంద శాతం పోలింగ్కు కృషి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించి వంద శాతం పోలింగ్ జరిగేలా పత్రికలు కృషి చేయాలని మంత్రి కె.తారకరామారావు సూచించారు. ఆదివారం బేగంపేట క్యాంప్ కార్యాలయంలో ‘ముద్ర’ దిన పత్రికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సమస్యల్ని వెలుగులోకి తెచ్చినప్పుడే పత్రికలకు సార్థకత చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంపాదకుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరరెడ్డి, శ్రీనివాసగౌడ్, ఆప్కాబ్ చైర్మన్ కె.రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటే ఆయుధం.. నమోదు ముఖ్యం
సాక్షి, అమరావతి: ఉత్తమ పాలన అందించే నేతలను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుని తన ఆశలను నెరవేర్చే నేతలను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు తప్పనిసరి. ఓటుకు ఇంత ప్రాధాన్యం ఉన్నందున ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే ఈనెలాఖరులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓట్లు ఉన్నప్పటికీ ఏ కారణంగానైనా జాబితా నుంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. పొరపాటున/సాంకేతిక సమస్యవల్ల కూడా ఓటర్ల జాబితా నుంచి మీపేరు తొలగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదా వెంటనే చూసుకోవాలి. ఒక వేళ లేకపోతే ఆధార్కార్డు లేదా ఇతర ధ్రువపత్రాలు సమర్పించి మీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. యువతరం పాత్ర కీలకం వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటు హక్కునమోదుకు అరుŠహ్లే. వచ్చే ఏడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా జనన ధ్రువీకరణ పత్రం లేదా తల్లిదండ్రులచే ధ్రువీకరణ పత్రం, తాజా ఫొటోతో సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం–6 నింపి అక్కడి సిబ్బందికి సమర్పించి రసీదు తీసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను (ఫారం –6ను) డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దారు/ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చు. www.nvsp.in అనే వెబ్సైట్కు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం ఈనెల 31వ తేదీ వరకూ ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అనర్హులు జాబితాలో ఉంటే.. అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగించాలంటూ ఎవరైనా ఫారం–7ను సమర్పించవచ్చు. ఓటరు జాబితాలో పేరు రెండు చోట్ల ఉన్నా ఒకచోట తొలగింపునకు కూడా ఇదే ఫారం –7 దాఖలు చేయవచ్చు. ఓటరు జాబితాలో పేరు తప్పు ఉన్నా, తండ్రి/భార్య/భర్త పేర్లలో తప్పులు ఉన్నా సవరణ కోసం ఫారం–8 దాఖలు చేయవచ్చు. చిరునామాలో మార్పు కోసం కూడా ఇదే ఫారం సరిపోతుంది. ఒకే నియోజకవర్గంలో ఇల్లు మారినా.. ఉన్న పోలింగ్ కేంద్రం నుంచి కొత్త పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఓటు మార్చుకోవాలన్నా కోసం ఫారం–8ఎ సమర్పించాలి. ఇప్పటికే నమోదైన ఉందో లేదో తెలుసుకోవాలంటే ceoandhra.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ల జాబితాలో పేరు చూసుకోవచ్చు. మిస్స్డ్ కాల్ ఇస్తే... ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలన్నా, కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నా 8367797101కు మిస్స్డ్ కాల్ ఇస్తే సీఈవో కార్యాలయం నుంచి సూచనలతో కూడిన ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ సౌకర్యం ఈనెల 31వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్పీ సిసోడియా ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకు అర్హులందరికీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి’ అనే నినాదంతో మిస్స్డ్ కాల్ సదుపాయం ప్రవేశపెట్టామని సిసోడియా చెప్పారు. ప్రజలను ఓటు హక్కుపై చైతన్యపరచడం కోసం త్వరలో సోషల్మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. -
అర్హులందరికీ ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహం సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఓటర్ల జాబితాలో చేర్పుల ప్రక్రియ కీలకమని భావి స్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను, ప్రతిపాదనలను, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25 వరకు గడువు ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటరు అయ్యేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నేతలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని వివరాలతో ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవడంతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నేతలతో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్లోని అన్ని స్థాయిల నేతలు ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా ప్రక్రియపైనే పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత ఉందని... అందరికీ ఓటు హక్కు ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉం టాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఓటరు జాబితా ప్రక్రియ అనంతరమే పార్టీ పరంగా ఇతర కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ‘స్టేషన్’పై కడియం వివరణ... టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రక్రియపై మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల పరిస్థితిపై ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్కు వివరిస్తున్నారు. సమాచారం ఆధారంగా కొం దరు అభ్యర్థులకు ఎప్పటికప్పడు సూచనలు చేస్తున్నారు. పలువురు అభ్యర్థులను పిలిచి మాట్లాడుతున్నారు. స్టేషన్ ఘన్పూర్లో నెలకొన్న తాజా పరిస్థితులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం కేటీఆర్కు వివరించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం తీరు, నియోజకవర్గంలోని అసంతృప్తి నేతల కార్యకలాపాలపై వీరిద్దరూ చర్చి ంచారు. మంత్రి మహేందర్రెడ్డి, చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేటీ ఆర్ను కలిశారు. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార తీరుపై చర్చించారు. చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కె.ఎస్.రత్నం ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన వ్యవహారంపై మాట్లాడారు. రత్నం గతంలోనూ టీఆర్ఎస్ను వీడి మళ్లీ వచ్చారని, ఆయన వెళ్లినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని మహేందర్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. మరో మంత్రి సి.లక్ష్మారెడ్డి సైతం కేటీఆర్ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ నేత దానం నాగేందర్ దాదాపు ప్రతిరోజూ కేటీఆ ర్ను కలుస్తూనే ఉన్నారు. ఖైరతాబాద్ టికెట్ విషయంపై శుక్రవారం మరోసారి కలసి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేయాలని కోరారు. తలసాని శ్రీనివాసయాదవ్ కూడా కేటీఆర్ను కలిశారు. -
ఆమే నిర్ణయాత్మక 'శక్తి'
ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా, ప్రజల స్వరం గట్టిగా వినబడాలన్నా ఓటు హక్కు మన చేతిలో ఉన్న వజ్రాయుధం. ఈ విషయాన్ని మహిళలు బాగా తెలుసుకున్నారు. ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం రానురాను పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్సభ, వివిధ రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్నీతి అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తుంది. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్పోల్ సర్వేలు నిర్వహిస్తూ జనం నాడిని తెలియజేస్తూ ఉంటుంది. ఆ సంస్థ కొన్నేళ్లలో నిర్వహించిన వివిధ సర్వేలు, తాజాగా నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రీపోల్ సర్వే ఫలితాలను సమీక్షిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో 65.5% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే ఎన్నికల్లో పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. దేశంలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 3 కోట్ల కంటే ఎక్కువే. అయినా పోలింగ్ బూత్లకి తరలి వెళ్లడంలో మహిళలు ముందంజలో ఉన్నారు. 1970వ దశకంలో ఓటు హక్కు వినియోగించుకున్న పురుషులు 61% ఉంటే, 2014కి వచ్చేసరికి 67% మాత్రమే. అదే మహిళా ఓటర్ల విషయానికొస్తే 1971లో 49% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటే 2014 వచ్చేసరికి ఏకంగా 65.5 శాతానికి చేరుకుంది. ఏ పార్టీకి లాభం? గతంలో జరిగిన ఎన్నికలను పరి శీలిస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ వైపు మహిళా ఓటర్ల మొగ్గు ఎక్కువగా ఉంది. 2 నుంచి 3 శాతం మహిళా ఓట్లు బీజేపీకి తక్కువగా వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పురుషులు, మహిళల ఓట్ల శాతం సమానం గా ఉంది. కాంగ్రెస్కి పోలైన ఓట్లలో 19% పురుషులైతే, మహిళలు కూడా 19% మంది ఓటేశారు. అదే బీజేపీకి పురుషులు 33% మంది ఓటు వేస్తే, మహిళలు 29% మాత్రమే ఓటేశారు. ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీది ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పడిన ఓట్లలో 15% పురుషులు ఉంటే, 5% మాత్రమే మహిళలు ఉన్నారు. గుజరాత్లో మాత్రం బీజేపీకి మెరుగైన పరిస్థితులే ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆ పార్టీని ఆదరిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న రాజకీయ పార్టీ లకే మహిళలు బ్రహ్మరథం పట్టారు. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ(పీడీపీ), యూపీలో మాయావతి (బీఎస్పీ), తమిళనాట జయలలిత(ఏఐఏడీంకే), పశ్చిమబెంగాల్లో మమతా బెనర్టీ (తృణమూల్ కాంగ్రెస్)లకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళలు ఏకంగా 10% ఎక్కువగా జయలలితకు ఓట్లు వేయడం విశేషం. 2019లో బీజేపీ వైపే మహిళా ఓటర్లు? 2014 నుంచి ఇప్పటికీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సమాన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్నీతి–సీఎస్డీఎస్ ఈ ఏడాది నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 30 శాతం మహిళలు బీజేపీ వైపు ఉంటారని సీఎస్డీఎస్ అంచనా వేసింది. ఈసారి ఎన్నికల్లో హరియాణా, ఒరిస్సా, పశ్చిమబెంగాల్లో మహిళా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ‘ఉజ్వల యోజన’పేరిట మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, బేటీ బచావో–బేటీ పఢావో లాంటి పథకాల కారణంగానే మహిళలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల సంఘం మహిళా ఓటర్ల నమోదును పెంచడానికి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో మహిళా ఓటర్లు నమోదు భారీగా ఉంటుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీదే విజయమన్న అభిప్రాయం నెలకొంది. బీజేపీకి మహిళా ఓటర్లు ప్రతికూలంగా ఉన్న రాష్ట్రాలు... అస్సాం, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ బీజేపీకి మహిళల మద్దతు ఉన్న రాష్ట్రాలు.. ఢిల్లీ, మధ్యప్రదేశ్ మహిళా ఓటర్లు జై కొడుతున్న సీఎంలు.. కె.చంద్రశేఖర రావు(తెలంగాణ) నితీశ్ కుమార్(బిహార్) శివరాజ్సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్) నవీన్ పట్నాయక్(ఒడిశా) -
తక్షణమే ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల నమోదు అర్హత తేదీ 2019 జనవరి 1 గడువుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2019’ను రాష్ట్ర శానససభ రద్దయిన నేపథ్యంలో తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు, అభ్యంతరాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు కీలక సూచనలు చేసింది. ఓటరుగా నమోదుకు 2018 జనవరి 1, 2019 జనవరి 1 తేదీల నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులు, అభ్యంతరాలను రెండుగా విభజించాలని ఆదేశించింది. 2018 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు.. ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’కింద ఓటు హక్కు కల్పించాలని కోరింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 2019 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి, 2018 జన వరి 1 అర్హత తేదీగా తక్షణమే ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’ను ప్రారంభించాలని ఆదేశిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి అర్హత సాధించిన వ్యక్తులు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2019 కింద దరఖాస్తు చేసుకొని ఉంటే మళ్లీ తాజాగా నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉత్పన్నం కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం పునరుద్ధరించనున్న 2019 సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద 2019 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని కోరింది. తొలగింపు జర భద్రం! - ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కింద ఓటర్ల తొలగింపులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే చనిపోయిన, చిరునామా మారిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని కోరింది. - ఒకటికి మించిన ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కలిగిన వ్యక్తుల ఓట్లను తొలగించినప్పుడు ఆయా వ్యక్తుల నుంచి అదనంగా ఉన్న ఎపిక్ కార్డులను వెనక్కి తీసుకుని వాటి రికార్డులను భద్రపరచాలి. - ఓటరు జాబితా డేటాబేస్లో ఆధారంగా తొలగించిన ఓటర్లకు పోస్టు/ఈ–మెయిల్/సెల్ఫోన్ ద్వారా సమాచారమివ్వాలి. - ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల పేర్లతో జాబితాను రూపొందించి వారం ముందు ఓటరు నమోదు అధికారి తన కార్యాలయం గోడలపై అతికించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్పై మీద ఈ జాబితాలను ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు స్వీకరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం ఈ జాబితాలను అందించాలి. - తొలగింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలగించిన తుది ఓటర్ల జాబితాలను సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. - ఓటర్ల తొలగింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ కేసుల్లో ప్రత్యేక పరిశీలన.. - మరణం మినహా ఇతర ఏ కారణాలతోనైనా ఒకే పోలింగ్స్టేషన్ పరిధిలో 2 శాతానికి పైగా ఓటర్లను తొలగిస్తే ప్రతి కేసును తహశీల్దార్, ఆపై స్థాయి అధికారి ప్రత్యేక పరిశీలించాలి. - ఒకే వ్యక్తి ఐదుకి మించిన కేసుల్లో అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రత్యేక పరిశీలన నిర్వహించాలి. - 2 శాతం కేసులను ఉప జిల్లా ఓటరు నమోదు అధికారి క్రాస్ చెక్ చేయాలి. 1 శాతం కేసులను జిల్లా ఎన్నికల అధికారి, 0.5% కేసులను ఎన్నికల పర్యవేక్షణాధికారి క్రాస్ చెక్ చేయాలి. ప్రముఖుల ఓట్లు ప్రత్యేకం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కళలు, జర్నలిజం, క్రీడలు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ వ్యక్తుల ఓట్లను తొలగించడానికి వీల్లేకుండా ఓటర్ల జాబితా డేటాబేస్లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. -
ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దు
మెట్పల్లిరూరల్(కోరుట్ల) : ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దని, రాజ్యాంగపరంగా వచ్చిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మెట్పల్లి జడ్జి అజయ్కుమార్ జాదవ్ తెలిపారు. మెట్పల్లి అర్బన్కాలనీలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కులమతాలకు అతీతంగా అందరు సమైక్యం గా ఉండాలని, తద్వారా సమస్యల పరి ష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు. అర్హుందరికీ ఉచిత న్యాయ సహాయం కోర్టుల్లో తప్పకుండా అందుతుందన్నారు. మండల లీగల్ సెల్ ఎళ్లవేళలా తోడుంటుందన్నారు. అధికారులు ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించకుంటే కేసు వేయొచ్చన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. ఎలాంటి విషయంలోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని న్యాయమూర్తి సూచించారు. చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తహసీల్దార్ సుగుణాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అప్పులుఇస్తే తప్పకుండా పత్రాలు రాయించుకోవాలని సూచించారు. సదస్సులో వెంకట్రావుపేట సర్పంచ్, న్యాయవాది కొమిరెడ్డి లింగరెడ్డి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం శంకర్రెడ్డి, ఏజీపీ ఎల్లాల మధుసూదన్రెడ్డి, ఎస్సై శంకర్రావు, ఆర్ఐ కృష్ణ, న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, మగ్గిడి వెంకటనర్సయ్య,ఓగులపు శేఖర్, తెడ్డు ఆనంద్, సురక్ష పాల్గొన్నారు. -
ప్రశాంతంగా బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, జస్టిస్ పి.కేశవరావు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. హైకోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 3,461 మంది ఓటర్లకు గాను 2,590 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా 80%పైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 100% పోలింగ్ నమోదైనట్లు బార్ కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో 85% మేర పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఇక హైకోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 2,746 మంది ఓటర్లకు గాను 1,552 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన గొడవతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోగా అధికారుల జోక్యంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లోని బ్యాలెట్ బ్యాక్సులకు సీలు వేసి వాటిని హైదరాబాద్కు తరలించనున్నారు. బార్ కౌన్సిల్కు ఎన్నికయ్యే 25 మంది తమలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 23న ఉంటుంది. ఢిల్లీలో 60 శాతం పోలింగ్.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు అల్లంకి రమేశ్ ఎన్నికల అధికారిగా, న్యాయవాదులు ప్రభాకర్, ఎస్ఏ.నఖ్వీ సహాయ అధికారులుగా వ్యవహరించారు. మొత్తం 60% పోలింగ్ నమోదైందని రమేశ్ తెలిపారు. -
1918 - 2018: వందేళ్ల క్రితం ఆడవాళ్లు
►వారసత్వంగా ఆస్తి పొందడానికి లేదు. (1922లో ‘లా ఆఫ్ ప్రాపర్టీ’ వచ్చాక ఆ పరిస్థితి మారింది). ►అకౌంటెంట్ అవడానికి, మేజిస్ట్రేట్ అవడానికి లేదు. ( 1919 నాటి సెక్స్ డిస్క్వాలిఫికేషన్ (రిమూవల్) యాక్ట్ వచ్చాక ఆ పరిస్థితి మారింది). ►బ్యాంకు అకౌంట్ తెరవడానికి లేదు. బ్యాంకు రుణం పొందడానికి లేదు. (1975లో ఆ పరిస్థితి మారింది). ►పబ్బుల్లో సొంతంగా డబ్బు ఖర్చు చేయడానికి లేదు. ( 1982లో ఆ పరిస్థితి మారింది). ►సమాన వేతన హక్కు లేదు.(1970 నాటి సమాన వేతన చట్టంతో ఆ పరిస్థితి మారింది). ►చట్టం దృష్టిలో ఒక ‘వ్యక్తి’ కాదు! (1929లో ఆ పరిస్థితి మారింది). ►‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో కనిపించడానికి లేదు.(1958 లో ‘లైఫ్ పీరేజస్ యాక్ట్’తో ఆ పరిస్థితి మారింది.) ►లండన్ స్టాక్ ఎక్సేంజ్లో పని చేయడానికి లేదు. (1973లో ఆ పరిస్థితి మారింది). ►క్రూరుడైన భర్తకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేందుకు లేదు.(1976 డొమెస్టిక్ వయలెన్స్ అండ్ మ్యాట్రిమోనియల్ ప్రొసీడింగ్స్ యాక్ట్తో ఆ పరిస్థితి మారింది). ►అవివాహిత అయితే గనుక గర్భనిరోధక మాత్రలు కొనడానికి లేదు.(1967లో నేషనల్ హెల్త్ సర్వీస్ ఫ్యామిలీ ప్లానింగ్ యాక్టుతో ఆ పరిస్థితి మారింది. ►చట్టపరంగా గానీ, వైద్యపరంగా గానీ సురక్షితమైన అబార్షన్ చేయించుకోడానికి లేదు. (1967 అబార్షన్ యాక్ట్ తో ఆ పరిస్థితి మారింది). ►భర్త రేప్ చేస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి లేదు. ( 1991లో ఆ పరిస్థితి మారింది). -
నంద్యాల సాక్షిగా
-
ఓటెత్తిన నంద్యాల
-
ఓటెత్తిన నంద్యాల
ఉప ఎన్నికలో 79.20 శాతం పోలింగ్ - గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం నమోదు - దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్గా రికార్డు - ఉదయం నుంచే బారులుతీరిన ప్రజానీకం - ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలే అధికం - అధికార పార్టీ ఎమ్మెల్యేల హల్చల్.. చివరి 3 గంటలూ దౌర్జన్యం - రిలీవర్ ఏజెంట్లను లోపలికి అనుమతించని వైనం - ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ప్రధానంగా మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి నంద్యాల చరిత్రలో లేని విధంగా 79.20 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్ఆర్ సీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరాక గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా బుధవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండటంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు భయోత్పాతం సృష్టించేందుకు తీవ్రంగా యత్నించారు. ఉదయం నుంచి అత్యంత ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్.. చివరి మూడు గంటల్లో రౌడీ రాజ్యాన్ని తలపించింది. 7వ వార్డులో కౌన్సిలర్ కలాంపై టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారు. భూమా మౌనిక, జగత్విఖ్యాత్రెడ్డిలు భారీగా అనుచరులను వెంటేసుకుని పట్టణంలో హల్చల్ చేయడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ రాజగోపాల్రెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే రాంబాబు అనుచరులు దాడికి విఫలయత్నం చేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి కాన్వాయ్తో పట్టణంలో కలియ తిరుగుతూ ఇబ్బంది కలిగిస్తున్నా పోలీసులు అభ్యంతరం చెప్పలేకపోయారు. మంత్రి అఖిలప్రియ అళ్లగడ్డకు చెందిన వ్యక్తులను వెంటబెట్టు కొని పలు పోలింగ్ బూత్లలో కలియతి రిగారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులపై దూషణలకు దిగారు. అయినా వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సంయమనం పాటించి, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాయి. కాగా, గెలుపు తమదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బారులు తీరిన మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకు 17 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్లో అదే పరంపర కొనసాగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 53 శాతం, సాయంత్రం 5 గంటలకు 77.6 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 79.20 శాతం నమోదైంది. గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం, నంద్యాల రూరల్లో 87.61 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ముస్లిం మైనార్టీ మహిళలు ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఎవరికి ఓటు వేశారంటూ వివిధ న్యూస్ చానళ్లు, పత్రికలు (సాక్షి కాదు) పలు విధాలా ప్రయత్నించినా ఓటు సీక్రెట్ అంటూ బహిర్గత పరచక పోవడం విశేషం. అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తోందని అధికార పార్టీ నేతలు నిరాశలో ఉండిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేల హల్చల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తప్ప ఇతరులెవరూ నంద్యాల నియోజవర్గ పరిధిలో ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లెక్క చేయలేదు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి హల్చల్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల పాస్ లేకుండా కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లు, ఏజెంట్లను ప్రభావితం చేస్తున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తమకు ఓట్లు పడటం లేదని అధికార పార్టీ నాయకులు అనుమానించారు. మరో మూడు గంటల్లో పోలింగ్ గడువు ముగుస్తుందనగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బూత్లలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభపెట్టారు. ఏజెంట్లను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ నగర్లో కౌన్సిలర్ శివశంకర్ ఓటర్లకు మరోమారు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు పోలింగ్ బూత్ల సమీపంలో టీడీపీకి ఓటు వేస్తామంటే రూ.2 వేలు ఇస్తానంటూ కౌన్సిలర్ జేవీసి హారిక బహిరంగంగా ప్రలోభాలకు గురిచేస్తూ హల్చల్ చేశారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ కలాంపై దాడి చేయడం, ఎన్జీవో కాలనీలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి, తమ్ముడు జగత్విఖ్యాత్రెడ్డిలు ఏజెంట్లు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్టీఆర్ షాదీఖాన సమీపంలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోగా.. వారిని ఎమ్మెల్సీ ఫరూక్ తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. యథేచ్ఛగా దొంగ ఓట్లకు తెగించిన టీడీపీ నందమూరినగర్లోని పోలింగ్ బూత్లలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివక్ష చూపారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళన నెలకొంది. వైఎస్సార్సీపీకి చెందిన రిలీవర్ ఏజెంట్లను బయటకు గెంటివేసిన పోలీసులు... తిరిగి వారిని లోపలికి అనుమతించలేదు. నంద్యాల్లోని 18, 18ఏ, 19, 19ఏ, 20, 20ఏ బూత్లలో ఉన్న ఏజెంట్లు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్తామంటే వారి స్థానంలో రిలీవర్ ఏజెంట్లు మంజుల, రమాదేవిని అనుమతించలేదు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వారిని తీవ్ర పదజాలంతో దూషించారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. నందమూరి నగర్లోని నాలుగు బూత్లలో బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దొంగ ఓట్లు వేశారు. ఇక్కడికి మొత్తం 60 మందికి పైగా దొంగ ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదు. చివరి క్షణంలో స్పందించిన పోలీసులు.. కేవలం ఆరుగురు దొంగ ఓటర్లను మాత్రమే అరెస్టు చేశారు. నందమూరి నగర్ పోలింగ్ బూత్లో మూడున్నర గంటలపాటు ఈవీఎం మిషన్కు అనుబంధంగా ఉండే వీవీ ప్యాట్ యంత్రం మొరాయించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మరమ్మతుకు నోచుకోలేదు. క్యూలో 70 మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అదనపు వీవీ ప్యాట్ యంత్రాన్ని అమర్చడంతో దాదాపు 7 గంటలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఎదుట ఓటర్లకు టీడీపీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, టీడీపీ నాయకుడు ప్రసాదరెడ్డి డబ్బులు పంచుతుండడంతో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇటుక పెళ్లతో దాడికి యత్నించారు. కొందరిపై చేయి చేసుకున్నాడు. పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. -
నంద్యాల ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు
భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు కర్నూలు(అగ్రికల్చర్): మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణకు భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు సోమవారం కలెక్టర్ సత్యనారాయణను ఆయన చాంబర్లో కలిశారు. ఓటర్లు ప్రలోభాలకు, ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వేచ్ఛగా ఓటు వేయాలని నంద్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓటర్లలో చైతన్యం పెంచేందుకు గానూ ఎన్నికల నిఘా వేదిక రూపొందించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. -
నంద్యాల ఉపఎన్నికలో 48 మంది నామినేషన్
-
నంద్యాల ఉపఎన్నికలో 30 మంది నామినేషన్
నూనెపల్లె: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. మొత్తం 30 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలుచేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 29 నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టినట్లు తెలిపారు. 30 మంది అభ్యర్థుల్లో 13 మంది ఇండిపెండెంట్లు కాగా, 17 మంది రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. నామినేషన్లను సోమవారం పరిశీలించి, ఉపఎన్నిక బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఉపఎన్నికలో 10,212 మంది కొత్త ఓటర్లు నంద్యాల ఉప ఎన్నికలో 10,212 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఏడాది జనవరిలో విడుదలచేసిన ఓటర్ల జాబితాలో 2,09,609 మంది ఉన్నట్లు నిర్ధారించారు. అయితే.. ఆ తర్వాత నూతనంగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ–రిజిస్ట్రేషన్, మాన్యువల్గా 15,734 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,212 మందిని అర్హులుగా నిర్ధారించిన ఆధికారులు.. మరో 5,522 దరఖాస్తులు బోగస్గా గుర్తించి పక్కన పెట్టేశారు. కొత్త ఓటర్లతో కలిపి మొత్తం 2,19,821 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొననున్నారు. -
ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం
-
ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం
ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్నికల నిఘా వేదిక వినతి సాక్షి, సిటీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణరావు, కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫిర్యాదు చేయొచ్చు : నంద్యాల ఉప ఎన్నికలో ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఫోన్ ద్వారా తెలిజయజేయవచ్చని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్ను జత పరిచామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల లిస్టులో 3,200 మందికి 2 చోట్ల ఓట్లు ఉండటాన్ని గుర్తించి తొలగించామని చెప్పారు. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల అక్రమాలపై 1950 టోల్ ఫ్రీ నంబర్కు, 08518–277305, 08518–277309లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఇరాన్లో ముగిసిన అధ్యక్ష ఎన్నికలు
టెహ్రాన్: ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆర్థిక, దౌత్య విధానాలపై ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు. ఇస్లాం అతివాది ఇబ్రహీం రైసీ(56) నుంచి రౌహానీకి గట్టి పోటీ ఎదురవుతోంది. దేశమంతా ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. దీంతో పోలింగ్ గడువును రెండు గంటలు పొడిగించారు. ఇరాన్ సుప్రీం నాయకుడిగా పరిగణించే అయాతుల్లా అలీ ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛ, అతి వాదుల మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని రౌహానీ ప్రజలకు పిలుపిచ్చారు. రౌహానీ దౌత్య విధానాలు విఫలమవడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని రైసీ విమర్శించారు. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నందునా వీటికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. -
నేడే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
అధ్యక్ష బరిలో రేసు మహేందర్రెడ్డి.. జెల్లి కనకయ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (టీహెచ్సీఏఏ) ఎన్నికలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో కొత్త కార్యవర్గ ఎన్నిక కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సంఘం అధ్యక్ష స్థానా నికి రేసు మహేందర్రెడ్డి, జెల్లి కనకయ్యలు పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి సురేందర్రెడ్డి, మహ్మద్ ముంతాజ్ పాషా, జలగం సంపత్కుమార్, కార్యద ర్శుల పోస్టులకు ఏడుగురు బరిలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఈసీ మెంబర్ల పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పోలింగ్ జరుగనుంది. దాదాపు 6 వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలో 82 శాతం పోలింగ్
⇒ రీపోలింగ్లో 6.18 శాతం తగ్గిన ఓటింగ్.. ⇒ 22న ఓట్ల లెక్కింపు సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 82.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారవడంతో ఈ నెల 9న జరిగిన పోలింగ్ రద్దైన విషయం తెలిసిందే. ఆ పోలింగ్లో 88.67 శాతం ఓటింగ్ నమోదవగా, రీపోలింగ్లో 6.18 శాతం తగ్గింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా సాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ సింగ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లతోపాటు ఇద్దరు వీడియోగ్రాఫర్లతో వీడియో తీయించామన్నారు. పోలింగ్ సరళిని అంబర్పేట ఇండోర్ స్టేడియం నుంచి పర్యవేక్షించామని, ఎక్కడా సమస్యలు దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రజత్కుమార్ హైదరాబాద్ నగరంలోని పలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆయా జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు అంబర్పేట స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లకు గట్టి బందోబస్తు మధ్య తరలించారు. అంబర్పేట స్టేడియంలో 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అద్వైత్కుమార్ తెలిపారు. -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం బయట, లోపల అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయడం కోసం జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయించారు. 852 ఓట్లకు గాను 851కి పోలయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ప్రభావం జిల్లా ఎన్ని కల అధికారుల మీద కూడా పడింది. పోలింగ్ సందర్భంగా చిన్న పాటి ఘర్షణలు, వివాదాలు కూడా చెలరేగకుండా ఉండటం కోసం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా ఉండేం దుకు తగిన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆధ్వర్యంలో పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు ఇతరులను అనుమతించలేదు. పోలింగ్ కేంద్రం బయట ఓటర్లను తనిఖీ చేసి మొబైల్ ఫోన్లు, పెన్నులు, ఇతర వస్తువులు లోనికి అనుమతించలేదు. గ్రూపుల వారీగా ఓటింగ్ ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉద యం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అధి కార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు గ్రూపులుగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాయుడుపేట, గూడూ రు, కావలి, ఆత్మకూరు కేంద్రాల్లో మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్ ముగిసింది. నెల్లూరు కేంద్రంలో కొడవలూరు మండలం కొత్త వంగళ్లు స్వతంత్ర ఎంపీటీసీ వెంకట కృష్ణయ్య కోసం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగించినా, ఆయన ఓటు వేయడానికి రాలేదు. గూడూరులో స్వల్ప ఉద్రిక్తత గూడూరులో టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో ప్రతిగా వైఎస్సార్పీ వర్గీయులు జైజగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని నెట్టివేశారు. ఓటేసిన ప్రముఖులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రముఖులు ఓటింగ్లో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరులో ఓటేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాదరావు, గూడూ రు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ గూడూరు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలోను, ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆత్మకూరులో ఓటు వేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. ఉదయగిరి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేక పోవడంతో ఆ నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటు లేదు. 20న ఓట్ల లెక్కింపు ఐదు రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులు శుక్రవారం సాయంత్రానికి నెల్లూరు ఎంపీడీవో కార్యాలయానికి చేరాయి. ఇక్కడ ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోలైన 851 ఓట్లలో చెల్లనివి తీసేసి మిగిలిన ఓట్లలో పోటీలోని ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరికి సగం వచ్చి ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలా కాక పోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తుం దని ఈ పరిస్థితి ఏర్పడితే మాత్రం తుది ఫలితం సాయంత్రం 4 గంటలకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్లో ఏపీ విద్యార్థులు
ఇన్స్పైర్ –2016లో విజేతలైన వారి ఆవిష్కరణల ప్రదర్శన సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ –2016లో విజేతలైన రాష్ట్ర విద్యార్థులు శనివారం ఢిల్లీలో ప్రారంభమైన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్లో తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏపీ నుంచి అరుగురు విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కె. నరేంద్ర రూపొందించిన ఆటోమేటిక్ హెల్మెట్ అందరినీ అకట్టకుంది. హెల్మెట్ పెట్టుకుంటేనే వాహనం స్టార్ట్ అయ్యేలా ఈ హెల్మెట్ను రూపొందించారు. ఆస్పత్రుల్లో పిల్లల అపహరణను అరికట్టేందుకు, సెలైన్ అయిపోగానే ఆలారం మోగేలా గుంటూరు జిల్లా విద్యార్థి శ్రీకృష్ణ వినూత్న పరికరాన్ని రూపొందించారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ఓటు హక్కు వినియోగించుకొనేలా అనంతపురం జిల్లా విద్యార్థి శ్రీనేష్ సరికొత్త వ్యవస్థను రూపొందించాడు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బిబి ఆయేషా అరటి కాండంతో వివిధ రకాల వస్తువులను తయారు చేసుకొనే విధానాన్ని ప్రదర్శించింది. విశాఖకు చెందిన శిరీష వాటర్ హాయెసెంట్ను రూపొందించింది. ప్రజల ఆర్యోగ సమస్యలకు ప్రధాన కారణమైన వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ‘ఆక్వా సైలెన్సర్’ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణలపై విద్యార్థులతో పాటు వచ్చిన ఉపాధ్యాయులు స్పందిస్తూ.. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనల ద్వారా రూపొందించిన అవిష్కరణలపై పేటెంట్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆవిష్కరణల్లో కొన్నింటిని ఎంపిక చేసి త్వరలో జపాన్లో జరిగే ఫెస్టివల్ ఇన్నోవేషన్కు పంపనున్నట్టు వారు తెలిపారు. -
ఓటు హక్కుకు మీరెందుకు దూరం
పట్టణవాసులను ప్రశ్నించిన గవర్నర్ ఎన్నికలప్పుడు పెట్టిన కేసులు, సీజ్ చేసిన నగదు ఏమవుతోంది ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు అవసరం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటరుగా నమోదు చేసుకుంటున్నప్పటికీ హక్కును విని యోగించు కోవడంలో దూరంగా ఉంటు న్నారు. పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కొంత మెరుగ్గా ఉంది. చైతన్య వం తులైన పట్టణ వాసులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దేశానికి చాలా నష్టం.’అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసిం హన్ అభిప్రాయపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బుధవారం రవీంద్రభారతిలో జరి గిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా ఉండడం బాధాక రమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సిన ఆవ శ్యకత ఉందన్నారు. ‘నేను గవర్నర్గా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడు తున్నా.. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే తల వంపులు కలిగించే విషయం. ఎన్నికల సందర్భంగా వేల కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా రూ.కోట్ల నగదును సీజ్ చేయడం జరు గుతుంది. అయితే ఈ కేసుల పరిశీలన, తీర్పులపై ఎలాంటి సమాచారం ఉండదు. అదే విధంగా పట్టుబడ్డ నగదు ఎక్కడ జమవుతోంది?. ఇలాంటి సందేహాలు ఎక్కువ శాతం ఒటర్ల మదిని ప్రశ్నిస్తు న్నాయి.’ అని అన్నారు. ఎన్నికల కేసులను మూడు నెలల్లో పరిష్కరిం చాలనే నిబంధన తీసుకురావాలని, బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. యువత ప్రశ్నించే విధా నాన్ని అలవర్చుకోవాలని, ఓటు వేసి అత్యు త్తమ ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేయాల న్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వ ర్లాల్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియో గించుకోకపోవడంతో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామన్నారు. ఓటర్లు సైతం పోటీ తత్వా న్ని అలవర్చుకోవాలని, ఉద్యమంలా ఓటు హక్కును వినియోగించుకుంటే స్వచ్చమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. అనంతరం నేషనల్ ఓటర్స్డే పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, విధుల్లో అత్యు త్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యో గులకు గవర్నర్ బహుమతులు అందజేశారు. -
‘ఓటు’ అందరి హక్కు..!
పాలనలో మార్పునకు ‘వజ్రాయుధం’ ప్రజాస్వామ్య దేశంలో ఇది కీలకం 18 ఏళ్లు నిండితే తప్పనిసరి యువత అవగాహన కల్గి ఉండాలి నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశంలో ఓటు వజ్రాయుధం.. దేశపాలనలో దీనిపాత్ర కీలకం..ఓటుహక్కుతో అవినీతి పారద్రోలడానికి వీలుంటుంది. ఓరాజకీయ నాయకుడిని గద్దెనెక్కించాలన్నా.. గద్దె దించాలన్నా దేశపౌరుడికి ఓటుహక్కు తప్పనిసరి.ఓటుహక్కుతో ప్రశ్నించే అధికారం ఉంటుంది.దేశభవిష్యత్ యుతవ చేతుల్లో ఉన్నందున యువత ఓటు హక్కును గురించి అవగాహన కలిగి ఉండాలి. ఓటు విలువను ప్రజలకు చాటిచెప్పాలి.. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – ఆదిలాబాద్ అర్బన్, మంచిర్యాల టౌన్ ప్రజాస్వామ్య దేశంలో మనల్ని మనం పరిపాలించుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప అవకాశం ‘ఓటు’. పాలనలో మార్పునకు ఓటు వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును నమోదు చేసుకోవాలని భారత ఎన్నికల సంఘం సూచిస్తోంది.కానీ అవగాహన లేక చాలామంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. జిల్లాలో గతేడాది ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వచ్చాయి. వీటిని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో జాతీయ ఓటరు దినోత్సవం అందిస్తారు. వీరితో పాటు సీనియర్ సిటిజన్లను బ్యాడ్జీలతో సత్కరిస్తారు. ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు.. ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 16,89,790 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,46,989 మంది, మహిళలు 8,42,594 మంది ఉన్నారు. ఇతరులు 207 మంది ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే మహిళలు 62శాతం, పురుషులు 65శాతం ఉన్నారు. 2016 జూన్ నుంచి నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ప్రతి ఏడాది నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమం గతేడాదిలో చేపట్టలేదు.దీంతో ఓటుహక్కుపై యువతకు ఓటుహక్కుపై అవగాహన లేకుండా పోయింది. ఓటరు దినోత్సవమే లక్ష్యం జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఆవి ర్భవించింది. రోజును ఓటర్ల దినోత్సవం గా ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ రోజున ఈ యేడాది జనవరికి ఒక టో తేదీనాటికి 18ఏళ్లు నిండిన దేశపౌరుడిని ఓటరు జాబితాలో చేర్పించి వారికి ఓటరు గుర్తింపు కార్డులు అందజేసి ఓటు హక్కును కల్పిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచుతారు. గ్రామాల్లో ర్యాలీలు చేపడుతారు. ఊరూరా ఓటుహక్కు ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారు. నేడు మరో అవకాశం ఓటర్ల దినోత్సవం సందర్భంగా నాలుగు జిల్లాల పరిధిలోని 2,322 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్వోలు అందుబాటులో ఉండి ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో, ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచుతారు. ఈరోజు ఓటరు కార్డులో తప్పులు సవరించడం, ఫొటోను సరి చేసుకోవడానికి వీలుంటుంది. తొలి ఓటు హక్కు 1950 జనవరి 25న మొట్టమొదటిసారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1952లో మొట్ట మొదటిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్న టీఎన్ శేషన్ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు. -
ఓటరుజాబితా సవరణకు త్వరలో నోటిఫికేషన్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ భీమారం: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన దృష్ట్యా ఓటరు జాబితా సవరణ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఓటు హక్కు వినియోగం’పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న అనం తరం భన్వర్లాల్ విలేకరులతో మాట్లాడుతూ 1 జనవరి 2017 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై చైతన్య పరచడానికి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నా మని, వారి సూచనలు పరిశీలిస్తామని భన్వర్లాల్ తెలిపారు. -
12న ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ అన్నవరం/రాజానగరం: త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలియజేశారు. మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, రెండు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే మార్చి 29లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. శనివారం ఆయన సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలోని సప్తగిరి అతిధి గృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, వీరికి ఓటరు దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన వారి కలర్ ఫొటోతో కూడిన ఓటరు కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. తాను ఏ గుర్తుపై ఓటు వేసిందీ ఓటరుకు కనిపించేలా ఓటింగ్ యంత్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేస్తోందని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఈవి«ధానం అమల్లోకి వస్తోందన్నారు., 2019 సంవత్సరంలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా వస్తాయని తెలిపారు. సమర్థులను ఎన్నుకోండి యువతకు ఓటు హక్కు వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే సమర్థవంతవంతమైన పాలకులను ఎన్నుకునే వీలుంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దివాన్చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో భావిఓటర్లతో శనివారం సాయంత్రం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానాలిచ్చారు. -
అవినీతి కేసుల్లో దర్యాప్తును ఆపరాదు
- ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చింది - అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ కోర్టుకు ఉంది - హైకోర్టుకు నివేదించిన ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు - తదుపరి విచారణ నేటికి వారుుదా సాక్షి, హైదరాబాద్: అవినీతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ‘ఓటుకు కోట్లు’కేసులో హైకోర్టుకు నివేదించారు. అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉందని, దాని అధికారాలను హరించే హక్కు ఈ కోర్టుకు లేదని వివరించారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉన్నా...విచారణ పరిధిని అతిక్రమించి ఈ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. కేసు తొలిదశలోనే, సాక్షులను విచారించకుండానే దర్యాప్తును నిలిపివేయడం సరికాదన్నారు. ఏసీబీ కోర్టు దర్యాప్తు(ఇన్వెస్టిగేషన్) చేసి నివేదిక సమర్పించమని ఆదేశించిందని, తమ ఉద్దేశం ప్రకారం ఇన్వెస్టిగేషన్, ఎంక్వరుురీ పర్యాయ పదాలేనని తెలి పారు. అలాగే ఓటుహక్కు వినియోగించుకోవడం పబ్లిక్డ్యూటీలో భాగమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. అవినీతి ఆరోపణల కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదంటూ అత్యున్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను ఈ సందర్భంగా పొన్నవోలు కోర్టు దృష్టికి తెచ్చారు. ‘ఓటుకు కోట్లు’కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగట్లేదని, ఈ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నా ఆ దిశగా ఏసీబీ దర్యాప్తు చేయట్లేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రరుుంచారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచగా.. ఈ వ్యవహారంపై 4 వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సునీల్చౌదరి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ‘‘రాజకీయ ప్రోద్బలంతో ఆర్కే పిటిషన్ వేశారనడం సరికాదు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు సంపాదించడాన్ని తప్పుబట్టడం సరికాదు. తమ వాదనలో బలముందా లేదా అన్నదే పరిశీలించాలి’’అని పొన్నవోలు వివరించారు. కోర్టు సమయం ముగియడంతో...న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వారుుదా వేశారు. -
‘అగ్ర’ పీఠం కోసం నువ్వా.. నేనా?
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత విద్వేషపూరిత ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న 4.2 కోట్ల మంది - ఫలితం తారుమారు చేయనున్న స్వింగ్ స్టేట్స్ - ఫ్లోరిడా, ఒహయో, న్యూహ్యాంప్షైర్, నెవడా, పెన్సిల్వేనియా, వర్జీనియాలపై ఆసక్తి - తాజా సర్వేలో హిల్లరీకి 292 ఎలక్టోరల్ ఓట్లు; నేనే గెలుస్తా: ట్రంప్ వాషింగ్టన్: పరస్పర ఆరోపణలు... విద్వేష ప్రసంగాల మధ్య అమెరికన్లకే అసహ్యం పుట్టించేలా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. శ్వేతసౌధ అధిపతిని ఎన్నుకునే అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. చివరి నిమిషం వరకూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్లు ప్రచారంలో కత్తులు దూసుకున్నారు. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని హిల్లరీ అస్త్రాలుగా చేసుకోగా, ఈమెరుుల్ వివాదంలో ఆమె దోషి అని ట్రంప్ విరుచుకుపడ్డారు. దేశాధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంత వివాదాస్పద, విద్వేషపూరిత ప్రచారం ఎన్నడూ జరగలేదన్నది విశ్లేషకుల, సర్వేల అభిప్రాయం. చివరి నిమిషంలో హిల్లరీ వర్గానికి ఎఫ్బీఐ ఊరట నిస్తూ.. ఈమెరుుల్ వివాదంలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోమంది. ఈఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ అవుతారు. ట్రంప్ గెలిస్తే అత్యధిక వయసున్న అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పటికే 4.2 కోట్ల మంది ముందస్తుగా ఓటేశారు. నార్త్ కరోలినాలో హిల్లరీ, మిచిగన్లో ట్రంప్: తన చివరి ప్రచారాన్ని హిల్లరీ సోమవారం అర్ధరాత్రి(భారత కాలమానం మంగళవారం మధ్యాహ్నం) నార్త్ కరోలినాలో ముగిస్తుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మిచిగన్లోని గ్రాండ్ రాపిడ్స ప్రచారానికి ముగింపు పలుకుతారు. అమెరికా గుర్తింపును నాశనం చేస్తోన్న విదేశీ శక్తుల్ని వెనక్కి పంపేందుకు ఈ ఎన్నికలు చివరి అవకాశమని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. మహిళలు, మైనార్టీల సమానత్వం దిశగా దేశ ప్రయాణం ప్రమాదంలో పడొచ్చని హిల్లరీ హెచ్చరించారు. స్వింగ్స్టేట్స్లో మాదేగెలుపు: ట్రంప్ ఫలితాన్ని నిర్ణరుుంచే రాష్ట్రాల్లో రిపబ్లికన్ ఆధిక్యంలో ఉందని, శ్వేతసౌధంలో తన ప్రవేశానికి రంగం సిద్ధమైందని సోమవారం ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు మీడియా, పోల్ సంస్థల్ని ఆశ్చర్యపర్చడం ఖాయమన్నారు. ‘మనం గెలవబోతున్నాం. కొలరాడోలో గెలుస్తాం. నెవెడాలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నార్త్ కరోలినా, వర్జీనియాలో మన పార్టీ పుంజుకుంది. ఫ్లోరిడాను గెలవబోతున్నాం’ అని అని అన్నారు. చివరి రెండు రోజుల్లో ట్రంప్ అయోవా, కొల రాడో, మిన్నియాపొలిస్, మిచిగన్, పెన్సిల్వేనియాలో ర్యాలీలు నిర్వహించారు. హిల్లరీ పెన్సిల్వేనియా, ఒహయో, న్యూ హ్యాంప్షైర్ ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ ఉద్యోగులపై ట్రంప్ అక్కసు..అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ముస్లింలు అమెరికాలో ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, మెక్సికో సరిహద్దు వెంట గోడ కట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసవాదుల్ని రేపిస్టులు, నేరస్తులుగా చిత్రీకరించారు. 2005 నాటి వీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడి తీవ్ర దుమారం సృష్టించారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చాక... 12 మంది మహిళలు ట్రంప్కు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ తెరపైకి వచ్చారు. ఇక సొంత పార్టీలోనే అనేక మంది ట్రంప్కు మద్దతివ్వలేదు. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎన్నికల ఫలితం వెలువడ్డాకే... దాన్ని అంగీకరించాలా? లేదా? అన్నది స్పష్టం చేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆదివారం కూడా ట్రంప్ భారత ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. మిన్నియాపొలిస్లో మాట్లాడుతూ... ఐబీఎం 500 మంది ఉద్యోగుల్ని తొలగించి భారతీయ, ఇతర దేశాల ఉద్యోగుల్ని నియమించుకుందని ఆరోపించారు. తాను అధ్యక్షుడినైతే అలాంటి కంపెనీలపై 35 % పన్ను విధిస్తానని హెచ్చరించారు. ఫ్లోరిడాలో, ఒహయో, న్యూహ్యాంప్షైర్ ఫలితాలపై ఆసక్తి అమెరికాలో పోలింగ్ (ఈస్ట్రన్ టైం జోన్ రాష్ట్రాల్లో) భారత కాలమానం ప్రకారం నవంబర్ 9 ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. అలాస్కాలో నవంబర్ 9 మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. జార్జియా, సౌత్ కరోలినా, వెర్మాంట్, ఇండియానా, కెంటకీల్లో నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం జార్జియా నుంచి వెలువడే అవకాశముంది. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్స ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అరగంట అనంతరం ... ఒహయో, నార్త్ కరోలినా ఫలితాలు వస్తారుు. ఒహయోలో హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా... నార్త్ కరోలినాలో రిపబ్లికన్లు కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అసలు ఆసక్తి అంతా ఫ్లోరిడాపైనే. ఏదైనా తేడా జరిగితే తప్ప ఈ రాష్ట్రం ఎవరి ఖాతాలోకి వెళ్తే వారే అమెరికా అధ్యక్షుడు అవడం ఖాయం. న్యూ హ్యాంప్షైర్ ఫలితం కూడా ఆసక్తి కలిగించేదే. మొదటి నుంచి డెమోక్రాట్లకు పట్టున్న ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొంది. అరిజోనా, టెక్సాస్ ఫలితాలు మాత్రం హిల్లరీకి నిరాశ కలిగించడం ఖాయం. డెమోక్రాట్లకు పట్టున్న కొలొరాడో, మిచిగన్, విస్కాన్సన్లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నారుు. హిల్లరీనే విజేత: సర్వే ఎన్నికలకు రెండ్రోజుల ముందు నిర్వహించిన పోల్స్ హిల్లరీనే విజేతగా తేల్చేశారుు. నవంబర్ 7న ఫైవ్థర్జీఎరుుట్ వెబ్సైట్ పోల్ ప్రకారం హిల్లరీకి 65.3 శాతం గెలుపు అవకాశాలున్నారుు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో హిల్లరీకి 292, ట్రంప్కు 245 ఓట్లు వస్తాయి. సీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం హిల్లరీకి 45 శాతం, ట్రంప్కు 41 శాతం మద్దతు పలికారు. ఇక రియల్క్లియర్ పాలిటిక్స్ సరాసరి పోల్స్లో హిల్లరీ కంటే ట్రంప్ 2 పారుుంట్లు వెనకబడ్డారు. ట్రంప్కు 245 ఓట్లు వస్తారుు. హిల్లరీకీ 48.3 శాతం, ట్రంప్కు 45.4 శాతం పాపులర్ ఓట్లు వస్తాయని వెబ్సైట్ పేర్కొంది. హిల్లరీకి ఎఫ్బీఐ తీపి కబురు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరొక రోజు సమయం ఉందనగా హిల్లరీ క్లింటన్కు ఎఫ్బీఐ తీపి కబురు అందించింది. ఈమెరుుల్ వివాదంలో అమెపై క్రిమినల్ నేరారోపణ అవసరం లేదని తేల్చిచెప్పింది. కొత్తగా వెలుగుచూసిన ఈమెరుుల్స్ క్షుణ్నంగా పరిశీలించాక ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి గెలుపు మరింత సులభం కానుంది. ఎఫ్బీఐ డైరక్టర్ జేమ్స్ బి కోమే వివరాలు వెల్లడిస్తూ...‘మా సమీక్ష ప్రకారం.. జూలైలో మేం వెల్లడించిన అభిప్రాయాన్ని ప్రస్తుతం మార్చుకోలేదు. 24 గంటలూ మా సిబ్బంది పనిచేసి మొత్తం ఈమెరుుల్స్ను పరిశీలించారు. క్రిమినల్ నేరం మోపాల్సిన వివరాలేమీ దొరకలేదు’ అని పేర్కొన్నారు. ఈ పరిణామంతో క్లింటన్ శిబిరం ఆనందంలో మునిగిపోరుుంది. 2 వారాల క్రితం హిల్లరీ తాజా ఈమెరుుల్స్ వివాదంతో ఒక్కసారిగా ఆమె ఆధిక్యం తగ్గిపోరుుంది. ఒక దశలో ట్రంప్ హోరాహోరీ పోరు ఇచ్చారు. ఎఫ్బీఐ తాజా ప్రకటనను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతూ హిల్లరీని కాపాడుతున్నారని ఆరోపించారు. ఎఫ్బీఐ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నానని, ఇంత తక్కువ సమయంలో 6.5 లక్షల మెరుుల్స్ను ఎలా పరిశీలించారంటూ ప్రశ్నించారు. హిల్లరీ దోషి అని, అది ఆమెకు, ఎఫ్బీఐకు తెలుసని చెప్పారు. -
15 ఏళ్లకే పెళ్లి.. 18ఏళ్లకి తల్లి !
-
చిన్నారి పెళ్లికూతుళ్లు
అమ్మాయిల ముందస్తు వివాహాల్లో ఏపీ టాప్ - 15 ఏళ్లకే పెళ్లి.. 18కి తల్లి! - తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ తగ్గని బాల్య వివాహాల సంఖ్య - నిర్ణీత వయసు వచ్చాక పెళ్లి చేసుకుంటేనే తల్లీబిడ్డకు రక్షణ సాక్షి, హైదరాబాద్ : ఓటు హక్కు 18 ఏళ్లు నిండిన తర్వాతే వస్తుంది. పెళ్లి కూడా అమ్మాయికి 18 ఏళ్లు నిండాక చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని వైద్యులు చెబుతారు. 21 ఏళ్లు నిండాక తల్లయితే బావుంటుందని కూడా వైద్యుల సూచన. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో 15 ఏళ్లకే పెళ్లయ్యే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక 18 ఏళ్లకే ఇద్దరు బిడ్డల తల్లిగా మారుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇలా తక్కువ వయసులో వివాహాలు, బిడ్డలు కనడం కారణంగా 30 ఏళ్లు కూడా నిండక ముందే వివిధ శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న యువతుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు స్త్రీ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. ఏపీలో 15.9 శాతం మందికి 15 ఏళ్లకే పెళ్లి రాష్ట్రంలో ఏటా 5 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతుంటాయని ఆస్పత్రులకు ప్రసవానికి వచ్చే గర్భిణుల సంఖ్యను బట్టి అంచనా. ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు, ప్రసవాల గణాంకాలతో పాటు, జిల్లా స్థాయి హౌస్ హోల్డ్ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ లెక్కను బట్టి రాష్ట్రంలో 15.9 శాతం మంది బాలికలు 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేసుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది 18 ఏళ్లు నిండక మునుపే తొలి బిడ్డకు, 20 శాతం మంది రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్లు ప్రసవాలను బట్టి తెలుస్తోంది. ఇదే పురుషుల్లో 21 ఏళ్లు నిండక మునుపే పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య 14.7 శాతం ఉంది. రెండో స్థానంలో తెలంగాణ తెలంగాణలో సైతం ఇదే పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఎర్లీ మ్యారేజెస్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటే.. తెలంగాణలో మాత్రం 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకుంటున్న యువకుల సంఖ్య 11.8 శాతం ఉంది. ముందస్తు వివాహాల్లో అమ్మాయిల కంటే 1.1 శాతం అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. చిన్న వయసులో తల్లి కావడం ప్రమాదకరం చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల రీ ప్రొడక్టివ్ (బిడ్డలను కనడం)కు కావల్సిన సామర్థ్యం అమ్మాయిల్లో ఉండదు. చిన్న వయసు, ఎదుగుదల లేని కారణంగా కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చే మార్గం తగినంత పెద్దదిగా ఉండ దు. దీనివల్ల సిజేరియన్ ద్వారా బిడ్డను తీయాల్సి రావడం, ఆ తర్వాత రకరకాల శారీరక సమస్యలు వస్తాయి. చిన్న వయసులో గర్భిణి కావడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుం ది. ఒక్కోసారి కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం చాలా ఉంది. - డా.బబిత మాటూరి,స్త్రీల వైద్య నిపుణురాలు, హైదరాబాద్ -
జీఎస్టీ మండలికి కేబినెట్ ఆమోదం
-
జీఎస్టీ మండలికి కేబినెట్ ఆమోదం
ఈ నెల 22, 23 తేదీల్లో తొలి సమావేశం - ఐఐటీ, ఐఐఎంల్లో పరిశోధనల కోసం నూతన సంస్థ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసే పనిని వేగవంతం చేస్తూ.. జీఎస్టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి సచివాలయానికి కూడా ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఈ మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యుడిగా కొనసాగుతారని, అయితే ఓటు హక్కు ఉండదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. రాష్ట్రాల రెవెన్యూ, వాణిజ్య పన్నుల మంత్రులు లేదా ఇతర మంత్రులైవరినైనా జీఎస్టీ మండలికి సిఫార్సు చేయొచ్చన్నారు. కాగా, విద్యాసంస్థల్లో నూతనఆవిష్కరణలకు ఊతమిచ్చేలా సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటీలు, ఐఐఎంల్లో పరిశోధన ఆధారిత వసతుల కల్పనకు ఈ సంస్థ రూ. 20 వేల కోట్ల నిధులిస్తుంది. 20 లక్షల టన్నులకు పప్పుదినుసుల నిల్వలు దేశంలో పప్పుదినుసుల నిల్వల్ని ప్రస్తుతమున్న 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై నియమించిన కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. -
‘ఓటు’పై పాఠం...
- పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం - కమిటీని నియమించిన సాధారణ పరిపాలన శాఖ సాక్షి, హైదరాబాద్ : ఓటు హక్కు, వినియోగంతో పాటు ఓటుకు సంబంధించి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే అవగాహన కలిగించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎలక్టోరల్ లిటరసీ’ని పాఠ్యాంశంగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. కళాశాలల్లోనూ దీనిని ప్రవేశపెడతారు. దీనికోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం జీఓ విడుదల చేసింది. ఈ కమిటీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చైర్మన్గా, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, డెరైక్టర్, ఇంటర్మీడియెట్బోర్డు కార్యదర్శి, ఎన్సీఈఆర్టీ డెరైక్టర్, అకడమిక్ నిపుణులు సభ్యులుగా ఉంటారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న పౌర, సాంఘిక శాస్త్రంలోని అంశాలను పరిశీలించి ఎలక్టోరల్ లిటరసీని ఏవిధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలో సూచనలను కమిటీ మూడునెలల్లో నివేదిక రూపంలో అందించనుంది. -
రేపే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు
- తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణకు సిద్ధం - ఓటుహక్కు వినియోగించుకోనున్న 49,600 మంది సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, కార్యాలయాలు, వర్క్షాపుల్లో పోలింగ్ జరగనుంది. 49,600 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. పది సంఘాలు పోటీలో నిలిచినా.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో టీఎంయూ -ఈయూ కలసి పోటీ చేసి సంయుక్త విజేతలుగా నిలిచాయి. ప్రస్తుతం అవి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కాగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య తాజా కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రతినెలా తమ వేతనం నుంచి కొంత మొత్తం కోత పెట్టుకుని పోగుచేసుకునే ‘కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ నిధులను, పదవీ విరమణ, కార్మికులు చనిపోతే అందే ఆర్థిక సాయం నిధులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో కార్మికులకు రుణా లు ఆగిపోయాయి. వాటిని తిరిగి జమకట్టేం దుకు ఆర్టీసీ వద్ద నిధుల్లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటంతో కార్మికుల కుటుంబా లు ప్రైవేటు అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయి. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం టీఎంయూ అధికార టీఆర్ఎస్తో సఖ్యతగా ఉంటోందన్న ప్రచారముంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ సమీక్షకు కేవలం ఆ సంఘం నేతలకే ప్రవేశం లభించటం గమనార్హం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ సంఘానికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ సంఘం గెలిస్తే కార్మికుల పక్షాన ప్రభుత్వంతో పోరాడలేదని మిగతా సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే... ఇతర సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు గెలుపు తమదేనని టీఎంయూ నేతలు విశ్వాసంతో ఉన్నారు. వేతన సవరణ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలలో బాండ్ల రద్దు, సర్వీసులో చనిపోయిన కార్మికులకు రికవరీ లేకుండా రూ.6 లక్షలు చెల్లింపు తదితర హామీలతో ఎన్ఎంయూ ధీమాగా ఉంది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, 44 శాతం ఫిట్మెంట్, గ్రేడ్ పే విధానం అమలు వంటివి తమ విజయాలేనని ఈయూ చెప్పుకొంటోంది. -
ఓటు వేయని సూర్య
తమిళసినిమా: నూరు శాతం ఓట్లు నమోదు కావాలి.అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య తన ఓటును వృథా చేయడం విమర్శలకు దారి తీసింది. సోమవారం జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో సూపర్స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలహాసన్ విదేశాల్లో తన షూటింగ్ను కూడా రద్దు చేసుకుని ఓటు వేశారు.ఇక ఓటు వేస్తారో లేదో అని పరిశ్రమ వర్గాల్లో చర్చకు తావిచ్చిన నటుడు అజిత్ కూడా ఉదయాన్నే సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్నికల అధికారులు నిర్వహించిన ఓటు యొక్క అవశ్యకతను వివరించే ప్రచార చిత్రాలలో నటించి అందురూ ఓటు వేయండి, నూరు శాతం పోలింగ్ నమోదు కావాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య ఓటు వేయకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికా వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికల కమీషన్ ఓటర్ల పట్టికలో ఓటర్ల పేర్లను సరిగా నమోదు చేయడంలోనూ,ఓటర్ల ఫోటోలను సక్రమంగా పొందుపరచడంలోనూ దృష్టి సారించకుంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసి సినీ తారలతో ఓటింగ్పై అవగాహనా ప్రచార చిత్రాలను రూపొందించి టీవీ.చానళ్లలో ప్రచారం చేయడానికే అధిక ప్రాముఖ్యత నిచ్చారు.అలా ప్రచార చిత్రాలలో నటించిన నటుల్లో సూర్య ఒకరు. అలాంటి ఆయన తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికాలో కూర్చున్నారు.దీని గురించి ఆయన వివరణ రూపంలో ఒక ప్రకటన విడుదల చూస్తూ తాను ఓటింగ్ రోజుకు చెన్నైకి తిరి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయినా అనివార్యకారణాల వల్ల చెన్నైకి చేరుకోలేక పోయాననీ,ఆన్లైన్ లాంటి ఇతర సోర్సెస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాలేదనీ పేర్కొన్నారు. తాను అందరికీ ఓటు వేయమని చెప్పి తాను ఓటు వేయనందుకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు పార్టీల గురించి తెలియని ఒక నిరుపేద నటి డబ్బు కోసం డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటిస్తే విమర్శలు గుప్పించిన వారు ఒక ప్రముఖ నటుడు తన ఓటును దుర్వినియోగం చేయడంపై మాట్లాడరా అన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపై ఎన్నికల కమీషన్ తారలతో అవగాహనా ప్రచార చిత్రాలు చేయడం మానుకోవాలనే గొంతు వినిపిస్తోంది. -
స్టార్స్ ఎట్రాక్షన్
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున తారలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, లోకనాయకుడు కమలహాసన్ అందరి కన్నా ముందుగా ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఇక, ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలన్న ఆకాంక్షను తారలు వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నటీ నటులు ఉదయాన్నే తమ తమ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బా రులు తీరారు. కొందరు అయితే, క్యూలో నిలబడి తామూ సాధారణ వ్యక్తులమే అని చాటుకున్నారు. మరి కొందరికి అభిమానుల తాకిడి పెరగడంతో నేరుగా పోలింగ్ బూతుల్లోకి దూ సుకెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజ నీ కాంత్ స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రానికి ఉదయం ఏడు గంటలకే వచ్చేశారు.ఆయన రాకతో అక్కడ హడావుడి, మీడియా హంగా మా బయలు దేరింది. ఏడు గంటల పది నిమిషాలకు తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన శర వేగంగా తన వాహనం ఎక్కేశారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక సంకేతాన్ని ఇచ్చే కథానాయకుడు ఈ సారి మీడియా గుచ్చి గుచ్చి ప్ర శ్నించినా తన దైన శైలిలో చిరునవ్వులు చింది స్తూ , చివరగా ఎవరు అధికారంలోకి వస్తారో తనకు తెలియదంటూ ముందుకు సాగారు. ఆళ్వార్ పేటలోని పోలింగ్ కేంద్రానికి ఏడున్నర గంటలకు నటి గౌతమి, తన కుమార్తె అక్షరతో కలిసి లోక నాయకుడు కమల హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం అనుకున్నది జరగవంటూ ఎవరు అధికారంలోకి వస్తా రో అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంద రూ ఓటు హక్కును వినియోగించుకుంటే, ప్రజా స్వామ్యానికి ఆయుష్షు మరింతగా పెరిగి నట్టు అని, మంచి వాళ్లు అధికారంలోకి రావాలంటూ ముందుకు సాగారు. వేళచ్చేరిలోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణి,నటి షాలినీ తో కలిసి నటుడు అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన క్యూలో నిలబడి మరి తానూ సామాన్యుడినే అని చాటుకున్నారు. నీలాంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఇళయదళపతి విజయ్ రాగానే, అభిమానుల తాకిడి పెరిగింది. పోలీసు భద్రత నడుమ ఆయన లోనికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీ నగర్ హిందీ ప్రచారసభ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో నటుడు కార్తీ, ఆయన తండ్రి శివకుమార్ ఓటు వేశారు. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎవరు అధికారంలో కి వచ్చినా సరే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని విన్నవించారు. అన్నదాతల సంక్షేమార్థం చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా కార్తీ విన్నవించారు. వలసరవాక్కంలోని నటు డు శివ కార్తికేయన్, సైదాపేటలో నటి మీనా, అన్నానగర్లో నటుడు విశాల్, ఆర్య, టి నగర్లో నటుడు టి రాజేందర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వలసర వాక్కంలో నటి రంభ, దర్శకుడు హరి, ఆళ్వార్ పేటలోనటుడు సిద్ధార్థ్, నటి త్రిష, టీనగర్లో దర్శకులు భారతీ రాజా, శంకర్, ఇక, నటి రాధిక, కుటుంబ సమేతంగా నటుడు ప్రభు, స్నేహ, ప్రసన్న దంపతులు,హాస్యనటుడు వివేక్, రచయిత వైరముత్తు, నటుడు ఎస్వీ శేఖర్, లత రజనీ కాంత్, సౌందర్య రజనీ కాంత్, ఐశ్వర్య రాజేష్, లారెన్స్లతో పాటుగా చెన్నై నగరంలో ఉన్న నటీ నటులు , సహాయ నటులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక, మదురైలో జోరు వాన కురుస్తున్నా గొడుగు చేత బట్టినటుడు శశికుమార్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాలిగ్రామంలో ఓటు వేసినానంతరం రంభ మీడియాతో మాట్లాడుతూ మంచి వాళ్లు అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. హాస్యనటుడు వడి వేలు మాట్లాడుతూ, మీడియా ప్రశ్నల న్నింటికీ దాట వేత ధోరణి అనుసరించారు. ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది గందరగోళమేనని, ప్రజలకు మంచి చేసే వాళ్లెవరో ప్రజలకు తెలుసునని, అందరూ ఓటు వేద్దామని ముగించారు. -
103 ఏళ్లకు తొలి ఓటు
కోల్కతా: అస్గర్ అలీ వయసు 103. ఆయన తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాడు. మే 5న జరిగే బెంగాల్ చివరి దశ ఎన్నికల్లో అస్గర్ ఓటు వేయబోతున్నాడు. ఆయన కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హంత నియోజకవర్గానికి చెందిన మధ్య మశల్దంగ ప్రాంత నివాసి. ఇది ఇంతకు పూర్వం బంగ్లాదేశ్ అధీనంలో ఉండేది. 5 నియోజక వర్గాల్లోని 38 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 9776 మంది బంగ్లా నుంచి బదిలీ అయిన పౌరులు ఈ దశలో ఓటు వేయనున్నారు. -
ఓట్లేసుడే..
♦ పురుషులు 1,30,917 ♦ మహిళలు 1,34,793 ♦ 291 మంది అభ్యర్థులు.. ♦ 265 పోలింగ్ స్టేషన్లు ♦ పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ ♦ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఖమ్మం : ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 50 డివిజన్లలో బరిలో నిలిచిన 291 మంది అభ్యర్థులకు అనుగుణంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. వాటిని ముందస్తుగా పరిశీలించారు. బీఎల్ఓల ద్వారా పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. దీనికోసం ప్రభుత్వ మహిళా కళాశాలలో పోలింగ్ అధికారులకు, సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చి.. నియమావళిపై వివరించారు. 2,65,710 మంది ఓటర్లు 50 డివిజన్లలో 1,30,917 పురుషులు, 1,34,793 మంది మహిళలు మొత్తం 2,65,710 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక ఏపీఓ, నలుగురు ఉద్యోగులను నియమించారు. 10 మంది రిటర్నింగ్ అధికారులు, 50 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి.. ప్రతీ డివిజన్ వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సంఖ్య తదితర అంశాలను సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 10 మోడల్ కోడ్ టీంలు, 10 ఖర్చుల వ్యవహార బృందాలు, 5 వీడియో బృందాలు, 5 గణాంక బృందాలతోపాటు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతోపాటు 1,500 మేరకు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు ప్రకటించారు. బరిలో 291 మంది వివిధ పార్టీలకు చెందిన 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ నుంచి 48 మంది, కాంగ్రెస్ నుంచి 42, టీఆర్ఎస్ నుంచి 50, టీడీపీ నుంచి 48, 40 మంది సీపీఎం, 8 మంది సీపీఐ అభ్యర్థులతోపాటు 42 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. సర్వం సిద్ధం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తోంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల ప్రక్రియ కార్పొరేషన్లో నిర్వహిస్తూనే.. మరోవైపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఈవీఎంలను భద్రపరచడం, ఓట్ల లెక్కింపు కోసం పత్తి మార్కెట్ను ఆధీనంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశారు. శనివారం జేసీ దివ్య, ఆర్డీఓ వినయ్కృష్ణారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, డీఎస్పీ సురేష్కుమార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల పనితీరును పరిశీలించి.. సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ఎన్నికల నియమావళిని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 305 ఈవీఎంల వినియోగం ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 305 ఈవీఎంలు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒకటి చొప్పున 265తోపాటు ఎక్కడైనా ఈవీఎంలు పనిచేయకపోవడం.. ఇతర కారణాలతో నిలిచిపోతే వెంటనే మరో ఈవీఎంను వినియోగించుకునేందుకు మరో 50 ఈవీఎంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. -
నాలుగో తరగతి విద్యార్థికి ఓటుహక్కు
ముస్తాబాద్: సెస్ ఎన్నికల్లో ముస్తాబాద్కు చెందిన నాలుగో తరగతి విద్యార్థి కె.వరుణ్కు అధికారులు ఓటుహక్కు కల్పించారు. వరణ్ పేరుతో కరెంట్ కనెక్షన్ ఉండడంతో సెస్ అధికారులు ఓటరు జాబితాలో వరుణ్ పేరును చేర్చారు. 18 సంవత్సరాలు నిండిన వారికే ఓటు హక్కు కల్పించాలన్న స్పృహను అధికారులు కోల్పోయారు. వరుణ్ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అధికారులు అడ్డుకున్నారు. బాలుడు ఎలా ఓటేస్తారని నిలువరించారు. ఓటుహక్కు ఎలా కల్పించారని అక్కడున్న వారు ప్రశ్నించారు. -
ఓటుకు రసీదు ఇవ్వాలి
హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే దానికి రసీదు వచ్చే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు సరిగా నమోదైందో లేదో తెలుసుకునేందుకు వయబుల్ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డి.శ్రవణ్కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎన్.రాజేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన 45 రోజులకు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, ఇందులో ఉపయోగించిన ఈవీఎంలలో నోటా లేదని పిటిషనర్లు తెలిపారు. నోటాను తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఓటు వినియోగించుకున్న వెంటనే రసీదు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయాలని 2013లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికల్లో నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, మధ్యంతర అభ్యర్థన, ప్రధాన అభ్యర్థన ఒకే రకంగా ఉన్నందున తుది విచారణ జరిపిన తరువాతనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. -
అదే తీరు..మారని ఓటరు
బల్దియా ఎన్నికల్లో పెరగని ఓటింగ్ శాతం కొందరి ఓట్లు గల్లంతు ఓటరు స్లిప్పుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం విద్యావంతుల్లో నిర్లిప్తత సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంపై గ్రేటర్లోని మెజార్టీ ఓటర్లు శ్రద్ధ చూపలేదు. బల్దియా ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో పోలింగ్ 45 శాతం...మరికొన్ని చోట్ల 35శాతం మించకపోవడం ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తోంది. ఇది నాణేనికి ఒక పార్శ్వంకాగా.. ఓటర్ల నిర్లిప్తతకు ఇతర కారణాలూ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటేయాలన్న కోరిక పౌరుల్లో బలంగా ఉన్నప్పటికీ... వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని...ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి...విరక్తితో పోలింగ్కు దూరంగా ఉండిపోయారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటేసినా తమ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, అధికారాలు బల్దియాకు లేవని.. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు. ఓటేసినా.. వేయకున్నా ఒరిగేదేమీ లేదన్న నిస్పృహతోనే చాలామంది దూరంగా ఉన్నట్లు విశేషిస్తున్నారు. కారణాలెన్నో... మెహిదీపట్నం డివిజన్లో 34.28 శాతం, విజయనగర్ కాలనీలో 34.51 , అహ్మద్నగర్లో 37.11 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పాతనగరంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు అలజడి రేగడంతో పలువురు ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ డివిజన్లలో ఓటరు స్లిప్పులు సరిగా పంపిణీ చేయకపోవడం, భర్తకు ఓ డివిజన్లో.. భార్యకు మరో డివిజన్లో ఓటు హక్కు ఉండడం, మరికొందరి ఓట్లు గల్లంతవడం పోలింగ్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.సరూర్నగర్ డివిజన్లో 37.89 శాతమే ఓటింగ్ నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవడం. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు పనుల్లో నిమగ్నమవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కొన్నిచోట్ల ఓటర్లకు స్లిప్పులు అందలేదు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఐడీ కార్డులను మాత్రమే తీసుకొచ్చి అవస్థలు పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివేకానంద నగర్ డివిజన్లో అపార్ట్మెంట్ల వాసుల ఓట్లు కొన్ని గల్లంతయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.మరికొన్ని చోట్ల ఓటరు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉండడంతో ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.2011, 2014లలో గ్రేటర్ జనాభా, ఓటర్ల లెక్కకు పొంతన కుదరకపోవడం కూడా పోలింగ్ శాతం తగ్గేందుకు కారణమని భావిస్తున్నారు. గత అనుభవాలే కారణమా? గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు సమస్యల పరిష్కారం విషయంలో... అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరచడంతో పలువురు ఓటుకు దూరంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రామాణ్య స్ట్రాటజీ అనే రాజకీయ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలువురు ఓటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు ఫిర్యాదులపై స్పందించారని 39.8 శాతం మంది తెలపగా.. అంతగా చొరవ చూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. 34.8 శాతం మంది తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టడం ప్రస్తావనార్హం. -
ఓటెత్తిన సెలబ్రిటీ
ఓటు హక్కు ముఖ్యమైనది.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనది. నానక్రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విజయనిర్మలతో కలిసి నేను ఓటు వేశాను. ఏ ఎన్నికలు జరిగినా విధిగా ఓటు వేస్తా. ఇది నా బాధ్యతగా భావిస్తాను. మన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేందుకు ఓటేయాలి. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - సినీనటుడు, కృష్ణ ఓటేసేవారికే ప్రశ్నించే హక్కు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నేను భావిస్తా. దీని ద్వారా ప్రశ్నించే హక్కు వస్తుంది. జూబ్లీహిల్స్ ఓబుల్రెడ్డి స్కూల్లో ఓటు వేశాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్పై అవగాహన బాగా పెరిగింది. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలన్నదే నా అభిమతం. లేటైనా పర్వాలేదు.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోవద్దు. ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - జూనియర్ ఎన్టీఆర్ ఇది అందరి బాధ్యత.. నాకున్న ఓటు హక్కును వినియోగించుకోవడం నా బాధ్యత. ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం. నానక్రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశాను. అవగాహన ఉన్నవారు.. చదువుకున్నవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. - సినీనటుడు నరేష్ -
మేయర్ ఎన్నికలో ఆ ఎంపీలు ఓటేయవచ్చా?
ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై న్యాయ సందేహం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నలుగురు రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం పై సందేహం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసంతో పాటు ఓటు హక్కున్న ఎంపీలు కె.కేశవరావు, చిరంజీవి, జైరామ్మ్రేశ్, మహమ్మద్ అలీఖాన్లకు మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించాలా, వద్దా అన్నది తేల్చుకోలేక ఉన్నధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై న్యాయశాఖ కూడా ఎటూ తేల్చలేక.. ఏజీ సలహా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యమున్న 18మంది రాజ్యసభ సభ్యులను విభజన అనంతరం ఏపీ, తెలంగాణలకు డ్రా పద్ధతిలో కేటాయించారు. అందులో తెలంగాణకు కేవీపీ రామచందర్రావు, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, జి.సుధారాణి, జి.మోహన్రావు, వీహెచ్ రాగా... ఏపీకి రేణుకాచౌదరి, సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, సుజనాచౌదరి, దేవేందర్గౌడ్, తోట సీతారామలక్ష్మి, కేకే, చిరంజీవి, జైరాంరమేశ్, అలీఖాన్ వచ్చారు. కేకే, చిరంజీవి, జైరాం రమేశ్, అలీఖాన్లకు హైదరాబాద్లో ఓటుహక్కుంది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుల హోదాపై గందరగోళం తలెత్తింది. ఏజీ సూచనల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. -
ఖైదీలకూ ఓటు హక్కు!
నేరాలలో సంబంధం ఉండి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం సేకరించి అర్హత కలిగిన ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఖైదీలను డివిజన్ల వారీగా విభజించి వారికి పోస్టల్ బ్యాలెట్ను అందిస్తారు. ఓటు వేసిన అనంతరం సీల్డ్ కవర్లో స్వీకరించి డివిజన్ల వారీగా భద్రపరుస్తారు. వీటిని ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పంపి ఫిబ్రవరి 5న లెక్కిస్తారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు రాజేంద్రనగర్ ఇన్చార్జి ఉపకమిషనర్ దశరథ్ పోలీస్స్టేషన్ల నుండి ఖైదీల వివరాలను సేకరించారు. మొత్తం ఇక్కడి ఐదు డివిజన్లలో 15 మంది జైలులో ఉన్నారు. కాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో 53 మంది సర్వీసు ఓటర్లను కూడా అధికారులు గుర్తించారు. వారి చిరునామా అనుగుణంగా పోస్టల్ ద్వారా సోమవారం బ్యాలెట్ పేపర్లను పంపించారు. - రాజేంద్రనగర్ -
డిగ్రీ ఉంటేనే ఓటు
సొంత ఇల్లు ఉన్నా ఓకే... 1934 మొదటి కార్పొరేషన్ సభ్యులు 30 మందే.. 1937 అయ్యంగార్ కమిటీతో మార్పులు 1965 అమల్లోకి మున్సిపాలిటీ చట్టం ► ఇప్పుడు 18 ఏళ్లు నిండితే అందరికీ ఓటు హక్కు... మరి 1934లో... గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఆ భాగ్యం... కనీసం సొంత ఇల్లైనా ఉండాలి. ఓటు హక్కు కల్పించినా... ఎక్కువమంది సామాన్యులకు వేసే భాగ్యం దక్కలేదు. ► 1934 లో మొదటి కార్పొరేషన్లో సభ్యులు 30... ఓటర్లు 13 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. మరో 13 మందిని జాగీర్ల ప్రతి నిధులుగా, నలుగురిని ప్రభుత్వ తరఫున నామినేట్ చేసేవారు. మొదట్లో కొత్వాల్ చేతుల్లో నగరం పాలన సాగింది. తర్వాత బ్రిటిష్ ఇండియా విధానాల్ని అమలు చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, మున్సిపాలిటీ ముఖ్య బాధ్యతల్ని హెల్త్ ఆఫీసర్లు, మునిసిపల్ ఇంజినీర్లు పర్యవేక్షించేవారు. కమిషనర్ ఎక్స్అఫీషియో సెక్రటరీగా విధులు నిర్వహించేవారు. మౌలికసదుపాయాలు కావాలంటే ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది ఆస్తిపన్నుగా వసూలు చేస్తున్నారు. 1934కు ముందు కార్పొరేషన్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుండేవారు.వీరందరిని నిజాం ప్రభుత్వమే నామినేట్ చేసేది. ప్రస్తుతం నగర్ కార్పొరేషన్లో సభ్యుల సంఖ్య 150 మందికి చేరింది. 1937లో అయ్యంగార్ కమిటీ... ► దీవాన్ బహదూర్ అరవమడ్ సిఫార్సు మేరకు మెరుగైన మున్సిపాలిటీ పాలనకు విధానాలు సూచించాలని నిజాం 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ‘హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ (ఏ) ఆఫ్ 1941’ ను రూపొందించింది. ► నగరాన్ని రెండుగా విభజించి.... జనాభా 15 వేలకు పైగా ఉంటే సిటీ మున్సిపాలిటీ, 5 నుంచి 15 వేల వరకైతే టౌన్ మున్సిపాలిటీగా వ్యవహరించేవారు. పురపాలనంలో ప్రజాస్వామ్యం ► 1951లో కార్పొరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకొచ్చాయి. కౌన్సిల్ అధికారాల అమలు, పాలన కోసం ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. పూర్తి స్థాయి మునిసిపాలిటీగా మార్చారు. 1965లో ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పురపాలన విభాగాలన్ని ఇందులో చేర్చారు. మొత్తం 391 సెక్షన్లు రూపొందించారు. -
సౌదీ ఎన్నికల్లో మహిళావిజయం
రియాద్: సౌదీ అరేబియాలోని మున్సిపల్ కౌన్సిల్లకు జరిగిన ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు కనీసం 13 మంది మహిళలు విజయం సాధించారు. దేశ చరిత్రలో తొలిసారి మహిళలకు ఓటుహక్కు కల్పించడంతోపాటు వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న సౌదీ మహిళలు.. పరిమిత సంఖ్యలోనైనా విజయం సాధించడం వారి అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. మద్రఖా గ్రామంలో సల్మా అల్ ఒతీబి, జిడ్డాలో లామా అల్ సులేమాన్, అల్ జాఫ్ ప్రాంతంలో హినుఫ్ అల్ హజ్మీ, తాబుక్ ప్రాంతంలో మోనా ఎల్ ఎమెరీ, ఫాదిలా అల్ అట్టవీ గెలుపొందారని సౌదీ అధికార వార్తా సంస్థ తెలిపింది. -
తొలి ఓటరుకు జై!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం సాయంత్రం అయిదు గంటలకల్లా ప్రచారపర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్లాల్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులందరూ ప్రచార గడువు ముగిశాక అక్కడ ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రచార గడువు ముగిసేలోపే వారంతా జిల్లా దాటి వెళ్లాలని ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో భన్వర్లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, నియోజకవర్గంలో మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 626 కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, మరో 300 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా టెంట్లు, తాగునీరు, టాయ్లెట్లు ఉంటాయని, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. తొలి ఓటరుకు పుష్పగుచ్ఛం అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొట్టమొదటగా ఓటు వేసేందుకు వచ్చే ఓటరుకు ఎన్నికల కమిషన్ ఘనస్వాగతం పలకనుంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి గౌరవంగా పుష్పగుచ్ఛం అందిస్తారని సీఈవో చెప్పారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గతంలో ఆరు గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని గంట పాటు కుదించిన విషయాన్ని ఓటర్లు గుర్తించాలని కోరారు. 93.46 శాతం ఓటరు స్లిప్పులు వరంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,09,671 మంది ఓటర్లుంటే ఇప్పటివరకు 93.46 శాతం మంది ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. వివిధ కారణాలతో 22,319 మందికి ఓటరు స్లిప్పులు అందలేదన్నారు. ఓటింగ్ రోజున సైతం ఓటరు స్లిప్పులు పొందేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రత్యేక కేంద్రాలుంటాయని, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఈసీ గుర్తించిన పది కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాస్పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకాలు, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ జాబ్కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపిస్తే ఓటుకు అనుమతిస్తారని చెప్పారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు చెబుతాం ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు, మద్యం, నగదు, కానుకల పంపిణీ జరిగితే వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని భన్వర్లాల్ సూచించారు. 180042522747 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లేదా 8790499899 నంబర్కు ఎస్ఎంఎస్ పంపించాలని కోరారు. ‘ఎంసీసీ’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సమాచారం చేరవేస్తే సరిపోతుందని అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు రూ.1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసి ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్లు పంపితే క్రిమినల్ కేసులు ప్రచార గడువు ముగిశాక ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేయటం కూడా నిషిద్ధమేనని, దీన్ని ఉల్లంఘించి వాటిని పంపించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో హెచ్చరించారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే సంబంధిత సర్వీసు ప్రొవైడర్లపైనా కేసులు పెడతామన్నారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు విధిగా బంద్ పాటించాలన్నారు. మీడియా సంస్థలు ప్రచార ప్రకటనలు చేయవద్దన్నారు. -
ఆ నేడు 25 సెప్టెంబర్, 2011
ఓటుకు పోదాం ఛలో ఛలో! మహిళలకు ఓటు హక్కు కల్పిస్తున్నట్లు సౌదీ అరేబియ రాజు అబ్దుల్లా ప్రకటించారు. కరడు గట్టిన ఒక సంప్రదాయ రాజ్యంలో ఇది చారిత్రక ఘట్టమే. ఓటు హక్కు మాత్రమే కాదు ‘షుర కౌన్సిల్’ (సంప్రదింపుల సభ)లో కూడా మహిళలు భాగస్వాములు కావాలని 87 ఏళ్ల అబ్దుల్లా పిలుపునిచ్చారు. తన చర్యను ‘జాగ్రత్తతో కూడిన సంస్కరణ’ అన్నారు ఆయన. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడాలని అబ్దుల్లా సౌదీ మహిళలను కోరారు. అబ్దుల్లా ప్రకటనపై దేశంలో చాలా మంది సానుకూలంగా స్పందించడం విశేషం. ‘‘మహిళలకు సంబంధించి దేశంలో అనుకూల మార్పులు తీసుకురావడానికి ఇదొక లిట్మస్ టెస్ట్లాంటిది’’ అన్నారు సామాజిక విశ్లేషకులు. ‘‘ఇది కంటితుడుపు చర్య..పాశ్చాత్యదేశాల మెప్పుకోసం వేసిన పిల్లి మొగ్గ’’ అన్నవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ ఓటుహక్కు అనేది తొలి అడుగు అనుకోవచ్చు. -
99%
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 99.35 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా... మొదట్లో మందకొండిగా ప్రారంభమైన మధ్యాహ్నానికి ఊపందుకుంది. సమయం ముగిసే సరికి మొత్తం 1087 మంది ఓటర్లలో 1080 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్కు దూరంగా ఉండాలని సీపీఐ నిర్ణయం తీసుకోవడంతో... ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్కు హాజరుకాలేదు. ఇక మిగిలిన ముగ్గురిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో, ఒకరు అధికార పార్టీ అడ్డుకోవడంతో ఓటింగుకు రాలేదని సమాచారం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థు డి. వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిలు.. కర్నూలు ఎన్నికల కేంద్రంలో ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకూ ఓటింగ్ సరళిని దగ్గరుండి పరిశీలించారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి..కర్నూలు పోలింగు కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు నంద్యాల కేంద్రంలో, కర్నూలులో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ, ఐజయ్యలు తమ ఓటు వేశారు. ఆదోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, జయ నాగేశ్వరరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలకులు కరికాల వలన్, టీజీ వెంకటేష్లు కర్నూలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బందోబస్తు తీరును డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆదోని డీఎస్పీలు పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్... ఆదోని, నంద్యాలలో ఎన్నికల తీరును పరిశీలించారు. ఇదిలా ఉండగా ఎవరికి వారు తమదే గెలుపని ప్రకటించుకున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే... ఓటమి భయం కళ్లకు కట్టినట్టు కనిపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కార్లలో తరలింపు పోలింగ్ కేంద్రానికి పలువురు ఓటర్లను అధికార పార్టీ నాయకులు.. కార్లలో తరలించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఓటింగు కేంద్రానికి తీసుకొచ్చారు. తమకు ఓటు వేస్తారో లేదోననే అనుమానంతో పలువురు సహాయకులను నియమించుకున్న అధికార పార్టీ... సహాయకులకు ప్రత్యేక సూచనలు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రయత్నాలు చేయడం కనిపించింది. స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపీటీసీ సభ్యుడు బాల ఉస్సేనిని కిడ్నాప్ చేశారంటూ అధికార పార్టీ కిడ్నాప్ డ్రామా ఆడించింది. తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని తామెందుకు కిడ్నాప్ చేస్తామని.. అధికార పార్టీనే కిడ్నాప్ చేసిందని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కర్నూలు డివిజన్లో అత్యధికం.. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రెవెన్యూ డివిజన్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 1087 మంది ఓటర్లు ఉండగా... 1080 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు డివిజన్లో అత్యధికంగా 99.74 శాతం ఓటింగ్ నమోదయ్యింది. కర్నూలు రెవెన్యూ డివిజన్లో 387 మంది ఓటర్లకుగానూ 386 మంది ఓటు వేశారు. ఇక నంద్యాల డివిజన్లో 307 మందికిగానూ 306 మంది ఓటు వేశారు. ఆదోనిలో 393 మంది ఓటర్లు ఉండగా... 388 మంది మాత్రమే ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా సగటున 99.35 శాతం ఓటింగు నమోదయ్యింది. -
నేడు ఉపపోరు
♦ నాలుగు సర్పంచ్, 19 వార్డులు, ♦ ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు ♦ తొలిసారిగా ఈవీఎంల వినియోగం ♦ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నల్లగొండ : జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిల్లో ఒక ఎంపీటీసీ స్థానం, సర్పంచ్లు 4, వార్డులు 19 ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)వినియోగించనున్నారు. మోత్కూరు మండలం మూసిపట్ల ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. 18 వందల మంది ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగి ంచుకోనున్నారు. 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదేని అవాంతరాలు ఎదురైతే రీపోలింగ్ ఆదివారం నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8గంటలకు మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అలాగే నాలుగు సర్పంచ్ స్థానాలకు 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు, సర్పంచ్ స్థానాలకు కలిపి మొత్తం 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్పంచ్ ఎన్నికలకు 24 ఈవీఎంలు వినియోగించునున్నారు. వార్డులకు బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పోలింగ్ కోసం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
ముస్లింలకు ఓటు వద్దు
శివసేన పత్రిక సామ్నాలో వివాదాస్పద డిమాండ్ ⇒ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపణ ⇒ శివసేనపై విరుచుకుపడిన పలు రాజకీయ పార్టీలు ముంబై/న్యూఢిల్లీ: ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలంటూ శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో చేసిన డిమాండ్ వివాదాస్పదమైంది. ముస్లింలను పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయని, అందువల్ల వారికి ఓటు హక్కు రద్దు చేయాలని సేన డిమాండ్ చేసింది. సంపాదకీయంలో ఎంఐఎం పార్టీ, ఒవైసీ సోదరులను ఉద్దేశించి శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైనారిటీ వర్గాలను దోచుకుంటున్న విషనాగులుగా వారిని అభివర్ణించింది. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలనూ రాజకీయం కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించింది. ఇటువంటివి తొలుత కాంగ్రెస్ మొదలుపెట్టిందని విమర్శించింది. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నంత కాలం వారికి భవిష్యత్తు ఉండదని, అందువల్ల వారికి ఓటు హక్కును ఉపసంహరించాలని బాలాసాహెబ్(బాల్ ఠాక్రే) గతంలో డిమాండ్ చేశారని సంపాదకీయంలో పేర్కొంది. శివసేన డిమాండ్పై వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. సమాజాన్ని విడగొట్టేలా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ డిమాండ్ ఉందని, ఇటువంటివి ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ మండిపడింది. ప్రధానిమోదీ ప్రోద్బలంతోనే ఇటువంటి వివాదాస్పద డిమాండ్లు తెరపైకి వస్తున్నాయంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ.. కేంద్రాన్ని డిమాండ్ చేసింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శివసేన ఈ అంశాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. తమ పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, కొంత మంది నాయకులు మొత్తం ముస్లింల కోసంకాక తమ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని వివరణ ఇచ్చింది. ఇటువంటివారు ముస్లిం వర్గాలకు నిజంగా సహాయం చేయకుండా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని సేన ఎమ్మెల్సీ, అధికారప్రతినిధి డాక్టర్ నీలమ్ గోర్హే పేర్కొన్నారు. శివసేన నాయకుడు, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ముస్లింలకు ఓటు హక్కును కొన్నేళ్లు దూరంగా ఉంచితే.. ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించే నాయకులకు వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగినంత కాలం దేశంలో అస్థిరత కొనసాగుతుందని చెప్పారు. దీనివల్ల ముస్లింలుకానీ, ఇటు దేశంకానీ ముందుకు వెళ్లాదని రౌత్ పేర్కొన్నారు. -
బరిలో మేము సైతం
సాక్షి, తిరుమల: బరిలో తామున్నామని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. ఫలితంగా తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫిబ్రవరి 13వ తేదిన తిరుపతి నియోజక వర్గ ఓటర్లు మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.శ్రీదేవిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అండదండలతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి కారణంగా పోటీ చేయరాదని జిల్లా కాంగ్రెస్ కేడర్ అధిష్టానానికి సూచించింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తే దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తిరుపతి లేదా పార్టీ సీనియర్ నాయకురాలు ప్రమీలమ్మను పోటీలో నింపాలని కేడర్ పార్టీ అధిష్టానాన్ని కోరింది. ఇది తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్కు మింగుడు పడలేదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, తాను సూచించిన అభ్యర్థినే నిలిపేలా పావులు కదిపారు. తన అనుచరురాలు, డ్వాక్రా సంఘం నాయకురాలు ఆర్.శ్రీదేవి పేరును అధిష్టానానికి సూచించారు. పోటీ అనివార్యం కావడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన మబ్బుదేవనారాయణ రెడ్డి తనకు టికెట్టు ఇవ్వాలని, మహిళా కోటా అయితే తమ పేరు పరిశీలించాలని సీనియర్ నాయకురాలు ప్రమీలమ్మ, ఐఎన్టీయుసీ జిల్లా నాయకురాలు రాజేశ్వరి, మరికొందరు వేర్వేరుగా పార్టీ టికెట్టు కోసం దరఖాస్తు చేశారు. శ్రీదేవి మినహా మిగిలిన వారు ఎవరికి టికెట్టు ఇచ్చినా కలిసే పనిచేస్తామని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో శ్రీదేవి పేరుతో పాటు మరికొందరి పేర్లు కూడా పంపాలని అధిష్టానం కూడా చింతామోహన్కు సూచించింది. ఈ విషయంలో అధిష్టానం పెద్దలు, ఆయన మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే నాటకీయ పరిణామాల మధ్య శ్రీదేవి పేరును పార్టీ ప్రకటించింది. దీంతో మహిళా కాంగ్రెస్, మబ్బు కుటుంబం కినుక వహించింది. వెంకటరమణ కుటుంబంపై ‘చింతా’ ఘాటు విమర్శలు సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొననసాగిన వెంకటరమణ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి క్షణంలో తెలుగుదేశంపార్టీలోకి చేరారు. ఆపార్టీ టికెట్టుపై పోటీ చేసి గెలుపొందారు. అంతవరకు రాసుకుని పూసుకుని తిరిగిన వెంకటరమణ, చింతా మోహన్ మధ్య విభేదాలు పొడచూపాయి. అయితే, బహిరంగ విమర్శల జోలికెళ్లలేదు. ఆఖరికి వెంకటరమణ మరణం తర్వాత పార్టీ కేడర్ పోటీకి వద్దన్నా ఆయన మాత్రం పోటీ చేయాలనే పట్టుబట్టారు. తాను అనుకున్న విధంగానే తన అనుచరురాలికి టికెట్టు ఖరారు చేయించారు. ఆ వెనువెంటనే మాటలకు పదును పెట్టారు. ‘వెంకటమణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఉండారు. ఏకంగా ఐదువందలకోట్లు సంపాదించారు. పార్టీకి తీరిని నష్టంచేయించారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఈ మాటలతో వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కరలేదు. తాను చేసిన విమర్శలు వల్ల తిరుపతి ఓటర్లు పునరాలోచన చేస్తారనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. చేతికి మట్టి గాజులు, మెడలో పసుపు మంగళసూత్రమే ఆస్తిగా ఉన్న శ్రీదేవికి తిరుపతి ప్రజలు ఓటువేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్ సీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రకటించింది. గత సంప్రదాయాలను పాటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్రెడ్డి సూచనతో పార్టీ కేడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా సానుకూలంగా స్పందించారు. ఇందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి సుగణమ్మ కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీకి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే, సీపీఎంతో పాటు జైసమైక్యాంధ్ర పార్టీ కూడా పోటీ చేయకూడదని నిర్ణయించాయి. బరిలో మరి కొందరు..నేడు, రేపు నామినేషన్లు తిరుపతి ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల్లో ఒక్కసారిగా హుషారు వచ్చింది. ఆదివారం వరకు లోకసత్తా, జన సంఘ్ పార్టీలతోపాటు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్నిక అనివార్యంకావడంతో సోమ, మంగళవారాల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్లకు తుది గడువు 27వ తేదీ, 28న నామినేషన్ల పరిశీలన, 30 ఉపసంహరణ, 13న పోలింగ్, 18న లెక్కింపు, 18నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాంగ్రెస్కు మళ్లీ పరపతి దక్కేనా? ఒకప్పుడు తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన తర్వాత పరపతి పోయింది. ఎంపీగా చింతామోహన్ ప్రాతినిథ్యం వహించిన తిరుపతిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మబ్బు దేవనారాయణరెడ్డికి కేవలం 2,848 ఓట్లు పడ్డాయి. తిరుపతి కాంగ్రెస్ చరిత్రలో ఇదే అత్యల్పంగా రికార్డు నమోదైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకరటమణ మరణంతో ఉప ఎన్నిక అనివార్యైమైంది. దీంతో పోగొట్టుకున్న పరపతిని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ తమ ప్రయత్నాలు ప్రారంభించింది. కృష్ణాజిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటమి చవిచూసినా.. కనీస ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతులైంది. అదే బాటను తిరుపతి ఉప ఎన్నికల్లో అమలు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే, అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరక పోవడం గమనార్హం. -
మేల్కొంటేనే మేలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి కీలకమైంది. ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిది. మంచి పాలకులను ఎన్నుకోవడానికి, అవినీతిపరులను గద్దె దింపడానికి ఓటుహక్కు సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటిది. ఇంతటి ప్రాధాన్యమున్న ఓటుహక్కుపై పలువురు అశ్రద్ధ కనబరుస్తున్నారు. ఓటర్ నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యంతప్రాధాన్యమున్న దీని విలువను గుర్తించలేకపోతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే ఓటుహక్కు వినియోగించుకుంటున్నవారి సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రతిఒక్కరూ ఓటు విలువను వివరించి.. దీన్ని వినియోగించుకునేలా చైతన్యపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరి 25నుజాతీయ ఓటరు దినోత్సవంగా ప్రకటించింది. ఆదివారం ఓటుహక్కుపై అవగా హన కల్గించేందుకు అధికారులు జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓటుహక్కుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు నడుం కట్టాలి ⇒ యువతరం.. భావితరాలకు మార్గదర్శకం కావాలి ⇒ 18 ఏళ్లు నిండినవాళ్లంతా ఓటర్గా పేరు నమోదు చేసుకోండి ⇒ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమాజానికే చేటు ⇒ రండి.. ఓటుహక్కు కోసం చైతన్యవంతులు కండి ⇒ నేడు జాతీయ ఓటరు దినోత్సవం ⇒ జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు యువతరం ముందుకు రావాలి చదువు, భవిష్యత్ కోసం నిరంతరం ఆలోచిస్తున్న యువత పౌరులుగా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదనే విమర్శలున్నాయి. చాలామంది యువతీయువకులు.. ఎవరికి ఓటేసినా తమకు ఒరిగేదేముందనే భావనతో ఓటు విలును గుర్తించలేకపోతున్నారు. కనీసం ఓటరుగా కూడా నమోదు చేసుకోవడంలోనూ అనాసక్తి కనబరుస్తున్నారు. యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగకపోవడమే ఇందుకు నిదర్శనం.ఈ కారణంగానే ఓటు హక్కు విలువను తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం పలు ప్ర త్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్పెషల్ కాంపెయిన్ల పేరుతో ఆయా గ్రామాలు, కళాశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటరు నమోదుకు అర్హత.. 18 సంవత్సరాలు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే ఓటరు నమోదుకు అనర్హులు. అయితే ఓటరు కేవలం ఒక్క పోలింగ్ బూత్ పరిధిలోనే ఓటుహక్కును పొందాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పొందడం చ ట్టరీత్యా నేరం. ఎలా పొందాలంటే.. ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు అందజేయాలి. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్ 6ఏ నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలిపేందుకు.. పోలింగ్ బూత్ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్ 7ను నింపి ఈఆర్ఓకు అందజేయాలి. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదు చేయదల్చుకుంటే ఫార్మ 7 ద్వారా ఇప్పటికే ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకునే వీలు ఉంటుంది. సవరణల కోసం.. తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత వాటిలో తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఫార్మ్ 8 ద్వారా వాటిని సరిదిద్దుకోవచ చ్చు. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో తప్పొప్పులను సరిదిదిద్దుకునే వీలుంది. ఆన్లైన్లోనూ ఓటరు నమోదు ఆన్లైన్లోనే సంబంధిత ఫారాలను నింపి అధికారులకు సమర్పించే వీలు కూడా ఉంది. నెట్లోనే సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్చేసి పంపిస్తే అధికారులు నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కును కల్పిస్తారు. ఈ సేవ కేంద్రానికి వెళ్లి అధికారులు ఇచ్చే ఎపిక్ నంబరును చెప్పి ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. -
నాలుగో విడత ప్రశాంతం
కశ్మీర్లో 49 శాతం, జార్ఖండ్లో 60 శాతం పోలింగ్ కశ్మీర్లో గత ఎన్నికల కంటే 4% అధికం శ్రీనగర్, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలను బహిష్కరించాలన్న వేర్పాటువాదుల పిలుపును పట్టించుకోకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగో దశలో నాలుగు జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో 49 శాతం ఓటింగ్ నమోదైంది. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చారు. గత ఎన్నికలతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువ ఓటింగ్ జరిగింది. అయితే తొలి మూడు దశల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇది తక్కువే. తొలి రెండు దశల్లో 71 శాతం, మూడో దశలో 59 శాతం ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, నాలుగో దశ ఎన్నికల సందర్భంగా డజను ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫోపియన్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తూ బీజేపీ అభ్యర్థి జావేద్ అహ్మద్ ఖాద్రి అక్కడి కెమెరాలకు చిక్కారు. అయితే పీడీపీ, నేషనల్ కాన ్ఫరెన్స్ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే అమిరకదల్ స్థానం పరిధిలోని చనాపోరా ప్రాంతంలో పోలింగ్ అధికారిపై బీజేపీ అభ్యర్థి హీనా భట్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీన్ని ఆమె తోసిపుచ్చారు. కొందరు అధికారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనాపోరా కేంద్రం ప్రిసైడింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై ఇతర పక్షాలన్నీ హీనా భట్ను తప్పుబట్టాయి. బీజేపీపై విమర్శలు గుప్పించాయి. కాగా, నాలుగో దశతో జమ్మూకశ్మీర్లోని మొత్తం 87 స్థానాలకుగాను 67 స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో జమ్మూ ప్రాంతంలో మిగిలిన 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరుగుతాయి. 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక జార్ఖండ్లో నాలుగో దశలో 61 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు అధికసంఖ్యలో ఓటేశారు. నాలుగో దశలో 15 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ 60 శాతం పోలింగ్ నమోదైంది. -
పోలీసు తీరుపై వెల్లువెత్తిన నిరసన
గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం పోలీసు తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఫలితంగా పోలింగ్కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయగా...గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో కేంద్రానికి కొద్ది దూరంలో కొందరు గుమిగూడటం గమనించి అక్కడికి వచ్చిన ఓ ఎస్ఐ .. నవీన్ అనే యువకుణ్ని కొట్టడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు. తాము ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా...అకారణంగా దాడిచేస్తారా? అంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎంపీటీసీ అంజిరెడ్డి మద్దతు పలికి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. కొందరు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ఓటు వేయబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, తహశీల్దార్ బాల్రెడ్డి, బేగంపేట ఎస్ఐ అనిల్కుమార్లు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులను నచ్చజెప్పి పోలింగ్ ప్రక్రియ యథావిధిగా సాగేలా చూశారు. -
పోలింగ్ సరళిపై ఆరాతీసిన సీఎం
ఫాంహౌస్కు చేరుకున్న కేసీఆర్ జగదేవ్పూర్: సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్పాయ్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అడుగుడునా పోలీసు బలగాలను మొహరించారు. మెటల్ డిటెక్టర్, డాగ్స్క్వాడ్తో కల్వర్టుల వద్ద తనఖీలు నిర్వహించారు. మధ్యాహ్నాం 2.35 నిమిషాలకు సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆయన అక్కడి పంటలను పరిశీలించారు. అక్కడి నుంచే ఓటింగ్ సరళిని ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి ఆయన ఫాంహౌస్లో బసచేసి ఆది వారం హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. బాల్రాజు, కిష్టన్న పోలింగ్ ఎట్లుంది.. వ్యవసాయక్షేత్రానికి వెళ్తూ శనివారం కొద్దిసేపు ఎర్రవల్లి గ్రామంలో ఆగిన సీఎం కేసీఆర్ పోలింగ్ శాతం ఎట్లుంది, బాగా నడుస్తోందా.. ఓటర్లు ఏమనుకుంటున్నరు..అంటూ స్థానిక సర్పంచ్ భర్త బాల్రాజు, నాయకులు కిష్టారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 80 శాతం పోలింగ్ నమోదైందని వారు సీఎంకు వివరించారు. కేసీఆర్ కాన్వాయ్ ఎర్రవల్లిలో ఆగడంతో గ్రామానికి చెందిన యువకులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. -
వారు సైతం...
మగానుభావులు మహిళలు ఉద్యమాలు చేస్తే ‘మాకేమి సంబంధం’ అన్నట్లు అంటీముట్టనట్లు ఉండే పురుషులు కొందరైతే, వారికి వెన్నుదన్నుగా ఉండే పురుషులు కొందరు. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు ఉండాలని అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్(ఎయిఆర్ఎ)తో పాటు ‘స్త్రీలకు ఓటు హక్కు ఉండాలి’ అనే నినాదంతో చేసిన ఉద్యమాల్లోనూ చాలామంది పురుషులు చురుగ్గా పాల్గొన్నారు. స్త్రీల హక్కుల కోసం పనిచేయడానికి ఒకానొక కాలంలో అమెరికాలో పురుష సంఘాలు కూడా ఏర్పడ్డాయి.1912లో ఏర్పడిన ‘ది నేషనల్ మెన్ లీగ్’లో ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారు. అభ్యుదయవాదులైన ఈ పురుషులు స్త్రీలకు మద్దతుగా ఉపన్యాసాలు ఇచ్చారు. వ్యాసాలు రాశారు.చిత్తశుద్ధితో పనిచేశారు. హెన్రీ బ్లాక్వెల్ తన భార్య లూసి స్టోనోతో పాటు మహిళలకు సంబంధించిన రకరకాల హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నాడు. భార్య చేస్తున్న ఉద్యమాల్లో పాల్గొన్న హెన్రీ బ్లాక్వెల్ లాంటి పురుషులు ఎందరో చరిత్రలో ఉన్నారు. -
టీడీపీకి షాక్
ఎత్తుకు పై ఎత్తులు, నిముషాల వ్యవధిలో జరిగి పోయిన అనూహ్య పరిణామాలు అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాయి. జెడ్పీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా గెలవాలనుకున్న తెలుగుదేశం ఆశలు నెరవేరలేదు. పార్టీకి ఝలక్ ఇచ్చిన పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీ అభ్యర్థిని ఒక్క ఓటు తేడాతో ఓడించడంతో పార్టీ నేతలు ఖంగు తినాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో అప్పటి దాకా గెలుపు ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ నిరుత్సాహంలో మునిగిపోయారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనూహ్య మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అడ్డదారిలో గెలవాలనుకున్న తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా వినియోగించకునే అవకాశం లేకుండా ఒక తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. గెలుపు కోసం తప్పుడు కేసు పెట్టించి పోలీసులను తెలుగు తమ్ముళ్లలాగా మార్చినా ఫలితం దక్కలేదు. గత నెల 20న ఘటన జరిగిందంటూ ఈ నెల 10వ తేదీ రాత్రి ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయకుండా 80 మంది పోలీసులతో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసిన తరహాలో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యులు కూడా తమ వారే గెలవడంతో జెడ్పీ చైర్మన్ తమదే అన్న ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంత సభ్యుడు ఈదర హరిబాబు ఇచ్చిన ఝలక్తో సీన్ రివర్స్ అయ్యింది. జెడ్పీ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవిని కూడా పోగొట్టుకున్న దేశం నేతలు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈదర హరిబాబు అసంతృప్తితో ఉన్నాడని గుర్తించినా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడంతో వారు దృష్టి పెట్టలేదు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కోసం కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్చౌదరి టీడీపీ తరఫున డాక్టర్ మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మర్రిపూడి జెడ్పీటీసీ తుళ్ళూరి వెంకట నరసింహం బలపరిచారు. ఈలోగా ఈదర హరిబాబు లేచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని చెప్పడంతో ఏవరైనా ప్రతిపాదించి, బలపరచాలని కలెక్టర్ సూచించారు. దీంతో వైఎస్సార్ సీపీ తన వ్యూహం మార్చుకుని తమ అభ్యర్థిని బరిలో దింపకుండా ఈదర హరిబాబుకు మద్దతు ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కనిగిరి జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం ప్రతిపాదించగా, పెద్దారవీడు జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి బలపరిచారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన డాక్టర్ నూకసాని బాలాజీని వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టింది. సమావేశంలోనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే జరిగిన ఈ పరిణామాలతో వారు కొద్దిసేపు నిశ్చేష్టులయ్యారు. తర్వాత బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అతని నామినేషన్ చెల్లదంటూ అడ్డగోలు వాదనకు దిగారు. కలెక్టర్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. ఈ విషయంపై జాప్యం జరుగుతుండంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపుసురేష్ ఎన్నికల నిబంధనను ప్రత్యేకంగా చదివి వినిపిస్తూ తొందరగా ఎన్నిక నిర్వహించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ సలహా తీసుకునేందుకు యత్నిస్తున్నానని, వచ్చింది రెండు నామినేషన్లే కనుక ఈదర హరిబాబు దాఖలు చేసిన నామినేషన్ విషయమై స్పష్టత కోసం వేచి ఉన్నామని చెప్పడంతో అయోమయం నెలకొంది. అయితే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం జెడ్పీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈదర హరిబాబుకు అతని ఓటుతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు 27 మంది మద్దతు కలిసి 28 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అయిన మన్నె రవీంద్రకు టీడీపీ సభ్యుల 24 ఓట్లు, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు సభ్యులతో కలిసి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈదర జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ నూకసాని బాలాజీ పేరును వెలిగండ్ల జెడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి ప్రతిపాదించగా, ఇంకొల్లు జెడ్పీటీసీ పీ.వెంకట రమణ బలపరిచారు. దీంతో ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు 26 మంది, అతని ఓటు, టీడీపీ నుంచి ఈదర హరిబాబు ఓటు కలిపి 28 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి పటాపంజుల కోటేశ్వరమ్మను సంతనూతలపాడు జెడ్పీటీసీ అభ్యర్థి తన్నీరు శ్రీనివాసరావు ప్రతిపాదించగా, కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్చౌదరి బలపరిచారు. అయితే ఈమెకు కేవలం 27 ఓట్లు మాత్రమే రావడంతో డాక్టర్ నూకసాని బాలాజీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయం దక్కడంతో ఒక్కసారిగా ఈదర హరిబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఎన్నిక కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నడిరోడ్డుపై ఇనుప ముళ్లకంచెలు వేసి పాస్ లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు. మీడియాను కూడా సెల్ఫోన్లతో లోపలికి అనుమతించలేదు. చైర్మన్ ఈదర హరిబాబు ప్రొఫైల్ పేరు: ఈదర హరిబాబు తండ్రి: చెంచయ్య స్వస్థలం : నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు వయస్సు: 59 సంవత్సరాలు విద్యార్హతలు: పదో తరగతి వరకు అమ్మనబ్రోలులో చదివారు. ఇంటర్మీడియెట్ చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం బీఎస్సీ గ్రాడ్యుయేషన్ను ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో చదివారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ జీవితం: తొలుత స్వగ్రామమైన అమ్మనబ్రోలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షునిగాను, 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా గెలుపొందారు. ఇవి కాకుండా ఏటా క్రమం తప్పకుండా ఎన్టీఆర్ కళాపరిషత్, విద్యార్థి పరిషత్, కర్షక పరిషత్, భారతీయం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రొఫైల్ పేరు: డాక్టర్ నూకసాని బాలాజీ తండ్రి: కోటయ్య, తల్లి : కామేశ్వరమ్మ స్వస్థలం : బింగినపల్లి, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా వయస్సు: 53 విద్యార్హతలు: ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్, పీహెచ్డీ రాజకీయ జీవితం: కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా బీసీ సెల్ చైర్మన్గా రెండు పర్యాయాలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా 2007 నుంచి 2010 వరకు పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2011 మే 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఇటీవలే పుల్లలచెరువు జెడ్పీటీసీగా గెలుపొందారు. -
‘నోటా’కు ఓటర్ల స్పందన
బెల్లంపల్లి, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా ఓటుకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో నోటా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థుల పట్ల ఓటర్లు విముఖత చూపారు. బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్కు మూడు రోజుల ముందు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీ నుంచి అర్ధంతరంగా వైదొలిగి కాంగ్రెస్-సీపీఐ ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో 20 మంది అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారానికి తొలి ప్రయత్నంలోనే అనూ హ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,60,960 మంది ఓటర్లు ఉండగా 1,19,442 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 73,779 ఓట్లతో విజయం సాధించగా సమీప ప్రత్యర్థి సీపీఐ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి గుండా మల్లేశ్కు 21,251 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రకు 9,167 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. మిగతా స్వతంత్ర అభ్యర్థులు కేవలం 3 వేల లోపు ఓట్లు పొంది చతికిల పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోవడంతో 769 మంది ఓటర్లు నోటా ఓటు వేశారు. తొలి ప్రయత్నంలోనే ఓటర్లు నోటా ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఓటర్ల విలక్షణ తీర్పు నియోజకవర్గంలో ఈ దఫా ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలి పర్యాయం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో ఓటర్లు హంగుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులను 14 వార్డుల్లో గెలిపించగా, టీఆర్ఎస్ అభ్యర్థులు 10 వార్డుల్లో, 5 వార్డుల్లో టీడీపీ, 2 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు, 03 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపించారు. సంపూర్ణ మెజార్టీ ఏ రాాజకీయ పార్టీకి కట్టబెట్టలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. స్వతంత్ర, సీపీఐ అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ యత్నాలు చేస్తోంది. రెండో దఫా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు మార్పును కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ అభ్యర్థులు విజయానికి దోహదపడ్డారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 47 ఎంపీటీసీ స్థానాలకు గాను 26 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 20 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థిని ఓటర్లు గెలిపించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లు, తాండూర్, నెన్నెల, భీమిని, కాసిపేట మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు విజయం చేకూర్చిపెట్టారు. ఈ రకంగా ఓటర్లు ఎన్నికల్లో అనూహ్యమైన తీర్పు ఇచ్చి పరిశీలకుల అంచనాను తారుమారు చేశారు. తమదైన శైలిలో తీర్పు ఇచ్చి రాజకీయ విశ్లేషకులను అయోమయానికి గురి చేశారు.