Wanaparthy
-
తెలంగాణ శ్రీరంగం
వనపర్తి: తమిళనాడులోని శ్రీరంగం రంగనాయకుడిని వనపర్తి సంస్థానాధీశులు ఇంటి దైవంగా కొలుస్తూ పూజించేవారు. తమ సంస్థానంలోని కొర్విపాడు (పెబ్బేరు మండలం శ్రీరంగాపురం) గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున ఉన్న గరుడకొండపై శ్రీరంగాన్ని పోలిన రంగనాథస్వామి ఆలయాన్ని 345 ఏళ్ల క్రితం అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనంతరం కొర్విపాడు పేరును శ్రీరంగాపురంగా మార్చారు. ద్వీపకల్పంగా దర్శనమిచ్చే ఈ దేవాలయానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. పురాతన ఆలయాల మాదిరిగా నేలమాలిగలను సైతం నిర్మించి.. అందులో పురాతనమైన తంజావూరు పెయింటింగ్స్ను భద్రపరిచారు. దేవాలయాన్ని, అందులో కొలువుదీరిన స్వామివారి మూలవిరాట్ను తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మాదిరిగానే ప్రతిష్ఠించారు. సంస్థానాధీశుల కాలంలో శ్రీరంగాపురం క్షేత్రం కవి, పండితులకు ఆస్థాన కేంద్రంగా భాసిల్లింది. సభలు, సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తిరుపతి వేంకటకవులు లాంటి మహోన్నత వ్యక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి.. ఆతిథ్యం తీసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఇటీవల కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలను ఇక్కడ నిర్వహించారు. వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిలోని కంచిరావుపల్లి గ్రామం నుంచి శ్రీరంగాపురం ఆలయానికి చేరుకోవచ్చు. పెబ్బేరులోని 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఈ ఆలయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు సుమారు 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఉట్టిపడే శిల్పసంపదశ్రీరంగనాయకస్వామి ఆలయంలో నిర్మించిన అద్భుతమైన శిల్పసంపద భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతోపాటు ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో ఆలయ గోపురం భక్తులకు స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.ఆలయం పక్కనే ఏడాది పొడవునా నీటితో కళకళలాడే రంగసముద్రం రిజర్వాయర్ ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలో పలు సినిమాల షూటింగ్ నిర్వహిస్తారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేస్తున్నా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. -
సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?
నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. -
7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందాపూర్ రోడ్డు పీర్లగుట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి అతి పెద్ద నాగుపాము వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని రాంబాబు బాత్రూంలోకి వెళుతుండగా.. బుసలు కొడుతున్న శబ్దం విని ఆగిపోయాడు. ఆ తర్వాత చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో భయపడిన రాంబాబు సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు చీర్ల కృష్ణసాగర్కు ఫోన్ చేశాడు.వెంటనే ఆయన తన బృందంతో అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నా డు. పాము పొడవు ఏడు అడుగులు ఉండగా, వయసు 16 నుంచి 17 ఏళ్లకు పైబడి ఉంటుందని కృష్ణసాగర్ చెప్పాడు. తాను ఇప్పటి వరకు 7,013 పాములు పట్టుకున్నానని, కానీ ఇంతపెద్ద నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని కృష్ణసాగర్ తెలిపాడు. ఈ విషయంపై వెటర్నరీ ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాము వయసు ఎక్కువే ఉండొచ్చని.. దాన్ని సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్టు తెలిపారు. -
Wanaparthy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై దాడికి యత్నం
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో దాడికి ప్రయత్నించిన తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనుచరులు. చిన్నారెడ్డి… pic.twitter.com/yTCuOrbKaf — Telugu Scribe (@TeluguScribe) April 18, 2024 -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్లో హైదరాబాద్కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారి వివరాలు.. అబ్దుల్ రహమాన్ (62), సలీమా జీ (85), చిన్నారులు వాసిర్ రవుత్ (7 నెలలు), బుస్రా (2), మరియా (5). -
వనపర్తి: కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు, కానీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు ప్రస్తుతం మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న నిరంజన్రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు. రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్! కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫి, డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు.. మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు. -
వనపర్తిలో ఓ డాక్టర్ మౌనపోరాటం..
వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు. డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు. చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు.. -
2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పనులు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. బయటపడిన భారీ ఇటుకలు 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. -
నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్ కవిత
మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫోన్లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. చిన్ని నిఖిల్.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్కు బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతిలు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్లో నిఖిల్ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్. ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది -
మంత్రి నిరంజన్రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్రెడ్డికి నీళ్ల నిరంజన్రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
రేపు ‘సాక్షి’ ఫోన్ ఇన్
‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ బీఎన్కే రమేష్తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఆయా పట్టణ ప్రజలు ఫోన్ చేసి మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు, కోతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవచ్చు. వీటి పరిష్కారానికి కమిషనర్లు సమాధానమిస్తారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ వాసులు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 63034 35647 నంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆత్మకూర్ పట్టణ ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్ 63034 35647 -
కొనసాగుతున్న ప్రాక్టికల్స్
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గరువారం ఉదయం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్లో 807 మందికి గాను, 773 హాజరు కాగా.. 34 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్న సెషన్లో 478 మందికి గాను, 455 మంది హాజరు కాగా.. 23 మంది గైర్హాజరయ్యారని డీఈసీ మెంబర్స్ ప్రకాశంశెట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. రెండో రోజు 52 మంది హాజరు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో రెండో రోజు 52 మంది హాజరైనట్లు పరీక్షల సహాయ సంచాలకులు మధుకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన పరీక్షలో తెలుగు మీడియంలో 31 మంది, ఇంగ్లీష్ మీడియంలో 26 మంది మొత్తం 57 మంది అభ్యర్థులను అలాట్మెంట్ చేయగా.. తెలుగు మీడియంలో 28 మంది, ఇంగ్లీష్ మీడియంలో 24 మంది మొత్తం 52 మంది హాజరైనట్లు చెప్పారు. తెలుగులో ముగ్గురు, ఇంగ్లీష్లో ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. దీంతో 91 శాతం హాజరు నమోదయినట్లు వెల్లడించారు. -
ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుద్ది
వనపర్తి: ఎనిమిదిన్నర ఏళ్లుగా దేశ ప్రజలకు పట్టిన బీజేపీ శని మరో ఏడాదిన్నరలో విరగడవుద్దని, దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ సత్తువ కోల్పోయిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారులో జ్యోతిబాపూలే బీసీ వ్యవసాయ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్ఆర్ కేంద్రంలో అధికారంలోకి రావాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కి వచ్చాను. ధరలు పెంచి.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న బీజేపీకి పాలించే అర్హత లేదు’అని అన్నారు. నిరంజన్రెడ్డి సీఎంకు చాలా దగ్గరుంటడు.. ఏది కావాలన్నా ఈయనకు ఇస్తడు.. అందుకే చిన్నదైన వనపర్తి జిల్లాను ఇంతగా అభివృద్ధి చేశారన్నారు. అంతకుముందు నిరంజన్రెడ్డి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సమాన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదులసంఖ్యలో ఉన్న గురుకులాలను వంద సంఖ్యలోకి మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని సబిత చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని కమలాకర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జ్యోతిబాపూలే గురుకులాల రాష్ట్రకార్యదర్శి మల్లయ్యభట్టు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
Medchal: పెళ్లై ఆరు నెలలు గడవకముందే యువకుడి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్సిగ్నల్ వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
‘వైఎస్సార్లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
పెళ్లికి నిరాకరించిందని హత్య
ఖిల్లాఘనపురం: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ప్రియుడు మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపు రం మండలం మానాజీపేటలో ఈ నెల 5న జరగగా 8వ తేదీ సాయంత్రం వెలుగు చూసింది. మానాజీపేటకు చెందిన బత్తని అంజన్న 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి శంషాబాద్ దగ్గర జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు శ్రీశైలంకు మిత్రుల ద్వారా హైదరాబాద్లోని కాటేదాన్కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పడంతో అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో సాయిప్రియ శంకర్తో మాట్లాడటం మానేసింది. తర్వాత కరోనా ప్రభావంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం కుటుంబం మానాజీపేటకు వెళ్లింది. మళ్లీ మాటలు కలిసి.. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. ఈ క్రమంలో నెల 5న సాయిప్రియ భూత్పూర్ వరకు రాగా అక్కడి నుంచి శంకర్ బైక్పై మానాజీపేటలోని తన షెడ్ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శంకర్ సాయిప్రియ మెడలోని చున్నీతో గొంతు నులిమి చంపాడు. తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసు విచారణతో.. సాయిప్రియ ఇంటికి రాకపోవడంతో మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనాస్థలానికి చేరుకుని తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. -
పాలమూరులో వైద్య కళాశాలలు
-
పిల్లి దేవత.. వాహనమూ మార్జాలమే..! ఆ ఊరు పేరు కూడా..
సాక్షి, హైదరాబాద్: పిల్లి అపశకునమనే భావన చాలామందిలో ఉంటుంది. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఓ ఊళ్లో మాత్రం పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. ఆ శివాలయంలో మార్జాలమాత ప్రత్యేక స్థానంలో కనిపిస్తోంది. ఆ దేవత వాహనం కూడా మార్జాలమే. విచిత్రమేంటంటే ఆ ఊరు పేరు కూడా ఈ పిల్లితో పుట్టిందే. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం.. శ్రీశైలం ముంపు గ్రామం. నేలబిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్నగ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఈ ఊళ్లో ఓ శివాలయం ఉంది. స్వామిని ‘బెక్కేశ్వరుడు’గా కొలుస్తున్నారు. ఈ గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం ఉంది. పైన కుడి చేతితో తామరపుష్పాన్ని ధరించి, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం (పార్వతి?) ఉంది. ఆ శిల్పం దిగువన మార్జాల ముఖం, మానవ శరీరాకృతితో, మార్జాల వాహనధారిౖయె అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండటం, పిల్లి వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయంలోని ఈ ప్రత్యేకతను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్యాంసుందర్, చంద్రశేఖర్ సోదరులు గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పిల్లి పేరుతోనే ఊరు ‘పూర్వం ఆ గ్రామంలోని తాటివనంలో ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తుంటే ఓ పిల్లి తాగుతూ ఉండేదని, దాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పుట్టను తవ్వగా శివలింగం వెలుగుచూసిందని గాథ అక్కడ ప్రచారంలో ఉంది. కన్నడంలో పిల్లిని బెక్కగా పిలుస్తారు. ఆ పిల్లి పేరుమీదుగానే ఆ శివుడికి బెక్కేశ్వరుడని, గ్రామానికి బెక్కం అని పేరు పెట్టారన్నది స్థానికుల కథనం. ఈ ఆలయానికి 1065 జూలై11న కేతరస, రాజరసలనేవారు త్రైలోక్యమల్ల 1వ సోమేశ్వరుడి పాలన కాలంలో భూదానం చేసినట్టు శాసనం కూడా బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన ఇక్కడి త్రికూటాలయంలో లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఓ గర్భాలయంలో ఛత్రాపరితల సమలింగం ఉండగా, ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి.’ అని హరగోపాల్ పేర్కొన్నారు. -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్మన్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, వనపర్తి: పట్టణంలోని రాజనగరం అమ్మచెరువు కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన చేపల వలలో ఆదివారం కొండ చిలువ చిక్కింది. అటుగా వెళ్లేవారు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. 8 అడుగుల కొండ చిలువను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం స్నేక్ సాగర్కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేశారు. చదవండి: Photo Feature: కుక్క.. కోతి సయ్యాట -
నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్
సాక్షి,వనపర్తి: ‘ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేసిన అధికారులను ఎండలో నిలబెట్టేందుకు వెనుకాడబోం..’ అంటూ కలెక్టర్ షేక్యాస్మిబాషా మండిపడ్డారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ‘ప్రజావాణి’లో అడిషనల్ కలెక్టర్ ఆశిష్సంగ్వాన్తో కలిసి ఆమె మొత్తం 20అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే సమస్యపై అర్జీదారులు రెండోసారి రాకుండా పరిష్కరించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం 11 గంటలలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. హెచ్హెచ్పీపై కలెక్టర్ ఆగ్రహం వేరే వారి విద్యుత్ లైన్ను తమ పొలంలో వేయటంతో ఇటీవల షార్ట్ సర్క్యూట్ అయిందని కలెక్టర్కు గోపాల్పేట మండలం ధర్మాతండాకు చెందిన నార్యానాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది ఎకరాల్లోని మామిడితోటలో కొన్ని చెట్లు కాలిపోయాయన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్ అధికారులను ఎప్పుడు అడిగినా.. ‘కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉందంటూ..’ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చెప్పారు. కలెక్టరేట్ నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని గట్టిగా అడిగితే ధరణి ఆపరేటర్ (హ్యాండ్ హోల్డింగ్ పర్సన్) అనడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఎవరికీ ఫోన్ చేయలేదని హెచ్హెచ్పీ చెప్పుకొచ్చారు. ఇక జిల్లా కేంద్రంలో 8సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. కొందరు నాయకులు ఉపాధ్యాయ భవన్ స్థలంలో షాపులు నిర్మించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. ∙ -
Wanaparthy: రూ.1.20కోట్ల ప్యాకేజీతో అమెజాన్లో ఉద్యోగం
సాక్షి, పాన్గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్కుమార్రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. అనీష్కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో, ఇంటర్ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ (సీఎస్) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. చదవండి: (సర్కారు వారి పాట) -
వామ్మో.. ఇన్ని పాములా..!
సాక్షి, వనపర్తి: వనపర్తి శివారు నాగవరం వద్ద ఉన్న రామన్పాడు మెయిన్ వాల్వ్కు లీకేజీ ఏర్పడింది. బుధవారం మరమ్మతు చేసేందుకు సిబ్బంది అందులోకి దిగారు. అందులో కుప్పలుగా పాములు, పిల్లలు కనిపించడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకొని మెయిన్ వాల్వ్లో ఉన్న 3 పెద్దపాములు, 50 దాకా పాము పిల్లలను బయటకు తీసి సురక్షితంగా అడవిలో వదిలేశారు. పట్టుకున్న పాములు నీరుకట్ట అని కృష్ణసాగర్ తెలిపారు. చదవండి: నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై.. -
వనపర్తిలో మరో ‘సర్ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’
వనపర్తి క్రైం: పెళ్లి ఇష్టం లేని యువతి ‘సర్ప్రైజ్.. కళ్లుమూసుకో..’ అంటూ కాబోయేవాడి గొంతు కోసేసింది. ఇది సోషల్మీడియాలో హల్చల్ చేస్తుండగానే.. ఓ మహిళ తన భర్తను ఇలాగే ‘సర్ప్రైజ్’ చేసింది. ఇంట్లో ఏమీ బాగోలేదు.. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పింది. అదీ అర్ధర్రాతి బలిస్తే మంచిదని నమ్మిం చి ఒక్కడినే పంపించింది. అప్పటికే అక్కడ తన ప్రియుడిని, సుపారీ గ్యాంగ్ను సిద్ధంగా ఉంచింది. భర్తను చంపి పాతి పెట్టించింది. పొలం అమ్మితే వచ్చిన రూ.30 లక్షలు తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది. 3 నెలలైంది.. ఇంట్లో ఆయన, ఆమె లేరు. ఏమైందో ఎవరికీ తెలియదు.. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ మిస్టరీ తాజాగా బయ టపడింది. స్థానిక సీఐ ప్రవీణ్కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. (చదవండి: హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్) వివాహేతర సంబంధంతో.. వనపర్తిలోని గాంధీనగర్కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నా రు. మదనాపురం మండలం దంతనూర్కు చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్తో వెళ్లిపోవాలని నిశ్చ యించుకుంది. కానీ భర్త మళ్లీ ఎక్కడ అడ్డువస్తాడోనని చంపేయాలని ప్లాన్ చేసుకుంది. కోడిపుంజు పేరుతో.. వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీగ్యాంగ్ కురు మూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్ఫోన్ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయం తో మృతదేహాన్ని హైదరాబాద్లోని బాలాపూర్ శివారుకు తీసుకెళ్లి పాతిపెట్టారు. హత్య బయటపడిందిలా? బాలస్వామి కనిపించకపోవడం, ఫోన్ లిఫ్ట్ చెయ్య కపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మర్నాటి నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయింది. దీంతో లావణ్య, నవీన్లను పోలీసులు బుధవారం అదుపు లోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం బయట పడింది. కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ.2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) -
నాగుపాముకు సిమెంట్ కట్టు
వనపర్తి: నాగుపాము అంటేనే భయంతో పరుగులు పెడతాం. కానీ సర్పరక్షకుడిగా పేరొందిన సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు, హోంగార్డు కృష్ణసాగర్ తీరే వేరు. ఎక్కడైనా పాము కనిపించిందని ఫోనొస్తే.. తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఆదివారం వనపర్తి పట్టణం నాగవరం శివారులో కదిరెపాడు ధర్మయ్య ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా మట్టిపెడ్డలు పడి నాగుపాముకు గాయమైంది. ఇది గమనించి వారు కృష్ణసాగర్కు సమాచారమిచ్చారు. గాయంతో పాము ఇబ్బంది పడుతుండటం చూసి ఆయన పశువైద్యాధికారి ఆంజనేయులును ఆశ్రయించారు. ‘దాని ఎముక విరిగినట్టుంది.. ఎక్స్రే తీస్తేగానీ వైద్యం చేయలేం’ అని డాక్టర్ తేల్చారు. చివరకు డా.పగిడాల శ్రీనివాస్రెడ్డి ఆస్పత్రిలో పాముకు ఎక్స్రే తీశారు. పాముకు ఎముక విరగడంతో సిమెంట్ కట్టు వేశారు.దానికి చికిత్స పూర్తయ్యాక వనపర్తి చిట్టడవిలో వదిలేస్తానని కృష్ణసాగర్ తెలిపాడు. -
ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. మరో వ్యక్తితో పరిచయం.. ప్రియుడితో కలిసి..
Wanaparthy: ఐదు రోజుల్లోనే అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేత సంబంధం కారణంగానే భర్తను భార్యే ప్రియుడితో కలిసి చంపించింది. చివరకు నిందితులిద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి సీఐ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. వనపర్తి మండలం రాజపేట–పెద్దతండా శివారులోని బనిగానితండా చెరువులో ఈనెల 13న తండాకు చెందిన కురుమయ్య అలియాస్ కుమార్ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు విచారణలో హత్యగా తేల్చారు. బనిగానితండాకు చెందిన కురుమయ్య, అంజలికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. అనంతరం జీవనోపాధి కోసం వారు హైదరాబాద్కు వెళ్లారు. భర్త ఆటో నడుపుకొంటూ ఉండగా.. భార్య ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అలాగే కురుమయ్యకు వరుసకు తమ్ముడైన హరీష్ సైతం అక్కడే ఉంటూ ఆటో నడుపుతున్నాడు. రూంలో ఒక్కడే ఉండటంతో అతడిని కురుమయ్య ఇంటికి అప్పుడప్పుడూ రమ్మని పిలిచేవాడు. ఈ క్రమంలోనే హరీష్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. అప్పుడే భర్త కురుమయ్యకు డబ్బులు అవసరం ఉండటంతో హరీష్ను అడిగాడు. చదవండి: రాంగ్ నంబర్ ఫోన్కాల్తో పరిచయం.. ఘట్కేసర్లో సహజీవనం.. ఇస్తానులే అని అతను చెప్పడంతో సంక్రాంతి పండుగకు కురుమయ్య, భార్య అంజలి తండాకు వచ్చారు. ఈనెల 13న హైదరాబాద్ నుంచి కొత్తకోటకు వచ్చిన హరీష్, తన బామ్మర్దితో కలిసి మద్యంబాటిళ్లు తీసుకుని పెద్దతండా శివారులోని బండ్లచెరువు వద్దకు రమ్మని కురుమయ్యకు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత ముగ్గురూ మద్యం తాగారు. హరీష్ కర్రతో కురుమయ్య తలపై కొట్టగా బామ్మర్దితో కలిసి గొంతునులిమి చంపారు. అనంతరం వలలో అతడి మృతదేహాన్ని చుట్టి చేపల కోసం వెళితే చనిపోయినట్టు చిత్రీకరించారు. ఇదేమీ ఏమీ తెలియనట్టు 14న హరీశ్ బనిగానితండాకు వచ్చాడు. తన భర్త చెరువులో అనుమానాస్పదంగా చనిపోయినట్టు మరుసటి రోజు భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అందులో హత్యగా తేలడంతో మంగళవారం అంజలి, ప్రియుడు హరీష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు -
వనపర్తి జిల్లాలో దారుణం
-
మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న భర్త
సాక్షి, వనపర్తి: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ ఎస్సైని ఆమె భర్త రెడ్ హ్యండెడ్గా పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన జిల్లాలోని కొత్తకోటలో వెలుగు చూసింది. మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాలు.. కొత్తకోటకు చెందిన ఓ మహిళతో వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఇద్దరిని రెడ్ హ్యండెడ్గా పట్టుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. చదవండి: వివాహిత అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడంతో యువకుడి ఆత్మహత్య కాగా ఈ నెల 18న మహిళను కలిసేందుకు ఎస్సై షేక్ షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి చితకబాదారు. ఎస్సై ఎంత ప్రాధేయపడినా ఆగకుండా కొట్టారు. అడ్డువచ్చిన భార్యను కూడా చెంప చెళ్లుమనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఎస్సైని వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అలాగే సదరు ఎస్సైని పోలీసు ఉన్నతాదికారులు సస్సెండ్ చేశారు. అయితే గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో ఉండి ఇలా నీచ బుద్ది చూపించిన ఎస్సై షేక్ షఫీపై పులువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి.. -
గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500
TRS MPTC Working As Shepherd At Daily Wage Rs.500 Wanaparthy District Pangal Mandal Pics Goes Viral పాన్గల్ (వనపర్తి జిల్లా): ఇతని పేరు సుబ్బయ్యయాదవ్. వనపర్తి జిల్లా పాన్గల్ మం డలం శాగాపూర్కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు. ఆయన ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామానికి చెందిన ఆడేం రాములు, కొమ్ము బిచ్చన్న వద్ద గొర్రెల కాపరిగా రూ.500ల రోజువారీ కూలికి రెండు రోజులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సుబ్బయ్యయాదవ్ పేర్కొంటున్నారు. (చదవండి: హరీశ్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో) -
36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని.. ఫేస్బుక్ కలిపింది!
సాక్షి, మదనాపురం(మహబూబ్నగర్: ఏడేళ్ల ప్రాయంలో తప్పిపోయింది. ఎక్కడో పెరిగింది. పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని ఫేస్బుక్ కలిపింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నిలివిడికి చెందిన క్యాసాని నాగన్న, తారకమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ, వెంకటేష్, కృష్ణ సంతానం. కాగా, 1985లో హైదరాబాద్లో ఒకరి ఇంట్లో పనిచేసేందుకు ఏడేళ్ల మంగమ్మను కుదిర్చారు. మూడు రోజుల అక్కడే ఉన్నా.. తర్వాత తల్లిదండ్రులపై బెంగతో బయటకు వచ్చింది. అదే ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తి తల్లిదండ్రులను చూపిస్తానంటూ ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపనికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చర్చి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయాడు. చదవండి: Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్ భాస్కర్నాయక్ పరిచయంతో..: చర్చి ముందు రోదిస్తున్న ఆ చిన్నారిని కనగల సామెలు గమనించి తమ ఇంటికి తీసుకెళ్లాడు. తన సంతానంతోపాటు మంగమ్మనూ పెంచి పెద్దచేశాడు. కొల్లిపర మండలం దవులూరుకు చెందిన అంబటి దాసుతో వివాహం చేశాడు. వీరికి శాంతకుమారి, వసంతకుమారి జన్మించారు. 2019లో శాంతకుమారిని యాలవర్రుకు చెందిన కిష్టఫర్తో వివాహం జరిపించారు. అయితే.. తన తల్లిదండ్రులు, తోబుట్టువులను చనిపోయేలోపు చూస్తానన్న ఆశ నెరవేరుతుందో.. లేదో.. అని మంగమ్మ బాధపడుతుండేది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కిష్టఫర్.. గూగుల్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియా ద్వారా మంగమ్మ కుటుంబసభ్యుల గురించి తెలుసుకోడానికి యతి్నంచాడు. ఈ క్రమంలో ఫేస్బుక్ లో నెలివిడికి చెందిన భాస్కర్నాయక్ పరిచయమయ్యాడు. ఆమె వివరాల ను భాస్కర్ కూడా పరిశీలించాడు. అలా కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసింది. ఆమె సోదరులు వెంకటేష్, కృష్ణ 3 రోజుల క్రితం దవులూరుకు వెళ్లి మంగమ్మతో పాటు భర్త దాసును సోమవారం స్వగ్రామానికి తీసుకొచ్చా రు. ఒక్కసారిగా తండ్రిని చూడగానే మంగమ్మకు కన్నీళ్లు ఆగలేదు. అక్కతో పాటు బావ, కోడళ్లకు చీర, సారెలు పెడతామని తమ్ముళ్లు తెలిపారు. -
వనపర్తి కిడ్నాప్, దాడి కేసు: శ్రీకాంత్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: వనపర్తి జిల్లాలో కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో బాధితుడి శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతన్ని శనివారం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. కాగా వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం సంపత్ రావుపల్లికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తికి, హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్కు మధ్య డబ్బు విషయంలో గొడవ ఏర్పడగా.. శ్రీకాంత్ను అతని కుటుంబ సభ్యులను చంద్రయ్య సంపత్రావుపల్లిలో తన ఇంట్లో నిర్భంధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా.. కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఇవి విన్న చుట్టుపక్కల వారు వెంటనే డయల్ 100కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు విముక్తి కల్పించారు. పోలీసుల రాకను గమనించిన చంద్రయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న విపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: డబ్బు విషయంలో తగాదా.. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి.. -
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని
వనపర్తి క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం.. వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటోంది. ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యా లయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు. తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లోనే మధ్యాహ్నం ఉరేసుకొని చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం. -
చెల్లి వరుసయ్యే బాలికపై లైంగిక దాడి
సాక్షి, వనపర్తి: కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్యే కామంతో కళ్లు ముసుకుపోయి చెల్లి వరుసయ్యే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జిల్లాకేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. బాలసదనంలో ఉండే ఓ బాలికను ఇటీవల జమ్ములమ్మ పండుగ కోసం గార్డియన్ అభ్యర్థన, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు బయటకు పంపించారు. సోమవారం ఇంటి ఆవరణలో ఉన్న అమ్మాయిని వరుసకు అన్నయ్య వెంకటేష్ అనే యువకుడు బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గార్డియన్ ఇచ్చిన సమాచారం మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్లు రూరల్ ఎస్ఐ షఫీ తెలిపారు. బాలికలకు తల్లీ తండ్రి ఇద్దరూ లేరు. -
వనపర్తి :మిద్దె కూలిపోవడంతో ఇద్దరు మృతి
-
కస్టమర్లపై కాసుల వర్షం
-
వైరల్: 100 విత్డ్రా చేస్తే.. రూ. 500
సాక్షి, అమరచింత: సాధారణంగా మనం ఏటీఎంకు వెళ్లి.. అన్నీ సరిగా నొక్కితేనే కావాల్సిన డబ్బులు వస్తాయి. అలాంటిది ఈ ఏటీఎంలో మాత్రం ఏకంగా కావాల్సిన దాని కంటే ఐదింతలు ఎక్కువ వచ్చింది. వనపర్తి జిల్లా అమరచింతలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు చెందిన ఇండియా–1 ఏటీఎంను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం రూ.100 విత్డ్రా కోసం కొడితే ఏకంగా రూ.500 బయటకు రావడంతో ఖాతాదారులు వరుస కట్టారు. రూ.రెండు వేల విత్డ్రా కోసం యత్నిస్తే రూ.10 వేలు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వచ్చి డబ్బులు డ్రా చేసుకోవడంతో జనసందోహం నెలకొంది. పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులు అక్కడ గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టి ఆరా తీసి, ఏటీఎంకు తాళం వేసి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వంద నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్టడం వల్లే.. రెండు రోజులకోసారి ఈ ఏటీఎంలో నగదును నిల్వ చేయడానికి వస్తున్న సిబ్బంది తప్పిదం వల్లే ఇలా జరిగిందని బయటపడింది. రూ.100 నోట్ల కట్టల స్థానంలో రూ.500 నోట్లను పెట్టారు. దీంతో రూ.100 విత్డ్రా కోసం నొక్కితే రూ.500 వచ్చా యని నిర్వాహకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా కొన్ని గంటల్లోనే రూ.5,80,000 అదనంగా విత్డ్రా అయ్యాయని తేలింది. చివరకు సీసీకెమెరాల ఆధారంగా ఏటీఎం కార్డు, ఖాతా నంబర్లు సేకరించి డ్రా చేసుకున్న అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఫోన్లలో ఖాతాదా రులకు సమాచారం ఇచ్చారు. చివరకు రూ.1.2 లక్షలు రికవరీ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో ఏటీఎం సిబ్బందికి ఖాతాదారులు సహకరించాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని ఎస్ఐ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. -
నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్కాల్..
అమరచింత/ వనపర్తి: దేశ రక్షణలో తానూ భాగస్వామిని అవుతానని తరచూ చెబుతూ ఆర్మీలో ఎంపిక కోసం అహర్నిశలు కష్టపడ్డాడు ఆ యువకుడు. చివరకు అనుకున్నది సాధించి ఆర్మీలో చేరిన రెండేళ్లకే విధుల్లో ఉంటూనే తనువు చాలించాడు. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన మాసమ్మ, గొల్లబాబు దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రజనీకుమార్ (21) ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుని రెండేళ్ల క్రితం ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అరుణాచల్ప్రదేశ్లో బోర్డర్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల తాత కావలి సత్యన్న మృతి చెందాడన్న సమాచారం అందగా అంత్యక్రియలకు రాలేకపోయాడు. అయితే దశదినకర్మకు ఎలాగోలా హాజరయ్యాడు. రెండు నెలల పాటు సెలవు తీసుకుని కుటుంబసభ్యులతో గడిపి తిరిగి జనవరి 29న విధుల్లో చేరాడు. తల్లిదండ్రులతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తండ్రితో ఫోన్లో ‘నాన్నా.. నేను బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు.. ’అని యోగక్షేమాలు తెలుసుకున్నాడు. ఇక్కడంతా బాగానే ఉందని చెబుతూనే.. రాత్రి బిర్యానీ తినడం వల్ల కడుపునొప్పి వస్తుందని చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి చూయించుకో అని తండ్రి సలహా ఇచ్చినా.. అదే తగ్గిపోతుందిలే అని బదులిచ్చాడు. బోర్డర్లో కాపలా కాసేందుకు సోమవారం నుంచి వేరేచోట విధుల్లోకి వెళ్తున్నానని చెప్పాడు. అయితే అక్కడి స్టోర్రూంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరివేసుకుని చనిపోయాడని.. తల్లిదండ్రులకు మిలిటరీ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఉదయం సమాచారం అందింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని, ఏదో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటాడని వారు పేర్కొంటున్నారు. చదవండి: పుట్టిన రోజే మృత్యు ఒడికి..! -
పెళ్లింట ఆడిపాడి.. మరునాడు కారు డిక్కీలో!
సాక్షి, అమరచింత(వనపర్తి జిల్లా): పెళ్లి వేడుకల్లో హుషారుగా ఆడిపాడి, చిందులేసిన ఓ బాలుడు కొన్ని గంటల్లోనే కారు డిక్కీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన కతాల్ తన కూతురి వివాహాన్ని ఆదివారం జరిపించారు. ఇదే గ్రామానికి చెందిన మోహిద్(16) సమీప బంధువు కావడంతో ఈ వేడుకలో పాల్గొన్నాడు. తీరా ఆ ఇంటి ఎదుట ఆగి ఉన్న ఓ కారులో సోమవారం సాయంత్రం శవమై కనిపించాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. నా అనే వారు లేక.. అమరచింత పట్టణానికి చెందిన భాను, అఫ్సర్ దంపతులకు మోహిద్ ఒక్కగానొక్క కుమారుడు. గతంలోనే భార్యను వదిలిపెట్టి అఫ్సర్ ఎటో వెళ్లిపోగా రెండేళ్ల క్రితం ఆమె కేన్సర్తో మృతి చెందింది. దీంతో నా అనేవారు లేక ఒంటరిగా ఉన్న మోహిద్ చిన్న, చిన్న కూలి పనులను చేసుకుంటూ రోజువారీ జీవనాన్ని సాగించేవాడు. ఈ క్రమంలోనే తమకు దగ్గరి బంధువు అయిన కతాల్ ఇంట్లో జరుగుతున్న పెండ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ బాలుడు ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రించడానికి వెళ్లిపోయాడు. హైదరాబాద్కు చెందిన కతాల్ బావమరిది ఇసాక్ తీసుకొచ్చిన కారు డిక్కీలో సోమవారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండటం చూసి అందరూ కన్నీరు మున్నీరయ్యారు. డిక్కీలో ఊపిరి ఆడక చనిపోయాడా? లేక ఎవరైనా అందులో పడవేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్
సాక్షి, మహబూబ్నగర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ఎల్లూరు వద్ద నీట మునిగిన కేఎల్ఐ ప్రాజెక్టు మోటర్లను పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను వనపర్తి జిల్లా పెబ్బేర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెబ్బేరులో ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్నాయి. అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెన్షన్తో పాటు కరోనాను పంచాడు..
సాక్షి, మహబూబ్నగర్ / వనపర్తి: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. నేడు రాష్ట్రంలో అత్యధికంగా 3,018 కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వనపర్తిలో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమే కాక.. జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఓ పెన్షన్ పంపిణీదారుడి వల్ల చిన్నంబావి జోన్లో పది రోజుల వ్యవధిలో ఏకంగా 100 మందికి కరోనా సోకినట్లు సమాచారం. వివరాలు.. సుమారు పది రోజుల క్రితం గ్రామస్తులకు పెన్షన్ పంపిణీ చేయడం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఒక పోస్ట్మ్యాన్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని కలిసిన వారికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత వారు కలిసిన వారు వైరస్ బారిన పడ్డారు.(చదవండి: తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు) ప్రస్తుతం ఈ కేసులు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారాయి. పోస్ట్మ్యాన్ని కలిసిన వారిని గుర్తించి.. ఆ తర్వాత వారు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో మెగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ డ్రైవ్ ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోమ్ క్వారంటైన్తో పాటు లాక్డౌన్ పాటిస్తున్నారు. బుధవారం నాటికి వనపర్తిలో 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలో గత వారం రోజుల్లో 337 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. -
ఈ ధాన్యం ఎవరిది?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వనపర్తి తహసీల్దార్ రాజేందర్గౌడ్, పౌరసరఫరాల శాఖ డీఎం అశ్విన్కుమార్ గురువారం వనపర్తి పట్టణంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వీరి పరిశీలనలో పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాల నిల్వలు గుర్తించారు. అలాగే 200 క్వింటాళ్లకు పైగా బియ్యం అక్రమంగా ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు సీల్ వేశారు. ఆరా తీస్తున్న అధికారులు ఈ మిల్లుకు గత ఖరీఫ్ సీజన్లో 21వేల బస్తాల వరి ధాన్యం అప్పగించారు. కాగా ఈ మిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 300 బస్తాల (150 క్వింటాళ్ల) బియ్యం మాత్రమే అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం, 150 క్వింటాళ్ల బియ్యం ఎక్కడిదని అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో అక్రమ దందాకు పాల్పడిన వారే ఇక్కడ నిల్వ చేశారా.. లేదా మిల్లు యాజమాన్యమే నిల్వ చేసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. లెక్కల్లో చూపని దాదాపు లక్ష వరి బస్తాల ధాన్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై డీఎస్ఓ రేవతిని వివరణ కోరగా కేదార్నాథ్ మిల్లు 150 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందన్నారు. అయితే ఇంత భారీగా ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎవరివో విచారణ చేస్తున్నామన్నారు. అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
రాఖీ కట్టి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
సాక్షి, వనపర్తి: రాఖీ పండుగరోజు జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామం వద్ద విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సుఢీకొట్టిన ఘటనలో అన్నాచెల్లెలు మృత్యువాత పడ్డారు. మరో చెల్లెలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు తూంకుంటకు చెందిన సుధాకర్, నందినిగా తెలిసింది. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెద్దదగడకు వెళ్లి సోదరుడికి రాఖీకట్టి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (మృత్యుపాశమైన బావి) -
డెంగీతో ఐఐటీ విద్యార్థిని మృతి
వనపర్తి, అమరచింత: పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్ తండాకు చెందిన సీత్యానాయక్ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు. (రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..) -
తల్లీ, తండ్రి లేనోడన్నా కనికరించలే..!
వనపర్తి: పుట్టుకతో వికలాంగుడు పెన్షన్ ఇప్పించండనీ ఎంత మందిని వేడుకున్నా కనికరించలేదని ఓ వృద్ధురాలు సాయం కోసం కలెక్టర్ను ఆశ్రయించారు. వికలత్వ శాతంను ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్ మంజూరై రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆసరా పెన్షన్ మంజూరు చేయలేదు. నలుగురు కార్యదర్శులు మారినా మాకుమాత్రం పెన్షన్ రాలేదని ఆ వృద్ధురాలు మనవడిని చూస్తూ అధికారులను వేడుకుంది. స్పందించిన డీఆర్డీఓ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారా అనే విషయంపై విచారణ చేయగా.. 2019 డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కె.అరుణ్కు ప్రభుత్వం నుంచి 2018 మే 9న సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. 47శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మనే పెంచుతోంది. (దయ.. ‘తల్లి’చేదెవరు!) -
మంటల్లో దూకి యువకుడి ఆత్మహత్య
సాక్షి, వనపర్తి : తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఉప్పరిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్(22) ఇంటర్ వరకు చదువుకుని ఐటీఐ పూర్తి చేశాడు. కాగా, ఇటీవల తల్లి కళావతి, అన్న మహేష్లు అప్పులు చేసి రూ.4లక్షలు పెట్టి భూమి కొన్నారు. ఈ భూమిని కొనడం ఇష్టం లేని రాజేష్ తాను వనపర్తిలో అద్దె ఇంట్లో ఉంటూ ఏదైనా పనిచేసుకుంటానని తనకు డబ్బులు ఇవ్వాలని తల్లీ, అన్నలపై ఒత్తిడి తెచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంద్ ఉందని, లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్లమని నచ్చజెప్పారు. అయినప్పటికీ పట్టించుకోకుండా రాజేష్ డబ్బులు అడిగేవాడు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన రాజేష్ సోమవారం పొలం దగ్గరకు వెళ్లి కొత్తకుంట చెరువు ప్రాంతంలో పొదగా ఉన్న ముళ్లపొదకు నిప్పు పెట్టి అందులో దూకాడు. మంటలు భారీగా వాపించడంతో పూర్తిగా కాలిపోయాడు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామస్వామి తెలిపారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో సంఘటన స్థలం దగ్గరే పోస్టుమార్టం నిర్వహించారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య కొత్తకోట : అప్పుల బాధతో ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గొడుగు చంద్రశేఖర్(25) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం డీసీఎంను కొనుగోలు చేశాడు. నాలుగు నెలలుగా డీసీఎంకు ఎలాంటి కిరాయిలు లేకపోవడంతో నెలవారి వాయిదా కట్టడానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో పాటు గతంలో డీసీఎం కొనుగోలుకు తెచ్చిన అప్పులు అదేవిధంగా ఉన్నాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి శాంతన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’
సాక్షి, మహబూబ్నగర్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యావద్దేశం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఖాకీలు ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ప్రజల్ని ఇష్టానురీతిలో హింసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వార్తల్లో నిలిచే హింసాత్మక ఘటన ఒకటి తాజాగా వనపర్తిలో చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ పిల్లాడు మొత్తుకుని ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించారు. ‘‘ డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ ’’ అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ్రతిమలాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు. ( గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్ సీరియస్ ) ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని, అతడి తండ్రిని జీపులో కుక్కి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్ మినిష్టర్ మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని పేర్కొన్నారు. -
తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ..
-
మాకు ఊపిరి పోస్తారా..?
సాక్షి, వనపర్తి : వేపచెట్లను బతికించుకోవడంపై అధికారుల్లో ఇంకా చలనం రావడం లేదు.. ‘ఔషధ గనికి ముప్పు’ శీర్షికన వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలో వేపచెట్లు మాత్రమే ఎండిపోతున్నాయని ‘సాక్షి’లో జనవరి 5న ప్రచురించిన కథనానికి కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం శాస్త్రవేత్తలు స్పందించారు. మరునాడే గ్రామాన్ని సందర్శించి వేపచెట్లకు సోకిన వైరస్ను తెలుసుకునేందుకు కొమ్మలు, ఆకులు, కాండం బెరడు సేకరించి ల్యాబ్ పంపించారు. అదేరోజు తెగులును అదుపు చేసేందుకు కార్బన్ డజిం అనే ఫెస్టిసైడ్ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సర్పంచ్ రాజవర్ధన్రెడ్డి గ్రామస్తులతో సమాలోచన చేసి కొన్ని చెట్లకు పిచికారీ చేయగా.. అవి మళ్లీ పచ్చని ఆకులను చిగురిస్తోంది. పత్రికల్లో వార్త వచ్చిన నాలుగైదురోజులు హడావుడి చేసిన స్థానిక పాలకులు, అధికారులు తర్వాత మళ్లీ చెట్ల విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకుని ఎంతో దూరం నుంచి పనివదులుకు వచ్చిన శాస్త్రవేత్తలు చేసిన సూచనలు, సలహాలు పాటించి ఉంటే ఎండినట్లు గుర్తించిన సుమారు 2 వేల చెట్లు ఇప్పటికే మళ్లీ చిగురించేవి. కానీ, స్థానిక అధికారులు, పాలకులు నామమాత్రపు చర్యలతో మమా అనిపించడంతో కొన్ని చెట్లు మాత్రమే పూర్వవైభవాన్ని సంతరించుకుని పచ్చని ఆకులను చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. హరితహారంపై ఉన్న ధ్యాస.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు, పాలకులు దశాబ్దాల నాటి వేలాది చెట్లను రక్షించుకునే విషయంలో ఎందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే గ్రామంలో సుమారు రెండు వేల చెట్లు ఎండిపోతున్నాయి, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు పాటిస్తే వాటన్నింటినీ బతికించుకోవచ్చు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డిప్లోడియా ఫంగస్గా గుర్తింపు కంభాళాపురంలో వేపచెట్లకు వచ్చిన వైరస్ డిప్లోడియా ఫంగస్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. పలుమార్లు గ్రామాన్ని సందర్శించి చెట్లకు పిచికారీ చేసే మందుల పేర్లు, ఎక్కడ లభిస్తుంది.. ఎలా వాడాలనే విషయంపై సూచనలు చేశారు. సకాలంలో స్పందించనందుకే.. సకాలంలో స్పందించి మందు పిచికారీ చేసినందుకే.. కొన్ని వేపచెట్లు మళ్లీ చిగురించాయి. లేదంటే వైరస్ పక్కనున్న గ్రామాలకు పాకేది. ఎండిన చెట్లలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి కూడా ఉన్నాయి. వాటికి ప్రాణం పోసిన తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తోంది. – రాజేంద్రకుమార్రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త 13 చెట్లకు పిచికారీ చేశాం గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షలు చేసి మందు నీటిలో కలిపి పిచికారీ చేయమన్నారు. ఆలయం వద్ద, ప్రధాన కూడళ్లలో ఉన్న 13 చెట్లకు కార్బన్డజిం మందును నీటిలో కలిపి పిచికారీ చేయడంతో అవన్నీ మళ్లీ చిగురించాయి. మిగతా వాటికి పిచికారీ చేయలేదు. వాటంతట అవే బతికే అవకాశం ఉంది. – రాజవర్ధన్రెడ్డి, సర్పంచ్, కంభాళాపురం -
ఎన్నికల బరిలో భార్యా భర్తలు..
సాక్షి, కొత్తకోట: మున్సిపల్ ఎన్నికల బరిలో ఇద్దరు భార్యాభర్తలు బరిలో నిలిచారు. ఒక జంటలో భర్త శ్రీనివాసులు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తుండగా, భార్య మాజీ సర్పంచ్ అయినటువంటి అరుణ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో పోటీపడుతున్నారు. ప్రస్తుతం అరుణ పోటీ చేస్తున్న 9వ వార్డులో టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి సుఖేశిని పోటీలో ఉన్నారు. అలాగే మరో జంట అయినటుంటి వారిలో నాగన్న 8వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పద్మజ 12వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. వీరిద్దరు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో బరిలో నిలిచారు. కాగా నాగన్న గతంలో 13 వార్డుసభ్యుడిగా పనిచేయగా, పద్మజ గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురికి రాజకీయంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. -
అమరచింత ఇదీ చరిత్ర..
సాక్షి, అమరచింత (కొత్తకోట): ఒకప్పుడు అమ్మాపురం సంస్థానంతోపాటు అమరచింత కూడా సంస్థానంగా విరాజిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో అమరచింత సంస్థానం అప్పట్లో 69 గ్రామాలను కలిగి దాదాపు 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థాన పరిపాలన అమ్మాపురం కేంద్రంగా కొనసాగుతుండేది. కాకతీయుల కాలంలో క్రీ.శ. 1676లో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి సంస్థానాన్ని అభివృద్ధిపర్చారు. మహారాణి భాగ్యలక్ష్మీదేవమ్మ అమ్మాపురంను కేంద్రంగా చేసుకుని అమరచింతను పరిపాలిస్తున్న కాలంలో సంస్థానంగా వెలుగొందింది. సంస్థానాల విలీనం తర్వాత.. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. నిజాం పరిపాలన ముగిసిన తర్వాత సంస్థానాలను విలీనం చేశారు. దీంతో సంస్థాన కేంద్రంగా కొనసాగిన అమరచింతను నియోజకవర్గ కేంద్రంగా రూపొందించారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టిసారిస్తూ వచ్చారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో అమరచింత నియోజకవర్గాన్ని రద్దుపర్చడంతో కేవలం అమరచింత ఓ గ్రామంగా మారింది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో.. తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన క్రమంలో ఒకప్పుడు అమరచింత సంస్థాన కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన అభివృద్ధిలో వెనుకబడటంతో ప్రభుత్వం అమరచింతను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో సంస్థానాన్ని కోల్పోయిన అమరచింత నియోజకవర్గ కేంద్రాన్ని కోల్పోయి ప్రస్తుతం మున్సిపాలిటీ కేంద్రంగా రూపాంతరం చెందింది. -
మిగిలింది ఒక్కడే..!
చిన్నంబావి (వనపర్తి): క్షణికావేశం.. ఆ కుటుంబంలో ఉన్న నలుగురిలో ముగ్గురిని బలిగొంది. కాలిన గాయాలతో తండ్రి, చెల్లి గురువారం మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన తల్లి సైతం శుక్రవారం మృతిచెందింది. దీంతో నాకు దిక్కెవరు అంటూ కుమారుడు సుజన్ రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మండలంలోని అయ్యవారిపల్లిలో క్షణికావేశంలో కుటుంబ కలహలతో భర్త జయన్న(40) తన భార్య, కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించగా గురువారం జయన్న, కూతురు గాయత్రి(17) మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వరలక్ష్మి(35) శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇంటికి పెద్దదిక్కు తమ కుటుంబాన్ని మొత్తాన్ని పోషించేది అమ్మేనని, తన చిన్నతనం నుంచి తమ కోసం ఎంతో కష్టపడిందని గుర్తుచేసుకున్నాడు. అంగన్వాడీ టీచరుగా పనిచేస్తు తమకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుందని, ఇప్పుడు అకాలంగా నన్ను విడిచి వెళ్తుందని ఎన్నడూ అనుకోలేదని కొడుకు సుజన్ రోదించాడు. ఎవరి కోసం బతకాలి.. కుటుంబంలో అందరిని కోల్పోయి ఒంటరిగా మిగిలాడు సుజన్. తనకు జీవితం మీద ఇష్టం లేదని, తను ఇంక ఎవరి కోసం బతకాలని తను చనిపోయి ఉన్నా బాగుండు అని రోదించాడు. గురువారం జయన్న, గాయత్రి మృతదేహలకు సర్పంచ్ రామస్వామి, గ్రామస్తుల సహకారంతో ఖననం చేశారు. -
రైతుల ఆశలకు గండి
వనపర్తి: ఆసియాలోనే సైఫన్ సిస్టంతో పనిచేసే రెండో ప్రాజెక్టు సరళాసాగర్కు దశాబ్దకాలం తర్వాత పూర్తిస్థాయిలో నీరు చేరిందన్న అన్నదాతల ఆశలకు గండి పడింది. రెండు నెలలుగా భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సరళాసాగర్కు రెండు వైపుల నుంచి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వనపర్తి జిల్లాలోని 16 గ్రామాల్లో వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా పేరొందిన సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం గండిపడటంతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాజెక్టు చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు రెండుసార్లు పుష్కలంగా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఖాళీ అవడంతో ప్రస్తుత యాసంగికి నారుమడులు సిద్ధం చేసిన రైతులు నిరాశకు గురయ్యారు. నిర్దేశిత ఆయకట్టు.. సరళాసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద 4,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీరు పుష్కలంగా ఉండటంతో నిర్దేశిత ఆయకట్టు కంటే ఎక్కువనే సాగు చేస్తారు. సుమారు 5 వేల ఎకరాల్లో యాసంగి వరి నాటేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రాజెక్టుకు గండిపడటంతో సరళాసాగర్ ప్రాజెక్టు కింది రైతులు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రాజెక్టుకు గండిపడినప్పుడు ఉధృతంగా దిగువకు పారిన నీరు కొద్ది కొద్దిగా గండి వెడల్పును పెంచుతూ వచ్చింది. ఉదయం 9.30 గంటల సమయానికి గండి 30 మీటర్ల వెడల్పునకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న 0.5 టీఎంసీల నీరు పూర్తిగా దిగువకు వెళ్లటంతోపాటు ఇంకా సరళా ప్రాజెక్టులోకి కొమిరెడ్డిపల్లి వాగు నుంచి వస్తున్న కేఎల్ఐ నీరు సైతం గండిపడిన ప్రదేశం నుంచి రామన్పాడ్ ప్రాజెక్టుకు వెళ్తోంది. మంత్రి అప్రమత్తతతో.. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉదయం 8 గంటలకు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. నీరు ఉధృతంగా దిగువకు వెళ్తుండటంతో రామన్పాడ్ జలాశయం అధికారులను అప్రమత్తం చేసి గేట్లను ఎత్తింపజేశారు. అధికారులు పది గేట్ల నుంచి రామన్పాడ్ నుంచి నీటిని కృష్ణానదిలోకి ఊకచెట్టువాగు నుంచి వదిలేశారు. దీంతో ముప్పు తప్పింది. లేదంటే భీమా ప్రాజెక్టు లిఫ్టులు, సరళాసాగర్ లిఫ్టు, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరందించే.. ఇంటెక్వెల్స్ సైతం మునిగిపోయేవి. నాలుగు గంటలపాటు దిగువకు.. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సుమారు నాలుగు గంటలపాటు సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు పారింది. సరళాసాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 0.5 టీఎంసీలు పూర్తిగా ఖాళీ అయ్యింది. 22 అడుగులకు చేరినా.. సరళాసాగర్ జలాశాయం సామర్థ్యం 22 అడుగుల వరకు నీరు చేరినా.. సైఫాన్లు తెరుచుకోలేదు. ప్రాజెక్టులోని సైఫాన్ల పక్కన ఉన్న మట్టికట్టపై చెట్లు పెరిగి కట్టబలహీనంగా మారింది. ఏదైనా మరమ్మతు చేయాలని గడిచిన నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు సమీప గ్రామాల రైతులు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా వారు అధికారులు స్పందించలేదు. రైతులు చెప్పిన వెంటనే అప్రమత్తమై ఉంటే.. ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు. సాగుపై తీవ్ర ప్రభావం.. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి చుట్టుపక్కల 16 గ్రామాల రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ప్రాజెక్టు పైభాగంలో వర్నె, ముత్యాలపల్లి, కనిమెట్ట, పాతజంగమాయపల్లి, చిలకోటినిపల్లి, బలీదుపల్లి, కన్మనూరు ఉండగా.. నిర్దేశిత ఆయకట్టు గల దిగువ ప్రాంతంలో అజ్జకొల్లు, శంకరంపేట, రామన్పాడ్, తిరుమలాయపల్లి, కొన్నూరు, నెల్విడి, నర్సింగాపుర్ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం గండి పడటంతో సాగునీటిపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. రెండోసారి గండి.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు రాజారామేశ్వర్రావు తన తల్లి సరళాదేవి పేరున ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏడు దశాబ్దాల క్రితం రూ.35 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ఆటోమెటిక్ సైఫాన్ సిస్టంతో ఈ ప్రాజెక్టును నిర్మించి 1959లో ప్రారంభించారు. ఆ తర్వాత 1964లో ఒకసారి భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండి సైఫాన్స్ పక్కనే కుడివైపు కట్టకు గండిపడింది. నీటి ప్రవాహానికి కొన్నూరు, మదనాపురం గ్రామాల మధ్యలోని రైల్వేలైన్ సైతం పెకిలిపోయి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మళ్లీ 55 ఏళ్ల తర్వాత ఈసారి ఎడమవైపు సైఫాన్స్కు పక్కనే కట్టకు గండిపడంది. పరిశీలించిన మంత్రి, కలెక్టర్ వనపర్తి జిల్లాకే తలమానికంగా చెప్పుకొనే సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపండిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్పీ అపూర్వరావు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సరళాసాగర్ ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ఎలాంటి సాంకేతిక లోపాల కారణంగా గండిపడిందో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి గండి పడిన ప్రాంతాన్ని చూశారు. కొందరు స్థానికులు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపారు. అధికారులకు విన్నవించా.. ఇరిగేషన్ అధికారులకు సరళాసాగర్ ప్రాజెక్టు కట్ట బలహీనంగా మారింది. రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతోంది. ఒక్కసారి పర్యవేక్షణ చేయాలని గత పదిరోజుల క్రితం చెప్పాను. అధికారులు స్పందించి రెండు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేసి కట్టకు మరమ్మతు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.– కురుమూర్తి, రైతు, శంకరంపేట, మదనాపురం మండలం -
సరళాసాగర్కు గండి!
సాక్షి, నాగర్కర్నూల్/వనపర్తి: అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్పాడు జలాశయానికి చేరింది. అక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం, ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గండి పడింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్పీ అపూర్వరావు తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం సరళాసాగర్కు గండి పడిన విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టును పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మైనర్ ఇరిగేషన్ సీఈ అమీద్ఖాన్, ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టుల సీఈ అనంతరెడ్డి గండిపడిన ప్రాంతానికి వెళ్లి పునర్నిర్మాణానికి సర్వే చేపట్టారు. ప్రాజెక్టుకు మరమ్మతులు, స్థాయి పెంపుపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఆసియా ఖండంలోనే తొలి సైఫన్ సిస్టం.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో 1947లో ప్రాజె క్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నా యి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు. ఈసారి భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుం చి వచ్చిన నీటి ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిని నింపారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది. 25 ఏళ్లుగా మరమ్మతులు లేవు.. 25 ఏళ్లుగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపించారు. 10రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు కట్ట బలహీనంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టా లని నీటి పారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. కాగా, ఈ నెల 24న ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా.. మండలంలోని ఓ ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని అధికారులు గేట్లు తెరవలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు గొడవ చేయటంతో ఆలస్యంగా 26న కాల్వలకు నీటి విడుదల చేశారు. అయితే సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో 27న బంద్ చేసి 28 నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీరు వదిలారు. ఇలా మూడ్రోజుల జాప్యం కారణంగానే గండి పడిందని రైతులు చెబుతున్నారు. ఆయకట్టుకు సాగు నీరిస్తాం.. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగునీరు అందిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. కేఎల్ఐ పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి ఈ ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కుడి, ఎడమ, సమాంతర కాల్వలతో అనుసంధానం చేసి యాసంగి పంటలకు నీరిస్తామని తెలిపారు. -
పూడ్చేందుకు స్థలం లేక రోజంతా అవస్థలు
వనపర్తి, అమరచింత(కొత్తకోట): గ్రామానికో శ్మశానవాటిక ఉండడం ప్రతి ఒక్కరం చూశాం. కానీ మండలంలోని ఈర్లదిన్నెకి ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఏ ఒక్కరు చనిపోయిన అంతిమయాత్రతో పాటు దహన సంస్కారాలు చేయడానికి స్థలం కరువైంది. దీంతో చనిపోయిన వారికి అంతిమయాత్ర నిర్వహిద్దామనుకున్న వారికి అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. గ్రామానికి సమీపంలో జూరాల ప్రాజెక్టు బ్యాక్వాటర్లో నీరు నిల్వ ఉండడంతో నది నీటిని దాటుకుంటూ ఒడ్డు కనిపించే స్థలంలో దహన సంస్కారాలు చేస్తున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన బౌరిశెట్టి కుమారస్వామి మృతిచెందడంతో కుటుంబసభ్యులు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దహన సంస్కారాలు చేసిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈర్లదిన్నె జూరాల ప్రాజెక్టు ముంపునకు గురవడంతో 25 సంవత్సరాల క్రితం గ్రామస్తులకు పునరావాసం కల్పించారు. కానీ శ్మశాన వాటికకోసం స్థలాన్ని కేటాయించకపోవడంతో ఏటిగడ్డ మీదనే దహన సంస్కారాలను చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
విధి చిన్నచూపు..
సాక్షి, మహబూబ్నగర్ క్రైం: తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసింది.. ఇక చివరి క్షణాల్లో కాన్పు అయి బిడ్డను కళ్లరా చూసుకోవాలని తపించింది. కానీ విధి అనుకోవాలో.. వైద్యుల నుంచి సరైన చికిత్స అందకపోవడమో కానీ ఒకే రోజు తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన పాలమూరులో అందరిని కలిచివేసింది. రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యింది ఓ గర్భిణి. నార్మల్ కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా లేదని హైదరాబాద్ రెఫర్ చేశారు. అయితే గురువారం జనరల్ ఆస్పత్రిలో తల్లి..నిలోఫర్ ఆస్పత్రిలో శిశువు మృతి చెందారు. దీంతో కుటుంబానికి తీరాని శోకం మిగిలింది. రెండో కాన్పు కోసం ఆస్పత్రికి... జడ్చర్ల పట్టణ కేంద్రంలోని పాతబజార్కు చెందిన యాదమ్మ కాన్పు కోసం రెండు రోజుల కిందట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావడంతో ఆమెకు లెబర్ రూంలో నార్మల్ డెలవరీ చేయడం జరిగింది. పుట్టిన శిశువు ఆరోగ్యంగా లేదని వైద్యులు హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేయడం వల్ల అక్కడి తీసుకువెళ్లారు. ప్రసవం అయిన తర్వాత యాదమ్మ గర్భసంచి ముడుచుకోవాలి కానీ అలాకాక రక్తస్రావం ఆగలేదు. అర్ధరాత్రి తర్వాత మళ్లీ సర్జరీ చేసి ఆమె గర్భసంచి తొలగించారు. అయినా ఆమె తీవ్ర రక్తస్రావం కావడం జరిగింది. ఆరు ఫ్యాకెట్ల బ్లడ్ను ఎక్కించిన కూడా ఫలితం లేకుండా రక్తం వెళ్లడంతో గురువారం ఉదయం యాదమ్మ మృతి చెందింది. ఇక్కడ తల్లి యాదమ్మ మృతిచెందిన కొంత సమయానికి నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవజాత ఆడ శిశువు కూడా మృతి చెందింది. తల్లీ, బిడ్డ ఒకేరోజు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయాలు అలముకున్నాయి. బాలింత యాదమ్మ మృతిపై జనరల్ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ను వివరణ కోరగా అధిక రక్తస్రావం అవుతుంటే వైద్యులు ప్రయత్నించారని, అయినా కంట్రోల్ కాలేదని, సర్జరీ చేసి గర్భసంచి తొలగించారన్నారు. కానీ చివరి దశలో కూడా రక్తస్రావం ఆగకపోవడం వల్ల మృతి చెందిందని వివరించారు. ఆస్పత్రి వర్గాల హడావుడి జిల్లా జనరల్ ఆస్పత్రిలో బాలింత యాదమ్మ మృతిచెందగా..మృతదేహాం ఎక్కువ సేపు ఆస్పత్రి ఆవరణలో ఉంటే ఆందోళనలు చేపడతారనే ఉద్దేశ్యంతో వారిని హడావుడి చేసి త్వరగా పంపాలనే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం మృతదేహాలను పార్ధీవవదేహ అంబులెన్స్లో తరలించాలి. కానీ వీళ్లు మాత్రం మరో అంబులెన్స్లో తరలించారు. -
ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..
వనపర్తి క్రైం: సబ్స్టేషన్లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన విద్యుత్ అధికారుల మాటలు నమ్మి తనకున్న భూమిని వారికి అప్పగించాడు. తీరా అధికారులు ఇచ్చిన మాట నెరవేర్చకపోయే సరికి ఏం చేయాలో తెలియక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోటపోతు బాలరాజు (28), శివరాములు ఐటీఐ పూర్తి చేశారు. ఆరేళ్ల కిత్రం గ్రామానికి 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరైంది. దీని ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో.. భూమి సమకూరిస్తే ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో 2016లో గ్రామస్తులు అంగీకరించారు. దీంతో ఉద్యోగం కోసం బాలరాజు తల్లిదండ్రులను ఒప్పించి తనకున్న ఎకరన్నర భూమిని అమ్మాడు. శివరాములు వద్ద ఉన్న డబ్బులు, బాలరాజు భూమి అమ్మిన డబ్బులు కలిపి మరోచోట సర్వే నం.58లో 30 గుంటలను కొనుగోలు చేసి అదే ఏడాది మార్చి 29న వనపర్తి డీఈ తాళ్లపల్లి లింగయ్యకు అప్పగించారు. అయితే సబ్స్టేషన్ ప్రారంభమైనా ఇంతవరకు వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. మరో పది రోజుల్లో పెళ్లి.. అధికారులు ఇస్తామన్న ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శనివారం రాత్రి కుంగిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామంలోని నీటిట్యాంకు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలరాజుకు ఈ నెల 14న పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి దుస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పినందుకే బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
దొంగ డ్రైవర్ దొరికాడు
సాక్షి, కొత్తకోట రూరల్: డ్రైవర్గా నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఏకంగా రూ.35లక్షల నగదుతో పరారైన దొంగ డ్రైవర్ దొరికాడు. నగదుతో పరారైన 24 గంటల్లోనే పోలీసులు మూడు టీంలుగా విడిపోయి దొంగను పట్టుకున్నారు. కొత్తకోట సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెం దిన విషాల్, ఆశోక్ వర్ధన్రెడ్డి అనే ఇద్దరు వ్యాపారులు బుధవారం తమ వ్యాపారం నిమిత్తం కడప నుంచి సొంత కారులో రూ.35లక్షల నగదుతో హైదరాబాద్ బయల్దేరారు. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోకి రాగానే భోజనం చేయడం కోసం ఓ దాబా దగ్గర కారు నిలిపారు. కారులో డ్రైవర్ నందుకుమార్తోపాటు విశాల్ తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి నర్సిరెడ్డి ఉండగా భోజనం కొరకు అందరూ కారు దిగగా లక్ష్మీదేవమ్మ మాత్రం నిద్రిస్తూ ఉండిపోయింది. టైర్లో గాలికొట్టిస్తానని చెప్పి డబ్బుతో పరార్.. అయితే, ఎలాగైనా డబ్బు కొట్టేయాలనే ఉద్దేశంలో ఉన్న డ్రైవర్ నందుకుమార్ కారు టైర్లో గాలి పట్టిస్తానని చెప్పి కారుతో బయలు దేరాడు. కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలో గల ఓ పెట్రోల్ పంప్ దగ్గర గాలి పట్టేందుకు కారును ఆపి వెనుక సీట్లో ఉన్న డబ్బు బ్యాగుతో పరారయ్యాడు. కారులోనే నిద్రిస్తున్న లక్ష్మిదేమ్మ కొంత సేపటికి లేచి కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా సంఘటన స్థలం దగ్గరకు వచ్చి కారుతో పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. మూడు టీంలుగా విడిపోయి గాలింపు ఆశోక్ వర్దన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తకోట సీఐ వెంకటేశ్వర్రావు అదేశానుసారం మూడు టీంలుగా విడిపోయి డ్రైవర్ ఆధార్కార్డు, ఫోన్ నంబర్ అధారంగా గాలింపు చేపట్టారు. అధార్కార్డు అడ్రస్ బీదర్ ఉండటంతో అక్కడకు ఒక టీంను పంపించి వివరాలు రాబట్టారు. బీదర్లో పోలీసులు తనకోసం వచ్చారని తెలుసుకున్న నందుకుమార్ హైదరాబాద్ వచ్చాడు. అక్కడ సైతం తాను అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గర విచారిస్తున్నారని గుర్తించి తన అక్క దగ్గరకు వెళ్లేందుకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా కాపుకాసిన పోలీసులు జడ్చర్ల బస్టాండ్లో నిందితుడిని పట్టుకొని అతని వద్ద ఉన్న రూ.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తకోట ఎస్ఐ సతీష్, పెబ్బేర్ ఎస్ఐ విజయ్కుమార్, పెద్దమందడి ఎస్ఐ విజయ్భాస్కర్, కానిస్టేబుల్స్ యుగంధర్గౌడ్, తిరుపతిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్రావు అభినందించారు. నిందితుడి నుండి మిగతా డబ్బును రాబట్టేందుకు విచారించి రిమాండ్కు పంపుతామని సీఐ తెలిపారు. -
పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?
సాక్షి, వనపర్తి : జిల్లా పత్తి రైతులు పండించిన పంట ఉత్పత్తులను మరోసారి దళారుల చేతిలో పెట్టాల్సిందేనా.. అన్న ప్రశ్నలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏటా జిల్లాలో సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైచిలుకు పత్తి సాగవుతోంది. పండించిన పంటల ఉత్పత్తులను విక్రయించేందుకు వనపర్తి ప్రాంత రైతులు సుదూర ప్రయాణం చేసి జడ్చర్లలోని బాదేపల్లి మార్కెట్లో విక్రయించాలి. వ్యయప్రయాసలు ఎందుకని భావించే రైతులు స్వగ్రామంలోనే దళారులకు పత్తిని విక్రయించటం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రిగా పదవిలో ఉన్నారు. అయినా జిల్లాలో పత్తిరైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈసారి జిల్లాలో కనీసం ఒక్కటైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న రైతుల, వ్యవసాయ అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ విషయం బహుశా మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి రాకపోయి ఉండవచ్చు. కానీ.. జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల పరిధిలోని రైతుల ఆశలు నీరుగారాయని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి పంటను విక్రయిస్తే భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ (మినిమమ్ సపోర్టింగ్ ప్రైజ్) ధర క్వింటా రూ.5,550 తప్పక లభిస్తుంది. ఇదివరకు అడిగేవారులేక ప్రస్తుత వనపర్తి జిల్లా పరిధిలో కనీసం ఒక్కసారికూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈసారైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారనే ఆశ ఉండేది. దళారుల చేతుల్లో రైతు చిత్తు జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతులు పంటల ఉత్పత్తులను వాహనాల్లో ఇతర ప్రాంతాల్లోని మార్కెట్కు తీసుకువెళ్లలేక గ్రామాలకు వచ్చే దళారులకే విక్రయిస్తున్నారు. వచ్చేందే రేటు.. ఇచ్చిందే మద్దతుధర అన్నట్లుగా వ్యవహారం నడుస్తుండేది. మంత్రి హయాంలో పరిస్థితి మారుతుందని రైతులు భావించారు. ఇకనైనా మంత్రి నిరంజన్రెడ్డి స్పందించి జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 7,295 ఎకరాల్లో పత్తిసాగు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్లో 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. జిల్లాలో 14 మండలాలు ఉండగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో కొంతమేర సాగయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లా సాధారణ పత్తిసాగు విస్తీర్ణం 8,315 ఎకరాలు కాగా 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. గత ఏడాది 6,795, అంతకుముందు ఏడాది ఖరీఫ్లో 10,950 ఎకరాల్లో సాగు చేశారు. మార్కెటింగ్ సౌకర్యం సక్రమంగా ఉంటే జిల్లాలో పత్తిసాగు మరింత పెరిగే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏటా విరివిగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కారణంగా ఏటేటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతోందని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు కసరత్తు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. జిల్లా నుంచి మార్కెటింగ్శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించినా వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పత్తి రైతులకు మరోసారి విక్రయాల అవస్థలు తప్పేలాలేవు. కేంద్రం ఏర్పాటు చేయాలి మంత్రి చొరవతో ఈసారి పత్తిసాగు ఎక్కువగా చేసే మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా పండించిన పత్తిని మార్కెట్కు తీసుకువెళ్లలేక గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసే దళారులకు విక్రయించేది. మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే మద్ధతు ధరకే రైతులమంతా పత్తిని విక్రయించుకుంటాం. – శేఖర్గౌడ్, రైతు, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం మండలం ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాము. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డులోగానీ, జిన్నింగ్ మిల్లులులోగానీ ఏర్పాటు చేస్తారు. వనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవే 44పై ఒక్కటే ఉంది. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు మార్కెట్ యార్డులలో ఎక్కడా విక్రయానికి పత్తి రాలేదు. – స్వరణ్సింగ్, డీఎం, మార్కెటింగ్, వనపర్తి జిల్లా -
సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్ బకాయిలు
సాక్షి, మహబూబ్నగర్: పాలమూరు సాగునీటి పథకాలకు అసలే అరకొర కేటాయింపులు ఉండడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. అయితే ప్రతిసారి బడ్జెట్లో మంజూరైన నిధుల్లో పనులు, పునరావాసం, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇతరాత్ర ఖర్చులు ఇలా అన్ని కేటగిరీలకు అవసరం మేరకు కేటాయిస్తారు. ఇందులో విద్యుత్ బిల్లుల కోసం కేటాయించిన నిధుల్లోనూ భారీగా కోత విధించి కనీసం పదిశాతం కూడా చెల్లించకపోవడంతో బిల్లులు ప్రతినెలా గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో ఆ భారం విద్యుత్ సంస్థకు గుదిబండగా మారింది. ప్రస్తుతం ఐదు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.1,641.57 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి బిల్లుల పెండింగ్ ఇతర రంగాలకు చెందినవి అయితే వాటికి విద్యుత్ సరఫరా నిలిపేసే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్ సరఫరా నిలిపేసే ప్రసక్తే లేకుండా పోయింది. ఇదీలా ఉంటే కనీసం బడ్జెట్లో జరిగిన కేటాయింపుల మేరకైనా బిల్లులు చెల్లిస్తే అంత సమస్య ఉండదని విద్యుత్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల బిల్లుల చెల్లింపులు సంబంధిత శాఖ ద్వారా నేరుగా ట్రాన్స్కోకు ఉండడంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. భారీ మోటార్లు.. బిల్లులు తడిసిమోపెడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ కోసం ప్రభుత్వం 30మెగావాట్లతో కూడిన 15మోటార్లు ఏర్పాటు చేసింది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 17 మెగావాట్లతో కూడిన ఏడు మోటార్లు నడుస్తున్నాయి. భీమా 1,2 ఎత్తిపోతలకు సంబంధించి రెండు చోట్లా 12మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు, నాలుగు మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు పని చేస్తున్నాయి. కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఐదు మెగావాట్లతో కూడిన నాలుగు మోటార్లు పని చేస్తున్నాయి. మోటార్లన్నీ భారీగా ఉండడంతో పంపులు పని చేసే సమయాన్ని బట్టి నెలకు కనిష్టంగా రూ.50లక్షలు గరిష్టంగా రూ.2కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. రూ.328.21బడ్జెట్లో రూ.6.32 కోట్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణకు రూ.328.21కోట్ల కేటాయింపు జరిగింది. అందులో రూ.97.97 కోట్లతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత నెలాఖరు వరకు కేవలం రూ. 6.32 కోట్లు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 67.74 కోట్లు కేటాయించగా.. రూ. 18.01 కోట్లు విద్యుత్ బిల్లుల కోసం కేటాయించారు. కానీ అందులో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేయలేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.146 కోట్ల కేటాయించగా... అందులో రూ.69.89 కోట్లు విద్యుత్ బకాయిలకు కేటాయించారు. అయినా అందులో నయాపైసా కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ. 1433.06 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.64.31 కోట్లు కేటాయించగా... రూ. 6.32 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించారు. పాత బకాయిలతో కలిపి రూ. 104.70కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 50.16 కోట్లు కేటాయించగా.. విద్యుత్ బిల్లుల కోసం రూ. 1.29 కేటాయించారు. కానీ అందులో ఒక్కరూపాయి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. ఇదీలావుంటే.. ఈ నెల 9న ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్లో ఎత్తిపోతల పథకాలకు కేవలం రూ. 79 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులు నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులకే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం చెల్లించలే ని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నిధుల సమస్య ఉంది జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబం ధించిన విద్యుత్ బకాయిలు చెల్లించాలంటే అవసరం మేరకు నిధుల కేటాయింపులు లేవు. పథకాల వారీగా మంజూరైన నిధుల్లో నిర్మాణ పనులు, పునరావాసం, విద్యుత్ బకాయిలు, ఇతరాత్ర ఖర్చుల విభజన చేసుకుని వాటిలో ఏది ఎంత అవసరమో గుర్తించి అందులో ఖర్చు చేస్తాం. విద్యుత్ బిల్లులకు అరకొర కేటాయింపులు ఉండడంతోనే చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. – ఖగేందర్, సీఈ -
ట్రీట్మెంట్ అదిరింది
వనపర్తి టౌన్: గొడ్డలి వేటుకు గురికావాల్సిన 8 చెట్లకు పునరుజ్జీవం వచ్చింది. వనపర్తి జిల్లాలోని నాగవరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పక్కనున్న చెట్లను నరికివేయకుండా ట్రీ ట్రాన్స్లొకేషన్ ద్వారా మరోచోట నాటాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. దీంతో అధికారులు హైదరాబాద్కు చెందిన ట్రీ ట్రాన్స్లొకేషన్ ఉప్పలయ్యను సంప్రదించారు. మొత్తం 12 చెట్లకు 8 చెట్లు మరోచోట నాటితే బతుకుతాయని చెప్పారు. దీంతో 4 రోజుల క్రితం చెట్ల చుట్టూ 5 అడుగుల గోతి తీసి.. ఫిట్టింగ్ బెల్డ్ సహాయంతో గోనెసంచుల్లో వేర్లు బయటికి రాకుండా మట్టితో బిగుతుగా కట్టి రసాయనిక మందులు పూశారు. అనంతరం శివారులోని ఖాళీ స్థలంలో వాటిని నాటారు. -
షూటింగ్లకు నిలయం.. ఆ ఆలయం
సాక్షి; శ్రీరంగాపూర్ (కొత్తకోట): ఇక్కడి రంగనాథస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా సెలవు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుండే గాక విదేశాల నుంచి సైతం భక్తులు పర్యాటకులు అధికంగా వస్తుంటారు. వనపర్తి జిల్లాలోనే అత్యధిక శిల్ప సంపద కలిగిన ఈ ఆలయం చుట్టూ నీటితో కళకళలాడే రంగసముద్రం చెరువు ఉంది. ఇది రమణీయంగా ఉంటుంది. ఇక్కడి మ్యూజియంలో ప్రసిద్ధిగాంచిన తంజావూరు చిత్రపటాలను భద్రపరిచారు. ఏటా హోలి రోజు ఇక్కడ పగలు రంగనాయకస్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమాలు రాజా రాజరామేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతాయి. సినిమా, సీరియల్ షూటింగ్లకు ప్రత్యేకత రంగనాయకస్వామి ఆలయం చుట్టూ నీటితో కళకళలాడుతున్న చెరువు ఉండడంతో పాటు పురాతన ఆలయం, గోపురాలు, శిల్పాలు ఉండడంతో చాలా సినిమాలు, తరచూ సీరియల్ షూటింగులు ఇక్కడే జరుగుతుంటాయి. ఆలయాన్ని చేరుకోండి ఇలా.. హైదరాబాద్ నుంచి 160 కి.మీ. దూరంలో శ్రీరంగాపూర్ ఉంటుంది. 44వ జాతీయ రహదారిపై పెబ్బేరు మీదుగా 10 కి.మీ. వెళితే ఈ ఆలయం వస్తుంది. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 25 కి.మీ. ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి. -
నిబంధనలు పాటించని కళాశాలల మూసివేతలు
సాక్షి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు జూనియర్ కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొటున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలల పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేక, అధ్యాపకులు రాక నిర్వహణ భారమై మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్, ఇతర పట్టణాలకు పంపించి ఇంటర్ విద్య చదివిస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు కళాశాలల్లో పేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వం సర్కారు కళాశాలలకు మళ్లించడంలో విజయవంతం అయిందనే చెప్పాలి. ఇది శుభ పరిణామం కూడా. కేవలం ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 3,300 అడ్మిషన్లు గత సంవత్సరం కంటే పెరిగాయి. అయితే గత సంవత్సరం కళాశాలలను సరిగ్గా నిర్వహించలేదని, పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేవని గమనించిన అధికారులు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో కలిపి మొత్తం 5 ప్రైవేటు కళాశాలలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతిని నిరాకరించారు. ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య పదుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రతి సంవత్సరానికి ఒక సారి అఫ్లియేషన్ కోసం కళాశాలలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు చేసుకున్న చాలా కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇంకా మంజూరు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా, ప్రమానాలు పాటించే కళాశాలలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. 37 కళాశాలలకు పెండింగ్.. జిల్లాలోని 37 ప్రైవేటు కళాశాలలకు ఇప్పటికి ప్రభుత్వ అఫ్లియేషన్ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 109 ప్రైవేటు కళాశాలలు ఉంటే ఇప్పటివరకు అనుమతి ఇచ్చింది 72 కళాశాలలకు మాత్రమే. గద్వాల్లో 6 కళాశాలలు, వనపర్తిలో 13 కళాశాలలు, నాగర్కర్నూల్ 14 కళాశాలలు, మహబూబ్నగర్, నారాయణపేట కలిపి మొత్తం 39 కళాశాలలకు మాత్రమే అఫ్లియేషన్ ఇచ్చింది. ఇక నిబంధనల ప్రకారం గత సంవత్సరం కళాశాలలను నిర్వహించని కళాశాలలను అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న, వాటికి కనీసం అడ్మిషన్లు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ జూనియర్ కళాళాల, భవిత, న్యూఎరా, మక్తల్లో సాయి చైతన్య, మద్దూర్లో వివేకానంద జూనియర్ కళాశాలలను ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా అఫ్లియేషన్ ఇవ్వని 37 కళాశాలల్లో కూడా కొన్ని కళాశాలలు మాత్రమే పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహిస్తున్నారని, చాలా కళాశాలలో ప్రభుత్వ నిభంధనల ప్రకారం నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు. గద్వాల జిల్లాలో చాలా జూనయర్ కళాశాలలు రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారని, వాటిని అనుమతి వచ్చే అవకాశం లేదని తెలస్తుంది. ఇవీ నిబంధనలు.. కళాశాలలకు అనుమతి ఉండాలంటే ముఖ్యంగా ఆర్సీసీసీ బిల్డింగ్ సొంతమా లేక, అద్దె భవనమా అని చూసి కళాశాలకు తరగతులకు నాలుగు సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఇక ప్లే గ్రౌండ్ విషయంలో మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఒక ఎకరా భూమిని, అర్బన్ ప్రాంతంలో ఉంటే 2.5 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి చూపించాలి. ఇక పారిశుద్ధ్య విషయంలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, వాష్బేసిన్లు, శుద్ధజలం వంటి వాటికి ముఖ్యమైనవి. స్ట్రక్షర్ సౌండ్ ఎఫెక్ట్కు సంబంధించి ఆర్అండ్బీ నుంచి అనుమతి, ఫైర్సేఫ్టీకి సంబంధించి ఎఫ్ఆర్డీ నుంచి అనుమతి తీసుకోవాలి. తరగతుల వారిగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఇక ల్యాబరోటరీలు, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ వేరువేరుగా ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక లైబ్రరీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి. అధ్యాపకుడి పూర్తి వివరాలు, ఒరిజినల్ సర్టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆ శాఖల నుంచి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి ఒరిజినల్వి పంపాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉంటే అప్పుడు బోర్డు అధికారులు తనిఖీలకు వెళ్లి అనుమతిని ధ్రువీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఎక్కువ మొత్తంలో విద్యార్థులను ప్రభుత్వ కళాశాలోల్లో చేర్పించేందుకు కృషి చేస్తోంది. ఇటీవల కస్తూర్బా గాంధీ కళాశాలల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున 22 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ప్రారంభించడంతో విద్యార్థులు అక్కడ అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఎటువం టి ఫీజులు లేకుండా పుస్తకాలు, వసతి, యూనిఫాం లతో పాటు నాణ్యమైన విద్య అందించడం తో అటువైపు చాలా మంది విద్యార్థులు వెళ్తున్నా రు. వీటితో పాటు ఇంటర్ జూనియర్ కళాశాల ల్లో కూడా పూర్తిగా ఉచిత విద్యను అందించడం తో విద్యార్థులు అక్కడే ఆసక్తి చూపుతున్నారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 3,300 అడ్మిషన్లు గతంలో కంటే పెరిగాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఈ కారణాలతో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు కరువయ్యాయి. నిబంధనలు పాటిస్తేనే అనుమతి జిల్లాలో అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న కళా శాలలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే అనుమతి లభిస్తుంది. నిబంధనలు ఖాతరు చేయని కళాశాలలకు అడ్మిషన్లు నిలిపివేశాం. అప్లియేషన్ రాని కళాశాలలు పూర్తి స్థాయిలో అన్ని వివరాలను సకాలంలో సమర్పిస్తేనే అనుమతి ఇస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించడం వల్ల చాలా వరకు అక్కడ అడ్మిషన్లు పెరిగాయి. – వెంక్యానాయక్, ఇంటర్మీడియెట్ అధికారి -
అడుగడుగునా అడ్డంకులే..
సాక్షి, మహబూబ్నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ పనులకు సంబంధించి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిధులు విడుదల కాలేదు. ఈ కారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల కాల్వ పనుల్లో పురోగతి ఆశించిన మేరకు కనిపించలేదు. తాజాగా నిధుల సమస్య తీరిందంటే ఆయా రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇన్ని చిక్కుల మధ్య గడువులోగా పనులను పూర్తి చేయడం అధికారులకు సవాల్గా మారింది. నిధులు మంజూరైనా.. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గత నెల 28న ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వాటి పరిధిలో నిర్మాణ దశలో ఉన్న కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కావడంతో ఇకపై ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, వచ్చే ఖరీఫ్ నాటికి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులూ అసంపూర్తి పనుల పూర్తితోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. అయితే పనులు చేపట్టాలంటే ముందుగా తమకు రావాల్సిన పరిహారం విషయాన్ని తేల్చాలంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో గడువులోగా పనుల పూర్తి సంబంధిత అధికారులకు సవాల్గా మారింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను స్థానిక మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉదండాపూర్ ప్రాజెక్టు.. జడ్చర్ల మండల పరిధిలో వల్లూరు– ఉదండాపూర్ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న 15.97 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు ఆటంకాల మధ్య కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి 5,107 ఎకరాలను సేకరించాలని గుర్తించారు. సాగునీటి సౌకర్యం కలిగిన భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, బీడు భూములకు రూ.5.50 లక్షలు ఇవ్వాలని రేటు ఖరారు చేశారు. అందు లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు 900 ఎకరాలకు ఇప్పటి వరకు రూ.65.5 కోట్ల పరిహారం అందజేశారు. మరో 480 ఎకరాలకు ఇం కా సుమారు రూ.18 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే వల్లూరు నిర్వాసితులకు సంబంధించి 1,200 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వంద ఎకరాలకు రూ.73 కోట్ల వరకు పరిహారం అందజేశారు. సకాలంలో అందని డబ్బులు సేకరించిన భూములకు సంబంధించి రైతులకు సకాలంలో పరిహారం డబ్బులు ఇవ్వలేదు. రైతుల ఆందోళనలు, నిరసనల అనంతరం దశల వారీగా పరిహారాన్ని అందించారు. అయితే ఎకరాకు ఇచ్చిన పరిహారానికి బహిరంగ మార్కెట్లో వంద చదరపు గజాల ప్లాటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంపునకు గురయ్యే వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలతోపాటు వాటి పరిధిలోని ఒంటిగుడిసె తండా, తుమ్మలకుంట తండా, ర్యాగడిపట్ట తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి ఇంతవరకు పునరావాస చర్యలు చేపట్టలేదు. ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా నిర్మించే ఇళ్లకు స్థల సేకరణ జరగలేదు. ఇటీవల ఉదండాపూర్ గ్రామానికి ఇళ్ల నిర్మాణాలకు గాను బండమీదిపల్లి గ్రామ శివారులో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి చదును చేసే పనులు ప్రారంభించారు. వల్లూరుకు సంబంధించి ఇప్పటి వరకు స్థలాన్ని ఖరారు చేయలేదు. కరివెన రిజర్వాయర్ భూత్పూర్ మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్కు సంబంధించి 6,676 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉండగా వంద శాతం సేకరించారు. రూ.760 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ.425 కోట్ల ఖర్చుతో దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్ కోసం కొత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరోనిగుట్టతండా, కర్వెన గ్రామ పంచాయ తీలోని ఏకులగట్టు తండా, ఎల్కిచర్ల గ్రామ పంచాయతీలోని భట్టుపల్లి తండా ప్రజల వ్యవసాయ భూములతోపాటు ప్రజలు ఇళ్లు కోల్పోయారు. వీరిలో కొందరికి 123 జీఓ ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు అందజేసింది. ఏదుల రిజర్వాయర్ రేవల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ.664 కోట్ల వ్యయానికి గాను రూ.642 కోట్లు ఖర్చు చేసి 98 శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్ బిజినేపల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్కు 4,526 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేలు సేకరించారు. రూ.6 వేల కోట్ల వ్యవయానికి గాను రూ.1,800 కోట్లతో 30 శాతం పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని కారుకొండతండా, అనెకాన్పల్లి, అనెకాన్పల్లితండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా వట్టెం గ్రామాల పరిధిలో 4,230 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 3,370 ఎకరాల భూమి సేకరణ పూర్తి కాగా మరో 860 ఎకరాలు పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న భూములకు సంబంధించి నిర్వాసితులకు పంటలను బట్టి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అందించింది. అయితే కొంతమంది రైతులు మాత్రం మల్లన్న సాగర్లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు, ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన కేసీఆర్కు సైతం వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్ రిజర్వాయర్ కొల్లాపూర్ మండలంలో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాలు సేకరించారు. రూ.760 కోట్ల వ్యయానికి గాను రూ.425 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తిచేశారు. రెండో ప్యాకేజీలో భాగంగా సున్నపుతండా వద్ద డిస్ట్రీబ్యూటరీ గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కాల్వలు తవ్వుతున్నారు. ఈ కాల్వ పనులు కుడికిళ్ల గ్రామ సమీపంలో 1.5 కి.మీ మేరకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో 267 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇక్కడ రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. గతంలో కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల్లో తమ భూములు కోల్పోయామని, మిగిలిన భూములను రెండోసారి పాలమూరు ప్రాజెక్టు కోసం లాక్కోవడం తగదని ప్రభుత్వాన్ని కోరుతున్న వీరు మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలో ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.5.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కుడికిళ్లలో పావు ఎకరం భూమి కూడా ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని, పరిహారం పెంచితేనే భూములు ఇస్తామని రైతులు చెబుతున్నారు. పరిహారంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే సర్వేకు మా భూముల్లోకి రావాలని రైతులు గతంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు భూ సేకరణ సర్వే పూర్తిచేశారు. -
‘రెవెన్యూ’లో ఇష్టారాజ్యం..!
సాక్షి, వనపర్తి: రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు లాభాపేక్షతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సదరు భూయజమానికి తెలియకుండానే.. అసలు నోటీసులు కూడా జారీ చేయకుండా.. కేవలం బయానా అగ్రిమెంట్ కాపీని ఆధారంగా చేసుకొని అతని భూమిని మరొకరి పేరుపై పట్టామార్పిడి(మ్యూటేషన్) చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిబంధనలు ఎంత పక్కాగా పాటించారో. ఇలాంటి సంఘటన ఒకటి జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలంలో వెలుగు చూసింది. ఈ విషయంపై బాధితుడు 2019 అగస్టు 19వ తేదిన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. భూమి కొనుగోలుకు కొంత బయానా.. జడ్చర్ల మండలం ఆలూరులో నివాసం ఉండే తెలుగు శ్రీనివాసులుకు ఖిల్లాఘనపురం మండలంలోని కమాలోద్దీన్పూర్లో కొంత భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు మాట కుదుర్చుకున్నారు. మొత్తం భూమిని రూ.2.40 లక్షలకు విక్రయించేందుకు తెలుగు శ్రీనివాసులు సిద్ధమయ్యాడు. అగ్రిమెంటు చేసుకుని రూ.1.30 లక్షలు అడ్వాన్స్ (బయానా) ఇచ్చారు. మిగతా డబ్బులకు కొంత గడువు పెట్టుకున్నారు. గడువు తీరుతున్నా డబ్బులు ఇవ్వకపోవటంతో భూమిని అమ్మిన తెలుగు శ్రీనివాసులును డబ్బుల కోసం అడగగా.. దాటవేస్తూ వచ్చారు. బయాన ఇచ్చిన వెంటనే భూమిని కబ్జాలోకి తీసుకున్న కొనుగోలు దారులు అధికారులను మచ్చిక చేసుకుని రహస్యంగా బయానా ఇచ్చిన భూమిని మొత్తం డబ్బులు చెల్లించకుండానే ముగ్గురి పేర్లపై మార్చారు. కారణం రాయని అధికారులు నిబంధనల ప్రకారం పట్టామార్పిడి చేసే సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఫైల్ తయారు చేసి భూమిని విక్రయించిన వారికి నో టీసులు జారీ చేయాలి. వారికి పట్టామార్పిడి చేస్తున్నట్లు సమాచారం ఇచ్చి ముటేషన్ చేయా లి. పట్టామార్పిడి చేస్తున్నప్పుడు కొత్తగా భూ మిపై హక్కు పొందుతున్న వారికి అట్టి భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని మ్యానువల్ రికా ర్డులో తప్పనిసరిగా.. రాయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు విషయంలో రికార్డులో ఎలాంటి వివరాలు రాయలేదు. కనీసం పట్టామార్పిడి చేసిన అధికారి సంతకం చేయలేదు. ఈ ముటేషన్కు సంబంధించిన ఫైల్ నంబర్ వేయలేదు. గుడ్డిగా రూ.లక్షల విలువ చేసే భూమి హక్కులను అధికారులు ఇతరుల పేరుకు మార్చారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయటంతో విషయం బయటకు పొక్కింది. తప్పుల తడకగా అగ్రిమెంట్ భూమిని కొనుగోలు చేస్తున్నట్లు రాయించిన అగ్రిమెంట్లోనూ తప్పులు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంటు కోసం ఉపయోగించిన రూ.100 స్టాంప్ పేపర్ను 2014 నవంబర్ 29వ తేదీన కొనుగోలు చేశారు. కానీ అగ్రిమెంటు మాత్రం 2012 జూన్ 6వ తేదీన చేసినట్లు రాశారు. అలాంటి తప్పుల అగ్రిమెంటును ఆధారం చేసుకుని అ«ధికారులు విలువైన భూమి హక్కులను ఎలా మార్చారు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. న్యాయం చేయాలి నా భూమిని సదరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు కొద్ది మొత్తంలో మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. రిజిస్టేషన్ చేయించుకోలేదు. అగ్రిమెంటు కాగితం ఆధారంగా పట్టామార్పిడి చేయించుకున్నారు. 2018 ఫిబ్రవరి వరకు నా పేరునే 1బీ ఉంది. తర్వాత మార్పులు చేసినట్లు తెలిసింది. – తెలుగు శ్రీనివాసులు, భూ యజమాని పరిశీలిస్తాం పట్టామార్పిడి ఎలా చేశారనే విషయాన్ని రికార్డుల్లో పరిశీలిస్తాం. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే తహసీల్దార్గా వచ్చాను. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. – వెంకటకృష్ణ, తహసీల్దార్, ఖిల్లాఘనపురం. -
ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..
సాక్షి, చిన్నంబావి(మహబూబ్నగర్) : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం పనుల్లో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల క్రితం వచ్చి చెప్పినప్పటికీ మీలో ఎందుకు మార్పు రావడంలేదని ప్రశ్నించారు. పెద్దదగడ గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత చేయించాల్సిన పనులను, మిషన్ ద్వారా ఎందుకు చేయించారని అని ప్రశ్నించారు. గురువారం మండలంలోని పెద్దదగడ, చెల్లెపాడు, చిన్నంబావి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటకపోవడం, అదేవిధంగా గ్రామాల్లో 50శాతం కూడా పూర్తికాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది చదవండి : దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి ప్లాస్టిక్ నిషేధిద్దాం.. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామలుగా తీర్చిదిద్దడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, కనీసం గ్రామంలోని ప్రజలకు అవగాహన కూడా కల్పించలేకపోతున్నారని అన్నారు. కనీసం మహిళా సంఘాలను కూడా చైతన్య పరచలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నా రు. హరితహరం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన పెద్దదగడ గ్రామ కార్యదర్శి, ఫిల్డ్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీస్ ఇవ్వా లని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ బద్రీనాథ్, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామమ్మ, అభిలాష్ రావు, ఏపీఓ ఉన్నిస బేగ్, తహసీల్దార్ పర్కుందా తన్సిమా ఉన్నారు. -
తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!
సాక్షి, గోపాల్పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు. -
శాంతించిన కృష్ణమ్మ
ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ క్రమంగా తగ్గుముఖం పట్టింది.. గతం వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన వరద ఆదివారం వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరింది.. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు గ్రామాలు నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. గత పదేళ్ల నాటి వరదలను దృష్టిలో ఉంచుకొని ఒకింత భయాందోళనకు గురయ్యారు.. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సోమవారం సాయంత్రం నుంచే వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది.. మంగళవారం వరకు ఏకంగా లక్ష క్యూసెక్కుల మేర తగ్గడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.. సాక్షి, వనపర్తి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది వరద రోజురోజుకు ఉగ్రరూపం దాల్చి.. మూడురోజులుగా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తింది. ఈ క్రమంలో మంగళవారం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు జూరాల నుంచి దిగువకు 6,30,642 క్యూసెక్కుల వరద నీరు వదిలారు. 24 గంటల వ్యవధిలోనే ఆదివారం తొమ్మిది గంటలకు వరద ఉధృతి పెరిగింది. దిగువకు వదులుతున్న నీరు 8,57,488 క్యూసెక్కులకు చేరింది. ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీరు పెరగడంతో కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుమారు 11 గ్రామాల్లో పంట పొలాలు, పండ్లతోటలు, పలు గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు 2009లో ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లోని 23 గ్రామాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని నమోదు చేసుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి కొద్దిగా తగ్గింది. పెరిగిన కృష్ణానది వరదకు తుంగభద్ర నదీ సోమవారం ఉదయం నుంచి పోటెత్తి సుమారు 2.20 లక్షల క్యూసెక్కుల నీటితో కృష్ణమ్మతో కలిసి శ్రీశైలానికి పరుగులు తీసింది. పొలాలు చాలా వరకు నీట మునిగిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కృష్ణమ్మ శాంతిస్తూ వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 8,67,099 క్యూసెక్కుల వరద నుంచి సాయంత్రం ఆరు గంటలకు 8,26,855కు తగ్గింది. రాత్రి తొమ్మిది గంటలకు 8,16,957 క్యూసెక్కులు వచ్చింది. నాలుగు గేట్ల మూసివేత సోమవారం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు వచ్చి వరదతో పోల్చితే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సుమారుగా లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గింది. జూరాల వద్ద 62 క్రస్టుగేట్లతో దిగువకు వచ్చే వరద నీరు మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు జూరాల వద్ద నాలుగు గేట్లను మూసివేసి 58 గేట్ల నుంచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే.. దాదాపు 24 గంటల వ్యవధిలోనే కృష్ణమ్మ సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గి ప్రవహించడంతో జిల్లా పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు పది అడుగుల మేర వరద నీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు తమ పంటలకు ఢోకా లేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పెరిగితే పరిస్థితి ఏంటి.. గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని భావించిన అధికారులకు మంగళవారం వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మంగళవారం సైతం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉన్నారు. -
కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన
సాక్షి, వనపర్తి: ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సరిగ్గా శుక్రవారానికి ఏడాది పూర్తయ్యింది. కొత్త పంచాయతీల ఏర్పాటు చేసిన ఆరు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల విషయంలో ఉదాసీనత వహిస్తోంది. పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. ఫలితంగా ఏడాది కాలంగా అధికారుల పాలనే సాగుతోంది. జిల్లా ఏర్పాటు అనంతరం.. 2016 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 14 మండలాలతో వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసింది. నాడు ఒకే మున్సిపాలిటీతో ఏర్పాటు చేసిన జిల్లాలో రెండేళ్ల పూర్తికావస్తున్న తరుణం 2018 ఆగస్టు 2వ తేదీన 15 వేల జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య ఐదుకు చేరింది. పాత మున్సిపాలిటీ వనపర్తి సరసన కొత్తగా పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట పట్టణాలు మున్సిపాలిటీలుగా చేరాయి. కానీ మున్సిపాలిటీల్లో అందించాల్సిన సేవలుగాని, ఏర్పాటు చేయాల్సిన సేవలుగాని పూర్తిస్థాయిలో అమలుచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండల ఎంపీడీఓలకే, ఆయా మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను అప్పగించి పాలన నెట్టుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సైతం అనుమతులు ఇవ్వకుండా అధికారులు ఎనిమిది నెలల పాటు ఆయా మున్సిపాలిటీల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో నెమ్మదిగా ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా 79 పంచాయితీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న తండాలను, ఆవాస ప్రాంతాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. జిల్లాలో మునుపు 185 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు తొమ్మిది గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. కొత్తగా 33 గిరిజన తండాలను, 46 ఆవాస ప్రాంతాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 2019 జనవరి కొత్త పాత పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆరు నెలల తర్వాత సర్పంచులకు చెక్పవర్ ఇచ్చారు. కొద్దోగొప్పో పాలన గాడిన పడుతోంది. కానీ కొత్త మున్సిపాలిటీల విషయంలోనే.. ప్రజల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 255కు చేరింది. పెరిగిన పన్నులు కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించటం పక్కన పెడితే పంచాయితీ ఉన్నప్పటికంటే ఎక్కువగా ఇంటి టాక్సీలు వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీగా ఎందుకు అప్గ్రేడ్ చేశారోనని అసంతృప్తి వాదనలు లేకపోలేదు. వేల మందికి ఉపాధి కరువు జిల్లాలో నాలుగు పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయటంతో జిల్లా సుమారు 9084 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. వారికి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు పని లభించలేదు. చేసేది లేక కూలీలు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేసింది కానీ నేటికీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఉమ్మడి పంచాయతీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు ఉమ్మడి పంచాయతీ లెక్కనే వర్తింప జేస్తున్నారు. పారిశుద్ధ్య సేవలు అంతంతే.. మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో గతంలో కంటే పారిశుధ్య నివారణ చర్యలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. నాటి పంచాయతీలో ఉన్న సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఏర్పాటు కాని పాలనా విభాగాలు కొత్త మున్సిపాలిటీల్లో టౌన్ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలను ఏర్పాటు నేటికీ ఏర్పాటు కాలేదు. అన్ని పనులను ఇన్చార్జ్ కమిషనర్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. నూతన మున్సిపాలిటీలకు పాలకవర్గాలు వస్తేగాని పాలన గాడిలో పడే పరిస్థితులు కనిపించటం లేదు. -
మంత్రి నిరంజన్రెడ్డికి మాతృవియోగం
వనపర్తి/పాన్గల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వందేళ్ల వయస్సు దాటిన ఆమె వనపర్తిలోని మంత్రి నిరంజన్రెడ్డి నివాసంలోనే ఇన్నాళ్లు ఉన్నారు. రోజూలానే ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించగా.. సోమవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ కనిపించింది. మంత్రి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. మంత్రితోపాటు వారి చెల్లెళ్లు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రముఖుల పరామర్శ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ మంత్రిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జైపాల్యాదవ్, అబ్రహం, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డితో పాటు మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల జిల్లా కలెక్టర్లు రోనాల్డ్రోస్, శ్వేతామహంతి, శ్రీధర్, శంశాంక్, వనపర్తి ఎస్పీ కె. అపూర్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఆర్.లోక్నాథ్రెడ్డి, స్వర్ణసుధాకర్రెడ్డి, పద్మావతి, టీడీపీ, బీజేపీ నాయకులు, ఆయా జిల్లాల జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అలాగే, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టులు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాయినిపల్లి శివారులో అంత్యక్రియలు సింగిరెడ్డి తారకమ్మ అంత్యక్రియలు పాన్గల్ మండలం రాయినిపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసం నుంచి రాయినిపల్లి శివారు వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు బంధువులు తరలివచ్చారు. తన వ్యవసాయక్షేత్రంలో మంత్రి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి తలకొరివి పెట్టారు. తల్లి తారకమ్మకు కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. -
వనపర్తిలో సప్త సముద్రాలు..
సాక్షి, వనపర్తి(మహబూబ్నగర్) : సంస్థానాల కాలం నుంచే.. వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకాలు వెల్లడిస్తున్నారు. కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వర్రావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ.. రాజ్యపాలన చేసేవారు. రాణి శంకరమ్మ అదే పద్ధతిని అనుసరించి పాలన చేశారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది. రాణిశంకరమ్మ హయాంలో బీజం వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో పదిలమైన స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా.. కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు. పురాణాల్లో ఉన్న సప్తసముద్రాల మాదిరిగా.. తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని బృహత్తరమైన కార్యానికి పూనుకుని తన హయాంలోనే.. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు. ఈ చెరువులకు వర్షం నాటి పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగు బారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా.. గొలుసుకట్టు విధానానికి రూపకల్పన చేశారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు (సప్త సముద్రాలు) జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే.. ఉపయోగపడుతున్నాయి. ఇక్కడే గొలుసుకట్టు చెరువులు వనపర్తి సంస్థానాధీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువుల నిర్మాణంతోపాటు అన్ని చెరువులు, కుంటలకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా అన్ని చెరువులకు గుట్టల ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా పాటు కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేలా పాటు కాల్వలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చెన్నై, కోల్కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పల్లిని కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. పల్లి ధరల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తిలో మార్కెట్లో ఏటా వేరుశనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ ధరలు పలుకుతాయి. ఎక్కువగా జిల్లా రైతులు వేరుశనగను యాసంగి పంటగా సాగు చేస్తారు. వేరుశనగ పంట ఉత్పత్తులు వచ్చే సమయంలో జిల్లాకేంద్రంలోని మార్కెట్ పల్లి రాశులతో కళకళలాడుతుంది. కాలు మోపెందుకు స్థలం లేనంతగా వేరుశనగ రాశులతో నిండిపోతోంది. 2 లక్షల ఎకరాల్లో సాగు.. సంస్థానాధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు సంతరించుకున్నది వనపర్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి పాలకుల కృషి ఫలితంగా కొత్త రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాల్వల నిర్మాణాలను చేపట్టడంతో ప్రస్తుతం జిల్లాలో ఏటా ఖరీఫ్లో మెట్ట, తరి పొలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరిసాగు చేస్తారు. ప్రతి ఖరీఫ్లో సుమారు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ రాష్ట్రంలోనే.. అత్యధికంగా వరిధాన్యం పండిస్తూ రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంకు మించి ధాన్యం విక్రయిస్తున్నారు. మా తాతముత్తాల నుంచే.. సప్తసముద్రాల్లో ఒకటైన శంకరసముద్రం మా గ్రామ సమీపంలో ఉండటం సంతోషంగా ఉంది. మా తాత, ముత్తాల కాలం నుంచి ఈ శంకరసముద్రం కింద మేం వ్యవసాయం చేస్తున్నాం. వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో పనులు ప్రారంభించారు. శంకరసముద్రంలో మా గ్రామం ముంపునకు గురైంది. ఏళ్లు గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులందరం నిరాశతో ఉన్నాం. – బాలయ్య, రైతు, కానాయపల్లి సాగు, తాగునీరు అందిస్తోంది పెబ్బేరు శివారులో ఉన్న మహాభూపాల్ చెరువును రాజుల కాలంలో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ చెరువు వర్షాలతోనే నిండదంలో పశువులకు, గ్రామ ప్రజలకు తాగునీరు, అవసరాలకు వాడుకోవడంతోపాటు చెరువు కింద రైతులు 2 వేల ఎకరాల్లో వరిసాగు చేసి నీళ్లను వాడుకుంటున్నారు. ఆ రోజుల్లో చెరువు చూడాల్సిన వారు రైతు కమిటీ సభ్యులను నీరేంటులుగా నియమించడంతో నీటి వృథా చేయకుండా వాడుకునేవారు. ప్రస్తుతం జూరాల కాల్వ చెరువు పక్కల ఆనుకొని పోవడంతో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులను చూసుకునే దిక్కులేకుండా పోయింది. – బాల్రాం, రైతు, పెబ్బేరు -
తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు!!
సాక్షి, వనపర్తి(మహబూబ్ నగర్) : దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనుగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అర్హత సాధించి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలెట్కు శిక్షణ తీసుకోనున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ, ఆలోచన, దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు. ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్థానం సంపాదించాడు. సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందనున్నాడు. నేవీ, ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అన్ని టెస్టుల్లోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు. దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్ప టి నుంచి కలలు గన్న ఆ యువకుడి తల్లిదండ్రుల ఆశయాలు ఫలించాయి. వనపర్తి లోని గాంధీనగర్కాలనీకి చెందిన ఎల్ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్కు గాను యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ 30న ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల కావ డంతో అర్హత సాధించిన వారికి డెహ్రడూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ ఏడాది జనవరి 14 నుంచి 19 వరకు డ్యాకుమెంట్ వెరిఫికేషన్, ఫిజిక ల్ ఫిట్నెస్ టెస్టు, సైకాలజీ టెస్టులో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్టులు ఒక పిక్చర్ చూయిం చి దానిపై స్టోరీ రాయించడం, స్విచ్వేషన్ రియాక్ట్ టెస్టులో 60 స్విచ్ వేషన్లను 30 నిమిషాల్లో స్టూడెంట్ 30 రియాక్షన్స్ పేర్కొన్నాలి. సెల్ఫ్ డిక్రిప్షన్, వర్డ్ అసోసియేషన్ టెస్టులో 15 సెకన్లకు వచ్చే ఒక వర్డ్పై సెంటన్స్ రాయడం, పర్సనల్ ఇంటర్వ్యూ ఒక గంట మౌఖికంగా నిర్వహించడం, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రూప్ చర్చలు, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, ప్రోగ్రెసివ్ గ్రూప్ చాట్, ఆఫ్ గ్రూప్ చాట్, సెల్స్ ఆప్టికల్స్, గ్రూప్ ఆప్స్ కిల్ రేస్, కమాండ్ టాస్క్ లెక్చరేట్, ఫైనాల్ గ్రూప్ టాస్క్ మెడికల్ ఎగ్జామ్ ఇలా అన్నింటిలో అర్హత సాధించాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 21 నుంచి 25 వరకు ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబిలీష్మెంట్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అన్నింటిలో మెరుగ్గా తేలడంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు, ప్రతి ఆరు నెలలకోసారి యూపీఎస్సీ భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది. మూడేళ్ల శిక్షణతోపాటు బీటెక్ అని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్వాస్లో గల ఎన్డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్ ఫోర్స్తోపాటు బీటెక్ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. సంతోషంగా ఉంది నేను దేశానికి సేవ చేయబోతున్నాననే మాట ఎంతో సంతృస్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశయాన్నీ నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకున్నా. అదే పట్టుదలతో దేశానికి సేవ చేస్తాను. ప్రణాళికబద్ధంగా చదువుకొని ముందుకు సాగాను. ఇకపై కూడా అన్ని పరీక్షల్లోనూ పూర్తిగా అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది. – నిఖిల్సాయి, వనపర్తి -
ఊరిలోనే పెళ్లి రిజిస్ట్రేషన్..
సాక్షి, వనపర్తి: ఇప్పటి వరకు వివాహా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రజల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పు లు చేసింది. ఇకపై వివాహం జరిగిన పంచాయతీలోనే కార్యదర్శితో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు జిల్లా వెల్పేర్ అధికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళా శక్తి కేంద్రం మహబూబ్నగర్ కో–ఆర్డినేటర్ అరుణ మారిన నిబంధనలు, పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పెళ్లిళ్ల రిజిస్ట్రార్గా కలెక్టర్, అదనపు రిజిస్టార్గా జిల్లా సంక్షేమ అధికారి పని చేస్తారని చెప్పారు. 30రోజుల్లో అయితే ఉచితంగానే.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పంచాయతీ కార్యద ర్శితో పెళ్లి కుమారుడుగాని, పెళ్లికూతురుగాని ఎవరి తల్లితండ్రులైనా.. కార్యదర్శి వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. ఈ దరఖాస్తుపై ఇరుపక్షాల సాక్షులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వయస్సు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యదర్శి పంచాయతీ కార్యాలయంలో పెళ్లిళ్ల రిజిస్టర్లో నమోదు చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ. 100ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన పెళ్లిల వివరాలు మున్సిపల్ కమిషనర్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చట్టబద్దత ఉంటుందన్నారు. కుటుంబానికి వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలు ఈ రిజిస్ట్రేషన్ ఎంతో దోహదపడుతుంది. కార్యక్రమంలో జిల్లా వెల్పేర్ అధికారి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్రెడ్డి, ఎంపీడీఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ పరుగులు
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకోనుంది. నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రుణం మంజూరైన వెంటనే మందకొడిగా సాగుతోన్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రుణ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిధులు మంజూరు చేయడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200కోట్లతో పాలమూరు–ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెన రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్ల ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయి తే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు సుమారు రూ.10వేల కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రుణం మంజూరు కానుండడంతో పనుల్లో వేగం మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో సర్కిల్–1లో కొల్లాపూర్ పరిధిలోని నార్లాపూర్లో 8.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వనపర్తి పరిధిలోని ఏదుల 6.99టీఎంసీలు, నాగర్కర్నూల పరిధిలోని వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్నగర్ పరిధిలోని కరివెన వద్ద 17.34 టీఎంసీలు, సర్కిల్–2 పరిధిలోని ఉద్దండాపూర్ వద్ద 9.1టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద 3 టీఎంసీలు (గతంలో 10 టీఎంసీల అంచనా ఉండగా> కుదించారు)మొత్తం ఆరు రిజర్వాయర్ నిర్మించేందుకు పథకాన్ని ప్రారంభించారు. పనులు ఇలా.. జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు 15ప్యాకేజీలుగా విభజించి కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాల భూమిని సేకరించారు. రూ.760కోట్ల వ్యయానికిగాను రూ.425కోట్లు ఖర్చు చేసి 60శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల రిజర్వాయర్కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ. 664 కోట్ల వ్యయానికి రూ.622 కోట్లు ఖర్చు చేసి 95శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్కు సంబంధించి 4,526ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేల ఎకరాలను సేకరించారు. రూ.6వేల కోట్ల వ్యయానికి రూ.1800 కోట్లతో 30శాతం పనులు పూర్తి చేశారు. కరివెన రిజర్వాయర్కు సంబంధించి 6,676 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 6,008 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించి సేకరణ అంశం వివిధ దశల్లో ఉంది. రూ.760కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ. 425కోట్ల ఖర్చుతో దాదాపు 60శాతం పూర్తయ్యా యి. కాలువల విషయానికొస్తే నార్లపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వలను 2, 3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాలువను 6, 7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచికరివెన వరకు 12కిలో మీటర్ల కాలువను 12వ ప్యాకేజీగా విభజించి 72 శాతం కాలువ పనులను పూర్తి చేశారు. మోటార్లకే కేటాయింపు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్లను బిగించనున్నారు. నార్లపూర్లో 145మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి రోజు 22వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ఇంత సామర్థ్యం గల పంపులు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించకపోవడం విశేషం. పవర్ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే రుణం వీటి కొనుగోలుకే కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ను రూ.600 కోట్ల అంచనాతో 2015లో అప్పటి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పనులు ప్రారంభించారు. సొరంగాలు, సర్జిపూల్స్, కాల్వలు పనులు పురోగతిలో ఉన్నాయి. 7.5 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణం 99 శాతం పూర్తి చేశారు. రూ.400 కోట్ల రిజర్వాయర్ నిర్మాణానికి, రూ. 200 కోట్ల కాల్వల నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడ 1.45 హెచ్పీ సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్కు నీరు వస్తే.. 29 గ్రామాల పరి«ధిలోని 45వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 5,011ఎకరాల భూసేకరణ చేశారు. ఇంకా 395 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 195 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు
సాక్షి, వనపర్తి : విలాసాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన భార్యకు విడాకులిచ్చానంటూ మ్యాట్రిమోని వెబ్సైట్లో ఫొటో అప్లోడ్ చేసి విడాకులు తీసుకున్న అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మోసం చేయడానికి పూనుకున్నాడు. గత 8 నెలల క్రితం వనపర్తికి చెందిన ఓ అమ్మాయిని మ్యాట్రిమోనిలో పరిచయం చేసుకొని మోసం చేస్తున్న చంద్రశేఖర్ను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం సీఐ సూర్యనాయక్ విలేకరులకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగూడెం పాతకాలనీకి చెందిన చంద్రశేఖర్ అలియాస్ చందుకు 2007లో వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పేకాట.. ఇతర జల్సాలకు అలవాటుపడిన అతను భార్యను పుట్టింటికి పంపాడు. తన భార్యకు విడాకులు ఇచ్చానని.. మ్యాట్రిమోని వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. వనపర్తికి చెందిన ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చింది. తను కూడా మ్యాట్రిమోనిలో అప్లోడ్ చేసింది. వెబ్సైట్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న చంద్రశేఖర్ సామ్సాంగ్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తానంటూ నమ్మబలికాడు. ఒక స్కీంలో ఇన్వెస్ట్మెంట చేస్తే తనకు ఎక్కువ లాభాలు వస్తాయని, ఈక్రమంలో డబ్బులు అవసరం ఉందని చెప్పి ఆమె ద్వారా రూ.9.70 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. వాటితో ఓ బైక్, సెల్ఫోన్ కొనుగోలు చేశాడు. అంతటితో ఊరుకోక ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ కావాలంటూ తీసుకున్నాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 14న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై నిఘా పెట్టారు. మహిళ చంద్రశేఖర్కు ఫోన్ చేసి వనపర్తికి పిలిచింది. వనపర్తికి వచ్చిన అతన్ని స్థానిక రాజీవ్ చౌరస్తాలో పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. అతను పేకాటకు అలవాటు పడి డబ్బుల కోసం మహిళలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని వెల్లడించారు. గతంలో రాజమండ్రిలో ఓ అమ్మాయి వద్ద రూ.70 వేలు, మధ్యప్రదేశ్లో ఓ అమ్మాయి వద్ద రూ.80 వేలు డబ్బులు ఖాతాలో వేయించుకొని మోసం చేశాడన్నారు. పేకాటకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులతో విడాకులు తీసుకున్న అమ్మాయిలను ఎంచుకున్నానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇతను పేకాట ఆడేందుకు గోవా, రాయిచూర్ వెళ్లేవాడన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన వారిలో రేవల్లి ఎస్ఐ వెంకటేష్గౌడ్, ట్రెయినీ ఎస్ఐ ఉమ, కానిస్టేబుల్ రాజగౌడ్ తదితరులున్నారు. -
ఆయనకు జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం..
సాక్షి, కొల్లాపూర్: సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే ఇష్టం. నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి కోరినా వెనకాడలేదు. మా ఊరు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం. నా చిన్నతనం నుంచి నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేసే సేవలు గమనించేవాడిని. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. చదువు పూర్తయిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. అందుకు మా నాన్న, అమ్మ, నా భార్య ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. నన్ను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులంతా సహకారం అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించాను. మా ఇంటి దేవుడు లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో రాణించగలుగుతున్నాను..’’ అని అన్నారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి. శనివారం ఆయన ‘సాక్షి’ పర్సనల్ టైమ్తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న లక్ష్మారెడ్డి, అమ్మ బుచ్చమ్మ, భార్య విజయ. మా నాన్న సింగోటం సర్పంచ్గా, డీసీసీబీ డైరెక్టర్ గా, అప్పట్లో టీడీపీ నాయకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా కుటుంబం కోసం వదులుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మా ఇంటికి వచ్చేవారు. ఎవరికి ఏ ఆపద, ఏ సమస్య ఉన్నా చేతనైనంతవరకు సాయం చేశాం. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఆ మార్గంలోనే నడుస్తున్నాను. నాకు ఇద్దరు అక్కలు ఉమాదేవి, సువర్చల.. పాఠశాల చదువు అంతా పదోతరగతి వరకు కొల్లాపూర్లోనే కొనసాగింది. ఇంటర్, డిగ్రీ, లా హైదరాబాద్లో పూర్తి చేశాను. 2001లో హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించాను. పదేళ్ల వరకు పూర్తిగా ఈ వృత్తిలోనే కొనసాగాను. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ చేయడంపై ఇష్టం ఉండేది. 2010–11నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువుకైనా సాయం చేశా.. ఎవరైనా సరే నా వద్దకు వచ్చినవారందరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి సాయం అడిగితే కూడా చేశా. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించా. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్ల పరిస్థితి బాగా లేదు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు అందని దుస్థితి. దీనిని పూర్తిగా మార్చివేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. దేశంలోనే ప్రత్యేకత ఉన్న కొల్లాపూర్ మామిడికి మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చాలన్నది నా లక్ష్యం. ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తా.. రాజకీయాల్లో బిజీగానే ఉంటా. అయినప్పటికీ ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తాను. నా భార్య విజయనే అన్నీ చూసుకుంటుంది. 70 ఏళ్ల వయసులోనూ అమ్మా, నాన్న నాకు ఎంతో తోడ్పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిత్యం సలహాలు ఇస్తున్నారు. కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేదు. ఎప్పుడైనా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. సింగోటంలోని లక్ష్మీనర్సింహస్వామిని ప్రతిరోజూ దర్శించుకుంటాం. 2010లో ఒకసారి యూరప్ వెళ్లాం. పూర్తిగా నేను రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి నా భార్య సహకారం మరువలేనిది. బిజీలో ఒకవేళ నేను టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే కారులో పెడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఆమెనే దగ్గరుండి చూసుకుంటుంది. ఫ్యామిలీనే నా బలం. వారి వల్లనే స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలుగుతున్నాను. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి, యోగక్షేమాలు అడిగి పంపించడం అమ్మానాన్నలతోపాటు నా భార్యకు అలవాటు. జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. మేము సహకరిస్తేనే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సేవ చేయగలుగుతారు. ఇంట్లో విషయాల కన్నా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఆయనకు సహకరించడం నా బాధ్యత. సేమియా పాయసం, అంబలి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఆయనకు చాలా ఇష్టం. అందరినీ ఈజీగా నమ్మడమే ఆయన బలం, బలహీనత. వాళ్ల అమ్మ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి సమస్యలు తెలుసు. కుటుంబం అందరం కలిసి భోజనం చేస్తాం. అత్తయ్య, మామయ్య సలహాలు, ప్రోత్సాహం, ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 నవంబర్ 25న జరిగింది. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. పండుగలు, శుభకార్యాలకు ఫ్యామిలీ అందరం కలిసి పాల్గొంటాం. ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలి రాజకీయ నాయకుడిగా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే నా కోరిక. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాకు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు అమ్మానాన్న, అక్కలు, భార్య ప్రచారంలో పాల్గొన్నారు. 2018లో మరోసారి పోటీ చేసి ప్రజల దీవెనలతో గెలుపొందాను. వృత్తిపరంగా వచ్చిన సంపాదనను రాజకీయాల్లో ఖర్చు చేశాను. రాజకీయాల్లో సంపాదించాలనే కోరిక లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇన్నేళ్లుగా ప్రజల్లో మంచి పేరు, ఆశీర్వాదం సంపాదించగలిగాను. నిత్యం ప్రజల మధ్య ఉండటమే ఇష్టం. నాకు కుటుంబం పూర్తిగా సహకరించింది. బయటికి వెళ్లిన సందర్భం తక్కువనే. గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. కొల్లాపూర్ ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలని కోరిక. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని పెంచుతా. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటాను. -
ముమ్మరంగా నీటి నిల్వ గుంతలు
సాక్షి,మల్దకల్: రోజు రోజుకు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిల్వ గుంతలకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతల తవ్వకాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో నీటినిల్వ గుంతలను తవ్వుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు బోరుబావుల్లో నీటి లభ్యత ఉంటుంది. వీటి నిర్మాణాలపై ఉపాధి హామీ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి నిల్వ గుంతలను నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వాటి నిర్మాణాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ పొలాల్లో వాటిని తవ్వుకునేందుకు ముందుకు వస్తున్నారు. కూలీలకు ఉపాధి పనులు దొరకడంతో పాటు రైతులకు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేయడంతో రెండు విధాలా లబ్ధిపొందుతున్నారని ఉపాధి హామీ సిబ్బంది తెలియజేశారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. ముఖ్యంగా వీటి నిర్మాణాల కోసం అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు వాటి నిర్మాణాలతో కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. దీంతో రైతులు సైతం ముందుకు వచ్చి తమ పొలాల్లో నీటి నిల్వ గుంతలను తవ్వుకుని భూగర్భ జలాల పెంపునకు తమవంతు కృషి చేస్తున్నారు. మల్దకల్ మండలానికి మొత్తం ప్రభుత్వం 821 నీటి నిల్వ గుంతలు మంజూరు కాగా.. వాటిలో 30కు పైగా నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరో 50 నీటి నిల్వ గుంతల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. నీటి నిల్వ గుంతల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వాటి కొలతలను బట్టి ఆర్థిక సాయం అందించడంతో వాటి నిర్మాణాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ పొలాల్లో పొలం చదునుచేసేందుకు, పొలం గెట్లపై ముళ్లచెట్ల తొలగింపు వంటి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నీటి నిల్వ గుంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో వీటి నిర్మాణ పనులపై స్థానిక ఉపాధి హామీ సిబ్బంది సైతం వేగవంతం చేస్తున్నారు. మండలంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నీటి నిల్వ గుంతలను వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉపాధి ఏపీఓ శరత్బాబు తెలియజేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట