bhavita
-
విశాఖలో భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రోల్మోడల్ స్టేట్గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
-
భవితకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: బ్లూ రాక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో జీఎస్ఎం క్రీడాకారిణి ఎన్. భవిత మెరిసింది. సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్గా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో భవిత 4–1తో విధి జైన్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల టైటిల్ పోరులో 4–2తో వి. సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గి విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 4–2తో ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, జూనియర్ బాలుర కేటగిరీలో అమన్ (ఏవీఎస్సీ) 4–2తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచారు. క్యాడెట్ బాలబాలికల ఫైనల్ మ్యాచ్ల్లో పార్థ్భాటియా (ఏడబ్ల్యూఏ) 3–1తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–2తో నిఖిత (వీపీజీ)పై... యూత్ బాలబాలికల తుదిపోరులో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 4–0తొ సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–2తో జి. ప్రణీత (హెచ్వీఎస్)పై గెలుపొందారు. పురుషుల ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ) 4–2తో పి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై నెగ్గగా, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–3తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. -
ఆ వీడియోల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వైనం!
యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్గాసక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం.. వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్ప్రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్ను ఆధారం గా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుం టే.. మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూ త్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా తక్కువ బడ్జెట్ కెమెరాలతో వీడియో షూట్ చేయొచ్చు. వీటిని గూగుల్ అకౌంట్ సహాయంతో యూట్యూబ్ చానల్ అకౌంట్ ఓపెన్చేసి, అప్లోడ్ చేయొచ్చు. ఆదాయం ఎలా? యూట్యూబ్ చానల్కు ప్రధాన ఆదాయ మార్గం.. ప్రకటనలు. వీటిద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సదరు యూట్యూబ్ చానల్ యజమానికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల యూట్యూబ్లో స్పామ్ కంటెంట్ పెరిగిందంటూ ఫిర్యాదులు, వీడియోలను వాయిస్ఓవర్తో తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత పెరిగింది. వీటితోపాటు ఏడాది కాలంలో 4,000 గంటల వాచ్టైం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సైతం అమల్లోకి తెచ్చింది. కనీసం వెయ్యి మంది సబ్ స్క్రైబర్స్తో రోజుకు 10 గంటల వాచ్ టైం ఉంటేనే ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ముఖ్యమైన టూల్స్ యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి పెట్టుబడి అవసరం లేకున్నా.. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. దాంతో వ్యూస్ పెంచుకోవడంతో పాటు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి. చానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే అంశంపై స్పష్టత ఉండాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. వీక్షకులకు ఆసక్తి గలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ నాణ్యతతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండే కెనాన్ 1300డి వంటి బ్రాండెడ్ కెమెరాలు తీసుకొని వాటితో వీడియోలు చేయొచ్చు. ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయొచ్చు. మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది. వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడి యోను ప్రొఫెషనల్గా తీర్చిదిద్దొచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్లోనూ ఇన్ బిల్ట్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే కోరుకున్న ఔట్పుట్ వస్తుం దని నిపుణులు చెబుతున్నారు. వ్యూస్ పెరిగేకొద్దీ.. యూట్యూబ్లో డబ్బులు రావాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా క్రమంతప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయాలి. చానల్ ప్రారంభించిన మొదట్లోనే డబ్బులు రావు. మొదటి పేమెంట్ రావాలంటే.. బ్రేక్ ఈవెన్ అమౌంట్ (సుమారు 100 డాలర్లు) దాటాలి. తర్వాత రెగ్యులర్గా ఆదాయం అందుతుంది. ఇండియాలో కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీడియోలు చూస్తే సదరు చానల్ ఓనర్కు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా థంబ్నైల్స్ కూడా చూపరులను కట్టిపడేసేవిగా కనిపించాలి. తెలుగులో చానల్ ప్రారంభిస్తే .. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగిం చుకోవాలి. ‘ఎంటర్టైన్మెంట్’ విభాగాల వీడి యోలు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఎడ్యుకేషన్ వంటి సంప్రదాయ విభాగాలు ట్రెండింగ్ వీడియోల్లో కనిపించట్లేదు. వైరల్ అయితే కాసులే! ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయితే చాలు ఎంతో పేరు, డబ్బు వస్తుంది. వినోదాత్మక జానర్ ఎంచుకొని కొత్తగా వీడియోలు చేస్తే త్వరగా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా చానల్ పెట్టాలనుకుంటే.. ఫ్రెష్గా, ప్రొఫెషనల్గా తీయాలి. వాయిస్ ఓవర్, యాంకర్లను పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చు. అప్లోడ్ చేసే క్రమంలో ‘కీవర్డ్స్’ కూడా సరిపోయేవి ఇస్తే చానల్కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. చానల్ ప్రమోషన్స్కు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవాలి. అందులోనూ ‘చెల్లింపు’ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా త్వరగా ప్రేక్షకులను చేరొచ్చు. – నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ చానల్. డేటా వినియోగం బాగా పెరిగింది జియో వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో డేటా వినియోగం బాగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తున్నారు. నేను అప్లోడ్ చేసే పోటీ పరీక్షల ‘ఎడ్యుకేషన్’ విభాగానికి సంబంధించిన వీడియోలకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటున్నారు. వారు మాత్రమే ఈ వీడియోలు చూస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అంత సులువుగా డబ్బులు ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నాకు మొదట ఆర్నెల్ల వరకు డబ్బులు రాలేదు. నేను ఫుల్టైం ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు వీడియోలు చేస్తున్నాను. రెగ్యులర్గా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. – ఆకుల నారాయణరావు, ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. -
కొలువులపై టెక్నాలజీ దెబ్బ
గతమంతా ఘనం.. భవిష్యత్ అంతా గందరగోళం అన్నట్లు..! ఒక్కసారి గతంలో ఉద్యోగాలు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోండి. ఉద్యోగాలకు భద్రత ఉండేది. కొంత అనుభవం సంపాదిస్తే.. ప్రమోషన్ గ్యారెంటీ..! అనే నమ్మకంఉండేది. జీతం తక్కువైనా ఖర్చులు తక్కువకాబట్టి ఆదాయ భద్రత ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈరోజున్న జాబ్ రేపు ఉంటుందన్న గ్యారెంటీలేదు. ప్రస్తుతం మీకు ఎంత టాలెంట్ ఉన్నా.. మీనైపుణ్యాలను మెరుగుపరచుకోకుంటే మూడేళ్లతర్వాత మీ ఉద్యోగం ఊడినట్లే..! అంటున్నారునిపుణులు. ఎందుకంటే.. ప్రతి మూడేళ్లకోసారిటెక్నాలజీ సమూలంగా మారిపోతుండటమే! ఓతాజా నివేదిక ప్రకారం భారత జాబ్మార్కెట్లోనియామకాల పరిస్థితి గతంలో ఎన్నడూలేనంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలోజాబ్ మార్కెట్లో తాజా హైరింగ్ ట్రెండ్స్ ఎలాఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంసొంతం కావాలన్నా.. కొలువులో మనుగడసాగించాలన్నా.. ఏం చేయాలోతెలుసుకుందాం... సాక్షి భవిత, జాబ్ ట్రెండ్స్ :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా టెక్నాలజీ రంగంలో రాకెట్ వేగంతో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ విస్తరణ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యం రంగంలో, ఉత్పత్తి ప్రక్రియలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దాంతో గతంలో ఏ పదేళ్లకో మార్పులకు లోనయ్యే జాబ్ మార్కెట్.. ఇప్పుడు మూడేళ్లకే పూర్తిగా మారిపోతోంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత సమర్థంగా అందిపుచ్చుకోగలరు అనే దానిపైనే మీ కెరీర్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు టెక్నాలజీ నేటి మంత్రం కంపెనీలు ఆన్లైన్ కస్టమర్స్తో మాట్లాడేందుకు చాట్ బోట్స్ను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఇంతకాలం కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్లో ఈ పనిచేసిన సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఉదాహరణకు ఐబీఎం వాట్సన్ కంప్యూటర్లో నిక్షిప్తిమైన రోగిæ.. రోగ చరిత్రనంతా స్కాన్ చేసి అత్యంత కచ్చితత్వంతో రోగాన్ని విశ్లేషించి.. వ్యాధి నివారణకు ఏం చేయాలో సలహా ఇస్తుంది. తద్వారా సంబంధిత నిపుణుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేవల రంగం వరకూ.. టెక్నాలజీ సాయంతో గతంలో ఒక పని పూర్తిచేసేందుకు నాలుగు గంటల సమయం అవసరమైతే.. ఇప్పుడు ఆ పని క్షణాల్లో పూర్తి కచ్చితత్వంతో పూర్తవుతోంది. తద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గ డంతోపాటు తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది. అందుకే కంపెనీలు మానవ వనురులపై ఆధారపడటం తగ్గించేస్తున్నాయి. నైపుణ్యం ప్రస్తుతమున్న నైపుణ్యాలనే పట్టుకొని కూర్చుంటే.. మీరు రోడ్డునపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మార్పు నేటి తారకమంత్రం కాబట్టి! ఉదాహరణకు.. గతంలో బుక్కీపింగ్ తెలిసుంటే చాలు.. అకౌంటెంట్ ఉద్యోగం ఖాయంగాలభించేది, జీవిత కాలంపాటు కొనసాగేది. కొన్నేళ్ల క్రితమే బుక్కీపింగ్ స్థానంలో.. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వచ్చి చేరింది. ఆ సమయంలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నైపుణ్యం లేనివారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదే అకౌంటింగ్ జాబ్స్పై కొద్దికాలం క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్టీ పెద్ద దెబ్బ కొట్టింది. జీఎస్టీ వచ్చాక ఈ అకౌంటెంట్స్పై ఆధార పడటం తగ్గిపోయింది. అంటే.. ప్రస్తుతం అమలుచేసిన జీఎస్టీ కారణంగా మారిన కంపెనీల అవసరాలకు తగ్గట్లు కొత్త నైపుణ్యాలున్న వారికే జాబ్ మార్కెట్లో అవకాశం లభిస్తుంది. నాలెడ్జ్ ఇప్పుడు మీరు సంపాదించిన నాలెడ్జ్ ఒక్క ఏడాది కళ్లు మూసుకుంటే ఎందుకూ కొరగాకుండా పోతుందంటే నమ్ముతారా..! నమ్మాలంటున్నారు మేధావులు. దీనికి కూడా టెక్నాలజీ విప్లవమే కారణం!! అంతేకాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, ఇంజనీర్ అందించే సేవల నాణ్యత.. ఆ సేవలకు ఎంత చెల్లించొచ్చో డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా క్షణాల్లో అంచనాకు వస్తున్నాయి కంపెనీలు. దాంతో సంస్థలు ఇస్తున్న వేతనానికి ఉద్యోగుల నాలెడ్జ్ స్థాయి, పనితీరు ఏమాత్రం తగ్గినా.. పింక్ స్లిప్ వెలాడుతున్నట్లే! మరోవైపు తక్కువ వేతనానికి నాణ్యమైన పనితీరు చూపే యువత అందుబాటులో ఉంటే.. సీనియర్ నిపుణులకు భారీ జీతాలు చెల్లించడం భారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగానే పింక్ స్లిప్ల పరంపర మొదలవుతోందని చెబుతున్నారు. ఇటీవలే ఓ ప్రముఖ ఐటీ కంపెనీ 1000 మంది సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందుకు సదరు సీనియర్ ఉద్యోగులు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడం ఒక కారణమైతే.. వారికి జీతాలు భారీగా ఉండటం మరో కారణమట! కాబట్టి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నాలెడ్జ్ పెంచుకుంటూæ... మంచి ఫలితాలు చూపితేనే కెరీర్లో మనుగడ సాధ్యమవుతుంది. నిరంతర అధ్యయనం స్టే క్యూరియస్, స్టే హంగ్రీ.. అనేది నేటి కెరీర్ మంత్రం. ప్రస్తుత నైపుణ్యాలు జాబ్ మార్కెట్కు పనికిరాకుండాపోతే.. ఇక ముందున్న ఏకైక మార్గం.. కొత్త స్కిల్స్ను వేగంగా నేర్చుకోవడమే! ఇందుకోసం ఆయా అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలి. నిత్య విద్యార్థిలా మారి.. మూక్స్ వంటి ఆన్లైన్ విధానాల ద్వారా అప్డేట్ కావాలి. నేర్చుకున్నది ఎప్పటికీ వృథా కాదు. నిరంతరం నేర్చుకుంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తి పెంచుతున్న ఉద్యోగిని వదులుకోవాలని ఏ కంపెనీ కోరుకోదు. కాబట్టి ఫ్రెషర్స్తోపాటు సీనియర్ ఉద్యోగులు కూడా కెరీర్ పరంగా, టెక్నాలజీ పరంగా తాము నేర్చుకోవాల్సిన టెక్నాలజీని, నైపుణ్యాలను సమీక్షించుకోవాలి. గత వారంలో, గత నెలలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాం.. ఏఏ కొత్త విషయాలు నేర్చుకున్నాం.. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి.. ఆ టెక్నాలజీ గురించి మనం ఏం నేర్చుకున్నాం.. నేర్చుకున్న టెక్నాలజీని మన కంపెనీ ప్రొడక్టివిటీ పెంచడంలో ఏమేరకు అన్వయించాం.. ఇలా ప్రతి ఒక్కరూ సమీక్షించుకుంటూ... ఉద్యోగ మనుగడ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మేలు నిరంతరం తమ సామర్థ్యాలను సమీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ.. టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. జాబ్ మార్కెట్కు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడంతోపాటు, ప్రత్యామ్నాయ కెరీర్ గురించి ఆలోచిస్తుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్చుకునే తపన, పనిచేసే సామర్థ్యం పెంచుకోవాలి. నిపుణుల ప్రసంగాలు వినడం, మంచి పుస్తకాలు చదడం, మనసును చురుగ్గా ఉంచుకోవడం ద్వారా అవుట్డేట్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మనం పనిచేయడమేకాకుండా... తోటి ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలు పెంచుకొని మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. -
స్టార్టప్ ఆఫర్స్..ఆచితూచి అడుగేయండి..!
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో స్టార్టప్స్ కంపెనీలు రెట్టింపు సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. భారీ పే ప్యాకేజీలు అందిస్తున్నాయి. విద్యార్థులు కూడా స్టార్టప్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! మరోవైపు స్టార్టప్ కంపెనీలు ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోని విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్ను సైతం వెనక్కు తీసుకుంటున్నాయి. నియామకాలను వాయిదా వేస్తున్నాయి. ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో ఈ విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో..స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ విషయంలో నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు!! పేరున్న స్టార్టప్ కంపెనీలు సైతం ఇటీవల కాలంలో విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్ను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం చివర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో చదివిన ప్రతిభావంతులు ఏదో ఒక జాబ్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ను ఆమోదించే ముందు అభ్యర్థులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమోటర్స్ నుంచి కంపెనీ ప్రొఫైల్ వరకు స్టార్టప్ కంపెనీ ఆఫర్ను ఆమోదించే ముందు అభ్యర్థులు స్టార్టప్ సంస్థ ప్రమోటర్స్ వివరాలు, వారి విజన్, సంస్థ ప్రొఫైల్, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సదరు సంస్థ ప్రొడక్ట్/సర్వీస్ వివరాలు.. టార్గెట్ కస్టమర్స్, సర్వీస్/ప్రొడక్ట్కు సంబంధించి మార్కెట్ పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్, కంపెనీల వెబ్సైట్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్టార్టప్ కంపెనీ ఆర్థిక సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. కార్యకలాపాల నిర్వహణ, భవిష్యత్తు మనుగడ పరంగా సంస్థకున్న ఆర్థిక వనరుల లభ్యత చాలా కీలకం. ఎందుకంటే భారీ లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే సీడ్ ఫండింగ్ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు.. స్టార్టప్ కంపెనీ నుంచి ఆశించిన లాభాలపై నమ్మకం సడలితే నిధులు ఉపసంహరించుకుంటారు. దాంతో ఒత్తిడికి లోనైన కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ముందు మానవ వనరులపై వేటు వేస్తాయి. కాబట్టి రూ.లక్షల ప్యాకేజ్తో ఆఫర్ ఇచ్చినా.. సంస్థ ఆర్థిక సామర్థ్యం సరిగా లేకుంటే అభ్యర్థులు సమీప భవిష్యత్తులోనే ఒడిదుడుకులకు లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పని వాతావరణం ఇప్పటికే సదరు స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకోవడం కూడా తాజా అభ్యర్థులకు మేలు చేస్తుంది. సాధారణంగా స్టార్టప్ సంస్థల్లో మానవ వనరుల సంఖ్య 20 నుంచి 50 మధ్యలోనే ఉంటోంది. ఫండింగ్ సంస్థల ప్రోత్సాహం ఉంటే ఈ సంఖ్య 100 నుంచి 150 వరకు ఉంటుంది. తద్వారా స్టార్టప్ సంస్థ మనుగడపై ఒక అంచనాకు రావచ్చు. వీలైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సంప్రదించి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో పని సంస్కృతి, పని వాతావరణం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్టార్టప్ సంస్థల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను, తమ ఆలోచనలను అమలు చేసేందుకు వీలుంటుందని, ఆ మేరకు కంపెనీలు సైతం తమను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. తాము చేరాలనుకుంటున్న కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఉందో? లేదో? తెలుసుకోవడం మంచిది. ప్యాకేజ్, ఇతర బెనిఫిట్స్ స్టార్టప్ ఆఫర్ను ఆమోదించే క్రమంలో తమకు అందించే ప్యాకేజ్ను ఏ రూపంలో ఇస్తాయో అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని స్టార్టప్ సంస్థలు భారీ స్థాయిలో పే ప్యాకేజీ ప్రకటించినా.. అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని ఈక్విటీలు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపు రూపంలో అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు.. తమ వాస్తవ అవసరాలు, కంపెనీలు అందించే ప్యాకేజీ తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. నగదు రూపంలో అందించే మొత్తం తమ అవసరాల మేరకు ఉందని భావిస్తేనే ఆఫర్ను అంగీకరించడం మేలు. స్టార్టప్ జాబ్.. సవాలే! స్టార్టప్ సంస్థలంటే అప్పుడే మొగ్గ తొడిగిన కంపెనీలు. ఉత్పత్తులు, సేవల గురించి లక్ష్యాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ.. వాటి అమలు, కార్యాచరణ అంతా ప్రాథమిక దశలోనే ఉంటుంది. జీరో నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి స్టార్టప్ కంపెనీలో పనిచేయడం సవాల్తో కూడుకున్న వ్యవహారం. కంపెనీలు సైతం తాము ఆఫర్ ఇచ్చిన అభ్యర్థుల నుంచి ఎంతో ఎక్కువగా ఆశిస్తాయి. నిజమైన ఆసక్తి ఉంటేనే, పని ఒత్తిడిని తట్టుకోగలమనుకుంటేనే స్టార్టప్ సంస్థల ఆఫర్ను ఆమోదించాలి. అంతేకాకుండా తమకున్న సబ్జెక్ట్ స్కిల్స్ సంస్థ జాబ్ ప్రొఫైల్కు సరితూగుతాయో లేదో ముందుగానే అంచనా వేసుకొని అడుగేయాలి. నిత్యనూతనంగా ఉండాలి కొత్తగా ప్రారంభమైన కంపెనీలో సీఈఓ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకూ.. అందరూ కలివిడిగా పని చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన జాబ్ ప్రొఫైల్ను మాత్రమే కాకుండా అందరూ అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను నిరంతరం అంచనా వేయడం.. పోటీదారుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం.. వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాలి. సంస్థ కార్యకలాపాలను నిర్వహించడంలో సృజనాత్మకతను వెలికి తీసే నైపుణ్యం అవసరం. ఇతరుల కంటే తమ సంస్థ ప్రొడక్ట్స్ బెస్ట్ అని వినియోగదారుల్లో అభిప్రాయం ఏర్పడేలా వ్యూహాలు, పథకాలు రచించాలి. ముఖ్యంగా మార్కెటింగ్ ప్రొఫైల్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. కాబట్టి స్టార్టప్ కంపెనీలో చేరేటప్పుడు అన్ని ప్రతికూలతలు, సానుకూలతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సలహా!! స్టార్టప్ జాబ్స్.. కీ డొమైన్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ∙డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ∙ఎస్ఈఓస్ ∙కోడింగ్ ఎక్స్పర్ట్స్ ∙సాఫ్ట్వేర్ డెవలపర్స్ ∙డేటా సైంటిస్ట్స్ ∙ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ∙వెబ్ డిజైనర్స్, యాప్ డెవలపర్స్ ∙బిజినెస్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్స్ ∙సోషల్ నెట్వర్క్ స్పెషలిస్ట్స్ స్టార్టప్ జాబ్స్ సానుకూలతలు అభ్యర్థుల నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఎంతో అవకాశం. తాము చేసిన పనికి వెనువెంటనే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికి అనుగుణంగా పని చేసే అవకాశం (ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్) ఉంటుంది. స్వీయ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే అవకాశం. ఇది ఎంఎన్సీ జాబ్స్లో లభించడం కొంత కష్టమే. స్టార్టప్ జాబ్స్ ప్రతికూలతలు సంస్థ ప్రమోటర్స్కు నిర్దిష్ట వ్యూహం లేకపోతే ఉద్యోగుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రారంభంలో నిర్దిష్ట పని వేళలని లేకుండా.. 24్ఠ7 విధానంలో పనిచేయాల్సిన పరిస్థితి. ఎంఎన్సీల మాదిరిగా కొత్త టెక్నాలజీలపై వ్యవస్థాగతంగా శిక్షణ ఉండదు. అభ్యర్థులే స్వీయ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. వేతనాల పరంగా ఎంఎన్సీలతో పోల్చితే తక్కువ ప్యాకేజ్లు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో కొంత ఇబ్బంది. తమ సంస్థను మెప్పించడంలో ప్రారంభంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురవుతాయి. -
ఆన్లైన్ ‘పరీక్ష’లో విజయానికి...
ఎగ్జామ్ టిప్స్ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు.. అభ్యర్థులు మొదట ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్లు కీలకం వీలైనన్ని ఎక్కువ ఆన్లైన్ మాక్టెస్ట్లు రాయాలి. దీనివల్ల ఆన్లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి. వేగం, కచ్చితత్వం అవసరం ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మార్గదర్శకాలు చదవాలి పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్డౌన్ డిస్ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు * పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. * పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు. * పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది. * ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు. * పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కాలి. * సబ్మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాకపోతే సబ్మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేసి, సరిగా సబ్మిట్ అయ్యేలా చూసుకోవాలి. -
భారత రాజ్యాంగం లౌకిక స్వభావం-పరిశీలన
కాంపిటీటివ్ గెడైన్స్ పాలిటీ (గ్రూప్ 1, 2) భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే. లౌకిక రాజ్యమంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పరిపాలన.. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం, పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్ హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్ భాషలోని Seculum (సెక్యులమ్) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్) అని దీని అర్థం. ఆ తర్వాత వాడుకలో ప్రభుత్వాన్ని, పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలన చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక భావన, వివిధ పార్శ్వాలు లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ. పూర్వకాలంలో ప్రజల అన్ని విషయాలను మతం, మతాచార్యులే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు. భారతీయ భావన భిన్నం పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణామాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు, విశ్వాసాలు, జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యాలుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం, రెండోది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. * ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’. లక్షణాలు * ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు. * అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు. * మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం. * న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం. * మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి. * రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం లౌకికతత్వం (సెక్యులర్) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది. * లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమాలలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరుడు కలిగి ఉండాలని కోరడం, లౌకికతత్వానికి మచ్చుతునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు. ప్రవేశిక - లౌకిక భావన భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు. ప్రాథమిక హక్కులు- లౌకికతత్వం రాజ్యాంగం మూడో భాగంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి. ముఖ్యంగా.. * ప్రకరణ-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. * ప్రకరణ-15 ప్రకారం మత ప్రాతిపదికపై ప్రజల పట్ల వివక్షను నిషేధించడం. * ప్రకరణ-16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని మినహాయింపులు తప్ప అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. * ప్రకరణ-25 ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ప్రబోధం మేరకు తనకు నచ్చిన మతాన్ని అవలంబించడం, ఆచరించడం, ప్రచారం చేసుకోవడం, మత మార్పును చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించడం. * ప్రకరణ-26 ప్రకారం మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును గుర్తించడం. * ప్రకరణ-27 ప్రకారం మతం ఆధారంగా పన్నులు విధించకుండా నిషేధించడం. * ప్రకరణ-28 ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధించడం. * మొదలైన హక్కులు, స్వేచ్ఛలు లౌకి క తత్వానికి ఆచరణాత్మక అంశాలు. * నిర్దేశిక నియమాల్లో ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలకు మత విశ్వాసాలు సమస్యగా పరిణమించకుండా నియంత్రించొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజా ప్రతినిధికి పోటీ చేయడానికైనా మతం అడ్డంకి కాదు. ఉదా: * రాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-58) * ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-66) * గవర్నర్ నియామకం (ప్రకరణ-155) * పార్లమెంట్, శాసనసభలకు పోటీ చేయడం (ప్రకరణ 80, 173) మొదలైన అంశాలు. * అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించడం (ప్రకరణ-325) కూడా లౌకికవాదానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. లౌకికతత్వం, వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు.. జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)లో తీర్పు చెప్పింది. అదేవిధంగా 1994లో ఎస్ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, లౌకికతత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. * లౌకికతత్వాన్ని పెంపొందించే అంశాలు * శాస్త్రీయ విద్యను, తార్కిక ఆలోచనను ప్రోత్సహించాలి. * రాజకీయాల్లో మత సంస్థలు పాల్గొనరాదు. * మత విశ్వాసాలతో కూడిన మత ప్రదర్శనలను నిషేధించాలి. * అధికార హోదాలో ఎవరూ మత ప్రదేశాలను సందర్శించరాదు. * వ్యక్తి ప్రజా జీవితంలో తాము నిర్వహించే పాత్రలో తన వ్యక్తిగత మత విశ్వాసాలను చొప్పించరాదు. ఏది ఏమైనా మొత్తానికి మత స్వేచ్ఛ, నమ్మకాలు వ్యక్తిగత ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడినంతవరకు ఫర్వాలేదు కానీ మత స్వేచ్ఛల పేరుతో మత సామరస్యానికి చేటు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రతి చిన్న విషయం అలజడికి కారణమై దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమించవచ్చు. కారల్మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందుగా మారుతుంది. మతోన్మాదానికి దారితీస్తుంది. ఉన్మాదంగా చెలరేగుతుంది. మానవ సంస్కృతిని మింగేస్తుంది. దీనికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. మతోన్మాద చరిత్ర ఎప్పటికీ పునరావృతం కారాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే అవి పునరావృతం అవుతాయి. లౌకికతత్వం వర్ధిల్లాలి. రాజ్యాంగ, చట్టపాలన కొనసాగాలి. - బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్
కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్ కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు.. ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్, అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ను నిర్వహిస్తారు. వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్బరేలీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్డ). అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్క్రాఫ్ట్ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్లైన్స్లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. సంస్థలు: జేఎన్టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ ఏవియేషన్ బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లతో ఇంటర్/+2. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్బరేలీ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్షిప్ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్ను అందిస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్లైన్స్లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాలి. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్. బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు. అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2. అందిస్తున్న సంస్థలు: ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స). వేతనం: ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్). ఇంకా ఎన్నో.. ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు. నల్సార్ వర్సిటీలో.. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (రెండేళ్లు) ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు) ⇒ పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (ఏడాది) ⇒ పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది) అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. -
పదో తరగతి తర్వాత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఏ గ్రూప్ను ఎంపిక చేసుకోవాలి? ఆయా గ్రూప్లు/కోర్సులతో ఎలాంటి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి? ఆయా కోర్సులు ఎంచుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? పదో తరగతి, ఇంటర్మీడియెట్తో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలేవి? స్వయం ఉపాధి దిశగా అవకాశాలున్నాయా? దూరవిద్య విధానంలో కోర్సులు అభ్యసించొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై విద్యార్థులకొచ్చే సందేహాలకు నిపుణుల సమాధానాలు.. ఇంటర్మీడియెట్లో బైపీసీ గ్రూప్ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అంటే.. ఎంబీబీఎస్లో చేరడానికి మాత్రమే అనే అభిప్రాయముంది. కానీ బైపీసీతో ఎంబీబీఎస్తోపాటు అనేక అవకాశాలు అందుకోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులపై ఇష్టం, ప్రకృతి పరిశీలన, జంతువులు.. వాటి జీవన శైలి వంటి వాటిపై సహజమైన ఆసక్తి ఉన్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ. వీటన్నిటికంటే ముఖ్యంగా బైపీసీ ఎంచుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణం కష్టించే తత్వం. కారణం.. బైపీసీ సబ్జెక్ట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఉండే గ్రూప్ కూడా ఇదే. కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత సైతం అవసరం. నేను పదో తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ను ఎంపిక చేసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మ్యాథ్స్పై ఆసక్తి, సమస్యలు-పరిష్కారాలు-వివరణలు ఇవ్వడం, భౌతిక, రసాయన శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రయోగాలంటే ఇష్టపడేవారు మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ గ్రూప్)ను ఎంపిక చేసుకోవచ్చు. థియరీ కంటే ప్రాక్టికల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న గ్రూప్.. ఎంపీసీ. ఆయా సబ్జెక్టుల్లో ఎప్పటికప్పడు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం అనే సహజ లక్షణాలు ఎంపీసీ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు చాలా అవసరం. ఎంపీసీలో ప్రథమ భాషగా తెలుగు లేదా సంస్కృతం, ద్వితీయ భాషగా ఇంగ్లిష్, గ్రూప్ సబ్జెక్టులుగా.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉంటాయి. ఎంపీసీ అంటే.. కేవలం ఇంజనీరింగ్లో చేరడం కోసమే అనే అభిప్రాయంతో ఈ గ్రూప్ను ఎంచుకుంటారు. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి కోర్సులు చేయొచ్చు. ఇంటర్మీడియెట్లో సీఈసీ గ్రూప్ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాలపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స (సీఈసీ). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కామర్స్లో నైపుణ్యాలు పొందిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన గ్రూప్.. సీఈసీ. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు సీఈసీ ఎంతో అనుకూలమైన గ్రూప్. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోకుండా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి. సీఈసీ తర్వాత చాలామంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ-కామర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆనర్స్ తదితర). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూప్ను ఎంచుకోవాలంటే ఏయే స్కిల్స్ ఉండాలి? ఇటీవల కాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పొందుతున్న గ్రూప్.. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ (ఎంఈసీ). అటు మ్యాథ్స్.. ఇటు కామర్స్.. రెండిటిని ఇష్టపడేవారికి చక్కటి గ్రూప్.. ఎంఈసీ. లెక్కలు, వ్యాపారం, గణాంకాలు, ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి అపార అవకాశాలందిస్తున్న ఈ కోర్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణలతో విస్తృత ఉద్యోగావకాశాలను ఈ గ్రూప్ ద్వారా సాధించవచ్చు. మ్యాథ్స్ అంటే ఆసక్తి, ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య శాస్త్రం పట్ల మక్కువ ఉన్నవారు ఎంఈసీని ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్లో హెచ్ఈసీ గ్రూప్ను ఎంపిక చేసుకునేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ‘ఏ గ్రూప్లో సీటు రాకపోతే హెచ్ఈసీలో చేరతారు’.. ఇది సాధారణఅభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని తిరగ రాయాల్సిందే. ఎందుకంటే.. ఇంటర్మీడియెట్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ).. సుస్థిర భవిష్యత్తుకు పునాది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా సివిల్స్ మొదలు గ్రూప్-4 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు.. మేలు చేసే గ్రూప్ హెచ్ఈసీ. ఈ గ్రూప్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకునే నైపుణ్యం. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్ఈసీ తర్వాత అవకాశాలు అనేకం. ఒకప్పుడు హెచ్ఈసీ తర్వాత బీఏలో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, లిబరల్ ఆర్ట్స్ తదితర) అందుబాటులోకి వచ్చాయి. హెచ్ఈసీతో (ఇంటర్మీడియెట్) ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ(ఎంఏ)లో ప్రవేశించొచ్చు. ఐటీఐలో చేరడానికి అర్హత ఏమిటి? ఎంపిక ఎలా ఉంటుందో తెలియజేయండి? పదో తరగతి తర్వాత తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే ఉద్యోగం/స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మార్గం.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ). ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో వివిధ నైపుణ్యాలు సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకాలేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశాలపై ఐటీఐలు దృష్టిసారించారుు. పదో తరగతి మార్కుల ఆధారంగా వీటిలో చేరొచ్చు. జూలై/ఆగస్టుల్లో ప్రవేశాలుంటాయి. ఐటీఐలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఐటీఐల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వైర్మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) తదితర కోర్సులు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్. ఈ కోర్సులే కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్/కంపెనీల అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులు, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఐటీఐలు అందిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేశాను. స్వయం ఉపాధి దిశగా స్థిరపడాలంటే స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి? సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ టిన్స్విటీస్ (సెట్విన్).. యువతకు స్వయం ఉపాధి కోర్సులను అందిస్తోంది. ఎంఎస్ ఆఫీస్, డెస్క్టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, ఎయిర్లైన్ టికెటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామ్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, టైప్ రైటింగ్, టెలిఫోన్ ఆపరేటర్, కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి. సెట్విన్ మాత్రమే కాకుండా స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్-భూదాన్ పోచంపల్లి(నల్గొండ జిల్లా), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)- హైదరాబాద్ వంటి సంస్థలు అటు స్వయం ఉపాధిని, ఇటు ఏదైనా ఉద్యోగాన్ని పొందేలా వివిధ కోర్సులందిస్తున్నాయి. వీటిల్లో ఇన్స్టిట్యూట్ను బట్టి హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, సెల్ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా, కంప్యూటర్ హార్డ్వేర్, ఎయిర్లైన్ టికెటింగ్, కాల్సెంటర్ ట్రైనింగ్, గోల్డ్ పాలిషింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి కోర్సును బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనాలేమిటి? ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ రాయాలి. ఇందులో ర్యాంకు ద్వారా మూడేళ్లు/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్లలో డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణులు ఈసెట్ ద్వారా బీటెక్లో రెండో సంవత్సరంలో ప్రవేశించొచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీ సూపర్వైజర్లుగా నియమించుకుంటున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సుల గురించి తెలపండి? పదో తరగతి ఉత్తీర్ణతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పి.వి.నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులు అందిస్తున్నాయి. అగ్రి పాలిటెక్నిక్లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. హార్టికల్చర్లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వెటర్నరీ పాలిటెక్నిక్లో భాగంగా డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. దరఖాస్తుకు సమయం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్సైట్స్ చూడొచ్చు. పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలపండి? సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లో కానిస్టేబుల్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స (సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎస్ఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స (బీఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స (ఐటీబీపీ)లలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మెన్స అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజుర్మెంట్స్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టె స్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష విధానం: వంద మార్కులకు నిర్వహించే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ ఇంటెలిజెన్స అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ అండ్ జనరల్ ఎవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లేదా హిందీలో నాలుగు విభాగాల నుంచి 25 మార్కుల చొప్పున 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వెబ్సైట్స్: www.cisf.gov.in, www.ssb.nic.in, www.nia.gov.in, www.http://bsf.nic.in, http://crpf.nic.in, http://itbpolice.nic.in, www.assamrifles.gov.in ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు ప్రకటన: రైల్వే ఉద్యోగాల భర్తీకి ఏడాదిలో చాలాసార్లు ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. ఈ మధ్య వివిధ రైల్వే జోన్లు ఖాళీలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాయి. ప్రకటనలు ఠీఠీఠీ.టటఛిఛ.జౌఠి.జీ వెబ్సైట్లో లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్లో చూడొచ్చు. డిఫెన్స్ జాబ్స్.. ఇండియన్ నేవీలో.. పోస్టులు: మెట్రిక్ రిక్రూట్-స్టివార్డ్/కుక్స్; మ్యుజీషియన్లు. వయోపరిమితి: 17-21 ఏళ్లు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వెబ్సైట్: www.nausena-bharti.nic.in ఇండియన్ ఆర్మీలో.. పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ అర్హత: 45 శాతం మార్కులతో దో తరగతి. వయోపరిమితి: 171/2న్నర నుంచి 21 ఏళ్లు. ఎంపిక విధానం: రాతపరీక్ష, హదారుఢ్య, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా. వెబ్సైట్: http://indianarmy.nic.in ఇండియన్ ఎయిర్ఫోర్స్లో.. పోస్టు: ఎయిర్మెన్ గ్రూప్-వై మ్యుజీషియన్ ట్రేడ్ అర్హత: పదోతరగతిలో 45 శాతం మార్కులు. వయసు: 17 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ల ద్వారా. సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. వెబ్సైట్: http://careerairforce.nic.in ఏపీఎస్ఆర్టీసీ/టీఎస్ఆర్టీసీలో.. పోస్టు: బస్ కండక్టర్ ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా.. పోస్టు: బస్ డ్రైవర్ ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్తోపాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి. ఆసక్తికి అనుగుణంగా ఇంటర్లో ఏ గ్రూపులో చేరినప్పటికీ, మొదట్నుంచి అకడమిక్గా ముందుండటానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆయా ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక కారణం చెప్పి, సబ్జెక్టుల అధ్యయనాన్ని వాయిదా వేసే ధోరణి సగటు విద్యార్థిలో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేయాలి. తమ గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల అప్లికేషన్స్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం ముఖ్యం. కాలేజీ సమయాన్ని మినహాయించి, రోజుకు 4-5 గంటలు కష్టపడి చదివినప్పుడే లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది. - ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీచైతన్య విద్యాసంస్థలు. -
ఇంటర్ తర్వాత...
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ అత్యున్నత విద్యావకాశాలు అందించే గ్రూప్.. మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ). ఇంటర్మీడియెట్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్) రాసి.. వివిధ బ్రాంచ్ల్లో బీటెక్, బీఫార్మసీ, బీటెక్(అగ్రి ఇంజనీరింగ్), బీటెక్(బయోటెక్నాలజీ), బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఫార్మ్డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ఫార్మ్డి మినహాయించి మిగిలిన కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఫార్మ్డి వ్యవధి ఆరేళ్లు. ♦ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యకు మేటి సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లలో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (ఇంజనీరింగ్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదవొచ్చు. దీనికోసం జాతీయస్థాయిలో ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు. ♦ సైన్స్ సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో నాలుగేళ్ల బీఎస్ (రీసెర్చ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదివే వీలుంది. ఇన్స్టిట్యూట్ను బట్టి జాతీయస్థాయిలో జరిగే ప్రవేశపరీక్ష/జేఈఈ అడ్వాన్స్డ్ తదితర మార్గాల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ♦ దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వంటివాటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటివి ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో బీఏ(మ్యాథ్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ(బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) వంటి కాంబినేషన్లతోపాటు బీఏ/బీకాం వంటి కోర్సులు చదివే వీలుంది. బీఏలో ఎకనామిక్స్ చదవడం కుదరదు. ఇంటర్లో ఎకనామిక్స్ చదివినవాళ్లే అర్హులు. బీఏ/బీఎస్సీ/బీకాం కోర్సుల వ్యవధి: మూడేళ్లు. ♦ బీటెక్ /బీఏ /బీఎస్సీ/బీకాం కోర్సులు పూర్తిచేస్తే సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్తో ఎంటెక్/ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఎంటెక్/ఎంబీఏ మినహాయించి మిగిలిన కోర్సులకు ఆయా వర్సిటీల ప్రవేశపరీక్షలు రాయాలి. ఎంటెక్కు గేట్/పీజీఈసెట్, ఎంబీఏకు క్యాట్/మ్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఆత్మా వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించాలి. ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుందా? ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ల్లో కమిషన్డ్ అధికారిగా అడుగుపెట్టే వీలుంది. అవాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నోటిఫికేషన్లో ప్రకటించిన తేదీనాటికి నిర్దేశిత వయసును కలిగి ఉండాలి. ప్రవేశపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీఏ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)- ఎజిమలలో నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి బీటెక్ ప్రదానం చేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్ని బట్టి త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్గా నియమిస్తారు. నెలకు రూ.35 వేల వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. ఇంకా గ్రేడ్ పే, హెచ్ఆర్ఏ, ఇన్సూరెన్స్, పెన్షన్ తదితర సదుపాయాలుంటాయి. ♦ దూరవిద్యతో అవకాశం: ఇంటర్మీడియెట్ తర్వాత ఉన్నత చదువులకు ఆటంకాలు ఏర్పడితే ఏదైనా ఉద్యోగం చేస్తూ దూరవిద్య విధానం ద్వారా బీఏ/బీకాం/బీఎస్సీ వంటి కోర్సులు చదువుకునే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం-తిరుపతి, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి జూలై మధ్యలో ఆయా నోటిఫికేషన్లు వెలువడతాయి. ఇంటర్మీడియెట్ ఎంఈసీ పూర్తిచేస్తే ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేయడం ద్వారా.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకాం) (జనరల్ /ఈ-కామర్స్ /కంప్యూటర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎంకాం(వ్యవధి:ఐదేళ్లు)లలో చేరొచ్చు. ♦ బీఏ/బీకాం తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) చదివి సంస్థల నిర్వహణలో కీలకపాత్ర పోషించొచ్చు. తద్వారా మేనేజ్మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు భారీ వేతనాలను అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులు చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది. ఇంటర్మీడియెట్ హెచ్ఈసీ పూర్తి చేశాను. బ్యాచిలర్ డిగ్రీలో బీఏ చదవాలనుకుంటున్నాను. బీఏలో ఏయే కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి? ♦ ఇంటర్మీడియెట్లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో చేరొచ్చు. ఇందులో భాగంగా వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ; సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ; సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్; సైకాలజీ, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిలాసఫీ; సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్; హిస్టరీ, హిందీ, సంస్కృతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఈ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఆయా పరీక్షల్లో కూడా ఈ నేపథ్యం ఉపకరిస్తోంది. దీంతో బీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ♦ ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. బీకాం చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఆర్థిక, వాణి జ్య రంగాల విస్తరణ, కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో బీకాం కోర్సుల అభ్యర్థులకు చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మార్కెట్/కంపెనీ అవసరాలకనుగుణంగా బీకాంలో వివిధ స్పెషలైజేషన్లను ఆయా విద్యా సంస్థలు ప్రవేశపెట్టాయి. రెగ్యులర్ బీకాంతోపాటు బీకాం ఈ-కామర్స్ /హానర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్ /కంప్యూటర్స్ /బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ /ట్యాక్సేషన్ /మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీకాం పూర్తయిన తర్వాత సంబంధిత అంశంలో ఎంకాం కూడా పూర్తిచేసే వీలుంది. ఇంటర్మీడియెట్ బైపీసీ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్య అవకాశాలు ఎలా ఉంటాయి? ♦ ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసినవారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ అండ్ మెడిసిన్ సర్జరీ (బీహెచ్ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్వైఎస్), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సెన్సైస్ (బీఎఫ్ఎస్సీ), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మ్డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ♦ ఇవే కాకుండా ఇంటర్మీడియెట్ బైపీసీ మార్కుల ఆధారంగా పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పారామెడికల్ బోర్డులు ఈ కోర్సులు నిర్వహిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో డిప్లొమా ఇన్.. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ/ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్/డయాలసిస్ టెక్నాలజీ /రెస్పిరేటరీ థెరపీ/మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ/పర్ఫ్యూషన్ టెక్నాలజీ/రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్/డార్క్రూమ్ అసిస్టెంట్/కార్డియాలజీ టెక్నీషియన్/క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ/ఈసీజీ టెక్నీషియన్/అనస్థీషియా టెక్నీషియన్/ఆడియోమెట్రీ టెక్నీషియన్/ఆప్టోమెట్రీ టెక్నీషియన్/రేడియోథెరపీ టెక్నాలజీ/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. ♦ పారామెడికల్ కోర్సులే కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(బీఎంఎల్టీ), బీఎస్సీ(నర్సింగ్) వంటి కోర్సుల్లోనూ ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా చేరొచ్చు. ♦ బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్) కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ♦ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు పీజీ స్థాయిలో సంబంధిత విభాగాల్లో ఎంఎస్/ఎండీ/సూపర్ స్పెషాలిటీ/డిప్లొమా/ఎంఎస్సీ వంటి కోర్సులు చదవచ్చు. ఇంటర్మీడియెట్ ఎంపీసీతో ఇండియన్ ఆర్మీలో ఏయే ఉద్యోగాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి.. ♦ సోల్జర్స్ (టెక్నికల్) (టెక్నికల్ ఆర్మ్స్, ఆర్టిలరీ, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్): 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్) ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు తప్పనిసరి. 171/2-231/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (అన్ని ఆర్మ్స్): 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియెట్ (ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొందాలి) ఉత్తీర్ణత. 17 1/2-23 1/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత తేదీనాటికి 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు ఐదేళ్లు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపడతారు. నెలకు అన్ని కలుపుకొని రూ.65 వేల వేతనం చెల్లిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో జాతీయస్థాయిలో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి? ♦ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్స్(ఎల్డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీటీపీలు), పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్ భర్తీకి జాతీయస్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (10+2). ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, నిర్దేశిత తేదీ నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.5200-రూ.20200 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభమవుతుంది. ♦ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్: వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విభాగాల్లో స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి ఏటా ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఆగస్టు 1, 2016 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూలై 31న పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ నేవీలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? ♦ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ సెయిలర్: నిర్దేశిత తేదీ నాటికి 17-20 ఏళ్ల మధ్యలో ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ సీనియర్ సెకండరీ రిక్రూట్స్: 17-21 ఏళ్ల మధ్య వయసు ఉన్న అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. గంట వ్యవధిలో జరిగే రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్లపై ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులను శారీరక సామర్థ్య పరీక్షకు ఎంపిక చేస్తారు. ♦ నోటిఫికేషన్లు: ఏటా డిసెంబర్/జనవరి; జూన్/జూలైల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్, జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి. ఇంటర్మీడియెట్ లో సీఈసీ/హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యపరంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్లో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (సీఈసీ), హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ) గ్రూప్ను ఎంచుకున్నవారికి తర్వాత ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలుంటాయి. ♦ రెండేళ్ల ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల బీఏఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. జాతీయస్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాలి. ♦ ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టమున్నవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సుల్లో చేరొచ్చు. దీనికోసం డీఈఈసెట్ రాయాలి. ఏటా మే/జూన్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా డీఈడీ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా అడుగుపెట్టడానికి అర్హత లభిస్తుంది. ♦ హోటల్ మేనేజ్మెంట్పై ఆసక్తి ఉన్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం)లలో మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరొచ్చు. ♦ సంప్రదాయ డిగ్రీలో చేరాలనుకుంటే.. మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)/బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం)ల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సులు కూడా అందిస్తున్నాయి. బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ పూర్తిచేస్తే తర్వాత రెండేళ్ల ఎంఏ/ఎంకాం/ఎంబీఏ చదవొచ్చు. ♦ సీఈసీ విద్యార్థులు చార్టర్ట్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) వంటి కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశించే వీలుంది. లేదంటే బీకాం చేసిన తర్వాత అకౌంటింగ్, ట్యాలీ వంటి కోర్సులు పూర్తిచేస్తే వివిధ సంస్థల్లో అకౌంటెంట్గా పనిచేయొచ్చు. ♦ ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ విద్యార్థులకు ఉన్న మరో అద్భుత అవకాశం.. ఇంటిగ్రేటెడ్ పీజీలు. వీటి ద్వారా బ్రేక్ లేకుండా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ పూర్తిచేయొచ్చు. మూడేళ్ల తర్వాత పీజీ వద్దనుకుంటే గ్రాడ్యుయేట్ పట్టా కూడా ఇవ్వడం ఈ కోర్సుల ప్రత్యేకత. ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. ఫైన్ఆర్ట్స చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ ఉత్తీర్ణతతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో భాగంగా స్కల్ప్చర్/ఫొటోగ్రఫీ/అప్లైడ్ ఆర్ట్స్/యానిమేషన్/ పెయింటింగ్/ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. హైదరాబాద్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఈ కోర్సులను అందిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రూ. 3 వేలు ఆలస్య రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో ప్రవేశపరీక్ష ఉంటుంది. సీఈసీ పూర్తిచేశాను.. బీసీఏ/బీబీఎం/బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చా? వీటితో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదవాలంటే.. ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సాఫ్ట్వేర్ బూమ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కోర్సుల్లో బీసీఏ ఒకటి. కొన్ని కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే విద్యార్థులకు నిర్వహణ నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కోర్సులు.. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. బీఎస్సీలో ఏయే కాంబినేషన్లు ఉన్నాయి? దేనికి ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి? ఇంటర్ ఎంపీసీ/బైపీసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్; మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సైన్స్; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. ♦ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీలో భాగంగా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లు ఉన్నాయి. వీటిలో అన్ని సబ్జెక్టులకు ఉన్నతవిద్య అవకాశాలున్నాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులు (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ) చదివే విద్యార్థులు పీజీ, పీహెచ్డీ చేయాలనుకుంటేనే ఆ సబ్జెక్టులు చదవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆ కోర్సులతో అంతగా ఉద్యోగావకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) కు ఉన్నతవిద్య పరంగా, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేస్తేనే మంచిదని పేర్కొంటున్నారు. ఆసక్తి, కెరీర్ పరంగా భవిష్యత్తు లక్ష్యాలు, జాబ్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో కాంబినేషన్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మా ఇండస్ట్రీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత అవకాశాలుంటున్నాయి. ఫైనలియర్లో చూద్దాంలే అనుకోకుండా.. కాలేజీలో చేరిన మొదటి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగ సాధనకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా సీరియస్గా సిద్ధమవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవాలి. మన సామర్థ్యాలను కచ్చితంగా వ్యక్తపరిచేందుకు ఇవి కీలకం. కాలేజీ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దినపత్రికలను కూడా చదవాలి. కేవలం మార్కులు, పర్సంటేజీలే కాకుండా అన్ని అంశాల్లోనూ ముందున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సొంతమవుతుంది. - డా. కె.ప్రమీల, ప్రిన్సిపల్, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 10+2 (బీటెక్) అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. నిర్దేశిత తేదీ నాటికి 17 - 19 1/2 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. వెబ్సైట్: www.joinindiannavy.gov.in/ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
ఉద్యోగాలు
పుదుచ్చేరి నిట్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాలు: ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3 వివరాలకు: www.nitpy.ac.in రాయ్పూర్ ఎయిమ్స్లో ట్యూటర్/క్లినికల్ ఇన్స్ట్రక్టర్ రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జూలై 14 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వివరాలకు: www.aiimsraipur.edu.in విజయనగరం జిల్లాలో 39 పోస్టులు విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ.. వ్యవసాయశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 39 అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25 వివరాలకు: www.vizianagaram.nic.in -
సహోద్యోగులే స్నేహితులు!
స్కిల్ డెవలప్మెంట్ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనిచేసే చోట స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. సహోద్యోగులను స్నేహితులుగా, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాన్ని కనుగొనడంలో మార్గం చూపే వ్యక్తులుగా మలచుకోవాలి. అప్పుడే వృత్తిగత జీవితం వర్ధిల్లుతుంది. ఈ క్రమంలో తోటి ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు సూచనలు.. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా కూర్చోకుండా, చొరవ తీసుకొని సహోద్యోగులతో మాట కలపాలి. టీ, లంచ్ బ్రేక్లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పనిచేసే చోట కుదురుకునేందుకు వీలవుతుంది. సహచర ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. చక్కటి పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తోటి ఉద్యోగులకు దగ్గర కావొచ్చు. వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. మంచి ఆలోచనలను పంచుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే తోటి ఉద్యోగులే మీతో స్నేహం చేయడానికి పోటీపడతారు. బ్రేక్ సమయాల్లో లేనిపోని గొప్పలు చెప్పుకోకుండా.. వృత్తికి సంబంధించిన లేదా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై తోటి ఉద్యోగులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులుగా మారడానికి దోహదం చేస్తుంది. సాయం చేయడంలో ముందుండాలి తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే.. చొరవ తీసుకొని, సాయం చేయడంలో ముందుండాలి. ఇలా చేస్తే వారు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోరు. చిన్న చిన్న కారణాలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు.. మీరే ముందుగా సారీ చెప్పండి. కొద్ది సేపు ఏకాంతంగా కూర్చుని, అన్ని అంశాలనూ చర్చించుకోండి. * మీతో మంచిగా ఉంటూ.. మీ గురించి ఇతరులతో చెడుగా చెప్పేవారిని దూరం పెట్టాలి. * మీ ఆలోచనలను కాపీ కొట్టి.. బాస్ దగ్గర మంచి పేరు కొట్టెయ్యాలనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. * చక్కటి పనితీరు కనబరిచే వారిపై లేనిపోని రూమర్లు పుట్టించి, వారిని పక్కదారి పట్టించాలని చూసేవారి మాటలు పట్టించుకోవద్దు. * పని విషయంలో ఇతరులను పోటీదారులుగా భావించకుండా, బృంద స్ఫూర్తితో అడుగేయాలి. -
చాలెంజింగ్ కెరీర్కు.. మెరైన్ ఇంజనీరింగ్!
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ విభాగంలో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి సరైన బ్రాంచ్.. మెరైన్ ఇంజనీరింగ్! ఇది ప్రధానంగా సముద్ర రవాణా, నౌకల తయారీ, వాటి నిర్వహణకు సంబంధించిన విభాగం. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్ల పని పరిధి విస్తరించింది. అంతర్జాతీయంగా ఎగుమతి, దిగుమతులకు ఎక్కువగా సముద్ర రవాణాను ఉపయోగిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం సరకు రవాణా షిప్పుల ద్వారానే జరుగుతుండటంతో మెరైన్ ఇంజనీరింగ్ ఉజ్వల కెరీర్కు వేదికగా నిలుస్తోంది.. మెరైన్ ఇంజనీర్లు ఏం చేస్తారు? మెరైన్ ఇంజనీర్ల విధులు కొద్దిగా రిస్క్తో కూడుకున్నవైనప్పటికీ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, నేవిగేషన్లలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమయ్యాయి. ఇంజనీర్లకు నౌక ఆకృతి, దాని తయారీకి అవసరమైన పరికరాల ఎంపిక, వాటి అమరిక, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మత్తులు తదితర విధులు ఉంటాయి. నౌకకు సంబంధించిన ప్రధాన యంత్రాలైన డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు, పంపులు, కంప్రెషర్లు, హీట్ ఎక్స్చేంజర్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ తదితరాల నిర్వహణ బాధ్యత పూర్తిగా మెరైన్ ఇంజనీర్లదే. నౌకల డిజైన్, నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం నౌకకు సంబంధించే కాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికుల్లా స్పందించి, సామాన్యులను కాపాడటం కూడా మెరైన్ ఇంజనీర్ల అదనపు బాధ్యత. దీనికి తగిన విధంగా సన్నద్ధమై ఉండాలి. కోర్సులు-వివరాలు పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసిన వారు బీఎస్సీ (నాటికల్ సైన్స్), బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ప్రత్యేక విభాగాలు మారిటైమ్ కామర్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, నేవిగేషన్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్, మెరైన్ రిన్యువబుల్ ఎనర్జీ రీసెర్చ్, అండర్ వాటర్ వెహికల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్-కమ్యూనికేషన్ సిస్టమ్స్-ఎక్విప్మెంట్, ఆఫ్షోర్ ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కేబుల్ లైయింగ్) వంటివి.. కెరీర్ వివరాలు అనేక ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగం మెరైన్ ఇంజనీరింగ్. ఇండియన్ మర్చెంట్ నేవీ, నేవీతోపాటు నౌకా నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు అపారం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లో అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి ది అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఆంగ్లో ఈస్టెర్న్ షిప్పింగ్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గ్రేట్ ఈస్టెర్న్ షిప్పింగ్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ వంటి సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారిని జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. ప్రతిభ, మంచి పనితీరుతో ఐదారేళ్లలోనే చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగవచ్చు. మరికొన్ని సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా మెరైన్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వేతనాలు ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పోల్చితే పోటీ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెరైన్ ఇంజనీర్లకు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుతున్నాయి. ఇందులో ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, చీఫ్ ఇంజనీర్ అనే స్థాయిలు ఉంటాయి. హోదాను బట్టి నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలను అందుకోవచ్చు. కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, గోవా www.imsgoa.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ www.iitm.ac.in ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కోల్కతా క్యాంపస్ www.merical.ac.in ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్, గ్రేటర్ నోయిడా www.imi.edu.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం www.andhrauniversity.edu.in/engg కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల తర్వాత విద్యార్థులు ఎక్కువగా మెరైన్ ఇంజనీరింగ్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్లకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు ఆకర్షణీయ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. - డా. బి.వి.అప్పారావు, ప్రొఫెసర్, మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ. -
ఇంటర్వ్యూ తేదీలు
* ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) హాస్పిటల్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: జూన్ 20 * హైదరాబాద్లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు: జూన్ 27 * రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్ట్ అటెండెంట్ (టెక్నికల్) పోస్టులకు: జూన్ 27 -
ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే. -
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్
జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు. ఏటా 8 లక్షల మంది.. ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. 2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. కువైట్ నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్మెంట్, హౌస్కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఖతార్ ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది. సౌదీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. యూఏఈ నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి. అర్హతను బట్టి ఉద్యోగాలు ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్గా పేర్కొంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..) ఔత్సాహికులకు భరోసా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం. వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. అంతా ఆన్లైన్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది. కఫాలా.. తప్పనిసరి గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లు ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్. గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. - కె.భవాని, జీఎం-హెచ్ఆర్, టామ్కామ్. -
యువతి అదృశ్యం
ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెలికాంనగర్లో నివాసం ఉండే పి.భవిత(22) ఈ నెల 16న తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి సురేష్రెడ్డి శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్టాప్లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి. మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి? ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు... ఏఐసీటీఈ ప్రమాణాలు కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్. * ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15 * ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి. * ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి. * లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి. * వీటిలో 25 శాతం జర్నల్స్ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్గా అందుబాటులో ఉంచాలి. * కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి. * ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా. ఫ్యాకల్టీ.. ప్లేస్మెంట్స్ ఎంబీఏ మొదటి సంవత్సరం అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్మెంట్స్లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే! ప్రత్యక్ష పరిశీలన వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి. స్పెషలైజేషన్ కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్మెంట్ అసోసియేషన్స్తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం.. ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 384 సీట్లు: 45,965 తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 347 సీట్లు: 41,796 ఐసెట్ కౌన్సెలింగ్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్పై అవగాహన ఏర్పరచుకోవాలి. - ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్. గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్, రియల్టైం ప్రాజెక్ట్వర్క్కు ప్రాధాన్యమివ్వాలి. - ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్. -
భవితకు ‘నిర్మాణ’ రంగం
నిర్మాణ రంగం ప్రస్తుత శరవేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. మార్కెట్ వాటా పరంగా గత నాలుగేళ్లుగా సగటున పది శాతం వార్షిక వృద్ధి నమోదు చేసుకుంటోంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ కేరాఫ్గా నిలుస్తోంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఉపాధి కల్పనలో ఈ రంగం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. తాజా నివేదికల ప్రకారం- 2022 నాటికి నిర్మాణ రంగం, దాని అనుబంధ మౌలిక సదుపాయాల విభాగాల్లో 12.67 మిలియన్ల కొత్త ఉద్యోగాలు నమోదవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కెరీర్ అవకాశాలు.. జాబ్ ప్రొఫైల్స్, అవసరమైన స్కిల్స్పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజర్స్ నిర్దిష్టంగా ఒక నిర్మాణం, లేదా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు.. ప్రాజెక్ట్ మేనేజర్స్. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రాజెక్ట్ మేనేజర్స్గా చేరొచ్చు. వీరికి అకడమిక్ అర్హతలతోపాటు ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఒక ప్రాజెక్ట్ సమర్థంగా పూర్తి చేయడంలో ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలపై ముందుగానే అవగాహన, నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలు ఉండాలి. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తిగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే నిపుణులే.. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్. బీటెక్/ఎంటెక్ స్థాయిలో సివిల్, అనుబంధ బ్రాంచ్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్గా నియమిస్తారు. ఒక ప్రాజెక్ట్కు సంబంధించి డిజైన్, ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉంటే కెరీర్లో మంచి స్థాయికి చేరొచ్చు. సూపర్వైజర్స్ ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయిలో సిబ్బందికి మధ్య వారధిగా పనిచేసేవారే.. సూపర్వైజర్స్. నిర్దిష్ట ప్రాజెక్ట్ పనితీరును పర్యవేక్షించే విధులను నిర్వర్తించడం సూపర్వైజర్స్ ప్రధాన బాధ్యత. నిర్దిష్ట ప్రాజెక్ట్కు అవసరమైన పరికరాలు, మెటీరియల్, మెషినరీ అవసరాల గురించి ముందస్తు అవగాహన ఉంటే సూపర్వైజర్స్గా మరింత రాణించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కింది స్థాయిలో దినసరి వేతనంపై పనిచేసే సిబ్బంది నిర్వహణ విషయంలో వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. డిప్లొమా స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు సూపర్వైజర్స్ పోస్టుకు అర్హులు. స్వల్పకాలిక కోర్సులతో వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. కొద్దిపాటి శిక్షణ, స్కిల్స్తో బార్ బెండర్, మ్యాసన్, ప్లంబర్, పెయింటర్, వెల్డర్, ఎక్విప్మెంట్ ఆపరేటర్ వంటి పలు అవకాశాలు అందుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో; సెట్విన్, నిమ్స్మేలలో అందించే స్వల్పకాలిక శిక్షణ ద్వారా విధులు సమర్థంగా నిర్వహించే అవకాశముంది. నిర్మాణ రంగంలో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత దృష్ట్యా శిక్షణనిచ్చే సంస్థల సంఖ్య సైతం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రాష్ట్రాల పరిధిలో డెరైక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో వృత్తి శిక్షణ కేంద్రాలు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్న సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్లో ఈ శిక్షణ లభిస్తోంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కు సంబంధించి కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. క్యాడ్ కలిసొచ్చే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో రాణించాలనుకునే అభ్యర్థులకు కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్)లో నైపుణ్యం. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లన్నీ కంప్యూటర్ ఆధారితంగా రూపొందుతున్నాయి. వీటికి సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. క్యాడ్ డిజైనింగ్. బీటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సర్టిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. క్షేత్ర స్థాయి విధులు ఎక్కువ అని భావించే కన్స్ట్రక్షన్ విభాగంలోనే ఇన్-హౌస్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ నైపుణ్యాలు.. కోర్సులు నిర్మాణ రంగం ఔత్సాహికులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు... నిర్వహణ నైపుణ్యాలను కూడా సమ్మిళితం చేస్తే కెరీర్లో దూసుకెళ్లొచ్చు. ప్రస్తుతం పలు ఇన్స్టిట్యూట్లు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పేరిట ఇటు కోర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, అటు నిర్దిష్ట ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులు అందిస్తున్నాయి. అవి.. * ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - కోర్సు: అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (నిక్మర్) - కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) - కాలికట్, కోర్సు: పోస్ట్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ నిర్మాణం, అనుబంధ రంగాల గణాంకాలివే * దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో పెద్ద రంగం. * ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తుతం 45 మిలియన్ ఉద్యోగాలు. * 2022 నాటికి మానవ వనరుల అవసరం 66.62 మిలియన్లకు చేరుకోనుందని అంచనా * ప్రభుత్వ మౌలిక నిర్మాణ పథకాల్లోనే (హైవేల నిర్మాణం, రైల్వే నిర్మాణం తదితర) 2022 నాటికి 1.8 మిలియన్ల మంది అవసరమని అంచనా. * వీటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రేడ్ సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ) నిపుణుల కమిటీ సూచించింది. పాజిటివ్స, నెగటివ్స్ * డిమాండ్ - సప్లయ్ కోణంలో ఏ కోర్సు పూర్తి చేసినా కెరీర్ ఖాయం. * ప్రారంభంలో కింది స్థాయిలోనే నెలకు రూ.10 వేల వరకు సంపాదించే అవకాశం. * క్షేత్ర స్థాయి విధులే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న ఇన్-హౌస్ జాబ్స్. * సిబ్బందిని, కార్మికులను మెప్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులు. * అధిక శాతం విధులు క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధంగా ఉండటం. * ఒక ప్రాజెక్ట్కు సంబంధించిన మెటీరియల్స్ను త్వరగా తెప్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు. ఎమర్జింగ్ కెరీర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఎమర్జింగ్ కెరీర్గా మారుతోంది. ముఖ్యంగా డిప్లొమా, బీటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశాలు ఖాయం. వీరు తమ అకడమిక్ అర్హతలకు అనుగుణంగా అదనపు సర్టిఫికేషన్ క్యాడ్, క్యామ్ వంటివి నేర్చుకోవడం, అదే విధంగా ఈ రంగానికి సంబంధించి స్పెషలైజ్డ్ శిక్షణ తరగతులకు హాజరవడం వంటివి చేస్తే ఈ రంగంలో మరింత ఉన్నతంగా ఎదగొచ్చు. - ప్రొఫెసర్ ఆర్.సతీశ్ కుమార్,నిక్మర్, హైదరాబాద్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పలు ఇన్స్టిట్యూట్స్ వృత్తి శిక్షణ నైపుణ్యాలను అందించే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి.. నేషనల్ కౌన్సిల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్సులు: డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్వాలిటీ సర్వేయింగ్. సర్టిఫికెట్ కోర్సులు: సైట్ ఆర్గనైజేషన్ అండ్ లేఔట్; కాంక్రీట్ అండ్ కాంక్రీటింగ్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ తదితర కోర్సులు. వెబ్సైట్: www.baionline.in నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ స్కాఫోల్డర్ హెల్పర్ బార్ బెండర్ అండ్ ఫిక్సర్ హెల్పర్ కార్పెంటర్ హెల్పర్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ హెల్పర్ మాసన్ వీటిని కన్స్ట్రక్షన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ విభాగం పరిధిలో పలు ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం ద్వారా అందిస్తోంది వెబ్సైట్: www.nsdcindia.org -
కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి. -
ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో 23 పోస్టులు చిత్తూరు జిల్లా ‘మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ’.. ఐసీడీఎస్ ప్రాజెక్ట్లోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఖాళీలు: 23 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తు పూర్తిచేసి ‘ప్రాజెక్ట్ డెరైక్టర్, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ, చిత్తూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 11 వివరాలకు: www.chittoor.ap.gov.in సెయిల్లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (డీఎస్పీ).. వివిధ విభాగాల్లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్)లకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు: 69 విభాగాలు: ఐసీయూ/ఎన్ఐసీయూ/బీఐసీయూ,మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు దరఖాస్తుకు చివరి తేది: జూన్ 22 ఇంటర్వ్యూ తేది: జూన్ 26 వివరాలకు: www.sailcareers.com ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులు గుల్బర్గాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. విభాగాలు: పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీ, టీబీ అండ్ చెస్ట్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, అనస్థీషియా తదితర విభాగాలు. ఖాళీలు: 21, ఇంటర్వ్యూ తేది: జూన్ 21 వివరాలకు: www.esic.nic.in -
ఇంటర్వ్యూ తేదీలు
* సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులకు: జూన్ 15 * హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ లో కన్సల్టెంట్ పోస్టులకు: జూన్ 21 * ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లో ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: జూన్ 24 -
సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బృహత్తర బాధ్యత పోలీసులది. పోలీసులు లేకుంటే ప్రజలకు భద్రత కరువవుతుంది. సమాజంలో నేరాలను, నేర ప్రవృత్తిని అరికట్టే బాధ్యతాయుత ఉద్యోగం.. పోలీస్! నేరాలు ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పోలీసుల అవసరం మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో పోలీసు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనలు వెలువడి భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ప్రకటనల నేపథ్యంలో పోలీస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. ఉద్యోగావకాశాలు * రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖలో ప్రాథమికంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి వెళ్లొచ్చు. * అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించొచ్చు. * యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం ద్వారా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) ఉద్యోగం సాధించొచ్చు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. * ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాంతాల్లో పోలీసు నియామకాలు చేపడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లో ఇన్స్పెక్టర్ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. * సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ)లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. రాత, శారీరక, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాలు సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు విభాగాలు ఉంటాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో మళ్లీ ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, టాస్క్ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) తదితర విభాగాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఛండీగఢ్, పాండిచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోలీసు విభాగాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు ఉంటారు. పారా మిలటరీ దళాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ)లు ప్రత్యేక సాయుధ దళాలు. నిర్ణీత విధుల కోసం వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులకు ఇవి సహకరిస్తాయి. సైన్యం తరహాలో వీటి నిర్మాణం ఉన్నందువల్ల వీటిని పారా మిలటరీ దళాలు అంటారు. పోలీసు విధులు ⇒ అంతర్గత భద్రతను పరిరక్షించడం. ⇒ రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు తదితర ప్రజల ఆస్తులు, ప్రఖ్యాత భవనాలు, కట్టడాలకు రక్షణ కల్పించడం. ⇒ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం. ⇒ నిందితులను విచారించడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం. ⇒ క్రైం రిపోర్టులను పరిశీలించడం. ⇒ అభియోగాలను నమోదు చేయడం. వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కోర్టుకు సమర్పించడం. ⇒ రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం. ⇒ అత్యవసర సమయాల్లో స్పందించడం. ⇒ ట్రాఫిక్/సమూహాన్ని నియంత్రించడం. ⇒ ఉద్రిక్తతల సమయంలో అందరూ శాంతియుతంగా ఉండేలా చూడటం పని వేళలు పోలీసులకు ప్రత్యేకించి పనివేళలు అంటూ ఏమీ ఉండవు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. అవసరమైతే అర్ధరాత్రయినా వెళ్లి నేరస్తులను అరెస్టు చేయాలి. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించడం వీరి బాధ్యత. పండగల సమయంలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు ⇒ పరిణతితో వ్యవహరించాలి. ⇒ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. ⇒ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలగాలి. ⇒ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ⇒ సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం. ⇒ సునిశిత పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం ఉండాలి. పాజిటివ్స్ ⇒ ప్రజలకు నేరుగా రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది. ⇒ ఆయా నేరాలకు సంబంధించిన చిక్కుముళ్లను ఛేదించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవచ్చు. ⇒ పోలీసులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. నెగటివ్స్ ⇒ పోలీసులకు నిర్ణీత పనివేళలు ఉండవు. వారు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. ⇒ పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా అవసరమైతే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ⇒ మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ⇒ వృత్తి పరంగా అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ⇒ ఉగ్రవాద, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావడం. -
ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్లోని అమీర్పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్కు అనుగుణంగా..సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్కు బాసటగా నిలుస్తున్నాయి. ఎవరెవరికి ఏ కోర్సులు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, హడూప్, షేర్పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, హిమాయత్నగర్, కుకట్పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), (హైదరాబాద్) అమీర్పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్పేటలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్ను అందిస్తున్నాయి. ఫీజులు ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇతర విద్యార్థులే ఎక్కువ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు * మార్కెట్ ట్రెండ్కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి. * కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి. * కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. * ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. * అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. * కొన్ని ఇన్స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అమీర్పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది. - ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్ -
విశ్వంలో ఎంత దూరం వెళ్లినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?
స్కూల్ ఎడ్యుకేషన్ * మన విశ్వంలో ‘ద్రవ్యరాశి’ (పదార్థం) గల ప్రతి వస్తువూ వేరే వస్తువుని ఆకర్షిస్తుంది. తన ఆకర్షణ శక్తితో ఆ రెండో వస్తువుని తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల మధ్య పరస్పరం ఉండే ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకటి ఆ రెండు వస్తువులలోనూ ఉండే పదార్థ పరిమాణం కాగా రెండోది ఆ రెండు వస్తువుల కేంద్ర భాగాల మధ్య ఉండే దూరం. * వస్తువుల ద్రవ్యరాశి పెరిగితే వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఆ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆ ద్రవ్యరాశుల లబ్ధం ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య పనిచేసే గురుత్వ బలం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. * ఇక గురుత్వ బలానికి సంబంధించిన రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు వస్తువుల కేంద్రకాల మధ్య ఉండే దూరం పెరిగే కొద్దీ ఆ రెండు వస్తువుల మధ్య పనిచేసే గురుత్వ బలం అదే స్థాయిలో తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు భూకేంద్రానికి -మనకు మధ్య ఉన్న దూరాన్ని రెండింతలు పెంచితే భూమికి - మనకు మధ్య పనిచేసే గురుత్వ బలం నాలుగో వంతుకి, పదింతలు పెంచితే 100వ వంతుకి పడిపోతోంది. ఇలా దూరం పెరిగి కొద్దీ గురుత్వ బలం క్రమేణా తగ్గిపోతుందే కాని ఎన్ని కోట్ల మైళ్ల దూరానికి పోయినా అది శూన్య స్థితికి మాత్రం చేరుకోదు. ఇదే సూత్రం విశ్వంలోని అన్ని ఖగోళాలకి వర్తిస్తుంది. -
బీటెక్ అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్లో ఎంతో క్రేజ్ ఉన్న కోర్సు. ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. దాంతో అమెరికాలోని యూజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే భారత్ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2015 నాటికి అమెరికాలో 9 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉండగా, వారిలో భారత విద్యార్థుల సంఖ్య 1,32,888. వీరిలో 15-18 శాతం మంది యూజీ కోర్సుల విద్యార్థులు! వీరిలో 80 శాతం మంది ఇంజనీరింగ్కు సంబంధించిన వారు కాగా, మిగిలిన వారు సైన్స్ కోర్సులు చేస్తున్నవారు. యూఎస్లో బీటెక్కు మార్గం యూఎస్లో బీటెక్లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. * స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో స్కోర్. * శాట్ సబ్జెక్టు టెస్ట్ల్లో స్కోర్ (కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు మాత్రమే) * ACT (American College Testing) శాట్, ఏసీటీ పరీక్షల విధానం శాట్ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి.. రీడింగ్ (52 ప్రశ్నలు), రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ (44 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (58 ప్రశ్నలు). మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. అదనంగా మరో 50 నిమిషాల్లో ఒక ఎస్సే రాయాలి. ఇది అభ్యర్థుల ఛాయిస్ మాత్రమే. 1600 పాయింట్లకు గరిష్ట స్కోరింగ్ ఉంటుంది. ఇందులో 50 శాతం మ్యాథమెటిక్స్కే!. విద్యార్థులు 1200 పాయింట్లు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు అనుగుణంగా అనుబంధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు శాట్ సబ్జెక్టు టెస్ట్లు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ తదితర 21 సబ్జెక్టుల్లో ఉండే శాట్ సబ్జెక్ట్ టెస్ట్లో ప్రతి సబ్జెక్ట్ పరీక్షకు 800 పాయింట్ల స్కోర్ ఉంటుంది. శాట్ పరీక్షను ఏటా ఏడుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. అయితే రెండు కంటే ఎక్కువ అటెంప్ట్లు ఇస్తే దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయముంది. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అమెరికాలోని కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్ విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1 నుంచి 36 పాయింట్ల స్కోర్ కేటాయిస్తారు. ఈ పాయింట్ల శ్రేణిలో 25 పాయింట్లు సొంతం చేసుకుంటే.. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా ఆరుసార్లు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం తొలుత అమెరికా విదేశీ వ్యవహారాల అధికారిక వెబ్సైట్ ఆధారంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితాను పరిశీలించాలి. ఆయా యూనివర్సిటీలు-అవసరమైన అర్హతలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత శాట్ లేదా ఏసీటీ టెస్ట్లకు సన్నద్ధం కావాలి. ఆ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు.. * విద్యార్హతల సర్టిఫికెట్లు ఠ స్టాండర్ట్ టెస్ట్ స్కోర్ కార్డులు * కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివసించేందుకు అయ్యే వ్యయాలకు సరిపడినంతగా ఆర్థిక వనరులున్నాయనే రుజువులు. * స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (సదరు కోర్సులో, నిర్దిష్టంగా సదరు ఇన్స్టిట్యూట్నే ఎంపిక చేసుకోవడానికి కారణాలు, ఆ ఇన్స్టిట్యూట్ అర్హతలు, ఇతర ప్రమాణాలకు తాము ఎలా సరితూగుతామో తెలియజేస్తూ రాసే స్టేట్మెంట్) * లెటర్ ఆఫ్ రికమండేషన్ వీసా ఎలా ప్రవేశం ఖరారు చేసిన ఇన్స్టిట్యూట్ ఐ-20 పేరుతో అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ పంపుతుంది. దాని ఆధారంగా విద్యార్థులు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వీసా లభిస్తుంది. ఈ వీసా కాల పరిమితి కోర్సు వ్యవధి మేరకు ఉంటుంది. ఎఫ్-1 వీసా పొందిన వారు కోర్సు పూర్తయ్యాక 2 నెలలు అమెరికాలో ఉండే విధంగా నిబంధనలో వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎఫ్-1వీసా ఆధారంగా యూజీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆ అర్హతతో అమెరికాలోనే మరో ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందితే.. మరో ఐ-20 ఫామ్ ఆధారంగా వీసా పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు, వ్యయాలు యూనివర్సిటీలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసాలున్నాయి. టాప్-10 యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు 40-47 వేల డాలర్లు ఉంది. ఉండటానికి, రవాణా, ఆహారం తదితర అవసరాలకు నెలకు 10 వేల డాలర్ల వరకు అవసరం. కొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి. ఉదా: ఏఏసీఈ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్, ఫుల్బ్రైట్ స్కాలర్షిప్.. * ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్ (విద్యార్థినులకు) వంటి స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నించొచ్చు. కొన్ని యూనివర్సిటీలు మెరిట్ కమ్ మీన్ బేస్డ్ విధానంలో తొలి సెమిస్టర్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. యూఎస్-టాప్ వర్సిటీలు * మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * ప్రిన్స్టన్ యూనివర్సిటీ * కాలిఫోర్నియా యూనివర్సిటీ * హార్వర్డ్ యూనివర్సిటీ * మిచిగాన్ యూనివర్సిటీ * స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ * యూనివర్సిటీ ఆఫ్ షికాగో * కొలంబియా యూనివర్సిటీ * యేల్ యూనివర్సిటీ * కార్నెగీ మిలన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.usnews.com, https://educationusa.state.gov యూఎస్లో అండర్గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు.. అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం 8 నెలల ముందు నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి. హాజరు కావాల్సిన ప్రామాణిక పరీక్షలు, యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లపై రెండు నెలల్లో అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. శాట్, ఏసీటీ పరీక్షల విషయంలో ఆందోళన అనవసరం. ఈ ఏడాది శాట్లో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. - రుచి థోమర్, డీజీఎం, మాన్యా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. -
ఎస్ఐ కొలువు సాధించానిలా..!
సక్సెస్ స్పీక్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో తొలి దశ ముగిసింది. అభ్యర్థులు మలిదశలో విజయానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్ఐ పరీక్షలో 327 మార్కులతో (2011, ఆగస్టు) 3వ ర్యాంకు సాధించిన వడ్డే ఉదయ్కుమార్ తన సక్సెస్ సీక్రెట్స్ను ‘భవిత’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, కరివారిగూడెం. నాన్న వడ్డే శ్రీనివాసరావు సింగరేణిలో కోల్ ఫిల్లర్గా విధులు నిర్వర్తించేవారు. ఆయన 2005లో మరణించారు. అమ్మ సత్యవతి గృహిణి. నేను ఇంటర్ వరకు మణుగూర్లో తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ కొత్తగూడెంలో, ఎంసీఏ హైదరాబాద్లో పూర్తి చేశాను. బంధువు సలహాతో.. నా ఎంసీఏ పూర్తయ్యే నాటికి (2008లో) సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఆర్థికమాంద్యం ప్రభావం ఉంది. సరైన అవకాశాలు లేవు. అప్పటికే మా బంధువుల్లో చాలా మంది పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా అన్నయ్య వేణుమాధవ్ సలహా మేరకు ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నించాను. మొదటి అటెంప్ట్లోనే విజయం సాధించాను. శిక్షణలో అగ్రస్థానం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో ఏడాది పాటు శిక్షణలో పాల్గొని, మొదటి స్థానంలో నిలిచా. బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ ఇండోర్గా నిలిచి సీఎం పిస్టల్, గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతోపాటు హోంమినిస్టర్ బ్యాటన్, గోల్డ్ మెడల్ను సాధించాను. పరుగు పందెంలో అప్రమత్తంగా... గతంలో మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, తర్వాత రాత పరీక్ష జరిపేవారు. కానీ, ఇప్పుడు మొదట రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మలి దశలో శారీరక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది అయితే ఇప్పుడు సివిల్ ఎస్ఐ, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు ఏవైనా రెండు ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్లో మెరిట్ సాధించినా.. ఎంపికలో ఎలాంటి మార్కులు కలపరు. కానీ, మిగిలిన పోస్టుల భర్తీలో మాత్రం ఈవెంట్స్లో సాధించిన మెరిట్కు స్కోరు కేటాయించి తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్ల పరుగుపందెంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులను ఎక్కువగా ఇందులోనే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్లో అర్హత సాధించాలి... ఫైనల్ ఎగ్జామ్లో ఇంగ్లిష్ ఒక పేపర్గా ఉంటుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేస్తారు. టెస్టులతో టైం మేనేజ్మెంట్... కోచింగ్ కేంద్రాలు నిర్వహించే మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అర్థమెటిక్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని వదిలేసి మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వదిలేసిన ప్రశ్నలను చివర్లో సాధించాలి. అర్థమెటిక్ పేపర్లో మెంటల్ ఎబిలిటీ/ రీజనింగ్కు సంబంధించిన ప్రశ్నలను తక్కువ సమయంలో సాధించవచ్చు. అభ్యర్థులు రీజనింగ్ బిట్స్ మొదట చేయడం లాభిస్తుంది. సబ్జెక్టు నేర్చుకోండి.. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అలాకాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరీక్షలో మంచి ఫలితాలు సాధించవచ్చు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని చదవడం ద్వారా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నవారే అర్హత సాధించారు. తెలంగాణ విద్యార్థులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బాగా చదవాలి. చాలా మంది అభ్యర్థులు ఎస్ఐ పరీక్షలో ఉండే అర్థమెటిక్ను ప్యూర్ మ్యాథ్స్గా భావించి.. కష్టమనే అపోహతో ఉంటారు. కానీ, పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆర్ట్స్ విద్యార్థులు కూడా సులువుగా చేసే విధంగా ఉంటాయి. అభ్యర్థులు తొలుత మ్యాథ్స్ అనే భయాన్ని వీడి ప్రిపరేషన్లో ముందుకుసాగాలి. ముందుగా సిలబస్లో ఉన్న అంశాలను పరిశీలించాలి. పరీక్షలో ఆయా అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్లో లేని టాపిక్స్ను చదవద్దు. ఏదైనా ఒక ప్రామాణిక మెటీరియల్ను ప్రిపరేషన్కు ఉపయోగించుకోవాలి. -
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
⇒ ఎన్సీఈఆర్టీలో 3 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్) పోస్టులకు జూన్ 1 ⇒ మోయిల్ లిమిటెడ్లోని మెడికల్ సర్వీసెస్లో 4 మేనేజర్ పోస్టులకు జూన్ 1 ⇒ డీఆర్డీఓలో 10 జేఆర్ఎఫ్ పోస్టులకు జూన్ 2 ⇒ ఈసీఐఎల్లో 4 జూనియర్ ఆర్టిసన్ పోస్టులకు జూన్ 2 ⇒ ఐసీఏఆర్లో 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు జూన్ 30 -
పరీక్ష తేదీలు
⇒ ఏపీ లా సెట్, ఏపీపీజీఎల్సెట్.. మే 28 ⇒ తెలంగాణ ఎడ్సెట్.. మే 27 ⇒ తెలంగాణ పీజీఈసెట్.. మే 30, 31, జూన్ 1, 3 ⇒ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్).. మే 28 ⇒ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ - ఏఎస్ఐ ఇన్ సీఐఎస్ఎఫ్ ఎగ్జామ్ (పేపర్-2).. జూన్ 5 -
బీపీవో ఇంటర్వ్యూ.. టాప్ కొశ్చన్స్
బీపీవో ఇంటర్వ్యూలు అనేక రౌండ్లతో సుదీర్ఘంగా ఉంటాయి. వీటిలో విజయం సాధించాలంటే పట్టుదల, సమయస్ఫూర్తి ఉండాల్సిందే. ఔత్సాహికులకు ఉపయోగపడేలా బీపీవో ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలు... 1. మీ గురించి చెప్పండి? ఇంటర్వ్యూయర్లకు అత్యంత ఇష్టమైన ప్రశ్న. దీనికి మీ సమాధానం అంతే ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా ఉండాలి. 2. బీపీవో అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి ఇతర కంపెనీల నాన్కోర్ కార్యకలాపాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ సేవలందిస్తాయి. 3. రాత్రి వేళల్లో పనిచేయగలరా? అభ్యంతరం లేదని చెప్పండి. ఎలాంటి సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనండి. 4. ఆఫ్షోర్ అవుట్సోర్సింగ్ అంటే ఏమిటి? సుదూర దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించే వాటిని ఆఫ్షోర్ కంపెనీలు అంటారు. చుట్టుపక్కల దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించేవి షోర్ సోర్సింగ్ కంపెనీలు. 5. ఇన్బాండ్, అవుట్ బాండ్ కాల్సెంటర్ల మధ్య వ్యత్యాసం ఏమిటి? సేవలకు సంబంధించి కాల్స్ను మాత్రమే అందుకునేవి ఇన్ బాండ్ కాల్ సెంటర్లు. సేవలకు సంబంధించి వినియోగదారులకు కాల్స్ చేసే కంపెనీలను అవుట్ బాండ్ కాల్ సెంటర్లు అంటారు. 6. బీపీవోలనే మీ కెరీర్గా ఎందుకు ఎంచుకున్నారు? కెపీవో అంటే..నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 7. కేపీవో, బీపీవో మధ్య వ్యత్యాసం ఏమిటి? కెపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 8. కంపెనీలకు ఔట్సోర్సింగ్ అవసరం ఏమిటి? బీపీవోలకు నాన్ కోర్ సర్వీసెస్ను ఔట్సోర్సింగ్కు ఇవ్వడం ద్వారా కంపెనీలకు డబ్బు ఆదా అవడంతో పాటు నాణ్యతతో కూడిన సేవలు అందుతాయి. 9. వినియోగదారులతో చక్కగా మాట్లాడగలరా? మాట్లాడగలను అని చె ప్పండి. మాక్ కాల్ వస్తేఆకట్టుకునేలా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. 10. 5 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కంపెనీకి ‘నా సేవలు ఏ స్థాయిలో అయితే గరిష్టంగా ఉపయోగపడతాయో అక్కడికి చేరుకోవాలనుంది’ అని చెప్పండి. -
సామాజిక రక్షణ చర్యలతోనే నిజమైన ఆహార భద్రత
కాంపిటీటివ్ గెడైన్స్ : సివిల్స్, గ్రూప్స్ ఎస్సే సామాజిక రక్షణ-ఆహార భద్రత-ప్రభుత్వ పాత్ర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆకలి, పోషకాహార లోపం. ప్రభుత్వ విధానాలు సామాజిక రక్షణ కల్పించేవిగా ఉన్నట్లయితే ఆకలి, పోషకాహారలోప సమస్యలను తగ్గించవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, తదితర) 64 పేద దేశాల నుంచి సేకరించిన సమాచార విశ్లేషణ ఈ వాదనకు బలం చేకూర్చింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్న పేద దేశాలు కూడా సగటు మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా దేశాలు తమకు లభ్యమవుతున్న పరిమిత వనరులను సామాజిక రక్షణకు కేటాయించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆకలి, పోషకాహార లోపం ముఖచిత్రం పేదరికం, నిరపేక్ష ఆకలి, పోషకాహారలోపం, మానవ సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. 201214 మధ్యకాలంలో 805 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 1990వ దశాబ్దం నుంచి పేదరికం కొంత మేరకు తగ్గినప్పటికీ 2014 ప్రాపంచిక ఆకలి సూచిక (Global Hunger Index) దాదాపు 39 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా, తూర్పు ఆగ్నేయాసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం కొంత తగ్గినప్పటికీ దక్షిణాసియా, సహారా దిగువ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా ఉంది. ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాపంచిక ఆకలి సూచిక విలువలు1996లో జరిగిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశంలో ఆహార భద్రతను.. ‘ప్రజలందరికీ, ఎల్లప్పుడు పోషకాహారం అందుబాటులో ఉంటూ, వారు ఆరోగ్యంగా, చురుకుగా జీవించగలగడం, భౌతికంగా, ఆర్థికంగా దీన్ని పొందగలగడం’గా నిర్వచించారు. దీంట్లో పారిశుధ్యం, మంచినీరు, వైద్య సదుపాయం అంతర్లీనంగా ఉంటాయి. ఇటీవల కాలంలో అహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలను అధిగమించింది. కానీ, బహుళజాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆయా దేశ ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు కృత్రిమ కొరతను సృష్టించి, పేద ప్రజలకు ఆహారధాన్యాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతోంది. ఇండియా లాంటి దేశాల్లో పర్యావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలుపడటం లేదు. దీంతో పంట దిగుబడి తగ్గి, సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులు అప్పులపాలై, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేద ప్రజలు వీధులపాలవుతున్నారు. మహిళలే అధిక బాధితులు ఆకలి, పోషకాహార లోపాన్ని స్త్రీ, పురుష కోణంలో పరిశీలించినట్లయితే ఆకలితో అలమటించే వారిలో 60% మంది మహిళలే ఉన్నారు. 50% గర్భిణీస్త్రీలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఈ కారణంగా (2,40,000 మంది) తల్లులు, పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారం లభించక ప్రతి ఆరుగురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఐదు సంవత్సరాల లోపు బాలబాలికల్లో 45% మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒక శిశుమరణం సంభవిస్తుంది. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల్లో ఆకలి, పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య సహారా దిగువ ఆఫ్రికాలోని వారికంటే ఎక్కువ. దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. జీవనోపాధి పథకాల అమలు, బీమా పథకం వర్తింపు, పారిశుధ్యం, రక్షితనీటి పథకం, తిండి, బట్ట, వసతి వంటి కనీస సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తేవాలి. దీన్నే సామాజిక రక్షణ అంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ పథకం కింద వైద్య సదుపాయం, అనారోగ్య భృతి, నిరుద్యోగ భృతి, వయోవృద్ధులకు ఆర్థికసహాయం, కుటుంబభృతి, ప్రసూతి భృతి, క్షతగాత్రుల భృతి మొదలైనవి అందించాలి. యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి స్థూలంగా సామాజిక భద్రతకు పలు సూచనలు చేశాయి. 1995లో కోపెన్హాగన్లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ‘సామాజిక అభివృద్ధి’ ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. 2010లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన జరిగిన శిఖరాగ్ర సమావేశం శతాబ్ది అభివృద్థి లక్ష్యాలను (Millenium Development goals) గుర్తించింది. ఈ లక్ష్యాల్లో దారిద్య్ర నిర్మూలన ప్రధానమైందిగా ఉంది. ఇందులో భాగంగా 2015లో (Sustainable development goals) ‘పేదరిక నిర్మూలన, ధరిత్రీ పరిరక్షణ, అందరికీ సంపద’ నినాదాన్ని ప్రారంభించారు. పేద దేశాల్లో వనరుల కేటాయింపు అత్యల్పం అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లో సామాజిక రక్షణలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, బీమా, ప్రజోపయోగార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే పేద దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తి (ఎఈ్క)లో ఈ రంగానికి ఆశించిన మేర వనరులను కేటాయించడం లేదు. వాస్తవానికి పేద దేశాల్లో ఈ రంగంపై ఎక్కువ వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆఫ్రికా ఖండంలో (201011) కేవలం 5.1 శాతం వనరులను మాత్రమే ఖర్చుచేయగా, అదే ఏడాది పశ్చిమ యూరప్ 26.7% వనరులను కేటాయించింది. ప్రపంచ దేశాల సగటు కేటాయింపు 8.6% ఉండగా, ఆసియా, పసిఫిక్ దేశాలు 5.3 శాతం కేటాయించాయి. సామాజిక భద్రత రంగంలో వృద్ధులకు అందించే పింఛను చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఇది నెలకు కేవలం రూ.250 మాత్రమే. కొన్నిసార్లు ఈ చిన్న మొత్తాన్ని కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. విద్య, ఆరోగ్యం, దారిద్య్ర నిర్మూలన, పారిశుధ్యం, బీమా రంగాలపై ప్రాంతాలవారీగా ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సంపన్న దేశాలు సామాజిక రక్షణకు తమ ఎఈ్కలో ఎక్కువ శాతం ఖర్చుపెడితే, పేద దేశాలు తక్కువ కేటాయిస్తున్నాయి. భారతదేశంలో భారతదేశం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (1997) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాహిత కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. నాలుగు లక్షల తొంభై ఎనిమిదివేల (4,98,000) చౌకధర దుకాణాలు దేశవ్యాప్తంగా 16 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి 25 నుంచి 35కిలోల వరకు చౌకధరలో ఆహారధాన్యాలను ప్రతినెలా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 1990 తొలినాళ్లలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. కానీ, మొత్తంగా చూస్తే ఈ వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన కొంత వరకు విజయవంతమైందని చెప్పవచ్చు. 2013నాటికి జాతీయస్థాయిలో పేదరిక తేడా సూచిక (Poverty Gap Index) గ్రామీణ స్థాయి పేదరికాన్ని 18% నుంచి 22% కి తగ్గించింది. తమిళనాడులో 61% నుంచి 83%కి, ఛత్తీస్గఢ్లో 39% నుంచి 57%కి గ్రామీణ స్థాయి పేదరికాన్ని తగ్గించడంలో ప్రజాపంపిణీ వ్యవస్థ విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో పేదవారికి ధనసహాయం అందించడం మంచిదా? వస్తు సహాయాన్ని అందించడం మంచిదా? అనే వివాదం తలెత్తింది. లబ్ధిదారుల మీద జరిపిన సర్వే వివరాల ప్రకారం ముఖ్యంగా మహిళలు వస్తురూప సహాయాన్నే కోరుకుంటున్నారని తేలింది. బ్రెజిల్లో ప్రజలు ధనసహాయాన్ని కోరుకుంటున్నారు. వివిధ దేశాలు ఆయా పరిస్థితులను బట్టి విభిన్న విధానాలను అవలంబిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణ, పారదర్శకత, అందిస్తున్న సహాయం, అనుసరిస్తున్న పద్ధతులపై సామాజిక రక్షణ కార్యక్రమాల విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. భారతదేశం విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లొసుగుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐఇఖీ) ఈ లొసుగులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇది 200405 నుంచి 2011-12 మధ్యకాలంలో ఈ రంగంలో అవినీతిని 35%55%కి తగ్గించడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి 23% 44.5% కుటుంబాలు వచ్చాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఇతర సామాజిక పథకాలు సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐఇఈ), మధ్యాహ్న భోజన పథకం బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషించాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మెరుగుపడింది. శైశవ బాల్యదశలో శారీరక, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పెద్దవారైన తర్వాత అన్ని రంగాల్లో విఫలం చెందడం వైద్యపరంగా నిరూపితమైంది. అందువల్ల పోషకాహారలోపాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలి. పేదప్రజల ఆదాయాన్ని పెంపొందించడంలో 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి పథకం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (కూఖఉఎ్క) చక్కగా ఉపయోగపడింది. దీని కింద ఏటా 5 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం దీనివల్ల లబ్ధి పొందుతుంది. 201314 సంవత్సరాలలో 1.21 బిలియన్ పని దినాలను కల్పించారు. అందులో 40% పనిదినాలు బలహీన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి, 55% పనిదినాలు మహిళలకు లబ్ధి చేకూర్చాయి. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం వల్ల వారి కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోల్చితే మహిళలే కుటుంబ ఆహార అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాఫ్రికాలో సత్ఫలితాలు దక్షిణ ఆఫ్రికాలో వృద్ధులకు పింఛన్ పథకం, బాలబాలికలకు ధనసహాయం మొదలైన కార్యక్రమాల ద్వారా సామాజిక రక్షణ అందుతోంది. తాజా అంచనాల ప్రకారం కోటి మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. దీని ఫలితంగా బడి హాజరు శాతంలో గణనీయమైన పెరుగుదల, పౌష్టికాహార లభ్యత మెరుగైంది. బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బాలబాలికలకు అందించే ధన సహాయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి బిడ్డల చదువుకు, పోషకాహారానికి మరింత ఉదారంగా వెచ్చించటానికి వీలు కల్పించింది. బ్రెజిల్ దేశంలో ‘శూన్య ఆకలి’ అనే పథకం బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడింది. ఆౌట్చ జ్చఝజీజ్చీ అనే ప్రత్యక్ష నగదు పథకం కింద గత 9 ఏళ్లలో బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని 61%, గ్రామీణ పేదరికాన్ని 15% మేర తగ్గించారు. దీని కారణంగా మూడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. వర్ధమాన దేశాలన్నిటికంటే సామాజిక పరిరక్షణకు బ్రెజిల్ అత్యధికంగా తలసరి ఆదాయంలో 17.9% వెచ్చిస్తుంది. ఆహార అభద్రతను ఎదుర్కోవాలంటే? ఈ పై అంశాలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ధన సహాయం అందించడానికి.. పేదరికం, ఆహార అభద్రత తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో తగినన్ని వనరులు, సరైన విధాన రూపకల్పన, సుపరిపాలన, రాజకీయ ఉద్యోగిస్వామ్య చిత్తశుద్ధి, సామాజిక రక్షణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. బంగ్లాదేశ్ అమలుచేస్తున్న "Challenging the frontiers of poverty reduction",రువాండాలో "Vision 2020 umurenge", భారతదేశంలో MGNREGA పథకాలు వీటికి చక్కని ఉదాహరణలు. పేద దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ వనరులు కేటాయించలేవనే భావన బహుళ ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా పైన ప్రస్తావించిన దేశాలన్నీ పేద దేశాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అభ్యుదయ భావాలు కలిగిన రాజకీయ నాయకత్వం, అంకితభావం కలిగిన ఉద్యోగిస్వామ్యం, చురుకైన పౌరసమాజాలు ఎన్ని పరిమితులనైనా అధిగమించి సామాజిక సంరక్షణకు దోహదం చేస్తాయి. వర్ధమాన దేశాల సమస్య వనరుల లేమి కాదు. వాటిని వెలికితీయడంలో విఫలం కావడమే. తృతీయ ప్రపంచదేశాల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. పరోక్ష పన్నులు పేదలను మరింత కుంగదీసి, ధనికులకు పన్ను మినహాయింపునకు దారితీస్తాయి. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రత్యక్ష పన్నుల పరిధిని విస్తృత పరచడమే. ఇండియా లాంటి దేశంలో ఆదాయం, సంపద విషయంలో ఖచ్చితమైన గణాంకాలు లేవు. దేశంలో 38% సంపద కేవలం 5% ఉన్న అత్యంత ధనికుల చేతిలో ఉంది. అట్టడుగున ఉన్న 60% కుటుంబాల చేతిలో 13% సంపద మాత్రమే ఉంది. సేవాపన్నుల విషయంలో కూడా ఇదే వైపరీత్యం కనపడుతుంది. ప్రోత్సాహకాలు అనే నెపంతో సంపన్న వర్గాలకు ఇచ్చే పన్ను మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం 201314 సంవత్సరంలో పన్ను ప్రోత్సాహకాల రూపంలో రూ. 5 లక్షల 49 వేల 984 కోట్లను నష్టపోయింది. ఈ మొత్తం.. పన్ను ఆదాయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. గనులు, నిర్మాణం, స్థిరాస్థిరంగం, నగలు, రత్నాలు వంటివాటిపై పన్నులు విధించి వాటిని సక్రమంగా ఉపయోగించినట్లయితే సామాజిక రక్షణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. - డా॥బి.జె.బి. కృపాదానం సబ్జెక్ట్ నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ -
ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
జాబ్ పాయింట్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు జూన్ 1లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు: అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో ఇంటర్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ల్లో 60 శాతం మార్కులు. జనరల్ డ్యూటీ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు జనరల్ డ్యూటీ (పైలట్) పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1998 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు. టెక్నికల్ బ్రాంచ్ (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్)కు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సెక్షన్-ఎ, సెక్షన్-బిలో ఉత్తీర్ణత. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు 01 జూలై 1992 - 30 జూన్ 1996 మధ్య జన్మించి ఉండాలి. షార్ట్ సర్వీస్ నియామకాలు: 8ఏళ్ల కాలానికి జరిపే ఈ షార్ట్ సర్వీస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల పదవీ కాలాన్ని పదేళ్లకు, పద్నాలుగేళ్లకు పొడిగించే వీలుంది. పైలట్స్ (సీపీఎల్): 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. దీంతోపాటు దరఖాస్తు చేసుకునే నాటికి డీజీసీఏ గుర్తింపు పొందిన కరంట్/వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ కలిగి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1998 తేదీల మధ్య జన్మించిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జనరల్ డ్యూటీ (ఉమెన్) పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విద్యా విధానంలో ఇంటర్ వరకు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లను చదివి ఉండాలి. 01 జూలై 1992 - 30 జూన్ 1996 తేదీల మధ్య జన్మించిన మహిళా అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు. దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ దశను దాటిన వారికి తుది దశ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in పోస్టుల వివరాలు ⇒ అసిస్టెంట్ కమాండెంట్లోని విభాగాలు.. ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పైలట్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ (మెకానికల్/ఏరోనాటికల్) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ (కమర్షియల్ పైలట్ లెసైన్స్ - ఎస్ఎస్ఏ) ⇒ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (ఉమెన్ -ఎస్ఎస్ఏ) -
ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!
ఇంజనీరింగ్ స్పెషల్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ముగిసింది.. త్వరలోనే ఫలితాలు.. ఆ తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపరుస్తున్న అంశం.. ఐఐటీల్లో ఫీజుల పెంపు! ఐఐటీల్లో బీటెక్ ఫీజులు రెట్టింపు చేస్తూ గత నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఐఐటీల్లో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలపై విశ్లేషణ... స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐఐటీల్లో బీటెక్ ఫీజులను రూ.90 వేల నుంచి రూ. రెండు లక్షలకు పెంచింది. వాస్తవానికి ఫీజును రూ. మూడు లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా.. రూ. రెండు లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు కాస్తలో కాస్త ఊరట. ఫీజుల పెంపునకు కారణాలు ఐఐటీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనపై గతేడాది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఐఐటీ -చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ డెరైక్టర్ల నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ ఫీజుల పెంపుపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రూ.3లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఐఐటీలు ఏటా ఒక్కో విద్యార్థిపై వెచ్చిస్తున్న వ్యయాన్ని, ఇతర నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచినట్లు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని, ఐఐటీ చదువులు ఆర్థిక భారమనే ఒత్తిడికి లోనవనక్కర్లేదని కేంద్రం పేర్కొనడం విశేషం. 70 శాతం మందికి మినహాయింపు! * ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం ఉన్నవారికి ఫీజు నుంచి పూర్తి రాయితీ. * కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న విద్యార్థులకు వారి సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మేరకు (66 శాతం) మినహాయింపు ఉంటుంది. * ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పథకం ఫీజుల భారం నేరుగా భరించే విద్యార్థుల కోసం తాజా ప్రతిపాదన విద్యాలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం. దీని ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన రోజే వడ్డీ రహిత స్కాలర్షిప్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చించి బ్యాంకుల సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు సైతం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేవి.. రీసెర్చ్ అసిస్టెన్స్షిప్, టీచింగ్ అసిస్టెన్స్షిప్. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు దాదాపు 23 స్కాలర్షిప్ పథకాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు తమ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం https://scholarships.gov.in చూడొచ్చు. రెండు వేల కోట్లతో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ రూ.రెండు వేల కోట్ల కార్పస్తో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ(న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా ఐఐటీల్లో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, ఇతర నిర్వహణ వ్యయాలకు వడ్డీ రహిత రుణాలు అందించాలని సూచించింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, కేబినెట్ ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది. విదేశీ విద్యార్థులకు సైతం పెరిగిన ఫీజులు ఐఐటీల్లో అడ్మిషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ పేరుతో మొత్తం సీట్లకు అదనంగా పది శాతానికి మించకుండా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వీరికి ప్రస్తుతం 4 వేల యూఎస్ డాలర్లుగా ఉన్న వార్షిక ఫీజును పది వేల డాలర్లకు పెంచారు. ఇతర ఖర్చులకు సిద్ధంగా ఉండాలి ఫీజుల విషయంలో రాయితీలు పొందే విద్యార్థులు ఇతర ఖర్చుల విషయంలో మాత్రం స్వయంగా వనరులు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశించే సమయంలో లైబ్రరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు, వన్ టైం కాషన్ డిపాజిట్ వంటి వాటికోసం నగదును దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ అకామడేషన్ ఫీజు పరంగానూ సొంత నిధులు సమకూర్చుకోవాలి. ఈ ఇతర వ్యయాలు పరిగణనలోకి తీసుకుంటే ఐఐటీల్లో ప్రతి సెమిస్టర్కు విద్యార్థులకు అవుతున్న వ్యయం రూ. 30 వేల వరకు ఉంటోంది. ఆ మేరకు నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యం ఐఐటీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. వీరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఫీజుల పెంపునకు కారణం ఐఐటీలకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కల్పించడమే. అంతేకానీ విద్యార్థులపై భారం మోపడం ఉద్దేశం కాదు. పెంచే ఫీజుల వల్ల ఆయా ఐఐటీల్లో నిర్వహణ వ్యయం లభిస్తుంది. తద్వారా పలు అనవసర జాప్యాలను నివారించొచ్చు. - ప్రొఫెసర్. కె.ఎన్. సత్యనారాయణ, ఐఐటీ-తిరుపతి క్యాంపస్ ఇన్ఛార్జ్. -
ఉద్యోగ అవకాశాలు
యూనియన్ బ్యాంక్లో 200కుపైగా పోస్టులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-150, చార్టర్డ్ అకౌంటెంట్-20, స్టాటిస్టీషియన్-2, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-2, మేనేజర్ (రిస్క్)-10, అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్) -8, సెక్యూరిటీ ఆఫీసర్-16. దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100) దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: జూన్ 10 వెబ్సైట్: www.unionbankofindia.co.in టీఎస్జెన్కోలో 42 కెమిస్ట్ పోస్టులు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్జెన్కో).. 42 కెమిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ సెన్సైస్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత. బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. వయోపరిమితి: 18-44 ఏళ్లు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 25 రాత పరీక్ష తేదీ: జూలై 10 వెబ్సైట్: http://tsgenco.telangana.gov.in భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ భువనేశ్వర్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ).. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ ప్రోగ్రామ్స్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈటీసీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ ఇంజనీరింగ్ (సీఈ). అర్హత: పదో తరగతి, ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2016లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానం: జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10 హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ: జూన్ 17 వెబ్సైట్: www.iiit-bh.ac.in -
స్పెషల్ ఎడ్యుకేషన్
టాప్ స్టోరీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.. వృత్తి బాధ్యతలు ఎంతో ప్రత్యేకం.. పిల్లల పట్ల కేరింగ్ చాలా ముఖ్యం! ఎందుకంటే.. తాము బోధించాల్సిన విద్యార్థులకున్న ప్రత్యేక అవసరాలే అందుకు కారణం. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కు సంపాదనతోపాటు సేవా సంతృప్తి సొంతమవుతుంది. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. తోటి పిల్లలతో కలిసి ఆడుతూ,పాడుతూ కేరింతలు కొట్టాల్సిన అయిదారేళ్ల వయసులో.. తమకే తెలియని మానసిక, శారీరక సమస్యలతో అందమైన బాల్యాన్ని కోల్పోయే చిన్నారులు ఎందరో! అలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి రూపొందించిన కోర్సులే.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి.. బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం (మూగ). స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేసిన వారు ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఉత్తీర్ణులకు మంచి డిమాండ్ ఉంది. పలు ఇన్స్టిట్యూట్స్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆర్సీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లక్ష్యం ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ బోధన, శిక్షణ కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులు, సర్టిఫికెట్లకే జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు. ప్రవేశం ఇలా ఆర్సీఐ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్స్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్స్ నోటిఫికేషన్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా మే, జూన్లో ప్రవేశాలు జరుగుతాయి. బ్యాచిలర్ కోర్సులు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్/లెర్నింగ్ డిజేబిలిటీస్/లోకోమోటలర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్/మల్టిపుల్ డిజార్డర్/ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్)వంటి కోర్సులున్నాయి. బీఏ బీఈడీ (విజువల్ ఇంపెయిర్మెంట్); బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్); బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ; బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశించడానికి అర్హత డిగ్రీ. అవకాశాలు పుష్కలం స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలు పుష్కలం. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ డిమాండ్ ఉంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక నెలకు రూ.15 వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో డీఎస్సీలోనూ పోటీ పడే అవకాశముంది. సర్టిఫికెట్ కోర్సులు స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా స్థాయి కోర్సులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు అర్హతగా డిప్లొమా స్థాయి కోర్సులు ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపెయిర్మెంట్), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్). పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఎంపీఈడీ, ఎమ్మెస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్లో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజువల్ ఇంపెయిర్మెంట్; హియరింగ్ ఇంపెయిర్మెంట్; మెంటల్ రిటార్డేషన్; ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకోసోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు వీటిలో ప్రవేశించడానికి అర్హులు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి పలు పీజీ డిప్లొమా కోర్సులు సైతం అభ్యసించే వీలుంది. ఇన్స్టిట్యూట్స్ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్. * స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు. * కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళాసభ, ఓయూ క్యాంపస్. * డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం. * శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. * దుర్గాబాయి దేశ్ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఓర్పు, నేర్పు అవసరం స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఖాయం. కానీ ఇదే సమయంలో కేవలం కెరీర్ అవకాశాలను పరిగణించే ఈ కోర్సులు ఎంపిక చేసుకోవాలనుకోవడం సరికాదు. కారణం.. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా తాము బోధించాల్సిన విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులని గుర్తించాలి. ఓర్పు, నేర్పు ఉన్న వారే స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్. వి.ఆర్.పి. శైలజ, హెచ్ఓడీ, స్పెషల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ -
SPOTTING ERRORS
కాంపిటీటివ్ గైడెన్స్ General English Getting qualified in the prelims, especially in English is as sure as anything. The candidates are expected to have comprehensive knowledge in the following areas of study. • Spotting Errors n Fill in the blanks • Cloze Test n Para-Jumbles • Reading comprehension Spotting Errors As far as spotting errors are concerned the candidates are advised to undergo careful, constructive and comprehensive preparation. This is one of the areas where a wide range of questions can be expected. This is also one of the areas where some unforeseen questions may also appear. This question tests student's knowledge of grammar and structure. The candidates are supposed to have in-depth knowledge of basics of English grammar. Errors are of many, however, we should focus on the following 1. Noun - Number 2. Reflexive Pronouns - Relative Pronouns 3. Concord (Subject-Verb Agreement) 4. Adjectives often confused 5. Correlative Conjunctions 6. Parallel Structure 1. Noun-Number Look at the following Examples : • The equipment (1)/ of the photographic studio (2)/ were (3)/ expensive. (4) / No error (5) (Incorrect) The equipment (1)/ of the photographic studio (2)/ was (3)/ expensive. (4) / No error (5) (Correct) • The singer was wearing (1) / a leather suit (2) / and heavy gold jewelleries (3) / for the interview. (4) / No error (5) (Incorrect) The singer was wearing (1) / a leather suit (2) / and heavy gold jewellery (3) / for the interview. (4) / No error (5) (Correct) Note: The nouns scenery, information, furniture, advice, news, equipment, jewellery machinery, stationery are always used in singular form only. They are not used with 'a' or 'an' and have no plural forms. Check the following examples • This cattle has (1)/ been in trouble (2)/ ever since (3)/ the famine. (4)/ No error (5) (Incorrect) These cattle have (1) / been in trouble (2)/ ever since (3)/ the famine. (4) / No error (5) (Correct). • The rural gentry (1)/ is strong fighters (2)/ who will (3)/resist change. (4)/ No error (5) (Incorrect) The rural gentry (1)/ are strong fighters (2)/ who will (3)/ resist change. (4)/ No error (5) (Correct) Note: Certain collective nouns though in singular form are used only in the plural form. Observe the following examples: • The committee have (1)/ decided (2) / to close (3)/ the restaurant. (4)/ No error (5) (Incorrect) The committee has (1)/ decided (2)/ to close (3)/ the restaurant. (4) / No error (5) (Correct) • The committee is (1) /divided (2)/ in (3)/ their opinion. (4) / No error (5) (Incorrect) The committee are (1)/ divided (2)/ in (3)/ their opinion. (4) / No error (5) (Correct) Note :The collective nouns jury, team, family, committee are used both as singular and plural in the same form. They take a singular verb when we regard them as a unit. The same words take a plural verb when they refer to individuals. 2. Reflexive and Relative Pronouns Examples: He describes himself as a socialist. The city defended itself from attack Note : A reflexive pronoun is used when the object and subject of a verb refer to the same person or thing. Verbs like enjoy, avail, pride, acquit, comport, conduct, absent, resign, apply, assert are always followed by reflexive pronouns. • I don't think (1)/ that she is (2)/ enjoying (3)/ very much at school. (4)/ No error (5) (Incorrect) I don't think (1)/ that she is (2)/ enjoying / herself (3) / very much at school. (4) / No error (5) (Correct) Relative Pronouns • Examples: Uneasiness lies (1)/ the head (2) / who (3)/ wears a crown. (4)/ No error (5) (Incorrect) Uneasiness lies (1) the head (2) / that (3)/ wears a crown. (4)/ No error (5) (Correct). • They never fail (1) / that (2)/ die in a (3)/ great cause. (4)/ No error (5) (Incorrect) They never fail (1) / who (2)/ die in a (3)/ great cause. (4)/ No error (5) (Correct) • The sun, which (1)/ rays give life (2)/ to the earth, (3)/ is regarded by some people as a god. (4)/ No error(5) (Incorrect) The sun, whose (1) / rays give life (2)/ to the earth, (3)/ is regarded by some people as a god. (4) No error (5) (Correct) • The horse (1) / that (2) / I recently bought (3)/is an Arab (4) / No error (5) (Incorrect) The horse (1) / which (2) / I recently bought (3) / is an Arab. (4) / No error (5) (Correct). A pronoun which relates to some noun going before it is called a Relative Pronoun. - R. Srinivasa Rao Subject Expert -
ఇంటర్వ్యూ తేదీలు
* హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు: మే 24 * సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టులకు: మే 25 * ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్, క్లినికల్ అండ్ టెక్నికల్ పోస్టులకు: మే 25, 26, 30, 31, జూన్ 1, 2 -
ఉద్యోగాలు
ఎన్ఐహెచ్లో రీసెర్చ్ అసోసియేట్, జేఆర్ఎఫ్ రూర్కీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఖాళీలు: 30 ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 26 వెబ్సైట్: www.nih.ernet.in జోధ్పూర్ ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్స్ జోధ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లినికల్ విభాగంలో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: జూనియర్ రెసిడెంట్స్ (క్లినికల్) ఖాళీలు: 42 అర్హతలు: ఎంబీబీఎస్ (ఇంటర్నషిప్తో) ఉత్తీర్ణత. ఇంటర్వ్యూ తేది: మే 31 వెబ్సైట్: www.aiimsjodhpur.edu.in -
కెరీర్కు సరైన అమరిక ఇంటీరియర్ డిజైన్
వాట్ ఆఫ్టర్: ఇంటర్మీడియట్ నేడు ప్రతి ఒక్కరూ ఇంటిని, కార్యాలయాలను తమ అభిరుచి మేరకు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. దీని కోసం ఖర్చుకు కూడా వెరవడం లేదు. ఈ క్రమంలో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర కీలకం. దీంతో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ.. బ్యాచిలర్ ఆఫ్ డి జైన్ (ఇంటీరియర్ డిజైన్)లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్ కెరీర్పై ఫోకస్.. సృజనాత్మక, పరిశీలనా నైపుణ్యాలను ఉపయోగించి అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగదారుని అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడమే ఇంటీరియర్ డిజైన్. ఈ క్రమంలో కస్టమర్ల ఇష్టాయిష్టాలు, ఆసక్తులు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి, నిర్మాణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి నిర్మాణంలో సృజనాత్మకత అవసరం ఎంతో. దీంతో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, ఆఫీస్ పరిసరాలు, ఇంటి లోపల భాగాలను అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్లకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. సంబంధిత కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి వివిధ దేశాల కంపెనీలు సైతం స్వాగతం పలుకుతున్నాయి. అవసరమైన నైపుణ్యాలు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారికి ప్రధానంగా సృజనాత్మకత, ప్రాదేశిక కల్పన(స్పేషియల్ ఇమాజినేషన్), మంచి కలర్సను ఎంచుకునే స్కిల్స్ ఉండాలి. వీటితోపాటు డిజైన్ స్కిల్స్, పరిశీలనా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, మేనే జ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు ఫొటోషాప్, 3డీ స్టూడియో మ్యాక్స్, ఆడోబ్ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్వేర్లపై అవగాహన అవసరం. వేతనాలు/ ఆదాయం ఇంటీరియర్ డిజైనర్లకు వేతనాలు అనేవి వారి వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో అనేక కంపెనీలు ప్రారంభంలో కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వేతనాలతో ఉద్యోగాలిస్తున్నాయి. అనుభవం పెరుగుతున్న కొద్దీ వేతనాలు పెరుగుతుంటాయి. స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకున్నవారు ఇంటీరియర్ డిజైన్ స్టూడియో/కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వారి సృజనాత్మకత ఆధారంగా నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. ఎలాంటి ఇన్స్టిట్యూట్లను ఎంచుకోవాలి ఇంటీరియర్ డిజైనింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లలో టీ చింగ్ ఫ్యాకల్టీ అర్హత లు, అనుభవంతో పాటు ఇన్స్టిట్యూట్ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. క్యాంపస్ పరిసర ప్రాంతాలు కోర్సుని అభ్యసించేవారికి అనుకూలంగా ఉండాలి. బోధన పద్ధతులు, గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లను పరిగణనలోకి తీసుకోవాలి. కోర్సుల వివరాలు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సులో నాలుగేళ్ల వ్యవధిలో 8 సెమిస్టర్లుంటాయి. మొదటి ఆరు సెమిస్టర్లలో వివిధ సబ్జెక్టులను బోధిస్తారు. ఏడో సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్, ఎనిమిదో సెమిస్టర్లో ఇంటీరియర్ డి జైనర్స్ కార్యాలయంలో 20 వారాలపాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇలా పూర్తిస్థాయిలో తమ నైపుణ్యాలను పెంచుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) జూలైలో నిర్వహించే ఆర్ట్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసీఈటీ)లో అర్హత సాధించాలి. మంచి అవకాశాలు ఇంటీరియర్ డిజైనింగ్లో కోర్సు పూర్తిచేసిన వారికి కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కోర్సుల్లో ఉత్తరాదివారు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు తెలుగువారు వారితో పోటీపడుతున్నారు. జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సుకు అర్హులు. మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 42 శాతం ఆంధ్ర , 36 శాతం తెలంగాణకు, 22 శాతం రాయలసీమకు కేటాయించారు. హమ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజై న్, లకోటియా ఇన్స్టిట్యూట్లు కూడా వర్సిటీ నిబంధనల మేరకు కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. - ప్రొఫెసర్ ఎస్.కుమార్, డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్ఏఎఫ్ఏయూ. -
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్
టాప్ స్టోరీ తెలంగాణలో మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20 నుంచి దాదాపు గతేడాది మాదిరిగానే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రత్యేక కథనం.. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లు అర్హులు 1,03,001 ప్రభుత్వ కళాశాలలు 56 ప్రైవేటు కళాశాలలు 169 ప్రభుత్వ సీట్లు 12,000 ప్రైవేటు సీట్లు 46,000 మొదటి దశ రిజిస్ట్రేషన్ విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశిత తేదీల్లో మొత్తం 21 హెల్ప్లైన్ సెంటర్లలో ఏదో ఒకదానికి హాజరై ర్యాంకు కార్డ్ను సంబంధిత అధికారికి అందజేసి పేరు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్ను తెలియజేయాలి. (ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ కావచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తీసుకువెళ్లాల్సినవి ⇒ టీఎస్పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ⇒ టీఎస్పాలిసెట్ హాల్టికెట్ ⇒ పదో తరగతి మార్కుల మెమో ⇒ నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ⇒ నివాస ధ్రువీకరణ పత్రం ⇒ జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ⇒ ఆధార్ కార్డ్ ⇒ కుల ధ్రువీకరణ పత్రం ⇒ వికలాంగులు/ఎన్సీసీ/స్పోర్ట్స్/చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి. ⇒ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి. రెండో దశ (సర్టిఫికెట్ వెరిఫికేషన్) ఈ దశలో అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సంబంధిత వెరిఫికేషన్ అధికారికి అందజేసి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే. మూడో దశ (ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు) రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. కోర్సులు, కళాశాలలు సీట్ల ఆధారంగా ప్రాథమ్యాలను ఎంపిక చేసుకోవాలి. నాలుగో దశ (ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రక్రియ ప్రారంభం) ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వెబ్సైట్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ప్రాథమ్యాల మేరకు ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్నే వినియోగించాలి. తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక లాగ్ అవుట్ అవ్వాలి. తిరిగి హోంపేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలి. లాగిన్ ఐడీ విద్యార్థుల మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ వివరాలు పూర్తిచేశాక సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (OTP) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్కు వన్టైం పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ను ఓటీపీ బాక్స్లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్ను చదివి, ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్పై క్లిక్ చేయాలి. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఆప్షన్ ఎంట్రీ బటన్పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్ల పక్కన టిక్ చేసి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్పై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్లు, బ్రాంచ్లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. దీంట్లో తమకు నచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా కాలేజ్ కోడ్, కళాశాల కోడ్ పక్కన ఉండే బాక్స్లలో ప్రిఫరెన్స్ నెంబర్ పొందుపర్చాలి. నాలుగో దశ (లాగ్ అవుట్) ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయ్యాక ఔౌజ ైఠ్ట బటన్పై క్లిక్ చేస్తే .. ave and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్లు కనిపిస్తాయి. అభ్యర్థులు అవసరాన్ని బట్టి బాక్స్లో టిక్ చేయాలి. ఎలాంటి మార్పులు లేవనుకుంటే Confirm Logout బటన్పై క్లిక్ చేయాలి. అయిదో దశ (సీట్ అలాట్మెంట్) ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజ్ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆరో దశ (ఫీజు చెల్లింపు) కేటాయించిన కాలేజ్ ఆధారంగా ఏడాదికి రూ.3800 నుంచి రూ.15,500 మధ్యలో ఫీజు చెల్లించాలి. ఫీజు ఆయా కాలేజ్లను బట్టి ఉంటుంది. ఈ ఫీజు చెల్లింపును నేరుగా కాలేజ్లోనే చెల్లించేలా గత ఏడాది వెసులుబాటు ఇచ్చారు. ఇదే విధానం ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏడో దశ (కాలేజ్లో రిపోర్టింగ్) అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవడం, ఫీజు చెల్లించడం ప్రక్రియ పూర్తయ్యాక వాటి ఆధారంగా తమకు సీటు లభించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో దశ (కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం) తొలి దశ కౌన్సెలింగ్లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్కు నిర్దేశిత హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. వెబ్సైట్: https://tspolycet.nic.in వెబ్ ఆప్షన్స్ ముఖ్య తేదీలు:- మే23, 24: 1 - 28,000 ర్యాంకు వరకు మే25, 26: 28001- 56000 ర్యాంకు వరకు మే27, 28: 56001-84000 ర్యాంకు వరకు మే29, 30: 84001- చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల మార్పు: మే 31 సీట్ ఎలాట్మెంట్: జూన్ 1 -
దరఖాస్తు చేశారా?
* కాలికట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వివిధ విభాగాల్లో ఫుల్టైం, పార్ట్టైం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) ప్రోగ్రామ్లో ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేది: మే 20 * హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో పీజీడీఆర్ డీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 25 * ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్లో క్యూసీఐ సర్టీఫైడ్ యోగా ప్రొఫెషనల్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 -
ఒత్తిడిని చిత్తు చేద్దాం.. విజయ తీరాలకు చేరుకుందాం..
టాప్ స్టోరీ ఒత్తిడి.. మూడు అక్షరాల పదం! ప్రభావం మాత్రం.. కొండంత!! నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులే! అకడమిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించాలని ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు.. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కలల కొలువులు సొంతం చేసుకోవాలని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగార్థులు.. 24్ఠ7 పని వాతావరణం; డెడ్లైన్స్; డెసిషన్ మేకింగ్; ఉన్నత స్థానాలు అందుకోవాలనే తపనతో ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు.. ఇలా... ఇప్పుడు క్లాస్ రూం, నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఒత్తిడి అనే మాట సర్వ సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలు.. సూచనలు.. ఆత్మవిశ్వాసం ఆలంబనగా ఒత్తిడిని జయించే క్రమంలో ఇటు విద్యార్థులైనా, అటు ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా.. ముందుగా పెంపొందించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ఒత్తిడికి గురవడం అనే సమస్య.. సాధారణంగా సహచరులతో పోల్చుకోవడం వల్ల, పోటీ గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎదురవుతుంది. తమపై తాము నమ్మకం పెంచుకుంటే ఒత్తిడిని సగం జయించినట్లే! మెండైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు తోటివారితో పోల్చుకోవడం, పోటీ గురించి అదేపనిగా ఆలోచించడం మానేయడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు అధిగమించొచ్చు. సానుకూల జీవన శైలి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపకరించే మరో అంశం.. వ్యక్తిగత జీవన శైలి సరళంగా, మానవ సంబంధాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం మేలు. కొన్ని సందర్భాల్లో అత్యంత సాధారణంగా ఉండే అంశాలు కూడా సమయాన్ని వృథా చేసి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాల గురించి పదేపదే ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, మిత్రులతో వీలైనంత గడపడం మంచిది. అలసటగా అనిపించినా.. ఆందోళనకు గురవుతున్నా కొత్త ప్రాంతాలను సందర్శించడం చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాధాన్యతలను గుర్తిస్తూ చాలామంది తాము చేయాల్సిన పనులు పూర్తి చేయలేదనే భయంతోనో లేదా వాటిని పూర్తి చేయకపోతే కలిగే ప్రభావాన్ని తలచుకొని చివరి నిమిషంలో ఎక్కువగా ఒత్తిడికి గురువుతుంటారు. ఇలాంటి వారికి ఒత్తిడిని జయించే క్రమంలో ఉపయోగపడే మంచి సాధనం.. ముందస్తు ప్రణాళిక. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా ఒక వారం లేదా ఒక రోజుకు సంబంధించి తాము చేయాల్సిన పనులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్ క్యాలెండర్లోనో నోట్ చేసుకోవాలి. ఒకరోజు చదవాల్సిన అంశాల్లో ప్రాధాన్యతను గుర్తిస్తూ ముందుకు సాగాలి. తద్వారా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడికి గురిచేసే వారికి దూరంగా ఒత్తిడిని దూరం పెట్టడంలో ఉపయోగపడే మరో చిట్కా. ‘ఒత్తిడి’కి గురిచేసే వారిని లేదా ‘నిరాశావాదు’లకు దూరంగా ఉండటం. కొంతమంది అదే పనిగా వచ్చి.. ఒక పరీక్షకు సంబంధించి ప్రతికూల అంశాలే చెబుతుంటారు. ‘ఇంత పోటీలో ఎంత చదివినా ఉపయోగం ఏంటి? నేను కూడా గతంలో ఎంతో కృషి చేశాను. కానీ ఫలితం లేదు’ అనే మాటలతో నిరుత్సాహానికి గురిచేస్తారు. అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్ తాము చేయాల్సిన పనులు లేదా చదవాల్సిన అంశాలను వాటి క్లిష్టత స్థాయి ఆధారంగా ఈజీ.. మోడరేట్.. డిఫికల్ట్గా వర్గీకరించుకోవాలి. ముందుగా ‘ఈజీ’తో మొదలుపెట్టాలి. ఇవి పూర్తయ్యాక మోడరేట్, డిఫికల్ట్ అంశాలనుఎదుర్కొనేందుకు ముందస్తు మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. ఇష్టం లేకున్నా కష్టమైన అంశాలతో మొదలుపెడితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని సందర్భాల్లో ఎంత వద్దనుకున్నా.. ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నా.. ఆందోళన పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో చదువుతున్న పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టి మానసిక విశ్రాంతి కోసం టెక్నిక్స్ పాటించాలి. అంటే.. ఇష్టమైన సంగీతం వినడం, గార్డెనింగ్, లేదా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడటం లాంటివి చేయాలి. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్.. మరికొన్ని టిప్స్ * దినచర్యను ఇష్టమైన పనితో ప్రారంభించాలి. * ప్రతిరోజూ కొద్దిసేపు నడక, యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. * ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి. * ఇష్టమైన ప్రదేశాలు చూడాలి. అయితే వీటికోసం రోజుల తరబడి వృథా చేయకూడదు. తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్తుండాలి. * విసుగు, కోపం, ఆవేదనకు దూరంగా ఉండాలి. * ఇతరుల విజయాల పట్ల సానుకూల దృక్పథం అవసరం. * ఉద్యోగులు డెడ్లైన్స్, లాస్ట్ మినిట్ వరకు వేచి చూడకుండా ముందుగానే పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. * ప్రతిరోజూ తప్పనిసరిగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అందరికీ ఒత్తిడి.. అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒత్తిడి అనే మాట వినిపించని రంగం, ఆ మాట తలవని వ్యక్తులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని అధిగమిస్తేనే విజయం. ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానసిక ఉపశమన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడి ఎదురైనప్పుడు కొద్దిసేపు దానికి విరామమిచ్చి సహచరులతో బృందచర్చల్లో పాల్పంచుకోవడం, అది వీలు కాకపోతే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. ఇక.. విజయం పరంగా పోటీ గురించి ఆలోచించకుండా కృషిచేస్తే ఒత్తిడి అనే మాట దరిచేరదు. - డాక్టర్. ఎం.ఎస్.రెడ్డి,సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్ తల్లిదండ్రులదీ కీలక పాత్ర 17 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ వయసులో పిల్లలు సహచర విద్యార్థులతో పోల్చుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా వారికి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులను తల్లిదండ్రులే గుర్తించి వారికి ఉపశమనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ సహచర విద్యార్థులతో పోల్చి మరింత ఒత్తిడికి గురి చేయడం సరికాదు. పోటీల్లో జయాపజయాలు సహజం. దీన్ని గుర్తించి ఫలితం ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధత పొందాలి. - డాక్టర్. జి.కృష్ణ, క్లినికల్ సైకాలజిస్ట్, ఎన్ఐఎంహెచ్ - సికింద్రాబాద్ -
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్కు అనుగుణంగా భారత్లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కన్సల్టెంట్లు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు: 17 అర్హతలు: సంబంధిత పోస్టుకు యూజీ/పీజీ/ డిప్లొమా/తత్సమానం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 27, 28. వెబ్సైట్: www.nihfw.org ఐజీసీఏఆర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని నిర్వహిస్తోంది. పోస్టు: టెక్నికల్ ఆఫీసర్ విభాగాలు: సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఖాళీలు: 7 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 17 వెబ్సైట్: www.igcar.gov.in రిషికేష్ ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సీనియర్ రెసిడెంట్, ఖాళీలు: 236 విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్. అర్హతలు: మెడికల్ అభ్యర్థులకు: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉండాలి. నాన్-మెడికల్ అభ్యర్థులకు (అనాటమీ డిపార్ట్మెంట్): సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ డిగ్రీ ఉండాలి. ఏదైన వర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి పీహెచ్డీ ఉండాలి. గతంలో సీనియర్ రెసిడెన్సీ చేసినవారు అనర్హులు. దరఖాస్తుకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in -
పరీక్షల తేదీలు
⇒ టీఎస్ ఎంసెట్: మే 15 ⇒ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ: మే 15 ⇒ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)- రిషికేష్ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్): మే 23 ⇒ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో మెయింటెయినర్ (ఎలక్ట్రీషియన్): మే 29 -
మా లక్ష్యం సామాజిక అభివృద్ధి..
వారందరి నేపథ్యాలు వేరు.. ప్రాంతాలు కూడా వేరు.. కానీ.. వారి ప్రత్యేకత.. అందరూ మహిళలే.... వారి లక్ష్యం ఒకటే.. అది సామాజికాభివృద్ధికి దోహదపడాలనే కాంక్ష! ఆ ఆశయ సాధనకు మార్గం.. సివిల్ సర్వీసెస్.. సాధించాలనే తమ తపనకు.. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాముల తోడ్పాటు అందింది! సివిల్స్ పరీక్షలో దీటుగా రాణించారు.. ర్యాంకుల్లో దూసుకెళ్లారు. మరికొద్ది రోజుల్లో కార్యక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. తాజా సివిల్స్-2015 ఫలితాల్లో ‘టాప్’లేపిన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా విజేతలపై ప్రత్యేక కథనం... ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు: 14వ ర్యాంకు చేకూరు కీర్తి : ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్పైనే ఉండేది. ఐఐటీ మద్రాస్ నుంచి మెటీరియల్ అండ్ మెటలర్జికల్ సైన్స్లో 2012లో బీటెక్ పూర్తిచేశా. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉండగానే సివిల్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒకవైపు స్నేహితులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విజయానికి కృషి చేస్తుంటే.. నేను కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నా ఆలోచనంతా సివిల్స్పైనే ఉండేది. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా 2013లోతొలి ప్రయత్నంలో 440వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. 2014 లో రెండో ప్రయత్నంలోనూ ఆశించిన ర్యాంకు రాలేదు. దాంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో 2015కు హాజరయ్యాను. సివిల్స్-2015 ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఐఆర్ఎస్ శిక్షణ పూర్తిచేసి, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా విధుల్లో ఉన్నా. ఐఆర్ఎస్ ట్రైనింగ్ కూడా పూర్తిచేసుకుని మళ్లీ సివిల్స్ రాయడానికి కారణం.. ఐఏఎస్కు నేరుగా ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉండటమే! నా విజయంలో అమ్మ పద్మ ప్రేరణ, నాన్న నాగేంద్ర తోడ్పాటు మరువలేనిది. సివిల్స్లో విజయం సాధించడం కష్టమే అయినా.. ఇష్టంగా చదివితే లక్ష్యం చేరుకోవచ్చు. పట్టుదల ఉంటే ఫలితం గ్యారెంటీ..! : 65వ ర్యాంకు వల్లూరు క్రాంతి : ఇష్టపడి చదివితే సివిల్స్లో విజయం సాధ్యమే. తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో ప్రయత్నించాలి. మాది కర్నూలు. అమ్మానాన్న లక్ష్మి, వెంకట రంగారెడ్డి ఇద్దరూ వైద్యులే. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే వారి ఆకాంక్షే నా విజయానికి కారణం. అమ్మానాన్న ఆకాంక్షలకు అనుగుణంగా చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్టే. ఐఐటీ-ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. బీటెక్ పూర్తిచేసిన తర్వాతే సివిల్స్పై దృష్టిసారించా. మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అరుదే అయినా.. మ్యాథ్స్పట్ల ఇష్టంతోనే ఆ సబ్జెక్టును ఎంపిక చేసుకన్నా. తొలి ప్రయత్నంలో 2013లో 562వ ర్యాంకుతో ఐఆర్టీఎస్కు.. 2014లో 230వ ర్యాంకుతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. అయితే, నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో పట్టుదలగా 2015 సివిల్స్కు హాజరై 65వ ర్యాంకు సాధించా. నా విజయ ప్రస్థానంలో.. అమ్మానాన్న అందించిన సహకారం మరవలేనిది. నేను ఏం చదువుతానంటే అది చదివించారు. అందుకే ఇంట్లో అందరూ డాక్టర్లయినా.. నేను మాత్రం ఇంజనీరింగ్పై ఆసక్తితో ఐఐటీలో చేరా. బీటెక్ అర్హతతో ఆఫర్లు వచ్చినా కాదనుకొని సివిల్స్ లక్ష్యంగా చదివా. ఆ కల సాకారమవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదలతో చదివితే సివిల్స్లో విజయం సాధ్యమే. కాకపోతే తొలి ప్రయత్నంలో రాకపోయినా నిరుత్సాహానికి గురికాకుండా ఓర్పుగా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. కార్యక్షేత్రంలో అడుగుపెట్టాక మహిళా సాధికారతకు తోడ్పడతా. మహిళలకు అందుబాటులో ఉన్న పథకాల సమర్థ అమలుకు కృషి చేస్తా. సమాజం కోసం సివిల్స్ గమ్యం.. : 82వ ర్యాంకు పాపమ్మగారి ప్రావీణ్య : విజయానికి ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చదవడం అలవర్చుకోవాలి. మాది అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం ఎనుములపల్లి. నా విజయంలో అమ్మానాన్న ఓబుల్ రెడ్డి, మాలతిల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడం, ఉన్నత హోదాల్లో ఉండటం (తండ్రి హెచ్ఏఎల్ చీఫ్ మేనేజర్, తల్లి సీజీహెచ్ఎస్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్) కూడా కలిసొచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ను వదులుకున్నా అమ్మానాన్న ఏమీ అనకపోవడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తయింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే ప్రముఖ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశా. అయినా నా దృష్టంతా సామాజిక అభివృద్ధివైపే. అందుకు మార్గం, నా గమ్యం సివిల్ సర్వీసెస్ మాత్రమే అని భావించా. సివిల్స్ ఆలోచన వచ్చిందే తడవుగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ కోసం చేరా. 2014లో తొలి ప్రయత్నం చేశా. ప్రిలిమ్స్లో విజయం సాధించా. మెయిన్స్లో పదిహేను మార్కుల తేడాతో కటాఫ్ చేజారింది. ఫలితం రాకున్నా.. సివిల్స్ సాధించగలను అనే నమ్మకం అప్పుడే కలిగింది. 2015 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని శ్రమించా. దాంతో రెండో ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యే అవకాశం దక్కింది. సీఏ నుంచి సివిల్స్ వైపు : జె.స్నేహజ 103వ ర్యాంకు మా స్వస్థలం ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, గుళ్లపాలెం. నాన్న వెంకటేశ్వర్లు చార్టర్డ్ అకౌంటెంట్. వృత్తి రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నేను కూడా నాన్న బాటలోనే చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేయాలని సీఏ కోర్సులో అడుగుపెట్టా. 2011లో తొలి ప్రయత్నంలోనే ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. అదే సమయంలో బీకాం కూడా పూర్తి చేశా. సీఏ చదువుతున్నప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం.. ఆ సమయంలో పలు నేపథ్యాల ప్రజల స్థితిగతులు ప్రత్యక్షంగా చూడటంతో సమాజానికి, ముఖ్యంగా పేద, గ్రామీణ వర్గాలకు సేవ చేయాలనే ఆకాంక్ష మొదలైంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. నా కోర్ సబ్జెక్ట్ కామర్స్నే ఆప్షనల్గా సెలక్ట్ చేసుకున్నా. తొలి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించకపోయినా సివిల్స్పై అవగాహన కలిగింది. దాంతో మరికొంత గెడైన్స్ లభిస్తుందని సివిల్స్ 2013 కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా. 2014లో మూడో ప్రయత్నంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్క్వార్టర్స్ సర్వీసుకు ఎంపికయ్యా. అయితే ఐఏఎస్ లక్ష్యంగా 2015లో నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు రావడంతో నా కల నెరవేరింది. నా విజయంలో అమ్మానాన్న తోడ్పాటు ఎంతో ఉంది. పదో తరగతి కాగానే.. అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. నేను కోరుకున్న చదువు చదివించారు. సివిల్స్ కోసం నాలుగేళ్లు వేచిచూసినా వెన్నంటి నిలిచారు. ఓర్పుతోనే.. విజయం! : కె.ప్రవళ్లిక 232వ ర్యాంకు మాది విశాఖపట్నం. నాన్న విశ్వనాథ్, ఎస్బీఐలో చీఫ్ మేనేజర్, అమ్మ విశాలాక్షి.. ఎస్బీహెచ్ ఉద్యోగిని. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఎందుకంటే నా లక్ష్యం గురించి తెలుసుకున్న అమ్మానాన్న నా కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. 2011లో బీటెక్ (సీఎస్ఈ) పూర్తయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీలో ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ. అందుకే సొసైటీకి సేవ చేసే అవకాశం ఉండే సివిల్ సర్వీసెస్ను లక్ష్యంగా ఎంచుకున్నా. తొలి ప్రయత్నంలో 2013లో మెయిన్స్ వరకు వెళ్లినా.. ఐదు మార్కుల తేడాతో విజయం చేజారింది. దాంతో మరింత పట్టుదలతో 2014కు హాజరుకాగా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ కేడర్ లభించింది. అదే సమయంలో నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం లభించింది. ఆ విధుల్లో చేరినా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మరోసారి ప్రయత్నించాను. 2015లో 232వ ర్యాంకు వచ్చింది. సివిల్స్లో సోషియాలజీ నా ఆప్షనల్. రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగించా. బీటెక్ పూర్తయ్యాక ఇన్నేళ్లు వేచి చూడాల్సి రావడం.. అమ్మాయికి పెళ్లి చేయండని బంధువుల ఒత్తిడి వచ్చినా కూడా నా లక్ష్యం గుర్తించిన అమ్మానాన్న ప్రోత్సహించడం చాలా సంతోషం కలిగించే విషయం. నాన్నే స్ఫూర్తిగా.. : అదిరె మంజు 291వ ర్యాంకు మాది హైదరాబాద్. నాన్న.. ధర్మయ్య, వికలాంగుల సంక్షేమ శాఖలో రిటైర్డ్ అటెండర్. నాన్నే నాకు స్ఫూర్తి. పిల్లలు ఉన్నత హోదాల్లో ఉండాలని నాన్న కోరుకోవడమే నేను ఈ రోజు సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసును లక్ష్యంగా చేసుకోవడానికి కారణం. నాన్న అందించిన నిరంతర ప్రేరణ, తోడ్పాటే నేను ఈ ర్యాంకు సాధించడానికి దోహదపడ్డాయి. ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. బీఈఎంఎల్ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 2011లో ఆంత్రోపాలజీ ఆప్షనల్గా తొలి యత్నంలో నిరుత్సాహ ఫలితం ఎదురైంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తుండటంతో సివిల్స్కు సిద్ధమవడం కష్టమైంది. 2013 నుంచి వరుసగా ప్రయత్నించాను. ప్రతి ఏటా గత లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగా. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. దాంతో తాజా ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో 291వ ర్యాంకు లభించింది. నా విజయంలో నాన్నతోపాటు భర్త హరీశ్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ సాధిస్తామనే భావన వీడాలి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే కోచింగ్ లేకపోయినా విజయం సాధించొచ్చు. కాకపోతే కొంత ఓర్పు అవసరం!! సామాజిక సేవ.. సంతృప్తి!! : ఉప్పలూరి మీనా 326వ ర్యాంకు మాది హైదరాబాద్. నాన్న శ్రీహరి ఐటీ కన్సల్టెంట్, అమ్మ సత్యశ్రీ. సివిల్స్ విజయంలో అమ్మానాన్న సహకారం ఎంతో ఉంది. ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్- ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ (2009-14) పూర్తయింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఐబీఎంలో ఆఫర్ వచ్చింది. ఒక ఏడాది బాగానే గడిచింది. కానీ ఏదో నిరుత్సాహం. సమాజానికి ఏమీ చేయలేకపోతున్నామనే భావన. ఎందుకంటే.. అప్పటికే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ CRY (Child Rights and You) ఐఐటీ ఖరగ్పూర్ చాప్టర్ మెంబర్గా ఖరగ్పూర్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఆ సమయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, గ్రామీణ విద్యార్థులకు అవగాహన కల్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించడం వంటివన్నీ గుర్తొచ్చేవి. దీంతో కార్పొరేట్ సంస్థలో కూర్చుని ఉద్యోగం చేసి లక్షలు సంపాదించినా సంతృప్తి ఉండదని.. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆత్మసంతృప్తి కలుగుతుందని భావించాను. దీనికి మార్గంగా సివిల్ సర్వీసెస్ను ఎంపిక చేసుకుని 2014లో తొలి ప్రయత్నం చేశాను. కానీ ఫలితం రాలేదు. ఉద్యోగం చేస్తూ సివిల్స్కు ప్రిపరేషన్ సాగించడం కష్టమని భావించి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్కు ఉపక్రమించాను. జాగ్రఫీని ఆప్షనల్గా ఎంచుకుని 2015లో ఫలితం దక్కించుకున్నాను. సివిల్ సర్వెంట్ పరిధి ఎక్కువ : ఎలా ప్రియాంక 529వ ర్యాంకు మాది కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి. నాన్న నారాయణ.. ఆయుష్ శాఖ డెరైక్టర్; అమ్మ లారా.. సీసీఎంబీ సైంటిస్ట్. అమ్మానాన్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చాలా కష్టపడి చదువుకున్నారట. అందుకే మాకు అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో చదువు పరంగా ఎంతో ప్రోత్సహించారు. నేను సేవాగ్రామ్లోని ప్రముఖ వైద్య కళాశాల ఎంజీఎంఐఎస్లో 2011లో ఎంబీబీఎస్ పూర్తి చేశా. దీంతో సివిల్స్ ప్రిపరేషన్కు ఉపక్రమించా. 2011-12 అంతా కోచింగ్కు కేటాయించి 2013లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చా. 2014లో రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో చోటు లభించలేదు. కానీ సాధించగలననే నమ్మకం కలిగింది. అదే ఉత్సాహంతో 2015కు హాజరై 529వ ర్యాంకు సొంతం చేసుకున్నా. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా ఎంపిక చేసుకుని రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు చదివా. సోషల్ డెవలప్మెంట్ కోణంలో డాక్టర్ కంటే సివిల్ సర్వెంట్కే ఎక్కువ పరిధి ఉంటుంది. అందుకే సివిల్స్ లక్ష్యంగా ఎంపిక చేసుకున్నా. సివిల్స్ విజయ ప్రస్థానంలో కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. చెల్లెలు శశాంక కూడా సివిల్స్ రాసి.. 2014లో విజయం సాధించి ప్రస్తుతం ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తోంది. నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అప్పుడే ఇంటర్వ్యూకు అర్హత లభించింది. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లి మాక్ ఇంటర్వ్యూ కోచింగ్ తీసుకునేందుకు భర్త మణిపాల్కుమార్ తోడ్పాటు కూడా ఎంతో ఉంది. పట్టుదలతో.. నాలుగో ప్రయత్నంలో : పి.వైష్ణవి 840వ ర్యాంకు మాది చిత్తూరు. నాన్న పుష్పరాజు.. జవహర్ నవోదయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, అమ్మ విజయలక్ష్మి. బిట్స్ పిలానీలో 2004లో సీఎస్ఈ పూర్తయింది. కొన్ని సంవత్సరాలు యూకేలో ఉండి 2009లో స్వదేశానికి తిరిగి వచ్చా. గివింగ్ బ్యాక్ టు సొసైటీ దృక్పథంతో సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నా. గ్రూప్స్ నుంచి సివిల్స్ వరకు అన్ని పరీక్షలకు ప్రిపరేషన్ సాగించా. 2011 గ్రూప్-1 మెయిన్స్లోనూ విజయం సాధించా. కానీ ఆ పరీక్షకు సంబంధించి కోర్టు కేసు ఉండటంతో ఇంకా ఫలితాలు రాలేదు. సివిల్స్ కోసం 2012 నుంచి వరుసగా ప్రయత్నాలు చేశా. తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా తొలి యత్నంలో ప్రిలిమ్స్లో విజయం సాధించినా మెయిన్స్లో నిరాశ. కానీ పట్టు వీడకుండా ప్రయత్నించడంతో ఇప్పుడు తాజా ఫలితం 840 ర్యాంకు దక్కింది. ర్యాంకు కొంచెం ఎక్కువే అయినా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం ఉండే సర్వీసులకు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా విజయంలో నాన్నతోపాటు భర్త చంద్రశేఖర్ తోడ్పాటు ఎంతో ఉంది. ప్రిపరేషన్ సమయంలో ఒక్కోసారి పాపను చూసుకోవడం వీలుకాకపోయినా వారే అంతా చూసుకునేవారు. కొంత ఆలస్యమైనా ఫలితం.. : నాగిరెడ్డిగారి మధులత 496వ ర్యాంకు మా స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాన్న జగన్నాథ్రెడ్డి రిటైర్డ్ వీఆర్ఓ. ఆ సమయంలో ఆయన నిర్వహించే విధులు చూడటంతో చిన్నప్పుడే సమాజానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ, ఆ తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తిచేశా. నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన సర్వీస్ మోటోతోనే సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నా. 2011 నుంచి సీరియస్గా ప్రిపరేషన్ సాగిస్తున్నా. 2011లో వివాహమైంది. దీంతో భర్త ఈశ్వర్రెడ్డి ప్రోత్సాహం కూడా తోడైంది. ఇదే క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2లకు కూడా ప్రిపరేషన్ సాగించా. గ్రూప్-2, 2012 ద్వారా ఏఎస్ఓ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో గ్రూప్-2 కేడర్లో ఆ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. తొలి రెండు ప్రయత్నాలు (2011, 2012) నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. 2014లో మాత్రం మెయిన్స్కు ఎంపికవడంతో ఆత్మస్థైర్యం పెరిగింది. 2015లో పట్టుదలగా కృషి చేస్తే 496వ ర్యాంకు లభించింది. ఆంత్రోపాలజీ ఆప్షనల్గా ఎంపిక చేసుకుని వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించా. దాంతో కొంత ఆలస్యమైనా ఫలితం లభించింది. మరో ప్రయత్నం చేసి ఐఏఎస్ లక్ష్యం చేరేందుకు కృషి చేస్తా. -
దరఖాస్తు చేశారా?
* భోపాల్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏ)డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 16 * ఎన్హెచ్ఎంలో భాగంగా కరీంనగర్ జిల్లా ప్రాజెక్ట్లోని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేది: మే 18 * ఈఎస్ఐసీ నాచారం (హైదరాబాద్)లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్ (అల్లోపతి) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జూన్ 29 -
నాటా - 2016
గరిష్టంగా ఐదుసార్లు గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఎన్నో అందమైన, ఎత్తై భవనాలకు చక్కటి రూపమిచ్చేది ఆర్కిటెక్ట్లే. అలాంటి సృజనాత్మక ఆర్కిటెక్టులుగా రూపొందాలంటే రాయాల్సిన పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీన్ని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. నాటా స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో చేరొచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 1న మొదలైంది. ఆగస్టు 20 వరకు రాయవచ్చు. ఈ ఏడాది నుంచి నాటాలో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి వివరాలు... నాటా-2016 మార్పులు.. * ఈ ఏడాది నుంచి ఐదుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీల్లేదు. అది కూడా మొదటిసారి పరీక్ష రాసిననాటి నుంచి రెండేళ్లలోపు వరకు మాత్రమే వర్తిస్తుంది. * నాటా పరీక్ష ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఆగస్టు 20 వరకు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. * అభ్యర్థులు గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాసుకోవచ్చు కాబట్టి వీటిలో ఉత్తమ స్కోర్ను ‘బెస్ట్ స్కోర్’గా పరిగణిస్తారు. * నాటా స్కోర్కు పరీక్ష రాసిన నాటి (ఏప్రిల్ 1, 2016) నుంచి రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 2016కు ముందు పరీక్ష రాసినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. * నాటా ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష రాసే ప్రతిసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా రాసిన ప్రతిసారి పరీక్ష ఫీజు చెల్లించాలి. * పరీక్ష తర్వాత ప్రకటించే మార్కుల జాబితాలో అంతకుముందు రాసిన పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కులు కూడా ఉంటాయి. * నాటా-2016కు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఇంతకుముందు రాసిన నాటా వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. * గతంలో నాటాకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయనివారు, రాసినా ఆ వివరాలు తెలపనివారి ప్రీవియస్ నాటా స్కోర్లన్నీ రద్దవుతాయి. వారు మళ్లీ పరీక్ష రాయడానికి అనర్హులు. నాటా-2016 సమాచారం అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: ఐదేళ్లు పరీక్ష విధానం.. ఈ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. డ్రాయింగ్ టెస్ట్: అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ వేయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమన డం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజజీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ.. వాటికి సంబంధించిన చిత్రాలను గీయమని కూడా అడుగుతుంటారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. నాటాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం కల్పిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏయూ, వైజాగ్. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ - హైదరాబాద్ ఎస్ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్-అగిరిపల్లి, కృష్ణాజిల్లా. వివరాలకు: http://www.nata.in రిజిస్ట్రేషన్ ఆగస్టు 18 వరకు www.nata.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1,250 డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అభ్యర్థిలోని పరిశీలనాత్మక, సృజ నాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ, ఆలోచనా శక్తిని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. -
ఇండియన్ నేవీ
జాబ్ పాయింట్ లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) ఇండియన్ నేవీలో లా కేడర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోర్సు 2017, జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిక్షణ, ఎంపిక విధానం, వేతనం తదితర వివరాలు... అర్హతలు 55 శాతం మార్కులతో లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 1990, జనవరి 2 - 1995, జనవరి 2 మధ్య జన్మించినఅవివాహితులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం లా చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. శారీరక ప్రమాణాలు పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు; మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదా కల్పించి కేరళలోని నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. వేతనం సబ్ లెఫ్టినెంట్కు పే బ్యాండ్ 3/ రూ.15,600 - 39,100 స్కేల్తో 5,400 గ్రేడ్ పేతో వేతనం చెల్లిస్తారు. అదనంగా ఇన్స్ట్రక్షనల్, యూనిఫాం, హార్డ్ ఏరియా, ఇంటి అద్దె, రవాణా అలవెన్సులు కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని సుమారు నెలకు రూ.74,100 వరకు పొందవచ్చు. గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ గ్రాట్యుటీ, ఇతర సదుపాయాలు ఉంటాయి. ఎంపిక లా డిగ్రీలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) షార్ట్లిస్ట్ చేస్తుంది. ఇందుకోసం కటాఫ్ మార్కులను నిర్ణయించే పూర్తి అధికారం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ)కి ఉంటుంది. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు 2016 జూన్- సెప్టెంబర్ మధ్య బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూర్/ విశాఖపట్నంలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలను అయిదు రోజుల పాటు రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఈ దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజున వెనక్కి పంపుతారు. రెండో స్టేజ్కు ఎంపికైన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తిచేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఖాళీల ఆధారంగా శిక్షణకు ఎంపికైన వారితో తుది జాబితా రూపొందిస్తారు. కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సులో ట్రైనింగ్ పొందుతారు. తర్వాత శిక్షణలో భాగంగా వేర్వేరు నేవల్ ట్రైనింగ్ యూనిట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్కు పంపిస్తారు. శిక్షణ ప్రారంభమైన నాటి నుంచి లేదా ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాతి నుంచి అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేషన్లో ఉంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ లా కేడర్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు మొదట పదేళ్ల సర్వీస్ మంజూరు చేస్తారు. తర్వాత అభ్యర్థుల ఆసక్తి, అవసరం, పనితీరు ఆధారంగా మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు దరఖాస్తుకు గడువు ముగిసింది. దరఖాస్తు ప్రింటవుట్కు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల నకలు పత్రాలను జతపరిచి పోస్ట్ బాక్స్ నంబర్ 4, చాణక్య పురి పోస్ట్, న్యూఢిల్లీ-110021 చిరునామాకు సాధారణ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
తెలంగాణ-పర్యాటకం
కాంపిటీటివ్ గెడైన్స్ : తెలంగాణ ఎకానమీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల అధిక రాబడితో పాటు విదేశీ మారక ద్రవ్య ఆర్జన పెరగటంతో ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ’ ఏర్పాటైంది. దీన్ని 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వేరుచేశారు. రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు కల్పించటం పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం. దీని వద్ద వోల్వో, మెర్సిడెస్ బెంజ్ కోచ్లున్న 63 వాహనాలు ఉన్నాయి. ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను నిర్వహిస్తోంది. విభిన్న పర్యాటక ప్యాకేజీలు అందిస్తూ దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజాం ప్యాలెసెస్ టూర్, హైదరాబాదీ హెరిటేజ్ ఫ్లేవర్ వీకెండ్ ప్యాకేజ్, టెంపుల్ కమ్ హిల్ స్టేషన్ టూర్, కాకతీయ హెరిటేజ్ టూర్ వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలను ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంది. నదీ ప్రయాణాలు, జల విహారాలకు అవసరమైన పడవలను కూడా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు ♦ యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరచటంతో పాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణమండపాలు, ధ్యానమందిరాలు, వేద పాఠశాల, కాటేజీలను ఏర్పాటు చేస్తారు. ♦ నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ‘మెగా సినిమా సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ♦ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించింది. ♦ బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ విశిష్టమైన పండగకు దేశంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ♦ అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం మేడారం జాతర. 2016, ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో లక్షల మంది పాల్గొన్నారు. ఈ జాతర వైపు దేశ ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ నాగార్జున సాగర్, కిన్నెరసాని, రామప్ప, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘నీతి ఆయోగ్’ రూ.33 కోట్లు కేటాయించింది. ♦ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ♦ ప్రభుత్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ ఆలయం, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయాల వద్ద పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ♦ తెలంగాణ జిల్లాల్లో తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ♦ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ గ్రామీణ పర్యాటకానికి సంబంధించి గుర్తించిన వాటిలో నల్గొండలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఆదిలాబాద్లోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులున్నాయి. ♦ భారత ప్రభుత్వం సహకారంతో కుతుబ్షాహీ సమాధుల పరిరక్షణ, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ ప్రసిద్ధ సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ ఇప్పటికే చేతులు కలిపింది. ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం ♦ అధిక ఆర్థిక వృద్ధి సాధనకు పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ చర్యల కారణంగా పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది. ♦ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణలో నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. ♦ పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ♦ ఆదాయం, ఉపాధికల్పన పెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుంది. ♦ పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో వివిధ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పౌరవిమానయానం, ఆతిథ్య పరిశ్రమల్లో పీపీపీ నమూనాను ప్రవేశపెడితే ప్రభుత్వ వ్యయభారం తగ్గుతుంది. ♦ పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వృద్ధి అధికమవుతుంది. ♦ పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టిసారించటం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఇంటర్వ్యూలు
* నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కన్సల్టెంట్, డీటీపీ ఆపరేటర్, జేపీఎఫ్, కంప్యూటర్ టైపిస్ట్, ఎంటీఎస్ పోస్టులకు:మే 18,19 * ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: మే 17, 18 * సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్హెచ్)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు : మే 28 -
గిరగిరా తిరిగితే ఎందుకు పడిపోతాం?
స్కూల్ ఎడ్యుకేషన్ నేలపై నిలబడి మన కాళ్లమీద వృత్తాకారంలో గిరగిరా తిరిగినప్పుడు, లేదా మన తలను వృత్తాకారంలో తిప్పినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపూ మనకు ఏమీ అనిపించనప్పటికీ, ఆపిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయినట్లుగా ఉంటుంది. మనం సరిగ్గా నిలబడలేక వెంటనే కూర్చుండిపోతాం. ఒక్కోసారి కిందపడిపోతాం కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన చెవుల లోపలి భాగంలో ఒక రకమైన సంచుల్లాంటి నిర్మాణాలు (కాక్లియా) కొన్ని ఉంటాయి. వీటిలో ఒక ద్రవం, ఆ ద్రవంలో కొన్ని స్ఫటికాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మన సమతుల్యతను నియంత్రిస్తాయి. మన తలని గిరగిరా తిప్పినప్పుడు ఆ ద్రవంలోని స్ఫటికాలు కూడా అందుకు అనుగుణంగా తిరిగి, సంచుల గోడలను తాకి వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో వీటిని అంటిపెట్టుకుని ఉండే నాడులు ఆ సంకేతాలను మెదడుకి అందిస్తాయి. మెదడు అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. మనం గిరగిరా తిరిగినప్పుడు మన చెవుల్లోని ద్రవపు సంచుల్లోని స్ఫటికాలు కూడా తిరుగుతాయి. అయితే మనం ఆగిపోయిన వెంటనే అవి మళ్లీ తమ పూర్వ స్థితికి చేరుకోలేవు. దాంతో కొంతసేపటిదాకా అసలేం జరుగుతుందో మన శరీర వ్యవస్థకు అర్థంకాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంతులతను కోల్పోయి కిందపడతాం. -
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్..
టాప్ స్టోరీ ఎంటర్ప్రెన్యూర్షిప్.. స్వయం ఉపాధికి ఆధునిక పేరు! ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం ఉంటున్న విభాగమిది! ఇందులో ప్రస్తుతం మరో కొత్త విభాగం కీలకంగా మారుతోంది. అదే.. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సామాజిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడే సంస్థలను స్థాపించడమే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇందులోని అవకాశాలపై విశ్లేషణ.. ఒకవైపు కెరీర్ పరంగా స్వయం ఉపాధి లక్ష్యాన్ని, మరోవైపు సామాజిక అవసరాలను తీర్చాలనే ఆకాంక్షను నెరవేరేలా చేస్తోంది సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది సామాజికంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు మొదలు అభివృద్ధి సమస్యల వరకు పరిష్కారాలను చూపుతోంది. సామాజిక అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎన్నో రంగాలు * సాధారణ ఎంటర్ప్రెన్యూర్షిప్తో పోల్చితే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆదాయం కొంత తక్కువ ఉంటుంది. కానీ, సమాజాభివృద్ధికి తోడ్పడ్డామన్న సంతృప్తికి కొదవ ఉండదు. * ప్రస్తుతం దేశంలో ఐఐటీల నుంచి సాధారణ కళాశాలల విద్యార్థుల వరకు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్పై మొగ్గుచూపుతున్నారు. ఔత్సాహికులు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐఐటీ చెన్నైకు చెందిన కృష్ణన్ అనే విద్యార్థి రైల్వేస్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్ను ఏర్పాటు చేసి, రూ.2కు లీటర్ నీటిని అందిస్తున్నారు. అమృత ధార పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఆలోచన.. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’ సంస్థ నిర్వహించిన పోటీలో విజయం సాధించింది. దీంతో ఆ విద్యార్థి ఆర్థిక సహకారం పొందాడు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సంస్థలకు వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విద్యా రంగానికి కూడా విస్తరిస్తోంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ సంస్థలు, ఈ-లెర్నింగ్ సంస్థలు, వెబ్సైట్లు వంటివన్నీ ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్గా పరిగణించవచ్చు. వీటికి కూడా సీడ్ ఫండింగ్ ఏజెన్సీల నుంచి మద్దతు లభిస్తోంది. హైదరాబాద్కు చెందిన Edutor ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థకు దాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే హైదరాబాద్ ఏంజెల్స్ సంస్థ రూ.2 కోట్లు సీడ్ క్యాపిటల్ అందించింది. ఉద్యోగావకాశాలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విభాగంలో సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో ఇందులో ఉద్యోగ అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ విభాగంలో వచ్చే రెండేళ్లలో 70 వేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమున్నట్లు అంచనా. కానీ ఇతర ఎంటర్ప్రెన్యూర్ సంస్థలతో పోల్చితే వీటిలో వేతనాలు కొంత తక్కువగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు సైతం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం ప్రకారం సంస్థలు తమ నికర లాభంలో రెండు శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలి. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్గా కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాల్లో స్టార్టప్ ఔత్సాహికులకు నిధులను కూడా సమకూరుస్తున్నాయి. కేవలం స్వచ్ఛంద సంస్థలు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి అడుగుపెడతాయనుకుంటే పొరపాటు. పూర్తిస్థాయిలో కమర్షియల్గా మారిన రంగాల్లోనూ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన IMPRINT పథకంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్నకు పెద్దపీట వేశారు. ఫండింగ్ ఏజెన్సీలు ACUMEN ఫండ్ SONG: ఈ సంస్థ చిన్న, మధ్య తరహా సోషల్ ఎంటర్ప్రైజెస్కు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆవిష్కార్ ఇండియా మైక్రో వెంచర్ క్యాపిటల్: ముంబైకు చెందిన ఈ సంస్థ చెత్త నిర్వహణ, ఇంధనం, హస్తకళలు తదితరాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. గ్రే మేటర్స్ క్యాపిటల్ ఫౌండేషన్: హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ మైక్రో ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఫండింగ్ సదుపాయం కల్పిస్తోంది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఇండియా ఇన్క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఓర్పు అవసరం. ప్రారంభంలో లక్షిత క్లయింట్లను చేరుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. నిధుల కోసం సీడ్ ఏజెన్సీలను మెప్పించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇటీవల కాలంలో స్టార్టప్ కాంపిటీషన్లలో సోషల్ స్టార్టప్ ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో ఫండింగ్ ఏజెన్సీల ఆలోచన దృక్పథంలోనూ మార్పు వస్తోంది. - రామ్ గొల్లమూడి, ఫౌండర్, ఎడ్యూటర్ -
సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్వేర్..
గెస్ట్ కాలమ్ ఉజ్వల అవకాశాలకు అందిస్త్తున్న సేవరంగం నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థల వరకు అన్నింటా కాస్ట్ అండ్ అకౌంటెన్సీ విభాగానిది కీలకభూమిక. విశ్లేషణా నైపుణ్యం, ప్రశ్నించే లక్షణం ఉన్న అభ్యర్థులు అకౌంటెన్సీ కోర్సుల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అంటున్న.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, విజయ్ కిరణ్ అగస్త్యతో గెస్ట్ కాలం... కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులు క్లిష్టమైనవి! ఎంత చదివినా వీటిలో ఉత్తీర్ణత సాధించడం కష్టం! అనే అభిప్రాయాలు చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి. ఇలాంటి భావనల వల్లే ఈ కోర్సుల్లో ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్నవారు కూడా వెనకడుగు వేస్తున్నారు. భయాన్ని వీడి ముందడుగేస్తే..ఈ కోర్సుల్లో సులభంగా విజయం సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో ప్రవేశించవచ్చు. మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కలర్ఫుల్ కెరీర్ ఆప్షన్లు ఖాయం. ప్రొడక్షన్కే పరిమితం కాదు గతంలో కాస్ట్ అకౌంటెంట్లకు ఉత్పత్తి సంస్థల్లో మాత్రమే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, టెలికం, సాఫ్ట్వేర్, బీపీవో ఇలా ప్రతి రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ కోర్సు పూర్తిచేసిన వారికి.. తక్కువ ఖర్చుతో సంస్థ కార్యకలాపాలను నిర్వహించే నైపుణ్యాలుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తుండటమే. దీంతో ఆయా సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, కొలువులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తిచేసి సభ్యత్వాన్ని సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అదే విధంగా వీరికి యూకేకు చెందిన కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్లు సీఐఎంఏ, ఏసీసీఏలు నిర్వహించే పరీక్షల్లో కొన్ని పేపర్లకు మినహాయింపు ఇస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే.. సీఎంఏ కోర్సు (మూడు దశలు)ను తొలి ప్రయత్నంలోనే పూర్తిచేయడం కష్టమనే అభిప్రాయం సరికాదు. ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ థింకింగ్తో అంశాలను అధ్యయనం చేస్తే అన్ని దశలనూ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయొచ్చు. ‘ఫౌండేషన్’ నుంచే పునాదులు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో ఫౌండేషన్ స్థాయిలోనే ప్రవేశిస్తే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని నేను భావిస్తాను. ఇంటర్/10+2 అర్హతతో ఫౌండేషన్ కోర్సు పరీక్షలు పూర్తిచేస్తే ఇంటర్మీడియెట్లో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు డెరైక్ట్ ఎంట్రీ స్కీం కింద బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కానీ, ఈ రంగంపై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ నుంచే ఈ దిశగా అడుగులు వేయడం ప్రయోజనకరం. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు జూలై 31, జనవరి 31లోపు; నాలుగు సార్లు (మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలకు వరుసగా అక్టోబర్ 31, జనవరి 31, ఏప్రిల్ 30, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబినార్స్, ఆన్లైన్ లెక్చర్స్ సీఎంఏ కోర్సు రెగ్యులర్ కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు వెబినార్స్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్, అదే విధంగా ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా కామర్స్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నా పరంగా ఇచ్చే సలహా... ఒక సమస్యకు సంబంధించి ఎలా? అనే దృక్పథం నుంచి ఎందుకు? అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు? అనే ప్రశ్న తలెత్తినప్పుడే మనలో ఆ సమస్యను పరిష్కరించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక నైపుణ్యాలను అలవడుతాయి. అభ్యర్థులు ప్రారంభం నుంచే చదవడం, వ్యక్తీకరించడం, ప్రణాళిక- అమలు .. వంటి అంశాలను ఆచరణలో పెడితే విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకొని కలర్ఫుల్ కెరీర్కు బాటలు వేసుకోవచ్చు. -
కెరీర్ కౌన్సెలింగ్
I want to become an air hostess. Please tell me about the institutes that provide the training? - Rupa, Hyderabad ⇒ The basic requirement to pursue career as Air hostess is, formal training in the specific area. Then there are some age, height and weight restrictions. The candidate should have normal eye sight and be proficient in English and Hindi. Proficiency in foreign languages is an added advantage. The recruitment of air hostesses involves stages like written test and interview. The following are the details of some institutes offering air hostess training: ⇒ Fly High Institutes of Air Hostess and Hospitality, Sri Nagar Colony, hyderabd offers six-months diploma in Air hostess training. The eligibility criteria are +2 as academic qualification and age between 18-24. The admission is based on performance at personal interview. ⇒ Avalon Academy, Masab Tank, hyderabd. offers Diploma in Cabin Crew. The eligibility criterion is +2. - T. Muralidharan T.M.I. Network -
Rawat proved majority in Uttarakhand
Competitive Guidance Current Affairs International ♦ Brazil's Dilma Rousseff to face impeachment trial Brazil's President Dilma Rousseff is to face trial after the Senate voted to impeach and suspend her. Ms Rousseff is accused of illegally manipulating finances to hide a growing public deficit ahead of her re-election in 2014, which she denies. Senators voted to suspend her by 55 votes to 22. ♦ Switzerland honours Yash Chopra with a Bronze Statue Switzerland Government has honoured veteran filmmaker Yash Chopra by unveiling a bronze statue at Interlaken. Chopra was known for opening a legacy of South Asian tourists flocking to Switzerland and spend much time in the country besides shooting his movies. Economy ♦ Rs 100 Commemorative Coin on Maharana Pratap released A commemorative coin of Rs 100 and a circulation coin of Rs 10 were released today on the occasion of 475th birth anniversary of Maharana Pratap. Also the Union Culture and Tourism ministry has agreed to release a sum of Rs 9.5 Crore to the Rajasthan state government for the development of the Indoor Stadium at Khel Gaon, in memory of the great warrior. ♦ Govt notifies relaxed FDI norms for ARCs The Union government has notified the relaxed foreign investment norms in asset reconstruction companies (ARCs), as it looks at effectively dealing with the burgeoning bad debts in Indian banking system. The department of industrial policy and promotion permitted 100% foreign direct investment in asset reconstruction companies to come in without any prior government approval under the automatic route. Earlier, while 49% FDI was permitted under the automatic route, investors needed prior government approval to increase their stake beyond 49%. ♦ India Mauritius sign DTAA The Protocol for the amendment of the Convention for the avoidance of double taxation and the prevention of fiscal evasion with respect to taxes on income and capital gains between India and Mauritius was signed by both the countries. National ♦ Asia's first Rice Technology Park in Karnataka The Karnataka Government has decided to establish Asia's first Rice Technology Park at Gangavati in Koppal district. Maize Technology Park is to come up at Ranebennur in Haveri district. The Rice Technology Park is to be set up in 315 acre at Karatagi in Gangavathi of Koppal district. The park will be the focal point of agro-based activity in the region catering to most parts of the Tungabhadra Command Area. Sona Masuri, which is a lightweight and aromatic variety of rice, is grown pre-dominantly in this area. ♦ Harish Rawat proved majority in Uttarakhand Harish Rawat is set to become the Chief Minister of Uttarakhand once again. He proved his majority in the floor of the house. With this, the chaos has come to an end. The floor test to prove the Congress government's majority was held after a political battle that lasted over a month with the Centre imposing President's Rule on March 27 after nine Congress MLAs voted with the BJP in the House on the budget-related Appropriation Bill on March 18. The House Speaker disqualified the rebels, and the decision was upheld later by the High Court and Supreme Court, which paved the way for the floor test. ♦ '112' to be active from January 1 The single emergency number '112' will be operational throughout India from January 1, 2017 to help people reach immediate services of police, ambulance and fire department. It is similar to the '911' all-in-one emergency service in the US. The service will also be accessible even through such SIMs and landlines whose outgoing call facility has been stopped or temporarily suspended. Persons in news ♦ Sunil Lamba: Vice-Admiral Sunil Lamba will be the next Chief of the Indian Navy. He will take over on 31st of May. He will be the 23rd Chief of Indian Navy. ♦ Enda Kenny: Enda Kenny has been re-elected as Irish Prime Minister. ♦ Sadiq Khan: Sadiq Khan has been elected the new Mayor of London - boosting Labour Party after it slumped in Scotland's elections. Mr Khan is the city's first Muslim mayor. Sports ♦ Djokovic emerged victorious Novak Djokovic beat defending champion Andy Murray in the Madrid Open final. Djokovic now moved ahead of Spain's Rafael Nadal with a record 29 ATP Masters 1000 titles. ♦ India @ fourth in jr. shooting WC The Indian squad ended their campaign at the ISSF Junior World Cup with a creditable fourth place finish in the medals table. The Indian juniors had an overall tally of three gold, four silver and three bronze medals in the competition, the winners are…. * Rituraj Singh won two gold medals in both the individual and team events of the men's 25m Standard Pistol. * Shivam Shukla won gold and a silver in pistol event * Arjun Das won gold and a bronze ♦ Among the junior women…. * Yashaswini Singh Deswal- Two silver medals, both in the individual and team sections of the 10 metre Air Pistol event. Italy topped the table with seven gold, four silver and one bronze. Russia stood second. Senior World cup is scheduled on from May 19th, will be held in Munich, Germany. - Rajendra Sharma Current Affairs Faculty, Hyderabad -
దరఖాస్తు చేశారా?
* చెన్నైలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ క్యాడర్, నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 12 * టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్)లో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు చివరి తే ది: మే 16 * ఐఐటీ నాగ్పూర్లో నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 20 * ఇస్రోలో వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 -
ఉద్యోగాలు
యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో: స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1): 300 ఫైనాన్స్: 43 అర్హత: చార్టెడ్ అకౌంటెంట్ (ఐసీఏఐ)/ కాస్ట్ అకౌంటెంట్ (ఐసీడబ్ల్యూఏ)/ఎంబీఏ ఫైనాన్స్/ఎంకాం/ బీకాం. సివిల్ ఇంజనీరింగ్: 5 అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) లీగల్: 15 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘లా’ డిగ్రీ. లాయర్గా మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రెండేళ్లు సరిపోతుంది. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 15 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ యాక్చురీ: 2 అర్హత: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/యాక్చూరియల్ సైన్స్లో డిగ్రీ ఉత్తీర్ణత జనరలిస్ట్: 220 అర్హత: ఏదైనా డిగ్రీ వయోపరిమితి: 2016, మార్చి 31 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100) దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: మే 6, 2016 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: మే 17, 2016 పరీక్ష తేది: జూన్ 12, 2016 వెబ్సైట్: www.uiic.co.in ఓయూలో బీకాం (ఆనర్స్) ఉస్మానియా యూనివర్సిటీ.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2016 ద్వారా మూడేళ్ల బీకాం (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: ఇంటర్మీడియట్, దరఖాస్తు ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: యూనివర్సిటీ నిర్దేశించిన కాలేజీల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. కాలేజీల జాబితా వెబ్సైట్లో పొందుపరిచారు. ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2016 ర్యాంక్ ఆధారంగా దరఖాస్తు చివరి తేది: మే 18, 2016 వెబ్సైట్: www.osmania.ac.in ఓయూలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ (పీజీడీడీఐఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం విద్యార్థులు అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేది: మే 7, 2016 అపరాధ రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 14, 2016 వెబ్సైట్: www.osmania.ac.in -
ఈ కలం.. జన గళం! 'జర్నలిస్టు'
నేచర్ ఆఫ్ జాబ్ సమాజంతో దగ్గరి సంబంధం ఉన్న ఉద్యోగం జర్నలిస్ట్. మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది ఎంతో వైవిధ్యమైన వృత్తి. రాసే వార్తలో ప్రతి పదం వాస్తవికంగా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులు రాసే ప్రతి అక్షరం ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జర్నలిజం యువతకు మంచి కెరీర్ ఆప్షన్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఉద్యోగ స్వభావం, అవసరమైన స్కిల్స్ తదితరాలపై కథనం.. రెండు విభాగాలు జర్నలిజంలో ముఖ్యంగా రెండు విభాగాలుంటాయి. ఒకటి బ్యూరో, రెండోది డెస్క్. బ్యూరోలో రిపోర్టర్లుంటారు. సిటీ, స్టేట్, జిల్లాల వారీగా వేర్వేరు బ్యూరోలుంటాయి. రిపోర్టర్లు ఫీల్డ్కు వెళ్లి వార్తను సేకరించి డెస్క్కు చేరవేస్తారు. బ్యూరో మాదిరిగానే డెస్క్లు కూడా సిటీ, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స, జిల్లాలు.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. డెస్క్లో ప్రాథమికంగా సబ్ ఎడిటర్లు ఉంటారు. రిపోర్టర్లు ఇచ్చిన వార్తల్లోని దోషాలను సవరించి, దానికి మంచి శీర్షిక పెట్టి వార్తగా మలుస్తారు. ఒక వార్తకు సంబంధించి తుది నిర్ణయం డెస్క్దే. పనివేళలు ఎలక్ట్రానిక్ మీడియాలో షిఫ్ట్ల వారీగా పనివేళలు ఉంటాయి. ఇవి ప్రతి వారం మారుతుంటాయి. ప్రింట్ మీడియాలో డెస్క్ విభాగంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పని వేళలు ఉంటాయి. బ్యూరో విభాగం... ఆ రోజు ఉదయం నుంచి జరిగిన అంశాలను సాయంత్రానికల్లా వార్తల రూపంలో డెస్క్కు అందిస్తుంది. రిపోర్టర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి నిర్ణయాలు వెలువడినా వెంటనే వార్తలు రాసి డెస్క్కు అందించాల్సి ఉంటుంది. కావాల్సిన స్కిల్స్ ⇒ జర్నలిస్టు కావాలనుకునే వారికి ప్రాథమికంగా, తప్పనిసరిగా భాషపై మంచి పట్టు ఉండాలి. ⇒ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నింటిపై కనీస అవగాహన ఉండాలి. ⇒ నిరంతరం నేర్చుకునే తత్వం అత్యవసరం. ⇒ ఏది వార్తో, ఏది కాదో గుర్తించే నైపుణ్యం ఉండాలి. ⇒ పనిలో వేగం, కచ్చితత్వం తప్పనిసరి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో ఉద్యోగావకాశాలకు ఢోకాలేదనే చెప్పుకోవాలి. టీవీ చానళ్లు, న్యూస్ పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా డెస్క్, బ్యూరో విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కెరీర్ ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. ⇒ జర్నలిజం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించొచ్చు. ⇒ జర్నలిజం ద్వారా పేదలు, బాధితులకు సాయం చేయొచ్చు. తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ⇒ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ అన్ని రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ⇒ జర్నలిజంలో కాలంతో పోటీపడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ ప్రతి రోజు డెడ్లైన్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి ఎక్కువ. ⇒ సెలవులు తక్కువగా ఉంటాయి. కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఉద్యోగాలు సాధించొచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంసీజే అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా విశ్వవిద్యాలయం కోర్సు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ఏయూసెట్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.andhrauniversity.edu.in కాకతీయ విశ్వవిద్యాలయం కోర్సు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.kakatiya.ac.in శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in యోగి వేమన విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.yogivemanauniversity.ac.in తెలంగాణ విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్లో ఎంఏ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.telanganauniversity.ac.in ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.anucde.info -
స్కాలర్షిప్
కింగ్స్టన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ యునెటైడ్ కింగ్డమ్ (యూకే)లోని కింగ్స్టన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ -2016కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్కాలర్షిప్: ఏడాదికి నాలుగు వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు. అర్హతలు: విద్యార్థులు భారతీయులై ఉండాలి. 2016 సెప్టెంబర్ నాటికి వర్సిటీలో ఏదైనా సబ్జెక్ట్లో ఫుల్టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరేందుకు ఆఫర్ లెటర్ పొంది ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2016 వెబ్సైట్: http://www.kingston.ac.uk/ -
స్టెనోగ్రాఫర్స్
(గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2016) జాబ్స్ విత్ ఇంటర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2016కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర ఉపవిభాగాలు, రాష్ట్రాల వారీగా ఖాళీలను త్వరలో వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్హతలు: ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత వయోపరిమితి: 18-27 ఏళ్లు. - ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఒబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీ వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. పార్ట్-1, 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-3లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ గ్రేడ్-సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాల వేగం, గ్రేడ్-డి అభ్యర్థులకు 80 పదాల వేగం ఉండాలి. గ్రేడ్-డి అభ్యర్థులకు ఇంగ్లిష్కు 50 ని.లు, హిందీకి 65 ని.లు, గ్రేడ్-సికి ఇంగ్లిష్కు 40 ని.లు, హిందీకి 55 ని.ల సమయమిస్తారు. రాతపరీక్ష సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్: వర్తమాన సంఘటనలకు సంబంధించి అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. భారత్, పొరుగు దేశాల సమాచారం తెలుసుకోవాలి. క్రీడలు, చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, పాలిటీ, శాస్త్రీయ పరిశోధన తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, రైటింగ్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. వివరాలకు: http://ssc.nic.in/ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 3, 2016, పరీక్ష తేది: 31 జూలై 2016 దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం. -
ఫలితాల వెల్లడి
⇒ ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ⇒ జలమండలి గ్రేడ్-2 టెక్నీషియన్స్ పోస్టులు ⇒ యూపీఎస్సీ: మెడికల్ ఆఫీసర్స్/ రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి) రాత పరీక్ష ⇒ యూపీఎస్సీ: స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ) ఫైనల్ -
హిమాలయాల్లో సహజంగా పెరిగే మొక్క?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు.. కిందివాటిని పరిశీలించండి. 1) పత్తి 2) వేరుశెనగ 3) వరి 4) గోధుమ పైవాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 సరైన సమాధానం: సి వివరణ భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజిస్తారు. అవి 1) ఖరీఫ్ 2) రబీ 3) జైద్. గోధుమ ప్రధానమైన రబీ పంట. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం సరిపోతుంది. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు-శ్రీలంక, ఇండో-బర్మన్ ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్స్పాట్స్’గా ప్రకటించడానికి కింద తెలిపిన వాటిలో మూడు ప్రామాణికతలేవి? 1) జాతుల సంపన్నత్వం (స్పిసీస్ రిచ్నెస్) 2) ఉద్భిజ్జ సంపద సాంద్రత (వెజిటేషన్ డెన్సిటీ) 3) స్థానీయత (ఎండెమిజం) 4) ప్రమాదస్థితి (థ్రెట్ పర్సెప్షన్) 5) వెచ్చటి, తడి వాతావరణాలకు అనుకూలత పొందే వృక్ష, జంతు జాతులు పై అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ) 1, 2, 3 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 3, 4, 5 సమాధానం: బి వివరణ జాతుల సంపన్నత్వం అంటే ఏదైనా జీవసమాజంలో మిగతా జాతులకన్నా ఓ ప్రత్యేక జాతి సంఖ్యాపరంగా, ఆ ప్రాంత వనరులను వినియోగించుకోవడంలో మిగతా జాతుల కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్థానీయత అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవిస్తూ, ఇతర ప్రాంతాల్లో పెరుగుదల తక్కువగా ఉన్న జాతులు. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల ప్రాంతాలు, ఇండో-బర్మన్ ప్రాంతాల్లోని జాతుల్లో ఎక్కువగా స్థానీయమైనవి. ఇవి ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. కింది వాక్యాలను పరిశీలించండి (1) టెక్సాస్ అనే మొక్క హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది. (2) దీన్ని ఇటీవల ‘రెడ్ డేటా బుక్’ లిస్ట్లో చేర్చారు (3) దీని నుంచి ‘టాక్సోల్’ అనే డ్రగ్ను తయారు చేస్తారు. దీన్ని ‘పార్కిన్ సాన్స్’ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. పై వాటి నుంచి సరైన దాన్ని గుర్తించండి (ఎ) 1 (బి) 2, 3 (సి) 1, 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ ఈ మొక్క నుంచి తయారు చేసే టాక్సోల్ డ్రగ్లో గుండె క్యాన్సర్, పార్కిన్సాన్స్, రొమ్ము క్యాన్సర్లను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ స్థాయిలో టాక్సోల్ డ్రగ్ను తయారు చేసేందుకు నిర్మూలించారు. అందువల్ల దీన్ని రెడ్ డేటా లిస్ట్లో చేర్చారు. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే కింది వాటిలో భారతదేశ భూభాగంపై కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి? (1) దేశంలో ఎక్కువ భాగం ఆసియా భూభాగం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి లోనై ఉండేది. (2) గంగా-సింధు మైదాన ప్రాంతంలో ఇప్పుడున్నంత విస్తీర్ణంలో సారవంతమైన ఒండ్రుమట్టి నేలలు, జీవనదులు ఉండేవి కాదు. వర్షపాత పరిమాణం తక్కువై దుర్భిక్ష ప్రాంతంగా ఉండేది. (3) రుతుపవన విధానం ఇప్పుడున్నట్లు కాకుండా భిన్నమైన రీతిలో ఉండేది. పైవాటి నుంచి సరైనదాన్ని గుర్తించండి. (ఎ) 1 (బి) 1, 3 (సి) 2, 3 (డి) పైవ న్నీ సరైన సమాధానం: డి కింది వాటిలో భారత్-చైనాల మధ్య 2006లో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలను పెంపొందించేందుకు ఏ కనుమను తెరిచారు? (ఎ) నిథిలా (బి) జెలెప్లా (సి) నాథులా (డి) షిప్కిలా సరైన సమాధానం: సి పశ్చిమ దిశలో ప్రవహించే నర్మద, తపతి లాంటి ద్వీపకల్ప నదులు వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టురీస్ ఏర్పరిచేందుకు కారణం? (1) అతి తక్కువ కాలంతో పాటు, వేగంగా ప్రవహించడంవల్ల (2) పశ్చిమతీర రేఖ తరచూ టైడల్ బోర్స్ తో మునిగిపోవడం వల్ల (3) అవి రవాణా చేసే నిక్షేపాల పరిమాణం తక్కువగా ఉండటం, పగులు లోయ గుండా ప్రవహిండం వల్ల. (4) వాటి ద్వారా రవాణా అయ్యే నిక్షేపాలను వాటి ముఖ ద్వారాల వద్ద నిక్షేపితం చేయకుండా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల పైవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి (ఎ) 1, 3, 4 (బి) 2, 3, 4 (సి) 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: ఎ వివరణ పై ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే పగులులోయలు, పశ్చిమ కనుమల భౌమ నిర్మాణంపై సరైన అవగాహన ఉండాలి - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
ఎడ్యు న్యూస్
ఆర్జీయూకేటీ నూజివీడులో ఎంటెక్ ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) - నూజివీడు.. కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. ఆర్జీయూకేటీ - నూజివీడు నిర్వహించే ఏడు వారాల ‘ఇంట్రడక్టరీ కోర్సు ఇన్ కంప్యూటింగ్’లో 80 శాతంతో ఉత్తీర్ణత తప్పనిసరి. గేట్ 2015/16లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ. 200 (ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150) డీడీ రూపంలో చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా (పూర్తిచేసిన దరఖాస్తును ప్రింట్ తీసి, ఒరిజనల్ డీడీ కాపీని జతచేసి ఆర్జీయూకేటీ-నూజివీడుకు పోస్ట్ ద్వారా పంపాలి) ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: మే 23, 2016 ప్రింట్ తీసిన దరఖాస్తును పంపేందుకు చివరి తేదీ: మే 30, 2016 వెబ్సైట్: www.rguktnuz.in -
ఇస్రోలో 375
సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులు దేశంలో స్పేస్ సైన్స్ అప్లికేషన్స్, టెక్నాలజీలో విశేష కృషిచేస్తున్న సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)! ఇది తాజాగా వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యువ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం. ఇస్రోలో కొలువును చేజిక్కించుకోవడం ద్వారా ఉన్నత కెరీర్కు బాటలు వేసుకోవచ్చు! ఉద్యోగం: సైంటిస్ట్/ఇంజనీర్ (ఎస్సీ) వేతన స్కేలు: రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). ఖాళీలు: 375 ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో ‘ఎస్సీ’ గ్రేడ్లో నియమితులవుతారు. తర్వాత సీనియారిటీ, పని అనుభవం ఆధారంగా ఎస్డీ, ఎస్ఈ, ఎస్ఎఫ్ వంటి గ్రేడ్లు ఇస్తారు. ప్రారంభంలో గ్రాస్ రూ.45,990 వరకు ఉంటుంది. ట్రావెల్ అలవెన్సు, వైద్య సదుపాయాలు వంటివి కూడా ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.isro.gov.in ఇంజనీరింగ్ స్పెషల్ జాబ్ పాయింట్ అర్హత కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84 సీజీపీఏతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఏఎంఐఈ/గ్రాడ్ఐఈటీఈ అర్హత ఉన్న వారికి సెక్షన్ బీలో 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ ఉండాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా అభ్యర్థులు 2016, ఆగస్టు నాటికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. వయసు 2016, మే 25 నాటికి 35 ఏళ్లు మించరాదు. పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో రాత పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఫీజు దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, చలానా జనరేట్ అవుతుంది. ఫీజు మొత్తాన్ని ఎస్బీఐలో చెల్లించాలి. చలానా కాపీని ‘సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐసీఆర్బీ), ఇస్రో హెడ్క్వార్టర్స్, అంతరిక్ష్ భవన్, న్యూ బీఈఎల్ రోడ్, బెంగళూరు’కు పంపించాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 5, 2016 దరఖాస్తుకు చివరి తేదీ: మే 25,2016 రాత పరీక్ష తేదీ: జూలై 3, 2016 పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువహటి, హైదరాబాద్, కోల్కతా... -
అడ్మిషన్ ఇన్ఫో
ఐఐటీటీఎంలో బీబీఏ ఆనర్స్ కోర్స్ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక క్యాంపస్ (నెల్లూరులో) గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం).. 2016-17 విద్యా సంవత్సరంలో పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. * టూరిజంలో ఇప్పటికే ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తున్న ఐఐటీటీఎం నెల్లూరు ఈ ఏడాది నుంచి ‘టూరిజంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఆనర్స్ డిగ్రీ’ని కూడా ప్రారంభిస్తోంది. ఈవెంట్ అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో లభించే ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. * బీబీఏ టూరిజం ప్రోగ్రామ్కి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూన్ 10. జూలై రెండో వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను www.iittmsouth.org లో పొందొచ్చు. 0861-2353199, 9866274850 నంబర్లతోపాటు www.iittmnlr@gmail.comలోనూ సంప్రదించొచ్చు. -
న్యూ కోర్స్
గాంధీనగర్, కాన్పూర్లలో కాగ్నిటివ్ సైన్స్ వ్యక్తుల మానసిక పరిస్థితిని అంచనా వేయడంలో నైపుణ్యం అందించే శాస్త్రం కాగ్నిటివ్ సైన్స్. దీని ఆధారంగా వ్యక్తుల సామర్థ్య స్థాయి, పనితీరు విషయంలో అనుసరించే విధానాలను తెలుసుకునే సౌలభ్యం లభిస్తుంది. కాగ్నిటివ్ సైన్స్ అన్ని రంగాల్లోనూ ఆవశ్యకంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తొలిసారిగా 2013-14 నుంచి ఐఐటీ-గాంధీనగర్ కాగ్నిటివ్ సైన్స్లో పీజీ కోర్సుకు రూపకల్పన చేసింది. తాజాగా ఐఐటీ కాన్పూర్ కాగ్నిటివ్ సైన్స్లో పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్లను ఈ విద్యా సంవత్సరం నుంచి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
కెరీర్ కౌన్సెలింగ్
ఎంఎస్సీ సెరీకల్చర్ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -సాయి రమ్య, తెనాలి. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: ఏదైనా బయాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ. ప్రవేశం: ఎస్కేయూసెట్లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.skuniversity.org తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. సెరీ- బయోటెక్నాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: సెరీకల్చర్/అగ్రికల్చర్/హార్టీకల్చర్/ఫారెస్ట్రీ/జువాలజీ/బోటనీ/ కెమిస్ట్రీ/ క్లినికల్ పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్/ మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/ ఎంటమాలజీ/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీల్లో ఏదైనా రెండు సబ్జెక్టులతో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. ఇదే విశ్వవిద్యాలయం సెరీకల్చర్లో డిప్లొమా కోర్సు కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.kakatiya.ac.in బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్లో సెరీకల్చర్లో ఎంఎస్సీ అందిస్తోంది. అర్హత: అగ్రికల్చర్/హార్ట్టికల్చర్/అగ్రి బయోటెక్/ ఫారెస్ట్రీ/ సెరీకల్చర్లో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.uasbangalore.edu.in -
పల్లె ప్రతిభ @ RGUKT
పదో తరగతితోనే బీటెక్ దిశగా ప్రవేశానికి మార్గం వేస్తోంది.. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ). పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా... ఆర్జీయూకేటీ పరిధిలోని మూడు క్యాంపస్లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లలో ప్రవేశం లభిస్తుంది. ఆర్జీయుకేటీ బాసర క్యాంపస్ (తెలంగాణ రాష్ట్రం)కు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేది మే 31. నూజివీడు క్యాంపస్ (ఆంధ్రప్రదేశ్), ఆర్కే వ్యాలీ క్యాంపస్(ఆంధ్రప్రదేశ్)లలోనూ త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్జీయూకేటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ప్రవేశ ప్రక్రియ, విద్యావిధానం తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం... ఏపీ ట్రిపుల్ ఐటీలు.. 2008లో అప్పటి ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో ఏర్పాటైనవి. వీటి నిర్వహణ కోసం ఆర్జీయూకేటీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీని సైతం నెలకొల్పడం జరిగింది. గతేడాది నుంచి బాసర క్యాంపస్లో ప్రవేశాలను తెలంగాణ ప్రభుత్వం, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ, డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా), నూజివీడు క్యాంపస్లలో ప్రవేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రకటనల ఆధారంగా ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అందిన దరఖాస్తులను, సదరు విద్యార్థుల జీపీఏ, రిజర్వేషన్ తదితర అంశాల ప్రాతిపదికగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కోర్సు: ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ అర్హతలు: పదో తరగతి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత (2016లోనే) వయసు: డిసెంబర్ 31, 2016 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు 21 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. అంతా ఆన్లైన్లోనే: ఔత్సాహిక అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందుకోసం ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవా సెంటర్లలో నిర్దేశిత దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ఒక్కో క్యాంపస్లో వెయ్యి సీట్లు తెలంగాణలోని బాసర క్యాంపస్, ఆంధ్రప్రదేశ్లోని ఆర్కే వ్యాలీ, నూజివీడులలో ఒక్కో క్యాంపస్లో వెయ్యి సీట్లు చొప్పున మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలోని బాసర క్యాంపస్లోని సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ఏపీలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు క్యాంపస్లలోని సీట్లలో 85 శాతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, మిగతా 15శాతం అన్ రిజర్వుడ్ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు ఉన్నాయి. ప్రతిభే కొలమానం ఆర్జీయూకేటీ క్యాంపస్లలో ప్రవేశం పూర్తిగా విద్యార్థుల పదోతరగతి ప్రతిభ ఆధారంగానే లభిస్తుంది. పదోతరగతిలో పొందిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ), పదో తరగతి ప్రతి సబ్జెక్ట్లో పొందిన గ్రేడ్ ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి అడ్మిషన్ కల్పిస్తారు. గురుకుల పాఠశాలలు మినహా జిల్లా పరిషత్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోర్ను కలుపుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ డిప్రైవేషన్ స్కోర్ విధానం అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఫీజు బీటెక్ ప్రోగ్రామ్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఏటా రూ. 37 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు; రూ. రెండు లక్షలలోపు ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రకారం ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని.. ఫీజు చెల్లించలేని విద్యార్థులకు బ్యాంకులతో ఒప్పందం ద్వారా రుణ మంజూరు సదుపాయం అందించే ప్రయత్నం కూడా జరుగుతోంది. బోధన, కరిక్యులంలో నిరంతరం కొత్త మార్పులు శ్రీకారం చుడుతూ నిత్యనూతన విధానాలు అమలు చేస్తున్నాం. మొత్తం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో బీటెక్ సమయంలో ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ వంటి కార్యకలాపాలు చేపడుతూ విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించే విధంగా శిక్షణ ఇస్తున్నాం. - ప్రొఫెసర్ పి.విజయ ప్రకాశ్, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ(ఏపీ), ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రవేశాలు, విధానాల పరంగా ఎలాంటి మార్పులు లేవు. అంతా గతేడాది మాదిరిగానే ఉంటుంది. విద్యార్థులు అవసరమైన పత్రాలతో సిద్ధంగా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు. - ప్రొఫెసర్. ఎస్. సత్యనారాయణ రెడ్డి, ఇంఛార్జ్ వీసీ, ఆర్జీయూకేటీ బాసర ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు స్వరూపం ఆర్జీయూకేటీ క్యాంపస్లలో ఇంటిగ్రేటెడ్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇందులో తొలి రెండేళ్లు పీయూసీ(ఇంటర్మీడియెట్)గా పరిగణిస్తారు. విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్లు అందుబాటులో ఉంటాయి. తొలి రెండేళ్ల పీయూసీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. మూడో ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈసీఈ, కెమికల్, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, మెటీరియల్ సైన్ అండ్ మెటలర్జికల్లలో తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ను ఎంపిక చేసుకోవచ్చు. -
బ్యాచిలర్ డిగ్రీతో బెటర్ ఫ్యూచర్!!
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్.. కాంపిటీషన్ కింగ్.. బీఏ పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్లో సోషల్సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్వర్క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్గా పనిచేయొచ్చు. కెరీర్ షైనింగ్.. కామర్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు. భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ ‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్ఐఆర్ నెట్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు. డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి. - ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
కెరీర్ కౌన్సెలింగ్
హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - సాగర్, విజయవాడ హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో బీఎస్సీ అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org హైదరాబాద్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా.. హోటల్ మేనేజ్మెంట్లో వివిధ కోర్సులను అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా వెబ్సైట్: iactchefacademy.com యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - రాంమోహన్,విజయవాడ జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. యానిమేషన్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.iacg.co.in హైదరాబాద్లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.aisfm.edu.in ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్డీ చేయడం ఎలా? - ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సులకు సీఎస్ఐఆర్-నెట్ జేఆర్ఎఫ్/డీబీటీ జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు వివరాలకు: www.iisc.ernet.in మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రణాళిక
కాంపిటీటివ్ గెడైన్స్ : యూపీఎస్సీ- సివిల్స్ 100 శాతం ఆత్మవిశ్వాసంతో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. పటిష్ట ప్రణాళికతో చదివితే తప్పకుండా ప్రిలిమ్స్లో విజయం సాధిస్తామనే నమ్మకం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా, కేవలం కటాఫ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని కాకుండా పూర్తిస్థాయిలో మంచి స్కోర్ సాధించేందుకు శ్రమించాలి. పేపర్ 1: 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్తో వచ్చిన మార్పులు కారణంగా ప్రిలిమ్స్లో విజయానికి జనరల్ స్టడీస్ పేపర్-1 కీలకంగా మారింది. ఈ పేపర్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు ఎంపిక చేస్తారు. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. సిలబస్లోని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టుసాధించడం ద్వారా ప్రిలిమ్స్ను తేలిగ్గా అధిగమించవచ్చు. తేదీలు, ఫ్యాక్ట్స్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే కేవలం ఫ్యాక్ట్స్, తేదీలు, పేర్లను గుర్తుంచుకోవడం కాదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్కు సంబంధించి వివిధ అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తూ వెళ్తే ప్రిపరేషన్ సాఫీగా సాగిపోతుంది. మెయిన్స్ కోణంలో వివిధ అంశాలపై పరిజ్ఞానం, అభిరుచిని పరీక్షించేలా ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్ను దృష్టిలో ఉంచుకొని, ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల రెండు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్ సబ్జెక్టులను చదవడం కూడా తేలికవుతుంది. * ప్రిలిమ్స్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి కచ్చితమైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటే, మెయిన్స్లో సరైన సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ అదే తేడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు తప్పించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు, అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్కు ఒకే విధంగా ఉంటాయి. * జనరల్ స్టడీస్కు దగ్గరగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మంచిది. * ప్రిలిమ్స్ (మల్టిపుల్ చాయిస్), మెయిన్స్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ (వెర్బల్ ప్రజెంటేషన్).. సివిల్స్లో ఈ మూడింటి రూపాలు వేరైనా.. వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సిద్ధమవాలి. * ప్రిలిమ్స్లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలకు వెయిటేజీ లేదు. ఒక అంశం నుంచి కచ్చితంగా వచ్చే ప్రశ్నల సంఖ్యను చెప్పలేం. ఈ పరిస్థితిలో ప్రిలిమ్స్, మెయిన్స్కు ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఉమ్మడి అంశాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, రాజనీతి శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు. ఎన్ని అంశాలను చదివామనే దానికంటే, చదివిన అంశాలను ఎంత బాగా అధ్యయనం చేశామన్నది విజయానికి కీలకం. పేపర్-2 (సీశాట్): సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) పేపర్ను అర్హత పేపర్గా మార్చడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మేలు జరుగుతోంది. ఈ పేపర్లో 33 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్దేశించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్ విభాగాన్ని తొలగించారు. ఈ మార్పుల వల్ల పేపర్-2 ప్రిపరేషన్ తేలికైంది. అయితే ఇది అర్హత పేపర్ కాబట్టి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పేపర్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కనీస స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీడింగ్ స్కిల్స్ను పెంపొందించుకోవాలి. * పేపర్-2 ప్రశ్నలకు సమాధానాలు రాసే విషయంలో వేగం, కచ్చితత్వం అవసరం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ నైపుణ్యాలు అలవడతాయి. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్టెస్ట్లు రాయాలి. మ్యాగజైన్లలో ప్రచురించిన క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ * సీశాట్లో రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా చిన్నది. ప్యాసేజ్ను చదివే ముందు మొదట ఒకసారి ప్రశ్నలన్నింటినీ పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికకు అవసరమైన సమాచారాన్ని గుర్తించడం తేలికవుతుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని విజయవంతంగా అధిగమించడానికి ఫ్రంట్లైన్, ఇండియా టుడే, వీక్ వంటి మ్యాగజైన్లను చదవాలి. ఇవి జనరల్ స్టడీస్కు కూడా ఉపయోగపడతాయి. * నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు పరీక్ష గురించి ఆందోళన చెందనవసరం లేదు. పరీక్షలో కేవలం బేసిక్ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేస్తే తేలిగ్గానే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగాల ప్రిపరేషన్కు ఎం.కె.పాండే, ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. * ప్రిలిమ్స్కు ఒకసారి చదవడం పూర్తిచేశాక, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్టెస్ట్లు రాయాలి. ప్రిపరేషన్కు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. రిఫరెన్స్ * అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే (లాజికల్, అనలిటికల్ రీజనింగ్) * ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్/లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్) * క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్శర్మ (టీఎంహెచ్) * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) * పజిల్స్ టు పజిల్ యూ - శకుంతలా దేవి * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) - శ్రీరాం శ్రీరంగం డెరైక్టర్, శ్రీరాం ఐఏఎస్, న్యూఢిల్లీ -
మెకానికల్.. మెరిసే..!!
ఇంజనీరింగ్ స్పెషల్ నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్, గడియారాలు, సంగీత పరికరాలు, గన్స్, సైకిల్ మొదలైనవన్నీ మెకానికల్ ఇంజనీర్ల సృష్టే! మార్కెట్ ఒడిదొడుకులతో పెద్దగా ప్రభావితం కాకుండా స్థిరమైన అవకాశాలు అందించే బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, కెరీర్ స్కోప్ వివరాలు.. కోర్సు ఇలా జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ అర్హత పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రఖ్యాత ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లో సీటు లభిస్తుంది. థర్మో డైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, థర్మల్ ఇంజనీరింగ్ తదితర కోర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, టూల్ డిజైనర్.. మొదలైన వాటిలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లోని పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, వీఎస్ఎస్సీ, ఇస్రో, ఐవోసీ, డీఆర్డీవో, సెయిల్, ఎన్టీపీసీ, డిఫెన్స్, పీడబ్ల్యుడీ, సీపీడబ్ల్యుడీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ల్లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు గేట్, పీజీఈసెట్ ద్వారా ఎంటెక్లో చేరొచ్చు. హైడ్రాలిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరో డైనమిక్స్ తదితర స్పెషలైజేన్లలో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అలాగే మేనేజ్మెంట్ విద్య పట్ల ఆసక్తి ఉంటే... క్యాట్, మ్యాట్, ఎక్స్ఏటీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి పరీక్షల్లో ప్రతిభను చూపడం ద్వారా ఎంబీఏలో చేరొచ్చు. విధులు మెకానికల్ ఇంజనీర్లు వారు పనిచేసే ఇండస్ట్రీ, స్పెషలైజేషన్ ఆధారంగా వేర్వేరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, ప్రొడక్షన్, అనాలసిస్ అండ్ టెస్టింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ టాటా గ్రూప్, గోద్రెజ్ గ్రూప్, ఎల్ అండ్ టీ, సీమెన్స్, జీఈ, హ్యుందాయ్ మోటార్స్, ఫోర్డ్, ఆశోక్ లేల్యాండ్, రాయల్ ఎన్ఫీల్డ్, మహింద్రా అండ్ మహింద్రా, జిందాల్ మొదలైనవి. మెకానికల్ ఇంజనీరింగ్కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఏరియా.. కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్ (సీఎఫ్డీ) ద్వారా డిజైన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హానీవెల్, జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) లాంటి పెద్ద కంపెనీలు సీఎఫ్డీపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నాయి. - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? - ఎన్. ప్రియబాంధవి, అనంతపురం సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు. -
పాలిటెక్నిక్.. జాబ్ గ్యారెంటీ!!
తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణలో ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో ఏపీ పాలిసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ తరుణంలో పాలిసెట్కు హాజరైన విద్యార్థులు ఇప్పటి నుంచే కోర్సుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. అందుబాటులోని డిప్లొమా కోర్సులు.. వాటి ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై దృష్టిసారించాలి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులపై స్పెషల్ ఫోకస్.. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వేస్, భవన నిర్మాణం, సర్వేయింగ్, వాటర్ సప్లయ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు. స్కిల్స్: విస్తృతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం. బృంద నైపుణ్యాలు, పర్యవేక్షణ నైపుణ్యాలు ఉండాలి. కెరీర్: సైట్ ఇంజనీర్గా మొదలై... ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగొచ్చు. ఉన్నత విద్య: బీటెక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: వర్కషాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెషిన్ డిజైన్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. స్కిల్స్: మెకానికల్ ఇంజనీర్లు టూల్స్, ఇంజన్స్, మెషిన్స్ డిజైనింగ్ విభాగాల్లో పనిచేస్తారు. కాబట్టి డిజైన్ నాలెడ్జ్, డ్రాయింగ్పై పట్టుండాలి. టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం.క్యాడ్/క్యామ్ నేర్చుకోవడం లాభిస్తుంది. ఉద్యోగాలెక్కడ: మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్, యాన్సిలరీ యూనిట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ. ఉన్నత విద్య: బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ వంటి బ్రాంచ్లు) కెరీర్: ట్రెయినీగా చేరి.. 5-6 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, డిజైనింగ్, కమ్యూనికేషన్ మైక్రోప్రాసెసర్స అండ్ మైక్రో కంట్రోలర్, ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ఉన్నత విద్య: బీటెక్ (ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ఇంజనీరింగ్) స్కిల్స్: అధునాతన టెక్నాలజీపై మంచి అవగాహన ఉండాలి. ఉద్యోగాలెక్కడ: కమ్యూనికేషన్ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు. కెరీర్: ట్రైనీ ఇంజనీర్గా కెరీర్ మొదలై... స్కిల్స్తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: పవర్ జనరేషన్, పవర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెషిన్స-వర్కింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్లను కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు. ఉద్యోగాలెక్కడ : జెన్కో, ట్రాన్స్కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు విద్యుత్ ఉపకరణ ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు. స్కిల్స్: లాజికల్, అనలిటికల్ స్కిల్స్. కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై... అనుభవంతో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. ఉన్నత విద్య: బీటెక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు కోర్సు: ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, ప్రోగ్రామింగ్ ల్వాంగేజెస్ అండ్ సాఫ్ట్వేర్స, వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్సపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థలు, కంప్యూటర్ ట్రైనింగ్ సంస్థలు. స్కిల్స్: కంప్యూటర్ పట్ల ఇష్టంతోపాటు మ్యాథమెటిక్స్పై మంచి పట్టుండాలి. లాజికల్, అనలిటికల్ స్కిల్స్తోపాటు బృంద నైపుణ్యాలు చాలా అవసరం. కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్తో మొదలై... సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు. ఉన్నత విద్య: బీటెక్ (సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఐటీ బ్రాంచ్లు) వెబ్ కౌన్సెలింగ్.. సీట్ల భర్తీ పాలిసెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వెబ్ బేస్డ్ విధానంలో కౌన్సెలింగ్ (వెబ్ కౌన్సెలింగ్) ద్వారా సీట్ల భర్తీ చేస్తారు. ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తొమ్మిది దశల్లో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్స్ (ఏపీ పాలిసెట్ విద్యార్థులు www.appolycet.nic.in టీఎస్ పాలిసెట్ విద్యార్థులు www.polycetts.nic.in) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలి. నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరం పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్యను కోరుకుంటే.. నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించే అవకాశముంది. ఇందుకోసం ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. బీటెక్ తర్వాత తమ బ్రాంచ్ల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంటెక్, ఎంఈ కోర్సులు చేయొచ్చు. ఏపీ పాలిసెట్ ఫలితాలు త్వరలో.. ఏపీ పాలిసెట్ ఫలితాలను త్వరలో ప్రకటిస్తాం. పాలిటెక్నిక్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా అందుబాటులో ఉన్న కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాలి. తమకు ఇష్టమైన బ్రాంచ్ ఎంపికపై స్పష్టతకు రావాలి. కౌన్సెలింగ్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ వ్యవధిలో కోర్సులపై అవగాహన, కళాశాలల నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడంపై దృష్టిసారిస్తే వెబ్ కౌన్సెలింగ్ సమయంలో మంచి కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. పలు జాబ్ ఓరియెంటెడ్ ఆధునిక డిప్లొమా కోర్సులు (ఉదాహరణకు ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ వంటివి) కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిపైనా దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ఎ.నిర్మల్ కుమార్ ప్రియ, జాయింట్ సెక్రటరీ, ఎస్బీటీఈటీ-ఏపీ గత ఏడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం.. కొన్ని ముఖ్య బ్రాంచ్ల్లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బ్రాంచ్లు, సీట్ల వివరాలు..మరికొన్ని కోర్సులు.. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ : ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్ సంస్థలు, ఆటోమొబైల్ పరిశ్రమలు. ఉన్నత విద్య: బీటెక్ (ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: ఉత్పత్తి సంస్థలు, ఎలక్ట్రానిక్స్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, ఎలక్ట్రికల్ ఉపకరణాల ఉత్పత్తి సంస్థలు. ఉన్నత విద్య: బీటెక్ (అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ బ్రాంచ్లు) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థలు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సంస్థల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు. ఉన్నత విద్య: బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మైనింగ్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు ఉద్యోగాలెక్కడ: మైనింగ్ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో ఉద్యోగాలు. ఉన్నత విద్య: బీటెక్ (మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషీనరీ ఇంజనీరింగ్) మూడున్నరేళ్ల కోర్సులివే: డిప్లొమా ఇన్ మెట్లర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ. స్పెషలైజ్డ్ కోర్సులు: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రస్తుతం పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఫుట్వేర్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ. -
పరీక్షల తేదీలు
⇒ టీఎస్ ఎంసెట్: మే 15 ⇒ టీ ఎస్ టెట్: మే 22 ⇒ ఓఎన్జీసీలో అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పరీక్ష : మే 22 ⇒ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్: జూన్ 12 ⇒ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్: జూన్ 26 -
హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ హిస్టరీ గుప్తుల అనంతర యుగం (క్రీ.శ. 6వ శతాబ్దం - 8వ శతాబ్దం) గుప్తుల తర్వాత భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలించారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు. అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తున్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తు, శిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల తర్వాత యుగంలో ఉత్తరాదిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ గొప్పది. పుష్యభూతి వంశం పుష్యభూతి ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు. ప్రభాకర వర్థనుడు పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్య యశోమతి. ప్రభాకర వర్థనుడు క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రాజ్యవర్థనుడు ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు.. గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్ను స్వాధీనం చేసుకున్నాడు. శశాంకుడు.. రాజ్యవర్థనుడిని హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు. హర్షవర్థనుడు హర్షవర్థనుడు గౌడ శశాంకుడి నుంచి కనౌజ్ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్కు మార్చాడు. శశాంకుడి తర్వాత గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తోంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి అతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. పాలనా విధానం ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఒక రాజుకు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని ‘భుక్తి’ అని పిలిచేవారు. రాష్ట్రాలను ‘విషయ’ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను ‘పాథక’ అని విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం. పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించేవారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం.. ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్ను కూడా విధించారు. - కె. యాకూబ్బాష, సబ్జెక్టు నిపుణులు -
ఎడ్యు న్యూస్
ఎస్ఎస్సీ ఫలితాల ప్రకటన తేదీలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల తేదీలు.. ⇒ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) 2015 తుది ఫలితాలు మే 30 ⇒ జూనియర్ ఇంజనీర్స్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2015 పేపర్-1 ఫలితాలు మే 16 ⇒ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూలై 22 ⇒ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ సి, డి) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూన్ 8.