Brain
-
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
జీర్ణక్రియ, పోషకాల శోషణకు నమలడం ప్రయోజనకరమని చాలామందికి తెలుసు. కానీ నమలడం వల్ల మెదడుపై కూడా ఆశ్చర్యకరమైన ప్రభావం ఉంటుందని తెలుసా? అదీ కలప వంటి గట్టి ఆహారాలను నమలడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది.ఫ్రాంటియర్స్ ఇన్ సిస్టమ్స్ న్యూరోసైన్స్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం మృదువైన ఆహారాలను నమలడంతో పోలిస్తే , గట్టి ఆహారాలను నమలడం అనేది మెదడుకి, జ్ఞాపకశక్తికి చాలా మంచిదని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గట్టి పదార్థాలను నమలడం వల్ల మెదడులో కీలకమైన గ్లూటాథయోన్ (GSH) లెవల్స్ గణనీయంగా పెరిగాయి.ఈ అధ్యయనం ఎలా జరిగిందిమెదడు తనను తాను రక్షించుకోవడానికి కొన్ని యాంటీఆక్సిడెంట్లను ఉపయోగిస్తుంది. వాటిలో ఒకటి గ్లూటాథయోన్. ఈ అధ్యయనంలో పరిశోధకులు దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 52 మంది ఆరోగ్యవంతమైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహానికి చెందిన వారికి పారాఫిన్ వాక్స్ గమ్ నమలమని, చెక్కతో చేసిన టంగ్ డిప్రెసర్లను నమలాలని మరో గ్రూపునకు చెప్పారు. ముప్పై సెకన్లు నమలడం, స్వల్ప విరామం, మళ్లీ నమలడం ఇలా ఐదు నిమిషాల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నమలడానికి ముందు, ఆ తర్వాత అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (అభిజ్ఞాన నియంత్రణకు ముఖ్యమైన మెదడు ప్రాంతం)లో గ్లూటాథయోన్ స్థాయిని, అభిజ్ఞాన పనితీరును అంచనా వేశారు. దీని ప్రకారం చెక్కను నమిలిన గ్రూపులో గ్లూటాథయోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. చూయింగ్ గమ్ నమిలిన గ్రూపులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇది ఒక రకంగా మెదడు కణాలకు రక్షక కవచంగా, మెరుగైన జ్ఞాపకశక్తి పనితీరుకు పనిచేస్తుందట.మొత్తంగా ఈ అధ్యయనం రెండు ప్రధాన ఫలితాలను ఇచ్చిందనీ మొదటిది కలప నమలడం సమూహం మెదడు గ్లూటాథియోన్ స్థాయిలు పెరగడం, రెండోది మెదడు పనితీరుతో మెరుగుపడటం జరిగిందన్నారు. మెదడు GSH స్థాయిలను పెంచడానికి ప్రస్తుతం మందులు లేదా నిర్దేశిత పద్ధతులేవీ లేనందున, గట్టి పదార్థాన్నినమలడం అనేది ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగ పడుతుందనిపరిశోధనలు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వృద్ధులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి, అభిజ్ఞా పనితీరును కాపాడుకోవడానికి బాగా నమలగలగడం చాలా ముఖ్యం. నిజానికి, దంతాల నష్టం అల్జీమర్స్ వ్యాధికి ఒక ప్రధాన ప్రమాద కారకం. బయోమెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రకారం, నమలడం అనేది హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్తో సహా అభిజ్ఞా ప్రక్రియకు అవసరమైన అనేక మెదడు ప్రాంతాలను సక్రియం చేస్తుంది. నమలడం వల్ల మెదడు కార్యకలాపాలను, రక్తప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడుకు చక్కటి ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. నోట్ : ఇది పరిమితంగా నిర్వహించిన పరిశోధన మాత్రమే అని గమనించగలరు. బలపాలు, సున్నం,బియ్య లాంటి వాటిని అసాధారణంగా తినడాన్ని అనారోగ్యానికి చిహ్నం. ఆహార పోషకాలు లోపాలు, ఒత్తిడి కారణంగా ఇలాంటి అలవాట్లు వస్తాయి. అలాగే చెక్కను నమలడం, లిగ్నోఫాగియా అని కూడా పిలుస్తారు. చెక్కను నమలడం వల్ల దంతాలు దెబ్బతింటాయి . ఇది బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువ. పైగా కొన్నిమొక్కలు విషపూరితంగా కూడా ఉంటాయి. ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య -
బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.డైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడమే..పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.తేడా వస్తే ఊబకాయమే..!జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీఇది ‘సెట్’ అయ్యేదెట్లా?అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి. -
Termin Injection : సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి.. లేదంటే ముప్పే!
డాక్టర్ గారూ, నేను డిగ్రీ చదివి కానిస్టేబుల్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం క్రితం మా ఊర్లో ఉన్న ఒక ఫేమస్ జిమ్లో చేరాను. తొందరగా బాడీ పెరగడం కోసం ‘టెర్మిన్’ అనే ఇంజక్షన్ ఉంటుంది అని, అక్కడ పని చేసే ట్రెయినర్ ఒకతను చెబితే అది తీసుకోవడం మొదలు పెట్టాను. మొదట్లో చాలా బాగా అనిపించింది. జిమ్లో ఎంతసేపు వర్కవుట్స్ చేసినా అలసట వచ్చేది కాదు. నిద్రలేకపోయినా చాలా హుషారుగా ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు ఇక ఇంజక్షన్ సరిపోయేది కాదు. రెండు నుంచి మూడు ఇంజక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. దానివల్లేనేమో, ఆకలి బాగా తగ్గిపోయింది. బరువు తగ్గాను. బాగా చికాకుగా ఉంటోంది. ఇంజక్షన్ తీసుకోకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. చెవిలో వింతవింత శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు, నన్ను చంపడం కోసం వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడెయ్యండి. – రమేష్, విశాఖపట్నంముందుగా మీ తప్పు మీరు తెలుసుకుని మారాలి అని అనుకుంటున్నందుకు మీకు నా అభినందనలు. మీరు పంచుకున్న ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. మన దేశంలో ఇటీవల చాలామంది యువత ఇలాంటి ఇంజెక్షన్స్కి అడిక్ట్ అయి బాధపడుతున్నారు. తమ అభిమాన నటుడు ఎవరో సిక్స్ ప్యాక్ శరీరం పెంచారని, తాము కూడా అలా పెంచుకోవాలి అనే యావలో లేదా ఎవరినయినా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో జిమ్లలో చేరడం తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశ్యంతో అడ్డదారులైన ఇలాంటి ఇంజెక్షన్లను ఎంచు కుంటున్నారు. మీరు తీసుకున్న టెర్మిన్ ఇంజక్షన్ సైకోస్టిమ్యులెంట్ డ్రగ్ కిందకు వస్తుంది. ఈ మందు మెదడులో సెరటోనిన్, డోపమైన్, నార్ అడ్రినలిన్ అనే రసాయనాలను ఎక్కువ మోతాదులో విడుదల అయ్యేలా చేస్తుంది. దానివల్ల వారికి అమితమైన బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఎంత పని చేసినా అలసట రాదు. దాంతో గంటలు గంటలు జిమ్లో వర్కవుట్స్ చేయగలుగుతారు. అయితే క్రమేణా కొంతకాలానికి శరీరం చల్లబడటం, బీపీ తగ్గిపోవడం, బాగా అలసటగా అనిపించడం జరుగుతుంది. బీపీ విపరీతంగా పెరగడం, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, వెంట్రుకలు ఊడిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనపడతాయి. ఒక్కోసారి గుండెలయలో మార్పులు వచ్చి ప్రాణం మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమందిలో చెవిలో మాటలు వినపడటం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ రావడం చూస్తుంటాము. దీనినే సైకోపిన్ అంటారు. మీరు వీలైనంత తొందరగా ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే ఈ సైకోసిస్ లక్షణాలను తగ్గించేలా సరైన వైద్యం చేసి తర్వాత అవసరమైతే కొంతకాలం పాటు మిమ్మల్ని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి కౌన్సెలింగ్, యోగ, ఇతరత్రా వైద్యవిధానాల ద్వారా పూర్తిగా ఈ అడిక్షన్ సమస్య నుంచి బయటకి తీసుకు రావచ్చు. ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదిస్తే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. గుడ్లక్. -డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్ను కూడా పరిశీలించారు. రీసెర్చ్కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
మనిషి మెదడులో రహస్య గదులు..
-
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్పర్సన్గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్
ఇది మామూలు హెల్మెట్ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్. ఈ హెల్మెట్ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ఈ హెల్మెట్ను ‘ఐ సింక్వేవ్’ పేరుతో రూపొందించింది.మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్ ప్యాచ్లు, జెల్ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.ఇది రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్లు (రూ. 41.04 లక్షలు). -
Health: డొక్క శుద్ధి.. బుర్రకు బుద్ధి!
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..కడుపు–మెదడు కనక్షన్ ఇలా..– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది – కడుపు నిండగానే ‘జీఎల్పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందంటే..మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.గట్ హెల్త్ దెబ్బతింటే..పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్లో కివి, ఆఫ్రికాట్లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి.. -
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
అంధమైన వెలుగు
చికాగో వేదికగా అంధులకు చూపు తెప్పించేందుకు ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న తొలి ప్రయోగాలు బ్రియాన్ బసార్డ్ అనే వ్యక్తిపై జరుగుతున్నాయి. పదహారో ఏట అతడి ఎడమకన్ను పోయింది. ఎలాగోలా నెట్టుకొస్తుండగా 48వ ఏట అతడి రెండో కన్నూ దృష్టిజ్ఞానాన్ని కోల్పోయింది. వైర్డ్ మ్యాగజైన్ కథనం ప్రకారం... ఇలాంటి అంధుల మెదడులో అమర్చే కొన్ని చిప్స్, బయట ఉండే వైర్లెస్ ఉపకరణం సహాయంతో చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం చికాగో ట్రయల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు స్పెయిన్లోని మిగ్యుయెల్ హెర్నాండెజ్ యూనివర్సిటీ పరిశోధకులూ ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కార్టిజెంట్ అనే సంస్థ ‘ఓరియాన్’ అనే ఉపకరణాన్ని రూపోందించి, ఆరుగురు వలంటీర్లకు ప్రయోగాత్మకంగా అమర్చింది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘న్యూరాలింక్’ సంస్థ కూడా అంధులకు దృష్టిజ్ఞానం తెప్పించే దిశగా పనిచేస్తోంది. ఇందుకోసం బ్రెయిన్ ఇం΄్లాంట్స్ రూపోందించి ప్రయోగాలు చేస్తోంది. వాళ్ల దగ్గర తయారవుతున్న ఇంపాంట్కు ‘బ్లైండ్సైట్’ అని పేరు పెట్టారు. కోతులకు అమర్చిన ఈ ‘బ్లైండ్సైట్’తో మంచి ఫలితాలే వచ్చాయనీ, ఇకపైన దాన్ని మానవులపై ప్రయోగించి చూడాల్సిందే మిగిలి ఉందని ‘న్యూరాలింక్స్’ పేర్కొంది. అయితే చూడటం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాలపట్ల చాలామంది నిపుణుల నుంచి సందేహాత్మకమైన అభి్రపాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో దృష్టిజ్ఞానం ఉండి తర్వాత చూపు కోల్పోయిన వారికే ఈ ఇం΄్లాంట్స్ అమర్చుతున్నారు. అయితే ఈ బ్లైండ్సైట్ ఉపకరణం కేవలం గతంలో చూపున్న వారికి మాత్రమే కాకుండా పుట్టు అంధులకూ దృష్టిజ్ఞానం కలిగించగలదన్నది ఎలాన్ మస్క్ చెబుతున్న మాట. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తయారవుతున్న ఉపకరణాలన్నీ రెటీనా, ఆప్టిక్ నర్వ్ ప్రమేయం లేకుండానే నేరుగా మెదడుకు దృష్టిజ్ఞానం కలిగించేలా రూపోందుతున్నాయి. మెదడులో అమరుస్తున్న చిప్స్... కొన్ని విద్యుత్తరంగాలతో అక్కడి న్యూరాన్లను ఉత్తేజితం (స్టిమ్యులేట్) చేయడం... ఫలితంగా మెదడులోని విజువల్ కార్టెక్స్లో చూస్తున్న దృశ్యం ఒక చుక్కల ఇమేజ్లా కనిపిస్తుంది. (విజువల్ కార్టెక్స్ అంటే... రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా కాంతి మెదడుకు చేరాక దృష్టిజ్ఞానం కలిగించేందుకు మెదడులోప్రాంసెసింగ్ జరిగే మెదడులోని ప్రాంతం.అయితే ఇప్పుడిది ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో జరుగుతున్న ప్రక్రియ కావడంతో ఇందులో వాస్తవ కాంతి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగి΄ోతుంది. వీటి సాయంతో కనిపిస్తుందనే ఆ ఇమేజ్ కూడా అస్పష్టమైనది. ఆ డివైజ్ కారణంగా కనిపించే అస్పష్ట దృశ్యాలూ, దృష్టిజ్ఞానపు పరిమితులూ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం జరుగుతున్నవారికి ప్రతిరోజూ కొన్ని సూచనలివ్వడం జరుగుతోంది. ఉదాహరణకు వారు గుర్తిస్తున్నదేమిటీ, ఒకవైపు వెళ్లమన్న తర్వాత వారు ఆ దిశగా వెళ్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలేమిటన్న అంశాలను బట్టి... డివైస్లను మరింత మెరుగుపరిచేందుకు రోజూ ప్రయోగాలు జరుగుతున్నాయి. దృష్టిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరిచే దిశగా వారికి ఎదురవుతున్న సవాళ్లలో మరో అంశం ఏమిటంటే... ఒక పక్క దృష్టిజ్ఞానం కల్పిస్తూనే, ఈ స్టిమ్యులేషన్స్ వల్ల వారికి వేరే అనర్థాలు రాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉదాహరణకు... ఈ ఎలక్ట్రిక్ స్పందనలు మెదడులోని ప్రదేశాలకు తాకినప్పుడు అవి సీజర్స్, మూర్ఛ వంటివి వచ్చేలా మెదడును ప్రేరేపించకూడదు. కంటిన్యూవస్గా ఎలక్ట్రిక్ తరంగాలకు గురవుతున్నందు వల్ల మెదడులో స్కార్ ఏర్పడే అవకాశముందా, అప్పుడు మెదడుకు హానిచేయని విధంగా ఈ ఉపకరణాల రూపకల్పన ఎలా అన్న సవాలు కూడా మరో ప్రతిబంధకం. ప్రస్తుతానికి ఇలాంటి పరిమితులు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో చూపులేనివారికి దృష్టిజ్ఞానం కల్పించగలమనే నమ్మకం పెరుగుతోందన్నది పరిశోధకుల మాట.ఎలాన్ మస్క్ ట్వీట్ మా ‘బ్లైండ్సైట్’ ఇంప్లాట్స్ ఇప్పటికే కోతుల్లో బాగా పనిచేస్తోంది. మొదట్లో స్పష్టత (రెజెల్యూషన్) కాస్త తక్కువే. అంటే తొలినాళ్లలో వచ్చిన ‘నింటెండో గ్రాఫిక్స్’ మాదిరిగా. కానీ క్రమంగా మానవుల నార్మల్ దృష్టిజ్ఞానంలాగే ఉంటుంది. (ఇంకా ఏమిటంటే... ఈ న్యూరాలింక్ వల్ల ఏ కోతీ చనిపోలేదూ, ఇంకేకోతికీ హాని జరగలేదు).పైది ‘ఎక్స్’ (ట్వీటర్)లో 2024 మార్చి 21న ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్. -
డ్యాన్స్ చేస్తే ఆ వ్యాధులు రావు! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జిమ్కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్నెస్ కోసం నృత్యానికి మించిన వర్కౌట్ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్కి, కొన్ని స్టెప్లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్ చేస్తారు. ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి చెక్ పెడుతుంది..డ్యాన్స్ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్ మూవ్మెంట్లు డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్ డ్యాన్స్. రెగ్యూలర్ డ్యాన్స్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ ఉండేందుకు ఉపకరిస్తుంది. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(చదవండి: రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
భారత్లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
Soaked Walnuts : వాల్ నట్స్ నానబెట్టి తినాలా? మామూలుగా తినాలా?
వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెదడు ఆకారంలో ఉండే దీనివలన జ్ఞాపకశక్తికి మంచి ఉపయోగం ఉటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వాల్నట్స్లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రధానంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటి వాల్నట్ను నానబెట్టి తింటే దాని లాభాలు రెట్టింపవుతాయి. వాల్నట్లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినడం ఉత్తమమైన మార్గం. 2-4 వాల్నట్ ముక్కలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.నానబెట్టిన వాల్నట్-ఆరోగ్య ప్రయోజనాలుమెదడుకు మంచిది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి. బరువు : తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన వాల్నట్స్ బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కారణంగా పెద్దగా ఆకలి వేయదు. వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఖనిజాలు ఫైబర్ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగు ఎముకలకు బలమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో లభిస్తాయి.చర్మ ఆరోగ్యం: ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. మెలటోనిన్, పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఎండనుంచి చర్మాన్ని రక్షించడంలో సాయపడతాయి.మధుమేహులకు వాల్నట్ గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తికి మంచిది వాల్నట్స్లో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.నిద్రకు: వాల్నట్స్లో సహజసిద్ధమైన మెలటోనిన్ రసాయనం కారణంగా మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ చాలా సంవత్సరాలుగా మనకు మంచి నిద్రను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాదరణ పొందింది. నానబెట్టిన వాల్నట్లను ఉదయం , పడుకునే ముందు తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యం: నానబెట్టిన వాల్నట్న్ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ వాల్నట్లతో పోలిస్తే, నానబెట్టిన తరువాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆ పోషకాలను బాడీ కూడా సులభంగా గ్రహిస్తుంది. ఇందులోని ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచుతాయి. -
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్ను వైద్యులు తొలగించారు. చిప్లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్ -
మీ బ్రెయిన్ ఆక్టివ్గా ఉండాలంటే.. ఇలా చేయండి!
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! -
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ చాలా బిజీ అనే చెప్పొచ్చు. పక్కోడితో మాట్లాడే టైం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు మనుషులు. ఇలా బిజీగా ఉన్నాం అని చెప్పడాన్ని కొందరూ స్టేటస్ ఆఫ్ సింబల్గా ఫీలవ్వుతారు. ఎంత బిజీ అంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులుగా భావిస్తారని అపోహలకు పోయి బిజీగా ఉండాలని పనులన్ని నెత్తిమీద వేసుకోండి. ఇలా క్షణం తీరిక లేకుండా ఉండటం చాలా ప్రమాదమని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు బిజీ అన్న ఫీలింగే అత్యంత డేంజరని చెబుతున్నారు. ఎందువల్ల అంటే..? చాలామంది వర్క్ లైఫ్లో బిజీగా ఉన్నామని కనీసం స్నేహితులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదని వాపోతుంటారు. చాలామంది తమ భాగస్వామికి, కడుపున పుట్టిన పిల్లలకు కాస్త కూడా టైం ఇవ్వరు. దీన్ని క్షణం తీరిక లేనితనం అంటారు. ఇది క్రమేణ వర్క్ లైఫ్పై ప్రభావం చూపి, నాణ్యతలేని పనితీరుకి దారితీసి మీ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే పనిచేయడం అన్నది ముఖ్యమే. కానీ సమయాన్ని సమృద్ధిగా వినియోగించుకునేలా చేసుకుని సకాలంలో అన్నింటిని చేయగలిగేలా కేటాయించుకోవాటలి. అందుకు మూడు సులభమైన వ్యూహాలు ఉన్నాయంటున్నారు యేల్స్ యూనిర్సిటి సైకాలజీ ప్రొఫెసర్ శాంటోస్. మానసిక శ్రేయస్సుని పెంపొందించేలా క్షణం తీరిక లేని బిజీని అధిగమించేలా చేయాలి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వర్కౌట్లు, ఫోన్కాల్లు, మీటింగ్లు వంటి వాటిన్నింటికి ప్రాముఖ్యత వారిగా టైం ఇచ్చుకోండి. కనీసం వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని నిమిషాలు మిగిలేలా చేసుకుండి. ఆ కొద్ది సమయంలో చేయాలనుకుంటున్న ఎంజాయ్మెంట్ని ఫుల్ జోష్గా చేయండి. అంటే వాకింగ్, లేదా కాసేపు మీతో మీరు గడపటం లేదా మీకు నచ్చిన వాళ్లతో తుళ్లుతూ హాయిగా గడటం వంటివి చేయండి. ఇది మీకు మానసికంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది. పైగా పనితీరు నాణ్యత మెరుగుపడుతుంది. ఎంతటి బిజీలో అయిని కొన్ని నిమిషాల ఫ్రీడమ్ని జరుపుకోవాలి. అది మీకు మంచి రిలీఫ్ని ఇస్తుంది. అంటే ఒక మీటింగ్ లేదా ఏదైన షెడ్యూల్ పూర్తి అయిని వెంటనే రిలాక్స్ అవ్వండి. కొద్ది విరామం లేదా స్పేస్ దొరకగానే కొద్దిపాటి నడక, ధ్యానం, పెంపుడు జంతువులతో ఫోటోలు వంటివి చేయండి. సమయం అనేది తిరిగిపొందలేక పోవచ్చు. కాస్త రిలాక్స్గా గడిపేందుకు డబ్బు వెచ్చించినా.. తప్పులేదని అంటున్నారు శాంటోస్. ఒక్కోసారి ఆలస్యంగా పనులు అయ్యాయని..అనుకున్నట్లుగా త్వరతిగతిన పనులు కాలేదని బెంత్తిపోనవసరం లేదు. మిగతా వ్యక్తిగత పనులను తొందరగా చేసుకునేలా ట్రై చేయండి చాలు. లేదా ఈ రోజు కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ టైం విరామం తీసుకున్నామని అనుకోండి తప్ప విరామం తీసుకోవడం మాత్రం స్కిప్ చెయ్యొద్దని చెబుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్స్ తొందరగా ఆఫీస్ పనులు పూర్తి చేయాలనకుంటారు. ఒక్కొసారి పలు కారణాల వల్ల ఆసల్యం అవుతాయి. దీంతో ఆగ్రహం తెచ్చుకోవద్దు. మరో అవకాశంలో త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఆ దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి టైం మిగిల్చుకోలేకపోయిన మరోసారి ఆ అవకాశాన్ని దక్కించుకుని ఎంజాయ్ చేయొచ్చన్న ఫీలింగ్ మనలో తెలియకుండానే ఒత్తిడిని జయించేలా చేస్తుంది. ఫలితంగా మెదుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. (చదవండి: వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె..?) -
పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..!
పిల్లలు పొద్దస్తమానం చదివితేనే అనేక విషయాలు తెలుస్తాయని, వారి పరిజ్ఞానం పెరుగుతుందని, వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలన్నా వారికి తగినంత శారీరక శ్రమ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఆలోచనా శక్తికి, బుర్రకు పదును పెట్టే కొన్ని ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెన్నిస్పిల్లలు గానీ, పెద్దలు గానీ టెన్నిస్ ఆడితే అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. టెన్నిస్ ఆడినప్పుడు శరీరంలోని కండరాలన్నీ కదులుతాయి. శారీరక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం ఏర్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అంచనావేయడం, సమయస్ఫూర్తి వంటివి పెంపొందుతాయి. బంతాటబంతాట అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. అయితే వారికి ఊరికే ఏదో బాల్ ఇచ్చి ఆడుకోమని వదిలేయకుండా, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో బాస్కెట్బాల్ రింగ్ తయారు చేసి, కొన్ని బంతులను వారికి ఇచ్చి, ఆడుకోమని చెప్పాలి. ఒక్కో బంతిని తీసి, ఆ రింగ్లో వేయమని వారికి సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య సమన్వయం మరింత మెరుగవుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సైక్లింగ్సైక్లింగ్ చేసేప్పుడు పిల్లలు కింద పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాలెన్సింగ్ నైపుణ్యాలను చక్కగా నేర్చుకుంటారు. పోటీతత్వం, ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడం వంటివి సైక్లింగ్ సాయంతో మరింతగా తెలుసుకుంటారు. సైక్లింగ్ శరీరానికీ మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతుంటారు. ఈతచిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే వారికి స్విమ్మింగ్ నేర్పించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్ మెదడును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వాన్ని నేర్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. కరాటే, కుంగ్ ఫూకరాటే, కుంగ్ ఫూ మొదలైనవి శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడేలా చేస్తాయి. ఏకాగ్రత, అవతలివారిని గౌరవించడం, అవసరమైనప్పుడు తమని తాము కాపాడుకోవడం, పట్టుదల, మానసిక పరిపక్వత మొదలైన లక్షణాలెన్నో కరాటే, కుంగ్ ఫూ వలన అలవడుతాయి. -
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్ని ఐస్కీమిక్ స్ట్రోక్గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
మెదడులో చిప్.. చెస్ ఆడించారు
ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ గర్వంగా ప్రకటించుకున్నారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి మైండ్ కంట్రోల్ చిప్ సాయంతో అతనితో చెస్ ఆడాడు. తద్వారా చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్కు చెందిన కంపెనీ న్యూరాలింక్ కార్పొరేషన్ అరుదైన ఫీట్ సాధించింది. ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చి.. అతని మైండ్ సాయంతో(Telepathically) ఆన్లైన్లో చెస్ ఆడిస్తూ అదంతా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. క్వాడ్రిప్లెజియా(కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన) పేషెంట్ అయిన నోలన్ అర్బాగ్ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు అర్బాగ్. https://t.co/OMIeGGjYtG — Neuralink (@neuralink) March 20, 2024 Today, we might see the first human Neuralink patient controlling a phone and a computer with his brain. Neuralink to go live on 𝕏 at 2:30pm PST pic.twitter.com/vQxMem3ih7 — DogeDesigner (@cb_doge) March 20, 2024 ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. కంప్యూటర్ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విజయం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లతో న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు. Neuralink's first ever patient demonstrating telekinetic abilities - controlling laptop, playing chess by thinking - using their implanted brain chip "Telepathy".#Neuralink #Telepathy #Telekinesis #Brainchip https://t.co/Qd7ZBdCPDK pic.twitter.com/uejICSs8R0 — Orders of Magnitude (@ordrsofmgnitude) March 21, 2024 2016లో బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ను ఎలన్ మస్క్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. వైకల్యాలున్న వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్. ఈ క్రమంలో న్యూరాలింక్ తయారు చేసిన ఈ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూరాలింక్ చిప్ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చినట్లు.. అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తే ఈ నోలన్ అర్బాగ్. ఎలా పనిచేస్తుందంటే.. న్యూరాలింక్ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్నకు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్లుగా మారుస్తుంది. న్యూరాలింక్ కంటే ముందే.. ఈ తరహా ప్రయోగాలు న్యూరాలింక్తో పాటు మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. న్యూరాలింక్ కంటే ముందే.. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో యూఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ను అమర్చింది. -
మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా?
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే. అపోహ ఎలా మొదలైంది? 1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు. ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు. తేడా గమనించండి.. మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. అపోహల నుంచి బయటపడండి.. మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు? తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది.. ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు.. ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక.. తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం.. తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం.. మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి. జ్ఞానమెలా వస్తుందంటే.. మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్మెంట్లు, జిమ్లో కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్ అమర్చాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే మంచి వ్యాయాయంతో తిరిగి ఫిట్ నెస్ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది. తాను చాలా హ్యాపీ గోయింగ్ మనిషిని అని తెలిపింది. అలాగే తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. -
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ని యూట్యూబ్లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్స్టిక్లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్స్టిక్లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. ఏడాదిలో 11 మంది మృతి!
పాకిస్తాన్ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫౌలెరి’ అని పిలిచే ఈ ఏక కణ జీవి ఇప్పటి వరకు 11 మందిని బలిగొంది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం. మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్లోని కరాచీ బఫర్ జోన్లో నివసిస్తున్న ఒక వ్యక్తి నైగ్లేరియా కారణంగా మృతి చెందాడు. దీనిగురించి సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ బాధితుడు గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడ్డాడు. పాకిస్తాన్లో ఇప్పటివరకు 11 మంది ‘నేగ్లేరియా ఫౌలెరి’ ఇన్ఫెక్షన్ (ఎన్ఎఫ్ఐ) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్ సాద్ ఖలీద్ మాట్లాడుతూ ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి వనరులలో వృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని ఖలీద్ నియాజ్ కోరారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా సోకుతుంది? బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు? -
తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..
కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది. రష్యాలోని ఫార్ ఈస్ట్లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్కి సీటీ స్కాన్ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయత్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు. పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్ ప్రాంతంలో సఖాలిన్లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు. విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్కి ఎడమ ప్యారిటల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు. (చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!) -
ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..
మెదడులో సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేయడం గురించి విన్నారా?. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఏదో ఎలక్ట్రిక్ స్విచ్ని ఆఫ్ చేసినట్లుగా ఓ ఆరేళ్ల చిన్నారి మెదడుల సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేశారు. ఎందుకిలా? ఏం జరిగింది ఆ చిన్నారికి తదితరాల గురించే ఈ కథనం.! వివరాల్లోకెళ్తే.. యూఎస్లోని ఆరేళ్ల చిన్నారి బ్రియానా బోడ్లీ అరుదైన మెదడువాపు వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి పేరు రాస్ముస్సేన్కి సంబంధించిన మెదడువాపు వ్యాధి. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని రాస్ముస్సేన్స్ ఎన్సెఫాలిటిస్ అనే మెదడు వాపు వ్యాధి. దీని కారణంగా ఆమె పక్షవాతానికి గురయ్యి నడవలేనంత దయనీయ స్థితిలో ఉంది. కనీసం మాటలు కూడా పలకలేదు. ఈ వ్యాధి కారణంగా ఆమె మెదడులోని ఒక వైపు భాగం కుచించుకుపోవడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి ఆమెపై ఓ రేంజ్లో విజృంభించడం ప్రారంభించింది. దీంతో వైద్యలు ఆమె పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో యాంటీ సీజర్, స్టెరాయిడ్లు ఇచ్చారు. అంతేగాదు ఆ వ్యాధిని నయం చేసేందుకు మెదడులో ఒకవైపు భాగాన్ని పనిచేయకుండా డిస్కనెక్ట్ చేశారు. అంటే ఒకరకంగా ఒకవైపు మెదడుని స్విచ్ఆఫ్ చేశారు. ఆ చిన్నారి ఎదుర్కొంటున్న వ్యాధిని నయం చేసేందుకు ఇలా ఒకవైపు మెదడుని పూర్తిగా డిస్కనెక్ట్ చేసినట్లు లోమాలిండా యూనివర్సిటీ డాక్టర్ ఆరోన్ రాబిసన్ చెప్పారు. ఈ మేరకు వైద్యులు రాబిసన్ మాట్లాడుతూ..మెదడులో పనిచేయని భాగాన్ని సిల్వియన్ షిషర్ అనే పిలిచే బ్రెయిన్ ఓపెన్ సర్జరీ ద్వారా బ్రెయిన్ని ఆఫ్ చేయొచ్చని చెప్పారు. ఈ చికిత్సలో తాము మెదడులోని థాలమస్ ప్రాంతం నుంచి తెల్లటి పదార్థాన్ని రీమూవ్ చేస్తామని చెప్పారు. సగం మెదడుతో రోజూవారి సాధారణ జీవితాన్ని గడపగలమని చెప్పారు వైద్యులు. దీని గురించి ఆ చిన్నారి బ్రియానాకి దాదాపు 10 గంటలకు పైగా శస్త్ర చికిత్స చేసి మరీ మెదడులోని సగ భాగాన్ని డిస్కనెక్డ్ చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ఆమె ఎడమ చేతిని కదపలేకపోవడం, కొంత మేర దృష్టిని సైతం కోల్పోయినప్పటికీ వివిధ ఫిజికల్ థెరఫీలతో మళ్లీ ఆమెను యథాస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొత్తగా నడవడం, బ్యాలెన్సింగ్ చేసుకోవడం వంటి నెపుణ్యాలను మళ్లీ అభ్యసిస్తోందని చెప్పారు రాబిసన్. ఇంతకీ రాస్ముస్సేన్ మెదడు వాపు వ్యాధి అంటే.. మెదడులో సగభాగంలో మంటతో కూడిన దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరితే సగభాగం పూర్తిగా పనితీరుని కోల్పోతుంది. దీంతో ఒక వైపు శరీరం చచ్చుబడి క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని 1958లో తొలిసారిగా వైద్యుడు థియోడర్ రాస్ముస్సేన్ వివరించారు. అందువల్ల ఆ వైద్యుడి పేరు మీదనే ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రతి పదిమిలియన్ల మందిలో ఇద్దర్ని ప్రభావితం చేస్తుందని, సాధారణంగా సుమారు 2 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, ఆఖరికి పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు: రాస్ముస్సేన్ ఎన్సెఫాలిటిస్ అత్యంత సాధారణ మూర్చలాంటి లక్షణాలనే చూపిస్తుంది. ఇది శరీరంలోని బలమైన కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఒక చేయి, కాలు మెలితిప్పినట్లుగా వంకరగా మారతాయి. మెదడులో ఒకవైపు నుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమవుతుంది (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?) -
షాకింగ్ ఘటన: మహిళ మెదడులో.. కొండచిలువ..
ఓ మహిళ గత కొన్ని రోజులుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ సాధారణమైనవే కదా అన్నట్లు మందులు వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా మతిమరుపు వంటి జ్వరం వంటివి మరీ ఎక్కువైపోయాయి. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్గానే వచ్చాయి. ఇక చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా..ఆమె మెదడులో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు వైద్యులు. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..64 ఏళ్ల మహిళ విరేచనాలు, వాంతులు దీర్ఘకాలిక జ్వరం తదితర వాటితో గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో వైద్యలు ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమె మెదడులో ఉన్న పరాన్నజీవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది కొండచిలువ శరీరంలో ఉండే ఒక విధమైన పురుగులాంటిది. అలా అని ఆమె పాములు పట్టే ఆమె కూడా కాదు. ఆమె కసలు పాములతో ఎలాంటి సంబంధ కూడా లేదు. అయితే ఆమె కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె వంట చేయడం కోసం అని గడ్డి వంటివి కోసుకువచ్చేది. అలాగే ఆకుకూరలు వంటి పదార్థాలను తీసుకొచ్చేది. ఈ కొండచిలువ వాటిపై పాకడం లేదా దాని మలం ద్వారా ఈ జీవి ఉండొ అవకాశం ఉందని. ఆమె ఆకుకూరలు తిన్నప్పుడో లేదా మరేవిధంగానో ఆమె శరీరంలోకి వెళ్లి మెదడులో కూర్చొందన్నారు. అది ఏకంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగనట్లు ఉందన్నారు. దీని కారణంగా ఆమె విపరీతమైన వాంతులు, కడుపునొప్పితో కూడిని విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొందన్నారు. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పరాన్నజీవిని తీసేసినట్లు తెలిపారు. సదరు పేషెంట్ కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందని అన్నారు. ఈ కేసు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ వ్యాధులేనని చెప్పారు. జూనోటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు. ఇలానే కనోనా వైరస్లు కూడా మానవాళిని భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. అందువల్ల మానవులు జంతువులను పెంచుకునేటప్పుడూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. టేప్వార్మ్ లాంటి బద్దె పురుగులు కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేసి మూర్చ వంటి రుగ్మతలను కలుగ చేస్తాయన్నారు. ఇవి జంతువుల శరీరంలో పరాన్నజీవిగా ఆశ్రయించి ఉండటం కారణంగా..మనం వాటిని ఆహారంగా తీసుకోవడంతో మన శరీరంలో చేరి నెమ్మదిగా అభివృద్ధి చెంది కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేస్తుందని అన్నారు. అందువల్ల బాగా ఉడకబెట్టి తగు జాగ్రత్తల పాటించి ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. (చదవండి: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
ముక్కులోంచి వెళ్లి మెదడు తినేసింది.. 15 ఏళ్ల కుర్రాడు మృతి!
కేరళలోని అలప్పుజా జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరిలో కలవరాన్ని పెంచింది. కలుషిత నీటిలో ఉండే అమీబా ఒక యువకుని ప్రాణాలను బలిగొంది. ఈ అమీబా ఆ కుర్రాడి మెదడులో నిన్ఫెక్షన్ను వ్యాపింపజేసింది. అది మెదడును తిసేసింది. కేరళ ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ తెలిపిన వివరాల ప్రకారం అలప్పుజా జిల్లాకు సమీపంలోని పనావల్లికి చెందిన కుర్రాడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. గతంలోనూ ఇటువంటి కేసులు.. గతంలోనూ ఇటువంటి ఐదు కేసులు వెలుగు చూశాయి. దీనిలో మొదటి కేసు 2016లో తిరమాల వార్డులో వెలుగు చూడగా, 2019, 2020లలో మలప్పురంలో రెండేసే కేసులు చొప్పున వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. 2020, 2022లలో కోజికోడ్, త్రిశూర్లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకినవారంతా మృత్యువాత పడ్డారు. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా వ్యాధి తీవ్రతను గమనించిన అలప్పుజా జిల్లా వైద్యశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. కలుషిత నీటితో స్నానం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడు జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలను ఎదుర్కొంటాడని వారు తెలిపారు. సూక్ష్మదర్శినితో మాత్రమే.. ఈ అమీబా ఎంత ప్రమాదకరమంటే ఇది మెదడులోని కణాలను తినేస్తుంది. ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తుంది. ఇది బాధితుడికి ప్రాణహాని కలిగిస్తుంది. Naegleria Fowleri అనే ఈ అమీబా చాలా చిన్నగా ఉంటుంది. దీనిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతారు. ఇది కూడా చదవండి: అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే.. -
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రత్యేకం
జూన్ 8, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా "ఒత్తిడిని తగ్గించుకోండి - మిమ్మల్ని మీరే కాపాడుకోండి" అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూమర్లపై అవగాహన కల్పించడానికి మీ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్.. అది ప్రమాదకరమైనది కావచ్చు, ప్రమాదం లేనిది కావచ్చు... మెదడులో ట్యూమర్ అంటూ వచ్చిందంటే ధృడమైన పుర్రె భాగం అడ్డుగా ఉంటుంది కాబట్టి అది లోపలి భాగాన్ని నొక్కి పెడుతూ దాని పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దీని కారణంగా అనేక లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. అసాధారణ లక్షణాల ఆధారంగా మెదడు పనితీరులో మార్పులను గమనించి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను ఆశ్రయించి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని లేకుండా బయట పడవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం ట్యూమర్ కణాలు వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. ఫలితంగా ట్యూమర్ సైజ్ పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ అవగాహనలో భాగంగా ట్యూమర్లను తరచుగా తలనొప్పి రావడం, జ్వరం రావడం, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, ఏమి తిన్నా వాంతులు అవ్వడం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి చిన్న చిన్న లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించమని చెబుతున్నారు ద్వారక HCMCT మణిపాల్ హాస్పిటల్ న్యూరో విభాగాధిపతి డా.అనురాగ్ సక్సేనా. బ్రెయిన్ ట్యూమర్లను తొందరగా గుర్తించడం వలన ప్రయోజనాలు: ట్యూమర్ సైజ్ నియంత్రించవచ్చు: ట్యూమర్ పెరిగేకొద్దీ మెదడు లోపలి భాగాన్ని బాగా నొక్కిపెడుతుంది కాబట్టి సరైన ట్రీట్మెంటును ఆశ్రయిస్తే ముందు దాని సైజ్ పెరగకుండా నియంత్రించవచ్చు. లక్షణాలను బట్టి నియంత్రిచవచ్చు: బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పు రావడం, కళ్ళు తిరుగుతుండటం, మూర్ఛపోవడం, ఇంద్రియాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తే పేషేంట్ తొందరగా కోలుకునే అవకాశముంటుంది. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకొవచ్చు: మెదడులో ఏర్పడిన ట్యూమర్లు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫలితంగా నరాల వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. ముందుగా గుర్తించడం వలన నరాల వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా, కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ట్యూమర్ గుర్తించే సమయాన్ని బట్టి ట్రీట్మెంట్: ముందుగానే వీటిని గుర్తిస్తే సర్జరీ ద్వారా తొలగించే అవకాశముంటుంది. మరికొన్ని సందర్భాల్లో కీమో థెరపీ, రేడియేషన్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యంతో వీటినుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు: తొందరగా గుర్తించడం వలన డాక్టర్లు అవసరాన్ని బట్టి సర్జరీ చేసి ట్యూమర్ ను తొలగించే వీలుంటుంది. ఆలస్యం చేసేకొద్దీ ట్రీట్మెంట్ జటిలంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరాన్ని బట్టి సర్జరీ తోపాటు కీమో థెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ట్యూమర్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు. -
పక్షవాత బాధితునికి ఏఐ సాయం... అతనిలో వచ్చిన వినూత్న మార్పు ఇదే..
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇంతకాలం అసాధ్యాలనుకున్నవన్నీ ఏఐ సాయంతో సుసాధ్యాలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అటువంటి మరో ఉదంతం ఇప్పుడు అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.స్విట్టర్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పక్షవాతానికిగురైన ఒక వ్యక్తికి అత్యుత్తమ చికిత్సనందించారు. బాధితుని శరీరంలోని కిందిభాగం పక్షవాతానికి గురికాగా, శాస్త్రవేత్తలు ఆ భాగం బాధితుని నియంత్రణలోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే 2011లో పక్షవాతానికి గురైన గర్ట్-జైన్ ఓస్కమ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏఐ సాయంతో తిరిగి నడవగలుగుతున్నాడు. తనకు చికిత్స అందించిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. 40 ఏళ్ల ఓస్కమ్ తన ఆలోచనల ద్వారా ఇప్పుడు తన శరీరభాగాలను నియత్రించగలుగుతున్నాడు. రెండు ఇంప్లాట్స్ కారణంగా ఇది సంభవమయ్యింది. బాధితుని మెదడు- వెన్నెముకకు మధ్య తిరిగి కనెక్షన్ ఏర్పరచడం ద్వారా బాధితుని శరీర భాగాలు అతని అదుపులోకి వచ్చాయి. ఓస్కమ్ మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి నడుస్తానని ఎప్పుడూ అనుకోలేదని,శాస్త్రవేత్తలు తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకుల బృందం ఓస్కామ్ మెదడుకు, వెన్నెముకకు మధ్య ఒక డిజిటల్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది.ఈ బ్రిడ్జి బాధితుడు అన్ని ఆటంకాలు అధిగమించి నడించేందుకు సహకరిస్తుంది. 2011లో జరిగిన ఒక ప్రమాదం అనంతరం ఓస్కమ్ పక్షవాతానికి గురయ్యాడు. ఆ తరువాత నుంచి వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏఐ సాయం, శాస్త్రవేత్తల కృషితో బాధితుడు తిరిగి నడవగలుగుతున్నాడు. -
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్లోని లైడెన్లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్లు గుర్తించారు. ప్రాజెక్ట్కి నాయకత్వం వహించిన లౌసాన్లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
బీజేపీ నేతలకు బుర్ర లేదు..ఏది పడితే అది మాట్లాడుతారు:నితీశ్ కుమార్
పట్నా: బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఈ తరం కమలం పార్టీ నాయకులకు అసలు బుర్ర లేదని, ఏం మాట్లాడుతారో కూడా తెలియదని ధ్వజమెత్తారు. తాను వాళ్లలా కాదని, నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడనని పేర్కొన్నారు. నితీశ్, ఆయన పార్టీని మట్టిలో కలిపేస్తామని బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలా ఫైర్ అయ్యారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నితీశ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సామ్రాట్. వచ్చే ఎన్నికల్లో నితీశ్ను, ఆయన పార్టీని మట్టిలో కలపాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నితీశ్ను ప్రధాని మోదీ సీఎం చేసినా.. ఆయన మోసం చేసి ఆర్జేడీతో చేతులు కలిపారని విమర్శించారు. ఇందుకు ప్రతీకారంగా 2024 సార్వత్రిక ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ పార్టీని మట్టిలో కలిపి తగిన బుద్ది చెప్పాలన్నారు. కొద్ది రోజుల క్రితం యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ మాఫియాను మట్టిలో కలిపేస్తాం అని హెచ్చరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ తర్వాత రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు వరుస ఎన్కౌంటర్లరో హతమైన విషయం తెలిసిందే. యోగి వ్యాఖ్యలనే స్ఫూర్తిగా తీసుకుని బిహార్ బీజేపీ చీఫ్.. నితీశ్ పార్టీని మట్టిలో కలిపేస్తాం అని వ్యాఖ్యానించారు. చదవండి: అతీక్ అహ్మద్ లాయర్కు మరో షాక్! ఉమేశ్పాల్ ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు -
మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే...
గుంటూరు మెడికల్: మనిషి దైనందిన జీవితంలో చేసే పనులన్నీ కూడా బ్రెయిన్ ద్వారానే జరుగుతాయి. జ్ఞానేంద్రియాలకు ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే. శరీరంలోని కీలకమైన అవయవాలన్ని కూడా మెదడు ఇచ్చే ఆదేశాల ద్వారానే పనిచేస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధుల వల్ల, ప్రమాదాల్లో గాయపడటం వల్ల మెదడు దెబ్బతిని, మెదడు పనిచేయక మనిషి చనిపోవటం జరుగుతుంది. మెదడును పరిరక్షించుకోకపోతే ఎలాంటి అనర్ధాలు వస్తాయి, మెదడు గురించి అవగాహన కల్పించేందుకు 1996 నుంచి 120 దేశాల్లో ప్రతి ఏడాది మార్చి 13 నుంచి 19వ తేదీ వరకు బ్రెయిన్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ సమస్యల బాధితుల వివరాలు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రతిరోజూ 150 మంది, న్యూరో సర్జరీ విభాగంలో వంద మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 50 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. చిన్న వయస్సు మొదలుకొని పెద్ద వారి వరకు అందరికి బ్రెయిన్ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయి. మెదడుకు ఇబ్బందికర పరిస్థితులు... ప్రమాదాల్లో తలకు గాయాలవ్వటం. పక్షవాతం. మెదడులో ట్యూమర్లు ఏర్పడడం. పార్కిన్సన్స్ వ్యాధి. యాంగ్జటీ, డెమెన్షియా, డిప్రెషన్ కారణాల వలన మెదడు దెబ్బతింటుంది. తలనొప్పి, వాంతులు అవడం, చూపులో తేడాలు, నడకలో తడబాటు, జ్ఞాపకశక్తి లోపించడం, ఏదైనా విషయాలపై ఏకాగ్రత చూపించలేకపోవడం, చెవిలో శబ్దాలు వినిపించడం, మనిషి అసాధారణంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు కనిపిస్తే మెదడుకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయనే విషయం గుర్తించాలి. బ్రెయిన్ ట్యూమర్స్పై అప్రమత్తత.. మెదడులో ఏర్పడే కొన్ని గడ్డలు క్యాన్సర్గా మారి ప్రాణాలు తీస్తాయి. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో ఫిట్స్ వస్తాయి. వైద్యుల సలహా మేరకు ఫిట్స్ రాకుండా మందులు వాడుతూ ఉండాలి. చేతులు, కాళ్లు పనిచేయకపోతే పక్షవాతం అని భావిస్తారు. బ్రెయిన్లో గడ్డ ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చు. అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్లను నిర్ధారిస్తారు. మెదడు గురించి.. ♦ మనిషి శరీరంలో బ్రెయిన్ మొత్తం బరువు రెండు శాతం. ♦ 18 ఏళ్ల వయసు వరకు బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది. ♦ పగలు కంటే రాత్రి వేళల్లోనే మెదడు ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది. ♦ మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. ♦ మెదడు 1300 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. ♦ అప్పుడే పుట్టిన పిల్లల్లో 350 నుంచి 450 గ్రాముల బరువు ఉంటుంది. ♦ శరీరం మొత్తం వినియోగించుకునే శక్తిలో 20 శాతం వినియోగించుకుంటుంది. -
ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్' ఇటీవలే ప్రచురించింది. అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు. చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్ -
మీకు తెలుసా?
మెదడు తనను తాను రిపేర్ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు ♦ నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ♦ దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది. ♦ నిద్రలేమి కారణంగా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ♦ ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. ♦ నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం. ♦ కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. ♦ కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. -
రెడీ...సెట్...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు
జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్ బ్రెయిన్ గేమ్స్పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది... బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్’ అనే గేమ్ యాప్ను సాధనంగా ఎంచుకుంది. కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్’ను ఉపయోగిస్తోంది. ‘సూపర్బెటర్’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్ హ్యాజ్ హీరోయిక్ పొటెన్షియల్’ అనేది ఈ ఆట నినాదం. ‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్బెటర్’ను రూపొందించిన జేన్మెక్ గోనిగల్. జేమ్మెక్ ఒకప్పుడు డిప్రెషన్ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్లో నుంచి ‘సూపర్బెటర్’ రూపంలో డిజిటల్ ఆటగా మారింది. న్యూరోసైంటిస్ట్ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్... లుమినోసిటీ. ఈ గేమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్ గేమ్ మాన్యుమెంట్ వ్యాలీ. ఈ గేమ్ యాప్ యాపిల్ డిజైన్, పాకెట్ గేమర్ ‘గోల్డ్’ అవార్డ్లను గెలుచుకుంది. ‘మాన్యుమెంట్ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్ సౌండ్ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్. సుడోకు ప్రేమికులను ‘గుడ్ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ. ఇక ఫన్మెథడ్ వీడియో గేమ్ ‘బ్లాక్బాక్స్’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్ ఉంటాయి. ‘ఎలివేట్’లో ప్రత్యేకమైన వర్కవుట్ క్యాలెండర్ ఉంటుంది. ‘ఫన్ అండ్ క్లిక్’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘బస్సు కోసం ఎదురుచూసే క్రమంలో టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్ జిమ్ గేమ్స్ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాకేత్. ‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్ను సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్ను సాల్వ్ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్ సాల్వ్ చేసే ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి. ‘మన జీవితమే పెద్ద పజిల్. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్ బ్రెయిన్ గేమ్స్ను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం. -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..
సాక్షి, విజయవాడ: శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్స్ట్రోక్కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. ►పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్కు కారణంగా చెబుతున్నారు. ►45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ►వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ►ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్స్ట్రోక్కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. జీవన విధానం ముఖ్యం.. ప్రతి ఒక్కరూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కదలిక లేని జీవన విధానం కారణంగా చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, మధ్య వయస్సు వచ్చేసరికి స్ట్రోక్కు దారి తీస్తున్నాయి. వంశపారంపర్యంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్న వారు మందులు సక్రమంగా వాడటం ద్వారా ముప్పు ను తప్పించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఈ వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులు వస్తున్నాయి.. ఇటీవల 45 ఏళ్లలోపు బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్న(స్ట్రోకింగ్ యంగ్) వారిని తరచూ చూస్తున్నాం. మా వద్ద వస్తున్న స్ట్రోక్ కేసుల్లో 25 శాతం అలాంటి వారే ఉంటున్నారు. తక్కువ వయస్సు వారిలో స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు వాడటం, మద్యపానం, ధూమపానంతో పాటు, హోమోసిస్టీన్, సిక్కుసెల్, రక్తంలో లోపాలు కూడా కారణం కావచ్చు. బ్రెయిన్స్ట్రోక్ లక్షణాలను గుర్తించి నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ డి. అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ -
ప్రమాదాల్లో మెదడుకు గాయమైతే!
ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలితే... మెలకువగా ఉండటం లేదా దెబ్బ బలంగా తగిలితే స్పృహ తప్పిపడిపోవడం... ఈ రెండే అందరికీ తెలిసిన పరిస్థితులు. అయితే ఇలా జరిగినప్పుడు బాధితులు ఏ మేరకు స్పృహలో ఉన్నారనే అంశం ఆధారంగా ఐదు రకాల కండిషన్లలోకి వెళ్లవచ్చు. అవి... స్టూపర్ అనే కండిషన్లోనా, కోమాలోనా, జీవించే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనలూ లేని జీవచ్ఛవ (వెజిటేటవ్ స్టేట్ అనే) స్థితిలోనా, లాక్డ్–ఇన్ సిండ్రోమ్ అనే దశలోనా... ఇలాంటి పరిస్థితుల్లో చివరిదైన బ్రెయిన్డెడ్ కండిషన్లలో దేనిలో ఉన్నాడని చూస్తారు. తలకు దెబ్బతగిలిన బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారు, ఏ మేరకు బాగవుతారు వంటి అంశాలు... అతడు ఏ స్థితిలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటాయి. ఆ స్థితులపై అవగాహనతో పాటు, తలకు దెబ్బతగిలి మెదడుకు గాయమైందని భావించినప్పుడు చేయాల్సిన పనుల గురించి తెలిపే కథనం. తలకు దెబ్బ తగిలి, దాని ప్రభావం ఎంతోకొంతైనా మెదడు మీద పడితే ఆ ప్రమాదాన్ని ‘ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ)’ అంటారు. అప్పుడు తలకు తగిలిన దెబ్బ తీవ్రత ఆధారంగా బాధితులు వెళ్లే ఐదు రకాల తీవ్ర పరిస్థితులివి... స్టూపర్ దశ: ఈ స్థితిలో కొద్దిగా మాత్రమే కదులుతూ... ఒకవేళ నొప్పికలిగినా, లేదా గిల్లడం వంటివి చేసినా కాస్త స్పందిస్తారు. వెజిటేటివ్ స్టేట్ : జీవచ్ఛవంగా ఉంటే దశనే వెజిటేటివ్ స్టేట్గా చెబుతారు. వీరికీ కోమాలో ఉన్న బాధితులకు తేడా ఏమిటంటే... కోమా ఉన్న రోగులకు నిద్ర, మెలకువ దశలు ఉండవు. వెజిటేటివ్ స్థితిలో ఉన్నవారిలో కొందరు అకస్మాత్తుగా సాధారణంగా స్పందించవచ్చు. కోమాలో ఉన్న రోగులు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కాగా జీవచ్ఛవంలా ఉన్న రోగులు కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండవచ్చు. శబ్దాలు చేయవచ్చు. చేతులు–కాళ్లు కూడా కదపగలరు. బాధితులు కంటిన్యువస్గా నెల (30 రోజుల) పాటు జీవచ్ఛవంలా ఉంటే దాన్ని ‘శాశ్వత జీవచ్ఛవ స్థితి’ (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్–పీవీఎస్) అంటారు. ఇలాంటి వారిలో రోగి మెరుగుపడే పరిస్థితి అన్నది వారి మెదడుకు అయిన గాయం తీవ్రతను బట్టి, బాధితుల వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసు వారైతే కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గుండెపోటు వచ్చిన కొందరిలో మెదడుకు రక్తం (ఆక్సిజనేటెడ్ బ్లడ్) అందక వారు జీవచ్ఛవ (వెజిటేటివ్) స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. కోమా : ఇది పూర్తిగా స్పృహ లేని స్థితి. అయితే బాధితులు కొన్నిసార్లు కొద్దిసేపు మాత్రమే కోమాలో ఉండి, మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలూ ఉంటాయి. వారు కోమాలో ఉండే వ్యవధి కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాలూ లేదా నెలల వరకూ ఉండవచ్చు. కోమాలో ఉన్నవారు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కోమాలో ఉన్నవారికి నిద్ర, మెలకువ వంటి స్థితులు కలగవు. కోమా నుంచి బయటపడ్డా... కొందరిలో ఎలాంటి స్పందనలూ లేకుండా జీవచ్ఛవం (వెజిటేటివ్ స్టేట్)లోనూ ఉండవచ్చు లేదా ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం వల్ల చాలామంది మునపటి చైతన్యాన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. లాక్డ్–ఇన్ దశ : ఈ కండిషన్లో బాధితుడు మెలకువగానే ఉంటాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా తన శరీరాన్ని కదిలించలేడు. అంటే శరీరం పూర్తిగా పారలైజ్ అవుతుంది. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (పీవీఎస్)లో బాధితుడికి మెదడు పైభాగం పూర్తిగా దెబ్బతిని, కింది భాగం మామూలుగానే ఉంటుంది. కానీ లాక్డ్–ఇన్ దశలో పై భాగం మామూలుగానే ఉండి, కింది భాగం (అంటే బ్రెయిన్ స్టెమ్) దెబ్బతింటుంది. లాక్డ్ ఇన్ సిండ్రోమ్లో ఉన్న చాలామంది రోగులు తమ కనురెప్పల కదలికల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. వీళ్లలోని కొందరిలో ముఖంలోని కొన్ని కండరాల్లోనూ కదలికలు ఉండవచ్చు. చాలామందిలో కాళ్లూ–చేతులపై నియంత్రణ (మోటార్ కంట్రోల్) ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఇలాంటి వారితో సంభాషించడానికీ / సమాచారాన్ని పంచుకోవడాని (కమ్యూనికేషన్)కి అనేక రకాల ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ డెడ్ : ఈ స్థితిలో బాధితులకు మెదడులోని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్తో పాటు బ్రెయిన్ స్టెమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా మెదడు మరణిస్తుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ఇక ఏమాత్రం చక్కదిద్దలేరు. శరీరం బతికి ఉండి... మెదడు పూర్తిగా మరణించిన స్థితి ఇది. ఇలాంటి స్థితిలో కృత్రిమశ్వాసపై శ్వాసప్రక్రియ కొనసాగుతుంటే... అది తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. బతికే అవకాశం ఏమాత్రమూ ఉండదు. అందుకే బ్రెయిన్డెడ్ పరిస్థితిలో ఉన్నవారి నుంచి డాక్టర్లు అవయవమార్పిడి (ట్రాన్స్ప్లాంటేషన్) కోసం అవసరమైన అవయవాలను సేకరిస్తారు. ∙ తలకు గాయం కాగానే పొరుగువారు చేయాల్సిన పనులు ♦తలకు గాయమైన వారిని సమతలంగా ఉండే పడకపై మెడ కదలకుండా పడుకోబెట్టాలి. ♦తరలించే సమయంలో తలకు, వెన్నుకు అయిన గాయం మరింత రేగకుండా, తీవ్రం కాకుండా చూడాలి. చికిత్స విషయానికి వస్తే... ఏదైనా ప్రమాదంలో తలకు గాయం అయినప్పుడు మెదడుకు నష్టం జరిగిందా లేదా అన్న విషయం తక్షణం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రమాదం జరిగిన గంటలోనే బాధితులను హాస్పిటల్కు తరలించగలిగితే... చాలావరకు ప్రాణాల కాపాడవచ్చు. దాంతో పాటు దుష్ప్రభావాలను (కాంప్లికేషన్స్ను) చాలావరకు అరికట్టవచ్చు. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అదే అరగంటలోపే తరలించగలిగితే... ఇంకా సమర్థమైన చికిత్స అందించవచ్చు. అందుకే ఆ సమయాన్ని ‘ప్లాటినమ్’ సమయంగా చెబుతారు. బాధితులకు ముందుగా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి తక్షణ వైద్య సహాయం అందాలి. ఇది ప్రమాద సంఘటన స్థలం నుంచే లేదా కనీసం ఆసుపత్రికి తరలించగానే క్యాజువాలిటీలోనైనా ప్రారంభం కావాలి. ఎందుకంటే గాయం కారణంగా మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం చాలా సందర్భాల్లో పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం చేయగలిగేది మెదడుకు మరింత నష్టం జరగకుండా చూసుకోవడం. ఒకవేళ గుండె స్పందనలు ఆగినట్లయితే వెంటనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీఆర్పీ) చేయాలి. దాంతో గుండె స్పందనలు మళ్లీ మొదలై... మెదడుకు రక్తం అందేలా చూడాలి. ఫలితంగా మెదడుకు జరిగే నష్టమూ తగ్గుతుంది, ప్రాణమూ నిలబడుతుంది. ఇక ఆ తర్వాత చేయాల్సిన వివిధ చికిత్సలను డాక్టర్లు హాస్పిటల్లో కొనసాగిస్తారు. చదవండి: Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు! -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ కాఫీగింజల్లో ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించగలరా?
సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రతి చిన్న విషయం ప్రజలకు తొందరగా చేరుతుంది. సోషల్ మీడియాలో వినోదభరిత వీడియోలే కాదు మెదడుకు మేతపెట్టే విషయాలు కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో నిజాలను, విశేషాలను నేర్చుకోవచ్చు. ఈ రకమైన దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. గందరగోళ రూపంలో ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్లో నుంచి సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతను పెంచి మెదడు చురుకుగా పనిచేయించడమే దీని వెనకున్న ఉద్ధేశ్యం. తాజాగా అలాంటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక ఫోటోలో పెద్ద సంఖ్యలో కాఫీ గింజలు ఉన్నాయి. అయితే అందులో ఓ మనిషి బొమ్మ కూడా దాగి ఉంది. దాన్ని కనుగొనాలాంటూ సవాల్ విసిరారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనిషి ముఖాన్ని గుర్తించొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. కనిపెట్టడం కష్టంగా ఉంటే ఇక ఈ కింది చిత్రాన్ని చూడండి. అయితే మీరు ఫోటో, పెయింటింగ్ చూసే విధానం ద్వారా మీ మెదడు ,వ్యక్తిత్వం ముఖ్య లక్షణాలు తెలుస్తాయి. మూడు సెకన్లలోపు మనిషి ముఖాన్ని గుర్తించగలిగితే, మీ కుడి మెదడు మీ తోటివారి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం పడితే, మీ మెదడు కుడి సగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. లేదా ఒకటి నుంచి మూడు నిమిషాల సమయం పట్టినట్లయితే, మీ మెదడు కుడి వైపు సమాచారాన్ని నెమ్మదిగా విశ్లేషిస్తుంది. ఒకవేళ మీకు మూడు నిమిషాలు సరిపోకపోతే, అలాంటి బ్రెయిన్ టీజర్ మీ మెదడుకు సవాలు విసురుతూనే ఉంటుందని ది మైండ్స్ జర్నల్ చెబుతోంది. చదవండి: విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష! -
చైనా అధ్యక్షుడికి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి
Cerebral or intracranial aneurysm: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మెదడుకి సంబంధించిన "సెరిబ్రల్ అనూరిజం"తో బాధపడుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గతేడాది 2021 చివరిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. జిన్పింగ్ ఎదుర్కొంటున్న సెరెబ్రల్ అనూరిజం అనే వ్యాధి ప్రమాదకరమైనదని వెల్లడించింది. అందువల్లే కరోనా విజృంభించినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు కూడా జిన్పింగ్ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదు. దీంతో జిన్పింగ్ ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. ఏంటీ సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం క్లాట్ అవుతుంటుంది. అంతేకాదు ఈ రక్తనాళాలు ఎప్పుడూ పగిలిపోతాయో చెప్పలేం. దీంతో మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్అరాక్నోయిడ్ హెమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం లేదా మరణించడం జరుగుతుంది. ఎప్పుడూ ఈ వ్యాధి బయటపడిందంటే? మార్చి 2019 లో జిన్పింగ్ తన ఇటలీ పర్యటనలో ఆయన సరిగా నడవలేకపోయారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడే ఈ వ్యాధి బయటపడింది. అంతేకాదు 2020లో షెన్జెన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటి నుంచి జిన్పింగ్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: అల్ జజీర్ మహిళా జర్నలిస్ట్ను చంపిన ఇజ్రాయిల్ దళాలు) -
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!
Last Recall Of Memories That we Have Experienced In Life: ఇంతవరకు శాస్త్రవేత్త పలు ఆవిష్కరణలతో వైజ్ఞానిక శాస్త్రాన్ని కొత్తపుంతలు తొక్కించారు. వైద్యా శాస్త్రానికి సాంకేతికతను జోడించి సాధ్యం కావు అనుకునే వాటన్నింటిని సాధ్యం చేయడమే కాక. సామాన్య మానవుడికి సైతం గొప్ప ఆధునికతతో కూడాని వైద్యం అందేలా చేశారు. ఇన్ని పరిశోధనలు చేసినప్పటికీ శాస్త్రవేత్తల బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క విషయం మరణం. మరణించే ముందు మనలో ఏం జరుగుతుంది ఆ తర్వాత ఎక్కడి వెళ్తారు అనే అంతుబట్టని చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికాయంటున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే...చనిపోవడానికి ముందు మన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను చివరిగా గుర్తుచేసుకుంటుందని డాక్టర్ జెమ్మార్ చెబుతున్నారు. ఈ మేరకు చనిపోతున్నప్పుడు మెదడు ఆలోచనలను రికార్డు చేయడంతో శాస్తవేత్తలకు మానవ మెదడును మరింత అర్థం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగామని చెప్పారు. ఈ రికార్డింగ్ ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. ఈ మేరకు న్యూరో సైంటిస్టులు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల రోగి మెదడు తరంగాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఆ రోగి గుండె పోటుకు గురై చనిపోతుతన్నప్పుడు అతని మెదడు ఊహించని విధమైన సంకేతాలను అందించింది. మనిషి చివరి సమయంలో రికార్డింగ్ మెమరీ రిట్రీవల్ ఊహించని మెదడు కార్యకలాపాలను వెల్లడించిందన్నారు. అవి తన జీవితపు తాలుకా జ్ఞాపకాలైన అయి ఉండవచ్చని చెప్పారు. రోగి మెదడు ఆలోచనలు గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత 30 సెకన్ల పాటు కొనసాగిందని తెలిపారు. అంతేకాదు గుండె పనిచేయడం ఆగిపోయే ముందు నాడీ డోలనాల్లో మార్పులను చూశామన్నారు. జ్ఞాపకశక్తి పునరుద్ధరణలో ప్రమేయం ఉన్న డోలనాలను ఉత్పత్తి చేయడం ద్వారా, మెదడు మనం చనిపోయే ముందు ముఖ్యమైన జీవిత సంఘటనల చివరి రీకాల్ను ప్లే చేస్తుందని ఇది మరణానికి సమీపంలో నివేదించబడిన అనుభవాల మాదిరిగానే ఉంటుందని డాక్టర్ జెమ్మార్ వెల్లడించారు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది, అవయవ దానం చేసే సమయానికి ఏం జరుగుతుంది తదుపరి ప్రశ్నలకు సంబంధించిన అవగాహనను సవాలు చేస్తాయంటున్నారు వైద్యులు. (చదవండి: న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి) -
మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే!
How does coronavirus reach brain?: ప్రాణాంతక కరోనా వైరస్ మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి గల కారణాలను యూఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తాజాగా విడుదల చేశారు. సాధారణంగా కరోనా వాయుమార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే ఇది అనతికాలంలోనే శరవేగంగా ఊపిరితిత్తుల్లో మత్రమేకాకుండా మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్ మనుగడకు కారణమిదేనని వీరి అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడ్డవారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైరస్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రయాణిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలంపాటు బాధపడే కోవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. అందుకు గల కారణాలను అధ్యయనం చేయడం కోసం అమెరికాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన 44 మంది రోగులపై శవపరీక్షల సమయంలో తీసిన కణజాలాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ బారినపడి 230 రోజులు దాటిన తర్వాత కూడా వైరస్ తాలూకు ఆనవాలు మెదడుతో సహా శరీరంలో వివిధ భాగాల్లో కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలం కోవిడ్తో బాధపడేవారి అవయవ వ్యవస్థ ఎందుకు ప్రభావితం అవుతుందో కనుగొనేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాల్నిచ్చాయని మిస్సోరీకి చెందిన క్లినికల్ ఎపిడెమియాలజీ సెంటర్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ ప్రయాణించగల అవయవాలు కేవల ఊపిరితిత్తులు మాత్రమేకాదు. ఇది మెదడుతో సహా మొత్తం శరీరం అంతటా సోకుతుంది. అధిక శాతం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో ఉంటుంది. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
World Stroke Day 2021: ఆ.. 60 నిమిషాలు విలువైనవి
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారిని తొలి గంట సమయంలోపు ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాపాయం తప్పినట్లే. కనీసం నాలుగున్నర గంటల్లోపు వస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు మూడు పదుల వయసు వారిలోనూ కనిపిస్తోంది. పోస్ట్ కోవిడ్ రోగులు ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో అవగాహన కలిగించనున్నారు. శుక్రవారం ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. విజయవాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఓ బ్యాంక్లో మేనేజర్గా పనిచేన్నాడు. అతను కోవిడ్ నుంచి కోలుకున్న ఇరవై రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వెంటనే అతనికి రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్ ఇవ్వడంతో స్ట్రోక్ ముప్పు నుంచి బయట పడ్డాడు. కోవిడ్ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఓ 25 ఏళ్ల యువకుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఆ ఫంగస్ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడటంతో బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. వీళ్లిద్దరే కాదు ఈ ఏడాది ఎంతో మంది పోస్టు కోవిడ్ రోగులు బ్రెయిన్ స్ట్రోక్కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. చదవండి: (Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..) స్ట్రోక్ లక్షణాలు ఇవీ.. మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, నియంత్రణ తప్పడం, మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోలేక పోవడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఒకటి రెండుగా కనిపించడం, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 80 శాతం మందికి క్లాట్స్ కారణం సాధారణంగా మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తంలో గడ్డ (క్లాట్)లు కట్టే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండె సంబంధిత వ్యాధులు వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టు కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులు కూడా స్ట్రోక్కు గురైనట్లు వైద్యులు చెపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటమే, మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్కు గురయ్యే వారు సకాలంలో ఆస్పత్రికి చేరితే మంచి ఫలితం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా స్ట్రోక్ ద్వారా వచ్చే వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంది. ప్రతి నిమిషమూ విలువైనదే.. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషమూ విలువైనదే. స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడ వచ్చు. 80 శాతం మందికి రక్తనాళాల్లో గడ్డలు కారణంగా బ్రెయిన్స్ట్రోక్ వస్తుంది. అలాంటి వారికి థ్రోంబలైసిస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రక్తనాళాల్లో గడ్డలు కరిగించి, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – డాక్టర్ డి.వి.మాధవీకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వాస్పత్రి, విజయవాడ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగాయి పోస్టు కోవిడ్ రోగులు కొందరు లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగి స్ట్రోక్కు గురవుతున్నారు. కోవిడ్ వైరస్ కారణంగా రక్తనాళాలు దెబ్బతిని, వాటిలో గడ్డలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురవుతున్న వారిని చూస్తున్నాం. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారికి మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి వారు మధుమేహం, రక్తపోటు, కోలస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ డి.అనీల్కుమార్, న్యూరాలజిస్ట్ -
పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?
దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? - సాక్షి సెంట్రల్ డెస్క్ మానసిక సమస్యలను ముందే గుర్తించినా.. కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ 45 వేల మందిపై పరిశోధన కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు. స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా.. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు. ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు. -
లాంగ్ కోవిడ్తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్ కోవిడ్ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ సీరియస్గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్ ఫాగింగ్ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్, మెంటల్ హెల్త్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ట్రేవర్ కిల్పాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్ పెట్రో పరిశోధన చేశారు. ఇన్ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్ డిక్లైన్, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్ఓ సైంటిస్ట్) ముక్కు నుంచి మెదడుకు.. కోవిడ్ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ను ముక్కులోని సెన్సరీ సెల్స్ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్ సిస్టమ్ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్లను పరిశీలిస్తే.. లింబిక్ సిస్టమ్లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ బి.చంద్రశేఖర్రెడ్డి, సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి లాంగ్ కోవిడ్ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్ ఫాగింగ్’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్ కోవిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్ వ్యాక్సిన్తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్ కోవిడ్ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్ బి చంద్రశేఖర్రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్ ఏపీ కొవిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ లాంగ్ కొవిడ్ సమస్య పెరిగింది కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్ కోవిడ్ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్లో లాంగ్ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్షైన్ ఆస్పత్రి -
ఐదేళ్ల శ్రమతో హెల్మెట్ తయారీ, ధర రూ.3700.. ఎన్నెన్నో ప్రత్యేకతలు
వాషింగ్టన్: మన మెదడులోని ఆలోచనలను కనిపెట్టడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అది సులువేనని అమెరికాలోని ఓ సంస్థ చెప్తోంది. కెర్నెల్ అనే సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది. దీనిపై చేసిన పరీక్షల ఫలితాలన్నీ ఆశాజనకంగానే వచ్చాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక వీటిని వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపునుంది. దీని ధరను 50 డాలర్లు (సుమారు రూ. 3,700)గా నిర్ణయించారు. ఈ హెల్మెట్లలో మెదడును అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. వీటితో రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్న తీరును అంచనా వేయవచ్చని అంటున్నారు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదివరకే ఉన్నప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాటిని అధిగమిస్తూ ఈ పరికరాన్ని కనిపెట్టారు. ఉదాహరణకు ఇలాంటి పరికరానికి ఇదివరకు అయ్యే ఖర్చు మిలియన్ డాలర్లుగా ఉండేది. పైగా సైజు పరంగా ఒక గది స్థలాన్ని ఆక్రమించేది. ప్రస్తుతం ఈ పరికరం తక్కువ ఖర్చు, పైగా బరువు చూస్తే 2 పౌండ్లు మాత్రమే ఉంటుంది. ‘సమాజంలో అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి, మా హెల్మెట్ ఉపయోగపడనుందని’ బ్రయాన్ జాన్సన్ చెప్పారు, అతను గత ఐదేళ్ళకు పైగా ఆయన ఈ హెల్మెట్ రూపొందించడానికి పని చేస్తున్నాడు. అదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ కోసం 110 మిలియన్ డాలర్లు డబ్బును కూడా ఖర్చు పెట్టాడు. చదవండి: స్టైలిష్ లుక్తో కట్టిపడేస్తున్న 'యమహా' -
శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తున్న కరోనా
కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడంతో రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతూ పోతుంది. కోవిడ్ -19 రోగుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఇతర అవయవ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. కోవిడ్ -19 వెంటనే శ్వాసకోశ వ్యవస్థ చూపినప్పటికి, తర్వాత కాలంలో ఇది లాంగ్-కోవిడ్ అని పిలువబడే మరొక స్థితికి మారుతుంది. ఇప్పుడు ఈ లాంగ్-కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులను, శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. కోవిడ్ -19 వచ్చిన రోగులలో కొందరు తర్వాత గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులతో తిరిగి ఆసుపత్రులకు వస్తున్నట్లు కనుగొన్నారు. కోలుకున్న రొగులు గుండెకు సంబందించిన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. లాంగ్-కోవిడ్ వ్యాది 2020లోనే మొదట నివేదించారు. కోవిడ్ -19 శరీరంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కోవిడ్ -19 వల్ల గుండె ప్రతికూల ప్రభావానికి గురైతున్నట్లు వివిధ అధ్యయనాలలో కనుగొనబడింది. లాన్సెట్ నివేదిక, జామా నివేదికలో ఇవి గమనించవచ్చు. కోవిడ్ -19 శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడిని పెంచి గుండె కండరాలను బలహీనపరుస్తుంది. 8 నుంచి 12 శాతం గుండె పోటు కూడా వస్తుంది. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇలా రక్త నాళాలపై పడే విపరీతమైన ఒత్తిడి కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న రొగులు గుండెకు సంబందించి ఏమైన ఇబ్బంది కలిగితే వెంటనే గుండెకు సంబందించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. క్రింద చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఛాతిలో అసౌకర్యంగా ఉండటం చేతుల్లో నొప్పి లేదా ఒత్తిడి కలగడం వివరించలేని విదంగా విపరీతమైన చెమట పట్టడం హృదయ స్పందన సక్రమంగా పనిచేయక పోవడం శారీరక శ్రమ లేకున్న అధిక అలసట లేదా అలసట కలగటం చదవండి: కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా -
కరోనా: మెదడుపై దాని ప్రభావం
కరోనా వైరస్ ప్రభావం అనగానే మొదట ఊపిరితిత్తులూ, గుండె వంటి అవయవాలపై దాని ప్రభావం గుర్తొస్తుంది. అయితే మనకు నేరుగా మెదడుపై ప్రభావమని అనిపించకపోయినా... పరోక్షంగా కరోనా మెదడుపై కలిగించే ప్రభావం కారణం గా కనిపించే లక్షణాలూ మనకు తెలుసు. అవే... వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం... ఈ రెండు లక్షణాలూ మెదడుపై కలిగే దుష్ప్రభావాల కారణంగానే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని చాలా దుష్ప్రభావాలే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని దుష్ప్రభావాలు చాలా ఎక్కువే ఉన్నాయంటున్నారు న్యూరోవైద్యనిపుణులు. కరోనా వైరస్ కారణంగా మెదడుపైనా, నాడీ మండలం పైనా... తద్వారా ఏర్పడే అనేక అనర్థాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. కరోనా ప్రభావం నాడీమండలంపై ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది కరోనా వచ్చినప్పుడు అంటే మొదటివేవ్లో చికిత్సకుల దృష్టి అంతా ప్రధానంగా ఊపిరితిత్తులూ, గుండె మీద ఉండింది. ఆ సమయంలో వారు ఊపిరితిత్తులు, గుండె ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఆక్సిజన్, హై కాన్సంట్రేషన్ ఆక్సిజన్ అందించి చాలామంది రోగులను బతికించారు. అయితే అలా కోలుకున్న రోగుల్లో కొందరికి కాలూ, చేయీ పనిచేకపోవడం, మూతి వంకర పోవడం, చుట్టుపక్కల వారిని గుర్తుపట్టకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దాంతో చికిత్సకులు తమ చికిత్సల్లో తాము ఏమైనా అంశాలను విస్మరించారా అంటూ అధ్యయనాలు మొదలు పెట్టారు. పైగా మనకు సీటీ స్కాన్, ఎమ్మారై వంటి అడ్వాన్స్డ్ మెడికల్ పరీక్షల సౌకర్యాలు ఉండటంతో చాలా అంశాలు బయటపడ్డాయి. ఉదాహరణకు మెదడులోని కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆయా భాగాలు ప్రభావితమై ఆ సెంటర్లు నియంత్రించే అవయవాలు సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించారు. అసలు వ్యాధి తగ్గి... ఇంటికి వెళ్లిపోయాక... ఓ మూడు, నాలుగు నెలల తర్వాత ఇలాంటి దుష్ప్రభావాలు రావడాన్ని వైద్యులు, నిపుణులు గుర్తించారు. ఇలా ఎవరికి జరుగుతోందని పరిశీలించినప్పడు మళ్లీ కో–మార్బిడ్ ఫ్యాక్టర్స్ వల్లనే ఇలా జరుగుతోందని తేలింది. అంటే డయాబెటిస్, హైబీపీ, ఊబకాయం ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు... ఇలాంటి జబ్బులు ఉండి, వ్యాధినిరోధకత తగ్గినవారిలో ఇలా జరుగుతోందని నిపుణుల పరిశీలనల్లో తేలింది. కాంప్లికేషన్స్ మూడు రకాలుగా... ముక్కు నుంచి ఆల్ఫాక్టరీ ట్రాక్ట్ (వాసన కోల్పోవడం తార్కాణం) ఇమ్యునలాజికల్ పద్ధతి తన రోగ నిరోధక వ్యవస్థే తన మీద ప్రభావం చూపడం (సైటోకైన్ స్టార్మ్) హైపాక్సిక్ ఈవెంట్ డ్యామేజ్ (మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల / నాలుగు నిమిషాల కంటే తగ్గితే శాశ్వతంగా దెబ్బతినే అవకాశం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (మెదడు, వెన్నుపాము, రెటీనా) పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ (నరాలు, గాంగ్లియా, కండరాలు) నాడీ మండలానికి చెందిన ప్రతిదీ దెబ్బతింటుందని ఇప్పటి అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అంటే వచ్చే అనర్థాలన్నీ ఈ ఆరు రకాల అవయవాల్లో వచ్చే ప్రమాదం ఉందన్నమాట. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్పై ప్రభావం కారణంగా కనిపించే లక్షణాలివి... వాసన తెలికపోవడం అనే లక్షణం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. మనలో చాలామందికి తెలిసిన దుష్ప్రభావం ఇది. రుచి తెలియకపోవడం అన్నది కూడా అందరికీ తెలిసిన మరో లక్షణం. జీబీ సిండ్రోమ్: వాస్తవానికి ప్రతి నాడికీ, నరానికీ పైన మైలైన్ షీత్ అనే ఓ పొర ఉంటుంది. ఆ పొరకు ఇన్ఫెక్షన్ రావడమే మైలైటిస్. మైలీన్ షీత్ అనే ఈ పొర వల్లనే మెదడు నుంచి వెళ్లే ఆదేశాలు ఆయా అవయవాలకు వెళ్తుంటాయి. దాంతో మెదడు ఆదేశాల మేరకు ఆయా అవయవాలు స్పందిస్తుంటాయి. మైలైన్ షీత్ అనే ఈ పొర దెబ్బ తినే కండిషన్ను ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ లేదా ‘జీబీ సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా ఎవరైనా రోగులు ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన సందర్భంలో దాని అనంతర అనర్థంగా (పోస్ట్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్గా) ఈ జీబీ సిండ్రోమ్ చోటు చేసుకుంటుంది. అలాంటప్పుడు మెదడు నుంచి ఏ అవయవానికి కనక్ట్ అయ్యే మైలీన్ షీత్ దెబ్బతింటే ఆ అవయవం చచ్చుపడిపోతుంది. సాధారణంగా ఈ మైలీన్ షీత్ మెల్లగా మళ్లీ నార్మల్కు వస్తుంది. అలా రాగానే ఆ అవయవం కదలికలు కూడా మామూలుగా మారిపోతాయి. ఇలా జరగడానికి సాధారణంగా దాదాపు రెండు నెలలు పట్టవచ్చు. కాళ్లూ, చేతులకు ఇలాంటి పరిస్థితి వస్తే పర్లేదు. కానీ ఏ ఊపిరితిత్తులకు అందాల్సిన ఆదేశాలు అందకుండా పోయే పరిస్థితి వస్తే అది తప్పక మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావం. మిల్లర్ఫిషర్ సిండ్రోమ్ : ఇది కూడా గులియన్ బ్యారీ సిండ్రోమ్ లాంటిదే. ఇందులో కూడా రోగి కండరాలపై నియంత్రణ కోల్పోతారు. ముఖ్యంగా కంటి కండరాలపైనా అలాగే కొన్ని టెండన్స్పైన. పాదం పైకెత్తలేకపోవడం (ఫుట్ డ్రాప్) కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం (క్రాంప్స్) ఫెటీగ్ (అలసట), పనుల్లోగానీ, ఏ వ్యాపకాల్లోగానీ ఆసక్తి లేకపోవడం దేహంలోని చర్మంపైనా లేదా చేతుల్లోని చర్మంపైనా తిమ్మిర్లు, గుచ్చినట్లుగా అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్న భావనతో స్పర్శ తెలియకపోవడం, మండటం, మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు (దీన్ని పారాస్థీషియా అంటారు). ముఖం కండరాలపై నియంత్రణ కోల్పోవడం, ముఖం పక్షవాతానికి గురికావడం (ఫేషియల్పాల్సీ) చూపు మందగించడం, కన్ను, కంటి గుడ్డు కదిలించలేకపోవడం నరాల కారణంగా కనిపించే మానసిక సమస్యలు అయోమయం తీవ్రమైన కుంగుబాటుకు / వ్యాకులత (డిప్రెషన్)కు గురికావడం యాంగై్జటీ (తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం) శారీరక కదలికలు సంబంధించి... వణుకు, దేహాన్ని కదలించేందుకు చేసే ప్రయత్నంలో పాక్షికంగా మాత్రమే అదుపు సాధించే అటాక్సియా వంటి లక్షణాలు ఉంటాయి. మింగడంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. ఈ కండిషన్ను ‘డిస్ఫేజియా’ అంటారు. మరికొన్ని దుష్ప్రభావాలు అలాగే... రాబ్డోమయోలైసిస్ (కండరాలు తీవ్రంగా దెబ్బతినడం, కండరాలు చచ్చుబడిపోవడం వంటి అనర్థాలు ఏర్పడవచ్చు. దాంతోపాటు మూత్రం చాలా చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం, బలహీనత, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలూ అరుదుగా కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు కోవిడ్ కారణంగా గానీ లేదా మరేదైనా కారణంగా గానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు... ఆ అనర్థాలను గుర్తించడానికి సీటీ బ్రెయిన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై స్పైనల్ కార్డ్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. అయితే సీటీ బ్రెయిన్తో పోలిస్తే ఎమ్మారై బ్రెయిన్లో చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చికిత్స మెదడుపై ప్రభావం కారణంగా కనిపించిన లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేసే చికిత్సలో శస్త్రచికిత్స చాలా చాలా అరుదుగానే అవసరం పడుతుంది.అయితే కరోనా కారణంగా నరాల ఇబ్బందులు ఏవైనా వచ్చినవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారిలో సమయం గడిచిన కొద్దీ క్రమంగా తెరుకునే అవకాశమే ఎక్కువ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మెదడుకు సంబంధించిన తొలి లక్షణాలు జ్ఞాపకశక్తి తగ్గడం (బ్రెయిన్ ఫాగ్), మాట తడబడటం, మాటల్లో తేడా రావడం ఈ లక్షణాలన్నీ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్లో కనిపించే ప్రధాన లక్షణాలైన తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, ఇటీవల కొత్తగా కనిపిస్తున్న లక్షణాలైన నడుమునొప్పి, కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు (డయేరియా) వంటి వాటికంటే ముందే కనిపిస్తున్నాయి. అంటే ఈ లక్షణాలన్నీ పైలట్ లా ముందే వస్తున్నాయిని నిపుణులు గుర్తించారు. అందుకే అమెరికాలాంటి పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలు లక్షణాలు కనిపించే వరకు ఆగకూడదని, ముందే ఆసుపత్రులకు రావాలని అక్కడి నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కరోనా సోకిన వారిలో 30 % మందికీ ఆక్సిజన్ పెట్టాల్సిన వారిలో 45% రోగులకు వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిన వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని కొన్ని పరిశీలనల్లో తేలింది. మెదడు (సెంట్రల్ నర్వస్ సిస్టమ్)పై దుష్ప్రభావాలివి : తలనొప్పి, పగలు నిద్ర వస్తుండటం, రాత్రి అస్సలు నిద్ర పట్టకపోవడం, స్ట్రోక్ లాగా రావడం, కాలూ చేయీ పని చేయకపోవడం ఇలా జరగడానికి రెండు రకాల కారణాలు... మొదటిది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (ఇస్కిమిక్) వల్ల ఆయా మెదడు భాగాలకు రక్తం అందకపోవడం, దాంతో మెదడులోని ఆ భాగం ఏ అవయవాన్ని నియంత్రిస్తుందో ఆ అవయవంపై దుష్ప్రభావం పడటం, ఇక రెండోది మెదడులో రక్తస్రావం (హేమరేజ్) అయితే ఆలా రక్తస్రావమైన భాగం ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ అవయవభాగంపై దుష్ప్రభావం పడటం. మూర్చ రావడం, మెదడువాపు రావడం వంటి అనర్థాలు కనిపిస్తున్నాయి. అలాగే కొందరిలో పక్షవాతం (స్ట్రోక్), మూర్చ (ఎపిలెప్సీ), మెనింజైటిస్ (మెదడులోని కొన్ని పొరల్లో వాపు కనిపించడం / మెదడువాపు) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇలాంటి మరో దుష్ప్రభావమే మైలైటిస్. అటాక్సియా అనే మరో రకం కండిషన్ కూడా ఏర్పడవచ్చు. సాధారణంగా మన అవయవాలపై మనకు పూర్తిగా నియంత్రణ ఉండటం మనకు అనుభవంలో ఉన్న విషయమే. అయితే కొన్ని అవయవాలు మన నియంత్రణలో ఉండకుండా పోవడం, వాటిపై పాక్షిక నియంత్రణ మాత్రమే కలిగి ఉండే కండిషన్ను ‘అటాక్సియా’ అంటారు. ఇది కూడా మెదడుపై కరోనా తాలూకు దుష్ప్రభావం వల్ల కనిపించే మరో అనర్థంగా చెప్పవచ్చు. అలాగే నిద్రకు సంబంధించిన అంతరాయాలు, డిప్రెషన్, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అయోమయం, అంతా గందరగోళంగా అనిపిస్తుండటం వంటివన్నీ ‘కేంద్రనాడీవ్యవస్థ’ పై కనిపించే దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు. -డాక్టర్ పి. రంగనాథం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ చదవండి: మేడమ్ నా వయసు 45 ఏళ్లు.. ఆ ట్యాబ్లెట్లు వాడొచ్చా? -
కోమా నుంచీ బయటపడవచ్చు!
సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్ అన్కాన్షియస్’ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు. 1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్గా తీసుకోవడం వల్లగానీ, కార్బన్డయాక్సైడ్, సయనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్ ఆర్గాన్స్) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు. కార్డియాక్ అరెస్ట్ – సాధారణంగా కార్డియాక్ అరెస్ట్తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్తో – సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి. అంటే సాధారణంగా 100–140 వరకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్ ఆస్మోలార్ కోమా అంటారు. 2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్ కోమా’ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత. ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను నివారించవచ్చు. హైపర్ న్యాట్రీమిక్ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య. ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. లివర్ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్బీసీ, హెచ్బీబీ వంటి వైరస్ల వల్ల లివర్ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్ను ‘గ్లాస్గో కోమా స్కేల్’గా చెబుతారు. ఇందులో స్కేల్ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్ ఆదేశాలకు రోగినుంచి స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్గా 15 ఉంటుంది. అంటే గ్లోస్గో స్కేల్ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. ►ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. ►బి – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. ►సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. -
మంచి నిద్రతో మెదడుకు మేత!
సాక్షి, హైదరాబాద్: రోజూ ప్రశాంత వాతావరణంలో అంతరాయం లేని మంచి నిద్ర పోవడం చాలా మంచిదని బామ్మలు, పెద్దవాళ్లు చెబుతూ వస్తున్నదే. అయితే మంచి నిద్రలో మెరుగైన ఆరోగ్యంతో పాటు మన ‘మెదడు ఆరోగ్యానికి’కూడా ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలిందని చెబుతున్నారు. మంచి నిద్రతో మెదడులోని మలినాలు, విషపూరితంగా మారే ప్రోటీన్లు దూరం అవుతాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఆరోగ్యవంతమైన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల (న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్) బారిన పడే అవకాశాలున్నాని చెబుతున్నారు. (చదవండి: రాదేమి కునుకు!) ‘మలినాల ను తొలగించడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు నరాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇలా మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంతస్థాయిలో జరుగుతున్నా మంచి, దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతోంది’ అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డా. రవి అల్లాడా వెల్లడించారు. మానవులు మొదలుకుని జంతువులు, పక్షులు, ఫలాలపై వాలే దోమల్లో నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. మంచి నిద్రకు సూత్రాలు.. పొద్దునే నడక, చిన్నపాటి వ్యాయామం. మంచంపై ల్యాప్టాప్లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించాలి. రాత్రిళ్లు మితంగా తినాలి. నిద్రకు రెండు, 3 గంటల ముందు ఎక్కువగా తినొద్దు. మద్యం, కాఫీ, టీ, చాక్లెట్లు రాత్రి తీసుకోరాదు. æ రాత్రి సమయాల్లో నీలం కాంతి లైట్లకు దూరంగా ఉండాలి. -
షాకింగ్: మహిళల మెదడులో సూదులు
బీజింగ్: ఓ మహిళ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు వెళ్లింది. డాక్టర్లు ఆమె తలకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టులో ఆమె మెదడులోకి రెండు పొడవైన సూదులు చొచ్చుకెళ్లినట్లు గుర్తించారు. చిత్రం ఏమిటంటే.. అవి తలలోకి ఎలా చొచ్చుకెళ్లాయో ఆమెకి కూడా తెలీదు. దానికి తోడు పుర్రెపై కూడా ఎలాంటి గాయాలు లేవు. దీంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. విచిత్రం ఏంటంటే దీని గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, ఎందుకైనా మంచిదని.. ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్ సమయంలో ఆమె తలలోకి వెళ్లినవి కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయని వైద్యులు గుర్తించారు. (చదవండి: లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!) దీని గురించి వైద్యులు ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. ‘గతంలో ఎప్పుడైనా నీకు సర్జరీ జరిగిందా’ అని అడిగారు. ఇందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చింది. పోనీ.. తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పింది. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. తనకు ఏ రోజు తలకు సంబంధించిన సమస్యలు రాలేదని జుహు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. జుహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని, చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (వైరల్: వందేళ్ల కిందటి శవం నవ్వుతోందా?) అయితే, తాము యాత్రలకు వెళ్లినప్పుడు జుహును పిన్ని ఇంట్లో ఉంచామని, అప్పుడు ఆమె తమ బిడ్డ తలపై రెండు నల్లని గుర్తులు చూశానని తమతో చెప్పిందన్నారు. అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు. -
పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..
పన్ను నొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. పంటిలో ఏర్పడిన చిన్న ఇన్ఫెక్షన్ను నియంత్రించక పోవడంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో 5 నెలల పాటు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. రెండుసార్లు గుండె ఆగిపోయి ప్రాణం పోయినంత పనైంది. దాదాపు 30 కిలోల బరువును కోల్పోయింది. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. తూర్పు యార్క్షైర్లోని స్నైత్కు చెందిన రెబెక్కా డాల్టన్ (30)కు గత ఏడాది డిసెంబరులో జ్ఞాన దంతంలో చీముగడ్డ ఏర్పడింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన డాక్టరు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీ కావడంతో పట్టించుకోలేదు. దీంతో మార్చి నెలలో మళ్లీ తిరగబెట్టింది. సమస్య తీవ్రమై ఇన్ఫెక్షన్ మెదడు దాకా పాకిపోయింది. ఫలితంగా మతిమరుపు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఆమె తిరిగి వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెదడు, గుండె, కాలేయంలో బాక్టీరియా గడ్డలను గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆమెకు హల్ రాయల్ వైద్యశాలలోని న్యూరోలాజికల్ విభాగానికి తరలించారు. ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత, రెబెక్కా కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందనీ, 30 ఏళ్ల వయసులో కనీసం టాబ్లెట్ కూడా తీసుకోలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడటం తనను షాక్కు గురిచేసిందని రెబెక్కా తన బాధలను గుర్తు చేసుకున్నారు. 30 కిలోల కంటే ఎక్కువ బరువు కోల్పోయాననీ, ఇప్పటికీ తన పని తాను చేసుకోలేకపోతున్నానని వాపోయారు. ఈ ఉదంతం జీవితంపై తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. సో... బీకేర్ఫుల్. యాంటిబయోటిక్స్ వాడాం కదా..నొప్పి పోయిందిలే అనే నిర్లక్ష్యం అసలు వద్దు..ఎందుకంటే చాలాసార్లు పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మరోవైపు ఆమెకు కచ్చితంగా కరోనా వస్తుందని భయపడిపోయానని రెబెక్కా తల్లి తెలిపారు. అదృష్టవశాత్తూ కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడం సంతోషం కలిగించిందన్నారు. కాగా గతంలో యుకెకు చెందిన ఆడమ్ మార్టిన్ కూడా దాదాపు ఇదే సమస్యతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డారు. పళ్లలో పాప్ కార్న్ ఇరుక్కోవడంతో అది గమ్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది కాస్తా దంతాల నుంచి గుండె వరకు వ్యాపించడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెల్లో ఒక కవాటాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
బీరు, వైన్లతో ఆ రిస్క్..
లండన్ : మద్యం అతిగా సేవించే వారి మాటతడబడటం, చూపు మసకబారడం చూస్తుంటాం. అయితే ఆల్కహాల్ మెదడు వయసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిర్ధిష్టంగా వెల్లడికాని క్రమంలో తాజా అథ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చింది. మద్యం తీసుకునే మోతాదును బట్టి మెదడు వయసు పెరుగుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నిత్యం మద్యం సేవించే 45 నుంచి 81 సంవత్సరాల మధ్య వయసున్న 11,600 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. రోజూ ఒక బీరు లేదా గ్లాస్ వైన్ను మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాముతో వారి మెదడు క్రమంగా కుచించుకుపోతున్నట్టు ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది. రోజులో అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ఆల్కహాల్తో వారి మెదడు రోజున్నరతో సమానమైన 0.02 సంవత్సరాల వయసు మీరుతుందని పరిశోధకులు గుర్తించారు. మద్యపానం, పొగతాగడం మెదడు వయసుమీరడానికి దారితీస్తుందనేది తొలిసారిగా కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ సదరన్ కాలిపోర్నియా పరిశోధకులు నిర్ధారించారు. రోజూ మద్యం సేవించే వారి మెదడు మద్యం తక్కువగా లేదా అసలు ముట్టని వారి మెదడు వయసుల మధ్య వ్యత్యాసాన్ని ఎంఆర్ఐ ద్వారా పరిశోధకులు పరిశీలించారు. ఒక గ్లాస్ వైన్, పింట్ బీరుకు మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ద్వారా మద్యపాన ప్రియుల మెదడు 0.02 సంవత్సరాలు వయసు మీరుతున్నట్టు వారు లెక్కగట్టారు. పొగతాగేవారిలోనూ ఇదే ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి : చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు... -
రేడియో సర్జరీ అంటే ఏమిటి?
మావారి వయసు 36 ఏళ్లు. ఇటీవల తరచుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దాంతో న్యూరాలజిస్ట్ను కలిశాం. ఆయన అన్ని పరీక్షలూ చేసి, మెదడు లోపల కాస్తంత లోతుగా 2.5 సెంటీమీటర్ల సైజ్లో కణితి (ట్యూమర్) ఉందని చెప్పారు. ఇలాంటి ట్యూమర్లకు రేడియో సర్జరీ మంచిదని సలహా ఇచ్చారు. మేం చాలా ఆందోళనగా ఉన్నాం. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్లు. ఎంతో భయంగా ఉంది. ఈ సర్జరీ గురించి వివరంగా చెప్పండి. మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే మీరుగానీ, మీ కుటుంబ సభ్యులుగానీ ట్యూమర్ విషయంలో ఎలాంటి ఆందోళనలూ, భయాలు పెట్టుకోనవసరం లేదు. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్ఆర్ఎస్ (స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ) లేదా రేడియో సర్జరీ అని పిలిచే అత్యాధునిక ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ... కేవలం అనారోగ్యకరమైన కణజాలాన్ని మాత్రమే తొలగించే లక్ష్యంతో డాక్టర్లు సర్జరీ నిర్వహిస్తారు. ఈ లక్ష్యాన్ని రేడియో సర్జరీ మరింత ప్రభావవంతంగా నెరవేరుస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్స్రేల నుంచి ఫోటాన్ శక్తిని ట్యూమర్పైకి పంపిస్తారు. మెదడుకు కేవలం 2 గ్రేల రేడియేషన్ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ట్యూమర్ను సమూలంగా నిర్వీర్యం చేయడానికి అంతకన్నా ఎక్కువ రేడియేషన్ అవసరం. అందుకే స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీలోఒక ప్రత్యేకమైన ఫిల్టర్ గుండా రేడియేషన్ను ట్యూమర్పైన మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేస్తారు. ఇందుకోసం 13 నుంచి 22 గ్రే ల రేడియేషన్ను వాడతారు. ఇది చాలా ఎక్కువ మోతాదు (హై డోస్) రేడియేషన్. అయినప్పటికీ ఈ రేడియేషన్ అంతా ప్రతి కిరణంలోనూ వందో వంతుకు విభజితమవుతుంది. అయితే మొత్తం రేడియేషనంతా ట్యూమర్ను టార్టెట్గా చేసుకొని పూర్తిగా దానిమీదే కేంద్రీకృతమవుతుంది. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. ఈ రేడియో సర్జరీలో ఫ్రేమ్ వాడరు. అందుకే దీన్ని ఫ్రేమ్లెస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని కూడా అంటారు. అయితే ఈ సర్జరీ చేయాలంటే ట్యూమర్ పరిమాణం 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. కానీ అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే సర్జరీ చేసి, దాని పరిణామాన్ని తగ్గించి, ఆ తర్వాత రేడియో సర్జరీ ద్వారా మొత్తం ట్యూమర్ను తొలగించవచ్చు. రేడియేషన్ పంపించిన తర్వాత రెండేళ్లకు కణితి పూర్తిగా కుంచించుకుపోతుంది. 3 నుంచి 5 ఏళ్లలో 60 నుంచి 70 శాతం తగ్గుతుంది. చివరికి మచ్చలాగా మిగులుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్లో రేడియోసర్జరీ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఒకేసారి ఐదు ట్యూమర్లనూ తొలగించవచ్చు. ఈ స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ కోసం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. ఔట్పేషెంట్గానే ఈ చికిత్సను పూర్తిచేయవచ్చు. ఇది పూర్తిగా నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే దీని కోసం శరీరం మీద ఎలాంటి కోత/గాటు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్ అంటే సాధారణంగా ఎంతోకొంత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఈ రేడియో సర్జరీలో కోత ఉండదు కాబట్టి దీనిలో ఎలాంటి రక్తస్రావమూ ఉండదు. కోత ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. చికిత్స జరిగే సమయంలో ట్యూమర్ కణాలు తప్ప, దాని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన మెదడు కణాలకు ఎలాంటి ప్రమాదమూ జరగదు. శరీరానికి కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీలో కణితిలోని కణాలు పక్కకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇందులో ఆ రిస్కు ఉండదు. సంప్రదాయక శస్త్రచికిత్సలో పొరబాటున మిగిలిపోయిన ట్యూమర్ కణాలను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. చికిత్స చాలా కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణ సర్జరీతో చికిత్స అందించలేని ట్యూమర్లను కూడా దీని ద్వారా నాశనం చేయవచ్చు. వృద్ధులకు, సర్జరీ చేయడం కుదరని పేషెంట్లకు కూడా ఈ రేడియో సర్జరీని చేయవచ్చు. కాబట్టి మీ డాక్టర్ సూచించిన విధంగా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ వారికి ఈ సర్జరీ చేయించండి. ట్యూమర్ అంటే అది క్యాన్సరేనా? మా ఫ్రెండ్ వాళ్ల నాన్న చాలాకాలంగా ట్యూమర్తో బాధపడుతున్నారు. అసలు ట్యూమర్ అంటే ఏమిటి? అంటే అది క్యాన్సరేనా? దీనికి చికిత్స లేదా? శాశ్వత పరిష్కారం ఏమిటి? ట్యూమర్లను ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేమిటి? దయచేసి ఈ వివరాలన్నీ చెప్పండి. కణాలు తమ నియతి (కంట్రోల్) తప్పి, విపరీతంగా విభజన చెంది పెరిగితే కణితి (ట్యూమర్) ఏర్పడుతుంది. కణుతులు అన్నీ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కాని కణుతులును బినైన్ ట్యూమర్లు అంటారు. క్యాన్సర్ కణాలైతే కణితి ఏర్పడిన చోటి నుంచి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కానీ బినైన్ కణాలు అలా వ్యాపించవు. కానీ కణితి పక్కనున్న నరంపైన ఒత్తిడి పడేలా చేస్తాయి. దాంతో ఇతర సమస్యలు రావచ్చు. ట్యూమర్ పెద్ద సైజులో ఉన్నా, కీలకమైన నరాల దగ్గర ఏర్పడినా ఫిట్స్ రావచ్చు. మెదడులో ట్యూమర్ వల్ల కొన్నిసార్లు కాళ్లూచేతులు పడిపోవడం లాంటి ప్రమాదం కూడా ఉండవచ్చు. అందుకే బినైన్ కణుతులకు కూడా చికిత్స అందించాలి. బినైన్ ట్యూమర్లను ఒకసారి తొలగిస్తే ఇక జీవితాంతం సమస్య ఉండదు. సాధారణంగా ఈ ట్యూమర్లు జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడతాయి. వీటికి పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) కారణాలూ తోడవుతాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారం లాంటి అంశాలు కణితి ఏర్పడే జన్యుతత్వాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అందువల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడకుండా నివారించలేము. మంచి ఆహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే కొంతవరకు మేలు. మెదడులో ట్యూమర్ ఉన్నప్పుడు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇవి చాలా వరకు పరీక్షల్లో మాత్రమే బయటపడుతుంటాయి. కణితి పెరిగి మరీ పెద్దగా అయినప్పుడు మాత్రమే ఇబ్బందులు తలెత్తవచ్చు. పదేపదే తలనొప్పి వస్తున్నదంటే మెదడులో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించవచ్చు. తలనొప్పితో పాటు వికారంగా ఉండటం, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ రవిసుమన్ రెడ్డి, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద çహాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బాబుకు ఆటిజమ్... తగ్గుతుందా?
మా బాబుకు నాలుగేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ కనిపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా? ఆటిజమ్ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటేనే నాకు వణుకు వచేస్తోంది. హోమియోలో ఆపరేషన్ లేకుండా చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలపాళ్లు తగ్గడంవల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ రాత్రంతా గురక... మర్నాడంతా మగత పల్మునాలజి కౌన్సెలింగ్స్ నా వయసు 52 ఏళ్లు. ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి రాత్రిళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయి ఉంటోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టమవుతోంది. నిద్రలో పెద్ద శబ్దంలో గురక పెడుతున్నట్లు ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఇక మర్నాడు పగలంతా బాగా అలసటగా ఉంటోంది. నా సమస్య ఏమిటి? ఇదేమైనా ప్రమాదమా? గురక రాకుండా చేయలేమా? స్లీప్ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారిలో నిద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి... అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్పియాలో సంభవించే చాలా ప్రమాదకరమైన పరిణామం అన్నమాట. కారణాలు, పరిణామాలు : టాన్సిల్స్, సైనసైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గండెజబ్బులు ఉన్నవారికి స్లీప్ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం / చికిత్స : ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగానే తీసుకునేలా జాగ్రత్త పడాలి.ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చికిత్స విషయానికి వస్తే స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ డాక్టరుకు చూపించుకోండి. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చురుకైన మెదడు కోసం...
మెదడు చురుగ్గా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. అది పది కాలాల పాటు హాయిగా పనిచేయాలన్నా, చాలాకాలం పాటు మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి. తీసుకోండి. మీ మెదడును చురుగ్గా ఉంచుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ : మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదా: దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) : కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచిది కాదుగానీ... మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు మాంసాహారం (ప్రధానంగా కోడి మాంసం), గుడ్లు, చేపలు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. అయితే ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన మంచి కొవ్వులను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమంగా తయారు చేసే డాల్డా వంటి పదార్థాలో ఉంటాయి. వీటి ద్వారా తయారు చేసే కేక్లు, బిస్కెట్లు మెదడును చురుగ్గా ఉంచవు. అమైనో ఆసిడ్స్ : మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు దోహదపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఈ అమైనో ఆసిడ్స్ అన్నవి ప్రోటీన్స్నుంచి లభ్యమవుతాయి. ఈ న్యూరోట్రాన్స్మిటర్స్పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువే. విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు) : మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో ఆసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్లో మార్చడంలోనూ బాగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమైవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 70 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. అయితే మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుంటాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం రెండు లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది. ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు రెండు లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకోవాలి. టీ, కాఫీ అనే ద్రవాహారం చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే పరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, దాంతో వేగంగా అలసిపోయేలా చేస్తుంది. కూల్డ్రింక్స్తో కూడా అదే అనర్థం చేకూరుతుంది. -
అకస్మాత్తుగా కాలూ– చేయి బలహీనం...కారణమేమిటి?
నా వయసు 30 ఏళ్లు. ఒకరోజు నాకు ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టంగా అనిపించింది. అనుమానం వచ్చి డాక్టర్ను కలిశాను. ఆయన ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. దాంతో నేను, మా కుటుంబసభ్యులం చాలా ఆందోళనకు గురవుతున్నాం. నాకు ఎందుకిలా జరిగింది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కారం ఏమిటి? పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ సమస్యకు కారణం దొరకడం మీ అదృష్టం. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల ఈ విధంగా జరుగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరియో వీనస్ మాల్ఫార్మేషన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా కష్టంగా తోచిందని మీరు చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటాం. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలు నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్స్ ఏర్పడి ఉంటాయి. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ ఉన్నట్లు అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. ఒకవేళ మందులతో క్లాట్ కరగకపోతే బ్రెయిన్ సర్జరీ ద్వారా క్లాట్ను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం ఏర్పరచవచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా న్యూరోసర్జన్ను సంప్రదించండి. డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట హైదరాబాద్ -
బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!
బుర్ర తక్కువ మనిషి అని మీరెవరినైనా తిట్టారనుకోండి. అవతలి వాళ్లు.. వెంటనే ఇంతెత్తున ఎగురుతారు. నన్ను అంతమాట అంటావా? అని కయ్యానికి దిగుతారు! కానీ.. రష్యాలోని ఓ 60 ఏళ్ల వ్యక్తిని ఈ మాట అంటే మాత్రం పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు! ఎందుకంటారా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇతనికి మెదడులో సగం లేదు కాబట్టి! ఆశ్చర్యంగా ఉందా? అసలు ఎలా బతికాడన్న అనుమానం వస్తోందా? చదివేయండి. మరి.. మాస్కోలోని బుర్నాసియాన్ ఫెడరల్ మెడికల్, బయో ఫిజికల్ సెంటర్లో కొన్ని రోజుల క్రితం 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. ఒక కాలు, చేయి కదపలేకపోతున్నా అని అంటే.. డాక్టర్లు స్కాన్ చేయించారు. తీరా ఆ మెదడు స్కాన్ను చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎడమ వైపు భాగం అసలు లేనే లేదు. నల్లటి ఖాళీ మాత్రమే కనిపిస్తోంది. ఇలా సగం మెదడు మాత్రమే ఉంటే.. ఏదో ఒక సమస్య ఉండి తీరాలనుకున్న డాక్టర్లు.. అతడి గురించి వాకబు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చదవడమే కాకుండా.. రెడ్ ఆర్మీలో కూడా పనిచేశాడు. ఏరకమైన ఇబ్బందులూ లేకుండా ఎంచక్కా కుటుంబాన్ని కూడా నడుపుకొచ్చారు. పిండంలో ఉన్న సమయంలోనే అతడి మెదడు సగమే పెరిగి ఉంటుందని.. స్కాన్ల వంటి టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో లేని కారణంగా అతడు భూమ్మీదకు రాగలిగాడని న్యూరాలజిస్ట్ మరీనా అనికినా చెప్పారు. చెడిపోయిన మెదడు భాగాలను అతి అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశమున్నా దుష్పరిణామాలకు దారితీయొచ్చని.. ఈ వ్యక్తి విషయంలో సగం మెదడు లేకపోయినా ఏరకమైన ఇబ్బంది లేకపోవడం అద్భుతమనే చెప్పాలని అంటున్నారు అనికినా. సాధారణంగా మెదడు కుడివైపు భాగం సృజనాత్మకమైన అంశాలకు ఉపయోగపడితే.. ఎడమవైపు భాగం సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్స్ వంటి అంశాలకు పనికొస్తుంది. కానీ ఈ వ్యక్తిలో ఎడమ భాగం లేకున్నా సమస్యలు లేకపోవడం గమనార్హం. -
ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?
జరిగిన కథ: చైనా శాస్త్రవేత్తలు కోతికి మనిషి మెదడును సెట్ చేయడంతో ‘కోతిలోకం’లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కొద్దికాలంలోనే కోతికి మనిషి బుద్ధులు వచ్చాయి. తలకొన అడవిలో రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార కోతి గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్లూ ఆయుధాలు తీశాయి. కాని అవి నకిలీ ఆయుధాలు కావడంతో ఇరువర్గాల్లో ఒక్క కోతి కూడా గాయపడలేదు. తరువాయి భాగం:‘‘ఇలా అయితే లాభం లేదు. బాహాబాహీకి దిగి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం’’ బస్తీమే సవాల్ అని అరుస్తూ బాహాబాహీకి దిగాయి రియల్ ఎస్టేట్ కోతి గ్యాంగులు.సరిగ్గా పది నిమిషాల తరువాత...‘‘ఆగండి’’ అనే అరుపు వినబడింది. రెండు గ్యాంగులూ కొట్లాట ఆపి ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాయి.‘‘ఎవరు మీరు? శాంతిదూతా?’’ అడిగింది గ్యాంగ్లో ఒక కోతి.‘‘కాదు. ఎల్ఐసీ ఏజెంట్ని. నా పేరు పొదుపేష్ కుమార్. ఏటూరునాగారం అడవి నుంచి వస్తున్నాను’’ అన్నది కొత్తగా వచ్చిన ఆ కోతి.‘‘మాతో నీకేం పని?’’ అడిగింది గ్యాంగ్లో కోతి.‘‘బాహాబాహీ రక్ష అని కొత్త పాలసీ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ టాక్ ఎబౌట్..’’ అన్నది ఎల్ఐసీ కోతి.‘చెప్పి చావు’ అన్నట్లుగా చూశాయి రెండుగ్యాంగుల కోతులు.ఎల్ఐసీ కోతి చెప్పటం మొదలు పెట్టింది:‘‘బాహబాహీ రక్షలో... డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొట్లాటలో మీ పళ్లు విరిగాయనుకోండి మీరు ఒక్కపైసా జేబులో నుంచి తీయాల్సిన పనిలేదు. డెంటల్ ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు వస్తాయి. మీ తలకు గాయాలుఅయ్యాయనుకోండి...హెడ్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయి. టైమ్ బాగోలేక మీరు పోయారనుకోండి....‘అమర జ్యోతి’ ఇన్సూరెన్స్ స్కీం కింద మీ కుటుంబ సభ్యులకు అక్షరాలా.....ఇంత డబ్బు వస్తుంది....’’ఎల్ఐసీ కోతి నాన్స్టాప్గా చెప్పుకుంటూ పోతుంది. పొదుపేష్ కుమార్ స్పీచ్ ధాటికి రెండు కొతి గ్యాంగులూ మూర్ఛపోయాయి.‘‘అయ్యో పాపం!’’ అనుకుంటూ తలకొన కోతి ఒకటి తాడి చెట్టు ఎక్కి...తాటికల్లు తెచ్చి వాటి ముఖం మీద చల్లింది. అప్పటికిగాని వాటికి మెలకువ రాలేదు.రెండు కోతిగ్యాంగులూ కాస్త తెరుకున్నాయో లేదో...‘‘నమస్కారం. నా పేరు వివాహిత్ విందా. వికారబాద్ అడవిలో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. కోతి మ్యారేజ్ బ్యూరోలలో రెండు తెలుగు స్టేట్స్లో మనదే టాప్. మీకు తెలుసు...పెళ్లి అనేది నూరేళ్ల పంట... ఆ పంట ఫలాలు చేతికందాలంటే మాలాంటి మ్యారేజ్ బ్యూరోలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి. మునుపటి రోజులు కాదు...ఒక కోతికి పెళ్లి జరగాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు. ఎప్పుడైతే మనిషి మెదడు జన్యువులను మన మెదడులో ప్రవేశ పెట్టారో...మనిషి ఆచారవ్యవహారాలు కూడా మనకు వచ్చాయి. అందులో కట్నకానుకలు కూడా ఒకటి. ఈ సిస్టమ్ మనలోకి వచ్చాక మన జాతిలో ‘మ్యారేజ్’ అనే మాటే వినబడం లేదు. కోట్లకు కోట్లు పోసి ఎక్కడ పెళ్లిళ్లు చేస్తామండీ!ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మాలాంటి మ్యారేజ్ బ్యూరోల అవసరం వస్తుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి చాలు...వారం తిరక్కుండానే...ఒక మంచి ఆడకోతిని చూసి మ్యారేజ్ చేసే బాధ్యతను మా మ్యారేజ్ బ్యూరో తీసుకుంటుంది... ఇందుకు మీరు పెద్దగా ఇవ్వాల్సిందేమీ లేదు...మీరు పుచ్చుకున్న కట్నకానుకల్లోనే కొంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుంది...’’ ఇలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూనే....‘‘హాbŒ ...హాచ్...హాచ్’’ అని మూడుసార్లు గట్టిగా తుమ్మింది మ్యారేజ్ బ్యూరో కోతి.అయిదు నిమిషాలు తిరిగేలోపే...అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో నుంచి మూడుకోతులు దిగాయి. తుమ్మిన కోతిని అమాంతం ఎత్తి అంబులెన్స్లో పడేశాయి. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఆకోతి అరిచేలోపే చేతికి సెలైన్ పెట్టేశాయి.కొద్దిసేపటి తరువాత...అంబులెన్స్ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టుకు దగ్గర్లో ఏడంతస్తుల ఖరీదైన భవంతి ఉంది.చాలా ఎత్తులో అమర్చిన బోర్డ్లో...‘చచ్చినా చావనివ్వం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్’ అనే అక్షరాలు కనిపించాయి.అంబులెన్స్ నుంచి దిగిన మ్యారేజ్బ్యూరో కోతికి మాత్రం చుక్కలు కనిపించాయి.‘‘ఏం జరుగుతోంది?!’’ అని అరిచేలోపే....తీసుకెళ్లి ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’లో చేర్చి ఫేస్కు మాస్కులు పెట్టారు! ‘‘వామ్మో...వాయ్యో...’’ అంటూ ఆ హాస్పిటల్ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది మిసెస్ వివాహిత్ విందా.డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక కోతి అక్కడికి వచ్చి...‘‘మీ ఆయన పేరు వామ్మో నా? వాయ్యో నా? రెండిట్లో ఏది?’’ అని అడిగింది.‘‘రెండూ కాదండీ...మా ఆయన పేరు వివాహిత్ విందా...’’ అంటూ మళ్లీ ఏడుపు అందుకొంది ఆ కోతి ఇల్లాలు.‘‘ఒహో...సిక్స్ బై టు...సెవెన్ ఇంటూ ఫోర్ పేషెంటా!’’‘‘ఆయన పేరు పేషెంట్ కాదండీ...వివాహిత్ విందా’’‘‘నా బొంద...మాకంటూ ఒక భాష ఏడ్చింది కదా... ఆ భాషలోనే మాట్లాడుకుంటాం! నువ్వు అట్టే కన్ఫ్యూజ్ కాకు. మీ ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించడం జరిగింది. పది నిమిషాలు ఆలస్యమైతే మీకు దక్కేవాడు కాదు. సమయానికి మా అంబులెన్స్ రాబట్టి ప్రాణాలతో మిగిలాడు’’ అని చెప్పింది ఆ డాక్టర్ కోతి.రెండు రోజులు తరువాత వివాహిత్ విందాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.‘‘అయ్యా! మూడు తుమ్ములు తుమ్మిన పాపానికి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్లా!’’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ ముందు వీలైనంత దీనంగా నిలబడ్డాడు వివాహిత్ విందా.‘‘మీ వేలి గోరు స్కాన్ చేయడానికి ఇంతైంది...మీ కాలి గోరు స్కాన్ చేయడానికి, అందులో మట్టిని స్కాన్ చేయడానికి ఇంతైంది...మీరు తుమ్మినప్పుడు బయటికి వచ్చిన సూక్ష్మజీవులు మామూలు సూక్ష్మజీవులేనా...ఈ మధ్య ప్రాణాంతకంగా తయారైన సకోనతుమ్తుమ్ రకం సూక్ష్మజీవులా? అనేది తేల్చడానికి ఇంతైంది...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు సూపరింటెండెంట్ కోతి.ఆయన చెప్పింది వింటూ ‘హాచ్’ అని తుమ్మాడు వివాహిత్ విందా....అంబులెన్స్ వస్తున్న చప్పుడు వినిపించి ‘నన్ను రక్షించండి బాబోయ్’ అని వెనక్కి చూడకుండా పరుగెత్తాడు. – యాకుబ్ పాషా -
మెదడు పనితీరును మెరుగుపరిచే నిద్ర
ఎంతటి మేధావులయినా తమ మేధోతత్వాన్ని ఇనుమడింప చేసుకోవాలంటే కంటినిండా నిద్రపోవాలని, లేదంటే క్రమంగా వారి తెలివితేటలు మసకబారడమే కాకుండా, ఆయుష్షు కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్దాయానికి, మనిషి సగటున రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నాడనే దానికి సంబంధం ఉందని, కంటినిండా నిద్రపోయేవారు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని ప్రొఫెసర్ జేమ్స్ రోలండ్ చెబుతున్నారు. మనిషి ఎంత పట్టుదలతో ఉన్నా, మహా అయితే 48 గంటలు మాత్రమే నిద్ర పోకుండా ఉండగలడని, ఆ తర్వాత కూడా నిద్ర ఆపుకోవాలని చూసినా, అది ఫలించదని, నిద్ర ముంచుకు రావడమే కాకుండా అప్పటికే శరీరంలో మితిమీరిన రీతిలో అవలక్షణాలు తొంగి చూస్తాయంటున్నారు పరిశోధకులు. అసలు అలా కావాలని నిద్రను నిలుపుకొంటే పూర్తిగా చావును కొనితెచ్చుకున్నట్టే అవుతుందనీ, ప్రఖ్యాత ప్రజావైద్యుడు ద్వారకానాథ్ కొట్నిస్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనా– జపాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులకు ఏకబిగిన నిద్రను లెక్క చేయకుండా దాదాపు మూడురోజులపాటు శస్త్ర చికిత్స చేయడం వల్ల అతని శరీరంలో ఎన్నో విపత్కర పరిణామాలు తలెత్తాయనీ, దాంతో 32 సంవత్సరాల వయస్సులోనే మూర్ఛవ్యాధి సోకడం వల్ల మరణించాడని గుర్తు చేస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన ప్రఖ్యాత ప్రజావైద్యుడు, ప్రపంచంలోనే వైద్యవృత్తిలో ధర్మాత్ముడిగా, ఆ వృత్తికి అత్యంత హుందాతనాన్ని, యశస్సును తీసుకొచ్చిన నార్మన్ బెతూన్. 49 ఏళ్లకే చనిపోయాడనీ, అందుకు కారణం కేవలం నిద్ర సరిగాపోకుండా విపరీతమైన సేవా కార్యక్రమాల్లోను, కొత్త శస్త్ర చికిత్స పరికరాల రూపకల్పనలోను తలమునకలు కావడమేననీ, ఈ విషయాలు ఎంత పాతవైనప్పటికీ, నిద్రపోకుండా ప్రయోగాలు, పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసి తీరాలంటున్నారాయన.దీనిని బట్టి చూస్తుంటే పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో రేయింబవళ్లు విద్యార్థుల్ని బట్టీలు పట్టించి చదివిస్తే ర్యాంకులు వస్తాయి గానీ మేధో పరిణితి, విచక్షణ, సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నూతనత్వం, ఉత్తేజం, ఉత్సాహం, తాజాదనం నేటి విద్యార్థుల్లో రాకపోవడానికి, లేకపోవడానికి గల కారణాలలో నిద్ర సరిగా లేకపోవడం కూడా ఒకటని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నిద్ర పోవాలి. ఏదో ఒక గమ్యం మీద కలలు కనాలన్నా, ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నా నిద్ర తప్పనిసరి అన్నమాట. -
‘ఐఓఎన్ఎమ్’ అంటే ఏమిటి?
మా మనవడి వయసు 9 ఏళ్లు. చిన్నతనం నుంచి తరచూ ఫిట్స్తో బాధపడుతున్నాడు. హైదరాబాద్లో పెద్దహాస్పిటల్లో చూపించాం. ‘బ్రెయిన్ ట్యూమర్’ అని చెప్పారు. చూపు, వినికిడి ఎఫెక్ట్ అయ్యేలా ట్యూమర్ ఉందన్నారు. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్తగా ‘ఐఓఎన్ఎమ్’ పద్ధతిలో ట్యూమర్ తొలగించారని పేపర్లలో చదివాం. మా బాబు చాలా చిన్నవాడు. ట్యూమర్ కారణంగా వాడి చూపుకు, వినికిడికి లేదా ఏదైనా ముఖ్య అవయవానికి లోపం జరిగితే వాడికి జీవితాంతం శాశ్వతమైన ఇబ్బంది ఏర్పడుతుందనే ఆందోళన ఉంది. దయచేసి మాకు ఐఓఎన్ఎమ్ పద్ధతి అంటే ఏమిటో విపులంగా వివరించి, మా మనవడి గురించి సలహా ఇవ్వండి. మీ మనవడి ట్యూమర్ మెదడులో ‘చూపు, వినికిడి’ నియంత్రించే భాగానికి ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. మీరు ఆందోళన చెందకండి. ఇలాంటి సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి న్యూరో సర్జరీలు, స్పైన్ సర్జరీలు ఇప్పుడు ఐఓఎన్ఎమ్ సర్జరీ ప్రక్రియతో విజయవంతమవుతున్నాయి.ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఐఓఎన్ఎమ్. మెదడు ఆపరేషన్లలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులోని మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలూ, అవయవాలకు సంబంధించిన ప్రాంతాల్లోని గడ్డలను/ట్యూమర్లను తొలగించడం చాలా రిస్క్తో కూడికున్న పని. ఎందుకంటే గడ్డలను తొలగించే ప్రయత్నంలో ఆయా ప్రాంతాలకు దెబ్బ తగిలితే, సంబంధిత అవయవం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యాధునికమైన ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3టీ ఎమ్మారైతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్ఎం) విధానం... సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా మెదడు కణజాలం దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ వరకు మాత్రమే తొలగించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్లు మొత్తం నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ, మిగతా భాగాలకు ఎలాంటి హానీ జరగకుండా పర్యవేక్షిస్తుంటారు. ఐఓఎన్ఎమ్ పద్ధతిలో సర్జరీ నిర్వహించే సమయంలో ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్ను పూర్తిగా తొలగించామా, లేదా అనే విషయాన్ని ఆపరేషన్ థియేటర్లోనే నిర్ధారణ చేసుకొని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. అందువల్ల మన జీవితంలో ఎంతో కీలకమైన... మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ప్రధాన కార్యకలాపాలు దెబ్బతినకుండా, కోల్పోకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఫలితంగా చాలా సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీల్లో రీ–డూ (మళ్లీ మళ్లీ చేయాల్సిన ఆపరేషన్లు) చేయాల్సి అవసరం రాకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. మొత్తం గడ్డను/ ట్యూమర్ను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి మీ మనవడి విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... ఆ సౌకర్యాలు ఉన్న పెద్ద హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి. నడుముకు శస్త్రచికిత్స అంటున్నారు... ఆందోళనగా ఉంది నా వయసు 40 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 60 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. డాక్టర్ను సంప్రదించాను. ఆయన నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్ను ఎమ్మారై తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూసలోని నరాలపై ఎక్కడ ఒత్తిడి పడుతోందో గుర్తించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ–హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడే రోగిని ఇంటికి పంపించేస్తారు. మొదట మీరు మీ ఎమ్మారై, ఇతర రిపోర్టులతో న్యూరోసర్జన్ను సంప్రదించండి. వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిజ్ఞానంతో మిగతా భాగాలకు ఎలాంటి లోపం/వైకల్యం రాకుండా శస్త్రచికిత్స చేయగలరు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంటి పాపాయిలను ఘనాహారం వైపు మళ్లించడం ఎలా? తల్లి పాలు తాగుతూ ఉండే చిన్నారులకు నాలుగో నెల రాగానే అన్నప్రాశన చేసి, వారు మెల్లగా ఘనాహారం తీసుకునేలా అలవాటు చేస్తుంటారు. ఇలా పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని ‘వీనింగ్’ అంటారు. ఇలా వీనింగ్ తర్వాత పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, టిష్యూల అభివృద్ధి కోసం మెుదటి ఏడాదిలో ఇవ్వాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. వీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి వీనింగ్ ప్రక్రియలో కొన్ని ఆహారాపు అలవాట్లను అవాయిడ్ చేయాలి. ►గిన్నెలో ఉన్నది పూర్తికావడం కోసం వాళ్లు వద్దంటున్నా బలవంతంగా పెట్టకండి. ►వాళ్ల దినచర్యకూ, వాళ్లు తీసుకుంటున్న ఆహారానికి వుధ్య సవుతౌల్యం (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోండి. ►వాళ్లకు ఏదైనా బహువూనంగా ఇవ్వదలచుకుంటే అది ఆహారపదార్థాలై ఉండకుండా జాగ్రత్తపడండి. (కొందరు అదేపనిగా ఫలానాది చేస్తే చాక్లెట్లను బహువూనంగా ఆశపెడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు). పిల్లలను వురీ ఎక్కువ తియ్యగా ఉండే మిఠాయిలకూ, ఉప్పగా ఉండే చిప్స్ వంటి పదార్థాలకు అలవాటు చేయకండి. మంచి స్వాభావికమైన ఆహారపదార్థాలైన కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను పిల్లలకు అలవాటయ్యేలా చూడండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్ర... పరీక్షకు రక్ష!
నిద్రపోవడం అంటే... మెదడుకు శక్తినివ్వడమే.పరీక్షల సమయంలో అయితే... జ్ఞాపకశక్తినివ్వడమే.చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికిరాత్రి నిద్రే కాదు... మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.ఆ వివరాలను మెలకువతో మెళకువగాతెలుసుకోండి. ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు. రాత్రిళ్లు చాలా ఆలస్యంగా పడుకోవడం, మళ్లీ పొద్దున్నే త్వరగా లేవడం లాంటి చర్యలతో తమ నిద్ర సమయాన్ని కుదించుకుంటారు. దాంతో మామూలుగా నిద్ర పోయే వ్యవధి కంటే చాలా తక్కువగా నిద్రపోతుంటారు. పరీక్షల సమయంలో ఇలా చేయడం ఎంత వరకు సబబు? పరీక్షల్లో చదవడానికి నిద్ర ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ సమయంలో నిద్ర తగ్గడం మంచిదేనా? నిద్రనూ, చదువునూ సమన్వయపరుచుకుంటూ పరీక్షల సమయంలో ఎలా చదవాలి? ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పిల్లల్లో నిద్ర చాలా ప్రధానం. అందునా చిన్నపిల్లలతో పాటు, ఇప్పుడు పరీక్షలకు చదువుతున్న టీనేజ్లో ఉండే పిల్లలకూ తగినంత సేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కరూ సరిగ్గా నిర్ణీతంగా ఇంత సమయం నిద్రపోవాలని చెప్పలేకపోయినప్పటికీ, మర్నాడు నిద్ర లేచాక తమకు అలసటగా ఉండటం, నిస్సత్తువగా లేదా నీరసంగా ఉండటం, మాటిమాటికీ చికాకు కలగకుండా ఉండటానికి ఎంత నిద్ర అవసరమో అంతసేపు నిద్రపోవాల్సిందే. పరీక్షలప్పుడు కూడా అంతే నిద్ర అవసరం. కాకపోతే పరీక్షల పేరిట పిల్లలు తాము అంతకు ముందు చదువుతున్న అంశాలను బ్రష్ అప్ చేసుకోడానికి ఒక గంట, గంటన్నర కేటాయించి, ఆ మేరకు మాత్రమే మెలకువతో ఉండటం మంచిది. ఏదో ఒక రోజు నిద్ర తగ్గితే పర్లేదుగానీ... అలా కాకుండా... రోజులో తాము నిద్రపోయే మొత్తం వ్యవధిలో రెండు గంటలకు మించి నిద్ర తగ్గడం అంత మంచిది కాదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే... పిల్లల్లో నిద్ర సమయంలో ఎన్నో కీలకమైన జీవక్రియలు జరుగుతుంటాయి. దాంతో నిద్ర వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. టీనేజ్లో ఉండే పిల్లల్లో అప్పుడప్పుడే యుక్తవయసులోకి వస్తుండటంతో వారిలో ఎన్నో రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. ఈ హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడం జరుగుతుంది. అందుకే పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తే, అవి పెద్దయ్యాక కూడా వారి సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రిపేర్ల ప్రక్రియ అంతా నిద్రలోనే : మనం నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అంటే మనం తగినంత నిద్రపోకుండా ఉంటే మనలోని రోజువారీ పనులు లేదా జీయక్రియల్లో దెబ్బతిన్న అంశాల రిపేర్లు అంత సమర్థంగా జరగవన్నమాట. నిద్రపోతేనే ఎత్తు పెరిగేది: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే స్రవిస్తుంది. కాబట్టి పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా ఎత్తు పెరగగలరు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలనూ బలపడేలా చేస్తుంది. అవి బలిష్టంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. ఇక పరీక్షలు రాసే మన పిల్లలంతా ఎదిగే వయసులో ఉండేవారే. ఏదో ఒకరోజో, రెండు రోజులో కాసేపు నిద్ర పోకపోతే దాని వల్ల జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పరీక్షలు సాధారణంగా రెండు లేదా మూడు వారాల పాటు జరుగుతుంటాయి. అంతకాలం నిద్రకు దూరం కావడం అంటే మన ఎదుగుదలనూ మనమే చేజేతులారా దెబ్బతీసుకున్నట్టే. చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి : పరీక్షల సమయంలో మనం చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి నిద్ర ఎంతగా దోహదం చేస్తుందో చూద్దాం. మనలో జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిదాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. మనం ఏదైనా చదవగానే మనకు అర్థమైనదంతా తిరిగి చెప్పాలంటే చెప్పగలం. కానీ కొంతకాలం తర్వాత దాన్ని మరచిపోవచ్చు. మళ్లీ చదివితే తప్ప అది గుర్తు రాదు. ఏదైనా చదివింది చాలాకాలం గుర్తుండాలంటే అది జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియలో రెండోదైన శాశ్వత జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ)లోకి వెళ్లాలి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్న అంశం... షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్లే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పరీక్షల కారణంగా రాత్రిపూట ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ వ్యవధి రాత్రి ఒక గంట ఆలస్యంగా పడుకోవడమో, ఉదయం ఒక గంట ముందుగా నిద్రలేచి ఆ సమయాన్ని చదువుకు వాడకోవడమో మంచిది. అంతకు మించి నిద్రను దూరం చేసుకోవడం పిల్లలకు మంచిది కాదు. నిద్రపోకుండా చదివితే కీడే ఎక్కువ : నిద్రపోకుండా చదువుకోవడం ఎందుకు మంచిది కాదో చెప్పడానికి ఎన్నో అధ్యయనాలున్నాయి. పరీక్షల పేరుతో నిద్రపోకుండా ఉండటం వల్ల జరిగే అనర్థాల్లో కొన్ని ఇవి... నేర్చుకునే శక్తి తగ్గుతుంది : íపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారిలో నేర్చుకునే శక్తి మందగిస్తుంది. అంతేకాదు... వారి ఏకాగ్రత సైతం తగ్గుతుంది. చురుకుదనం లోపిస్తుంది. ఏదైనా అంశం మీద దృష్టి కేంద్రీకరించే శక్తి, రీజనింగ్ పవర్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బాగా తగ్గుతాయి. పిల్లలు మందకొడిగా అయిపోతారు. పరీక్షల సమయంలో పైన పేర్కొన్న అంశాలు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకే చదువుకునే సమయం కాస్త తగ్గినా పర్లేదుగానీ... చిన్నారుల నిద్ర సమయం మాత్రం తగ్గనివ్వకూడదు. పిల్లల మూడ్స్కు అంతరాయం : నిద్రలేమితో బాధపడేవారి పిల్లల మూడ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి అంశాలకే తీవ్రంగా స్పందించడం, చిన్న చిన్న అంశాలకే చికాకు పడటం వంటి ఎక్స్ట్రీమ్ మూడ్స్ ప్రదర్శిస్తుంటారు. అదే బాగా నిద్రపోయిన వారు కాస్త స్థిమితంగా ఉంటారని అధ్యయనవేత్తలు తెలుసుకున్నారు. పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి వాళ్ల మూడ్స్ కూడా బాగుండటం చాలా అవసరమన్నది తెలిసిందే కదా. పదాల కోసం తడుముకోవడం : ఇక నిద్ర కోసం జరిగిన మరో పరిశోధనలో వెల్లడైన వివరాలివి... క్రితం రాత్రి నిద్రలేమితో బాధపడ్డవారూ, కంటినిండా నిద్రపోయిన వారు... ఇలా రెండు విభాగాలను తీసుకొని ఒక అధ్యయనం నిర్వహించారు. నిద్రలేమితో బాధపడ్డవారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయినట్లు, ఏదైనా రంగులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించడంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు, మాట్లాడే సమయంలో పదాల కోసం తడుముకున్నట్లు తెలుస్తోంది. అదే బాగా నిద్రపోయిన వారిలో ఈ సమస్య ఎదురుకాలేదు. పైగా నిద్రలేమితో ఉన్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు కూడా అధ్యయనవేత్తలు గుర్తించారు. పరీక్షల కోసం తయారయ్యే పిల్లలకు పదసంపద (వకాబ్యులరీ) ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. చదివిన అంశాలను పరీక్షల్లో రాసే సమయంలో వారికి పదాలు (వకాబ్యులరీ) వెంట వెంటనే తడుతూ ఉండాలి. అలా తట్టాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. ఒకటీ రెండూ కాకుండా... ఈ విషయాలన్నీ నిద్ర గురించి వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు జరిపిన దాదాపు 70 అధ్యయనాల్లోనూ ఇదే తేలింది. పరీక్షల సమయంలో నిద్ర మానేసి చదవడం అంత శ్రేయస్కరం కాదని ఇటు పిల్లలూ, అటు పెద్దలూ గుర్తించాలి. పరీక్షల సమయంలో నిద్రను సమన్వయించుకోవడానికి ఈ కథనంలో పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. మిగతా పదహారు గంటలు చదువుకోసం కేటాయించవచ్చు. అలా కుదరకపోతే మీ రాత్రి నిద్రను ఆరుగంటల కంటే ఎట్టిపరిస్థితుల్లో తగ్గనివ్వవద్దు. అది మీ చదువుకు మేలు చేకూర్చకపోగా... మీకు (పిల్లలకు) కలిగే నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోండి. పరీక్షల సమయంలో మీ పడక, నిద్ర ఎలా ఉండాలంటే... చదివే ప్రదేశం ప్రకాశవంతంగా ఉండాలి: కొంతమంది పిల్లలు చదివేదానిపై బాగా దృష్టి కేంద్రీకరించడం కోసం టేబుల్ లైట్ మాత్రమే వేసి, గదంతా చీకటిగా ఉంచుతారు. చదువు ఒంటబట్టడానికి ఈ తరహా వాతావరణం సరికాదు. మీరు చదివే గదంతా వెలుతురు పరచుకుని ఉన్నప్పుడే చదువు బాగా మనసుకెక్కుతుందని గుర్తుంచుకోండి. పడక దీనికి భిన్నంగా ఉండాలి. మీరు పడుకునే చోట మసక వెలుతురుండాలి. మీరు చదివే గది దేదీప్యమానంగా ఉండాలి. మీ పడక పడుకోవడం కోసమే: కొంతమంది పిల్లలు పడకపై పడుకొని చదువుతుంటారు. నిజానికి కూర్చొని చదవడమే మంచిది. బెడ్పై చదవడం, ల్యాప్టాప్ బ్రౌజింగ్ చేయడం, సెల్ఫోన్ చూసుకోవడం.. ఇలాంటి పనులేవీ చేయకండి. చదవడం అన్నది డెస్క్ దగ్గర. పడుకోవడం మాత్రమే బెడ్ మీద. పడకగది చీకటిగా ఉంటేనే మెదడులో మెలటోనిన్ అనే రసాయనం స్రవిస్తుంది. నిద్రపట్టడానికి ఈ రసాయనమే దోహదపడుతుంది. నిద్రకు రెండు గంటల ముందే భోజనం : మీరు పరీక్షలకు చదువుతున్నా లేదా మామూలు సమయంలోనైనా... మీరు పడకకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు. ఇలా కుదరకపోతే కనీసం గంట ముందన్నా భోజనం పూర్తి చేయండి. హెవీ మీల్ తినేసి, అప్పుడు మీరు చదువుకోడానికి కూర్చున్నా అది కునికిపాట్లకు దారితీస్తుంది తప్ప ఏకాగ్రత కుదరదు. రోజూ అదే వేళకు... ‘అర్లీ టు బెడ్.. అర్లీ టు రైజ్’ అని వాడుక. అంటే పెందలాడే పడుకొని, పెందలాడే నిద్రలేవడం మంచి అలవాటని అర్థం. పరీక్షలున్నా లేకపోయినా... వేరే పనులున్నా... సెలవుల సమయమైనా, హాలిడే ఉన్నా ఈ అలవాటు తప్పనివారిలో ఏకాగ్రత, చదివింది అర్థం చేసుకునే శక్తి ఎక్కువ అని అనేక అధ్యయనాల్లో తేలింది. నీళ్లు ఎక్కువగా తాగండి : సాధారణంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచి అలవాటన్నది తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో, బాగా చదివే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు పిల్లల్ని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలోని మిగతా అవయవాలతో పాటు మెదడుకూ మంచి హైడ్రేషన్ ఉండటం వల్ల చదివింది గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. మరిన్ని సార్లు మూత్రవిసర్జనకు లేవాల్సిరావడం కూడా వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. మధ్యాహ్నం పూట ఓ పవర్ న్యాప్ : పరీక్షలకు చదివే సమయంలో రాత్రి నిద్రపోని పిల్లలు మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు నిద్రపోవడం మంచిది.ఈ పవర్న్యాప్ వారిలో మరింత శక్తిని పెంచుతుంది. అయితే ఈ పగటి నిద్ర కేవలం అరగంటకు మాత్రమే పరిమితం కావాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోతే అది రాత్రి మళ్లీ నిద్రలేమికి దారితీయవచ్చు. దాంతో మర్నాడు పగటిపూట మందకొడిగా, చికాకుగా, నిస్సత్తువగా ఉండవచ్చు. అందుకే పవర్న్యాప్ అన్నది కేవలం చదివే పవర్ను పెంచేలా ఉండాలి. అది అరగంటకు మించకూడదు. రాత్రి కష్టమైన టాపిక్స్ చదవవద్దు : మీకు కష్టం అనిపించినవీ, కఠినమైనవీ రాత్రిపూట చదవకండి. కేవలం మననం చేసుకునేవీ, మనసులో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు చదివేవి మాత్రమే రాత్రిపూట చదవండి. ఒక్కోసారి అలా చదివే సమయంలో అది రాత్రి నిద్రలేమికి దారితీయవచ్చు. కాబట్టి కఠినమైనవీ, టఫ్ సబ్జెక్టులను పగటివేళే చదవండి. లెక్కలూ... రీజనింగ్ కోసం నిద్ర అవసరం ఎంతంటే... విక్టోరియా (ఆస్ట్రేలియా)లోని ప్రవుుఖ పిల్లల పరిశోధన సంస్థ ‘వుర్డోక్ చిల్డ్రెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన ఓ అధ్యయన బృందం 4500 వుంది పిల్లలపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో నిద్రసమస్యలు ఉన్న పిల్లల కంటే... రాత్రి బాగా నిద్రపోయిన పిల్లలు క్లాస్రూమ్లో మిగతా పిల్లలు తవు టీచర్లతో వ్యవహరించేటప్పుడూ, లెక్కలు చేసేటప్పుడూ మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంటే రీజనింగ్తో వ్యవహారాలను సమర్థంగా నెరపడానికీ, మ్యాథ్స్ బాగా చేయడానికి కూడా కంటినిండా నిద్రపోవడం అన్నది బాగా ఉపకరిస్తుంది. ‘‘నిద్ర సవుస్యలు ఉన్న పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సవుస్య వస్తే– అది తగ్గే తీరు, కోలుకునే వ్యవధి వంటివి మిగతా పిల్లల కంటే కాస్తంత తక్కువే. అదేగానీ పిల్లలకు సరిపోయినంత నిద్ర ఉంటే వాళ్లలో దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సస్ట్రేషన్) కూడా ఎక్కువ. అంతేకాదు– సవుస్యలను పరిష్కరించే (ప్రాబ్లమ్ సాల్వింగ్) శక్తి కూడా అధికం. పైగా వర్క్లోడ్ తీసుకునే సావుర్థ్యం కూడా పెరుగుతుంది’’ అన్నది ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన జాన్ క్వాష్ చెబుతున్న మాట. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బ్రెయిన్ డైట్
మెదడుకు మనం చెబుతామా? మనకు మెదడు చెబుతుందా? ఇది పెద్ద పజిల్! మనం ఏమి తినాలో, ఏవి రుచిగా ఉంటాయో, ఏది హానికరమో, ఏది శ్రేష్ఠమో మనకు చెప్పేది బ్రెయినే! అయితే పరీక్షల టైమ్లో పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి వారు ఏమి తినాలో మెదడుకు ఎక్కించేదే ఈ కథనం. పిల్లల పరీక్షల సీజన్ ఇది. చదివిందంతా గుర్తుపెట్టుకోవాలని అటు పిల్లలకూ ఉంటుంది. ఇటు తల్లిదండ్రులదీ అదే కోరిక. ఎగ్జామ్స్లో వాళ్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలని కూడా అటు పిల్లలూ, ఇటు పేరెంట్స్ కోరుకుంటారు. చదివిందీ, విన్నదీ, చూసింది గుర్తుపెట్టుకోవలసిన విజ్ఞానానికి భాండాగారమే మెదడు. కేవలం అలా చదివేసి మెదడులో నిక్షిప్తం చేసుకుంటే చాలదు... అలా దాచుకున్నది కాస్తా అవసరమైనప్పుడు టక్కున స్ఫురించాలి. స్ఫురించింది పూర్తిగా వరుసగా గుర్తుకురావాలి. అప్పుడే గుర్తుకొచ్చిన ఆ విషయాలను పిల్లలు పరీక్ష పేపర్ మీద రాయగలుగుతారు. చురుగ్గా ఉన్న మెదడే ఇలా విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడం... అలా చేసుకున్నదాన్ని అవసరమైనప్పుడు బయటకు తీయడం చేస్తుంది. మరి మన పిల్లల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండటానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి వారు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో మరో మాటగా చెప్పాలంటే పేరెంట్స్ వారికి పెట్టాల్సిన ఫుడ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందుగా మెదడు గురించి సంక్షిప్తంగా... మన శరీరం బరువులో మెదడు బరువు కేవలం 2 శాతం. కానీ ఒంటికి అందే ఆక్సిజన్లో దానికి 20 శాతం కావాలి. శరీరం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే కావాలి. దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. పిల్లలు మొదలుకొని మన వరకూ అందరమూ విజ్ఞానాన్నంతా మెదడు కణాల్లోనే నిక్షిప్తం చేసుకుంటాం. మనం చదివిందంతా బాగా గుర్తుండిపోవాలంటే మాటిమాటికీ మననం చేసుకుంటాం. అప్పుడది తాత్కాలిక జ్ఞాపకం నుంచి శాశ్వత జ్ఞాపకంలోకి మారిపోతుంది. మనం అప్పటికే ఏర్పరచుకున్న జ్ఞాపకాలతో మెదడులో ఒక లైబ్రరీ ఏర్పడుతుంది. ఏదైనా కొత్త విషయం వస్తే అది మదిలో పదిలంగా ఉందా లేదా అన్నది మెదడు చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఆ లైబ్రరీలోని కొత్త పుస్తకంలా నిల్వ చేసుకుంటుంది. ఉన్నదే అయితే అది మరోసారి అప్డేట్ అవుతుంది. గుర్తుంచుకోవడం అంటే ఏమిటి? అదెలా జరుగుతుంది? ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని... మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. గుర్తుంచుకోవడం అన్నది మామూలుగానే జరుగుతుందని అనిపిస్తుంటుంది. కానీ చాలాకాలం గుర్తుంచుకోవాలంటే కొంత ధారణ అవసరం. ఒక సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఈపనిని మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం చాలా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ) అంటాం. ఇలా లాంగ్ టర్మ్ మెమరీ అంటా మెదడులోని నియోకార్టెక్స్ అనే భాగంలో నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు అక్కడినుంచి మనం గుర్తుతెచ్చుకుంటాం. ఇలా జ్ఞాపకం పెట్టుకోవడంతో పాటు అవసరమైనప్పుడు గుర్తుతెచ్చుకోవడానికి మెదడు చురుగ్గా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన మంచి ఆహారాలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. మంచి ఆహారాలు అంటే సమతౌల్యంగా ఉండే అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మైక్రోన్యూట్రియెంట్ల వంటివి. చెడు ఆహారాలు మెదడును మందకొడిగా చేస్తాయి. జంక్ఫుడ్, కోలాడ్రింక్స్, పరిమితి దాటినప్పుడు కాఫీ, టీల వంటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారాలు... కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్: మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే ముందుగా శరీరం నుంచి కనీసం 15 శాతం తీసుకునే దానికి శక్తినిచ్చే గ్లూకోజ్ సరిగా అందాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచివి కాదన్న విషయం తెలిసిందే. కానీ మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’ పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వాటితోపాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. ఏ కొవ్వులు మెదడుకు మంచిది కాదు? మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజినేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారుచేసే కేక్లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అలాగే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంచడం కోసం వాడే మార్జరిన్ వంటి కృత్రిమ నూనెలు మంచివి కాదు. తినుబండారాలు కొనే సమయంలో జాగ్రత్త: మనం మార్కెట్లో కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా పరిశీలించి, అందులో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. మెదడుకు అవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు ఎక్కువగా తినాలి. శాకాహారులు ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆలివ్ ఆయిల్ వంటి నూనెలపై ఆధారపడవచ్చు. అమైనో యాసిడ్స్: మెదడులోని అనేకకణాల్లో ఒకదానినుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే మెదడులోని అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనో యాసిడ్స్’. మనకు ప్రోటీన్స్నుంచి ఈ అమైనో యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇక ఈ న్యూరోట్రాన్స్మిటర్స్పైనే మనందరి మూడ్స్ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టోఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. పిల్లలు చదివిందంతా షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి నిక్షిప్తం కావడమనే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పిల్లల్లో మంచి జ్ఞాపకశక్తి ఉండాలంటే, వారికి నిద్ర కూడా అవసరమైనంతగా ఉండాలి. అందుకు ట్రిఫ్టొఫాన్ బాగా దోహదం చేస్తుంది. అందుకే వారికి రాత్రి పడుకోబోయే ముందర గోరువెచ్చని పాలు ఇవ్వడం చాలా మంచిది. విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో యాసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి తాజాకూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. అయితే ఇటీవల స్ట్రిక్ట్ వెజిటేరియన్ పదార్థాలు మాత్రమే తీసుకునే ఇండ్లలోని పిల్లలకు, ఎండకు సోకని చిన్నారుల్లో విటమిన్ ‘డి’ లోపించే అవకాశాలు ఎక్కువ. ఆధునిక జీవనశైలి వల్ల ఇప్పుడీ కండిషన్ చాలామందిలో చోటుచేసుకుంటోంది. ఇలాంటివారు విధిగా విటమిన్ డితో పాటు విటమిన్ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా పిల్లల్లో నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది. నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మనమూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటినుంచి భర్తీ అవుతుంది. రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం తగ్గుతుంది. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మన అందరి మూడ్స్పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతోపాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు (ఈ పండ్లరసాల్లో చక్కెర వేయడం సరికాదు. చక్కెర ఎక్కువైనా అది మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది), రాగిజావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి... పిల్లలు తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకునేలా చూడండి. ఇది పిల్లలతోపాటు అందరికీ అవసరం. పరీక్షలకు వెళ్తున్న పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్.... మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. దాంతోపాటు విటమిన్–బి6, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, యాపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు. మెదడుకు మేలు చేసే ఆహారాలు: నేరుగా చెప్పాలంటే మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి వారు తినే ఆహారంలో ఈ కింది అంశాలు/పదార్థాలు ఉండేలా చేసుకోండి. పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు: కూరగాయల్లో పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితోపాటు డార్క్/బిట్టర్ చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. చేపల్లో: పండుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్)... వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. మెదడుకు హాని చేసే ఆహారాలు : టీ, కాఫీలు డీహైడ్రేషన్... అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే అవి చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే అది మెదడును ముందుగా చురుగ్గా చేస్తుంది. అయితే ఈ చర్యవల్ల మెదడు వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్వల్ల కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. ►ఉప్పు ఒంట్లోని నీటిని తొలగించి డిహైడ్రేషన్కు దారితీస్తుంది. కాబట్టి నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్డ్ సూప్స్ మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగానే తీసుకోవాలి. ►మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతోపాటు మెదడుకూ అది చేటు చేస్తుంది. అది జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది. కాబట్టి తక్కువ ఉప్పు తీసుకునేలా పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది. ►కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలనే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా తీసుకునేలా చూడాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బజారాహిల్స్,హైదరాబాద్ -
ఆకలి పొలం
ఒకరోజు.. రాత్రి.. పార్టీ జరుగుతోంది... ‘‘తమ్ముడూ.. నిజంగానే దయ్యాలు లేవంటావా?’’ అన్నాడు ఆ ఊరి సర్పంచ్ మనసులో కాస్త బెరుకుతోనే. ‘‘దయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్ సర్పంచ్ సాబ్..’’ అని అంటూ‘‘ఏమ్రా అజయ్..ఉన్నయా?’’ అడిగాడు పక్కనే ఉన్న తన కజిన్ను. వాడు అదోరకంగా నవ్వాడు. ‘‘మరి అంతకుముందు గీ పొలం కొంటామని వచ్చిన ఆ ఇద్దరు ఎట్లా చనిపోయినట్టు?’’ డౌట్ సర్పంచ్కి. ‘‘ఏముందీ.. బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయిన పర్సన్కు అంతకుముందే క్లాట్స్ ఏవో ఉండి ఉంటాయి. యాక్సిడెంట్లో పోయిన అతని గురించి చెప్పేదేముంది? తాగి బండి నడుపుతున్నాడు..ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకున్నాడు. ఇక్కడ దయ్యమెక్కడినుంచి వచ్చింది సర్పంచ్ సాబ్?’’ వెటకారంగా రాహుల్. గ్లాస్ను పెదవుల దగ్గర పెట్టుకున్న అజయ్.. రాహుల్నే చూస్తున్నాడు తదేకంగా. ‘‘ఏమైతేంది.. పొలం కొనుక్కున్నరు. మీరు మంచిగా పండిస్తే మా ఊరోళ్లకు కూడా మస్తు ధైర్యమొస్తది అన్నిరకాలుగా’’ అన్నాడు సర్పంచ్ చికెన్ ముక్కను నములుతూ! మళ్లీ తన కజిన్ భుజమ్మీద చేయివేసి అతనిని చూపిస్తూ ‘‘ఇగో సర్పంచ్ సాబ్.. వీడు నా చిన్నమ్మ కొడుకు. రెండురోజుల కిందట అమెరికా నుంచి వచ్చిండు. నాకు హెల్ప్ చేయడానికే. నాతోనే ఉంటడు.ఇద్దరం కలిసి పొలం దున్ని చూపిస్తం. చాలెంజ్’’ అని సర్పంచ్తో సవాల్ చేసి.. మళ్లీ కజిన్ వైపు తిరిగి ‘‘ఏమంటావ్రా..అజయ్? ’’ అన్నాడు అతని భుజాన్ని గట్టిగా నొక్కుతూ.‘‘అంతే అన్నా.. చాలెంజ్. దున్ని చూపించుడే’’ అని అన్నకు జవాబిచ్చి సర్పంచ్ వైపు తిరిగి ‘‘ సర్.. వంచిన నడుము ఎత్తనీయకుండా పొలంల పనిచేయిస్తా మా అన్నతో. చాలెంజ్ ఏందో చెప్పుండ్రీ’’ అన్నాడు అజయ్నవ్వుతూ!ఆ చాలెంజ్లో ధీమా కన్నా అతని మాటలతో భయమే కలిగింది సర్పంచ్కి. మందు ఎక్కువైనట్టుంది అంటూ సమాధానపడ్డాడు. ఆ రాత్రి గడిచింది. రాహుల్... బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. పేరున్న ఎమ్ఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఓ స్టార్టప్ కంపెనీకి కూడా ప్లాన్వేస్తూండగా రైతుల ఆత్మహత్యలకు చలించిపోయి అగ్రికల్చర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మెదక్ జిల్లాలోని ఒక ఊళ్లో పొలం కూడా కొనేశాడు. తన బిజినెస్ మైండ్తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు ప్రేరణనివ్వాలని ఆశపడ్తున్నాడు. అమ్మా, నాన్నా, చివరకు జీవితమంతా సేద్యంతోనే గడిపిన తాత చెప్పినా మనసు మార్చుకోలేదు అతను. గతం..రాహుల్ కొనుక్కున్న పొలం మల్లయ్యది. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒమన్లో, చిన్న కొడుకు భివండిలో ఉంటారు. భార్యతో ఊళ్లో ఉండేవాడు మల్లయ్య. ఉన్న అయిదు ఎకరాల్లో మూడుఎకరాలు కౌలుకి ఇచ్చి, మిగిలిన రెండు ఎకరాల్లోనే పాక లాంటిది వేసుకొని ఆలుమగలిద్దరూ సాగు చేసుకునేవారు. వరసగా వానలు లేక.. పొలంలో వేసిన బోరులో నీళ్లు పడక.. పంట పండక.. అప్పులపాలయ్యాడు. ఆ బెంగతోనే ఓ రోజు రాత్రి గుండె ఆగి చనిపోయాడు. పెద్ద కొడుకు రానేలేదు. చిన్నకొడుకే వచ్చి కర్మకాండ తంతు నిర్వహించి వెళ్లిపోయాడు. మల్లయ్య భార్య ఒక్కతే ఉండడం మొదలుపెట్టింది. ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి జాలిపడేవారు. భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకోక.. భర్త ఉన్నాడనే భ్రమలోనే ఆమె బతుకుతోందని! రోజూ ఇద్దరికి సరిపోయే భోజనం వండేది. గుడిసెలో తనతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్లే ప్రవర్తించేది. కొన్నాళ్లకు ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చింది..మల్లయ్య దయ్యమయ్యాడా ఏంటీ అని! మల్లయ్య పొలంవైపుగా వెళ్లిన కొంతమంది.. గుడిసెలో మగ గొంతుతో మాటలు వినిపిస్తున్నాయంటూ ఆ అనుమానాన్ని రూఢీ చేసేసుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ మల్లయ్య పెద్ద కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఒమన్ నుంచి వచ్చాడు పెద్దోడు. భివండి నుంచి తమ్ముడినీ పిలిపించాడు. తల్లిని ఆ ఊళ్లోనే ఉన్న ఆశ్రమంలో చేర్పించి ఉన్న పొలం అమ్మేసుకొని చెరిసగం పంచుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తల్లిని ఆశ్రమంలో చేర్పించారు కూడా. ఆ పొలం కొందామని బేరం కుదుర్చుకున్నాడు అదే ఊళ్లోని ఓ మోతుబరి. డబ్బులిచ్చే సమయానికి హఠాత్తుగా చనిపోయాడు. ఖంగుతిన్నారు అన్నదమ్ములిద్దరూ. మరో పదిరోజులకు ఇంకో వ్యక్తి ముందుకొచ్చాడు కొనడానికి. తెల్లవారి డబ్బులు తెస్తూ అతనూ చనిపోయాడు యాక్సిడెంట్లో.దీంతో ఊళ్లో వాళ్లకు మల్లయ్య నిజంగానే దయ్యమయ్యాడనే రుజువు దొరికినట్టయింది. కాని అన్నదమ్ములిద్దరూ నమ్మలేదు. పొలం అమ్మే బాధ్యతను తమ చిన్నాన్నకు అప్పగించి పెద్దోడు ఒమన్కు, చిన్నోడు భివండికి బయలుదేరారు. తర్వాత చాలా రోజులు ఆ పొలం అలాగే ఉంది. మల్లయ్య ఉన్నప్పుడు మూడు ఎకరాలు తీసుకున్న కౌలు రైతు కూడా భయపడి కౌలు చేయడం మానేశాడు. ఈ వ్యవహారమంతా వ్యవసాయం చేస్తున్న స్నేహితుల ద్వారా తెలుసుకున్న రాహుల్ చాలా చవకకు ఆ పొలాన్ని కొనేశాడు. ఆ సందర్భంగానే సర్పంచ్కి ఇచ్చిన పార్టీ అది. ప్రెజెండ్ డే... ఉదయం... తాత్కాలికంగా సర్పంచ్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాహుల్ నిద్ర లేచాడు. సెల్ ఫోన్లో టైమ్ చూశాడు. ఎనిమిది అయింది. ‘‘అమ్మో’’ అంటూ దిగ్గున లేచాడు. పక్కనున్న మంచం మీద అజయ్ కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్లాడేమో అనుకొని ఓనరకి, టెనెంట్కు కామన్గా ఉన్న వసారాలోకి వచ్చాడు. పేపర్ చదువుతూ కనిపించాడు సర్పంచ్. ‘‘గుడ్ మార్నింగ్ సర్పంచ్ సాబ్!’’‘‘గుడ్ మార్నింగ్ సార్.. గిప్పుడు లేచిండ్రా..? మీ తమ్ముడు ఎప్పుడో పొలంకి పాయే’’ అన్నాడు నవ్వుతూ సర్పంచ్. ‘‘అవునా?’’ ఆశ్చర్యపోయాడు రాహుల్. ‘‘మాటలే గాదు.. షేతల్లో చూపిస్తుండు మీ తమ్ముడు’’ మెచ్చుకోలుగా సర్పంచ్ పేపర్లోంచి తల తిప్పకుండానే. ఆదరాబాదరాగా దినచర్యకు దిగాడు రాహుల్. అరగంటలో అన్నీ పూర్తి చేసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ..ఎవరో స్త్రీ మూర్తితో మాట్లాడుతూ కనిపించాడు అజయ్ అల్లంత దూరం నుంచి. దగ్గరకు వచ్చాక చూస్తే.. మల్లయ్య భార్య. చాలా నవ్వుతూ మాట్లాడుతోంది అజయ్తో. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?ఆ సందేహాన్నే ప్రశ్నలుగా సంధించాడు ఆమె వెళ్లిపోయాక. ‘‘మనం ఈ పొలం కొన్నమని ఎవరో చెప్పిన్రట అన్నా. మంచిగ పండించుకోండ్రి అని చెప్పడానికొచ్చింది’’ అన్నాడు అజయ్ అదేదో అంతగా పట్టించుకునే విషయం కాదన్నట్టు. ‘‘ఊ’’ అంటూ చెట్టు కిందకు వెళ్తున్న రాహుల్ ఫోన్ మోగింది. విస్మయం.. ఆ భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాహుల్. ‘‘హలో అన్నగా.. ఏంరా.. నేను రాకుండా.. లేకుండానే కల్టివేషన్ చేస్తవా? నేను వచ్చేదాకా ఆగు. ఈ వారంలో వస్తున్నా. జాబ్గీబ్ అన్నిటికీ గుడ్బై చెప్పేశ్న. కలిసి వ్యవసాయం చేసుకుందాం..మన దేశం.. మన మట్టి..’’ అంటూ ఇంకేదో చెప్తూనే ఉన్నాడు అవతల నుంచి. రాహుల్ మొహం నిండా చెమటలు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. చెవి దగ్గరున్న ఫోన్ని పట్టుకున్న చేయి వణుకుతోంది. కాళ్లూ కంపిస్తున్నాయి. - సరస్వతి రమ -
తాగుపోటు
తాగగానే కంట్రోల్ తప్పుద్ది. అప్పటికైతే కొంచెం మగాడు అన్న ఫీలింగ్ వస్తుందిగానీ పెళ్లాం, పిల్లలు, కుటుంబం, మంచి–చెడు చూసుకునేంత మగాడైతే కాలేడు. చుక్క దిగినప్పటి నుంచి కక్కేవరకు అన్నీ పోట్లే! గుండెపోటు, రక్తపోటు, మెదడుపోటు, నైతికతకు పోటు మానవత్వానికి పోటు, గౌరవానికి పోటు, చివరకు జీవితానికే పోటు! లోపల కుళ్లిపోతారు. బయటకు కుళ్లు వాసన వస్తుంది. పిల్లలు ముక్కు పట్టుకుంటారు. పెద్దలు తల పట్టుకుంటారు. బయటివారు కాలర్ పట్టుకుంటారు. థూ... ఏంటీ దౌర్భాగ్య జీవితం. అంత మంచి పుట్టుక ఇచ్చిన తల్లిదండ్రులు, సంస్కారం ఇచ్చిన గురువులు, గౌరవం ఇచ్చిన సమాజం అంతా వికారమైపోతుంది. మీకు దండం పెడతాం. మందు మానండి... మీ ఫ్యామిలీ ప్రేమ పొందండి. కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటిలాగే ఆనవాయితీ. తమ నిర్ణయంపై ఒకటి రెండు రోజులు గట్టిగానే ఉంటారు. ఆ తర్వాత కాస్తంత మెత్తబడటం మామూలే. ఇప్పటికి ఎలాగూ ఓ నాలుగు రోజులు దూరంగా ఉండే ఉంటారు. ఇక మద్యంపై ధ్యాస మళ్లే ఈ దశలో దాని దుష్ప్రభావాలను మరో మారు గుర్తుచేసుకుంటే మీ నిర్ణయం, మీ నిబద్ధత మరింత నిశ్చలంగా ఉంటాయి. అలా ఉండటం కోసమే ఈ కథనం. మద్యంతో దేహంపై చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. అవి మన శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపైనా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. మెదడు (నాడీవ్యవస్థ), జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, సెక్స్ సామర్థ్యంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు... ఇలా అన్నీ దెబ్బతింటాయి. ఆ అన్నింటికంటే అన్ని వ్యవస్థలనూ నియంత్రించగల అత్యంత ప్రధానమైన మెదడూ, నరాలూ, నాడీవ్యవస్థ చాలా ఎక్కువగా దుష్ప్రభావానికి లోనవుతుంది. నోట్లోకి వచ్చీ రావడంతోనే అనర్థాలు ప్రారంభం... ఆల్కహాల్ను అలా నోట్లోకి తీసుకున్నప్పట్నుంచి దాని దుష్ప్రభావాలు మొదలవుతాయి. మొదట నోట్లో ఉండే మ్యూకస్ పొరల మీద ఆల్కహాల్ ప్రభావం కనిపిస్తుంది. ఆహారమైనా జీర్ణం కావడానికి చిన్న పేగుల వరకు రావాలిగానీ... మద్యం మాత్రం నోట్లోంచే ఒంట్లోకి ఇంకిపోతుంటుంది. అలా ఆ ఇంకడం అన్నది చిన్నపేగుల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. మెదడుపై మద్యం చేసే మాయ... మద్యం తొలి మోతాదుల్లో ఒకటి రెండు డ్రింక్స్ వరకు చాలా హాయిగా, రిలాక్సింగ్గా ఉంటాయి. తాము చాలా తేలికై పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇన్హిబిషన్స్ తగ్గుతాయి. పూర్తి స్పృహలో ఉన్నప్పుడు విచక్షణతో తొక్కిపట్టి ఉంచిన ఎన్నో భావనలు ఆ సమయంలో పురివిప్పుతాయి. ఆ సమయంలో ధైర్యం పుంజుకున్నట్లు అనిపిస్తుంది. విచక్షణరహితంగా ఏదైనా మాట్లాడగలుగుతారు. ఒత్తిడి తగ్గినట్లుగా భ్రాంతి కలుగుతుంది. బాగున్నాయని అనిపించే ఈ ఫీలింగ్స్ అన్నీ తాత్కాలికాలే. ఏ సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోగలమనే ధీమా ఆ సమయంలో తాత్కాలికంగా కాసేపు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికీ కారణం... మన మెదడులోని ఓపియాయిడ్ అనే కణాల నుంచి డోపమైన్ అనే సంతోష రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరచడమే. దాంతో ఒక ఆనందం, ఆహ్లాదం, తనువంతా హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఆ ఆనందాహ్లాద భావనలను కోల్పోకూడదనే ఉద్దేశంతోనే తాగడాన్ని కొనసాగిస్తుంటారు. అవెప్పుడూ సొంతం కావాలన్న తపనతో అదేపనిగా తాగుతుంటారు.అప్పట్నుంచి అనర్థాలు మొదలవుతాయి. అత్యంత ఎక్కువ మోతాదుల్లో తీసుకున్న ఈ మద్యం మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలవుతుంది. మనలో లాజిక్తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్కూ, అంచనావేయడానికి తోడ్పడే ఈ భాగం క్రమంగా పనిచేయకపోవడంతో క్రమంగా మన భావోద్వేగాలపై అదుపులేకపోవడం, రిస్క్ తీసుకునే పనులకు పాల్పడటం, ముప్పును తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడం వంటివి జరుగుతాయి. కానీ దానికి తగ్గట్టుగా శరీరపు కదలికలు ఉండవు. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ తర్వాత టెంపోరల్ లోబ్ ప్రభావితమవుతుంది.ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. మద్యం... దాంతో కలిగే అనర్థాలు... నిద్రకు అంతరాయం: మనం రాత్రి హాయిగా పడుకుంటే ఉదయం మంచి రిలాక్సేషన్ ఫీలింగ్తో నిద్రలేస్తాం. ఇందుకు కారణం మన నిద్రలోని ఆర్ఈఎమ్ అనే దశ. ఇందులో కనుపాపలు స్పందిస్తూ ఉంటాయి.నిద్రలేవగానే హాయినిచ్చేందుకు ఈ ఆర్ఈఎమ్ దశ దోహదం చేస్తుంది. విపరీతంగా మద్యం తాగినప్పుడు మనలో ఆర్ఈఎమ్ దశ లోపిస్తుంది. దాంతో నిద్రలేచాక చికాకుగా ఉండి, హాౖయెన ఫీలింగ్ ఉండదు.అంతా చికాగ్గా ఉంటుంది. అసలు రుచి తెలియకుండా ‘కంజీనర్ల’ మాయ! ఆల్కహాల్లో ఉండే కొన్ని పదార్థాలను ‘కంజీనర్స్’ అంటారు. ఆల్కహాల్ తాగగానే మనకు పదార్థం తాలూకు అసలు రుచి తెలియదు. వాసన పసిగట్టలేం. రంగును గుర్తించలేం. అలా రంగు, రుచి, వాసనలను తెలియకుండా చేసేవే ఈ కంజీనర్స్. మద్యపానం తర్వాత వచ్చే మైగ్రేన్ తలనొప్పులు, మర్నాడు ఉదయం వచ్చే హ్యాంగోవర్కు ఈ కంజీనర్సే ప్రధాన కారణం. స్లీప్ ఆప్నియాతో ప్రాణాలకే ప్రమాదం: మద్యం తాగిన వారిలో గురక వస్తుంది. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా గురక వచ్చి శ్వాసకుఅంతరాయం కలిగే కండిషన్ను ‘స్లీప్ ఆప్నియా అంటారు. మంచి నిద్రలో మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేక సార్లు వస్తుంది. ఆప్నియా కండిషన్లో మనం తీసుకునే ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ప్రభావం చూపవచ్చు. కొందరిలో స్లీప్ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. నిద్రలో ప్రమాదకరమైన గురక (స్లీప్ ఆప్నియా)తో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మైగ్రేన్: ముదురు రంగులో ఉండే వైన్ లేదా రమ్ వంటి ఆల్కహాల్ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు. మూర్ఛ: సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో మూర్ఛ (సీజర్స్/ఫిట్స్) వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అందుకే ఆల్కహాల్ను మొదలే పెట్టకూడదు. ఏదైనా కారణాల వల్ల ఒకసారి తాగినా దాని దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు గుర్తించి మానేయాలి. తమ నియంత్రణలో తాము ఉండలేకపోవడం : దీర్ఘకాలం మద్యం తాగేవారిలో మెదడులోని బ్యాలెన్సింగ్కు తోడ్పడే సెరిబెల్లమ్ భాగం దెబ్బతింటుంది. దాంతో వారు సరిగా నడవలేరు. తూలుతున్నట్లుగా నడుస్తారు. మాట కూడా ముద్దముద్దగా, అర్థం కానట్టుగా (స్లర్ర్డ్ స్పీచ్) వస్తుంది. ఆల్కహాల్తో వచ్చే పెరిఫెరల్ న్యూరోపతి:ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు మన ఒంట్లో మండుతున్న భావనలు (బర్నింగ్ సెన్సేషన్) ఉండవచ్చు. అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపించడం జరగవచ్చు. క్రమంగా నరాల దొంతరలు (నర్వ్ ఫైబర్స్) దెబ్బతిని... ఆ తర్వాత్తర్వాత చేతులు–కాళ్లు దెబ్బతిని నడవలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటి స్థితి రావచ్చు. అయితే మద్యం మానేయడం ద్వారా దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మెల్లగా చక్కబడి మునుపటిలా అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక మద్యంతో తలతిరగడం, అంగస్తంభన సమస్యలు, నియంత్రించలేనంత ఒత్తిడితో మూత్రంవస్తుండటం, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంపై నియంత్రణ లేకపోవడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఇవేగాక... నాడీ వ్యవస్థలో లోపాలు అనేక లోపాలు అంటే... ఉదాహరణకు జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు వంటి సమస్యలూ రావచ్చు. అనేక ఇతర శారీరక వ్యవస్థలూ... మద్యంతో వాటిపై ప్రభావం ∙జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. ∙గుండె: ఆల్కహాల్ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు, గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్ సమస్యలు. ∙సెక్స్ సమస్యలు : సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు. ∙గర్భిణులు ఆల్కహాల్ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు. ∙చూపు దెబ్బతినడం : అన్ని కండరాలు దెబ్బతిన్నట్లే చాలా అరుదుగా కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గడం జరగవచ్చు. ఇక ఆల్కహాల్లో మిథనాల్ కలిసినప్పుడు ఆ కల్తీసారా తాగి ఒకేసారి చాలామంది కంటిచూపు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరిగిన దుష్పరిణామమే. ∙మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక వైటమిన్ లోపాలకు కారణం అవుతుంది. ∙బింజ్ డ్రింకింగ్తోనూ ప్రమాదమే: ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం కదా అనే వంకతో కొంతమంది ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. దీన్నే బింజ్ డ్రింకింగ్ అంటారు. అలా తాగినప్పుడు 6 నుంచి 36 గంటల పాటు మనలో చక్కెర పాళ్లు తీవ్రంగా తగ్గిపోతాయి. అందుకు కారణం మన చక్కెరపాళ్లను సరిదిద్దుతూ/నియంత్రిస్తూ ఉండాల్సిన కాలేయం తన అసలు పనిని వదిలేసి ఆల్కహాల్ విషాలను విరిచేస్తూ ఉండటం. దాంతో మన ఒంట్లోని నీళ్ల (ద్రవాల) పాళ్లు తగ్గుతాయి. డీ–హైడ్రేషన్ జరిగి దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్థితి 6 – 36 గంటల పాటు కొనసాగుతుంటుంది. దాహంతో పాటు వికారం (వాంతి వస్తున్న) ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చు. ఫలితంగా తలనొప్పి మొదలుకొని... వాంతులు, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా రావచ్చు. ఇలా బాగా తాగేసినప్పుడు మన అంచనా వేసే శక్తి లోపించడం (జడ్జిమెంట్ దెబ్బతినడం), అవయవాలను సమన్వయం చేసుకోలేకపోవడం (కోఆర్డినేషన్ లేకపోవడం), దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి పరిణామాలకు దారితీసి రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రక్తంలో మితిమీరి ఆల్కహాల్ ఉండటం అంటే ప్రతి 100 ఎమ్ఎల్ రక్తంలో 300 ఎంజీ ఆల్కహాల్ ఉంటే అది ఒళ్లు చల్లబడిపోవడం (హైపోథెర్మియా) మొదలుకొని రక్తపోటు తగ్గిపోవడం (హైపోటెన్షన్)తో పాటు శ్వాసమందగించి మరణానికి దారితీయవచ్చు. అలవాటును తప్పించడం / చికిత్స ఇలా... మద్యం అలవాటును అధిగమించడానికి, దాని దుష్ప్రభావాలకు చేసే చికిత్సలో భాగంగా మొదట అది మానే సమయంలో కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు. తర్వాత తాగుడు మాన్పించడం కోసం మందులు ఇస్తూ అదే సమయంలో సైకోథెరపీ, కౌన్సెలింగ్ చేస్తారు. సమాజంలో మనుగడ సాధించడం కోసం అవసరమయ్యే సామాజిక నైపుణ్యాల శిక్షణ (సోషల్ స్కిల్స్ ట్రైనింగ్) కూడా ఇస్తారు. ఇందుకోసం మానసిక వైద్యుల పర్యవేక్షణ అవసరం. అందుకే మద్యం మానాలన్న తీవ్రమైన సంకల్పబలంతో మానసిక వైద్యులను కలుసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదాలు (యాక్సిడెంట్స్) మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ. కాలేయానికి ఎంతో ముప్పు! ఒంట్లోకి వచ్చే ప్రతి విషపదార్థానికీ ఒక చెక్పాయింట్ లాంటిది కాలేయం. దేహంలోకి వచ్చిన ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్) విరిచేయడం కాలేయం పనుల్లో ఒకటి. అంతేకాదు... ఆ విషాలు ఒంట్లోంచి బయటకు వెళ్లేలా కూడా చూస్తుంది. మెదడు కూడా ఈ పనికి దోహదపడుతుంది. మెదడు మన జీవక్రియలు వేగంగా జరిగేలా చూసి చెమటపట్టించేలా చేస్తుంది. అలాగే శ్వాసవేగం పెరిగేలా చూస్తుంది.మద్యం ఎక్కువగా తాగిన వారి చెమటలో కూడా దుర్గంధం వస్తుండటం గమనించవచ్చు. మనలో ఎక్కువైన మద్యాన్ని మెదడు, కాలేయం కలిసి బయటకు విసర్జించే ప్రక్రియలో భాగంగా చెమట ద్వారా కూడా మద్యం బయటకు వెళ్లేలా చేస్తాయి. అందువల్లనే ఆ దుర్వాసన. మరికాసేపటి తర్వాత మూత్రం ద్వారా కూడా మద్యం వల్ల చేరిన విషాలను బయటకు పంపేలా మెదడూ, కాలేయం శ్రమిస్తాయి. అలా మద్యం నుంచి రక్షించే కార్యక్రమం అది ఒంట్లోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి జరుగుతుంటుంది. అయితే అవి బయటకు పంపే మోతాదు కంటే మనం తాగేది ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు, కాలేయాలు ఆ పని చేయలేక చేతులెత్తేస్తాయి. దాంతో అనర్థాలు, దుష్ప్రభావాలు కనిపించే దశలు మొదలవుతాయి. శనివారం రాత్రికీ మద్యానికీ సంబంధం ఏమిటి? ఇక్కడో ఇట్రరెస్టింగ్ సినిమా టైటిల్లాంటి పేరుతో ఒక వ్యాధి ఉంది. దాని పేరే ‘సాటర్డే నైట్స్ పాల్సీ’. ఆసక్తికరమైన ఆ వ్యాధి ఏమిటో కాస్త చూద్దాం. నరాలు చచ్చుబడేలా చేసే వ్యాధులకు ‘పాల్సీ’ అనే మాట వాడతారు. ఉదాహరణకు సెరిబ్రల్ పాల్సీ అనే పిల్లల వ్యాధిలో వారిలోని నరాలు సక్రమంగా స్పందించకపోవడం వల్ల వాళ్ల కదలికలూ మామూలుగా ఉండవు. అవి చూరుగ్గానూ ఉండవు. అలాగే ‘సాటర్డే నైట్స్ పాల్సీ’ అనే పాల్సీ కూడా మరొకటి ఉంది. ఇది పూర్తిగా పెద్దలది. మద్యం తాగే పెద్దలది. ఈ కండిషన్లోనూ నరాలు తాత్కాలికంగా చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఆదివారం సెలవు కాబట్టి శనివారం నాడు చాలామంది మద్యం ప్రియులు అదేపనిగా తాగేస్తుంటారు. ఎంతగా తాగుతారంటే... వాళ్లు అలాగే కుర్చీ మీద కూర్చుని నిద్రభుజం మీద తలపెట్టుకుని నిద్రపోతారు. దాంతో చేతికి వచ్చే ప్రధాన నరం అయిన ‘రేడియల్ నర్వ్’ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా అది తాత్కాలికంగా చచ్చుబడవచ్చు. ఇలా మద్యం తాగడం అనే ప్రక్రియ వీకెండ్ రాత్రే ఎక్కువ కాబట్టి ఆ కండిషన్కు ‘సాటర్డే నైట్స్ పాల్సీ’ అని పేరు పెట్టారు. జబ్బు పేరులో సాటర్డే అనే ఉన్నా ఇది మద్యం తాగిన ఏరోజైనా రావచ్చు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రక్త కణాలతోనే నాడీ మూలకణాలు
మెదడుకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేందుకు జర్మనీకి చెందిన హైడెల్బెర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మానవ రక్తకణాలనే నాడీ మూలకణాలుగా మార్చేయడం.. తద్వారా సరికొత్త మెదడు కణాలను వద్ధి చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. గుండెపోటుతోపాటు నాడీ సంబంధిత సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స కల్పించేందుకు ఈ కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని అంచనా. గతంలోనూ ఇలా సాధారణ కణాలను మూలకణాలుగా మార్చినప్పటికీ పరిశోధనశాలలో మూలకణాలు ఎక్కువ కాలం పాటు ఇతర కణాలుగా ఎదగడం మాత్రం ఇదే తొలిసారి. నాడీ మూలకణాలుగా మార్చగలగడం వల్ల నాడీ వ్యవస్థకు కీలకమైన న్యూరాన్లు, లేదా గ్లియల్ కణాలను తయారు చేయడం వీలవుతుందని గుండెపోటు తరువాత కోలుకుంటున్న వారికి వీటిని అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. మూలకణ పరిశోధనల్లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులోనే వీటిని నేరుగా రోగుల్లో వాడేందుకు అవకాశముందని అంచనా. -
మధుమేహాంతో మెదడు సమస్యలు?
మధుమేహంతో అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలుసుకుగానీ.. ఈ జబ్బు వల్ల మెదడుకూ ఇబ్బందులు తప్పవని అంటున్నారు టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు తాము జరిపిన అధ్యయనంలో టైప్–2 మధుమేహం వల్ల ఆలోచన తీరు, జ్ఞాపకశక్తుల విషయాల్లో సమస్యలు రావచ్చునని తేలినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిషేల్ కల్లిసాయ తెలిపారు. మధుమేహం ఉన్న కొంతమంది వయోవృద్ధులపై పరిశోధనలు చేశామని.. మొదట్లో వారి ఎమ్మారై స్కాన్లను పరిశీలించినప్పుడు మెదడులోని కొన్ని భాగాల సైజు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఐదేళ్ల కాలంలో వారి మెదడు పనితీరు తగ్గుదల కనిపించిందని, ఇందుకు అనుగుణంగానే మెదడు సైజు కూడా తగ్గిపోవడాన్ని తాము గుర్తించామని వివరించారు. మధుమేహులు తమ మెదడుపట్ల కూడా కొంత శ్రద్ధ వహించాలనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని.. ఇందుకు రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. ఏదో ఒక రూపంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం.. పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గుండెకు మంచి చేసే ఆహారం మెదడుకూ మేలు చేస్తుందని చెప్పారు. వీటితోపాటు నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండేందుకు అవకాశముందని అన్నారు. -
బాబుకు తరచూ తీవ్రమైన తలనొప్పి...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదకొండేళ్లు. తరచూ తలనొప్పి తో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కానీ ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రామస్వామి, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. నివారణ / చికిత్స: ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. వర్షం,వాతావరణంఉంటే చాలు... ముక్కులుబిగదీసుకు పోతున్నాయి! మా పాప వయసు ఏడేళ్లు. కాస్తంత మబ్బు పట్టి వాన వచ్చేలాంటి వాతావరణం ఉంటే చాలు పాపకు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఏడుస్తోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – జి. రమణి, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్ను రైనైటిస్గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్లో కనిపిస్తాయి. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్)గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా ఇది వస్తుంది. మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. పాపకు నోట్లో పొక్కులు... తగ్గేదెలా? మా పాప వయసు ఆరున్నర ఏళ్లు. కొద్ది రోజుల కిందట పాప గొంతు నొప్పి అంటే డాక్టర్కు చూపిం చాం. అప్పుడు తగ్గాయి కానీ మళ్లీ పాప నోటిలో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. గొంతు అంతా ఎర్రబారింది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – ఈశ్వరీబాయి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగపరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, అబ్రేసివ్ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి.దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఇది వస్తున్నట్లు భావించవచ్చు.ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి. అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కాఫీ వాసన గుప్పుమంటే.. మెదడుకు చురుకు!
ఉదయాన్నే కాఫీ తాగితే రోజంతా చురుకుగా ఉంటామని కొందరు అంటూ ఉంటారు. దీని మాటేమిటోగానీ కాఫీ వాసన తగిలినా చాలు.. మీరు వేగంగా లెక్కలు వేసేస్తారు అంటోంది స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆశ్చర్యంగా అనిపిస్తోందా? వివరాలు తెలుసుకుందాం. జీమ్యాట్ పరీక్ష గురించి మీకు తెలిసే ఉంటుంది. బిజినెస్ స్కూల్స్లో ప్రవేశానికి నిర్వహిస్తూంటారు దీన్ని. స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వంద మందికి పది ప్రశ్నలతో ఈ పరీక్ష పెట్టారు. విడదీసిన రెండు గుంపుల్లో ఒకదానికి మంచి కాఫీ వాసన వచ్చేలా చేశారు. ఇంకో గుంపులోని వ్యక్తులకు మామూలుగా పరీక్ష పెట్టారు. ఫలితాలను బేరీజు వేసినప్పుడు కాఫీ వాసన ఉన్న గదిలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇదంతా కాఫీ వల్లనే జరిగిందా? అన్నది తెలుసుకునేందుకు ఇంకో 200 మందిపై నాలుగు దఫాలుగా సర్వే జరిపారు. చివరకు తేలింది ఏమిటి అంటే.. కాఫీ వాసన వచ్చినప్పుడు తాము మరింత అలర్ట్గా, చురుకుగా ఉండగలుగుతున్నామూ అని! మిగిలిన సువాసనలతో పోలిస్తే కాఫీ వాసన మెదడుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవకాశమిస్తున్నాయని తెలిసింది. -
బ్రెయిన్ యోగా
యోగా అంటేనే దేహం, మనసు, ఆత్మల సమన్వయం. నిజానికి ప్రతి యోగాసనంతో మైండ్, బాడీ, స్పిరిట్ (సోల్) ఈ మూడూ పునరుత్తేజితమవుతాయి. అయితే ఇక్కడ పేర్కొన్న ఈ ఆసనాలు నేరుగా మెదడును ఉత్తేజితం చేస్తాయి. అందుకే ప్రత్యేకంగా వీటి ప్రస్తావన. చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (ఇక్కడ చూపిన పొజిషన్లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి. సూర్యనమస్కారాల్లో ఒకటైన ఆసనాన్ని విడిగా చేయాలి అనుకున్నప్పుడు... సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్లాలి. పైన చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద పైకి లేస్తూ మడమల్ని పైకి ఎత్తి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మడమలను నేల మీద ఆన్చి తల చేతులు కలిపి ముందుకు ఫార్వార్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్లను ఫ్రీగా ఉంచి పొట్టను లోపలకు లాగుతూ నడుము నుంచి పై భాగాన్ని ఎడమవైపు నుంచి కుడివైపునకు కుడి నుంచి ఎడమవైపునకు చేతులను వేలాడేస్తూ రొటేట్ చేయాలి. తలను మధ్యలోకి తీసుకు వచ్చి చేతులు ముందు నేల మీద ఒకదానికి ఒకటి ఒక అడుగు దూరంలో ఉంచి ఆల్టర్నేట్ పాదాలు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ రెండు పాదాలు వెనుకకు తీసుకువెళ్లి, పాదాల మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగు దూరం ఉంచి నడుమును బాగా పైకి లేపి భూమికి శరీరం త్రిభుజాకారంలో ఉండేటట్టుగా ప్రయత్నించాలి. శ్వాస వదులుతూ పొట్టను బాగా లోపలకి లాగిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తూండాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత తిరిగి అలాగే వెనుకకు పాద హస్తాసనము లోనికి, శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ చేతులు పక్క నుంచి కిందకు తీసుకువచ్చి తిరిగి సమస్థితిలోనికి రావాలి. ఉపయోగాలు: శరీరంలో ఉన్న 640 కండరాలలో కనీసం 500 కండరాలకు వ్యాయామం జరుగుతుంది. వెన్నుపూస భాగానికి తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. చంద్రభేది ప్రాణాయామం అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ నిటారుగా ఉంచి ఎడమచెయ్యిని ధ్యానముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటవేలు చివరభాగానికి తాకించి) లేదా చిన్ముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటనవేలు మధ్యభాగానికి తాకించి)లో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్ర లేదా నాసాగ్రముద్రలో లేదా మధ్యలో మూడు వేళ్లు మడిచి బొటన వేలు చిటికెన వేలితో నాసిక రంధ్రాలను మూస్తూ చేయాలి. చేసే విధానం: కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకున్న తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు వదలాలి. మళ్లీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు రిపీట్ చేయాలి. గమనిక: రైట్ హ్యాండర్స్ కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎడమచేత్తో చేయవచ్చు. కుడిచేత్తో చేసేటట్లయితే కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి తెరవడానికి బొటనవేలును ఉపయోగిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళు చిటికెన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని తెరవడం, మూయడం చేస్తారు. ఉపయోగాలు: ఎడమ ముక్కు నుంyì శ్వాస తీసుకుంటాం కనుక మెదడులోని కుడి గోళార్ధానికి ఆక్సిజన్ ఎక్కువగా పంపబడి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. స్ట్రెస్, టెన్షన్స్, హై బీపి, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వంటి సమస్యలకు చాలా మంచిది. క్రియేటివ్ థింకింగ్, ప్యారల్లెట్ ప్రాసెసింగ్కి ఉపయోగించే కుడి మెదడు పనితీరు మెరుగవడానికి ఉపయోగపడుతుంది. సర్వాంగాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీ కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును సీటు భాగాన్ని ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజములు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్డ్గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు. కపాలాసన లేదా శీర్షాసన ఇది చేయడం కష్టతరమే అని అన్పిస్తున్నా నిరంతర అభ్యాసంతో తేలికగా చేయవచ్చు. ముందుగా కొన్నాళ్లు గోడను ఆధారంగా చేసుకొని ప్రాక్టీసు చేయాలి. తలకింద మెత్తటి బ్లాంకెట్ను గాని యోగా మ్యాట్ను గాని చక్కగా మడత వేసి, తల మాడు భాగాన్ని కాకుండా ప్రీ ఫ్రోంటల్ ఏరియాను అంటే మాడు నుదురుకి మధ్యలో ఉన్న భాగం నేల మీద ఉంచాలి. రెండు అరి చేతులు తలకి ఇరువైపులా వేళ్లు ఇంటర్లాక్ చేసి సపోర్టుగా రెండు మోచేతులు భూమి మీద తలపక్కగా స్టాండ్లాగా ఉంచాలి. శరీరాన్ని బ్యాలెన్సు చేస్తూ రెండు పాదాలు, కాళ్లు కలిపి ఉంచి వాటిని భూమి మీద నుండి నెమ్మదిగా పైకి లేపుతూ భూమికి సమాంతరంగా వచ్చిన తరువాత, రెండు మూడు శ్వాసల కాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్కడ నుండి పైకి భూమికి లంబంగా వచ్చేటట్లుగా తీసుకువెళ్లాలి. ఈ స్థితిలో మూడు లేదా అయిదు నిమిషాల సేపు ఉండగలిగితే మెదడులోని కణాలన్నింటికీ ఆక్సిజన్తో కూడిన రక్తం సరఫరా బాగా పెరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. పిట్యుటరీ గ్రంధి యాక్టివేట్ అవ్వడం వలన శరీరంలో హార్మోన్ల విడుదలలో సమతౌల్యత చేకూరుతుంది. ముఖ్య గమనిక: నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని సాధన చేయాలి. బ్రెయిన్ ట్రెయిన్ యోగా అనేది మనల్ని మనం వర్తమానంలో ఉంచుకోవడానికి ఉద్దేశించింది. మొత్తం యోగా కాన్సెప్ట్... అనేది దీని చుట్టూనే డిజైన్ చేయడం జరిగింది. ఈ మైండ్నే యోగాలో అంతఃకరణాలు అంటాం. ఇంద్రియాలు, మనస్సు కలిపి కాన్షియస్ మైండ్ అంటాం, అహం, చిత్తంని అన్కాన్షియస్ లేదా సబ్కాన్షియస్ మైండ్ అంటాం. మన స్వభావం మారితేనే అన్నీ మారతాయి. కోపం, ఈర్ష్య, కామం వంటివాటిపై అదుపు ఉన్న మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వీటికి అవసరమైన శిక్షణ, సాధన యోగాలో లభిస్తుంది. బ్రెయిన్కు స్ట్రెయిన్... బ్రెయిన్కి ముందు భాగంలో ఉండేవాటిని ఫ్రాంటల్ ఏరియాస్ అంటాం. ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది బ్రెయిన్లోని ఆ ప్రాంతమే. అయితే ప్రస్తుత తరం పిల్లల్లో ఆ ఏరియా చాలా బలహీనపడింది. దీంతో భావోద్వేగాల మీద, ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉండటం లేదు. ర్యాంక్ రాకపోయినా సూసైడ్, మొబైల్ కొనకపోయినా సూసైడ్ చేసుకోవడం... వంటివి అందుకనే జరుగుతున్నాయి. జీవితంలో చిన్ననాటి నుంచి కష్టాలను ఎదుర్కుంటే ఫ్రాంటల్ ఏరియాస్ శక్తిమంతంగా మారతాయి. ఇప్పుడు పిల్లలకి అంతా స్పూన్ ఫీడింగ్ కదా. బస్సెక్కి శారీరక అవయవాలను ఉపయోగించి చేయాల్సిన పనులు వాళ్లు చేయడం లేదు. మైండ్ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. శరీరం ఒక కష్టాన్ని తట్టుకుంటూ నేర్చుకోవడాన్ని ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు పిల్లల్లో ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్, లోకోమోటార్ లెర్నింగ్ తక్కువైపోయింది. పరిశోధనలు తేల్చింది ఏమిటంటే... బ్రెయిన్పై యోగా–ధ్యానం ప్రభావం అనే అంశంపై ప్రస్తుతం 500కి మించి పరిశోధనలు జరుగుతున్నాయి. మైండ్ ఫుల్ నెస్ అనే అంశం మీద జాన్ కబాత్ అనే ఆయన అమెరికాలో మెడిటేçషన్ కోర్సు పెట్టాడు. మెడిటేషన్ తర్వాత బ్రెయిన్లో వచ్చే ఎన్నో సానుకూల మార్పులు ఆయన కనిపెట్టారు. నవతరం చాలా షార్ప్. ఒకేసారి 10వేల రకాల డైరెక్షన్లో వీరి మైండ్ తిరుగుతుంటుంది. మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో మైండ్ మరింత యాక్టివ్గా ఉంటోంది. దీని వల్లే వీరికి ఒక పనిమీద ఏకాగ్రత అంత సులభంగా కుదరదు. విపరీతమైన డైవర్షన్స్ ఉంటాయి. దీనికి కారణం ఎమోషన్స్ని కంట్రోల్ చేసే గ్రేసెల్ ఏరియాస్, వైట్ సెల్ ఏరియాస్ వీక్ అవుతుండటం. ఇదే రీసెర్చ్లో తేలింది. ప్రస్తుత తరంలో అత్యధికులు మైండ్ సంబంధిత పని మాత్రమే చేస్తున్నారు. శారీరకమైన పని దాదాపు సున్నా అయింది. అది సరైంది కాదు. అలాగే లెఫ్ట్ బ్రెయిన్, రైట్బ్రెయిన్స్లో లెఫ్ట్ యాక్టివ్గా ఉంటోంది. రైట్ బ్రెయిన్ వీక్ అవుతోంది. స్ట్రెస్, యాంగ్జయిటీ అంతా లెఫ్ట్లోనే ఉంటుంది. రైట్ బ్రెయిన్ మనకి పీస్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అందిస్తుంది. భారతీయుల్లో సహజంగానే లెఫ్ట్ బ్రెయిన్ చాలా యాక్టివ్. పుస్తకాల పురుగుల్లా చేయడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. రైట్ బ్రెయిన్ చాలా పూర్గా పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది. ఇదే క్రియేటివిటీకి ఉపయోగిస్తుంది.అలా రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయడానికి ధ్యానం ఉపకరిస్తుంది. రైట్ బ్రెయిన్కి ప్రోగ్రామింగ్ చేయడం అనేది మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. మైండ్ ట్రెయిన్... మైంyŠ కి ఇచ్చే శిక్షణ 2 రకాలు. ఒకటేమో ఏకాగ్రత పెంచేది. రెండోది వర్తమానంలో ఉంచడానికి ఇచ్చేది. మన స్వభావాన్ని, నేచర్ని మార్చడానికి, వర్తమానంలో ఉండేందుకు చేసేదే మెడిటేషన్. –ధ్యానాలు... కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు. అన్కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు అని రెండుంటాయి. మైండ్ అటూ ఇటూ వెళ్లకుండా ఉపయోగపడే ధ్యానాలను గ్రాహ్య తరగతికి చెందినవి. మంత్ర మెడిటేషన్, చక్రాల మీద ధ్యానం చేయడం ఇవన్నీ కాన్షియస్ మైండ్ మీద పనిచేసేవి. అన్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపే ధ్యానాలను గ్రహీత్న తరగతికి చెందుతాయి. అసలైతే ధ్యానాల్లో మొత్తం 40 రకాలు ఉంటాయి. వీటిలో దాదాపు అన్నీ అంటే 38 రకాల వరకూ కాన్షియస్ మైండ్ మీదనే పనిచేస్తాయి. ఆసనం ఉద్దేశం అదే... యోగాసనాల ఉద్దేశం చాలా మంది అనుకుంటున్నట్టు ఫిట్నెస్, ఆరోగ్యం ఇవి మాత్రమే కావు... బ్రెయిన్ని సరైన విధంగా శిక్షణ ఇవ్వడమే. మనసుకి అటూ ఇటూ తిరగడం అలవాటు. దాన్ని మార్చడానికి, శరీరంతో ఉంచడానికే ఆసనం. కాబట్టి దాదాపు అన్ని ఆసనాలూ బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి ఉపకరిస్తాయి. అన్కాన్షియస్ మైండ్ అనేది శరీరంలో అణువణువునా ఉంటుంది. అయితే ప్రతి కదలికలో మనసు ఉండాలి. అలాంటి శిక్షణ ఇచ్చేదే ఆసనం. అందుకే ఆసన కాన్సెప్ట్ మొత్తం కూడా బ్రెయిన్ ప్రోగ్రామ్నకు చెందిందే. అథోముఖ శ్వానాసనం, కపాలాసనం లేదా శీర్షాసనం... ప్రాణాయామాల్లో చంద్రభేదీ ప్రాణాయామం, క్రియా ప్రాణాయామం ... ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద శక్తిమంతంగా పనిచేసి అల్జీమర్స్, పార్కిన్సన్స్, డౌన్ సిండ్రోమ్, ఆటిజం వంటి సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. ఆసనం ద్వారా ఆక్సిజన్ సరఫరా పెరిగి 15 నుంచి 20% బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుందని రుజువైంది. -
బ్రెయిన్ను జిల్లు మనిపించండి
బోర్ కొడుతుంటే కొత్త డోర్ ఓపెన్ చేయాలి... బ్రైన్కి కొత్త రోడ్ వేయాలి.మొదడులో కొత్త స్విచ్ను ఒత్తి కొత్త బల్బులు వెలిగించాలి. అదీ సంగతి... స్విచ్ చేయండి... కొత్త అలవాట్లకి.... కొత్త ప్రక్రియలకి... కొత్త జిల్లులకి. మార్పు చేస్తుంది బ్రైన్ను షార్ప్. ఇవాళ కొంచెం రొటీన్ని బ్రేక్ చేద్దామా?... అంటే?ఏం లేదు... రోజూ కుడి చేత్తో ఎత్తే కాఫీ గ్లాసును ఎడమచేత్తో ఎత్తడం.కుడి చేత్తో చేసే పళ్లు తోముకోవడాన్ని ఎడమ చేత్తో చేయడం.కుడి చేత్తో దువ్వుకునే తలను ఎడమ చేత్తో దువ్వడం.సైకిల్నో స్కూటర్నో ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఎక్కడం.రోజూ ఈ వైపు నుంచి దిగే మంచాన్ని ఆ వైపు నుంచి దిగడం.రోజూ అలవాటైన దారిలో కాకుండా ఇంకొక దారిలో ఆఫీసుకు వెళ్లడం.ఇవన్నీ చేస్తే?... చేస్తే మంచిది.ఎవరికి మంచిది? మీకు మంచిది... మీ మెదడుకు మంచిది... అలవాటైన పద్ధతుల్లో అలవాటైన విధానాల ద్వారా మీ జీవితం సాగుతున్నప్పుడు సుప్తావస్థలోకి వెళ్లి ఆ రొటీన్కు అలవాటు పడిన మీ మెదడులోని కణాలు చైతన్యవంతం కావడానికి మంచిది. దీనివల్ల మెదడులోని కొత్త పాత్వేస్ అకస్మాత్తుగా చురుగ్గా మారతాయి. నిద్రాణంగా ఉన్నవి మళ్లీ చురుగ్గా మారతాయి. అంటే... టోటల్గా మెదడులోని చాలాభాగం చురుగ్గా మారుతుందన్న మాట. మెదడును తట్టి లేపి చైతన్యవంతం చేసే ఇలాంటి వ్యాయామన్నే ‘న్యూరోబిక్స్’ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొన్ని పనులు భిన్నంగా, కొన్ని పనులు ఎరుకతో చేయడమే న్యూరోబిక్స్. ఉదాహరణకు: మీ జేబులో ఉన్న నాణేలను ముట్టుకొని, వాటి అంచులను పరిశీలించి, ఆ స్పర్శతో ఆ నాణెం విలువ ఎంతో ఊహించండి. బయటికి తీసి మీరు రైటో కాదో చెక్ చేసుకోండి. కళ్లు మూసుకొని, మీ ఇంట్లోని ఏ ఫర్నిచర్ ఎక్కడుందో కనిపెడుతూ వెళ్లండి. కళ్లు తెరచి మీ అంచనా ఎంత కరెక్టో చూడండి. టీవీని కాసేపు మ్యూట్లో పెట్టండి. తెర మీది క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించండి. మళ్లీ మ్యూట్ తొలగించి మీరెంత కరెక్ట్గా ఊహించారో పరీక్షించుకోండి. నాలుగైదు రకాల సుగంధద్రవ్యాలను ఒకేలా ఉన్న సీసాలలో పెట్టించండి. కళ్లకు గంతలు కట్టుకొని వాటిని వాసన ద్వారా కాకుండా స్పర్శ ద్వారా అవేమిటో తెలుసుకోండి. ఇలా చేసి చూస్తే ఏమవుతుందని మీరు అడగవచ్చు. ఇలా చేయడం మెదడుకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఒంటికి చేసే వ్యాయామాలు ఏరోబిక్స్. మరి మైండ్కు? అవి న్యూరోబిక్స్. ఇవి బ్రెయిన్ను షార్ప్గా పనిచేయడంతో పాటు ... దీర్ఘకాలంలో మతిమరపు (డిమెన్షియా), అలై్జమర్స్ లాంటివాటిని నివారిస్తాయని కొందరు అంటారు. సైనాప్స్ కోసం మన మెదడు కార్యలాపాలన్నీ వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే వస్తుంటాయి... పోతుంటాయి. మైండ్ యాక్టివిటీ చాలావరకు ఆటోమేటిక్. మెదడు కణాలైన న్యూరాన్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే కనెక్షన్లను సైనాప్స్ అంటారు. సైనాప్స్ ఎంతబాగా ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటే ఆలోచనలు అంత విస్తృతంగా, వైవిధ్యంగా ఉంటాయి. మన చర్యలు రొటీన్గా మారినప్పుడు సైనాప్స్ నిద్రాణస్థితిలోకి వెళతాయి. అవి తుళ్లి పడేలా చేయడానికి చైనత్యవంతం కావడానికి రొటీన్ పనిని భిన్నంగా చేయడం అవసరం. ఇది ఇంకా బాగా తెలియాలంటే దీనికి కార్యక్షేత్రమైన మెదడు గురించి తెలియాలి న్యూరోబిక్స్ చేయడం ఎలా? మీరు నిద్రలేవడానికి ఎప్పుడూ ఒకేరకం అలారం పెట్టుకొని లేస్తుంటారా? ఈసారి డిఫరెంట్ టోన్లో అలారం పెట్టుకోండి. మెదడు దానిని గుర్తించి మేల్కొనడానికి కొత్త పాత్వే సృష్టించుకుంటుంది. ఫోన్లో రింగ్టోన్ మార్చండి. అది మోగినప్పుడు మీ మెదడు వెంటనే స్పందించదు. అది ఒకే రకమైన రింగ్టోన్కు ఫిక్సయి ఉంది. కానీ కొత్త రింగ్టోన్ మోగుతున్నప్పుడు మీకైమీరు పెట్టుకున్న రింగ్టోన్ అని గుర్తొచ్చి బ్రెయిన్లో కొత్త పాత్వే ఏర్పడుతుంది. ఇలా మీరు వదిలేస్తున్న అంశాలనూ మళ్లీ ఉపయోగంలోకి తెస్తుండటంతో అప్పటివరకూ మీరు లూజ్ చేసుకునేవి కూడా మీరు యూజ్ చేసుకునేవే అవుతున్నాయి. కింద మీరు చేయదగిన ఇలాంటివే మరికొన్ని మీ కోసం... బాత్రూమ్లో: మీ సబ్బును మారుస్తూ కొత్త వాసనలు పీలుస్తుండాలి. కొత్తవి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడూ వాడే నోటు కాకుండా సరికొత్త కరెన్సీ నోట్ మీ పర్స్లోకి వచ్చిందనుకోండి. విలువ సేమ్ అయినా కాసేపైనా దాన్ని అపురూపంగా చూస్తారు కదా. అలాగే ఈ కొత్త అనుభవాలూ మీకు కొత్త థ్రిల్నూ, జీవితేచ్ఛనూ ఇస్తాయి. ఆఫీసుకు వెళ్లే దారిలో : మీ వాహనాన్ని అలవాటైన ఒకే రూట్లో కాకుండా, వేర్వేరు రూట్స్లో నడుపుతుండండి. దాంతో మీకు కొత్తదారులు తెలుస్తాయి. ఎప్పుడైనా ఒక రూట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు... దాన్ని అధిగమించడానికి అప్పటికే తెలిసిన ‘కొత్త దారులు’ మీకు స్ఫురిస్తాయి. పనిలో: మనం పనిచేసే చోట మీ వస్తువుల్నీ, ఉపకరణాలన్నీ ఎప్పుడూ ఒకే లా ఉండకుండా చూడ ండి. కొత్త రంగు పెన్సిల్ నూ, కొత్త రంగు పెన్నూ, కొత్త ఇంక్నూ వాడండి. రొటీన్ భిన్నంగా ఉండే కొత్తది ఎప్పుడైనా మనకు ఉత్తేజాన్నే ఇస్తుంటుంది. మెదడును ఉపయోగించండి: మీరు రోజూ చేసే పనిని రొటీన్గా చేయకండి. కాస్తంత వేరుగా ఎలా చేయగలమో ఆలోచించండి. వైవిధ్యమైనవీ, విభిన్నమైనవీ ఆలోచనలు చేసి, అవి మీ పనికి ఎలా ఉపకరించగలవో చూడండి. అమలు చేయండి. తేడా గమనించండి. బ్రెయిన్ స్టార్మింగ్: ఆలోచనలు అలల్లాగా వస్తాయంటారు. ఒకరి ఆలోచనలు కొన్ని అలలైతే... ఎంతోమంది ఆలోచనలలు కలిస్తే... అదొక అలల వెల్లువ. ఆ వెల్లువ తీవ్రత మరింత పెరిగితే! అది అల స్థాయి నుంచి ఉప్పెనగా మారుతుంది. అయితే మీ స్నేహితులు, వాళ్లు మీకు ఇచ్చే కంపెనీ, వారందరి ఆలోచనల వెల్లువ ఉప్పెనగా మారితే... అదే బ్రెయిన్ స్టార్మింగ్. మామూలు స్టార్మ్ వినాశకమైతే... ఈ తుఫాను మంచిది. మేలు చేసేది. కాకపోతే మీ మిత్రులంతా మంచివాళ్లయి ఉండాలంతే. భోజనాల దగ్గర: భోజనాల సమయంలో ఎప్పు డూ మీకు అలవాటైన ఫుడ్ మాత్రమే కాకుండా మెనూ మార్చండి. మార్కెట్లో: ప్రతిసారీ ఒకే షాప్కు వెళ్లకండి. కొత్త చోట్లకు వెళ్లి అక్కడి ఉత్పాదనల్లోని ఇన్గ్రేడియెంట్స్ చూడండి. ఎప్పుడూ కొత్త చాక్లెట్లూ, కొత్త బిస్కెట్లూ్ల ట్రై చేయండి. పాలవాడు ఇంటికి వచ్చి పాలపాకెట్ వేయడం మామూలే. అప్పుడప్పుడూ మీరే వెళ్లి పాలపాకెట్ తెండి. ట్రావెల్: మీరు ప్రయాణాలు చేయడం అన్నది అత్యద్భుతమైన ‘న్యూరోబిక్’ వ్యాయామం. కొత్త ప్రాంతాలూ, కొత్త ముఖాలు, కొత్త ఆహారాలూ ఇవన్నీ మీ ప్రమేయం లేకుండానే సమకూరుతాయి. దాంతో మెదడులో ఆలోచనల కొత్త పాత్వేస్ ఏర్పడతాయి. మీరెంతగా ఎక్సయిట్ అవుతున్నారంటే... అంతగా ‘న్యూరోబిక్’ యాక్టివిటీ జరుగుతుందని అర్థం. అన్నట్టు... ఎప్పుడూ ఒకే వాహనంలో వెళ్లకండి. అప్పుడప్పుడూ మీ వాహనాన్ని మీ ఫ్రెండ్కు ఇచ్చి... అతడిది మీరు వాడండి. మాట్లాడండి: భావాలను వ్యక్తపరచండి. మీరు బాగా సిగ్గరా? అయితే కనీసం బాత్రూమ్లోనైనా మీ భావాలను బయటకు చెప్పండి. ఎప్పుడూ పాడే పాటలు కాకుండా కొత్త పాటలు పాడుతుండండి. విశ్రాంతిగా ఉన్నప్పుడు: ఏదైనా కొత్త హాబీని ప్రయత్నించండి. కొత్త ఫొటో తీయండి. కొత్త సంగీతవాద్యాన్ని ప్లేచేయండి. చెస్ ఆడండి. లేదా కొత్త గాడ్జెట్, కొత్త యాప్ వాడుతుండండి. మీరు చూడండి. కొందరు కొత్త కొత్త గాడ్జెట్స్ వాడుతూ, దాని అంతు చూడాలనుకుంటారు. కొత్తవాటిని ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే... మీలో అంతగా జీవనోత్సాహం ఉందన్నమాట. ఇలా చేస్తుంటే ఏమవుతుంది... మెదడుకు ఏరోబిక్స్ అయిన ఈ న్యూరోబిక్స్తో మెదడులోని పాత కణాలే... సరికొత్త కణాలుగా మళ్లీ తమను తాము ఆవిర్భవించుకుంటాయి. తమ పనిని కొత్తగా ఆవిష్కరించుకుంటాయి. మైండ్కు కొత్త పవర్ సమకూరుతుంది. మీ విజయరహస్యం మీ మైండ్ పవరే కదా. ఆ పవర్ మీకుంటే మీరెప్పుడూ ఫిట్. మీరెప్పుడూ యంగ్. మెదడు గురించి కొంచెం... మెదడు బరువు మహా అయితే 1.4 కిలోలు. ఈ కొద్ది బరువే తనకంటే దాదాపు 50 రెట్ల బరువున్న దేహాన్ని చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. నిత్యం దాన్ని నడిపిస్తుంటుంది. మెదడులో 85 శాతం నీళ్లే. మెదడు కణాలన్నీ కొవ్వు కణాలే. శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్లో 25 శాతం మెదడులోనే ఉంటుంది. ఒంటికి అందే ఆక్సిజన్లో 20 శాతం ఆక్సిజన్ తీసుకుంటుంది. మెదడులో దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. మెదడులోని ఇసుక రేణువంత భాగంలో లక్ష న్యూరాన్లు పొరుగు కణాలతో అనుసంధానితమై 100 కోట్ల కనెక్షన్లు (సైనాప్స్) ఏర్పరుస్తాయి. ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం మెదడులో ఉన్నప్పుడు దానికి వ్యాయామాలు కావాలి కదా. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనిషికి పదేళ్ల వయసు నుంచి సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అతడి ఎదుగుదలలో ఎదురవుతున్న అనుభవాలతో మెదడులో కొత్త కొత్త సైనాప్స్లు ఏర్పడుతుంటాయి. చూస్తున్నవీ, వాసన పీలుస్తున్నవీ, వింటున్నవీ, నేర్చుకుంటున్నవీ... ఒక కోడ్ రూపంలో న్యూరాన్లలో నిక్షిప్తమవుతాయి. ఒకసారి ఏర్పడిన జ్ఞాపకం వేరే సందర్భంలో బయటకు వచ్చి సమస్య పరిష్కారానికి తోడ్పడటం న్యూరాన్ల కనెక్షన్లతో ఏర్పడే ‘సైనాప్స్’లనే జరుగుతుంటుంది. ఇలా తెలివితేటలు (ఇంటెలిజెన్స్) వృద్ధి పొందుతుంది. అయితే ఈ ప్రక్రియలో మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరుగుతాయి. దృష్టి పెట్టని అంశాలు తగ్గుతాయి. దీన్నే ‘యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా చెప్పవచ్చు. అంటే ఉపయోగించేవి పెరుగుతూ, ఉపయోగించనివి తగ్గిపోతుంటాయి. ఉపయోగించని వాటిని ఉపయోగంలోకి తెస్తేనే మరిన్ని సైనాప్స్లు ఏర్పడి మెదడు చురుగ్గా మారుతుంది. న్యూరోబిక్స్ అవసరమయ్యేది అందుకే. – డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఫిజిక్స్తో మెదడులో కొత్త చైతన్యం!
వినేందుకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఫిజిక్స్ నేర్చుకుంటే... మెదడులో కొన్ని ప్రాంతాలు మరింత చైతన్యవంతమవుతాయి అంటున్నారు ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మెదడు పనిచేసే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడే ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్మారై) వాడి తాము ఈ అంచనాకు వచ్చామని ఎరిక్ బ్రూవీ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాదాపు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రయోగంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తూ తాము ఒక భౌతికశాస్త్ర కోర్సు మొదలుపెట్టామని, ఎఫ్ఎమ్మారై ద్వారా వారి మెదడును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు చైతన్యవంతం కావడాన్ని గుర్తించామని వివరించారు. కోర్సు ప్రారంభానికి ముందు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్య పూరణం వంటి అంశాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు చురుకుగా మారితే.. కోర్సు పూర్తయిన తరువాత ఫ్రంటల్ పోల్స్ ప్రాంతంతోపాటు పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం కూడా చైతన్యవంతమైంది. మొదటి భాగం నేర్చుకోవడానికి సంబంధించిందైతే.. రెండోది ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను క్రమపద్ధతిలో నెమరేసుకోవడం, సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్ అంశాలకు సంబంధించినవని బ్రూవీ తెలిపారు. -
కష్టం.. మెదడుకి ఇష్టం
లండన్: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్ బ్రెయిన్ హైపోథిసిస్ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది. -
మెదడును దాచేసుకోండి!
మెమరీ కార్డు కానీ.. పెన్డ్రైవ్ కానీ కొన్నప్పుడు అది మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని సినిమాలు కానీ.. పాటలతో కానీ నింపేస్తే.. అందులో మన సమాచారం భద్రంగా ఉంటుంది. దీన్ని జీవితాంతం ఎలాగోలా దాచేసుకోవచ్చు. మరి చిన్నప్పటి నుంచి మన మెదడులో ఎంత సమాచారం చేరి ఉంటుంది. మరి ఈ సమాచారం జీవితాంతం దాచుకోవచ్చా.. అదెలా సాధ్యం మనం చనిపోయినప్పుడే ఆ మెదడు కూడా చనిపోతుంది. మరి ఆ సమాచారం.. ఇంకెక్కడి సమాచారం మనతోపాటే గాల్లో కలిసిపోతుంది. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ మాత్రం మీ మెదడును చాలా జాగ్రత్తగా దాచేస్తామని చెబుతోంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఆ మెదడులోని సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తామంటోంది. మన మెదడులోని నాడులను, నెట్వర్క్ను అధ్యయనం చేసి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తామని నెట్కాం అనే ఈ కంపెనీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టింది ఆ కంపెనీ. ఏంటంటే మన మెదడును వారు తీసుకుని భద్రపరచాలంటే మనం చనిపోకముందే తీసుకుంటుందట. అమ్మో అదేంటి చనిపోయాక తీసుకోవచ్చు కదా అంటే సమాచారం‘బతికి’ఉండాలట. బతికి ఉండగానే మెదడులోకి ఎంబామింగ్ రసాయనాలు పంపి తాజాగా ఉంచుతారట. ఇప్పటికే ఓ పంది మెదడును ఈ ప్రక్రియతో భద్రపరిచారట. మరి ఎవరు మొదట తమ మెదడును భద్రపరుచుకుంటారో చూడాలి. -
వాటర్ ట్యాప్ తాకగానే.. 240 వోల్ట్స్ షాక్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్లో చోటుచేసుకుంది. డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. 50 ఓల్ట్ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు. -
కాలుష్యం కాటు..ఎందెందు వెతికినా..అందందే..
వాయు కాలుష్యం.. కంటికి కనపడదు.. కానీ.. ఒంట్లో మాత్రం కనిపిస్తుంది.. అదెలా అంటారా.. వివిధ రకాల రుగ్మతల రూపంలో.. ఓ సారి కింద ఉన్న గ్రాఫిక్పై ఓ లుక్కేయండి.. కాలుష్యం కాటు ప్రభావం.. మన శరీరంలో ఎందెందు వెతికినా.. అందందే అన్నట్లు కనిపిస్తుంది.. అతి సూక్ష్మమైన ధూళి కణాల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే.. ఊపిరితిత్తులు.. - ఊపిరితిత్తుల వ్యాధి మరింత ముదురుతుంది - ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది రక్తం - రక్త నాళాల గోడల ద్వారా ఈ ధూళి కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి - రక్త ప్రసరణ సమస్యలు - రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం/థ్రాంబోసిస్ రక్త నాళ వ్యవస్థ - అథెరోస్క్లెరోసిస్(ధమని గోడల్లో కణితి ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ తగ్గడం) - రక్త నాళాలు కుచించుకుపోవడం, అధిక రక్తపోటు మెదడు - మెదడుకు రక్తప్రసరణ సరిగా లేక స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం - కాగ్నిటివ్ డిజార్డర్స్ (మానసిక రుగ్మతలు) - న్యూరో డిజెనరేషన్ సమస్యలు(పార్కిన్సన్, అల్జీమర్స్ మొదలైనవి) గుండె - గుండె పనితీరులో మార్పులు - గుండె కొట్టుకునే వేగానికి సంబంధించిన సమస్యలు పునరుత్పత్తి వ్యవస్థ - సంతానోత్పత్తి సమస్యలు - గర్భస్రావం - పిండం ఎదుగుదల సమస్యలు, నెలలు నిండకుండానే జననం - తక్కువ బరువుతో పుట్టడం సాక్షి, తెలంగాణ డెస్క్ ఆధారం: ఫ్రెంచ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ -
మెదడు సైజు పెరిగింది
గత ముప్పయి లక్షల సంవత్సరాల వ్యవధిలో మనిషి మెదడు సైజు మూడు రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మెదడు పరిమాణం పెరగడం వల్లనే నాగరికత, సంస్కృతి, భాషలు, పరికరాలను తయారు చేసుకునే సామర్థ్యం అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు వందకు పైగా మానవ శిలాజాలను నిశితంగా పరీక్షించిన తర్వాత షికాగో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. షికాగో వర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ డ్యూ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 మానవ జాతులకు చెందిన 94 శిలాజాలను సేకరించి పరీక్షలు జరిపింది. పరిణామ క్రమంలో మానవ జాతికి సమీప బంధువులైన చింపాంజీలతో పోలిస్తే ఇప్పటి ఆధునిక మానవుల మెదడు పరిమాణం మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉంటోందని, ఈ స్థాయిలో పరిణామం చెందడానికి ముప్పయి లక్షల ఏళ్ల కాలం పట్టిందని డాక్టర్ ఆండ్రూ డ్యూ తెలిపారు. -
పచ్చదనంతో పిల్లల మెదడుకు హాయి
లండన్: పిల్లల్ని పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిప్పడం వల్ల వారు చురుగ్గా ఉండటం గమనిస్తూనే ఉంటాం. ఇంటి చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం ఉంటే వాళ్ల మెదడు ఎదుగుదలకు మంచిదట. ఇది స్పెయిన్లోని బార్సెలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు అంటున్న మాట. పచ్చదనం వల్ల మెదడులో ఉండే తెల్లని, బూడిద రంగు పదార్థం ఎక్కువగా అవుతుందని, దానితో పిల్లల మెదడు ప్రశాంతంగా ఉండి, జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. 253 మంది పాఠశాల విద్యార్థులను ఎమ్మారై స్కానింగ్తో పరీక్షించగా పచ్చదనంలో నివసించేవాళ్లలో మెదడు ఎదుగుదల బాగుందని గుర్తించామని తెలిపారు. -
కొంచెం పుచ్చుకుంటే.. మెదడుకు మేలేనట!
మితంగా పుచ్చుకుంటే మద్యం వల్ల మెదడుకు మేలే జరుగుతుందని అంటున్నారు రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. తక్కువ స్థాయిలో తీసుకునే మద్యం మెదడులో పేరుకుపోయే బీటీ అమైలాయిడ్ వంటి విష పదార్థాలు బయటకు పంపేందుకు దోహదపడుతుందని , తద్వారా వాపు/మంట తగ్గి మెదడు పనితీరు మెరుగవుతుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలంపాటు మద్యం ఎక్కువగా తీసుకోవడం నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని వీరు గతంలోనే నిరూపించగా.. తాజా అధ్యయనంలో కొన్ని ఎలుకలకు తక్కువ మోతాదులో ఎథనాల్ అందించి.. వాటి మెదళ్లలో వచ్చే మార్పులను పరిశీలించారు. అస్సలు మద్యం తీసుకోని ఎలుకల కంటే కొద్దిమోతాదులో తీసుకునే వాటిలో మెదడులోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడే సెంట్రల్ స్పైనల్ ఫ్లూయిడ్స్ వేగంగా పనిచేసినట్లు తెలిసింది. మెదడు కదలికలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా మద్యం తీసుకోని.. తక్కువ తీసుకున్న ఎలుకల పనితీరు ఒకేలా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ ప్రయోగాల్లో తక్కువ మోతాదు మద్యమంటే.. రోజుకు రెండున్నర పెగ్గులుగా తీర్మానించారు! -
మెదడుకు కూడా!
పసుపుతో మేనికి మెరుపు వస్తుందనే సంగతి చాలాకాలం నుంచే మన దేశంలోని మహిళలకు తెలుసు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు పలు ఆధునిక పరిశోధనలు కూడా తేల్చాయి. పసుపుతో మేనికి మాత్రమే కాదు, మెదడుకు కూడా మేలు జరుగుతుందని ఒక తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఆహారంలో భాగంగా పసుపును తరచూ వాడుతున్నట్లయితే జ్ఞాపక శక్తి దాదాపు ముప్పయి శాతం మేరకు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు. ఆహారంలో పసుపు వినియోగం వల్ల జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసే అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ గ్యారీ స్మాల్ వెల్లడించారు. పద్దెనిమిది నెలల పాటు రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు ఆహారంలో పసుపు తీసుకున్న వృద్ధుల మెదడు పనితీరులో గణనీయమైన మెరుగుదలను తమ పరిశోధనల్లో గుర్తించామని ఆయన తెలిపారు. -
ఉప్పుతో... మెదడు పనితీరులోనూ తేడాలు!
ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుందని మనకు తెలుసు. వెయిల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో విషయాన్ని కనుక్కున్నారు. ఈ రకమైన ఆహారంతో మతిమరుపు మొదలుకొని అనేక మెదడు సంబంధిత కార్యకలాపాల్లో తేడాలు రావచ్చునని ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా వీరు గుర్తించారు. మెదడుకు.. మన కడుపు/పేగులకు మధ్య ఇప్పటివరకూ గుర్తించని ఓ సంబంధం వల్ల ఇలా జరుగుతోందన్నది వారి అంచనా. కొన్ని ఎలుకలకు అధిక మోతాదులో ఉప్పు ఉన్న ఆహారాన్ని అందించినప్పుడు వాటి మెదడులోని కార్టెక్స్ ప్రాంతంలో రక్త సరఫరా 25 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. అలాగే ఎనిమిది వారాల తరువాత హిప్పోకాంపస్లోనూ ఇంతే స్థాయి తగ్గుదల నమోదైంది. ఈ ఎలుకలకు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు సాధారణ ఎలుకల కంటే చాలా అధ్వానమైన ఫలితాలు వచ్చాయి. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు తెల్ల రక్తకణాలు ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం.. ఫలితంగా ఎండోథీలియల్ కణాల్లో నైట్రిక్ యాక్సైడ్ తగ్గిపోవడం ద్వారా మెదడుపై ప్రభావం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మందుల ద్వారా ఈ ప్రొటీన్ను అందించగా పరిస్థితులు చక్కబడ్డాయి. కీళ్లనొప్పుల వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలప్పుడు కూడా ఈ ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఎలుకలు నాలుగు వారాల్లో సాధారణ స్థితికి వచ్చినట్లు వారు చెప్పారు. -
వీరు క్యాన్సర్ను జయించారు
క్యాన్సర్ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణం ఇదీ అని తెలియదు. ఈ వ్యాధికి గురైనవారిలో చక్కటి ఆరోగ్యవంతమైన జీవనశైలి గడుపుతూ ఉన్నవారూ ఉన్నారు... అలాగే దురలవాట్లకి లోనైనవారూ, వయసుపైబడిన వారూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా మంచి జీవనశైలితో పాటు క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం. వీలైనంతగా క్యాన్సర్ను ముందే పసిగట్టగలగడం. ఇప్పుడు క్యాన్సర్ను జయించడం అంత కష్టమేం కాదు. మనోబలం, నిబ్బరం చాలు క్యాన్సర్ను జయించడానికి. అలా జయించిన వారు చాలామందే ఉన్నారు. వారి స్ఫూర్తి మనలో నింపుకుంటే ఇప్పుడు క్యాన్సర్ను ఓడించడం సులభమే. అలా క్యాన్సర్ను జయించిన కొంతమంది ప్రముఖుల గురించి ఈ కథనంలో... ప్రముఖ క్రికెటర్ యువరాజ్సింగ్ 2011లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురైనప్పుడు అంత ఆరోగ్యవంతులకూ క్యాన్సర్ వస్తుందా అంటూ అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకొని ‘ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్’ అనే పుస్తకం రాశారు. ఇంతకు ముందులాగే అంతే ఆరోగ్యకరమైన రీతిలో, అంతే సామర్థ్యంతో క్రీడాజీవితం గడుపుతున్నారు. ఎందరికో అభిమాన నటిగా పేరుతెచ్చుకున్న మనీషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్కు గురయ్యారు. సర్జరీతో పాటు మిగతా చికిత్స తీసుకొని ఇప్పుడు క్యాన్సర్ మీద అవగాహన కలిగించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ 16 ఏళ్ల నుంచే రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. 25 ఏళ్ల వయసులో క్యాన్సర్... మెదడు, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లోకి పాకడంతో పాటు అడ్వాన్స్డ్ దశలో టెస్టిక్యులార్ (వృషణాల) క్యాన్సర్ బయటపడ్డప్పుడు ఆయన బతకడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో అన్ని రకాల కాంబినేషన్ చికిత్స తీసుకొని ఆయన ఆ మహమ్మారిపై విజయం సాధించారు. తర్వాత ఆరుసార్లు టూర్ డిఫ్రాన్స్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఒకప్పటి సౌత్ఆఫ్రికా దేశాధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి విజేత, భారతరత్న నెల్సన్మండేలా పీఎస్ఏ పరీక్షతో ముందే ప్రోస్టేట్ క్యాన్సర్ను పసిగట్టి రేడియేషన్ థెరపీ తీసుకున్నారు. 1990లో ప్రోస్టేట్గ్రంథిని తొలగించుకొని, ఆ క్యాన్సర్ బారినుంచి విముక్తిపొందారు. 95 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మరణించారు. అంతేగానీ క్యాన్సర్తో కాదు. ప్రముఖ నటి గౌతమి, గ్రామీఅవార్డు దక్కించుకున్న పాటల రచయితా, గాయని షెరిల్ క్రౌ, ఇక జీన్మ్యూటేషన్ పరీక్షతో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టి మాసెక్టమీ చేయించుకున్న హాలివుడ్ నటి ఏంజిలినా జోలీ బ్రెస్ట్క్యాన్సర్ మీద విజయం సాధించిన చాలా మందిలో కొందరు మాత్రమే. ఇలా మనకు తెలిసిన ప్రముఖ విజేతలతో పాటు తెలియనివారెందరో గుండెధైర్యంతో జీవితంలోని అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, క్యాన్సర్కు ఎదురొడ్డి నిలిచి, దాన్ని జయించారు. వీరిలో జీన్ మ్యూటేషన్, ఇతర పరీక్షలతో ముందే ప్రమాదాన్ని గుర్తించి క్యాన్సర్ రాకుండా చికిత్స తీసుకున్న వారు కొందరైతే, మరికొందరు శరీరమంతా అది పాకినా, ఇంక ఏ విధమైన ఆశలు లేవని తేలిపోయినా... ఆ స్థితి నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నవారూ ఉన్నారు. ఇలాంటి విజేతలందరిలో ఉండే లక్షణాలు ఏమిటా అని ఆలోచిస్తే... వారికి క్యాన్సర్ ఉందని తెలిశాక కూడా కుంగిపోకుండా, మనోనిబ్బరంతో దాన్ని ఎదుర్కోవడమే. ముందుగా కొంత ఆందోళనకు గురైనా, తర్వాత వారు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, చికిత్స ఎలా తీసుకోవాలి, ఏయే జాగ్రత్తలు పాటిస్తే మంచిది, ఆహారం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి... లాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకొని డాక్టర్ సలహాలు తప్పక పాటిస్తూ, చికిత్స తీసుకుంటూనే తమ తమ రంగాల్లో తమ కృషిని కొనసాగిస్తూ... నటించిన వారూ, ఆటల్లో పాల్గొన్నవారూ, పుస్తకాలు రాసినవారూ ఉన్నారు. ఏ క్యాన్సర్ అయినా తొలిదశలో గుర్తిస్తే ఆ కణం మీద విజయం సాధించడం తేలికే. పొగాకు ఉత్పత్తులు వాడేవారికి, ఆల్కహాల్ అలవాట్లు, అధికబరువు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ అని అందరూ తెలుసుకుంటే మంచిది. క్యాన్సర్ రిస్క్ అన్నది పర్యావరణ పరిస్థితులు, వారు చేసే వృత్తి, వంశపారంపర్య లక్షణాలు, వారు వాడే ఇతర మందులు, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర అలవాట్లు... ఇలా అనేక విషయాలతో ముడిపడి ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఈ సమస్య విషయంలో అవగాహన లేమితో పాటు అపోహలు, అనవసర అనుమానాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పటి ఆధునిక వైద్యవిధానాలతో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మీద, క్యాన్సర్ మీద పట్టు సాధించగలుగుతున్నాం. అన్ని సందర్భాల్లోనూ నయం చేయడం సాధ్యం కాకపోతే, కనీసం అదుపులోకి తీసుకురాగలుగుతున్నాం. కీమో మందులలో మరింత కొత్తవి, దుష్ప్రభావాలు తక్కువగా ఉండేవి వస్తున్నాయి. సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఈ కీమో మందుల ధరలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. ఇతర శరీర భాగాల మీద చాలా తక్కువ ప్రభావం చూపే రేడియేషన్ థెరపీలు అందుబాటులోకి వచ్చేశాయి. వీఎమ్ఏటీ, సైబర్నైఫ్ వంటి రేడియో రోబోటిక్ సర్జరీలతో దుష్ఫలితాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక సర్జరీలు, శరీరభాగాలను తొలగించినప్పుడు చేసే రీకన్స్ట్రక్టివ్ సర్జరీలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మనం చేయాల్సిందల్లా... క్యాన్సర్ను తొలిదశలో కనుగొనడం, అనుభవజ్ఞులైన డాక్టర్ను సంప్రదించడం, చికిత్స, మందులు సరిగా తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్కు హాజరు కావడం, యోగా, ధ్యానం, మంచి వ్యాపకాల వంటివి ప్రాక్టీస్ చేయడం, నలుగురితో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఇలా చేస్తే అన్ని విధాలా మంచిది. క్యాన్సర్ అని తెలియగానే మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్కు గురయ్యేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యాపకాలు పెంపొందించుకొని, మంచి చికిత్స తీసుకుంటే మీరూ క్యాన్సర్ను జయించవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
పిల్లల మెదడుకు వెరీ‘గుడ్డు’
‘సండే యా మండే... రోజ్ ఖావ్ అండే’ అనేది ఉత్త ప్రచార నినాదమే కాదు, శాస్త్రీయ వాస్తవం కూడా. ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తింటున్నట్లయితే పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా ఆరునెలలు ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు చొప్పున తినే పిల్లల మెదడు పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు గుర్తించామని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్త లోరా ఇయానోటి వెల్లడించారు. పాలు, పప్పుధాన్యాలు, గింజలు మాదిరిగానే గుడ్లు కూడా పిల్లల ఎదుగుదలకు బాగా దోహదపడతాయని తెలిపారు. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాల తో పాటు కీలకమైన డీహెచ్ఏ, కోలిన్ అనే సూక్ష్మ పోషకాలు మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని వివరించారు. -
ఈట్ గ్రీన్ ఫర్ గుడ్ బ్రెయిన్!
వాషింగ్టన్: ఆకుకూరలు ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. అయితే ఆ కూరలు ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచడమేకాదు.. మన వయసును తగ్గిస్తాయట. అదెట్లా? అని ఆశ్చర్యపోవద్దు.. ఎందుకంటే ఆకు కూరలు మెదడు వయసును తగ్గిస్తాయట. అంటే... మన శరీరం వయసు పెరిగినా దాని ప్రభావం మెదడుపై పడకుండా చేస్తాయట. దీనివల్ల ఆకుకూరలు తినేవారు మరింత చురుగ్గా కనిపిస్తారట. రోజూ ఆకుకూరలను తమ ఆహారంలోభాగం చేసుకున్నవారు మిగతావారితో పోలిస్తే 11 సంవత్సరాలు వయసు తక్కువగా కనిపిస్తారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికాలోని రష్ యూనివర్సిటీ తన జర్నల్లో ప్రచురించింది. పరిశోధనలోభాగంగా ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారికి, అప్పుడప్పుడు మాత్రమే తినేవారికి కొన్ని పరీక్షలు పెట్టారు. వీరిలో ప్రతిరోజూ ఆకుకూరలు తినేవారు ఏదైనా ఆలోచించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదట. మిగతావారు మాత్రం చిన్నపాటి విషయాలకు కూడా గంటల తరబడి ఆలోచించడాన్ని గమనించారట. దీనికి కారణం వారి శరీర వయసుకంటే మెదడు వయసు ఎక్కువగా ఉండడమేనని గుర్తించారు. -
మీ పిల్లలు స్మార్ట్ఫోన్తో ఎక్కువగా ఆడుకుంటున్నారా?
పిల్లలు స్మార్ట్ఫోన్తో ఎక్కువగా ఆడుకుంటున్నారా? అయితే వారి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు రేడియొలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా శాస్త్రవేత్తలు. సౌత్ కొరియా విశ్వవిద్యాలయ న్యూరోరేడియాలజీ శాస్త్రవేత్త హ్యుంగ్ సుక్ ఒక పరిశోధన నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఎం ఆర్ఎస్) సాయంతో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్లకు బాగా అలవాటు పడ్డ యుక్తవయస్కుల మెదళ్లలో జరిగే మార్పులను పరిశీలించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా ఈ ఆధునిక వ్యసనాల ప్రభావాన్ని అంచనా వేసి మరీ వీరిని ఎంపిక చేశారు. స్మార్ట్ఫోన్ వ్యవసనం వీరిలో మనోవ్యాకులత, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి మానసిక సమస్యలకు కారణమవుతోందని గుర్తించారు. ఆ తరువాత వారికి మానసిక శాస్త్రవేత్తల ద్వారా చికిత్స (బిహేవియరల్ థెరపీ) అందించారు. చికిత్సకు ముందు, తరువాత వారి మెదళ్లలోని రసాయన ప్రక్రియలను పరిశీలించినప్పుడు రెండురకాల న్యూరో ట్రాన్స్మిటర్లలో తేడాలు కనిపించాయి. వీటిల్లో ఒకటి మెదడులోని న్యూరాన్లు బాగా చైతన్యవంతం చేసేదైతే, రెండోది మెదడు సంకేతాలను మందగింపజేసేది. ఈ రెండో న్యూరోట్రాన్స్మిటర్ మన దృష్టి, కదలికలను నియంత్రిస్తుందని అంచనా. చికిత్స తరువాత వీరిలో ఈ సమస్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. -
తెలివితేటలనూ, జ్ఞాపకశక్తిని పెంచే వేరుశెనగ...!
వేరుశనక్కాయలు టైమ్పాస్ కోసం అని చాలామంది అనుకుంటారు. అలా వాటిని తినేవారు తాము టైంపాస్ చేస్తున్నామనే భ్రాంతిలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడం అనే తమ పనిని తాము సైలెంట్గా చేసేస్తాయి వేరుశనక్కాయలు. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... వేరుశనక్కాయలను ‘బ్రెయిన్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. వేరుశనగలో ఉండే విటమిన్–బి3 పోషకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. మన మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయం వల్ల మన మూడ్స్ బాగుంటాయి. వేరుశనక్కాయలు తిన్నప్పుడు అందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్ బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశలో, నిస్పృహలో ఉన్నవారు టైంపాస్ కోసం వేరుశనక్కాయలు తింటే మూడ్స్ బాగుపడి డిప్రెషన్ దూరమవుతుంది. వేరుశనక్కాయల్లో – విటమిన్ బి–కాంప్లెక్స్లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్–బి3గా పిలిచే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది. -
మెదడు ఆదేశాలతో రోబోటిక్ నియంత్రణ!
వాషింగ్టన్: అవయవం కోల్పోయిన వారు అమర్చుకునే రోబోటిక్ అవయవాన్ని మెదడుతో నియంత్రించే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చడంతో ఇది సాధ్యపడుతుందని అమెరికాలోని షికాగో వర్సిటీ∙పరిశోధకులు తెలిపారు. కోల్పోయిన అవయవ స్థానంలో అమర్చిన రోబోటిక్ అవయవాన్ని నియంత్రించేందుకు మెదడులోని సంబంధిత భాగాన్ని గుర్తించి, అక్కడ ఎలక్ట్రోడ్లను అమర్చనున్నట్లు ప్రొఫెసర్ హాట్సోపౌలస్ చెప్పారు. ‘ప్రమాదంలో చేతులు కోల్పోయిన కోతులకు రోబో చేతులను అమర్చాం. చేతులను నియంత్రించే మెదడులోని భాగాల్లో ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టాం. సహజ చేతుల్లాగానే రోబో చేతులనూ మెదడు ద్వారా నియంత్రించాయి’అని చెప్పారు. -
బ్రెయిన్ స్ట్రోక్ మాట్లాడుతోంది!వినండి
పక్షవాతం వచ్చే ముందు మెదడు మనతో మాట్లాడుతుంది. కొన్ని లక్షణాల ద్వారా తన సందేశాన్ని పంపుతుంది. అదే ఇంగ్లిష్ అక్షరాలా ఫాస్ట్. ఇందులో ఎఫ్... ఫేస్ ఈజ్ డ్రూపీ అంటే ముఖం వాలిపోయినట్టుగా ఉండటం. ఏ... ఆర్మ్ వీక్నెస్ ఆన్ ఒన్ సైడ్ అంటే ఒకవైపు చేయి బలహీనంగా మారడం. ఎస్... స్పీచ్ ఈజ్ స్లర్ర్డ్... అంటే మాట ముద్ద ముద్దగా రావడం. టీ... అంటే టైమింగ్ ఈజ్ క్రిటికల్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్... అంటే సమయం చాలా అమూల్యమైంది. ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే... పక్షవాతం వల్ల వచ్చే వైకల్యం అంతగా తగ్గి మనిషి మామూలు అవుతాడని. అందుకే మెదడు మాట్లాడే మాటలను ‘ఫాస్ట్’గా వినండి. ‘ఫాస్ట్’ లక్షణాలను గురించండి... ఫాస్ట్గా స్పందించండి. రోగిని ‘ఫాస్ట్’గా హాస్పిటల్కు తరలించండి. ఈ నెల 29న వరల్డ్ స్ట్రోక్ డే. పక్షవాతం గురించి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రోజు ఇది. గతంలో పక్షవాతం అంటే పెద్దవయసువారిలో తప్ప అందరిలో ఊహించలేని జబ్బు. ఒకప్పుడు చిన్నవయసు వారిలో వస్తుందని ఊహకు సైతం అందని ఈ వ్యాధి ఇప్పుడు యుక్తవయసులో ఉన్నవారికీ వస్తోంది. ఏ పనీ చేయలేని విధంగా వైకల్యాలను తెచ్చిపెట్టేలా పెద్ద మాస్టర్ ‘స్ట్రోక్’ ఇస్తోంది. బతుకును దుర్భరం చేస్తోంది. కొంతమందిలో ప్రాణాలను సైతం తీస్తుంది. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఈ అనర్థాన్ని తెచ్చిపెడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేసులు ప్రతి లక్షమందిలో 84 నుంచి 262 మందిలో ఉంటే, పట్టణాల్లో మాత్రం ఇవి ప్రతి లక్ష మందిలో 334 నుంచి 424 మందిలో కనిపిస్తున్నాయి. ఇవీ పక్షవాతం తీవ్రతను సూచించే అంకెలు. వీటిని చూసి తీవ్రత తక్కువే అనుకోవడం సరికాదు. ఏ పనీ చేయలేక... తమ పనులు సైతం తాము చేసుకోలేక బతుకీడ్చే రోగిని చూస్తే గుండె పిండేసినట్లవుతుంది. కాబట్టి మెదడును పిండేసే వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. మెదడుకు అనేక రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. వాటిని పెద్దవి, మధ్యరకం, చిన్నవి అని మూడుగా వర్గీకరించవచ్చు. పెద్ద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి అవి పూడుకుపోతే తీవ్రమైన పక్షవాతం వస్తుంది. అదే మధ్యరకం రక్తనాళాలు బ్లాక్ అయితే ఓ మోస్తరు స్ట్రోక్, చిన్నవి బ్లాక్ అయితే మైనర్ స్ట్రోక్ వస్తాయి. మెదడులో రెండు అర్ధభాగాలు ఉంటాయి. శరీరంలోని ఎడమవైపు ఉన్న అవయవాలను కుడి అర్ధగోళం, కుడి వైపు అవయవాలను ఎడమ అర్ధగోళం నియంత్రిస్తాయి. మెదడు కుడివైపు భాగాలకు రక్తప్రసరణ జరగకపోతే ఎడమవైపు, ఎడమ మెదడుకు రక్తప్రసరణ జరగకపోతే కుడివైపు శరీర భాగాలు చచ్చుబడతాయి. స్ట్రోక్లో రకాలు... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటే : పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి 24 గంటలలోపు తగ్గిపోయి రోగి రికవర్ అయితే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ అని అభివర్ణిస్తారు. అంటే...ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా వాటిని భావించాలి. ఒకవేళ పై లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా రోగి వాటి నుంచి కోలుకోకపోతే దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇవాల్వింగ్ స్ట్రోక్ : మన కళ్లెదుటే రోగికి కాళ్లూ చేతులూ క్రమంగా చచ్చుబడిపోతూ 10–20 నిమిషాల్లో పూర్తి స్థాయి స్ట్రోక్ రావడాన్ని ఇవాల్వింగ్ స్ట్రోక్ అంటారు. ఈ టీఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవాలి. స్ట్రోక్కు కారణాలు వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా రావచ్చు. అయితే 98% మందిలో ఈ కింది కారణాలు స్ట్రోక్కు దోహదపడతాయి. అవి... రక్తపోటు, డయాబెటిస్, పొగతాగడం, మద్యం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం. ఇవిగాక గుండెజబ్బులు ఉన్నవారికి, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటం కూడా స్ట్రోక్కు కారణాలు. బీపీ పరిమాణం ఇలా... బీపీని గుండె పై, కింది గదుల స్పందనలతో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్/డయాస్టోలిక్ బీపీగా చెబుతారు. బీపీ పరిమాణం ఈ కింది విధంగా ఉంటే... ∙ 120 / 80 ఉంటే దాన్ని నార్మల్ బీపీగా పరిగణిస్తారు. ∙ 140 / 90 ఉంటే దాన్ని చాలా కొద్దిపాటి బీపీ (మైల్డ్ హైపర్టెన్షన్)గా చెబుతారు. ∙ 160 / 100 ఉంటే దాన్ని ఓ మోస్తరు బీపీ (మాడరేట్ హైపర్టెన్షన్)గా చెబుతారు. ∙ 200 / 110 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా మాలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటారు. మైల్డ్, మాడరేట్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్లలో ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే హైబీపీ లేదా మాలిగ్నెంట్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్లలో హేమరేజిక్ స్ట్రోక్ వచ్చేందుకు అవకాశం ఉంది. స్ట్రోక్కు పైన పేర్కొన్న కారణాల్లో బీపీ, షుగర్, పొగతాగడం... వీటిని ప్రైమరీ వ్యాస్కులార్ రిస్క్ ఫ్యాక్టర్స్గా పేర్కొంటారు. శరీరంలోని అన్ని రక్తనాళాల్లోనూ లోపలివైపు గోడల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి అవి గట్టిగా మారతాయి. అలా రక్తనాళాల్లో కొవ్వు అడ్డుకోవడాన్ని అథెరో స్లీ్కరోటిక్ బ్లాక్ అంటారు. దాంతో లోపలివైపు రక్తనాళాల సర్ఫేస్ రఫ్గా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణ స్మూత్గా కాకుండా అడ్డుకుంటూ ఉండటం వల్ల రక్తం గడ్డకట్టడానికి అవకాశం ఎక్కువ. రక్తనాళం క్రమేపీ పూడిపోయి, రక్తప్రసరణ తగ్గిపోయి... మెదడులోని ఏ భాగంలో రక్తసరఫరా లేదో ఆ భాగం దెబ్బతింటుంది. దాంతో మెదడులోని ఆ కేంద్రం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. షుగర్ పరిమాణం ఇలా... రక్తంలో చక్కెర పరిమా ణాలను రెండు దశల్లో కొలుస్తారు. మొదటిది పరగడుపున దీన్నే ఫాస్టింగ్ షుగర్ అంటారు. ఇక ఏదైనా తిన్న తర్వాత కొలిచే పరిమాణానికి పోస్ట్ ప్రాండియల్ షుగర్ అని పేరు. ఆ కొలతలు నార్మల్గా ఉండాల్సిన తీరు ఇది... ∙ ఫాస్టింగ్ ... 100 ∙ పోస్ట్ప్రాండియల్... 160 (ఈ కొలతలకు 10 అటూ, ఇటూగా ఉన్నా ఫరవాలేదు) ∙ అయితే షుగర్ ఉండాల్సిన పరిమాణం కంటే తేడాలున్నప్పుడు డాక్టర్ను సంప్రదించి ఎక్కువగాన్న షుగర్ను నియంత్రించుకోవాలి. కొలెస్ట్రాల్ : స్ట్రోక్కు మరో కారణం రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువ ఉండటం. అందుకే వీటి నార్మల్ పరిమాణం ఎంతో తెలుసుకుని వాటిని అదుపులో ఉంచుకోవడం కూడా మంచిది. ∙ రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్... 200 కంటే తక్కువ ఉండాలి. ∙ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ... 100 కంటే తక్కువ ఉండాలి. ∙ మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) ... 40 కంటే ఎక్కువగా ఉండాలి. ∙ ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వు ... 200 కంటే తక్కువగా ఉండాలి. చికిత్స ఇలా... స్ట్రోక్లోని రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. దాదాపు 80% లో మైల్డ్ స్ట్రోక్ మాత్రమే వస్తుంది. మిగతావారిలో 15% లో మాడరేట్ స్ట్రోక్ రావచ్చు. ఇక తీవ్రమైన స్ట్రోక్ కేవలం 5% లో మాత్రమే వస్తుంది. ఒకసారి స్ట్రోక్ వస్తే ఇక మంచాన పడిపోతామనే అపోహ చాలామందిలో ఉంది. అది సరికాదు. స్ట్రోక్లతో 95% కేవలం మైల్డ్, మాడరేట్ స్ట్రోక్లే కాబట్టి వాళ్లను చాలామట్టుకు ఔట్పేషంట్స్గానే చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చు. అది ఇస్కిమిక్ స్ట్రోక్ అని నిర్ధారణ అయితే రక్తాన్ని పలుచబార్చే మందులు ఇస్తారు. దీనికి తోడు వాళ్లకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉంటే దానికి తగినట్లు ఆయా రుగ్మతలకు తగిన మందులు వాడతారు. మైల్డ్, మాడరేట్ స్ట్రోక్లకుచికిత్స మైల్డ్ స్ట్రోక్లో దాదాపు అందరినీ ఔట్పేషంట్ రోగిగానే పరిగణించి చికిత్స చేయవచ్చు. ఇక మాడరేట్ స్ట్రోక్కు గురైనవారిలో 80% కి ఔట్పేషంట్గానే చికిత్స చేయవచ్చు. కేవలం 20% లోనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. మైల్డ్, మాడరేట్ స్ట్రోక్స్ 100% తగ్గిపోయి, పూర్తిగా రికవర్ అవుతారు. ఇలా మైల్డ్, మాడరేట్ స్ట్రోక్స్ వచ్చినవారు ప్రతినెలా క్రమం తప్పకుండా ఫాలోఅప్స్ చేయించుకుంటే భవిష్యత్తులో స్ట్రోక్కు అవకాశం ఉండదు. సివియర్ స్ట్రోక్కు చికిత్స...: స్ట్రోక్ రోగులందరిలో కేవలం 5% లోనే ఈ సివియర్ స్ట్రోక్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు కాలు, చేయి పూర్తిగా పడిపోవడం, కొందరి పూర్తిగా స్పృహతప్పిపోవడం జరుగుతుంది. వీళ్లను తప్పనిసరిగా న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చేర్చి చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్లలోనూ దాదాపు 50%–70% పూర్తిగా కోలుకుంటారు. రక్షించుకోండిలా... స్ట్రోక్ వచ్చినప్పుడు రోగిని... ∙మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్కు తీసుకువస్తే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజిన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే మందును నరంలోకి (ఇంట్రావీనస్గా) ఇస్తారు. దీన్ని ఇవ్వాలంటే ముందుగా సీటీ స్కాన్, ప్లేట్లెట్ కౌంట్ పరీక్ష చేసి ఈ టీపీఏ ఇవ్వవచ్చా అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. స్టెమ్ సెల్స్ చికిత్స : ఇటీవల కొన్ని దేశాల్లో స్టెమ్సెల్ థెరపీగా పేర్కొనే ఈ మూలకణ చికిత్సను చేస్తున్నారు. స్ట్రోక్ వల్ల దెబ్బతిన్న మెదడు భాగాల్లో మూలకణాలను (స్టెమ్సెల్స్) ప్రవేశపెట్టడం వల్ల ఆయా భాగాలు మళ్లీ మెదడు కణాలుగా అభివృద్ధి చెంది ఆ భాగం తిరిగి పనిచేసేందుకు అవకాశం ఉంది. న్యూరో ప్రొటెక్టార్స్ : సిటోకోలీన్, పిరాసిటామ్, అడర్వాన్, న్యూరోవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి వాడటం వల్ల దెబ్బతిన్న మెదడు భాగాలు మళ్లీ కోలుకునేలా చేసేందుకు అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రోక్ చికిత్సలో ఒక ప్రధాన ప్రక్రియ. ఎండో వాస్క్యులార్ థ్రాంబెక్టమీ : చాలా ఉన్నతస్థాయి సంస్థలో జరిగిన ఈ ట్రయల్స్ తాలూకు అధ్యయనాల వల్ల చాలా ఉపయోగం ఉంది. గతంలో స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తీసుకొస్తేనేనే అవయవాలు చచ్చుబడకుండా చూసేవారు. ఈ ‘ఎండో వాస్క్యులార్ థ్రాంబెక్టమీ’ వల్ల దాదాపు 24 గంటల వరకు చేరింది. ఈ పద్ధతిలో స్ట్రోక్ వల్ల వచ్చే చాలా అనర్థాలను గణనీయంగా తగ్గించి, దాదాపు అందరినీ మామూలు వ్యక్తుల్లా చేసేందుకు అవకాశం ఉంది. పక్షవాతం నివారణకు జలగ చేసే సాయం జలగ శరీరానికి గాయం చేసి దాదాపు చాలాసేపు రక్తం పీలుస్తుంది. రక్తానికి ఉన్న గుణం ఏమిటంటే... ఒకసారి గాయం అయ్యాక అక్కడ రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశంలో రక్తం గడ్డకడుతుంది. అయితే జలగ ఇలా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు తన లాలాజలంలోని హెపారిన్ అనే పదార్థాన్ని రక్తంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టే స్వభావాన్ని కోల్పోతుంది. ఈ హెపారిన్ రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుందని దాదాపు 40 ఏళ్ల క్రితమే కనుగొన్నారు. దాంతో స్ట్రోక్ వచ్చిన రోగుల్లో రక్తపు గడ్డను నివారించడానికి ఈ హెపారిన్ ఉపయోగం చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ)లోనూ, ఇవాల్వింగ్ స్ట్రోక్ వచ్చిన సందర్భాల్లోనూ, గుండెకు సంబందించిన ధమనుల్లో (ఆర్టీరియల్ ఫిబ్య్రులేషన్) వచ్చే స్ట్రోక్స్లోనూ, మెదడుకు వచ్చే స్ట్రోక్స్ సీఎస్వీటీ (సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్)లలోనూ ఈ హెపారిన్ను ఉపయోగిస్తారు. పక్షవాతం లక్షణాలు పక్షవాతం అనగానే అందరికీ తెలిసిన ప్రధాన లక్షణం ఒక వైపు చేయీ, కాలూ చచ్చుపడిపోవడం. దీన్నే వైద్యపరిభాషలో ‘హెమీప్లీజియా’ అంటారు. కొందరిలో మూతి వంకరపోతుంది ∙కొందరు కళ్లు తిరిగి పడిపోతారు ∙కొందరు శరీరంపై అదుపు తప్పినట్లు నడుస్తారు. దీన్ని అటాక్సియా అంటారు ∙మరికొందరిలో ఒకవైపు చూపు పడిపోవడం లేదా దృష్టి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కండిషన్ను ‘హెమీ అనోపియా’ అంటారు ∙కొందరు పూర్తిగా స్పృహతప్పిపోతారు ∙కొందరిలో మింగడం కష్టంగా ఉండవచ్చు. ఈ కండిషన్ను డిస్ఫేజియా అంటారు ∙కొందరికి ఎదుటనున్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించవచ్చు. దీన్ని డిప్లోపియా అంటారు. వైద్య పరీక్షలు బ్రెయిన్స్ట్రోక్ వచ్చిందని అనుమానం వచ్చినప్పుడు సీటీ స్కాన్ బ్రెయిన్ పరీక్ష చేయించాలి. దాంతో అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్ (బ్రెయిన్)లో అది నిర్ధారణ కాకపోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో ఇంట్రా క్రేనియల్ వెసెల్స్ పరీక్ష చేయించాలి. దాంతోపాటు టూడీ ఎకో, కెరోటిడ్ డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, క్రమం తప్పకుండా షుగర్ పాళ్లు తెలుసుకోవడం, ఛెస్ట్ ఎక్స్రే చేయించడం... ఇవన్నీ రొటీన్గా చేయించే పరీక్షలు. నివారణే ప్రధానం... అస్సలు స్ట్రోక్ రాకముందే తీసుకునే జాగ్రత్తలను ‘ప్రైమరీ ప్రివెన్షన్’ అంటారు. అయితే మైల్డ్, మాడరేట్ స్ట్రోక్స్ వచ్చినవాళ్లు, అది తగ్గిన తర్వాత తీసుకునే జాగ్రత్తలను ‘సెకండరీ ప్రివెన్షన్’ అంటారు. ఒకసారి స్ట్రోక్ వచ్చి తగ్గినవారు తీసుకునే రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్ థిన్నర్స్) మినహా అది ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్లలో మిగతా జాగ్రత్తలన్నీ ఒకేలా ఉంటాయి. పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ నివారణ చర్యలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. 1) లైఫ్స్టైల్లో మార్పులు 2) ఆహారంలో మార్పులు లైఫ్ స్టైల్ మార్పులివి... ∙ ప్రతిరోజూ అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి. ∙ ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ∙ వేళకు భోజనం చేయాలి, వేళకు నిద్రపోవాలి. ఆహారంలో మార్పులివి... ∙ పాలు, మీగడ, వెన్న, నెయ్యి, మిఠాయిలు, నూనె పదార్థాలు తగ్గించాలి. ∙ కొవ్వు పదార్థాలను చాలా పరిమితంగానే తీసుకోవాలి. ∙ ఉప్పు కూడా కొంచెం తగ్గించాలి. ∙ తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ ఆశిష్ కుమార్, కన్సల్టెంట్ సెరెబ్రోవాస్కులార్ – ఎండో వాస్కులార్ న్యూరోసర్జన్ – స్ట్రోక్ స్పెషలిస్ట్, మ్యాక్స్క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
చాలనతో మెదడు చురుకు
యోగ సాధనకు ముందుగా శరీరాన్ని సిద్ధం చేసే ప్రక్రియలో భుజాలకు, గుండె కండరాలకు సంబంధించిన కొన్ని చాలన క్రియల గురించి తెలుసుకుందాం. ఈ అంగచాలనాలు చాలా తేలికమయినవి, మనసుకు శరీరానికి ఉత్తేజాన్ని నింపేవి కాబట్టి ఇవి రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. ఆఫీసులో కూడా లంచ్కి ముందు కాని లేదా సాయంత్రం 5 గంటల సమయంలో కాని ఈ చాలనాను కేవలం 5 నిమిషాల పాటు చేసినట్లయితే మైగ్రేన్, స్పాండిలోసిస్, భుజం నొప్పి వంటి సమస్యలను నివారించవచ్చు. మనం పీల్చే ఆక్సిజన్లో సుమారు మూడవవంతు (1/3) మెదడు భాగం, క్రేనియల్ నెర్వస్ సిస్టమ్ వినియోగించుకుంటాయి. ఈ తేలికపాటి చాలనాల వలన మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించబడుతుంది. 1. పరివృత్త ఏకబాహు చాలన సమస్థితిలో నిలబడి కుడిచేతిని ముందుకు చాచి శ్వాస వదులుతూ కిందకు మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనుకకు మళ్ళీ పైకి శ్వాస వదులుతూ తిరిగి కిందకు రొటేట్ చేయాలి. చాలానెమ్మదిగా తేలికగా చేయడం ముఖ్యం. 3 నుండి 5 రౌండ్లు చేయాలి. వ్యతిరేక దిశలో కూడా 3 నుండి 5 సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ చేతితో కూడా రెండు దిశలలో చేయాలి. మధ్యలో రెండు భుజాలు పైకి కిందకు ష్రగ్గింగ్ చేయడం వలన భుజాలలో ఉన్న హెవీనెస్ పోతుంది. 2. పరివృత్త ద్విబాహు చాలన ఇదేవిధంగా రెండు చేతులను ఒకేసారి ఫార్వర్డ్ రొటేషన్ 3 లేదా 5 సార్లు తిరిగి బ్యాక్వర్డ్ రొటేషన్ 3 లేదా 5 సార్లు చేయాలి. చేతులు పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవడం, చేతులు కిందకు వచ్చేటప్పుడు శ్వాస వదలడం గమనిస్తూ చేయాలి. సూచనలు: ఒక చేతిని రొటేట్ చేసేటప్పుడు శరీరం పక్కకు తిరిగిపోకుండా ముందు వైపుకు ఫేస్ చేసి ఉంచాలి. రేంజ్ ఆఫ్ మోషన్ వీలైనంత ఎక్కువగా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్ ఉన్నట్లయితే చేయి పైకి ఎంతవరకు లేపగలరో అంతవరకు మాత్రమే చేయాలి. నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. రెండు చేతులతోనూ ఒకేసారి చేసేటప్పుడుమోచేతులు పక్కలకు పోవడం గమనించగలరు. మోచేతులు ఫ్రీగా వీలైనంత ఎక్కువగా ఓపెన్ చేసే ప్రయత్నం చేయాలి. డెల్టాయిడ్, లాటిస్మస్ డోర్సి, పెక్టోరాలిస్, ట్రెపీజయస్ కండరాలకుమంచి టోనింగ్ జరుగుతుంది. రొటేటర్ కఫ్ కండరాలకు చక్కటి వ్యాయామం జరుగుతుంది. 3. పరివృత్త ముంజేయి చాలన మోచేతులు రెండు పక్కలకు 180 డిగ్రీల కోణంలో ఉంచి భుజం నుండి మోచేతుల వరకూ కదలకుండా స్థిరంగా ఉంచి, కేవలం రెండు ముంజేతులను ఫోరార్మ్స్ని వీలైనంత పెద్దవృత్తాకారంలో గడియారం దిశలో తరువాత వ్యతిరేక దిశలో 3 నుండి 5 సార్లు తిప్పాలి. ఉపయోగాలు: భుజం నుండి మోచేతుల వరకు పక్కలకు స్థిరంగా కాంటిలివర్ పొజిషన్లో ఉండడం వలన బైసప్స్, ట్రైసప్స్, డెల్టాయిడ్, కండరాలు బలంగా తయారవుతాయి.ముంజేతులను వృత్తాకారంలో తిప్పడం వలన అల్నార్ కండరాలు, అల్నార్ నర్వ్కి సంబంధించిన సమస్యలు రావు. అల్నార్ నర్వ్ బలంగా లేకపోయినట్లయితే చేతులలో తిమ్మిర్లు,వేళ్ళు కొంకరలు పోవడం జరుగుతుంది. దీనినే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్యగా కూడా వ్యవహరిస్తారు. 4. మణికట్టుకు, చేతివేళ్లకు చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులను బయటకు లోపలకు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చేయాలి. శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయడం శ్వాస వదులుతూ క్లోజ్ చేయాలి. 5 నుండి10 సార్లు చేయాలి. ఎ) అలాగే పైకి కిందకు కూడా మణికట్టు, అరచేతుల కదలికతో చేసే ఈ చాలనాల వలన గుండె కండరాలకు చక్కటి వ్యాయామం జరిగి హార్ట్ హెల్తీగా ఉంటుంది. బి) రెండు చేతి గుప్పిట్లను బిగించి చేతులు రెండూ శరీరానికి దగ్గరగా ఉంచి, శ్వాస వదులుతూ రెండు గుప్పిట్లను ముందుకు విసురుతూ చేతివేళ్లు ఓపెన్ చేయాలి. మళ్ళీ శ్వాసతీసుకుంటూ గుప్పిట్లు బిగించి వెనుకకు ఈ విధంగా 5 నుండి 10 సార్లు చేయాలి. ఇది గుండె కండరాలకు పూర్తి వ్యాయామాన్ని కలిగిస్తుంది. – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: రమ్యకృష్ణ పస్టాకియా -
ఇతడు మెదడుతో చూస్తాడు..!
కంటి చూపు లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను అంధులు ఎంతో చక్కగా అంచనా వేయగలుగుతారు. ఈ కోవలోకే వస్తాడు 17 ఏళ్ల జీత్త్రివేది. అయితే ఇతడు అంధుడు కాదు. కానీ డ్రైవింగ్, చదవడం, సూదిలో దారం గుచ్చడం వంటి పనులను కళ్లు మూసుకుని చకచకా చేసేస్తాడు. గతేడాది సెప్టెంబర్లో 40 కిలోమీటర్ల వరకు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడిపి చూపించాడు. ఎలా ఇలా అంటే.. మధ్య మెదడును యాక్టివేట్ చేయడం వల్ల ఏదయినా సాధ్యమే అంటున్నారు జీత్ ట్రైనర్ భరత్ పటేల్. జీత్కు తన ఇంద్రియాల పట్ల చక్కని నియంత్రణ ఉందని, ఒక అవయవాన్ని మనం పనిచేయకుండా ఆపేస్తే ఆ పనిని ఇంకో అవయవం సహాయంతో చేయగలుతాడని భరత్ చెప్పారు. అంతేకాదు కళ్లకు గంతలు కట్టుకునే జీత్ పుస్తకాలు చదవగలడు, తన ఎదురుగా వచ్చే వస్తువులను పట్టుకోగలడు, దాగి ఉన్న వస్తువులను కనిపెట్టగలడు, ఒకేసారి ముగ్గురితో చెస్ ఆడగలడు. ఎదురుగా వచ్చే వస్తువు వాసన బట్టి గుర్తించగలుగుతున్నానని, ఆ వస్తువు ఏంటో కూడా చెప్పగలనని జీత్ చెబుతున్నాడు. మధ్య మెదడును ఉత్తేజితం చేస్తే ఆ విద్య ఎవరికైనా సాధ్యమేనంటున్నారు భరత్. సమాజంలో జీత్లా ఏ చిన్నారికైనా ఈ శిక్షణ ఇవ్వచ్చని, అయితే కావాల్సిందల్లా ఓపిక, పట్టుదల, తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం అని వివరించారు. -
యోగాతో మతిమరపు మాయం
బ్రెసిల్లా: మానవులకు వృద్ధాప్యం వచ్చిందంటే జ్ఞాపకశక్తి మందగించడం అంటే, మతిమరపు పెరిగిపోవడం, ఏ పని మీదనైనా ఏకాక్రగత తగ్గిపోవడం మనకందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు విధులను ప్రధానంగా మెదడులో ఎడమ వైపు నుండే కార్టెక్స్ నిర్వహిస్తోంది. మందంగా ఉండే ఈ కార్టెక్స్ పలుచపడుతున్నాకొద్దీ వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితిని మెరగుపర్చుకోవాలంటే మందులు వాడడం తప్పనిసరి. అయితే ఇక ముందు ఆ అవసరమే లేదు. ఈ విషయంలో మందులకన్నా యోగా బాగా పనిచేస్తోందని బ్రెజిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రయోగం నిర్వహించడం కోసం వారు గత ఎనిమిదేళ్లుగా వారానికి కనీసం రెండు సార్లు చొప్పున యోగా చేస్తున్న 60 ఏళ్లు దాటిన 21 మంది వృద్ధ మహిళలను ఎంపిక చేశారు. ఏకాగ్రత దెబ్బతినని, మతిమరపులేని అంతే వయస్సుగల ఆరోగ్యవంతమైన మహిళలను ఎంపిక చేశారు. ముందుగా రెండు జట్ల కార్టెక్స్ మందం స్థాయిని ఎమ్మారై ద్వారా రికార్డు చేశారు. సాధారణ ఆరోగ్యవంతమైన వృద్ధ మహిళ్లల్లోకెల్లా ఎనిమిదేళ్లుగా యోగా చేస్తున్న మహిళల్లో కార్టెక్స్ మందం స్థాయి ఎక్కువగా ఉంది. అదే గ్రూపులో ఎనిమిదికన్నా ఎక్కువ ఏళ్లుగా యోగా చేస్తున్న వారి కార్టెక్స్ స్థాయిని పోల్చి చూశారు. యోగా చేయనివారికన్నా చేస్తున్న వారిలో, కొన్నేళ్లుగా చేస్తున్నవారికన్నా ఎక్కువ ఏళ్లుగా చేస్తున్న వారిలో కార్టెక్స్ పొరల మందం ఎక్కువున్నట్లు తేలింది. తద్వారా వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఎక్కువగా ఉంది. యోగా అలవాటులేని గ్రూపు మహిళల్లో కార్టెక్స్ పొరల మందం తక్కువగా ఉన్నవారిని ఎంపిక చేసి వారితో స్పల్పకాలిక యోగాను చేయించడం వల్ల కూడా సానుకూల ఫలితం వచ్చిందని పరిశోధకులు తెలిపారు. తాము ఈ అధ్యయనం వృద్ధ మహిళలపైనే నిర్వహించామని, వివిధ ఏజ్ గ్రూపుల మధ్య, మగవారిపై కూడా ప్రయోగాలు నిర్వహించి వ్యత్యాసాలను పరిశీలించాల్సి ఉందని వారన్నారు. వారు తమ అధ్యయన వివరాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’ మాగజైన్లో ప్రచురించారు. -
పేదల గుండెచప్పుడు వినిపించాలి!
సువార్త ఆలోచనల ఉత్పత్తి కేంద్రం, యంత్రం మెదడు. అందుకు అదివాడే ముడిసరుకు ‘స్వార్థం’!! తాను ఆరంభించిన దైవరాజ్య నిర్మాణాన్ని అందుకే మెదడుతోగాక, దేవుడిచ్చే ‘పరిశుద్ధాత్మ శక్తి’తో జరపాలని యేసుక్రీస్తు తన అనుచరులను ఆరోహణ సమయంలో ఆదేశించాడు. (అపొ 1:1–8). మెదడెప్పుడూ ‘నీగురించే ఆలోచించుకో’ అంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో పని చేశారు కాబట్టి ఆదిమ అపొస్తలులు ఆస్తులు, డబ్బు జోలికి పోలేదు, అధికారాది ప్రలోభాలకు లోను కాలేదు. చివరికి హతసాక్షులయ్యేందుకూ వెనకాడలేదు. దేవునికి, ప్రజలకు మధ్య అనుసంధాన వ్యవస్థగా దేవుడు లేవీయులను యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులుగా నియమిస్తే కాలక్రమంలో అది పూర్తిగా దిగజారి దౌర్జన్యపూరితమైంది. అందుకే యేసుప్రభువు వారిలాగా ఉండవద్దని, అగ్రస్థానాలు, పీఠాలు, కోరుకోకుండా తమను తాము పూర్తిగా తగ్గించుకొని సాత్వికత్వం, పవిత్రత, నిస్వార్థత కలిగిన పరిచారకులై ప్రలోభాలకు అతీతంగా ఉంటూ పేదలకు సేవచేయాలని ఆదేశించారు (మత్త 23:12). విషాదమేమిటంటే, యేసుక్రీస్తు ఆనాడు ఖండించిన యాజక వ్యవస్థలాగే, ఈనాటి పరిచారకుల వ్యవస్థ లోనూ విలువలు లోపిస్తున్నాయి. పరిచారకులు పేదలు, బలహీనుల పక్షంగా నిలబడవలసింది పోయి, డబ్బు, విలాసాలు, డాంబికాల వేటలో వారికందనంత ఎత్తుకు ఎదగడమే విజయమని భావిస్తున్నారు. పేదవిశ్వాసులను నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టి, పెద్దకార్లలో వచ్చే ధనికులైన విశ్వాసుల కారు తలుపులు తెరిచే సంస్కృతికి తెర తీశారు. నిరంతరం పేదలు, బలహీనులు, నిర్భాగ్యుల కోసమే తపించి అలమటించిన యేసుక్రీస్తు ‘ఆరాధనాస్థలాలు’ ఇవి ఎలా అవుతాయి? యేసు పేదల ప„ý పాతి అన్నది బైబిలు చెప్పే సత్యం కదా! ఇది అరణ్యఘోష కాకూడదు మిత్రులారా! ఇలా ఆత్మీయంగా, సామాజికంగా కూడా నిర్వీర్యం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది. పరిచారకుల్లో బోధకుల్లో పవిత్రత, ఆత్మీయ పోరాట పటిమ లోపిస్తే విశ్వాసులు అందుకు పూనుకుని తీరాలి. వేలు, వందలకోట్ల రూపాయలు వేళ్లతో లెక్కపెట్టగలిగినంత మంది దుర్బోధకుల బ్యాంకుల్లో, ఇళ్లలో, లాకర్లలో పేరుకుపోవడం కాదు; కులమత వివక్ష లేకుండా పరిచర్యం చేయగలిగిన వందలాది అనాథాశ్రమాలు, ఆశ్రయకేంద్రాలు, ఉపాధి కేంద్రాలు, ఉచిత విద్యాబోధనా సంస్థలు, ఉచిత ఆసుపత్రులు ఆరంభమయ్యేందుకు ఆ డబ్బు ఉపకరించాలి. చర్చి ఆదివారం నాడు ఆరాధనాస్థలంగానే కాదు, సోమవారం నుండి శనివారం దాకా పేదలు, బలహీనుల పరిచర్య కేంద్రంగా ఉండాలి. ఇది ఎవరో చెప్పేది కాదు, యేసుప్రభువే నిర్దేశించిన విధానం (మత్త 25:31–40). విశ్వాసులంతా ఒకటైతే ఈ దేశంలో పేదరికం అంతర్థానమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
స్ట్రాబెర్రీలతో మెదడుకు చురుకుదనం
స్ట్రాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇవి సహజంగా మేలు చేస్తాయని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. స్ట్రాబెర్రీలు కలిగించే మరో ప్రయోజనం కూడా తాజా పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. స్ట్రాబెర్రీలు మెదడుకు చురుకుదనం ఇస్తాయని, వయసు మళ్లిన దశలోనూ మెదడు పనితీరు మందగించకుండా ఉంచుతాయని కాలిఫోర్నియాలోని సాల్క్స్ సెల్యులర్ న్యూరోబయాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ల్యాబ్లో ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో స్ట్రాబెర్రీల వల్ల మెదడులో కలిగే సానుకూల మార్పులను గుర్తించారు. స్ట్రాబెర్రీలను తీసుకుంటున్నట్లయితే వార్ధక్యంలో మెదడు పనితీరు మందగించడం వల్ల వచ్చే అల్జీమర్స్ వ్యాధి, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని వారు తేల్చి చెబుతున్నారు. -
స్మార్ట్ఫోన్ దగ్గరుంటే మెదడు మటాష్!
లండన్: స్మార్ట్ఫోన్లకు అలవాటైన వారు ఒక్కరోజు కూడా వాటిని విడిచి ఉండలేరన్న విషయం తెల్సిందే. అయితే స్మార్ట్ఫోన్లను దగ్గరుంచుకున్న వారి జ్ఞానశక్తి కూడా అవిలేని వారితో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందట. ఫోన్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా? అన్న అంశంతో సంబంధం లేకుండా వారి జ్ఞానశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లోని మ్యాక్కోంబ్స్ బిజినెస్ స్కూల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియన్ వార్డు తెలిపారు. ఆయన తన శిష్యులతో కలసి రెండు బృందాలపై వేర్వేరుగా జరిపిన పరీక్షల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. మొదటి బృందంగా ఆయన 800 మంది స్మార్ట్ఫోన్ యూజర్లను ఎంపిక చేసుకున్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ ఫోన్లను పక్క రూములో, రెండో గ్రూపు ఫోన్లను టేబుల్పైనా, మూడో గ్రూపు ఫోన్లను జేబుల్లోగానీ, తమ బ్యాగుల్లోగాని పెట్టుకోమని చెప్పారు. అన్ని ఫోన్లను సైలెన్స్ మోడ్లో ఉంచాల్సిందిగా కోరారు. వారందరికి మనసును బాగా లగ్నం చేయాల్సిన పరీక్షను కంప్యూటర్ ద్వారా నిర్వహించారు. పక్క రూములో ఫోన్లను భద్రపర్చినవారు, టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికన్నా బాగా ఫలితాలు సాధించారు. ఇక టేబుళ్లపై ఫోన్లు పెట్టుకున్నవారు జేబుల్లో ఫోన్లు పెట్టుకున్నవారికన్నా బాగా రాణించారు. ఆ తర్వాత స్మార్ట్ఫోన్లను బాగా ఉపయోగించేవారిని ఎంపిక చేసి వారికి కూడా ఇదే సరళిలో పరీక్ష నిర్వహించారు. కొందరిని ఫోన్లను పక్కరూములో పెట్టించారు, కొందరి ఫోన్లను టేబుల్పై పెట్టించారు. మరి కొందరి ఫోన్లను స్విచాఫ్ చేయించారు. ఫోన్లు ఆఫ్ ఉందా, ఆన్లో ఉందా ? అన్న సంబంధం లేకుండా ఎక్కువగా ఫోన్ ఉపయోగించేవాకి చాలా తక్కువ మార్కులు, తక్కువగా ఫోన్ ఉపయోగించేవారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫోన్ ఆఫ్లో ఉందా, ఆన్లో ఉందా ? అన్న అంశంతో సంబంధం లేకుండా ఫోన్లు దగ్గరుంటే చాలు జ్ఞానశక్తి తగ్గుతుందని పరిశోధక బృందం తేల్చింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య 2014 సంవత్సరంలో 157 కోట్ల మంది ఉండగా, 2017 సంవత్సరానికి వారి సంఖ్య 232 కోట్లకు చేరుకుంది. 2020 నాటికి 287 కోట్లకు చేరుకుంటుందన్నది ఒక అంచనా. -
స్మార్ట్ఫోన్ దగ్గరుందా? మీ మెదడు శక్తి తగ్గినట్లే!
స్మార్ట్ఫోన్ రేడియేషన్తో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న వార్తలు పూర్తిగా నిర్ధారణ కాకముందే ఆస్టిన్లోని టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. స్మార్ట్ఫోన్ అనేది మన దగ్గర ఉంటే చాలు.. అది స్విచ్ఆఫ్లో ఉన్నా సరే మన మెదడు సామర్థ్యం తగ్గిపోతుందని వీరు అంటున్నారు. దాదాపు 800 మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ప్రయోగాలు చేసి నిర్ధారణకు వచ్చినట్లు అడ్రియన్ వార్డ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఒక ప్రయోగంలో వీరందరికీ ఒక కంప్యూటర్ ద్వారా పరీక్ష పెట్టారు. కొంతమందికి స్మార్ట్ఫోన్ తమ వద్దే ఉంచుకొమ్మని, ఇతరులను పక్క గదిలో ఉంచమని చెప్పి ఈ పరీక్ష నిర్వహిం చారు. ఫోన్లన్నింటినీ ఆఫ్ చేసి ఉంచాలన్న సూచనలూ ఇచ్చారు. పక్క గదిలో ఫోన్ పెట్టిన వారి ఫలితలు కొంచెం మెరుగ్గా ఉండగా.. కళ్లముందు, జేబులో ఫోన్ పెట్టుకున్న వారు తక్కువ మార్కులు సాధించారు. ఫోన్ దగ్గర ఉన్న వారు.. తాము పనిపై దృష్టి పెట్టామని అనుకుంటారు గానీ ఎప్పుడో ఒకప్పుడు వారి ఆలోచనలు స్మార్ట్ఫోన్ పైకి వెళతాయని ఫలితంగా వారి ఆలోచన సామర్థ్యం తగ్గుతుందని తెలుస్తోందని అంటున్నారు -
గ్యాస్ కట్టేసి... మళ్లీ మళ్లీ చూస్తున్నారు!
హోమియో కౌన్సెలింగ్ నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రిపూట గ్యాస్ ఆపేశామా లేదా అని మళ్లీ మళ్లీ చెక్ చేయడం, తలుపులు వేసిన వాటినే మళ్లీ మళ్లీ వెళ్లి చూడడం వంటివి. ఆయన సమస్య ఏమిటి? – నివేదిత, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ భర్త అబ్బెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) తో బాధడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మానసిక రుగ్మత. అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి వల్ల ఇది వస్తుంది. కొంతమందిలో ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయినా ఈ వ్యాధి వస్తుంది. ఓసీడీ వ్యాధి ఉన్నవాళ్లు మాటిమాటికీ వాళ్ల వస్తువులను చెక్ చేసుకోవడం, వాళ్లు చేసే పనిమీద అనుమానంతో పరీక్షించుకుంటూ ఉండటం, మీరు చెప్పినట్లుగా గ్యాస్ స్టౌ ఆపేశారా లేదా అని చూడటం, తాళాలు వేశామా లేదా అని పదే పదే చెక్ చేయడం వంటివి అన్నమాట. చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉంటారు. దాంతో మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోతూ ఉంటారు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అదే రిపీటవుతూ వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. కారణాలు: ∙జన్యుకారణాలు, పర్యావరణ పరిస్థితులు ∙మానసిక ఒత్తిడి ∙ఇన్ఫెక్షన్స్ ∙అధికంగా ఆలోచించడం. లక్షణాలు: పదే పదే లాక్ చెక్ చేయడం ∙ అంకెలను మళ్లీ మళ్లీ లెక్కించడం. చికిత్స: ఓసీడీని హోమియో పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో మూల కారణాన్ని గుర్తించి, దానికి చికిత్స చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యాధిని నయం చేయవచ్చు. ఓసీడీకి హోమియోలో ఆర్సినికమ్ ఆల్బమ్, అర్జెంటమ్ నైట్రికమ్, నక్స్వామికా, మెరిడోనమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో తగిన మోతాదులో వాడితే తప్పక మంచి ఫలితాలు కనిపిస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ మైగ్రేన్ తగ్గుతుందా? హోమియో కౌన్సెలింగ్ నా ఫ్రెండ్కి 28 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ను సంప్రదించింది. మైగ్రేన్ అన్నారు. మందులతో తగ్గుతుందన్నారు. అయితే అది మాటిమాటికీ తిరగబెట్టే సమస్య అని తెలిసింది. అలా జరగకుండా ఆమె సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సుమతి, అమలాపురం మైగ్రేన్ అనేది మెదడులో ఉండే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల పరిమాణం వ్యాకోచించడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. కారణాలు: ∙మానసిక ఒత్తిడి ∙నిద్రలేమి ∙ఉపవాసం ∙హార్మోన్ల సమస్యలు, ∙అధిక వెలుతురు ∙వాసనలు ∙మత్తు పదార్థాలు, పొగాకు, పొగతాగడం, కాఫీ ∙మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల లక్షణాలు రావచ్చు. లక్షణాలు: ∙తలనొప్పి అధికంగా, తలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉండి ఒకవైపు లేదా రెండు వైపులా ఉండవచ్చు ∙నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు ∙తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు ∙రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది ∙వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం, వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం వంటి లక్షణాలు తరచూ మైగ్రేన్ నొప్పిలో ఉంటాయి ∙నిద్రలేమి, చిరాకు, నీరసం, ఉత్సాహాన్ని కోల్పోవడం, ఆవలింతలు, తీపి ఇంకా కారపు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడటం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. చికిత్స : ఈ సమస్యకు హోమియోలో సాంగ్వినేరియా, బ్రయోనియా, ఐరస్ వెర్స్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, నక్స్వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గేదెలా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, అనంతపురం మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో ఇది సాధారణం. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో 90 శాతం కేసుల్లో ఈ–కొలై బ్యాక్టీరియానే కారణం. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద ఉండే పరాన్నజీవి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది.మూత్రపిండాల్లో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డంకిగా మారడం వల్ల కూడా బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందు లేదా తర్వాత విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం, పొత్తికడుపు నొప్పి, చలిజ్వరం, వాంతులు. చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తితత్వాన్ని బట్టి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
హెల్త్ టిప్స్
రోజులో మూడుసార్లు హెవీగా తినడానికి బదులు రోజుకి ఐదారుసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. ప్రతి భోజనానికి మధ్యలో రెండు మూడు గంటలు విరామం ఇవ్వాలి. దీని వల్ల మెటబాలిజం వేగవంత మవు తుంది. తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్, 15 నుంచి 20 శాతం ప్రొటీన్స్, 10 నుంచి 15 శాతం ఫాట్స్ ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు బాగా నములుతూ మెల్లిగా తినాలి. ఇలా చేయడం వల్ల దేహానికి తగినంత ఆహారం కడుపులో చేరగానే మెదడు నుంచి ఇక చాలనే సంకేతాలు జారీ అవుతాయి. ఆహారం పరిమాణం తగ్గుతుంది. -
దేహవింతలు
పదిశోధన ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఏడు వింతలు ఎప్పటికీ మనకో వండర్. అయితే.. అంతకంటే విడ్డూరమైన, విచిత్రమైన నిర్మాణాలు మన ఒంట్లోనే ఉన్నాయని మీకు తెలుసా? ఉదాహరణకు గుండెనే తీసుకోండి! దేహం మొత్తం మీద కష్టపడి పనిచేసే కార్మికురాలు గుండె ఒక్కటే. ప్రతిరోజూ ఈ కండరం... ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్లు నడపగలిగేంత శక్తిని (ఎనర్జీని) ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడి పైకి వెళ్లి రావచ్చు! గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయంచోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇక మెదడు! అది మీరీ వండర్. మెదడులో 60 శాతం కొవ్వే ఉంటుంది. ఏ సమయంలోనైనా మన మెదడు 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. ఒక బల్బు వెలగడానికి ఇది చాలు. అంతేకాదు, 50 వేల రకాల వాసనలను మెదడు పసికట్టగలదు. ఏ వయసులోనూ ఉండనన్ని మెదడు కణాలు అత్యధికంగా రెండేళ్ల వయసులో ఉంటాయి. అయినా సరే మెదడు పూర్తిగా పరిణతి చెందడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. ఇవి కాక... మన బాడీలో ఇంకా ఏయే వండర్స్ ఉన్నాయో చూడండి. చర్మం: మానవ దేహంలోని అతి విస్తారమైన భాగం ఇది. నిరంతరం తనని తను పునర్నవీకరించుకుంటూనే ఉంటుంది! ప్రతి నిముషం 50 వేల చర్మకణాలు రాలిపోతుంటాయి. ఇలా జీవితకాలం మొత్తం రాలిన కణాల బరువు 18 కిలోలు ఉంటుంది. మెదడు: మనం మేల్కొని ఉన్నప్పటి కంటే, నిద్ర పోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే... అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకు 70 వేల ఆలోచనలు చేయిస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే... బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం కానీ, బ్రెయిన్కి వచ్చే నొప్పిని గ్రహించలేం! ఎముకలు: మనం 300 కు పైగా ఎముకలతో పుడతాం. పెద్దవాళ్లం అయ్యేనాటికి వాటి సంఖ్య తగ్గి, 206కి చేరుకుంటాయి! కారణం కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమే. జ్ఞాపకశక్తి: గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8 వేల కొత్త కణాలతో వృద్ధి చెందుతుంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. వెంట్రుకలు: ప్రతి నాలుగు వారాలకు అంగుళంలో నాలుగో వంతు పెరుగుతాయి. అంటే 6 మిల్లీమీటర్లు. అలా ఒక్కో వెంట్రుకా ఆరేళ్ల వరకు పెరుగుతుంది. తర్వాత రాలిపోతుంది. అదేచోట కొత్త వెంట్రుక మొలుస్తుంది. ఇనుము: మన దేహంలో ఉండే ఇనుము మొత్తంతో మూడంగుళాల పొడవైన మేకును తయారుచెయ్యొచ్చు. కన్ను: మానవ నేత్రం 576 మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరా వంటిది! అది కోటి రకాల వేర్వేరు రంగుల ఛాయల్ని గుర్తించగలదు. నీరు: మనిషి తన జీవితకాలంలో 75 వేల లీటర్ల నీరు తాగుతాడు. దేహం అంత నీటిని పీల్చేస్తుందన్నమాట. ముక్కు, చెవులు: మనిషి ముక్కు, చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుదల ఒక్కొక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో కనిపించదు. తుమ్ము: ఒక బలమైన తుమ్ము మన ముక్కులోంచి, నోట్లోంచి గంటకు 64 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. -
టీ – మతిమరపు ఢీ!
పరిపరిశోధన జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా? జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా? మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీ కెటిల్ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్ టీ గానీ, గ్రీన్ టీ లేదా సాధారణ చాయ్ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్నకు చెందిన డాక్టర్ ఫెంగ్ లీ పేర్కొంటున్నారు. సదరు యూనివర్సిటీ అధ్యయన ఫలితాలను ఇటీవలే ‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్’ అనే ఆరోగ్య పత్రికలోనూ అధికారికంగా ప్రచురించారట. అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫెంగ్ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్ జాయ్ హాయ్లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్ లీ!! -
అదా విషయం.. అయితే ‘రైట్ రైట్’
మెదడు పరిణామక్రమానికి చేతివాటానికి లింకు మనలో 90 శాతం మంది కుడిచేతివాటం వారే! ఎందుకలా? దీని వెనుక కారణం ఏంటి? మానవ మెదడు పరిణామక్రమానికి ఈ అలవాటుకు ఏమైనా సంబంధం ఉందా? పరిశోధకులు తాజాగా ఈ ప్రశ్నల గుట్టు విప్పారు. మనుషుల్లో అనాదిగా మెజారిటీ ప్రజలు చాలా పనులకు ఎడమచేతిని కాకుండా కుడిచేతినే వాడడానికి గల కారణాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ అలవాటుకు కారణం మనుషుల చేతుల్లో కాదు వారి పళ్లలో దొరికింది! అంతేకాదు కుడిచేతివాటానికి, మనిషి మెదడు పరిణామ క్రమానికి కూడా దగ్గరి సంబంధం ఉన్నట్టు తేలింది. ఆదిమానవుల పరికరాల ద్వారా.. మన మెదడును నిలువుగా చూస్తే రెండువైపులా రెండు సమ భాగాలుగా కనిపిస్తుంది. ఎడమవైపు భాగం.. భాష, కదలికలకు సంబంధించిన పనులను నియంత్రిస్తే, కుడి భాగం చూపు, దూరం, దగ్గర వంటి అంశాలను నియంత్రిస్తుంది. కానీ మెదడులో ఒకవైపు భాగం.. రెండోవైపు భాగంతో పోలిస్తే అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. ఈ భాగంలోనే క్లిష్టమైన పనులను మెదడు నిర్వర్తిస్తుంది. ఈ కీలక భాగానికి, చేతివాటానికి దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆదిమానవులు వాడిన రాతి పరికరాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని కెన్యాలో 33 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వాడిన రాతి పరికరాలు దొరికాయి. వాటి తయారీ, వినియోగం విధానాన్ని విశ్లేషించగా.. అవన్నీ కుడిచేతివాటం వారికి అను కూలంగా ఉన్నట్టు తేలింది. అలాగే మెదడులోని క్రియాశీలక భాగానికి కుడిచేతివాటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. పళ్లపై చారికలు.. ఐరోపాలో నియాండర్తల్ దశకు చెందిన కొన్ని మానవ అస్తిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందులో నోటి ముందుభాగంలోని ఎడమవైపు పళ్లపై కొన్ని బలమైన గీతలు, చారికలు కన్పించాయి. ఇవి ఎలా ఏర్పడి ఉంటాయన్న దిశగా అధ్యయనం చేశారు. ఏదైనా పరికరాన్ని సాగదీసి నోటిలో బిగించి పట్టుకొని, కుడిచేతితో పని చేస్తున్న సమయంలో పొరపాటున అది తెగి పంటికి తాకడం వల్ల ఆ చారికలు ఏర్పడినట్టు గుర్తించారు. ఈ అంచనాకు వచ్చేందుకు నోటికి రక్షణగా గార్డులు ధరించి కుడిచేతితో పనిచేస్తూ ఇదే తరహా ప్రయోగం చేశారు. ఇందులో సరిగ్గా ఎడమవైపు ఉన్న పళ్లకు దెబ్బ తగిలి చారికలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటివారు కుడిచేతి వాటంవారేనని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. -
చురుకైన... మెదడు కోసం!
గుడ్ ఫుడ్ మెదడు చురుగ్గా ఉండటానికి, పది కాలాల పాటు హాయిగా పనిచేయడానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి... కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్: మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమల వంటివి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు): మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకోవచ్చు. అవి మాంసాహారం, గుడ్లు, చేపలు, నట్స్, అవిసెనూనె నుంచి లభ్యమవుతాయి. అయితే ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన మంచి కొవ్వులను (అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను) అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమంగా తయారు చేసే డాల్డా వంటి పదార్థాల్లో ఉంటాయి. వీటి ద్వారా తయారు చేసే కేక్లు, బిస్కెట్లు మెదడును చురుగ్గా ఉంచలేవు. అమైనో యాసిడ్స్: మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు దోహదపడేవే ‘అమైనో యాసిడ్స్’. ఈ అమైనో యాసిడ్స్ అన్నవి ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని పాలు తాగాలని సలహా ఇస్తుంటారు డాక్టర్లు. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువ. విటమిన్లు... మినరల్స్ (ఖనిజ లవణాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో యాసిడ్స్ను న్యూరో ట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్లో మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీ-కాంప్లెక్స్లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలం. నీళ్లు: మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. అయితే మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛ్వాసనిశ్వాసాల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుం టాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీని కోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది. ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతో కొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్ పైనా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6-8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీ అనే ద్రవాహారం పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే ఫరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, దాంతో వేగంగా అలసిపోయేలా చేస్తుంది. కూల్డ్రింక్స్తో కూడా అదే అనర్థం వస్తుంది. -
మూర్ఛకు మందులున్నాయా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. రాత్రి షిఫ్ట్లో ఉద్యోగం చేస్తోంది. ఆమె జాబ్లో ఒత్తిడి ఎక్కువ. ఒక రోజు కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంటే హాస్పిటల్కు తీసుకెళ్లాం. డాక్టర్లు చూసి కన్వల్షన్స్ (మూర్ఛ) అన్నారు. జీవితాంతం మందులు వాడాలి అని చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - లక్ష్మీ, కందుకూరు మూర్చ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధులలో ఒకటి. మెదడులో రసాయనిక చర్యల వల్ల విద్యుత్ తరంగాలు వెలువడటంతో కేంద్రనాడీ వ్యవస్థలో, యాంత్రిక నాడీ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించి, మనిషి స్పర్శ కోల్పోవడం, కండరాలు బిగుసుకుపోవడం, శరీరంలోని భాగాలలో వణుకు రావడం వంటి లక్షణాలు ఏర్పడటాన్ని కలగలిపి మూర్చవ్యాధి అంటారు. మూర్చవ్యాధి చిన్నపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బుతో బాధపడేవారు కొందరు కిందపడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతుంటారు. ఈ సమయంలో వారి నోటి నుంచి నురగ కూడా వస్తుంటుంది. దాంతో వారిని మూర్చవ్యాధిగ్రస్తులుగా మనం గుర్తిస్తాం. పక్కవారు కొందరు వారి చేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఏ విధమైన ఉపశమనమూ ఇవ్వదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కారణాలు: జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మూర్చవ్యాధి రావచ్చు మెదడులో లోపాలు లేదా మెదడులో కంతులు, మెదడు రసాయనాల్లో మార్పులు/అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు అతిగా మద్యపానం, ఆకలితో ఎక్కువసేపు ఉండటం నిద్రలేకపోవడం లక్షణాలు: మూర్చపోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుంచి చొంగ కారడం, ఒక్కోసారి నాలుక కరచుకోవడం వంటివి చేస్తుంటారు. స్పర్శ కోల్పోవడం, అరుపులతో శబ్దాలు చేయడం ఒళ్లంతా చెమటలు పట్టడం తెలియకుండా మూత్రవిసర్జన చేయడం. చికిత్స: హోమియోలో ఈ వ్యాధికి చికిత్స వయసును బట్టి ఉంటుంది. దీనికి కోనియం, ఫై మెట్, సెలీనియమ్, కాల్కేరియా కార్బ్, క్యూప్రమ్మెట్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో డాక్టర్లు మందులు సూచిస్తారు. అనుభజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే..? కిడ్నీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఆయనకు డయాబెటిస్ ఉంది. కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. సమస్యను డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షల గురించి చెప్పండి. - ప్రసాద్, గుంటూరు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అన్నది చాలా సాధారణమైంది. మారుతున్న జీవనశైలి, స్థూలకాయం, లోపించిన దేహ పరిశ్రమ, డయాబెటిస్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. కొన్ని ఏళ్ల తరబడి నియంత్రణలో లేని డయాబెటిస్ దుష్ర్పభావాల వల్ల చాలా మంది మూత్రపిండాల వైఫల్యానికి గురై, మృత్యువాత పడటం జరుగుతోంది. డయాబెటిస్ మూలంగా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి అవగాహన కల్పించాలి. దాదాపు అరవై రకాల వ్యాధులకు డయాబెటిస్ ప్రధాన కారణమవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. దీర్ఘకాలికంగా డయాబెటిస్తో బాధపడేవారిలో ఎక్కువ మంది డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతుంటారు. మానవ శరీరంలోని విసర్జక వ్యవస్థలో కిడ్నీలు ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి. శరీరంలోని అబ్డామిన్ క్యావిటీకి వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఈ కిడ్నీలు అమరి ఉన్నాయి. ఒక్కొక్క కిడ్నీ పొడవు 11 సెం.మీ. వెడల్పు 6 సెం.మీ., మందం 3 సెం.మీ. కలిగి, బరువు 150 గ్రాములు ఉంటుంది. ఈ కిడ్నీల్లో నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. అవి అవిశ్రాంతంగా రక్తాన్ని వడపోస్తూ అందులోని విష, వ్యర్థ, మలిన పదార్థాలను మూత్రరూపంలో బయటకు పంపుతుంటాయి. ఈ రక్త వడపోత కార్యక్రమంలో అంతరాయం ఏర్పడటాన్ని డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యుర్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ రకాలు: 1.అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ 2.క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. కారణాలు: కిడ్నీ ఫెయిల్యూర్కి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని... పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు తర్వాతి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీయవచ్చు మూత్ర విసర్జక వ్యవస్థలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, సరైన సమయంలో చికిత్స చేయించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయవచ్చు దీర్ఘకాలికంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెజబ్బులకు సరైన చికిత్స తీసుకోనివారిలో ఎక్కువ శాతం మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతుంటారు మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధక శక్తి మన మూత్రపిండాలపైనే దాడి చేస్తే అవి దెబ్బతింటాయి. ఈ కండిషన్ను క్రానిక్ గ్లోమెరులో-నెఫ్రైటిస్ అని అంటారు. లక్షణాలు: ముఖం, పొట్ట, కాళ్లు, పాదాలకు బాగా నీరుపడుతుంది ఆహారం తీసుకున్న వెంటనే వాంతి వచ్చినట్లుగా ఉంటుంది మూత్రవిసర్జనలో మార్పులు వస్తాయి ఆకలి తగ్గిపోతుంది బరువు తగ్గుతుంది బద్దకంగా ఉండటం తలనొప్పి కళ్లు తిరగడం ఒళ్లంతా దురదలు మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: సీరమ్ క్రియాటినిన్ బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ మొదలైనవి నార్మల్ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి ఆల్బుమిన్ మూడు ప్లస్ ఉంటుంది అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఐవీపీ ఎక్స్రే ద్వారా కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించవచ్చు రీనల్ బయాప్సీ ద్వారా కిడ్నీ ఎంత మేరకు దెబ్బతిన్నదనే అంశాన్ని, కిడ్నీ భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోవచ్చు. డాక్టర్ ఎమ్.కమల్ కిరణ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బ్రెయిన్ సైజ్కు దానికి సంబంధం!
న్యూయార్క్: బ్రెయిన్ సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎంతపెద్దగా(ఎంత ఎక్కువ సమయం) ఆవులింత వస్తుందో తెలుసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు సుమారు 29 రకాల క్షీరదాల ఆవులింతలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్థారించారు. జీవుల్లో ఎంత అంతపెద్ద బ్రెయిన్ ఉంటే అంత ఎక్కువ సమయం ఆవులింత వస్తుందని వారు తెలిపారు. మెదడు బయటిపొరలోని నాడీకణాల సంఖ్య, బ్రెయిన్ సైజ్ ఈ రెండూ ఆవులింత పరిమాణాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉదాహారణకు గొరిల్లాలు, గుర్రాలు, ఆఫ్రికన్ ఏనుగుల ఆవులింతల పరిమాణం చిన్నగా ఉంటుందని, దీనికి కారణం శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మన మెదడు పరిమాణం కంటే వాటి మొదడు పరిమాణం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడమే అని వెల్లడించారు. ఆవులింత ఎంతపెద్దగా వస్తుందనే విషయం శరీరం ఎంతపెద్దగా ఉందనేదానిపై కాకుండా మెదడు ఎంతపెద్దగా ఉందనే విషయంపై ఆదారపడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆండ్రూ గాల్లప్ తెలిపారు. -
ఆవలింత పెద్దదైతే మెదడు కూడా పెద్దదే!
న్యూయార్క్: ఆవలింతలు, మెదడు పరిమాణాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 29 రకాల క్షీరదాలపై పరిశోధన చేసి వారు ఈ విషయం తేల్చారు. ఒక్కో ఆవలింత సమయం ఎక్కువగా ఉంటే, వాటి మెదడు పెద్దగా ఉన్నట్లట. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారు పరిశోధనలో క్షీరదాల ఆవలింతల సగటు సమయాన్ని నమోదు చేశారు. మెదళ్ల బరువును ముందుగానే తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. మెదడు బరువుతోపాటు, వల్కలం అనే భాగంలోని నాడీ కణాల సంఖ్యమీద ఆధారపడి ఆవలింత సమయం ఉంటుందన్నారు. -
బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!
ఎప్పటికప్పుడు మన మెదడుకు పదునుపెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిదే. చేసే పనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టడం, ఉన్న జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకుని ఉత్సాహవంతంగా పనిచేయడం..ఇవన్నీ మెదడు చురుగ్గా ఉంటేనే సాధ్యం. దానికి పరిష్కారం మరెక్కడో లేదు.. మన జేబులోనే ఉంది. ఇటీవల ప్రజలు స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నా.. స్మార్ట్ఫోన్లో వాడే యాప్స్ ద్వారా మెదడుకు పదునుపెట్టుకోవచ్చట. వీటిలో 8 కొత్తరకం యాప్స్ భలే సక్సెస్ఫుల్గా పనిచేస్తూ.. మానసిక శాంతిని చేకూరుస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. లూమోసిటీ... బ్రెయిన్ ట్రైనింగ్ యాప్స్లో ఇది చాలా పాపులర్. న్యూరో సైంటిస్టులు ఈ యాప్ను రూపొందించారు.అత్యంత ఆసక్తికరమైన ఫీచర్లెన్నో దీనిలో ఉంటాయి. యూజర్ల మెమరీని పెంచుతూ, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి, యూజర్లకు అనుగుణంగా ఆలోచించడంలో లుమోసిటీ యాప్ పని అమోఘం. ప్రస్తుతం ఈ యాప్ను 70 మిలియన్ యూజర్లు వాడుతున్నారు. చిన్న చిన్న గేమ్స్ ద్వారా యూజర్లు తమ తెలివిని పరీక్షించుకుంటూనే తర్వాత దశలకు వెళ్లొచ్చని ఈ యాప్ డెవలపర్లు పేర్కొంటున్నారు. విజార్డ్... ఈ యాప్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు, గేమ్ డెవలర్స్, మనోవైకల్యం కలిగిన వారు కలిసి రూపొందించారు. విజార్డ్ యాప్ యూజర్లు ఒక ప్రత్యేక కార్యక్రమంపై అందరికీ ఒకేలా మెమరీ కలిగి ఉండేలా సహకరించడంతో పాటు, మనోవైకల్యం కలిగిన వారి దైనందిన జీవితంలో ఉపయోగపడేలా దీన్ని తయారుచేశారు. ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్.... వేగవంతంగా ఆలోచించడానికి ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్ యాప్ ఎంతో సహకరిస్తుంది. 360 గేమ్స్, పజిల్స్ కూడిన ఈ యాప్, యూజర్ల బ్రెయిన్కు పదునుపెట్టేలా చేస్తుంది. గేమ్స్ ద్వారా మీ ఫర్ఫార్మెన్స్ను ట్రాక్ చేసి, సలహాలు సూచనలు కూడా ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్ అందిస్తోంది. ఇడెటిక్: ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్లు నుంచి సన్నిహితుల బర్త్డేల వరకు ఏ వాస్తవం గుర్తుంచుకోవాలన్నా ఈ యాప్ భలే సహాయ పడుతుందట. ఇతరాత్ర భాషలు నేర్చుకోవడానికి కూడా ఈ ఇడెటిక్ సూపర్గా ఉపయోగపడుతుంది..విద్యార్థులకు సంబంధించి ఫర్ఫెక్ట్ యాప్స్లో ఇది ఒకటిగా చెప్పొచ్చని పరిశోధకులంటున్నారు. ఎలివేట్... 2014లో ఎలివేట్ యాప్ను లాంచ్ చేశారు. డైలీ చాలెంజస్తో యూజర్లు తమ కమ్యూనికేషన్, ఎనలిటికల్ స్కిల్స్ను పెంచుకోవడంలో దీనికి సాటిలేదట. మెమొరీ, మ్యాథ్స్, ఏకాగ్రతతో పాటుగా ఇతర మెంటల్ స్కిల్స్ను పరీక్షించే 30 రకాల గేమ్స్ దీనిలో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో ఉచితంగా లభించే ఈ యాప్లో ఒకసారి ఎంటరైతే మరలా బయటకు రావడం కష్టం. అంతగా ఆకట్టుకునే రీతిలో ఈ గేమ్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ .. మాథమేటికల్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం నుంచి సుడోకోలు ఆడటం వరకు ఎంపిక చేసిన గేమ్స్ అన్నింటినీ ఇది ఆఫర్ చేస్తుంది. బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ యాప్ యూజర్లు ఏ అంకెలనైనా వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి, మెదడును ఓ మంచి రూపంలో తయారుచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మైండ్ గేమ్స్.. ఈ యాప్ పూర్తిగా ఉచితం. వెంటనే మెమరీని పెంచడం, పదసామాగ్రిని యూజర్లలో విస్తృతపరచడానికి ఇది ఎంతో సహకరిస్తోందట. హ్యాపీఫై... సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఎక్కువ పాజిటివ్గా ఆలోచించాలనుకుంటున్నారా? అయితే హ్యాపీఫై మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతుందట. ఈ యాప్ క్విజ్ లను, పోల్స్ను ఆఫర్ చేస్తూ మనలోని ఒత్తిడిని తొలగిస్తుందట. దీనిలో రిలాక్సేషన్, మెడిటేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయట. -
చెట్టుకూ మెదడు ఉంది!
‘చెట్టు నా ఆదర్శం’ అన్నారు కవి ఇస్మాయిల్. ఆయన కవితల్లో చెట్టు ఇంతై, అంతై...భువనమంతై... తన విశ్వరూపాన్ని చూపుతుంది. ఒక కవితలో ఆయన ఇలా అంటారు... ‘మనిషీ మనిషీ పిట్టలకు ఎగరడం నేర్పిన చెట్టుని చూడు ఏ భాషలో పుష్పిస్తుందది? ఊడల నీడల్లో మాపటి వేళల్లో ఊడల్లా కావలించుకునే ప్రియుల హస్తాలు ఏ భాషలో తడుముకుంటాయి?’ ‘చెట్టు ఉన్నచోటు నుంచి కదలదు. కానీ దానిలోని స్పందనలు మాత్రం స్థిరంగా ఉండవు. గాలితో పాటు భావాలు ప్రయాణిస్తాయి. వాటి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే...ఎన్నో భావాలు అర్థమవుతాయి’ ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచిస్తే... అది ‘భావుకత’ కేటగిరీలోకి పోతుందేగానీ ‘వాస్తవం’లోకి పోదు. అయితే మన ‘భావుకత’లో అతిశయోక్తి, అవాస్తవం ఏవీ లేవంటున్నాయి తాజా పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ టురిన్, ఇటలీకి చెందిన ప్రొఫెసర్ మాసిమో, ఇంకా కొద్ది మంది పరిశోధకులు చెట్టు చెట్టు తిరిగి, వేరు వేరుని పలకరించి ఎంతో పరిశోధన చేశారు. వీరు చెప్పేదాని ప్రకారం... చెట్లకు మెదడు ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. చెట్లు ఒకదానితో ఒకటి మౌనంగా సంభాషించుకుంటాయి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఒక చెట్టు యోగక్షేమం గురించి మరొకటి ఆలోచిస్తుంది. వాటికి జ్ఞానమే కాదు... బాధ కూడా ఉంటుంది. ఇక ఒకే జాతి చెట్ల మధ్య చాల గట్టి బంధం ఉంటుందట. వాటి బంధం వేర్ల సహాయంతో బలపడుతుందట. కొన్ని సందర్భాల్లోనైతే... అవి కలిసికట్టుగా చనిపోతాయట! ఎంత చిత్రం!! -
బ్రెయిన్ ట్రెయిన్
1. ఏకపాద హస్తాసన సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచేయి ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకెళ్లాలి. కుడిభుజాన్ని కుడి చెవికి దగ్గరగా ఉంచి నడుమును పైకి సాగదీస్తూ కుడి చెయ్యిని పైకి స్ట్రెచ్ చేయాలి. ఎడమకాలును వెనుకకు మడిచి ఎడమచేత్తో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. కాలి మడమను ఎడమ పిరుదుకు దగ్గరగా నొక్కుతూ పట్టుకోవాలి. నిదానంగా శ్వాస వదులుతూ తల కుడి చెయ్యి కలిపి ఉంచుతూ ముందుకు వంగి కుడిచేయి నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. కుడి మోకాలు స్ట్రెయిట్గా ఉంచి నుదురు కుడి మోకాలుకు వీలైనంత దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ తల కుడి చేయి కలిపి ఉంచి పైకి తీసుకెళుతూ నెమ్మదిగా పైకి లేవాలి. శ్వాస వదులుతూ కుడిచేయి పక్క నుంచి కిందకు, ఎడమపాదాన్ని కిందకు తీసుకురావాలి. అలాగే రెండవ వైపున కూడా ఎడమకాలు మీద నిలబడి కుడికాలును మడతపెట్టి చేయాలి. ఉపయోగాలు: శరీరంలో కుడి ఎడమ భాగాల మధ్య సమతౌల్యం వస్తుంది. వృద్ధాప్యంలో బాత్రూమ్లో జారిపడడం వంటి ప్రమాదాలు జరగవు. ్ల హామ్స్ట్రింగ్స్ (తొడ వెనుక కండరాలు), పించ్ నర్వ్ కరెక్షన్కు, సయాటికా సమస్యకు ఉపయోగం. జీర్ణవ్యవస్థ ఉత్తేజితం. తల భాగానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. 2. పర్వతాసన సూర్యనమస్కారాల్లో ఒకటైన ఆసనాన్ని విడిగా చేయాలి అనుకున్నప్పుడు... సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్లాలి. పైన చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద పైకి లేస్తూ మడమల్ని పైకి ఎత్తి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మడమలను నేల మీద ఆన్చి తల చేతులు కలిపి ముందుకు ఫార్వార్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్లను ఫ్రీగా ఉంచి పొట్టను లోపలకు లాగుతూ నడుము నుంచి పై భాగాన్ని ఎడమవైపు నుంచి కుడివైపునకు కుడి నుంచి ఎడమవైపునకు చేతులను వేలాడేస్తూ రొటేట్ చేయాలి. తలను మధ్యలోకి తీసుకు వచ్చి చేతులు ముందు నేల మీద ఒకదానికి ఒకటి ఒక అడుగు దూరంలో ఉంచి ఆల్టర్నేట్ పాదాలు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ రెండు పాదాలు వెనుకకు తీసుకువెళ్లి, పాదాల మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగు దూరం ఉంచి నడుమును బాగా పైకి లేపి భూమికి శరీరం త్రిభుజాకారంలో ఉండేటట్టుగా ప్రయత్నించాలి. శ్వాస వదులుతూ పొట్టను బాగా లోపలకి లాగిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తూండాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత తిరిగి అలాగే వెనుకకు పాద హస్తాసనము లోనికి, శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ చేతులు పక్క నుంచి కిందకు తీసుకువచ్చి తిరిగి సమస్థితిలోనికి రావాలి. ఉపయోగాలు: శరీరంలో ఉన్న 640 కండరాలలో కనీసం 500 కండరాలకు వ్యాయామం జరుగుతుంది. వెన్నుపూస భాగానికి తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. 3. ప్రసారిత పాదోత్థానాసన తాడాసన స్థితిలో నిలబడి రెండు కాళ్లను వీలైనంత దూరంగా ఉంచి చేతులు రెండూ పక్కల నుంచి సాగదీస్తూ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకువెళ్లి, శ్వాస వదులుతూ రెండు చేతులను, తలను మధ్యలో నుండి ముందుకు వంచి కాళ్లను ఇంకా దూరం చేసి చేతులు రెండు కింద పెట్టే ప్రయత్నం చేయాలి తర్వాత తలను మాడు భాగాన్ని నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. తల ముందువైపు దూరంగా కాకుండా రెండు కాళ్ల మధ్య సరళరేఖకు దగ్గరగా తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీలైతే చేతులు రెండూ వెనుకనుంచి పైకి తీసుకెళ్లి, రెండు చేతులూ ఇంటర్లాక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఉపయోగాలు: తలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు ముఖభాగాలకు ఎక్కువ రక్తప్రసరణ జరగడం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. పిట్యుటరీ, హైపోథాలమస్ వంటి మాస్టర్ గ్రంధులు ఉత్తేజితమై వీటి నియంత్రణలో ఉండే థైరాయిడ్, పీనియల్, ఎడ్రినల్ గ్రంధులు బాగా పనిచేస్తాయి. హామ్స్ట్రింగ్స్, స్పైన్ శక్తివంతమవుతాయి. పొట్ట భాగాలకు టోనింగ్ జరిగి జీర్ణవ్యవస్థకు మేలు కలుగుతుంది. ఎవరైతే శీర్షాసనం వేయలేరో దీన్ని సాధన చేస్తే దాని వల్ల కలిగే లాభాలన్నీ దీని వల్ల కలుగుతాయి. - సమన్వయం: ఎస్.సత్యబాబు, సాక్షి ప్రతినిధి -
మహిళ మెదడులోని కణితి తొలగింపు
విశాఖ మెడికల్: అరుదైన రక్తనాళాల వాపు (ఎన్యురిజమ్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఇండస్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ టి.సురేష్ మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స వివరాలను ఆయన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం వన్నాడ గ్రామానికి చెందిన జగన్నాథమ్మ (45) నియంత్రణలో లేని రక్తపోటు, వాంతులు, తీవ్రమైన తలనొప్పితో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిందన్నారు. ఆమెను పరీక్షించగా మెదడు మధ్య భాగంలో ఉన్న రక్తనాళంలో అసాధారణ వాపు ఏర్పడి అది కణితి రూపంలో గడ్డకట్టినట్లు గుర్తించామన్నారు. ఈ కణితి చుట్టూ ఉన్న చిన్నపాటి రక్తనాళాలు మెదడులోని ముఖ్యమైన శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తాయి. వీటికి ఎటువంటి ముప్పు జరగకుండా స్కల్ బేస్, సెరిబ్రోవాస్కులర్ ప్రక్రియ ద్వారా అత్యంత చాకచక్యంగా కణితిని తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పుర్రె భాగం పక్కనుండి రంద్రంచేసి రక్తనాళ కణితిని, పక్కన ఉన్న చిన్న చిన్న రక్తనాళాలను జాగ్రత్తగా విడదీసి క్లిప్పింగ్ చేసి రక్తపోటును నియంత్రించి రక్తస్రావం జరగకుండా తొలగించామన్నారు. 8 గంటల పాటు నిర్వహించిన ఇటువంటి ఎన్యురిజమ్ సర్జరీలు గతంలో ముంబాయి, మద్రాసు వంటి నగరాలకు చికిత్సకు తరలించేవారని, ఇప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలు ఇండస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు న్యూరో మత్తు వైద్యుడు శ్రీనివాస్ సహకరించారన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుందన్నారు. త్వరలో డిశ్చార్జి చేయనున్నామన్నారు. -
ఆ లోపంతోనే మతిమరుపు!
ఫ్లోరిడాః వృద్ధాప్యంలో మతిమరువు రావడానికి విటమిన్ బి-12 తక్కువ స్థాయిలో ఉండటమే కారణం కావచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వయసు పెరగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు విడుదలయ్యే స్థాయి తగ్గిపోవడంతో ఆహారంలోని బి-12 ను గ్రహించే శక్తి శరీరం కోల్పోతుందని, దీంతో క్రమ క్రమంగా వృద్ధుల్లో విటమిన్ లోపానికి దారితీస్తుందని ఫ్లోరిడాకు చెందిన సైంటిస్టులు పరిశోధనలద్వారా కనుగొన్నారు. వయసు పైబడినవారిలో మతిమరుపు రావడానికి ముఖ్య కారణం విటమిన్ బి-12 లోపం కావచ్చని నోవా ఆగ్నేయ యూనివర్శిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్.. రిచర్డ్ డెట్ మెదడుపై నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లోపంతో బాధపడేవారిలో సమస్య బయటకు పెద్దగా కనిపించకపోయినా... క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో చెప్పిన విషయాలను మరచి పోవడం, మళ్ళీ మళ్ళీ అడుగుతుండటమే కాక, ప్రతి విషయానికీ తిగమక పడటం వంటి లక్షణాలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ పనిచేయడానికి బి-12 విటమిన్ ఎంతగానో సహకరిస్తుంది. అందుకే విటమిన్ లోపం ఏర్పడగానే శరీరంలో నిస్సత్తువ, అవయవాలు పట్టుతప్పి, మూత్రం తెలియకుండా వచ్చేయడం, బీపీ తగ్గడంతో పాటు మతిమరుపు వంటి అనేక సమస్యలు మెల్లమెల్లగా బయట పడతాయని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయంలో సమస్యను గుర్తించకపోతే అది.. రక్త హీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వయసులో ఉన్నపుడు మనశరీరం కణజాలంలోనూ, కాలేయాల్లోనూ బి-12 ను నిల్వ చేసుకుంటుందని, అందుకే ఆ సమయంలో విటమిన్ తగినంత శరీరానికి అందకపోయినా పెద్దగా తేడా కనిపించదని చెప్తున్నారు. అయితే ఉండాల్సిన కన్నా భారీ స్థాయిలో లోపం ఏర్పడితే మాత్రం శరీరంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. బి-12 లోపం నివారించాలంటే ఆ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలైన చేపలు, మాంసం, కాలేయం వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. చికెన్, గుడ్లు, పాలు, పాల పదార్థాల్లో కూడా బి-12 ఉన్నా.. తక్కువ మోతాదులో ఉంటుందని, శాకాహారంలో అయితే బి-12 పెద్దగా కనిపించదని పరిశోధకలు చెప్తున్నారు. అందుకే శాకాహారులు.. బి-12 లోపం కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్ మాత్రలు వాడాల్సి ఉంటుందని సూచిస్తున్న పరిశోధకులు.. తమ అధ్యయనాలను ప్లాస్ వన్ జర్నల్ లో నివేదించారు. -
మెదడు గురించి మరింత తెలిసింది..
97 కొత్త ప్రాంతాలను గుర్తించిన వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు మన శరీరంలోని అవయవాల వివరాల ఎంత ఎక్కువ తెలిస్తే వైద్యం అంత పురోగమిస్తుంది. గుండె మొదలుకొని ఇతర అవయవాలన్నింటి విషయంలో జరిగింది అదే. అయితే వందేళ్ల పరిశోధనల తరువాత కూడా మన మెదడు గురించి తెలిసింది చాలా తక్కువంటే ఆశ్చర్యం అనిపించకమానదు. హ్యూమన్ కనెక్టోమ్ ప్రాజెక్టు పుణ్యమా అని ఇప్పుడీ పరిస్థితిలో కొంచెం మార్పు రానుంది. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్టు మన మెదడులో మనకు తెలియని 97 కొత్త ప్రాంతాల వివరాలు అందించింది. వందల కోట్ల న్యూరాన్లు... అంతకుమించిన సైనాప్స్ (న్యూరాన్ల మధ్య సంబంధాలు) ఆక్సాన్లతో కూడిన మన మెదడు అతి సంక్లిష్టమైన అవయవమనడంలో సందేహం లేదు. దీన్ని అర్థం చేసుకునేందుకు వందేళ్లకుపైగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి. 1909లో కొర్బినియన్ బ్రాడ్మాన్ అనే న్యూరోసైంటిస్ట్ తొలిసారి మెదడులో ఉండే వేర్వేరు కణాల ఆధారంగా సెర్రిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో దాదాపు 43 వేర్వేరు ప్రాంతాలున్నట్లు ఒక మ్యాప్ను సిద్ధం చేశారు. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఈ ప్రాంతాల సంఖ్య 83కు చేరింది. తాజా పరిశోధనల ఫలితంగా ప్రస్తుతమిది 180కు చేరింది. ఎలా గుర్తించారు...? మెదడులోని కొత్త ప్రాంతాలను గుర్తించేందుకు 210 మంది ఆరోగ్యవంతులైన మానవుల ఎంఆర్ఐలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. కార్యకలాపాలు, నిర్మాణం వంటి వేర్వేరు అంశాల ద్వారా మెదడులో ఉండే ప్రత్యేక ప్రాంతాలను నిర్వచించారు. దాంతోపాటు కార్టెక్స్ మందాన్ని కూడా ఉపయోగించారు. ఒక్కో మనిషి మెదడు సైజు, నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి తాము గుర్తించిన ప్రాంతాలు కరెక్టేనా కాదా? అన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా మరో 210 మంది మెదడు ఎంఆర్ఐలతో పోల్చి చూశారు. తాము గుర్తించిన 97 ప్రాంతాలు ఇతరుల్లోనూ ఉన్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ ఎంత కచ్చితంగా పనిచేసిందంటే... కొంతమందిలో భాషకు సంబంధించిన ప్రాంతం రెండుగా విడిపోయిందని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఒక ప్రాంతం అనుకుంటున్నది కాస్తా 12 చిన్న భాగాలుగా విడిపోయి ఉందని తెలిసింది. తాము సృష్టించిన మ్యాప్ను మరింత విస్తృతంగా అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని అంటున్నారు. పరిశోధన వివరాలు సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. - సాక్షి, హైదరాబాద్ -
మెదడు పెద్దదైతే.. మానసిక రుగ్మతలు
వాషింగ్టన్ : మెదడు పరిమాణం పెద్దగా ఉండే వారు మనోవైకల్యం, అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మెదడు పరిమాణం పెద్దగా ఉండడంతో మెదడులోని దూర ప్రాంతాలకు సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణంగా వారు పేర్కొంటున్నారు. క్షీరదాలలో సమాచార మార్పిడి, జ్ఞాపకశక్తి వ్యవస్థలను మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ నిర్వహిస్తుంది. దీనిలోని నాడుల పనితీరును తెలుసుకోవడం ద్వారా అది చేసే పనుల గురించి అవగాహనకు రావచ్చని వాషింగ్టన్ వర్సిటీ, రుమేనియాలోని బొలాయి వర్సిటీ పరిశోధకులు తెలిపారు. -
అలా చేస్తే బ్రెయిన్ పవర్ సూపర్!
న్యూయార్క్: సరైన వ్యాయామం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలే మెదడును చురుగ్గా ఉంచుతాయంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మార్క్ డీఎస్పోస్టియో పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం ఎరోబిక్స్, రీజనింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించే వారిలో మెదడు చురుగ్గా ఉంటుందని తేలింది. పరిశోధనల్లో భాగంగా 36 మంది 56-75 ఏళ్ల వయస్సున్న వారిని ఎంచుకున్నారు. శారీరక వ్యాయామం, రీజనింగ్ అలవాట్ల ప్రకారం వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మెదడులో రక్తప్రసరణ ఆధారంగా వారి పనిని పర్యవేక్షించారు. శారీరక వ్యాయామం చేసే గ్రూపులో మెదడు రక్తప్రసరణ చురుగ్గా ఉండటాన్ని గమనించారు. రీజనింగ్ సమస్యలను పరిష్కరించే వారి మెదడులో రక్తప్రసరణ మరింత చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వ్యాయామం చేసేవారితో పోల్చినపుడు రీజినింగ్ సభ్యుల్లో రక్తప్రసరణ వేగం 7.9 అధికంగా నమోదవడాన్ని గుర్తించారు. -
ఓ ఆడ, మగ కలసి ఓ పని చేస్తే.....
కాలిఫోర్నియా: పరస్పర సహకారంతో చేయాల్సిన ఓ పనిని ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు కలసి చేస్తే ఎలా ఉంటుంది? అదే ఓ ఆడ, మగ కలసి చేస్తే ఎలా ఉంటుంది? చేసే పని పట్ల వారి దృక్పథాలు ఎలా ఉంటాయి? అప్పుడు వారి మెదళ్లు ఎలా స్పందిస్తాయి? వారి మెదళ్లలోని ఏ భాగంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అన్న విషయంలో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే పనిని ఇద్దరు ఆడవాళ్లు చేయడంకన్నా ఇద్దరు మగవాళ్లు చేస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. అదే ఓ ఆడ, మగ కలసి పని చేస్తే పని పట్ల వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో, వారి మెదళ్లలో ఎక్కడ ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలసుకునేందుకు అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు జరిపారు. పని చేస్తున్నప్పుడు వారి మెదళ్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం ద్వారా ఫలితాలను విశ్లేషించారు. అనుకున్న పనిని పూర్తిచేసేందుకు మగవాళ్లు బహు విధాల ఆలోచిస్తారు. ఆడవాళ్లు ఒకే రీతిన ఆలోచిస్తారు. సాధారణంగా మగవాడు ఏం చేయబోతున్నాడన్నది అంచనావేసి అతడు ఆలోచనా ధోరణికి అనుగుణంగా పనిచేస్తూ ఆ పనిని పూర్తయ్యేందుకు ఆడవాళ్లు సహకరిస్తారు. ఇద్దరి దృక్పథాల్లో భిన్న ధోరణులు ఉన్నట్లే వారి మెదడులోని వేర్వేరు ప్రాంతాల్లో స్పందనలు కనిపిస్తాయి. మగవాడు బహువిధ దృక్పథంతో ఆలోచిస్తాడు కనుక మెదడులోని కార్టెక్స్ కుడి పైభాగం స్పందిస్తుంది. ఆడవాళ్లు ఏక దృక్పథంతో ఆలోచిస్తారు కనుక కార్టెక్స్ కుడివైపు దిగువ భాగం స్పందిస్తుంది. పనిచేస్తున్నప్పుడు రక్తంలోని ఆక్సిజన్ ఏ ప్రాంతానికి ఎక్కువగా చేరుతుందో గమనించడం ద్వారా ఆ ప్రాంతం స్పందిస్తున్న విషయాన్ని గుర్తిస్తారు. 200 మంది ఆడ, మగ జంటలకు పరస్పర సహకారంతో పూర్తి చేయాల్సిన ఒకే పనిని అప్పగించడం ద్వారా ఈ ప్రయోగాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇద్దరు ఆడవాళ్లకన్నా ఇద్దరు మగవాళ్లే నిర్దేశిత పనిని ఉత్తమంగా చేస్తారన్న గత అధ్యయనాలను కూడా ఈ ప్రయోగం శాస్త్ర విజ్ఞానపరంగా రుజువు చేస్తోంది. ఇద్దరు ఆడవాళ్లకన్నా కూడా ఒక మగ, ఆడ కలిసి బాగా పనిచేస్తారని కూడా తేలింది. ఇద్దరు మగవాళ్లు పూర్తిచేసే పనిలో, ఆడ, మగ జంట కాస్త వెనకబడినప్పటికీ వ్యత్యాసంలో పెద్ద తేడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఓ నిర్దేశిత పనిని పూర్తి చేయడంలో ఆడ, మగ మధ్య తేడా ఉంటుందని చెప్పడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని, పని పూర్తి చేయడంలో ఆడ, మగ మెదళ్లలో కలిగే మార్పులను సూచించడమే తమ ఉద్దేశమని పరిశోధకులు వివరించారు. భవిష్యత్తులో ఆడ, మగ కలసి సమష్టిగా పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలో అంచాను రావడం కోసమే తమ ప్రయోగమని చెప్పారు. అయినా తాము నిర్వహించిన ఈ తాజా ప్రయోగంతో అప్పుడే ఓ నిశ్చితాభిప్రాయానికి రానవసరం లేదని, ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని వారు తెలిపారు. సాంస్కృతిక, సామాజిక పరిస్థితులనుబట్టి కూడా ఆగ, మగ దృక్పథాల్లో మార్పులు ఉండవచ్చని వారన్నారు. -
రన్నింగ్ ఒక్కటే మెదడుకు మంచిది
న్యూయార్క్: మానవులు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తెలివితేటలు పెరుగుతాయని గ్రీకులు, రోమన్ల కాలం నుంచి వస్తున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని శాస్త్ర విజ్ఞానపరంగా నిరూపించేందుకు గత రెండు దశాబ్దాలుగా న్యూరోసైన్స్పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ వస్తున్నారు. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మెదడులోని కణాల అభివృద్ధికి తోడ్పడే ప్రొటీన్లు పెరుగుతాయని, కణాలు పెరగడం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఇది పాక్షికంగా మాత్రమే నిజం. మెదడులో జ్ఞాపకశక్తి విస్తరించడానికి, కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి మెదడు కణాల్లో జరిగే జీవన క్రియను వైద్య పరిభాషలో హిప్పోక్యాంపస్ అని పిలుస్తాం. ఈ హిప్పోక్యాంపస్ ప్రక్రియ అభివృద్ధి చెందడానికి శారీరక వ్యాయామం తోడ్పడుతుందనే విషయం కూడా వాస్తవమే. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల ఈ ప్రక్రియ అభివృద్ధి చెందుతుందనే విషయం ఇంతకాలం సంక్లిష్టంగా ఉంటూ వచ్చింది. కొందరు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ఏరోబిక్స్ చేస్తే మెదడు క్రియాశీలకంగా మారుతుందని, జిమ్కెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మెదడు కణాలు అభివృద్ధి చెందుతుందని, ఏరకమైన ఎక్సర్సైజ్ అయినా మెదడుకు మంచిదేనని రకరకాలుగా చెబుతున్న వారు ఎందరో ఉన్నారు. శరీరంలో కొవ్వు కరగడానికి, కండరాలు బలపడడానికి ఏ వ్యాయామమైనా సరిపోవచ్చుగానీ తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడే మెదడు కణాల అభివృద్ధికి మాత్రం పరుగెత్తడం ఒక్కటే మార్గమని ఇటీవల జరిపిన రెండు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో ఓ అధ్యయనాన్ని ఫిన్ల్యాండ్కు చెందిన పరిశోధకులు వెల్లడించగా, మరో అధ్యయనాన్ని ‘సెల్ మెటబాలిజమ్’ తన తాజా సంచికలో వెల్లడించింది. ఈ అధ్యయనాలు జరిపిన రెండు బృందాలు వేర్వేరుగా హెచ్ఐటీ, ఆర్టీ వ్యాయామాలు చేసిన వారిలోని మెదడు కణాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. హెచ్ఐటీ అంటే హై ఇంటెన్సిటివ్ ఇంటర్వెల్ ట్రేనింగ్, అంటే ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడం, ఆర్టీ అంటే రిసిస్టెంగ్ ట్రేనింగ్, అంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేయడం. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాలు స్వల్పంగా అభివృద్ధి చెందాయి. వెయిట్లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరుగెత్తే వారి మెదడులో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా వారిలో హిప్పోక్యాంపస్ ప్రక్రియ వేగవంతమై మెదడులోని కణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పాత కణాలు బలపడడమే కాకుండా కొత్త కణాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ పరిశోధనల ద్వారా పరుగెత్తడమే మెదడుకు మంచిదని, జ్ఞాపక శక్తి పెరిగి తెలివి తేటలుపెరుగుతాయని పరిశోధకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రోజూ పరుగెత్తే వారందరికి తెలివి తేటలు వాటంతట అవే వస్తాయనుకుంటే పొరపాటు. అలా అయితే పోటీల్లో పాల్గొనే రన్నర్లు అందరూ తెలివితేటలు కలిగిన వారై ఉండాలి. తెలివితేటలు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన శక్తి మాత్రమే మెదడుకు సంక్రమిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై దృష్టిని కేంద్రకరిస్తే వాటిల్లో మన తెలివితేటలు పెరుగుతాయి. -
ఫంగల్ బాల్ అంటే ఏమిటి?
పల్మునాలజీ కౌన్సెలింగ్ కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. దగ్గుతో పాటు రక్తం పడుతోంది. డాక్టర్కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి నా ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. ఆందోళనగా ఉంది. అంటే ఏమిటి? - సురేశ్, కాకినాడ ఫంగల్ బాల్ అనే సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్లోకి) చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్ను మన ఇమ్యూనిటీ నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇతరత్రా అంశాలు కూడా తోడవడంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో యాబ్సెస్, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది. లక్షణాలు: కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనాపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. ఈ ఫంగస్ ఉండ రక్తనాళాలపై దాడి చేసినప్పుడు ఇలా రక్తం పడవచ్చు. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్-రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్తనాళాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స, ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి. - వి. పట్టాభిరామ్, విజయనగరం గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయబద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవితాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి. 1. దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2. దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూడదు. 3. ఈ కండరానికి ‘కొరనరీ ధమనుల’ ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4. కొన్ని సూక్ష్మక్రిములు గుండె పొరలను, కవాటాలను పాడు చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు. అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. హార్ట్ ఎటాక్లో గుండెకు జరిగే రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసాగిస్తే హార్ట్ ఎటాక్లు నివారితమవుతాయి. నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన అంశం. అలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు. ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణంలోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదార్థాలు తీసుకోడానికి, తగినంత నీరు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం, చక్కెరపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్ఫుడ్స్ను, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు. ఔషధాలు: అల్లం 5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు ఐదు చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం కాచుకుని రోజూ 30 మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడుపున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ, హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం కావడం కూడా బాగా జరుగుతుంది. మద్ది (అర్జున) చెట్టు ‘తెలుపు, నలుపు’ అని రెండు రకాలు. తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు నల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది. బజారులో లభించే మందులు: ప్రభాకరవటి లేదా నాగార్జునాభ్రరస మాత్రలు ఉదయం 1, రాత్రి 1 వాడాలి త్రిఫలాచూర్ణం 5 గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నాకు తొమ్మిదేళ్ల వయసులో ముఖం కాలింది. అప్పట్లో మంచి చికిత్సతో గాయం మానిపోయినప్పటికీ దాని తాలూకు మచ్చ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ముఖంపై కాలిన గాయం మచ్చ వల్ల నేను మానసికంగా ఆవేదనకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - నవీన, వరంగల్ స్కిన్ డ్రాఫ్ట్ సర్జరీ ద్వారా మీ ముఖంపై ఏర్పడిన కాలిన గాయం మచ్చను సమూలంగా రూపుమాపవచ్చు. ఈ సర్జరీకి రెండు విధాల చికిత్సను అనుసరిస్తారు. ఒకటి - స్ల్పిట్ థిక్నెస్, రెండోది - ఫుల్ థిక్నెస్. మొదటి దానిలో మీ శరీరంలోని ఏదైనా భాగం నుంచి (ఎక్కువగా తొడ భాగాన్నే ఎంచుకుంటుంటారు) చర్మాన్ని తీసి, అవసరమైన చోట సర్జరీ ద్వారా అమర్చుతారు. దీనికి మూడు వారాల సమయం వరకు పడుతుంది. అలాగే చిన్నపాటి కుట్లు (స్టిచెస్) కూడా వేయాల్సి ఉంటుంది. ఇక రెండో విధానానికి వస్తే... ఈ ప్రక్రియలో కూడా మొదటి విధానాన్నే అనుసరిస్తారు. అయితే చర్మాన్ని రెండు విడతలుగా మచ్చపై అమర్చి కుట్లు (స్టిచెస్) లేకుండా సర్జరీ ముగిస్తారు. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా సర్జరీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మచ్చను పూర్తిగా కనబడకుండా చేయడానికి ఈ విధానంలో ఆరు వారాలకు పైగా పడుతుంది. సాధారణంగా ఈ విధానాన్ని బ్రెస్ట్, ముక్కు సర్జరీలకు వాడుతుంటారు. కాలిన గాయాలతో ఏర్పడిన మచ్చ తీవ్రతను బట్టి కూడా ఈ ప్రక్రియను వాడే అవకాశం ఉంది. మీ ముఖంపై ఉన్న మచ్చను బట్టి సర్జరీకి ఏ విధానం అవలంబిస్తారనేది సర్జన్ నిర్ణయిస్తారు. మీరు వెంటనే మంచి నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్ను కలిసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు. డా.శశికాంత్ మద్దు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్ -
గిరగిరా తిరిగితే ఎందుకు పడిపోతాం?
స్కూల్ ఎడ్యుకేషన్ నేలపై నిలబడి మన కాళ్లమీద వృత్తాకారంలో గిరగిరా తిరిగినప్పుడు, లేదా మన తలను వృత్తాకారంలో తిప్పినప్పుడు ఆ పని చేస్తున్నంతసేపూ మనకు ఏమీ అనిపించనప్పటికీ, ఆపిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయినట్లుగా ఉంటుంది. మనం సరిగ్గా నిలబడలేక వెంటనే కూర్చుండిపోతాం. ఒక్కోసారి కిందపడిపోతాం కూడా. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మన చెవుల లోపలి భాగంలో ఒక రకమైన సంచుల్లాంటి నిర్మాణాలు (కాక్లియా) కొన్ని ఉంటాయి. వీటిలో ఒక ద్రవం, ఆ ద్రవంలో కొన్ని స్ఫటికాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మన సమతుల్యతను నియంత్రిస్తాయి. మన తలని గిరగిరా తిప్పినప్పుడు ఆ ద్రవంలోని స్ఫటికాలు కూడా అందుకు అనుగుణంగా తిరిగి, సంచుల గోడలను తాకి వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో వీటిని అంటిపెట్టుకుని ఉండే నాడులు ఆ సంకేతాలను మెదడుకి అందిస్తాయి. మెదడు అందుకు అనుగుణంగా స్పందిస్తుంది. మనం గిరగిరా తిరిగినప్పుడు మన చెవుల్లోని ద్రవపు సంచుల్లోని స్ఫటికాలు కూడా తిరుగుతాయి. అయితే మనం ఆగిపోయిన వెంటనే అవి మళ్లీ తమ పూర్వ స్థితికి చేరుకోలేవు. దాంతో కొంతసేపటిదాకా అసలేం జరుగుతుందో మన శరీర వ్యవస్థకు అర్థంకాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం సంతులతను కోల్పోయి కిందపడతాం. -
పలు భాషలు రావడం మెదడుకు మేతే
లండన్: ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చిన వారిని మనం బహుభాషా కోవిదులు అంటూ కొనియాడుతాం. వారిని అలా పిలవడం ద్వారానే మనకు తెలియకుండానే వారి పట్ల సానుకూల దృక్ఫథం వ్యక్తం చేస్తాం. ఒక్క భాష వచ్చిన వారి మెదడు బాగా పని చేస్తుందా? లేదా రెండు, అంతకంటే ఎక్కువ భాషలు వచ్చిన వారి మెదడు బాగా పనిచేస్తుందా ? అన్న అంశంపై ఎప్పటి నుంచో చర్చ కొనసాగుతోంది. ఒకటికన్నా ఎక్కువ భాషలు నేర్చుకుంటే మెదడు గందరగోళంగా తయారవుతుందని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై అది ప్రభావం చూపిస్తుందని వాదించేవాళ్లు ఎప్పటి నుంచో ఉన్నారు. వాస్తవానికి ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చినవారు, అంటే బహుభాషా కోవిదుల్లో జ్ఞానశక్తి, అవగాహన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ‘బైలింగ్విల్ రిసెర్చ్ బాడీ’ ఒకటి తాజాగా వెల్లడించింది. బహు భాషలు రావడం మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, భాషల మీద పట్టు సాధించడమే కాకుండా కార్యనిర్వాహక సామర్థ్యం కూడా వారిలో పెరుగుతోందని రిసెర్చ్ బాడీ తెలిపింది. పలు భాషలు నేర్చుకోవడం వల్ల మెదడులోని అన్ని ప్రాంతాలు క్రియాశీలకం అవుతాయని, అలా మెదడులోని అన్ని విభాగాలు క్రియాశీలకం కావడం కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తోందని ప్రపంచ బహుభాషా పరిశోధకుల్లో ప్రముఖులైన ఎలెన్ బయాలిస్టాక్ చెప్పారు. తమిళంతోపాటు ఇంగ్లీషు వచ్చిన భారత్కు చెందిన 20 మంది, కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన 20 మందిపై తాము జరిపిన పరిశోధనల వల్ల ఈ విషయం తేలిందని ఆమె అన్నారు. బహు భాషలను నేర్చుకోవడం వల్ల మెదడు స్వరూపంలో కూడా మార్పులు వస్తాయని తాజాగా విడుదలైన మరో సర్వే కూడా తెలియజేస్తోంది. అందుకేనేమో ఒక్క విదేశీ భాషైనా నేర్చుకోవాలనే నియమం యూరప్ లాంటి దేశాల్లో ఉంది. పది మందిపైనో, పాతిక మందిపైనో అధ్యయనం చేయడం ద్వారా బహు భాషల వల్ల మెదడుకు ప్రయోజనమని వాదించడం సబబు కాదని ప్రముఖ సైకాలజిస్ట్ కెన్నేత్ పాప్ అభిప్రాయపడుతున్నారు. బహు భాషల వల్ల సామాజిక ప్రయోజనం ఉన్న మాట వాస్తవమేనని, దాని ద్వారా జ్ఞానశక్తి వద్ధి చెందుతుందన్న వాదనతో విభేదిస్తున్నానని ఆయన అన్నారు. వచ్చిన ఒకే ఒక్క భాషతోనే వివిధ రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని ఆయన చెప్పారు. -
మెదడు ఏజింగ్ ను తగ్గించే స్లో జాగింగ్!
వయసు పైబడటం వల్ల వచ్చే పరిణామాలను ఇంగ్లిష్లో ఏజింగ్ అని వ్యవహరిస్తుండటం మామూలే. ఈ ఏజింగ్ ప్రక్రియకు ఏ అవయవమూ అతీతం కాదు. కాకపోతే చర్మం వంటి కొన్ని భాగాల్లో ముడుతల పడటం, వెంట్రుకలు అయితే తెల్లబడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే మెదడు కూడా ఏజింగ్కు గురవుతుంది. కానీ స్లో జాగింగి ఆ ప్రక్రియను స్లో చేస్తుంది. ఈ విషయాన్ని ఒకటి రెండేళ్లు కాదు... సరిగ్గా 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు కొందరు న్యూరాలజీ నిపుణులు. ఈ అధ్యయనం కోసం దాదాపు 1,500 మందికి పైగానే ఆరోగ్యకరమైన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఎంపిక చేసుకున్న వారందరూ 40 ఏళ్ల వయసు వారే. ఎంపిక సమయంలో వారికి బీపీ, గుండెజబ్బుల వంటి సమస్యలతో పాటు మతిమరుపు (డిమెన్షియా) వంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకున్నారు. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారికి తొలుత ఎమ్మారై పరీక్షతో పాటు కొన్ని మెదడుకు సంబంధించిన పరీక్షలూ చేశారు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు వారు క్రమం తప్పకుండా ట్రెడ్మిల్పై స్లో జాగింగ్ చేయించారు. అయితే వీళ్లలో కొందరు వ్యాయామం చేసినప్పటికీ అడపా దడపా మాత్రమే దాన్ని కొనసాగించారట. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఈ రెండు గ్రూపుల వారికీ మళ్లీ మెదడుకు సంబంధించిన ఎమ్మారై వంటి పరీక్షలు మళ్లీ చేయించారు. అడపాదడపా మాత్రమే వ్యాయామం చేసిన వారితో పోలిస్తే... క్రమం తప్పకుండా జాగింగ్ చేసిన వారందరిలోనూ సాధారణంగా 60 ఏళ్ల తర్వాత సహజంగా కనిపించే డిమెన్షియా వంటి సమస్యలు కనిపించలేదని గుర్తించారు పరిశోధకులు. ఇదే అంశాన్ని పరిశోధకులు ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్లో పొందుపరిచారు. -
సింగిల్ జాగ్రత్త... డబుల్ మేలు!
పరిపరిశోధన గుండెకు మంచి కోరుతూ మనం పాటించే అంశాలు... మెదడుకూ మేలు చేస్తాయి. గుండె, మెదడు విషయంలో ఇది చాలా ఎక్కువని తేలింది. అమెరికాకు చెందిన పరిశోధకులు దాదాపు వెయ్యికి మందికి పైగా వ్యక్తులపై ఆరేళ్ల పాటు నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసింది. ఇందుకోసం సగటు వయసు 72 ఏళ్లు ఉన్న 1,033 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వారంతా గుండె జబ్బుల నివారణ కోసం పాటించాల్సిన నియమాలను పాటించేలా చూశారు. వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా, బరువును అదుపులో ఉంచుకునేలా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా, పొగాకుకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరేళ్ల తర్వాత వారిలోని మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి వంటి అంశాలను పరీక్షించారు. అప్పుడు వాళ్లలోని చాలామందిలో మెదడు పనితీరు (ప్రాసిసెంగ్) వేగం, జ్ఞాపకశక్తి, ఏదైనా పనులను అర్థం చేసుకునే అవగాహన వంటి అంశాలు చాలా చురుగ్గా ఉన్నాయని తేలింది. ఇదే విషయాన్ని ఆ పరిశోధకులు ‘ద జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురించారు. -
నేను మీ నాలుకను
రుచులు తెలిసేది నా వల్లనే ఆనంద్ తినేటప్పుడు రకరకాల రుచులను ఆస్వాదిస్తుంటాడు. అతడికి అవన్నీ తెలిసేది నా వల్లనే. చిన్న చిన్న కండరాలు, చాలా నరాలతో కూడి ఉంటాన్నేను. నా పైవైపు ఉపరితలం మీద చిన్న చిన్న బుడిపెల్లా కనిపించే కండరాలపై రుచి మొగ్గలు (టేస్ట్బడ్స్) ఉంటాయి. ఇవి రుచులను గ్రహించి, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. అలాగని రుచిమొగ్గలు నా వరకే పరిమితం కాదు. అవి ఆనంద్ నోట్లోని మిగిలిన భాగాల్లోనూ ఉంటాయి. అయితే, ఏదైనా ఆహారం అసలు రుచి తెలియాలంటే, అది ద్రవరూపం సంతరించుకోవాల్సిందే. లాలాజలంతో కలిసి ఆహారం ద్రవరూపం సంతరించుకున్నప్పుడు నా రుచిమొగ్గల్లో జరిగే సూక్ష్మ విద్యుత్ రసాయనిక చర్య ఫలితంగా రుచుల సంకేతం మెదడుకు చేరుతుంది. అప్పుడు ఆ రుచులు బాగున్నదీ, లేనిదీ మెదడు తీర్పునిస్తుంది. ఉదాహరణకు ఐస్క్రీమ్ రుచి అద్భుతంగా ఉందనో, కాకరకాయ కూర రుచి మరీ చేదుగా ఉందనో... అలాగని అందరికీ అన్ని రుచులు ఒకేలా ఉండవు. రుచుల పట్ల ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు సోడియం బెంజోయేట్ కొందరికి తీపిగా అనిపించవచ్చు. ఇంకొందరికి అదే పదార్థం పుల్లగా అనిపించవచ్చు. ఆనంద్కు ఏమీ తోచనప్పుడు ఒక్కోసారి నన్ను బయటకు తీసి, అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. తను దేని కోసం నన్ను చూస్తున్నాడో తనకే సరిగా తెలీదు. ఒకవేళ నాలో ఏదైనా తేడా కనిపిస్తే తన ఆరోగ్యానికి ఏదో జరిగిపోతోందని రకరకాల కారణాలు ఊహించుకుంటాడు. అయితే, అతడు ఊహించే కారణాలేవీ సరైనవి కావు. ఆనంద్ నోట్లో ఉండే నేను సుమారు పది సెంటీమీటర్ల పొడవు ఉంటాను. నా బరువు కాస్త అటూ ఇటుగా అరవై గ్రాములు ఉంటుంది. నేను ఆనంద్ నాలుకను. అతడి శరీరంలో నేనే బలమైన కండరాన్ని. నాపైనే ఒత్తిడి ఎక్కువ ఆనంద్ కళ్లు, చెవులతో పోలిస్తే, నేను భరించే ఒత్తిడే ఎక్కువ. అయినా, పంచేంద్రియాల జాబితాలో నా స్థానం చిట్టచివరే ఉంటుంది. ఇది అన్యాయం అంటాన్నేను. నేను లేకుండా ఆనంద్ని బతకమనండి చూద్దాం! పోనీ... అంతొద్దు. నన్ను నోటి బయటకు చాచి, పళ్ల మధ్య కాస్త కరిచిపట్టి ఆనంద్ని మాట్లాడమనండి చూద్దాం! అప్పుడు అతడి మాటలు ఎవరికైనా అర్థమవుతాయా? మాట్లాడటం, తినడం అనే ప్రక్రియల్లో నాది ప్రధాన పాత్ర. ఆహారాన్ని దంతాలు నములుతాయి గానీ, వాటి కింద సమానంగా నలిగేలా ఆహారాన్ని పంపేది నేనే. శుభ్రంగా నమిలిన ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యే స్థితిలో గొంతు ద్వారా కడుపులోకి చేరవేసేది కూడా నేనే. మింగాలంటే నేనుండాల్సిందే ముఖ్యంగా ఆహారాన్ని మింగే ప్రక్రియ నా సహకారం లేనిదే సాధ్యం కాదు. ఈ ప్రక్రియలో నా ముందు భాగం నోటి పైగోడను ఒత్తుతుంది. అప్పుడు నా వెనుక భాగం రంగంలోకి దిగి, నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. ఇదంతా చాలా సులువైన ప్రక్రియలా అనిపిస్తుంది. నరాలు, కండరాలు ఒక క్రమపద్ధతిలో వెనువెంటనే చేసే చర్యల సమాహారమే ఈ ప్రక్రియ. నిజానికి ఆనంద్కు మింగడం అనే ప్రక్రియ పుట్టుకకు ముందు నుంచే తెలుసు. అంటే, బతకడానికి మింగడం ఎంత కీలకమో అర్థమవుతుంది కదా! ఆరోగ్య సమస్యలను ప్రతిఫలిస్తాను నన్ను చూస్తే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఆనంద్ ఎనీమియాతో బాధపడుతున్నాడనుకోండి... నేను ఎర్రగా, మరీ మృదువుగా మారిపోతాను. జాండీస్ సోకిందనుకోండి... పసుపురంగులోకి మారుతాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను సాధారణంగా ఎర్రగా ఉంటాను. కొన్ని రకాల ఫంగస్ సోకితే నాపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు. అయితే, జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ మాత్రం నన్ను తెగ ఇబ్బందిపెడుతుంది. ఇది సోకితే, చక్కెర చేదుగా అనిపించవచ్చు. చాక్లెట్ ఉప్పగా అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నేను మళ్లీ సాధారణ స్థితికి వస్తాను. అరుదుగా నేను ఎదుర్కొనే మరో ఇబ్బంది ‘హైపోగ్యూసియా’. ఇది సోకితే, రుచులను గుర్తించే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఏది తిన్నా రుచీపచీ లేని చప్పిడి తిండి తిన్నట్లే ఉంటుంది. మరీ అరుదైన కేసుల్లోనైతే రుచిచూసే సామర్థ్యం పూర్తిగా నశిస్తుంది. రుచిమొగ్గల తీరుతెన్నుల్లో మార్పులు వంటి చాలా కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. ఈ సమస్య తలెత్తితే జీవితమే రుచిరహితంగా మారుతుంది. ఆనంద్ తరచుగా నన్ను అద్దంలో చూసుకుంటూ ఉంటాడు గానీ, అతడి ఆరోగ్యానికి నేనే అద్దాన్ని. మాట్లాడటం ఒక విన్యాసం ఇప్పుడంటే ఆనంద్ అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు గానీ, పుట్టినప్పుడు అతనికి ఏ మాటలూ రావు. రెండేళ్ల వయసు వరకు క్రమంగా రకరకాల ధ్వనులను అనుకరించేవాడు. చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దుగా పలికేవాడు. ఆ తర్వాత చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు. క్రమంగా నాతో రకరకాల విన్యాసాలు చేయించడం ద్వారా క్లిష్టమైన మాటలను కూడా పలకడం నేర్చుకున్నాడు. మాట్లాడేటప్పుడు నేనో జిమ్నాస్ట్లా పనిచేస్తాను. ఒక్కోసారి ఆనంద్ తనకు ఆలోచన వచ్చిందే తడవుగా ఎదుటివారితో మాట్లాడేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతడు నా కదలికలను గమనిస్తే అర్థమవుతుంది... నేనెంతటి విన్యాసాలు చేస్తూ ఉంటానో. అంతేకాదు, నేను నా బద్ధశత్రువులైన దంతాలతో సహజీవనం చేస్తుంటాను. అయినా, వాటి నుంచి నన్ను నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కాపాడుకుంటూనే ఉంటాను. వాటి మధ్య చిక్కుకుని, నేను నలిగిపోయిన సందర్భాలు చాలా అరుదు. ఇక నా దిగువ భాగంలో చిన్న తీగ నోటి అడుగు భాగాన్ని అతుక్కుని ఉంటుంది. నా కదలికలన్నింటికీ ఈ తీగే ఆధారం. ఒకవేళ ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం ఉండేది కాదు. ఇప్పుడైతే ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేయడానికి వీలవుతోంది. -
ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..
సాక్షి, స్కూల్ ఎడిషన్: సంతోషం, కోపం, బాధ, ఆందోళన వంటి అనేక భావనలు మనలో సహజంగా కలుగుతాయి. వీటన్నింటికీ మన మెదడులోని రసాయనాలే కారణం. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిన అంశం. మెదడులో విడుదలయ్యే నాడీ రసాయనాల వల్లే సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ రసాయనాలను అదుపులో పెట్టుకుంటే ఎక్కువ ఆనందంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల మాట. మన చుట్టూ ఉండే పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివి ఒత్తిడికి గురిచేస్తాయి. ఫలితంగా ఆనందం దూరమవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మెదడులో హ్యాప్పీ కెమికల్స్ విడుదలయ్యేలా చూసుకుంటే మళ్లీ సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలయ్యేందుకు ఏం చేయాలో.. దీనివల్ల సంతోషాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.. చల్లని నీటితో.. ఇది రోజూ క్రమం తప్పకుండా చేసేపనే. చల్లని నీరు తీసుకుని కాస్త ముఖంపై చల్లుకోండి. దీనివల్ల గుండె వేగం తగ్గి, వేగస్ అనే ఓ కీలకమైన నాడీ సంబంధిత నరం ఉత్తేజితమవుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు ఎక్కువగా ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి. వేగస్ ఉత్తేజితమైతే జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. మన మూడ్ని, ఆలోచనల్ని మార్చేందుకు పరోక్షంగా ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. సన్నిహితులతో మమేకం.. మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా, ఒకే ప్లేస్లో ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నించండి. లేదా ఏదైనా బుక్స్టోర్, కాఫీ షాప్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్కు వెళ్లండి. అక్కడి వారితో సంభాషించండి. ఇలా ఇతరులతో సరదాగా మాట్లాడడం, ఎంజాయ్ చేయడం వల్ల ఆక్సీటోసిన్ విడుదలవుతుంది. దీంతోపాటు సెరటోనిన్ కూడా మెరుగుపడుతుంది. ఈ రెండు రసాయనాలు ఉత్సాహాన్ని కలిగించేవే. అందువల్ల ఇతరులతో సన్నిహితంగా మెదలడం వల్ల మెదడుకు ఈ రసాయనాల వల్ల కొత్త శక్తి లభిస్తుంది. కేవలం తోటివారితో మాట్లాడడం మాత్రమే కాదు. గార్డెనింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ వినడం వంటి పనులు కూడా చురుకుదనాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు.. సంతోషంగా ఉన్నప్పుడే నవ్వగలుగుతాం అనేది సత్యమే. కానీ నవ్వడం వల్ల కూడా సంతోషం కలుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. వీలైనంత వరకు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. చిరునవ్వు అయినా, బిగ్గరగా నవ్వినా సంతోషం కలుగుతుంది. కృత్రిమంగా నవ్వినా, సహజంగా నవ్వినా మెదడులో కలిగే స్పందనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆనందాన్ని కోరుకున్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దీంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. సూర్యకాంతితో చురుకుదనం.. వీలున్నంత వరకు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆరుబయట తిరగండి. లేదా ఆఫీస్ వేళల్లో కాస్త సూర్యకాంతి పడేలా చూసుకోండి. అలాగని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. సూర్యకాంతి మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది మెదడుకు మంచి శక్తినిస్తూ, మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరంలో మెలటోనిన్ విడుదలయ్యేలా కూడా సూర్యకాంతి తోడ్పడుతుంది. ఇది మంచి నిద్రను అందిస్తుంది. పెంపుడు జంతువులతో కాలక్షేపం.. కుక్క, పిల్లి, కుందేలు, లేదా ఏదైనా పక్షి వంటి పెంపుడు జీవులతో గడపడం వల్ల మొదడుకు కొత్త శక్తి చేకూరి ఆనందం కలుగుతుంది. పెంపుడు జీవులతో కాస్సేపు గడపడం వల్ల మెదడులో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, డోపమైన్ వంటి హ్యాప్పీ కెమికల్స్ విడుదలవుతాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యపు అలవాట్లు బాగుంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముఖ్యంగా శునకాలతో ఆడుకునే వారిలో ఆక్సిటోసిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు జపాన్ అధ్యయనం వెల్లడించింది. అందుకే ఏదైనా పెంపుడు జంతువుకు ఇంట్లో చోటు కల్పించండి. -
వెన్ను మార్గంలోకి మెదడు!
మెడిక్షనరీ మెదడుకు ఉన్న స్థలం సరిపోక కొందరిలో అది వెన్ను మార్గంలోకి జారుతుంది. ఈ కండిషన్నే కెయరీ మాల్ఫార్మేషన్ అనీ లేదా ఆర్నాల్డ్ కెయరీ మాల్ఫార్మేషన్ అని అంటారు. ఇది చాలా అరుదైన కండిషన్. ఇలా జరిగినప్పుడు మెదడులోంచి వెన్నుపాములోకి వెళ్లే ఫొరామెన్ మాగ్నమ్ అనే చిన్న దారిలోంచి మెదడులోని సెరెబెల్లమ్ వెన్ను మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ కండిషన్ ఏర్పడినప్పుడు రోగుల్లో తలనొప్పి, అలసట, కొన్ని కండరాలు బలహీనం కావడం, మింగడంలో ఇబ్బంది, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం, మగత, వికారం, చెవిలో గుయ్ అనే శబ్దం, మెడనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎమ్మారై పరీక్ష ద్వారా కెయరీ మాల్ఫార్మేషన్ను నిర్ధారణ చేస్తారు. దీనికి సర్జరీ / డీకంప్రెసివ్ సర్జరీతో పాటు ఆయా లక్షణాలను తగ్గించే మేనేజ్మెంట్ వంటివి చేసి చికిత్స అందిస్తారు. -
మెదడుకు పదును పెట్టే ఆహారం
ఎగ్జామ్ టిప్స్ బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి.అవిసెగింజలు: ఏయల్ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి.కాఫీ-కెఫీన్ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి.మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులోని న్యూరోట్రాన్సిస్టర్స్ చదువుకోవాలనే మూడ్ను పెంచుతాయి. అవకాడో - ఇందులోని మేలు చేసే కొవ్వులు రక్త సరఫరా పెంచి మెదడును చురుగ్గా పనిచేయడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.గుడ్లు, గుడ్లలోని కొలిన్ అనే పోషకం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. తృణధాన్యాలు, ఓట్మీల్ లాంటి ముడిధాన్యాలు తక్షణ శక్తిని ఇచ్చి బ్రెయిన్ పవర్ పెంచుతాయి. ఇందులోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఒమెగా కొవ్వులు వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు కూడా లభిస్తాయి.చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచును.{బకోలి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మెదడును చురుగ్గా చేస్తుంది. డా. కె. వాణిశ్రీ న్యూట్రిషన్ కన్సల్టెంట్ తన్వికా డైట్ఫిట్ -
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం
గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజు ద్వారా సరఫరా అయ్యి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి.యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పళ్లు, కూరగాయల వల్ల జ్ఞానం వృద్ధి చెంది పిల్లల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.పెరుగులోని మాంసకృత్తులు, మేలు చేసే కొవ్వు, విటమిన్-బి మెదడుకు గ్రాహ్యశక్తిని పెంచుతాయి. చేపలలోని ఒమేగా, విటమిన్-డి మతిమరుపును తగ్గించి గ్రాహ్య శక్తిని పెంచుతుంది. నట్ బటర్ (వెన్న) ఒమెగ-3 ఫ్యాట్స్ మెదడు సరిగా పనిచేయుటకు తోడ్పడును. ఆకుకూరలు పాలకూరలోని విటమిన్స్ మతిమరుపును తగ్గిస్తాయి. ఓట్మీల్లోని మాంసకృత్తులు, పీచు పదార్థాలు మెదడులోని ధమనులను సరిగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.మంచి నీరు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్కు లోనై చదివినవి గుర్తు ఉండక పరీక్షల్లో సరిగ్గా రాణించలేరు.గుమ్మడి గింజలలో ఉన్న జింక్ మెదడుకు పదును పెడుతుంది. ఆపిల్స్ మరియు బాదంలోని కొన్ని పదార్థాలు మెదడులోని నరాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. -
మెదడు బాగా పనిచేయాలంటే..
న్యూ ఢిల్లీ: మెదడు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా ఎక్కువ భాషలను నేర్చుకోవడం, ఉపయోగించడం వలన వృత్తి పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. భారతీయులపై జరిపిన పరిశోధనలో నిర్థారించింది. ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఒక భాష నుండి ఇంకో భాషలోకి తమ మెదళ్లను సందర్భానుసారం ట్యూన్ చేసుకొని ఉపయోగించడం మూలంగా మెదడు నిర్మాణాత్మకంగా బాగా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే భాషలో ప్రావీణ్యం ఉన్నవారితో పోల్చితే.. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించేవారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నయని పరిశీలనలో తేలింది. దేశంలో మెదడు సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
మత్తెక్కువయితే మెదడు గోవింద!
న్యూయార్క్: కొకైన్ వంటి మత్తుపదార్థాలను శృతిమించి ఉపయోగించడంవల్ల మెదడుకు తీరని హాని కలుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అత్యధిక కొకైన్ వాడకంవల్ల బ్రెయిన్ తనను తానే తినేస్తుందని, మెదడులోని కణాలు వాటిని అవే తినేస్తాయని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు అధ్యయనకారులు తెలియజేస్తూ 'పెద్దమొత్తంలో కొకైన్ తీసుకోవడం మూలంగా మెదడులో నియంత్రణ అదుపుతప్పి, అందులోని కణజాలం పూర్తిగా హరించుకోవడం ప్రారంభమవుతుంది. అందులోని కణాలు వాటిని అవే తినేస్తాయి. దీనినే ఆటోపగి అంటారు' అని వారు చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. గర్భిణీగా ఉన్నవారు కొకైన్ తీసుకున్నా కూడా వారి గర్భంలోని శిశువు మెదడులో కూడా మృతకణాలు కనిపించినట్లు తెలిపారు. -
నేను మీ మెదడుని
నేను ఆనంద్ మెదడును. అతడి శరీరభాగాన్ని మాత్రమే కాదు, తానే నేను... నేనే తాను అనుకోవచ్చు. నేను అతడి వ్యక్తిత్వాన్ని. అతడి ప్రతిస్పందనల సమాహారాన్ని. అతడి మానసిక సామర్థ్యాన్ని. అతడి తలలో ఉండే నేను, కాస్త తెలుపుగా, కాస్త బూడిద రంగులో పుట్టగొడుగు ఆకారంలో ఉంటాను. నా చుట్టూ పుర్రె ఎముకలతో కట్టుదిట్టమైన కోటలాంటి నిర్మాణం ఉంటుంది. పుర్రె ఎముకల వెనుక మెత్తని గుజ్జులా ఉండే నా చుట్టూ నీటి లాంటి ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే నన్ను బయటి షాక్ల నుంచి కాపాడుతూ ఉంటుంది. నాకు అవసరమైన గ్లూకోజ్ తప్ప అనవసర పదార్థమేదీ నాలోకి చేరకుండా నిరోధించే ఏర్పాటు కూడా నాలోనే ఉంది. ఈ ఏర్పాటు వల్లే బ్యాక్టీరియా వంటివి నాలోకి చేరలేవు. ఇంత కట్టుదిట్టమైన నిర్మాణం ఉన్నా, నా బరువు దాదాపు కిలోన్నర మాత్రమే. నాలో ఉండేది 85 శాతం నీరే కాగా, మిగిలినవన్నీ కొవ్వు కణాలు. నాలో దాదాపు 3 వేల కోట్ల కణాలుంటాయి. వీటినే న్యూరాన్లు అంటారు. నాలోని ఒక్కో న్యూరాన్ ఆనంద్ శరీరంలోని దాదాపు 64 వేల ఇతర కణాలతో అనుసంధానమై ఉంటుంది. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం నాది. ప్రపంచంలోని ఎలాంటి సూపర్ కంప్యూటర్ అయినా నా విధులను పూర్తిస్థాయిలో అనుకరించలేదు. నిద్రలోనూ పనిచేస్తుంటా! ఆనంద్ అనుకుంటూ ఉంటాడు... చెవులతో వింటున్నాననీ, నాలుకతో రుచి చూస్తున్నాననీ, చేతులతో స్పర్శిస్తున్నాననీ... నిజానికి ఇవన్నీ నాలో జరిగే చర్యలే! చెవులు, నాలుక, చేతులు... ఇవన్నీ కేవలం సమాచారాన్ని గ్రహిస్తాయంతే! ఆనంద్కు ఒంట్లో నలతగా ఉన్నా, ఆకలి వేసినా ఆ విషయాన్ని నేనే అతడికి చెబుతాను. అతడి భావోద్వేగాలను, లైంగిక వాంఛలను... ఇలాంటి వాటన్నింటినీ నేనే నియంత్రిస్తాను. ఆనంద్ నిద్రిస్తున్న సమయంలో కూడా నేను పనిచేస్తూనే ఉంటాను. మెలకువలో ఉన్నప్పుడు అతడికి కుప్పలు తెప్పలుగా అందే సమాచారాన్ని ఒక గాటన పెడుతూనే ఉంటాను. అలా వచ్చి పడ్డ సమాచారంలో ఏది ముఖ్యమైనదో నేనే నిర్ణయిస్తాను. మిగిలిన వాటిని ఆనంద్ పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఉదాహరణకు ఆనంద్ తనకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ చేతిలో ఒక నవల పుచ్చుకుని చదువుతూ ఉంటాడు. నవల ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉందనుకోండి... ఆనంద్కు తాను విన్న సంగీతమేదీ పెద్దగా గుర్తుండదు. ఆపదల్లో అప్రమత్తం చేస్తా! ఏదైనా ఆపద ఎదురైందనుకోండి. ఆనంద్ను వెంటనే అప్రమత్తం చేస్తా. ఉదాహరణకు ఆనంద్ నడుస్తూ ఉన్నప్పుడు జారి పడబోయాడనుకోండి.... వెంటనే నిలదొక్కుకునేలా నేను అతడి భుజాలకు సంకేతాలు పంపుతాను. అయినప్పటికీ ఆనంద్ జారి పడ్డాడనుకోండి... అప్పుడు ఏవైనా గాయాలైతే, ఆ సంగతిని ఆనంద్కు వెంటనే చెబుతాను. నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆనంద్ను హెచ్చరించేందుకు వీలుగా ఆ సంఘటనను నా మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటాను. ఇలాంటి ఆపద సమయాల్లోనే కాదు, నిరంతరం నేను వేలాది పనులు చేస్తూనే ఉంటాను. పదిరెట్లు ఆక్సిజన్ కావాలి! ఆనంద్ శ్వాసక్రియను నేనే పర్యవేక్షిస్తుంటాను. ఒకవేళ అతడి రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగితే, అతడికి మరింత ఆక్సిజన్ అందాలని నేనే అప్రమత్తం చేస్తాను. ఈలోగా అతడి శ్వాసవేగాన్ని పరిస్థితికి అనుగుణంగా సర్దుకునేలా చేస్తాను. ఆనంద్ శరీరం బరువులో నా బరువు రెండు శాతమే. అయితే, నాకు అతడు పీల్చే ఆక్సిజన్లో ఇరవై శాతం అవసరం. అంటే, మిగిలిన శరీర భాగాలతో పోలిస్తే, నాకు పదిరెట్లు ఎక్కువగా ఆక్సిజన్ కావాలి. తగినంత ఆక్సిజన్ నిరంతరం అందుతూ ఉంటేనే నేను సక్రమంగా పనిచేయగలను. అలాగే, నాకు నిరంతరాయంగా గ్లూకోజ్ కూడా సరఫరా అవుతూ ఉండాలి. ఆనంద్ ఒకవేళ తీవ్రమైన ఆకలితో మలమలమాడుతున్నా, అతడి శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు ఎక్కడ ఉన్నాయా అని వెతికి మరీ వాడుకుంటాను. నాకు గ్లూకోజ్ సరఫరా కాసేపు తగ్గిందంటే, ఆనంద్ స్పృహ కోల్పోతాడు. కొన్ని నిమిషాల సేపు నాకు గ్లూకోజ్ పూర్తిగా అందని పరిస్థితి ఏర్పడితే, ఆనంద్ అపాయంలో పడినట్లే. అలాంటప్పుడు ఆనంద్కు పక్షవాతమైనా రావచ్చు లేదా మృత్యువైనా రావచ్చు. నొప్పి తెలుస్తుంది... నొప్పి ఉండదు! ఇంతవరకు ఎవరూ అన్వేషించని ఖండంలా ఉంటాను నేను. ఇప్పటి వరకు నన్ను మ్యాప్ చేసేందుకు ప్రయత్నించిన వారంతా ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ప్రపంచం ముందు ఉంచారు. నేనొక అంతుచిక్కని అద్భుతాన్ని. నొప్పి, బాధ వంటి వాటిని నేను అనుభూతి చెందుతూనే ఉన్నా, నాకు ఎలాంటి నొప్పీ ఉండదు. నన్ను కోసినా నాకు నొప్పి తెలీదు. అందుకే నాకు శస్త్రచికిత్స చేయాల్సి వస్తే, రోగి మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స చేస్తారు. ఇప్పటి వరకు నన్ను మ్యాప్ చేసిన వైద్యపరిశోధకులందరూ నాలోని ప్రాథమికమైన భాగాలను, వాటి విధులను గుర్తిస్తూ కేవలం ఔట్లైన్ను మాత్రమే రూపొందించగలిగారు. వెనుకభాగం చూపును, పక్క భాగాలు వినికిడిని గ్రహిస్తాయని గుర్తించగలిగారు. మరీ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పరిశోధకులు నాలోని ‘ఆనంద కేంద్రాన్ని’ (ప్లెజర్ సెంటర్) కూడా గుర్తించారు. ప్లెజర్ సెంటర్కి ప్రేరణ కలిగినప్పుడల్లా ఆనంద్ సంతోషంగా ఉంటాడు. అదొక్కటే అసాధ్యం! నాలో ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా, మిగిలిన అవయవాల్లా నేను నా కణాలను పునరుత్పత్తి చేసుకోలేను. నాకు సాధ్యం కానిది అదొక్కటే. శరీరంలోని చర్మం, లివర్, రక్తకణాలు వంటివేవి దెబ్బతిన్నా... అవి తిరిగి తమ నష్టాన్ని భర్తీ చేసుకోగలవు. అయితే, నాలో ఏ ఒక్క కణం నాశనమైనా అది ఎప్పటికీ తిరిగి భర్తీ కాదు. ఆనంద్కు ఇప్పటికే 40 ప్లస్ కదా! ఈ వయసులో అతడు ప్రతిరోజూ దాదాపు వెయ్యి న్యూరాన్లను కోల్పోతూ ఉంటాడు. వయసు పెరిగే కొద్దీ నా బరువు కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అయితే, ఈ నష్టం వల్ల ఎలాంటి చేటు లేకుండా నన్ను నేను కాపాడుకుంటూనే ఉంటాను. ఓ వెయ్యికణాలు నశించినా, మిగిలిన కణాలు ఆ నష్టాన్ని గుర్తించలేవు. బాగా ఎక్కువ కణాలు నశిస్తేనే ఇబ్బంది. అలాంటప్పుడే ఆనంద్కు వినికిడి శక్తి, ఆఘ్రాణ శక్తి, రుచులను గ్రహించే శక్తి తగ్గిపోతాయి. పేర్లు, ముఖ్యమైన తేదీలు, టెలిఫోన్ నంబర్లు వంటివి స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి. అయితే, బాగా ముఖ్యమైన విషయాలను నేను తుది వరకు పదిలంగానే కాపాడుకుంటాను. నాలో కుడి ఎడమలు నేను ఒకే అవయవాన్ని అయినా నాలో కుడి భాగం, ఎడమ భాగం ఉంటాయి. ఎక్కువ మందిలో నాలోని ఎడమ భాగమే కీలకంగా పనిచేస్తుంది. కుడిచేతి వాటంతో పనిచేసే వాళ్లను నియంత్రించేది ఇదే. ఈ తీరులోనే నాలోని కుడిభాగం కీలకంగా ఉన్నవాళ్లు ఎడమచేతి వాటానికి చెందినవాళ్లయి ఉంటారు. కుడి భాగాన్ని (రైట్ హెమిస్పియర్), ఎడమ భాగాన్ని (లెఫ్ట్ హెమిస్పియర్) అంటారు. చాలామందిలాగే ఆనంద్ది కూడా కుడిచేతి వాటమే. అతడి చేతిరాతను, నడిచే శక్తిని, లెక్కలు చేసే శక్తిని, విషయాలను అర్థం చేసుకునే విశ్లేషణాత్మక శక్తిని, గుండె పనితీరును, శ్వాసక్రియను నియంత్రించేది నాలోని ఎడమ భాగమే. నాలోని కుడి భాగం కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకశక్తిని, ఆలోచనల్లో సమగ్రతను నియంత్రిస్తుంది. నా దిగువగా ఉండే బ్రెయిన్స్టెమ్ కూడా నాలోని ఎడమ భాగం తరహాలోనే గుండె పనితీరును, శ్వాసక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. స్పీడులో బుల్లెట్ ట్రెయిన్ నా న్యూరాన్లు ఒక ఫిలమెంట్కు అతుక్కుని ఉన్న సాలెపురుగు ఆకారంలో ఉంటాయి. వీటి ద్వారా సమాచారం శరీరమంతటికీ శరవేగంగా ప్రసారమవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్కు అతడి కాలి ద్వారా దానికి అనుసంధానమైన న్యూరాన్ నుంచి ఏదైనా సిగ్నల్ అందిందనుకోండి. మిగిలిన న్యూరాన్ల ద్వారా రెప్పపాటులోనే అది శరీరమంతటికీ చేరుతుంది. న్యూరాన్ల ద్వారా సిగ్నల్స్ గంటకు 340 కిలోమీటర్ల వేగంతో శరీరం అంతటికీ ప్రసారమవుతాయి. ఈ వేగం దాదాపు బుల్లెట్ రైళ్ల వేగంతో సమానం. అయితే, నాలోని ఏ న్యూరాన్ కూడా మరో న్యూరాన్కు అతుక్కుని ఉండదు. అయినా, నాలో జరిగే జీవరసాయన చర్యల ఫలితంగా ఈ సిగ్నల్స్ మెరుపువేగంలో శరీరమంతటికీ ప్రసారమవుతాయి. మందుతో ఇబ్బందే! ఆనంద్కు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటాడు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వంటివి నాకు చేరుతాయి. మందుల ప్రభావంతో అతడి ఆరోగ్య సమస్యలూ కొంతకాలానికి దూరమవుతాయి. దురదృష్టవశాత్తూ ఒకవేళ అతడు న్యూ ఇయర్ పార్టీలో మందు కొట్టినా, ఏ రేవ్ పార్టీల్లోనో మత్తుమందులు వంటివి తీసుకున్నా అవి కూడా నాకే చేరుతాయి. ఆల్కహాల్ వంటి పదార్థాలు నాకు చేరితే, నా సాధారణమైన పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటివి మోతాదు మించితే ఆనంద్కు మాట తడబడటం, తూలడం, అంతుచిక్కని భ్రమలకు లోనవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇక పొగతాగే అలవాటు వల్ల కూడా నాకు ఇబ్బందులు తప్పవు. ఈ పాడు అలవాటు వల్ల నాలోని సన్నని రక్తనాళాలు బలహీనపడిపోతాయి. దురదృష్టవశాత్తూ ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే ముప్పే. అలాంటి పరిస్థితుల్లో పక్షవాతం రావడం, జ్ఞాపకశక్తి నశించడం, మతిభ్రమించడం వంటి ప్రమాదాలతో పాటు ఒక్కోసారి మృత్యువు కూడా తప్పకపోవచ్చు. -
చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!
జ్ఞానేంద్రియాల్లో ముక్కు, శ్వాస పీల్చుకోవడంతోపాటు, వాసనలను పసికట్టేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెదడులో భావాలను కలిగించే 'లిమ్బిక్' వ్యవస్థ వల్ల ముక్కు వాసనలను పసిగట్టగల్గుతుంది. ఇలా ముక్కునుంచి మెదడుకు సంబంధం ఉండటం మనకు తెలుసు.. కానీ ఆ బాలుడికి ఏకంగా మెదడే ముక్కులో పెరుగుతుండటం వైద్య రంగాన్నే విస్తుపోయేలా చేసింది. అయితే అనేక ఆపరేషన్ల తర్వాత బిర్మింగమ్ పిల్లల ఆస్పత్రి వైద్యులు చిన్నారి లోపాన్ని సరి చేయగలిగారు. పుట్టుకతో వచ్చిన లోపంతో ఇబ్బందిపడుతున్న వేల్స్ మీస్టెగ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్క నెల్ల ఒల్లీ ట్రీజీజ్ కు మెదడు భాగం చిట్లి దాని ద్వారా ముక్కులో ఓ తిత్తిలా మెదడు పెరగటం ప్రారంభించింది. వైద్య శాస్త్రంలో ఎన్సెఫలోసెల్ గా పిలిచే ఈ పరిస్థితిని గుర్తించేందుకు డాక్టర్లు కూడ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చిన్నారికి ఇరవై వారాల వయసులో స్కాన్ తీసిన వైద్యులు ముక్కులో కండ పెరుగుతున్నట్లుగా భావించారు. ఒల్లీ తల్లి ఇరవై రెండేళ్ళ యామీ... వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కు గురైంది. భర్తకు దూరమైన యామీ ఒల్లీని తన వరంగా భావించింది. చిన్నారికి ఏమౌతుందోనని ఖంగారు పడిపోయింది. తొమ్మిది నెలలు గడిచే సరికి ఒల్లీ రూపం పినాచియో బొమ్మలా మారుతూ వచ్చింది. దీంతో వైద్యులు అతడి ముక్కుకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేదంటే అతడు ఊపిరి పీల్చడం కూడ కష్టంగా మారుతుందని యామీకి చెప్పారు. ఆమెకు అవగాహన కూడ కల్పించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత బిడ్డ ముక్కులో పెరుగుతున్నది కండకాదు.. ఓ తిత్తిలా పెరుగుతున్న మెదడు అని తేల్చారు. పుట్టుకతో వచ్చిన లోపంగా కూడ గుర్తించారు. 2014 నవంబర్ లో ఒల్లీకి బిర్మింగమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండుగంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. పుర్రె భాగాన్ని కత్తిరించి మెదడు నుంచి ముక్కులోకి అధికంగా ఉన్న తిత్తివంటి ఫ్లూయిడ్ భాగాన్ని తీసి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం ఒల్లీ పూర్తిగా కోలుకున్నాడు. నాలుగేళ్ళ తన అక్క అన్నతో హాయిగా ఆడుకుంటున్నాడు. అయితే చిన్నారికి భవిష్యత్తులో చికిత్సలు చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్నిప్రస్తుతానికి వైద్యులు నిర్థారించ లేదు. అతడి మెదడు పెరుగుదలను బట్టి భవిష్యత్ చికిత్స ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. -
‘టెన్స్’ వాడితే మీ నడుము టెన్షన్ దూరం!
హోమియో కౌన్సెలింగ్ మా పాప వయసు మూడున్నరేళ్లు. ఇప్పటినుంచే చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. అడిగినవి ఇవ్వకపోతే తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేస్తోంది. డాక్టర్కు చూపిస్తే ఆటిజమ్ కావొచ్చని అన్నారు. దీనికి హోమియోలో మందులున్నాయా? - పూర్ణిమ, మంచిర్యాల ఆటిజమ్ మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఆటిజమ్లో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజమ్ ఉన్న వారందరూ ఒకేలా ఉండకపోవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే అన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజమ్కు దోహదం చేస్తున్నట్లు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా కారణం కావచ్చు. లక్షణాలు: అకారణంగా ఏడుస్తూ ఉండటం, గంటల తరబడి స్తబ్దుగా ఉండటం, వయసుకు తగినట్టుగా శారీరక, మానసిక అభివృద్ధి లేకపోవడం మొదలైనవి. ఆటిస్టిక్ డిజార్డర్: ఎక్కువగా కనపడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని చైల్డ్హుడ్ ఆటిజం అంటారు. థాట్స్ డిజార్డర్: ఇది ఆడపిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇందులో పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు కాని తర్వాత నెమ్మదిగా లక్షణాలు బయటపడుతుంటాయి. ఇవి రెండు మూడేళ్లలోనే వేగం అవుతాయి. అప్పటికి వచ్చిన ఒకటిరెండు మాటలూ మర్చిపోతారు. ఆస్పర్జెర్స్ డిజార్డర్: సాధారణంగా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి కానీ ఈ ఆటిజంలో మాటలు మామూలు గానే ఉంటాయి. నలుగురిలోకీ వెళ్లడం, తెలివితేటలు బాగానే ఉంటాయి. కాని తక్కువ మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పి ఆపేస్తారు. శరీరాకృతి చిన్నగా ఉంటుంది. మిగతా ఆటిజమ్ పిల్లల్తో పోలిస్తే వీరు చురుగ్గానే ఉంటారు. అయితే ప్రవర్తన సమస్యలు, కోపోద్రేకాలు అధికం. చైల్డ్హుడ్ డిజింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజమ్లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లడం మొదలవుతుంది. లక్షణాలు చాలా వేగంగా కనపడతాయి. ముఖం రఫ్గా, ముదిరినట్టుగా ఉండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనపడతాయి. మీరు చె బుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు ఆటిజమ్ అంత తీవ్రంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా దారిలోకి వస్తారు. అయితే మీరు అశ్రద్ధ చేయకుండా నిపుణులైన హోమియో డాక్టర్ను కలిసి, వారి పర్యవేక్షణలో మీ పాపకు చికిత్స చేయించడం మంచిది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ నా వయసు 75 ఏళ్లు. డిస్క్ ప్రొలాప్స్ సమస్యతో బాధపడుతున్నాను. రెండేళ్ల కిందటే ఇలాంటి సమస్య వస్తే ఫిజియోథెరపీ తీసుకొమ్మని డాక్టర్ సూచించారు. అప్పుడు లంబార్ ట్రాక్షన్, స్టిమ్యులేషన్ ప్రక్రియలను 15 రోజుల పాటు తీసుకున్నాను. అప్పట్నుంచి బాగానే ఉంది. కానీ ఇటీవల మళ్లీ అకస్మాత్తుగా భరించలేనంత నొప్పి వస్తోంది. మళ్లీ ట్రాక్షన్ తీసుకోవాలా? దయచేసి వివరించండి. - సాగర్రెడ్డి, కర్నూలు మరోసారి మీరు ట్రాక్షన్ తీసుకోవడం అంతగా సిఫార్సు చేయదగ్గ ప్రక్రియ కాదు. మీరు కాసిన్ని రోజులు బెడ్రెస్ట్ తీసుకోండి. ఈ టైమ్లో చదునుగా ఉండే పడకమీద పడుకోండి. ఆ పరుపు కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి. దీనితో పాటు ‘టెన్స్ అప్లికేషన్’ అనే ప్రక్రియ అవసరం. టెన్స్ అంటే... ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఈ ప్రక్రియ చర్మం ద్వారా అక్కడి నరాన్ని స్టిమ్యులేట్ (ఉత్తేజితం) చేస్తుంది. ఇవి పాకెట్ సైజ్లో దొరికేవి లభ్యమవుతుంటాయి. వీటిలో ఒకటి కనీసం ఎనిమిది గంటల పాటు ఉపయోగపడుతుంది. మీ పరిస్థితి మెరుగు పడుతున్న కొద్దీ దీని ఉపయోగాన్ని ఆరు నుంచి నాలుగు గంటలకు తగ్గించవచ్చు. దీన్ని మీరు కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు వాడితే మీ పరిస్థితి నార్మల్కు వస్తుంది. అయితే ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తించాలి. ఒకవేళ మీకు పేస్మేకర్ ఉపయోగించారా లేదా మీకు ఇతరత్రా ఏవైనా గుండె జబ్బులు ఉన్నా దీన్ని ఉపయోగించడం ఎంతమాత్రమూ మంచిది కాదు. మీరు దీని సహాయం తీసుకోదలిస్తే, దీన్ని ఎలా ఉపయోగించాలన్న అంశాన్ని మీకు ఫిజియోథెరపిస్ట్ వివరిస్తారు. మీరు లంబోశాక్రల్ బెల్ట్ కట్టుకోండి. ఆ తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ, బెల్ట్ కట్టుకునే వ్యవధిని తగ్గించుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత మీ నడుము నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలూ చేయించుకోవాలి. అవి మీకు మీ ఫిజియోథెరపిస్ట్ సూచిస్తారు. మీ వెన్ను మీద భారం వేసేవీ లేదా మీ కాళ్లను విపరీతంగా ఉపయోగించాల్సిన వ్యాయామాలు చేయవద్దు. అలాగే మీ శరీరంపై ఉపయోగించే మెషిన్లను సరిగ్గా ఉపయోగించాలి. వీటన్నింటికంటే చదునైన పడకపై వారం రోజుల పాటు తీసుకునే విశ్రాంతి మీకు బాగా ఉపకరిస్తుంది. మంచి రిలీఫ్ ఇస్తుంది. ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా పాప వయసు తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఎంతో హుషారుగా, చలాకీగాఉండే మా పాప ప్రవర్తనలో గత ఏడాదిగా ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడప్పుడు తన ఒక చేయి కొద్దిసేపు కొట్టుకుని ఆగిపోతున్నట్లు ఇటీవల మేము గమనించాం. మా పాపకు ఏ విషయం సరిగ్గా గుర్తుండడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఎవరికైనా మంచి వైద్యులకు చూపించండి అని టీచర్లు సూచించారు. మా పాపకు గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. తనకేమవుతుందో కూడా తను మాతో చెప్పుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది. చిన్న వయసులో మతిమరుపు వస్తుందా? అసలు మా పాపకు ఏమైంది? మా పాప మళ్లీ సాధారణంగా మారుతుందా? దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - హేమలత, విజయవాడ పిల్లల ప్రవర్తనలో మార్పులు, మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప మూర్ఛ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోండి. పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఉంటే వారి ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధి ఉంటే మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యధి ఏ వయస్సులోనైనా రావచ్చు. చాలా కారణాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. మెదడులో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దాంతో ప్రవర్తనలో కూడా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మీరు వైద్యులను సంప్రదిస్తే వైద్యులు మీతో, మీ పాపతో మాట్లాడి సమస్యను గుర్తిస్తారు. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలకు ఈ తరహా సమస్యలు పెడియాట్రిక్ న్యూరాలజిస్టులు, పెడియాట్రిక్ ఎపిలెప్టాలజిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, మార్కులు తక్కువగా వస్తున్నాయని మీ పాపను ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి సమస్య ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వ్యాధితత్వం, వయసు, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. డాక్టర్ బి.జె. రాజేష్ సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
మెదడు తినేస్తుంది!
ఈ జబ్బు ఉన్నవారు అత్యంత నాణ్యమైనదీ, ఖరీదైనదీ, అద్భుతమైన హంగులు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. సాధారణంగా తలలోని ముందుభాగంలో ఉండే మెదడు (ఫ్రంటల్లోబ్) దెబ్బతిన్న తర్వాత వాళ్లలో తిండియావ మొదలవుతుంది. ఇక దాంతో ఖరీదైన ఆ తిండిని తీవ్రమైనయావతో బకాసురుల్లా తినేస్తుంటారు. ఈ జబ్బును ‘గౌర్మాండ్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. ఇలాంటి ఖరీదైన ఆహారాన్ని తినాలనే ఈ విచిత్ర పరిస్థితి ప్రాణాపాయానికి దారితీయదు. నిరపాయకరమైన ఈ ఆహారపు అలవాటు మాత్రం పర్సుకు గండికొడుతుంది. జేబుకు చిల్లుపెడుతుంది. మెడిక్షనరీ -
ఆ కిక్కుతో మెదడు గుల్ల
లండన్: కిక్కు కోసం వాడే గంజాయి మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ముఖ్యంగా మెదడులోని రెండు అర్థగోళాలకు మధ్య సమన్వయం నిర్వహించే భాగంపై పనిచేయడం వలన తీవ్రమైన హానిని కలుగజేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బ్రిటన్లో ఈ తరహా మత్తు పదార్థాల వాడకం అధికంగా ఉంది. ఒక దశాబ్థ క్రితం నాటి గంజాయితో పోలిస్తే.. ప్రస్తుతం వాడుతున్నటువంటి ఎక్కువ గాడతగల గంజాయిలో టెట్రా హైడ్రో కనాబినల్(టీహెచ్సీ) మోతాదు అధికంగా ఉండటం వలన దీని దుష్పరిణామాలు మరింత పెరుగుతున్నట్లు లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల బృందం తెలిపింది. మెదడు పనితీరులో కీలకపాత్ర పోషించే కార్పస్ కెల్లోసమ్ అనే భాగంపై టీహెచ్సీ నేరుగా ప్రభావం చూపడంతో అనేక మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు గంజాయిని తీసుకోని వారి మెదడుతో పోల్చినప్పుడు తీసుకునే వారి మెదడులో విపరీతమైన మార్పులు గమనించారు. కార్సస్ కెల్లోసమ్లోని నాడీకణాల ఆక్సాన్లు టీహెచ్సీని ఎక్కువమోతాదులో గ్రహించే లక్షణం కలిగి ఉండటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఎమ్ఆర్ఐ ద్వారా పరిశీలించినప్పుడు గంజాయి బాధితుల మెదడులో తెలుపు భాగం తీవ్రంగా ప్రభావితమై ఉన్నట్లు తేలింది. వీరిలో అనేక మానసిక వ్యాధులకు గంజాయి వాడడం కారణంగా తెలిపారు. -
కునుకుతీస్తె మెదడులోన చురుకు పుడతది...
పరిపరి శోధన ‘కునుకుతీస్తె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి ఏనాడో చెప్పాడు. మనసు కుదుటపడటమే కాదు, కాస్తంత కునుకు వల్ల మెదడుకు చాలానే ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆధునిక పరిశోధకులు. మంచి నిద్ర వల్ల మెదడు ఆరోగ్యకరంగా ఉంటుందని, అలసి సొలసిన వేళల్లో కాస్తంత కునుకు తీశాక మరింత చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ మూడుగంటల కునుకు తీసిన తర్వాత జ్ఞాపకశక్తి ఇరవై శాతం మేరకు మెరుగుపడుతుందని కాలిఫోర్నియా వర్సిటీ సైకాలజీ విభాగం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. మధ్యాహ్నం కునుకు తీయని వారి కంటే, మూడు గంటలు కునుకు తీసిన వారు జ్ఞాపకశక్తి పరీక్షలో ఇరవై శాతం మేరకు అదనపు మార్కులు సాధించగలిగారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మాథ్యూ వాకర్ వెల్లడించారు. -
వారిలో విభిన్న ఆలోచనలు..
మనిషి సంఘజీవి. అతిని చుట్టూ రకరకాల అనుబంధాల తీగలను పెనవేసుకొని సమాజంలో మనుగడ సాగిస్తుంటాడు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కుటుంబంతో పాటు ఎలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపి ఒంటరి వారి ఆలోచనలు సంఘజీవులతో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయని నిర్ధారించారు. ఈ పరిశోధనలో ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన వారి మెదడు పనితీరు చాలా విభిన్నంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో తమకు ఎదురయ్యే ఆపదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా వారి మెదడు ట్యూన్ చేయబడి ఉంటుందని తెలిపారు. ఒంటరివారి ఆలోచనలు 'స్వీయ రక్షణ' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తించారు. నిజంగానే తమకు ఏ విధమైన హాని లేకపోయినప్పటికీ స్వీయ రక్షణకు ఒంటరి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కుటుంబాలతో గడిపే వారు ఇవ్వరని నిర్థారించారు. పరిశోధనలో భాగంగా 'బిలాంగ్', 'పార్టీ', 'ఎలోన్', 'జాయ్' అనే పదాలను విన్పించినప్పుడు మిగతావారితో పోల్చితే ఒంటరివారిలో విపరీతమైన ప్రతిస్పందనలు గమనించినట్లు గుర్తించారు. అయితే ఈ స్పందనలు వారికి తెలియకుండానే అసంకల్పితంగా వెలిబుచ్చారని తెలిపారు. సమాజంపై గల ప్రతికూల ఆలోచనల ఫలితంగానే వారి మెదడు ఇలా ట్యూన్ చేయబడుతుందని అందుకే ఇలాంటి స్సందనలు గమనించినట్లు శాస్త్రవేత్తలు కార్టెక్స్ జర్నల్లో తమ ఫలితాలను ప్రచురించారు. పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే.. ఒంటరితనం అనేది మనసులో తాము వేరు చేయబడ్డామని ఏర్పరుచుకునే ఒక భావన. కొందరు ఎంతో మంది స్నేహితులు, బంధువులను కలిగి ఉన్నప్పటికీ తాము ఒంటరివారిమనే భావనలోనే ఉంటారని తెలిపారు. -
మెదడు బలం కాళ్లలోనే...
పరిపరి శోధన తెలివితక్కువ దద్దమ్మలను హేళన చేయడానికి ‘వాళ్లకు మెదడు మోకాల్లో ఉంది’ అంటుంటారు గానీ, మెదడు బలం కాళ్లలోనే ఉందంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. అంటే, కాళ్లు బలంగా ఉంటేనే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. రోజూ నడక, గుంజీలు తీయడం వంటి వ్యాయామాలు చేసేవారికి కాళ్లు బలంగా తయారవుతాయని, అలాంటి వారిలో మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. పదేళ్ల పాటు 324 మంది కవలలపై విస్తృతంగా అధ్యయనం నిర్వహించి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు అంటున్నారు. ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసిన కవలల్లో కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసేవారి మెదడు పనితీరు, అలాంటి వ్యాయామాలు చేయని వారి కంటే మెరుగ్గా ఉందని ‘గ్యారంటాలజీ’ జర్నల్ ద్వారా వారు వెల్లడించారు. -
తెలివిగా తినండి.!
మెదడు... మరేమీ కాదు, తలకాయలో కాస్తంత గుజ్జు. బుద్ధిజీవులైన మనుషుల్లో తెలివితేటలకు ఇదే కేంద్రం. మెదడు సజావుగా పనిచేస్తేనే మనం సక్రమంగా ఆలోచించగలం. అంతేకాదు, మన శరీరంలోని అన్ని వ్యవస్థలూ వాటి విధులను అవి సక్రమంగా నిర్వర్తించుకోగలవు. మరి... అలాంటి మెదడును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలంటే, దానికి చక్కని పోషణను అందించాలి. పిండ దశ నుంచే మెదడుకు పోషణ అవసరం. ఇందులో ఎలాంటి లోపం ఏర్పడినా, నానా సమస్యలు తలెత్తుతాయి. ఆ పోషకాలన్నీ మన రోజువారీ ఆహారంలోనే దొరుకుతాయి. కొన్ని నేర్చుకునే సత్తువనిస్తాయి. మరికొన్ని మెదడును స్తబ్దుగా, మందకొడిగా తయారు చేస్తాయి. ఆలోచనల చురుకుదనానికి ఆహారంతో బ్రేక్ వేయకండి. తిండిలో ఉప్పు ఎక్కువైతే చురుకుదనానికి ముప్పు, కూల్డ్రింకులతో కుదేలు, కెఫిన్తో బెంబేలు. బ్రెయిన్ను మరింత హుషార్ప్ చేసే ఆహారాన్ని తీసుకోండి. చురుకైన మెదడు కోసం తెలివిగా తినండి. అదెలాగో తెలుసుకోండి... మెదడుకు మేలు చేసేవి మెదడు చురుగ్గా పనిచేయాలంటే, ఈ దిగువ జాబితాలోని ఆహార పదార్థాలు మీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. పసుపు, కొత్తిమిర: కూరల్లో వేసుకునే పసుపు, గార్నిషింగ్ కోసం వాడే కొత్తమిరతో మెదడు చురుకుగా మారుతుంది. చేపలు: పండుగప్ప, వంజరం, మాకరెల్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నూనెలు: ఆలివ్ ఆయిల్, శాకాహార నూనెలు మెదడుకు మేలుచేస్తాయి. ఆలివ్ ఆయిల్ కొలెస్ట్రాల్ను అరికడుతుంది. రక్తపోటును అదుపు చేస్తుంది. మెదడుకు వచ్చే పక్షవాతం, అల్జైమర్స్ డిసీజ్ వంటి వ్యాధులను నివారిస్తుంది. పండ్లు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటి పండ్లు మెదడుకు మేలు చేస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు: పాలకూర, బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో పాటు డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ పిండ దశ నుంచే మెదడు ఎదుగుదలకు దోహదపడే కీలకమైన పదార్థం ఫోలిక్ యాసిడ్. గర్భస్థ పిండం మెదడు సక్రమంగా ఎదగడానికి, పిండంలో న్యూరల్ ట్యూబ్కు సంబంధించిన సమస్యలను నివారించడానికి గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఇస్తుంటారు. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డ మెదడు ఆరోగ్యకరంగా ఎదగడానికి కావలసిన డీహెచ్ఏ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్లో ఇదొక రకం) తల్లిపాల ద్వారా అందుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మెదడు పనితీరులో సునిశితత్వం, వేగం ఉండాలంటే దానికి తగినంత గ్లూకోజ్ అందాలి. మన ఆహారంలో తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్లో కనీసం 15 శాతం నేరుగా మెదడుకు అందినప్పుడే అది సక్రమంగా పనిచేస్తుంది. ఇందుకోసం మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా తీసుకోవాలి. దంపుడు బియ్యం, పొటు ్టతీయకుండా మరపట్టించిన గోధుమ పిండి, బంగాళ దుంపలు, చిలగడ దుంపలు వంటి వాటిలో ఇవి లభిస్తాయి. పొట్టుతీయని ఆహారం ద్వారా శరీరంలో తయారయ్యే గ్లూకోజ్ ఒక క్రమ పద్ధతిలో మెదడుకు దీర్ఘకాలం పాటు నిదానంగా అందుతూ ఉంటుంది. పొట్టుతీసిన ఆహారం ద్వారా తయారైన గ్లూకోజ్ వెంటనే వినియోగమైపోతుంది, ఫలితంగా తక్కువ వ్యవధిలోనే మెదడుకు మళ్లీ గ్లూకోజ్ అవసరమవుతుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి శరీరానికి అత్యవసరమైన కొవ్వు పదార్థాలు. కొవ్వులు పరిమితికి మించితే ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి తెలిసిందే. అయితే, మెదడు చురుగ్గా పనిచేయాలంటే మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావలసిందే. అందుకే, మెదడుకు అత్యవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ కొవ్వు కణాలే. మెదడు బరువులో అరవై శాతం కొవ్వుపదార్థమే. మిగిలిన దానిలోనూ మరో ఇరవై శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను శరీరం తనంతట తానే తయారు చేసుకోలేదు కాబట్టి వాటిని తప్పనిసరిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. మనం తీసుకునే ఆహారంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్గా పరిగణిస్తారు. ఇవి మనకు చేపలు, గుడ్లు, వేరుశనగలు, జీడిపప్పు, బాదం గింజలు వంటి నట్స్, అవిసెనూనె వంటి పదార్థాల నుంచి లభిస్తాయి. హాని చేసే కొవ్వులు మెదడు చురుగ్గా పనిచేయడానికి కొవ్వు పదార్థాలు అవసరమే అయినా, కొన్ని రకాల కొవ్వులు మెదడుకు మేలు బదులు హాని చేస్తాయి. సాంకేతికంగా ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు (కృత్రిమ కొవ్వులు) మెదడు చురుకుదనాన్ని దెబ్బతీసి, మందకొడిగా మార్చేస్తాయి. కృత్రిమ నెయ్యిలో (వనస్పతి) ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేకులు, బిస్కట్లు, స్వీట్లు వంటివి మెదడుకు హాని చేస్తాయి. మనం మార్కెట్లో కొనే పదార్థాల ప్యాకెట్లను పరిశీలిస్తే, వాటిలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉన్నట్లయితే, అప్పటికీ జిహ్వచాపల్యం ఆపుకోలేకపోతే చాలా పరిమితంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. అమినో యాసిడ్స్ మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు దోహదపడే భాగాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఇవి ఎంత వేగంగా పనిచేస్తే, మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. న్యూరోట్రాన్స్మిటర్స్ చురుకుదనానికి దోహదపడేవే అమినో యాసిడ్స్. ఇవి ప్రొటీన్స్ నుంచి దొరుకుతాయి. మన మూడ్స్ కూడా న్యూరోట్రాన్స్మిటర్స్పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు బాగా నిద్రపట్టాలంటే ‘సెరటోనిన్’ అనే జీవరసాయనం కావాలి. పాలలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ ద్వారా శరీరంలో ‘సెరటోనిన్’ తయారవుతుంది. అందుకే, నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. విటమిన్స్, మినరల్స్ మెదడు చురుకుదనానికి విటమిన్లు, ఖనిజలవణాలు కూడా కీలకమైనవే. అమినో యాసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చడంలోను ఇవి విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బి1, బి6, బి12 విటమిన్లు చాలా అవసరం. ఇవి తాజా కూరగాయల్లో, ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారంలోనే దొరుకుతుంది. పూర్తి శాకాహారులు విటమిన్-బి12 లోపంతోను, ఎండ సోకకుండా ఉండేవారు విటమిన్-డి లోపంతోను బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లు వైద్యుల సూచనపై విటమిన్ బి-12, విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విటమిన్-ఇ మెదడుకు వేగంగా నేర్చుకునే శక్తిని ఇస్తుంది. నీరు మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయినా, మొత్తం మెదడును తీసుకుంటే, అందులో 80 శాతం ఉండేది నీరే. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మూత్రం ద్వారా, ఊపిరి ద్వారా రోజు మొత్తంలో మనం 2.5 లీటర్ల నీటిని విసర్జిస్తాం. మెదడు సజావుగా పనిచేయాలంటే రోజుకు కనీసం 1.5 లీటర్లు... అంటే దాదాపు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. మిగిలిన నీరు మనం తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల ద్వారా భర్తీ అవుతుంది. రోజువారీ తాగే నీరు 1.5 లీటర్ల కంటే తక్కువైతే మాత్రం మెదడు చురుకుదనం మందగిస్తుంది. ఆ ప్రభావం మూడ్స్పై పడుతుంది. అందుకే రోజుకు దాదాపు ఎనిమిది గ్లాసుల నీటితో పాటు పాలు, మజ్జిగ, రాగిజావ, పండ్లరసాలు వంటివి తీసుకోవాలి. ఈ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. - ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, మాక్స్క్యూర్ హాస్పిటల్స్ కాఫీ, టీ, కూల్డ్రింక్స్తో ఇబ్బందే... కెఫీన్ ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు మితిమీరి తాగితే డీహైడ్రేషన్కు గురికాక తప్పదు. కెఫీన్ ప్రభావం వల్ల శరీరంలోని నీరు త్వరగా బయటకు పోతుంది. అందుకే కాఫీ, టీలను రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకపోవడం క్షేమం. అంతకు మించి తీసుకుంటే, తొలుత మెదడు చురుగ్గా పనిచేసినా, త్వరగా అలసిపోతుంది. చక్కెర ఎక్కువ మోతాదులో ఉండే కార్బొనేటెడ్ కూల్డ్రింక్స్ కూడా ఇలాంటి ప్రభావాన్నే చూపుతాయి. చేటు ఇవి బాగా ఉప్పువేసి, నిల్వ ఉంచిన ఆలూచిప్స్, టిన్డ్ సూప్స్ వంటివి మెదడుపై దుష్ర్పభావం చూపుతాయి. మన ఆహారంలో ఉప్పు రోజుకు ఆరు గ్రాములకు మించితే, అది మెదడుకు చేటు చేస్తుంది. వనస్పతి, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు మంచిది కాదు. మాంసాహారులు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు తీసుకోవాలి. ఇక వెన్న, మీగడలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పొగతాగటం, ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తాయి.మెదడును స్తబ్దుగా మార్చేస్తాయి. దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరుపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తాయి. -
చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల కింద ఓ ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చింది. వెన్నుపూస దెబ్బతిని చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యిని కదిలించలేడు, స్పర్శ జ్ఞానం కూడా లేదు. కానీ ఇప్పుడా వ్యక్తి వస్తువులను పట్టుకోగలుగుతున్నాడు, అవి ఎలా ఉన్నాయో (మెత్తగా, గట్టిగా, వేడిగా.. ఇలా) ముట్టుకుని తెలుసుకోగలుతున్నాడు. కానీ ఇది తన చేతితో కాదు.. ఒక కృత్రిమ చెయ్యితో..! ఈ కృత్రిమ చెయ్యిని నేరుగా అతని మెదడుకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా డిఫెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా) ఈ విప్లవాత్మకమైన విజయాన్ని సాధించింది. ప్రమాదాల్లోనో, ఇతర కారణాలవల్లో కాళ్లూ, చేతులు పోగొట్టుకున్నవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం సాధారణమే. కాలుగానీ, చెయ్యిగానీ లేని లోటును ఈ కృత్రిమ అవయవాలు కొంత వరకూ తీర్చగలవు. కానీ వాటితో వస్తువులను ముట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అనుభూతిని మాత్రం ఇవ్వలేవు. ఇది అతిపెద్ద లోటు. ఈ లోటును తీర్చడం ద్వారా జీవ సాంకేతిక రంగంలో డార్పా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారు. డార్పా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా వ్యక్తులు తమకు అమర్చిన కృత్రిమ అవయవాలను నేరుగా మెదడు ద్వారానే నియంత్రించడంతోపాటు, వాటిని స్పర్శించిన అనుభూతిని పొందుతారని డార్పా ప్రోగ్రామ్ మేనేజర్ జస్టిన్ సాంచెజ్ చెప్పారు. తద్వారా సహజమైన అవయవాలు ఉన్న భావన వస్తుందన్నారు. పక్షవాతానికి గురైన ఒక వ్యక్తి మెదడులోని గ్రాహక ప్రాంతాని (మోటార్ కార్టెక్స్)కి కృత్రిమ చెయ్యి నుంచి సంకేతాలు అందించే ఎలక్ట్రోడ్లను అమర్చామని చెప్పారు. జాన్హాప్కిన్స్ వర్సిటీకి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ ఈ కృత్రిమ చెయ్యిని రూపొందించిందని.. దీని వేళ్లకు ఒత్తిడిని, స్పర్శను గుర్తించే సెన్సర్లను అమర్చారని తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టి కృత్రిమ చేతులను తమ చేతులతో, వివిధ వస్తువులతో తాకి చూశామని... వీటన్నింటినీ అతను గుర్తించగలిగాడని సాంచెజ్ వెల్లడించారు. దాదాపుగా సహజమైన చెయ్యిలా అనుభూతిని పొంది నట్లు ఆ వ్యక్తి వెల్లడించాడని తెలిపారు. -
మెదడుకు మళ్లీ ప్రాణం పోస్తే..!
బ్రెయిన్ ప్రిజర్వేషన్పై పెరుగుతున్న ఆసక్తి మానవ మస్తిష్కం. దాదాపు 10 వేల కోట్ల న్యూరాన్ల సముదాయం. శరీర కదలికల్ని, సామర్థ్యాల్ని, అంచనాకందని ఆలోచనల్ని నియంత్రించే.. లక్షలాది జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే భాండాగారం. అందులోని ఒక్కో న్యూరాన్.. ఒక్కో సమాచార కేంద్రం. న్యూరాన్లు కూడా సాధారణ కణాల్లాంటివే. అయితే, సాధారణ కణాలను, న్యూరాన్లను వేరు పర్చేది.. న్యూరాన్లలోని విద్యుత్స్రాయన సంకేత(ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్) సామర్థ్యం. ఆ సామర్థ్యంతోనే అవి సమాచారాన్ని సేకరించడం, మార్పిడి చేయడం చేస్తుంటాయి. జీవితకాలం విషయంలోనూ ఇవి ప్రత్యేకమైనవే. అయితే, మనిషి చనిపోయిన క్షణాల్లోనే ఈ న్యూరాన్ వ్యవస్థ కూడా శిథిలమవడం ప్రారంభమవుతుంది. చనిపోయాక కూడా బ్రెయిన్ను సజీవంగా ఉంచగలిగితే.. దాన్లోని న్యూరాన్లు నాశనం కాకుండా కాపాడగలిగితే.. భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత ఆ మస్తిష్కం పనితీరును, దానిలోని న్యూరాన్లలో దాగిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అద్భుతాలు చేయవచ్చు. ఇప్పుడు మన మేధను భద్రపరిచే సాంకేతిక వ్యవస్థపై విశ్వవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. న్యూయార్క్లోని 23 ఏళ్ల కిమ్సోజీ తనకు కేన్సర్ సోకి చనిపోయే పరిస్థితి తలెత్తడంతో తన మెదడును భద్రపరచటం ద్వారా.. తన భావాలను, అనుభూతులను, అనుభవాలను శాశ్వతం చేసుకోవాలని సంకల్పించింది. ఈ రోజు కాకపోయినా కొన్ని దశాబ్దాల తరువాతైనా అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతికత సాయంతో మస్తిష్కాన్ని, దాన్లోని న్యూరాన్లను స్కాన్ చేసి, కోడింగ్ చేసి, ఆ న్యూరాన్ల ప్రత్యేక సామర్థ్యాలను ముందు తరాలకు అందించాలనుకుంది. అయితే ఇందుకోసం కనీసం 80వేల పౌండ్లు(రూ.82 లక్షలు) ఖర్చవుతాయి. కిమ్ తన తండ్రిని అడిగితే అంత డబ్బును సమకూర్చలేనన్నాడు. దీంతో ఆమె ఫేస్బుక్ ద్వారా విరాళాల రూపంలో ఆ మొత్తాన్ని సేకరించింది. అయితే ఈ మస్తిష్క సంరక్షణ అంత సులువు కాదు. ముందుగా, వ్యక్తి చనిపోవడానికి క్షణాల ముందే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి. అంతకుముందే క్రయోనిక్స్ టీం(శరీర భాగాలను భద్రపరిచి, చెడిపోకుండా సంరక్షించే బృందం)ను అప్రమత్తం చేయాలి. చనిపోగానే మెదడుకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలి. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవాలి. మెదడును వేరు చేసి, తరలించి, మైనస్ 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ద్రవరూప నైట్రోజన్లో భద్రపరచాలి. ఆమె మరణానికి కొద్ది గంటల ముందు.. బ్రెయిన్ ప్రిజర్వేషన్లో అమెరికాకు చెందిన ‘అల్కొర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్’ కిమ్ మెదడును అలా భద్రపరచింది. ఈ సంస్థే ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ టెడ్ విలియమ్స్ మెదడును భద్రంగా సంరక్షిస్తోంది. -
ఎందరో నానీలు...
హ్యూమర్ ఫ్లస్ భలేభలే మగాడివోయ్ సినిమాలో నానికి మతిమరుపు. ఏదైనా తొందరగా మరిచిపోతాడు. మతిమరుపు జబ్బులా కనిపిస్తుంది కానీ నిజానికి అదో వరం. ఇచ్చిన వాగ్దానాలన్నీ గుర్తుంటే మన రాజకీయ నాయకుల మెదడు ట్రాన్స్ఫార్మర్లా వేడెక్కి పేలిపోయి వుండేది. ఎక్కడిదక్కడ గ్రక్కున విడువంగవలెను సుమతీ అనేది వాళ్ల పాలీస. ఓటర్లు కూడా అంతే. నాయకుల మాటల్ని మరచిపోతారు కాబట్టే మళ్లీ వాళ్లనే ఎన్నుకుంటారు. మెదడులో డిలిట్ కొట్టే ఆప్న్ లేకపోతే పిచ్చాసుపత్రులు నిండిపోయి వుండేవి. ఆ సినిమాలో నాని ప్రత్యేకత ఏంటంటే ఒక పనిచేస్తూ ఇంకో పనిలోకి వెళ్లిపోయి అంతకుముందు చేస్తున్న పనిని మరిచిపోతాడు. గవర్నమెంట్ ఆఫీసులకెళితే మనకు బోలెడుమంది నానీలు కనిపిస్తారు. మనం ఒక పనికోసం వెళ్లి పడిగాపులు కాస్తుంటే ఆ అధికారి మన విషయమే మరిచిపోయి ఇంకేదో పని చేస్తుంటాడు. అది ఎట్లనినన్... ‘‘సార్, నేనో సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేశా’’ - బాధితుడు. ‘‘సర్టిఫికెట్లు ఇవ్వడానికే మేముండేది... ఇంతకీ ఏం సర్టిఫికెట్... (ఫోన్ రింగ్) హలో సార్ బావున్నారా... ఏదో మీ దయవల్ల.. ఎక్కడ సార్, పనులెక్కడ జరుగుతున్నాయి... మునుపటిలా కాదు, వర్క్ కల్చర్ పోయింది. నెలలో వారంరోజులు గవర్నమెంట్ సెలవలు, వారం రోజులు ఉద్యోగులు సెలవు.. మిగిలిన రోజుల్లో కాఫీ, టీ, లేట్ కమింగ్ ... ఇవన్నీ పోయి... ఏంటి వర్క్ కల్చర్పైన ఫేస్బుక్లో రాశారా... ఇప్పుడే చూసి లైక్ కొడతా’’ అంటూ నానీ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి లైక్ కొట్టాడు. ‘‘సార్ బర్త్ సర్టిఫికెట్కోసం....’ ‘‘ఒక్క నిముషం, బాస్ పిలుస్తున్నాడు.’’ పది నిముషాల తర్వాత నాని విసుగ్గా ‘‘ఏంటో ఈయన మతిమరుపుతో చస్తున్నాను. తీరా పిలిచాకా ఎందుకు పిలిచాడో మరిచిపోయాడు. ఇంతకూ మీరెవరు?’’ ‘‘సార్, బర్త్...’’ ఫోన్ రింగ్ ‘‘సార్, నమస్తే... భలేవారు సార్, మీరు చెబితే మరిచిపోతానా... ఆ ఫినాయిల్ కాంట్రాక్ట్... సారీ పామాయిల్ కాంట్రాక్ట్ కదా... ఆ ఫైల్ రెడీ చేస్తా... వన్ మినిట్ బాస్ నుంచి పిలుపు. ‘‘సార్...’’‘‘వుండవయ్యా, అవతలవాడు చంపుతున్నాడు.. అసలీ బాస్లంతా ఇలాగే పీక్కుతింటారా. లేదంటే పీక్క్తునేవాళ్ళే బాస్లవుతారా..’’ ఐదు నిముషాల తర్వాత కోపంగా వచ్చి అటెండర్ని పిలిచి ‘‘బుద్ధుందా నీకు... గాడిదని పిలవమంటే గుర్రాన్ని పిలుస్తావా? లోపలికెళితే బూతులు తిట్టాడు. ఆ మిస్సయిన ఫైల్ నాది కాదు... వాళ్ళావిడకి మతిభ్రమణం, దాంతో వీడికి మతిమరుపు. మధ్యలో నన్ను కరుస్తున్నాడు. ‘‘మీరు నన్ను కరుస్తున్నారు’’ - అఠెండర్. ‘‘తెలుగు సినిమాలు చూసి చూసి ప్రతివాడికి ఈ పంచ్ల గోల ఎక్కువైంది’’.‘‘సార్, నా బర్త్..’’ ‘‘నీ బర్త్... నా చావుకొచ్చేలా వుంది... ఒక కప్పు టీ తాగితే కానీ బుర్ర పనిచేయదు.’’ ‘‘తాగినా పనిచేయదు’’ - అటెండర్. ఈ కథ అన్ని ఆఫీసుల్లో ఇలా సాగుతూనే వుంటుంది. మతిమరుపు కొందరికి నిజంగా వుంటే, మరికొందరు తమకు వుందని అనుకుంటూ ఉంటారు. జనరల్గా నిర్మాతలు రెమ్యునరేషన్ మరిచిపోతూ వుంటారు. దాంతో కొందరు హీరోలు డబ్బింగ్ థియేటర్కి దారిని మరిచిపోతారు. కొందరు భార్యని మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు అప్పుల్ని మరిచిపోతారు, తప్పుల్ని కూడా మరిచిపోతారు. లోకంలో ప్రతివాడు ఏదో ఒకటి మరిచిపోతూనే వుంటాడు. మతిమరుపు అంటే అదో ఇష్టకష్టం. - జి.ఆర్. మహర్షి -
మెదడుకూ స్టెంట్స్!
కొత్త పరిశోధన మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చే స్ట్రోక్ని (పక్షవాతాన్ని) ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారన్న విషయం తెలిసిందే. ఇలా పక్షవాతం వచ్చిన సందర్భాల్లో వెంటనే టీపీఏ (టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్) అనే ఇంజెక్షన్ ఇస్తారన్న విషయమూ తెలిసిందే. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన మరుక్షణంలో అది రక్తపు గడ్డలను (క్లాట్స్ను) చెదరగొట్టి మళ్లీ మెదడులోని ఆయా భాగాలకు రక్తసరఫరా పునరుద్ధరిస్తుంది. అందుకే పక్షవాతం వచ్చిన రోగుల్లో వెంటనే ఈ ఇంజెక్షన్ను ఇస్తుంటారు. అయితే మెదడులోకి స్టెంట్ వేయడం వల్ల టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ కంటే మంచి ఫలితాలు ఉంటాయని ఒక డచ్ అధ్యయనంలో తేలింది. మిస్టర్ క్లీన్ అనే పేరిట నిర్వహించిన ఈ అధ్యయనాన్ని 500 మంది పక్షవాతం రోగులపై నిర్వహించారు. ఇందులో 89 శాతం మందికి ప్రాణరక్షణ మందుగా వ్యవహరించే టిష్యూప్లాస్మినోజెన్ యాక్టివేటర్ను ఇచ్చారు. ఇక మిగతావారిలో ఎంపిక చేసిన వారికి ఇంట్రా ఆర్టీరియల్ ట్రీట్మెంట్గా వ్యవహరించే చికిత్స చేశారు. అంటే వారి తొడ భాగం నుంచి ఒక క్యాథెటర్ను (పైప్లాంటి ఉపకరణాన్ని) ప్రవేశపెట్టి, మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి ఆ క్యాథెటర్ను తీసుకెళ్లి, ఆ ప్రాంతంలో స్టెంట్ను అమర్చారు. క్యాథెటర్ను వెనక్కులాగే సమయంలో గడ్డకట్టిన రక్తపు ముద్దనూ వెనక్కుతీసుకువచ్చి దాన్ని బయటకు తొలగించారు. ఈ అధ్యయనం ద్వారా ఇలా రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం వచ్చిన వారికి స్టెంట్ వేయడం వల్ల 32.6 శాతం మంది అంతకు ముందు వ్యవహరించినట్లే తమ పనులు తామే చేసుకునేలా ఉన్నారనీ, అయితే కేవలం టీపీఏ ఇచ్చిన వారిలో 19.1 శాతం మంది మాత్రమే, స్టెంట్ వేసిన వారిలా బాగుపడ్డారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన డచ్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాలను ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో పొందుపరచారు. -
న్యూరో కౌన్సెలింగ్
మెదడులో కణుతుల సర్జరీ ఎలాగంటే..! మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్లా ఉంది. సర్జరీ, రేడియేషన్తో కణుతులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - కిరణ్మయి, గుడివాడ మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణుతులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో ఇది మరీ అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. చాలారకాల కణుతులకు సమర్థంగా చికిత్స అందించవచ్చు. సాధారణ కణుతులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణుతుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణుతుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణుతుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు. మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణుతులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్లో అది మొదటి రెండు గ్రేడ్లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు. అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణుతులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణుతులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ , కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. అంటే భిన్న ప్రక్రియలను ఉపయోగించి మెదడు కణుతులను తొలగించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
న్యూరాలజీ కౌన్సెలింగ్
మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది ఏం చేయాలి? మా చెల్లి వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతోంది. చిన్నప్పట్నుంచీ ఫిట్స్తో బాధపడుతోంది. చాలాసార్లు కాలేజీలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దాంతో కాలేజీ వారూ, కుటుంబసభ్యులూ ఆందోళనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్కు తీసుకెళ్లి వైద్యం చేయించాం. కొంతకాలం బాగానే ఉంది. కానీ ఈమధ్య మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది. ఆమె అనారోగ్యం కుటుంబంలో అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం చేయడానికి ఏదైనా చికిత్స ఉందా? దయచేసి మాకు తగిన సలహా అందించండి. - బి. కరుణాకర్రెడ్డి, నల్గొండ ఫిట్స్ (మూర్ఛ) అనేది మెదడులో సంభవించే ప్రకోపనాలకు సంకేతం మాత్రమే. ఫిట్స్ వల్ల నిజానికి ఎలాంటి ప్రాణహానీ ఉండదు. కానీ చాలామంది ఫిట్స్ను ఏదో తీవ్రమైన, అరుదైన, ప్రమాదకరమైన సమస్యగా చూస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఇది చాలా సాధారణమైన సమస్య. మెదడులోని నాడీ కణాల్లో నిరంతరం విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని నాడీ కణాల్లో విద్యుత్ చర్యలు అస్తవ్యస్తమైనప్పుడు ఫిట్స్ వస్తాయి. వీటినే సీజర్స్ అని కూడా అంటారు. ఇలా తరచూ ఫిట్స్ వస్తుంటే దాన్ని తెలుగులో మూర్ఛ అని ఇంగ్లిష్లో ఎపిలెప్సీ అని అంటారు. ఫిట్స్ అన్నీ ఒకే రకానికి చెందినవి కావు. ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో దాన్ని బట్టీ, ఆ సమయంలో కనిపించే లక్షణాలను బట్టీ ఇది ఏరకమైన ఫిట్స్ అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో కొద్దిసేపట్లోనే ఎలాంటి వైద్యసహాయం లేకుండానే పేషెంట్ తనంతట తానుగా కోలుకుంటాడు. అయితే ఫిట్స్ వచ్చిన సమయంలో ఆ వ్యక్తిని ఒకవైపునకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. మళ్లీ కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి వస్తాడు. అలా కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి రాకపోతే మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి. అంతేగానీ ఫిట్స్ వచ్చిన సమయంలో పేషెంట్ నోట్లో ఏదైనా పెట్టడం, చేతిలో తాళాల వంటి ఇనుప వస్తువులు ఉంచడం, ముక్కు దగ్గర ఏదైనా తోలు వస్తువు వాసన చూపడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూనుకోకూడదు. ఇలాంటి చర్యల వల్ల పేషెంట్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా కొన్ని సందర్భాల్లో అవి హాని చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక మీ సోదరి విషయానికి వస్తే స్త్రీ జీవితంలోని ప్రతి దశలోనూ అంటే... రజస్వల కావడం, నెలసరి రావడం, గర్భధారణ, బిడ్డకు పాలివ్వడం, నెలసరి నిలిచిపోవడం... ఇలా ప్రతి దశలోనూ హార్మోన్ల ప్రభావం బలంగా ఉంటుంది. దీంతో ఫిట్స్ సమస్యకూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో 90 శాతం కేసుల్లో సుదీర్ఘ చికిత్స, మందుల ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా వెంటనే అనుభవజ్ఞులైన న్యూరోఫిజీషియన్కు చూపించి చికిత్సను కొనసాగించండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్