Chirala
-
ఇసుక దందాతో తాగునీటికి కటకట
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఇసుక దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా జాతీయ స్థాయికి చేరింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీటికి కటకట తప్పదని వేటపాలెం మండలం పుల్లరిపాలెంలోని సాయి ఎస్టీ కాలనీ వాసులు యానాది హక్కుల పరిరక్షణ సంఘం పేరున నవంబర్లో జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.‘రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎస్టీ కాలనీ సమీపంలోని ఇసుక దిబ్బల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండడంతో తవ్వకాల వ్యవహారాన్ని హైదరాబాద్కు చెందిన కొందరికి అప్పగించారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. వేటపాలెం ప్రాంతం నుంచి బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు హైదరాబాద్కు సైతం ఇసుక భారీగా తరలిపోతోంద’ని వారు వివరించారు. ఈ విషయమై తక్షణం విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు అందాయి. అయితే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులు నవంబర్ 27న తొలి విచారణ సందర్భంగా బాధితులనే బెదిరించారు. ఈ విషయమై ఎస్టీలు మరోమారు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయగా, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందం ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ విచారించాలని ఆదేశించింది. కాగా, తాము చెప్పినట్లు విచారణలో చెప్పాలని, ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని అధికారులు రాసిన పేపర్లలో సంతకాలు పెట్టాలని అధికార పార్టీ నేతలు.. ఎస్టీలను బెదిరించినట్లు సమాచారం. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాము న్యాయవాదిని నియమించుకుని సమాధానం ఇస్తామని శుక్రవారం విచారణకు వచి్చన అధికారులకు బాధితులు తేల్చి చెప్పారు.మామూళ్ల మత్తులో అధికారులు! వేటపాలెం ప్రాంతంలో ఇప్పటికే కనుచూపు మేర రొయ్యల చెరువులు వెలిసి, కెమికల్స్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల వేసవిలో తాగునీటి కోసం తమ కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని యానాది హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్ ఇండ్ల స్వాతి, సెక్రటరి పోలయ్య, కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ విషయమై మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాల్సి వచి్చంది. అయినా కొందరు అధికారులు ఇసుక మాఫియా నుంచి నెల మామూళ్లు పుచ్చుకుంటుండటంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం. -
డ్రైనేజీ భూముల్లో టీడీపీ గద్దలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్తోపాటు పచ్చ నేతల కన్ను ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని డ్రైనేజీ (ప్రభుత్వ) భూములపై పచ్చనేతతోపాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఇన్నాళ్లూ ఆ భూములను కాపుకాసిన విశ్రాంత అధికారి కన్నూ పడింది. తలో ఇంత పంచుకున్నారు. ఎటువంటి పట్టాలు పొందే అవకాశం లేని ఆ ప్రభుత్వ భూములను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అగ్రిమెంట్ల మీదనే ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మారు. వీటిలో ఎక్కువ భూములను మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దొరకబుచ్చుకున్నారు. ఆ భూముల్లో రొయ్యల చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. వేటపాలెం మండలం సంతరావూరు బ్రిడ్జి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే రొంపేరు డ్రైన్, ముసలమ్మ మురుగు నీటి కాలువల మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. డ్రైన్స్ నిర్మాణంలో భాగంగా వాటిని పూర్వం ప్రభుత్వం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం వరకు వేటపాలెం ప్రాంతంలో ఉన్న కుమ్మరులు (శాలివాహనులు) కుండలు, ఇతరత్రామట్టి పాత్రలు తయారు చేసేందుకు ఆ భూముల్లో ఉన్న బంకమట్టిని తీసుకువెళ్లేవారు. అప్పట్లో ఆ భూముల ఆక్రమణకు కొందరు నేతలు ప్రయత్నించగా కుమ్మరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయి తయారీ నిలిచి పోవడంతో కుమ్మరులు వాటిని వదిలేశారు. దీంతో ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.వాలిపోయిన పచ్చ మూకలుఇప్పుడు వాటిని పరిరక్షించే వాళ్లు లేకపోవడంతో పచ్చ మూకలు వాలిపోయాయి. చీరాల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, మరికొందరు ఆ భూములను ఆక్రమించారు. 10 మంది కలిసి 15 ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేసేవారు. ఇంకొందరు కొన్ని భూములు వారివంటూ హద్దులు గీసుకున్నారు. వేటపాలేనికి చెందిన డ్రైనేజీ విభాగం విశ్రాంత అధికారి సైతం కొంత మేర ఆక్రమించారు. వాస్తవానికి డ్రైనేజీ, డొంక, శ్మశాన తదితర పోరంబోకు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. ఇక్కడ కూడా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సమాచారం. కానీ టీడీపీ నేతల అనుచరులు ఇప్పటికే సుమారు 18 ఎకరాలు ఆక్రమించడంతో పాటు, అప్పటికే ఆక్రమించిన వారి వద్ద భూములను కూడా ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు కొన్నారు. ఇలా ఇప్పటివరకూ 30 ఎకరాలకుపైగా డ్రైనేజీ భూములు విక్రయాలు జరిగినట్లు సమాచారం. డ్రైనేజీ విభాగం రిటైర్డ్ అధికారి సైతం కొన్ని భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడొకరు కొంటున్నారు. ఈ భూముల ఆక్రమణ, అమ్మకాలను అడ్డుకోవాల్సిన డ్రైనేజీ విభాగం అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కైపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, డ్రైనేజీ భూములను కొందరు సాగు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందని, ఆక్రమణలు విషయం తన దృష్టికి రాలేదని మురుగునీటిపారుదల శాఖ డీఈ వెంకట సుబ్బారావు చెప్పారు. విచారణ జరిపి క్రయవిక్రయాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నేతన్న కంట కన్నీళ్లు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. కరువైన నేతన్న నేస్తం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కలగానే చేనేత పార్కు.. చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు. కనీస వేతన చట్టానికి దిక్కేది? కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్లూమ్, ఏడీ -
బియ్యం ఇస్తే ఓకే.. లేదంటే ‘6ఏ’ అస్త్రం
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని ఒక రేషన్ డీలర్ (ఇతను రేషన్ మాఫియాలో నెలకు రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నాడు) మండలంలో ఉన్న రేషన్ డీలర్ల నుంచి మాఫియా తరఫున నెలనెలా బియ్యం సేకరించి అప్పగిస్తాడు.ఇదే మండలంలో కూతురు పేరుతో రేషన్ షాపు నడుపుతున్న మరో డీలర్ను బియ్యం ఇవ్వాలని నవంబరు 2న కోరాడు. అమ్మకాలు పూర్తికాలేదని, బియ్యం తర్వాత ఇస్తానని ఆ డీలర్ చెప్పాడు. దీంతో డీలర్ కం మాఫియా ఉద్యోగి వెంటనే రేషన్ మాఫియాను నడిపిస్తున్న ‘ఒంగోలు ప్రసాద్’కు ఫోన్చేశాడు.బియ్యం అడిగితే డీలర్ స్పందించడంలేదని, అతను మనకు సక్రమంగా బియ్యం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశాడు. అంతే.. రేషన్ షాపులు పర్యవేక్షించే ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ప్రసాద్ ఫోన్ కొట్టి తనకు బియ్యం ఇవ్వని రేషన్ డీలర్ను వెంటనే బుక్చేయాలని హుకుం జారీచేశాడు. అరగంటలో అక్కడ వాలిన అధికారి షాపును తనిఖీచేసి 92 బస్తాల బియ్యం అధికంగా ఉన్నాయంటూ ఆ డీలర్ వివరణ కూడా తీసుకోకుండా సిక్స్–ఏ కింద బుక్చేసి వెంటనే ఆయనను తొలగించారు. కొసమెరుపు ఏంటంటే రేషన్ మాఫియాలో నెలజీతానికి పనిచేస్తున్న వేటపాలెంకు చెందిన డీలర్కే ఈ డీలర్షిప్ అప్పగించారు. బియ్యం విషయంలో చీరాల రూరల్ పరిధిలోని ఒక డీలర్తో రేషన్ మాఫియాకు నవంబరులో గొడవైంది. ఏకంగా డీలర్పైనే రేషన్ మాఫియా మనుషులు దాడిచేసి కొట్టారు. రేషన్ డీలర్ చీరాల టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైంది. చీరాల నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. రేషన్ మాఫియా ఆగడాలు శృతిమించాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణ.సాక్షి ప్రతినిధి, బాపట్ల: పేదల బియ్యాన్ని చవగ్గా కొట్టేసి రీసైక్లింగ్ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న మాఫియా, రేషన్ డీలర్లను శాసిస్తోంది. పేదల కడుపుకొట్టి మొత్తం చౌక బియ్యాన్ని తమకే అప్పగించాలని బెదిరిస్తోంది. ఈ ప్రాంతంలో ఓ పచ్చనేత ఇలాగే రేషన్ మాఫియా నుంచి రూ.20 లక్షలు కప్పం పుచ్చుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో రెచి్చపోతున్న మాఫియా రేషన్ డీలర్లతో కుమ్మక్కైంది. ఈ అక్రమ వ్యాపారం తొలిరోజుల్లో కార్డుదారులకు కిలోకు రూ.8 నుంచి రూ.10.. డీలర్లకు రూ.13 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో ఎక్కువ ధర ఇస్తామని వ్యాపారులు పోటీపడుతున్నారు. కిలో బియ్యానికి రూ.10 నుంచి రూ.13 ఇస్తామని లబ్ధిదారులకు.. అదే సమయంలో డీలర్లకు రూ.16 ఇస్తామని చెబుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో.. లబ్దిదారులు, డీలర్లు ఇంకా ఎక్కువ మొత్తం కోరుతున్నారు. మరోవైపు.. నియోజకవర్గ పచ్చనేతల డిమాండ్ కూడా పెరిగింది. ప్రారంభంలో చీరాల ప్రాంతంలోని ఒక పచ్చనేతకు నెలకు రూ.12 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న మాఫియా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు సమాచారం. ఇలా పచ్చనేతకు పెద్ద మొత్తంలో కప్పం కడుతున్న చీరాల మాఫియా రేషన్ డీలర్లను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. కొందరు ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్ చేస్తూ బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడంతో ఈ మాఫియా ప్రైవేటు సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగడమే కాక ఏకంగా భౌతికదాడులకు తెగబడుతోంది. రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సైతం నెలనెలా మామూళ్లు ఇస్తుండడంతో వారు మాఫియాకు దన్నుగా నిలుస్తున్నారు. వారిని అడ్డుపెట్టి మాటవినని డీలర్లపై సిక్స్–ఏ కేసులు నమోదు చేయించి డీలర్లను తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న చుట్టుపక్కల డీలర్లకు ఈ షాపులను అప్పగిస్తున్నారు. దీంతో.. పచ్చనేత, అధికారుల మద్దతు ఉండడంతో రేషన్ మాఫియా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉంటోంది. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం అస్సలు ఇవ్వకుండా మొత్తం బియ్యం తీసేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కార్డులు రద్దుచేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రీసైక్లింగ్ చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. కొందరు జిల్లాస్థాయి అధికారులు మాఫియాతో కుమ్మక్కై తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోవడంతో రేషన్ దందా జోరుగా సాగుతోంది. సిక్స్–ఏ కేసు అంటే..ప్రభుత్వ రేషన్ షాపుల్లో అవకతవకలు జరిగితే రెవెన్యూ అధికారులు (ఎన్ఫోర్స్మెంట్ డిటీ, తహసీల్దారు తదితరులు) ఈ 6ఏ కేసులు నమోదు చేస్తారు. ప్రధానంగా డీలర్ వద్ద ఉన్న స్టాకు రికార్డులకు అనుగుణంగా ఉండకపోతే ఈ కేసులు పెట్టడం పరిపాటి. విచారణలో నిజమని తేలితే ఆర్డీఓ స్థాయిలో డీలర్ను తొలగించవచ్చు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకపోతే ఈ కేసు బుక్ చేసిన వెంటనే తహసీల్దార్ స్థాయిలోనే డీలర్íÙప్ నిలిపివేసి వేరొకరికి కేటాయిస్తారు. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్లు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్టాప్లు, ఐప్యాడ్, మూడు వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. -
చీరాలలో యువకుడి హత్య
చీరాలటౌన్: చీరాలలో ఆదివారం దారుణహత్య జరిగింది. పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు చిన్న కారణానికే కత్తితో పొడిచి క్యాటరింగ్ షాప్ నిర్వాహకుడు కంచర్ల సంతోష్ (36)ను హత్యచేశాడు. పట్టణ సీఐ పి.శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. కంచర్ల సంతోష్ (36) సంగం థియేటర్ సమీపంలో (ఖానాఖజానాలో) అయ్యప్ప క్యాటరర్స్ నిర్వహిస్తూ కర్రీ పాయింట్ కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద పండ్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పండ్ల వ్యాపారి చిన్న వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తాగునీటి క్యాన్ను నీటితో కడిగాడు. ఆ నీరు ఎదురుగా ఉన్న అయ్యప్ప క్యాటరర్స్ ఖానాఖజానా దుకాణం వద్దకు చేరాయి. ఈ విషయమై కర్రీ పాయింట్లో పనిచేసే మహిళలు ఉమామహేశ్వరరావును ప్రశి్నంచారు. దీంతో అతడు వారిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ మహిళలు తమ యజమాని సంతో‹Ùకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన సంతోష్ ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఉమామహేశ్వరరావు పండ్లు కోసే కత్తితో సంతోష్ని పొడిచాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన సంతోష్ను స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి ఉన్నారు. ఘటనాస్థలాన్ని, సంతోష్ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును, పండ్ల వ్యాపారి చిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. -
హత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
చీరాల/చీరాల అర్బన్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన యువతిపై హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారాంపేటకు చెందిన పౌజుల సుచరిత (21) ఇంటర్ వరకు చదివి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఆ యువతి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ తరువాత రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో వివస్త్రగా ఆమె మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారని హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాల్గా తీసుకుని 10 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మత్తులో.. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. ఈపూరుపాలెం గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహే‹Ù, దేవరకొండ శ్రీకాంత్ ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. నిందితులు ముగ్గురినీ శనివారం సాయంత్రం చీరాల బైపాస్ రోడ్డు వద్ద హాయ్ రెస్టారెంట్ సమీపంలోని వాడరేవు వెళ్లే రోడ్డులో 50 మీటర్లు దూరంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి మత్తుకు బానిసలైన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున రైల్వేట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని ఏ1 విజయ్, ఏ2 మహేష్ బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్ళారు. యువతి నోరుమూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేయడంతోపాటు నోరు, ముక్కు మూసి హత్య చేశారన్నారు. ఆ ఇద్దరికీ ఏ3 శ్రీకాంత్ ఆశ్రయం కల్పించాడన్నారు. ముగ్గురు నిందితులకు నేరచరిత్ర ఉందని.. వారిపై చీరాల రూరల్ పోలీస్స్టేషన్లో గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ దర్యాప్తు చేశారన్నారు. ముగ్గురు నిందితులపై కోర్టులో చార్జిïÙట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి యువతి హత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను శనివారం సునీత పరామర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ ఆకురాతి పద్మిని, గంజి చిరంజీవి ఉన్నారు. ఇదిలావుండగా.. హత్యాచారానికి గురైన పౌజుల సుచరిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు. యువతిపై హత్యాచార ఘటన దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
చీరాలలో హత్యాచారం!
చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి ముఠా పనే! సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో నార్కోటెక్ సెల్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్గ్రేíÙయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. -
చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
చీరాల టౌన్/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్ కేంద్రానికి కొండయ్య యాదవ్ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారు.పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరుకున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అనుచరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యంచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కరణంపై ఆమంచి దాడిచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
చంద్రబాబు ఓ మోసగాడు..
-
చీరాలలో బడుగుల జాతర
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైఎస్ జగన్: మంత్రి నాగార్జున దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్లమెంటులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
సిలోన్ కాందిశీకుల కల నెరవేరింది
చీరాల: వారంతా శ్రీలంకలో బతకలేక.. ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో తమిళనాడుకు వలస వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన కాందిశీకులకు వసతులు, ఉపాధి కష్టంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అప్పట్లో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కాందిశీకులకు ఉపాధి కల్పించింది. కాగా.. 1980లో చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద కేంద్ర ప్రభుత్వం నూలు మిల్లు ఏర్పాటు చేసింది. ఆ మిల్లులో పనుల కోసం దాదాపు 200 శ్రీలంక కాందిశీక కుటుంబాలను చీరాల తరలించారు. నూలు మిల్లు పక్కనే 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించి కాందిశీకులకు కాలనీ కట్టించి ఇళ్లు కేటాయించారు. ఆ కాలనీలో కాందిశీకులు నివాసం ఉంటూ నూలుమిల్లులో పనులు చేసుకుంటూ జీవించేవారు. నూలు మిల్లులు నష్టాల పాలవడంతో వాటన్నింటినీ మూసివేశారు. 2000 సంవత్సరంలో చీరాల నూలు మిల్లు కూడా మూతపడింది. అప్పటినుంచి కాందిశీకులు ఈ ప్రాంతంలోనే ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు. కాందిశీకుల కల నెరవేర్చిన జగన్ దేశాయిపేటలో నిర్మించిన సిలోన్ కాలనీలో ఇళ్లలో నివాసం ఉంటున్న కాందిశీకులకు ఆ ఇళ్లపై ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిలోన్ కాలనీలో నివాసం ఉంటున్న కాందిశీకులందరికీ ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో వారికి ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కు లభించింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది శ్రీలంక నుంచి చీరాల వచ్చి స్థిరపడిన కాందిశీకులకు 42 ఏళ్ల తరువాత సొంత గూడు ఏర్పాటుకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సిలోన్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా. – కరణం బలరాం ఎమ్మెల్యే, చీరాల ఇళ్ల పట్టాలు ఇచ్చారు 43 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వలస వచ్చాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సిలోన్ కాలనీలో ఉంటున్నాం. ఆ ఇళ్లపై మాకు పూర్తి హక్కులు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం వాటికి పట్టాలు మంజూరు చేసింది. – ఎం.శివనాడియన్, సిలోన్ కాలనీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిలోన్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూలుమిల్లు మూసివేసిన తరువాత ఈ ప్రాంతంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాం. కాలనీలో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. – ఎం.సత్యవేలు, సిలోన్ కాలనీ -
సోము వీర్రాజుకు నిరసన సెగ..!
-
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ చీరాల వాసులు
-
సూడాన్లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు
చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది. సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది. తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు. కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి కొరియర్ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు. పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే. – పొత్తూరి బాలకేశవులు, చీరాల -
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు
కొత్తపట్నం/చీరాల టౌన్: బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోగా.. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆదివారం సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న ఏడుగురు మత్స్యకారుల బృందం ఓడరేవు గ్రామం నుంచి గరికన కృష్ణ, మల్లె బంగారయ్య, మెరుగు శివ, కుక్కల మహేష్, మరద పౌలు, దాసరి పంపోజీ, మెరుగు ప్రసాద్ (డ్రైవర్) సముద్రంలో నెల్లూరు జిల్లా వైపు బయలుదేరారు. 4 రోజుల పాటు వేట కొనసాగించారు. ఆ సమయంలో మాండూస్ తుపాను హెచ్చరికలు వెలువడటంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వీరి మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోగా.. కాసేపటికే ఆ బోటులోని ఒక ఇంజన్ చెడిపోయింది. అలల ఉధృతికి బోటు ముందుకు సాగలేదు. దీంతో వారు నడిసంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా ముందుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం మొబైల్ సిగ్నల్స్ పనిచేయడంతో టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తాము ఆపదలో ఉన్నామని అధికారులకు సమాచారమిచ్చారు. యంత్రాంగం అప్రమత్తం సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్, మత్స్యశాఖ, స్పెషల్ బ్రాంచ్, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులతో ఫోన్లో సంప్రదించగా.. రాకాసి అలలు ఉధృతంగా వస్తున్నాయని బోటు తిరగబడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపట్నం సమీపంలోని గుండమాల రేవుకు వెళ్తామని అధికారులకు చెప్పగా.. చీరాల మత్స్యశాఖ జేడీ పి.సురేష్, ఇతర అధికారులు కొత్తపట్నం బీచ్కు చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడి.. వారిని గుండమాలకు వెళ్లొద్దని, కొత్తపట్నం బీచ్కు రావాలని, తాము ఇక్కడే ఉన్నామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారంతా శనివారం రాత్రి 9 గంటలకు కొత్తపట్నం సమీపానికి వచ్చారు. అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో ముందుకు రాలేమని చెప్పి బీచ్కు 500 మీటర్ల దూరంలో లంగర్ వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం కొత్తపట్నం బీచ్కు చేరుకుని వేరే బోటును తీసుకెళ్లి వారిని తీసుకొచ్చారు. -
వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’
అలరారే అపార మత్స్య నిక్షేపాలకు ఆలవాలమైన నడి సంద్రంలో వినూత్న కేజ్ కల్చర్కు శ్రీకారం చుట్టడం ఓ సాహసం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి పది యూనిట్ల సమాహారం (ప్యాకేజ్)తో భారీ ప్రాజెక్టుకు నడుం కట్టడం నిజంగా అద్భుతం. ఈ పెను విప్లవానికి నాంది పలికారు చీరాల మండలం వాడరేవు యువకులు. కడలిపై వానర సైన్యం వారధి కట్టినట్టు.. వీరు భారీ పంజరాన్ని (కేజ్) నిర్మించి విజయవంతంగా సాగర జలాల్లోకి పంపారు. మహాద్భుత ఘట్టాన్ని కళ్లెదుటే ఆవిష్కరించి ఔరా అనిపించారు. చీరాల : మనం చెరువులు, కుంటలలో చేపలు, రొయ్యల పెంపకం చూసుంటాం. సముద్రంలో మత్స్య సాగును అసలు ఊహించలేం. ఈ అనూహ్య పరిణామాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు చీరాల మండలం వాడరేవు యువకులు. సముద్రంలో భారీ కేజ్ కల్చర్కు శ్రీకారం చుట్టారు. ఇతర దేశాల్లో ఉన్నదే.. చెరువులు, కుంటల్లో రొయ్యలు, చేపల సాగుకు కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. తరచూ మత్స్య సంపదకు వ్యాధులు సోకుతున్నాయి. దీని నుంచి తప్పించుకోవడం ఎలా.. అనే ప్రశ్న నుంచే సముద్రంలో మత్స్యసాగు చేయాలనే వినూత్న ఆలోచన పుట్టుకొచ్చింది. నిజానికి కేజ్ కల్చర్ కొత్తేమీ కాదు. పలు దేశాల్లో ఉన్నదే. మన దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విశాఖ ప్రాంతంలోనూ కొందరు ఈ సాగును చేస్తున్నారు కూడా. ఆచరణ ఇలా.. చీరాల మండలం వాడరేవుకు చెందిన రాకాతి శివ మత్స్యకారుడు. ఫైబర్ బోట్ల తయారీలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతని మేనల్లుళ్లు ఉస్మాన్, సతీష్ వైజాగ్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో సముద్రంలో చేపల సాగు (మెరీ కల్చర్) గురించి తెలుసుకుని మేనమామకు చెప్పారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. శివ, మేనల్లుళ్లు ఇద్దరితో పాటు వాడరేవుకు చెందిన మరో ఏడుగురు మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, కాకినాడలలో చేపడుతున్న కేజ్ కల్చర్ను పరిశీలించారు. భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వాడరేవులో అలల సాంద్రత, మత్స్య ఉత్పత్తి అనుకూలంగా ఉందని సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో 2018లో మత్స్యశాఖ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి తొలి అడుగు పడింది. అయితే కరోనా వల్ల నిర్మాణ పనులు ఆలస్యమైనా ఎట్టకేలకు గతనెల 6న భారీ కేజ్ జల ప్రవేశం చేసింది. వంద టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఆరు నెలల్లో వంద టన్నుల మత్స్య ఉత్పత్తులు లక్ష్యంగా ఈ కేజ్ కల్చర్కు శ్రీకారం చుట్టారు. సముద్రంలో 9 కిలోమీటర్ల దూరంలో ఈ కేజ్ను నిలిపి సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రొయ్య, చేప పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీని కూడా ప్రారంభించి రోజూ లక్ష పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోనున్నారు. మత్స్య సంపద రవాణా, రాకపోకలకు అనుకూలంగా పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో జూన్ 15 వరకు సాగుకు విరామం ప్రకటించారు. నిర్మాణం.. ప్రత్యేకం.. ఈ భారీ కేజ్ పంజరంలా ఉంటుంది. 145 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో 2,700 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. కేజ్ మధ్యలో నిలువు, అడ్డంగా దారుల ఏర్పాటుతోపాటు సిబ్బంది నివాసం, దాణా నిల్వకు రెండు గదుల నిర్మాణం, చేపలు, రొయ్యల సాగుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చారు. జనరేటర్లూ అందుబాటులో ఉంచారు. తుప్పు పట్టని తేలికపాటి ఇనుప పైపులు తయారీకి వినియోగించారు. 3.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఈ కేజ్ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి సూచనలు అందించారు. రూ.1.50 కోట్లతో.. నీలి విప్లవం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017–18లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 41 కేజ్ కల్చర్ యూనిట్లను మంజూరు చేసింది. విడివిడిగా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించిన శివ బృందం అప్పటి మత్స్యశాఖ అధికారుల సహకారంతో ఒక సంఘంగా ఏర్పడింది. ఒక్కో యూనిట్ కాకుండా పది యూనిట్లను కలిపి ఏక ప్యాకేజ్గా దరఖాస్తు చేసుకుంది. దీంతో రూ.50 లక్షల రుణం మంజూరైంది. రూ.37 లక్షల రాయితీ వచ్చింది. దీనికి అదనంగా ఈ బృందం మరో రూ.కోటి వెచ్చించి భారీ కేజ్ కల్చర్ను రూపొందించింది. బహుళ ప్రయోజనకారి చీరాల వాడరేవులో తొలిగా కేజ్ కల్చర్కు శ్రీకారం చుట్టాం. సీఎంఎఫ్ఆర్ఐ, మత్స్యశాఖ సహకారంతో భారీ ప్రాజెక్టును చేపట్టగలిగాం. సముద్రంలో మత్స్య సాగు ప్రయోజనకరంగా ఉంటుంది. పలు చోట్ల ఈ కేజ్ కల్చర్ అమల్లో ఉంది. వాడరేవుకు ఖ్యాతిని తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలో మత్స్య ఉత్పత్తిలో చీరాల ప్రాంతం ముందుంటుంది. మత్స్యకారులకు ఉపాధి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారి. – రాకాతి శివ, కేజ్ నిర్మాణకర్త, వాడరేవు ఇదో విప్లవం వాడరేవులో ఏర్పాటు చేసిన భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఓ విప్లవం. యువకుల అంకితభావం, మత్స్యశాఖ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. సముద్రంలో భారీ కేజ్ నిలుపుదలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాం. మత్స్యశాఖ తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తాం. – ఎ.చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖాధికారి, ఒంగోలు -
చీరాల బీచ్లో బాలయ్య ఫ్యామిలీ సందడి
-
చీరాలలోని శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
చిన్న ముంబైలో పెద్ద మోసం..
చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ..జరిగింది గతంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో ర్యాప్లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్ ఆఫీసర్గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్
చీరాల: ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు ఈ ఆటోవాలా. ‘నే ఆటోవాణ్ణి.. ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి’ అంటూ ప్రయాణికుల్ని ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు. చదవండి: ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా! -
ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదు..!
చీరాలటౌన్: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
'20 ఏళ్లలో ఎన్నో అవమానాలు'
సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు, బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు. -
చీరాల: మందలించాడని మర్డర్ చేశాడు
-
దారుణం: మందలించాడని రిటైర్డ్ ఏఎస్ఐ మర్డర్
సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్ ఏఎస్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్ ఏఎస్ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్ షానూర్పై హత్యాయత్నం) -
ఎస్సై విజయ్కుమార్పై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఒంగోలు: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన చీరాల యువకుడు కిరణ్ కేసులో ఎస్సై విజయ్కుమార్పై సస్పెన్షన్ వేటుపడింది. కిరణ్పై పోలీసులు దాడి చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపణల నేపథ్యంలో చీరాల ఎస్సై విజయ్కుమార్ని సస్పెండ్ చేస్తూ ఎస్పీ గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. చీరాలలోని థామస్పేటకు చెందిన ఎరిచర్ల మోహన్రావు, హెప్సీబాల కుమారుడు కిరణ్కుమార్ (26), స్నేహితుడు షైనీ అబ్రహాంతో కలిసి ఈనెల 19వ తేదీన తన పల్సర్ వాహనంపై వెళుతుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఔట్పోస్టు వద్ద పోలీసులు ఆపి మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా, వారు వాగ్వావాదానికి దిగారు. ఎస్ఐ విజయ్కుమార్ వారిని పోలీస్ జీపులో తరలిస్తుండగా, మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు దాడి చేశారని పేర్కొంటూ కిరణ్, షైనీలు ఔట్పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్ను అదే రోజు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. (మాస్కు వివాదం.. యువకుడి బలి) (చీరాల ఘటనపై సీఎం జగన్ సీరియస్) -
కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమంచి
సాక్షి, ప్రకాశం: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన యువకుడు కిరణ్ మృతదేహానికి చీరాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళర్పించారు. యువకుడి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కిరణ్ మృతిపై విచారణ చేస్తామని అడిషనల్ ఎస్పీ గంగాధర్ తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా, మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
చీరాల ఘటనపై సీఎం జగన్ ఫైర్
-
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
ఆందోళన వద్దు: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం: చీరాలో వెలుగు చూసిన రెండు కరోనా పాజిటివ్ కేసుల వ్యక్తులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్, క్వారంటైన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. (పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా ప్రస్తుతం వారి రిపోర్టులు రావాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెల్లోచ్చిన బృందంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. దీనిపై ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన పడొద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి సూచించారు. (ఇంటికెళ్లాలని ఉంది: కనికా కపూర్) -
ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా వైరస్ (కోవిడ్–19 ) దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 19వ తేదీన ఒంగోలు నగరంలోని ఓ యువకునికి తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే సదరు యువకుని కుటుంబ సభ్యులకు, తనతో ప్రయాణించిన వ్యక్తులకు సైతం రిపోర్టులు నెగిటివ్ రావడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే శనివారం ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న చీరాలకు చెందిన ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. (ఒకట్లూ, పదులు, వందలు.. నేడు వేలు!) ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి నివాసముండే చీరాల చుట్టు పక్కల ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించి నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణే ఆయుధంగా అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చామని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అనుమానితులను అందులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వలంటీర్ల సాయంతో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఇళ్లకే పరిమితం కావాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. (క్వారంటైన్ కేంద్రం ఎలా ఉంటుందంటే..) ముస్లిం మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆయనతో పాటు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ వార్డులకు తరలించే పనిలో పడ్డారు. చీరాల రూరల్ మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీ పరిధిలోని నవాబ్పేటకు చెందిన ముస్లిం మతపెద్ద ఈ నెల 19వ తేదీన సుమారు 80 మంది ముస్లింలతో కలిసి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. (మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ) ఈ నెల 15న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మతపెద్దతో కూడిన బృందం విజయవాడ మీదుగా 17వ ఉదయం చీరాలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే మతపెద్ద ప్రయాణించిన భోగీలో చీరాల, పేరాల, కారంచేడు, ఈపురుపాలెం, ఒంగోలుకు చెందిన ఐదుగురు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది. వీరంతా మతపెద్దతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు తేలడంతో వీరందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సదరు మతపెద్ద చీరాలకు వచ్చిన తరువాత నవాబ్పేట మసీదులో ప్రార్థనలు చేయడంతో పాటు రెండు వివాహ కార్యక్రమాలకు సైతం హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఆయనతో పాటు ప్రయాణించిన వారి గురించి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. (కోవిడ్తో స్పెయిన్ యువరాణి మృతి!) చీరాలలో భయం..భయం చీరాల ప్రాంతం కరోనా కబంద హస్తాల్లోకి వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేయడంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ కరోనా వైరస్ కబళిస్తుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పంజా చీరాలపై పడింది. చీరాల మండలం సాల్మన్ సెంటర్ పంచాయతీలోని నవాబుపేటలో గురువారం రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. నవాబుపేటకు చెందిన భార్య, భర్తలకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన ప్రత్యేక అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ) రక్త పరీక్షల అనంతరం శనివారం వారిద్దరికీ కరోనా వైరస్ ఉన్నట్లుగా రిపోర్టులు రావడంతో చీరాల ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో చీరాల ప్రాంత వాసులల్లో వణుకు మొదలైంది. అయితే కరోనా బాధితులు ఎక్కడెక్కడకు వెళ్లారు... ఎవరిని కలిశారు అనేది తెలియాల్సి ఉంది. దీంతో బాధితులతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తుల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. సుమారు 50 నుంచి 60మందిని ఐసోలేషన్కు తరలించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే 1056 మంది విదేశీ ప్రయాణికులను సర్వేలేన్స్లో ఉంచారు. (కరోనాతో చిన్నారి మృతి; తొలి కేసు!) పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడకు వెళ్లారో పరిశీలిస్తే.. మార్చి 12: చీరాల మండలం సాల్మన్సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. మార్చి 14: ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మార్చి 14,15,16: మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. మార్చి 17: ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు. మార్చి 19: ఒంగోలులో రాజీవ్ గృహకల్ప కాలనీలో కుమారుడి ఇంటి వద్ద ఉన్న భార్యను తీసుకుని అదే రోజు అర్ధరాత్రి 2 గంటలకు చీరాలకు చేరుకున్నారు. మార్చి 20 నుంచి 25వ తేదీ వరకు చీరాలలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వివాహానికి, ఒక ముస్లిం కుటుంబంలో జరిగిన అంత్యక్రియలకు హాజయ్యాడు. 20వ తేదీ శుక్రవారం మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నాడు. మార్చి 25: భార్యాభర్తలు ఇద్దరికి దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం రావడంతో వారిని ఏఎన్ఎం పరీక్షల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మార్చి 26: దంపతులిద్దరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ప్రత్యేక అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. శనివారం వారికి కరోనా పాజిటివ్గా రావడంతో నవాబుపేట ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. రెడ్జోన్గా గుర్తించి రాకపోకలు నిలిపివేశారు. అయితే కరోనా అనుమానితులుగా వైద్యశాలకు తరలించిన వెంటనే ఆ ప్రాంతంలో అధికారుల బృందం పర్యటించింది. బ్లీచింగ్, శానిటేషన్ పనులు చేశారు. బాధితుడి నివాసం పరిసర ప్రాంత ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి భరోసా కల్పించారు. -
ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు. -
కాశీ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే.. కటకటాల్లోకి..!
సాక్షి, చీరాల రూరల్: ఓ వ్యక్తి వ్యసనాలకు బానిసై అందిన కాడికి అప్పులు చేసి జులాయిగా తిరుగుతూ ఇంటిని కూడా విక్రయించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మాజీ భార్యను కర్రతో మోది హత్య చేశాడు. ఆమె మాజీ భర్తను ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రూరల్ మండలం తోటవారిపాలెం పంచాయతీ బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన నీలం కృష్ణమూర్తి, ఆదిలక్ష్మి (39) భార్యాభర్తలు. వీరికి 1996లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణమూర్తి పదేళ్లుగా మద్యానికి, పేకాటకు బానిసయ్యాడు. ఇంట్లో జరగడం లేదని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఎలాగని భర్తను ఆదిలక్ష్మి ప్రశ్నిస్తుండేది. కృష్ణమూర్తి ఇంట్లోకి డబ్బులు ఇవ్వకపోగా కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భర్త బాధలు భరించలేని ఆమె 2011లో ఈపురుపాలెం పోలీసుస్టేషన్లో కేసు కూడా పెట్టింది. పోలీసులు కృష్ణమూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు కూడా పంపారు. జైలు నుంచి వచ్చిన అతడిని అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయసాగారు. ఏం చేయాలో పాలుపోని అతడు ఉన్న ఇంటిని తెగనమ్మేందుకు సాహసించాడు. ఇందుకు భార్య అడ్డుపడింది. ఉన్న ఇంటిని అమ్మితే నడిరోడ్డుపై ఉండాల్సి వస్తుందని, కుటుంబం పరువు బజారున పడుతుందని వేడుకుంది. ఇరువర్గాలకు చెందిన పెద్దలు రాజీ కుదిర్చారు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఆదిలక్ష్మి 10 నెలలుగా అతడికి దూరంగా ఉంటోంది. తనకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేసి భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఆదిలక్ష్మిపై పగ పెంచుకున్న కృష్ణమూర్తి ఎలాగైన ఆమెను చంపుతానని తనకు తెలిసిన వారికి చెబుతూ తిరుగుతున్నాడు. సరైన అదను కోసం ఎదురు చూస్తుçన్న అతడు ఈ ఏడాది ఆగస్టు 25న సాయంత్రం ఏడు గంటల సమయంలో కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రురాలిని స్థానికులు, ఆమె బంధువులు చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె అదే నెల 30వ తేదీన మృతి చెందింది. పోలీసులు మొదట కొట్లాట కేసుగా నమోదు చేసి ఆమె మరణానంతరం హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం వేట కొనసాగించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇచ్చిన ఆదేశాల మేరకు డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, రూరల్ సీఐ జె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక వేషధారణల్లో నిందితుడు నిందితుడు తప్పించుకునేందుకు అనేక వేషధారణల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే సమాచారం తెలుసుకున్న కృష్ణమూర్తి గుండు గీయించుకుని అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. కొంతకాలం తనకు తెలిసిన వారి వద్ద పొడుగుల పని చేశాడు. చేతిలోకి కొంత డబ్బులు వచ్చాక తిరిగి మరొక చోటికి మారేవాడు. మరికొంత కాలం బేల్దారి పనులకు వెళ్లేవాడు. ఇలా పోలీసులకు చిక్కకుండా సుమారు రెండు నెలలు పాటు తిరిగాడు. చివరికి అతడు ప్రముఖ పుణ్య క్షేత్రం కాశీ వెళ్లేందుకు సమాయత్తమై తన స్వగ్రామానికి దగ్గరగా ఉన్న గుంటూరు జిల్లా స్టూవర్టుపురం చేరుకున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాసరావు ఈపురుపాలెం ఎస్ఐ సుధాకర్, హెడ్కానిస్టేబుల్ కుంభా శ్రీను, కానిస్టేబుళ్లు విజయ్కృష్ణ, నజీర్, హోంగార్డు రవూఫ్లు నిందితుడు కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. -
ఆ చేతి బజ్జీ
చలి గజగజ వణికిస్తున్నా... జోరున వాన కురుస్తున్నా... వెంటనే బజ్జీలు, పునుగుల మీదకు మనసు వెళ్తుంది...ఆవురావురుమంటూ లాగిస్తూ, ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది...పుల్లారావు బజ్జీలకు యమ క్రేజ్... ఏ సీజన్లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే... స్వచ్ఛమైన బజ్జీ, పునుగులను రుచి చూడటం కోసం బారులు తీరతారు చీరాల వాసులు... 30 సంవత్సరాలుగా బజ్జీ ప్రియులకు విందు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు పుల్లారావు... ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు... పుల్లారావు వ్యాపార విజయ రహస్యమే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు. అంతే! మరి అక్కడ నుంచి కాలు కదపలేకపోతారు. అప్పటికే అక్కడ క్యూలో నిలబడినవారిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ తిరునాళ్లను తలపిస్తుంది. చిన్నదే అయినా... చూడటానికి చిన్న అంగడే అయినా అక్కడ దొరికే బజ్జీ, పునుగులను ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వేడివేడిగా లభ్యమయ్యే పుల్లారావు బజ్జీలంటే చీరాల పట్టణ వాసులకు యమ క్రేజ్. స్వచ్ఛమైన పదార్థాలతో, రుచికరంగా తయారు చేసే పునుగు, బజ్జీలను గత మూడు దశాబ్దాలుగా చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు పుల్లారావు. స్థానిక కొట్లబజారు రోడ్డులోని తుపాకి మేడ దగ్గర ఊర పుల్లారావు చిన్న బడ్డీ బంకు పెట్టి, అందులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా చేస్తారు... బజ్జీలకు పచ్చి పప్పు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి పిండిని బాగా మెత్తగా చేసి ఉప్పు, కారం అన్ని సమపాళ్లలో కలిపి, స్పెషల్గా తెచ్చిన మిరపకాయలను కోసి, వాటిలో వాము పొడిని తగినంతగా చేర్చి, కాగిన నూనెలో రెండు సార్లు వేయించుతారు. అందుకే వాటికి అంత రుచి అంటారు బజ్జీ తిన్నవారంతా. మినప్పప్పు, బియ్యప్పిండిని వాడుతూ రుచికరమైన పునుగులను తయారుచేస్తారు. పునుగు పిండితో తయారుచేసిన బరోడా బజ్జీ, బొండాలకు మరింత క్రేజ్ ఉంది. ఆ బజారులో ఎన్నో బజ్జీల షాపులున్నా పుల్లయ్య బజ్జీల షాపు దగ్గరే జనం కనిపిస్తారు. స్వచ్ఛమైన నూనె, మన్నిక కలిగిన పదార్థాలతో రుచికరంగా తయారయ్యే పుల్లయ్య బజ్జీలను తిన్న ఎంతటివారైనా ‘వాహ్వా! పుల్లయ్య బజ్జీ!!’ అని పొగడక మానరు. – సంభాషణ, ఫొటోలు: పి. కృష్ణ చైతన్య, చీరాల అర్బన్ -
ఇక్కడ ప్రతి ఆహార పదార్థం కల్తీ!
సాక్షి, చీరాల(ప్రకాశం): కల్తీ ఆహార పదార్థాలకు చీరాల మల్టీ బ్రాండ్గా మారింది. ఉప్పు..పప్పు.. కారం.. టీ పొడి నుంచి ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారింది. అయితే కల్తీలన్నింటిలో నూనెలదే పైచేయిగా ఉంది. పైకి బ్రాండెడ్ కంపెనీల పేరుతో లోపల మాత్రం నాణ్యతలేని నాసిరకం నూనెను నింపి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. బ్రాండెడ్ వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి వచ్చే నీటిని కలిపి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు జరిపితే చీరాలలోని నూనె వ్యాపారులు అంతా దుకాణాలు సర్ది పరారయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం చీరాల పట్టణంలో ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతో కల్తీ నూనెలను విక్రయిస్తున్న దుకాణంపై అధికారులు దాడులు చేశారు. అక్కడ వేరుశనగ నూనె కావాలని కోరిన గ్రామీణులకు వ్యాపారులు కల్తీ నూనెనే విక్రయిస్తున్నారు. నూనె వ్యాపారుల కాసుల కక్కుర్తికి కొందరు అధికారులు తోడుగా నిలిచి నామమాత్రంగా కూడా తనిఖీలు చేయకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి తీసిన నూనెను కలిపి చీరాల్లోని వ్యాపారులు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విడి వినియోగం ఎక్కువే.. చీరాల ప్రాంతంలోని బార్లు, రెస్టారెంట్లు, ఖానా ఖజానాలు, హోటళ్లు, మెస్లల్లో వంటకాల తయారీకి, తోపుడు బండ్లలో పిండివంటలు చీరాల్లోని నూనె దుకాణాలు, గానుగల నుంచి వంట నూనెలను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క చీరాల ప్రాంతంలోనే వీటి ద్వారా నెలకు రూ.90 లక్షలకు పైగా వ్యాపారాలు చేస్తుంటారు. తినుబండారాలు, ఆహార పదార్థాలు విక్రయించే వారు అధికంగా నూనె వినియోగిస్తుంటారు. ఆహార పదార్థాలను తయారు చేసినప్పుడు మిగిలిన నూనెను మరుసటి రోజు వాడకుండా పారబోయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోకుండా ఆ నూనెలను వాడుతూనే ఉన్నారు. కల్తీ నూనెలతో వ్యాపారాలు చేసే వారికి కనీసం 95 శాతం మందికి లైసెన్స్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కల్తీ నూనెలతో వంటపదార్థాలు తయారు చేసిన వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉన్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నెలకు రూ.కోటికి పైగా విక్రయాలు కల్తీ నూనె విక్రయాలు నెలకు దాదాపుగా రూ. కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయంటే కల్తీ వ్యాపారం ఇక్కడ ఎంత జోరుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో 30 వరకు ప్రత్యేక నూనె దుకాణాలు ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు కల్తీ నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. చీరాల నుంచి తయారైన కల్తీ నూనెను చీరాల, పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ నూనెల విక్రయాల్లో కనీసం 10 శాతం మేరకు ఇతర నూనెలు కలిపి నాసిరకం నూనె, విడినూనెలను బ్రాండెడ్ కంపెనీల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కల్తీ నూనె తయారీ, అమ్మకాల్లో దర్బార్ రోడ్డు, సంతబజారు, రామమందిరం వీధిలోని నూనె దుకాణాలు, కొన్ని హోల్సేల్ కిరాణా వ్యాపారులు కీలకపాత్ర పోసిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నూనె దుకాణాలు ఇతర ప్రాంతాల నుంచి పత్తి గింజల నూనె, పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలను డ్రమ్ముల్లో చీరాలకు దిగుమతి చేసుకుని వేరుశనగ నూనెలో కల్తీలు చేసి బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని నాసిరకం నూనెల డ్రమ్ములను దిగుమతి చేసుకుని ప్రజలకు బ్రాండెడ్ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ పక్కకు.. అసలు పరీక్షలకు..! ఆహార భద్రతాధికారులు ప్రతినెలా నూనెలను తనిఖీలు చేయాల్సి ఉండగా వారు వచ్చే సరికి వ్యాపారులు కల్తీ నూనెల డ్రమ్ములను పక్కనబెట్టి బ్రాండెడ్ నూనెలను చూపించి వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్లకు పంపిస్తున్నారు. అక్రమ, కల్తీ వ్యాపారాల్లో అధికారులు పాత్ర కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నూనెలను కొనుగోళ్లు చేసిన హోటళ్లు, మెస్లు, పిండివంటల తయారీదార్లు నుంచి అధికారులు శాంపిళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తే కల్తీ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది. కలీలకూ చెక్ పడుతుంది. కానీ ఆహారభద్రతా అధికారులు మాత్రం కేవలం బ్రాండెడ్ నూనెలను ల్యాబ్లకు పంపించడం వలన కల్తీ నూనె విషయం తెలియడం లేదు. అనారోగ్యం తప్పదు కల్తీ ఆహార పదార్థాలను భుజించడం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వంట నూనెల్లో కల్తీ వలన హృద్రోగ, రక్తనాళ సంబంధిత వ్యాధులు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కొవ్వు పెరిగి రక్తపోటు, కొన్ని సందర్బాల్లో గుండెపోటు, మొదడు పోటు వచ్చి ప్రాణాలను హరించివేస్తుంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పరిశుభ్రత లోపిస్తే అతిసారం, ఫుడ్పాయిజనింగ్, జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. డాక్టర్ ఎన్.రాజ్కుమార్, చీరాల -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై చీరాల ఒన్టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఒక పురుషుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారివద్ద రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఒన్టౌన్ సీఐ నరహరి నాగ మల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెంలో నివాసముండే అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. వీరు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే మహిళలను, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలకు దూరంగా ఉండే మహిళలను గుర్తిస్తారు. వారికి డబ్బులు ఆశచూపించి లోబరుచుకుని వ్యభిచార కూపంలోకి బలవంతంగా దించుతారు. అంతేకాక వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించారు. ఈ విధంగా వారు వ్యాపార పరంగా చీరాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యభిచార మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే వారు చీరాల, ఈపురుపాలెం, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సిఐ తెలిపారు. అయితే ఇటువంటి సంఘటనలపై తరచు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా ప్రదేశంపై పోలీసులు ఎప్పటినుండో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం అందుకున్న ఒన్టౌన్ సీఐ నాగ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో రామకృష్ణాపురంలోని బోడిపాలెం వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఈ దాడిలో ఒక పురుషుడితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. వారితో పాటు గృహ నిర్వాహకులైన అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులను కూడా అరెస్టు చేశారు. వారిని తనిఖీలు చేయగా వారివద్ద రూ. 9,230 నగదు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన నగదుతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యో పాపం.. ఆడపిల్ల
నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి. అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం. -
చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు
-
చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. చదవండి : నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..! ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేను యడం రవిశంకర్ ప్రశ్నించగా నన్నే ప్రశ్నిస్తావా... నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యడం రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కరణం బలరామకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
దీనులంటే లెక్కలేదు!
సాక్షి, చీరాల: దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్మారక 100 పడకల చీరాల ప్రభుత్వాసుత్రిలో చికిత్సలు పొందే రోగులకు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలు సక్రమంగా అందించడంలేదనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. వారిపై ఉన్న ఆరోపణలు అటుంచితే వివిధ ప్రమాదాల బారినపడి ఆస్పత్రిలో చికిత్సలు పొందుదామని వచ్చే క్షతగాత్రులకు, నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కనీసం స్టెచ్చర్లు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ సూరినేని ఉష గత మంగళవారం వైద్యలను, వైద్య సిబ్బందిని వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ఆస్పత్రిలో విచారణ చేస్తున్న సమయంలో కూడా ఆస్పత్రికి వచ్చిన బాధితులను సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటువంటి సంఘటనలు నిత్యం ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నా స్పందించే అధికారులు లేకపోవడం శోచనీయం. చీరాలకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బ తగిలింది. తన బంధువుల సాయంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుదామని గత మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. అతడు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లే సమయంలో నేలపై దోకుతూ లోపలికి వెళ్లాడు. అతని పరిస్థితిని చూసిన ఆస్పత్రి సిబ్బంది కనీసం అతనికి స్టెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ అందించలేదు. అతడు ఆస్పత్రిలోకి వెళ్లి కాలికి కట్టు కట్టించుకున్న అనంతరం లోపలికి ఏవిధంగా అయితే వెళ్లాడో బయటకు కూడా నేలపై దేకుతూ అదే విధంగా వచ్చాడు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారిణి డాక్టర్ ఉష అదే ఆస్పత్రిలో వార్డులను తనిఖీలు చేసి వైద్య సేవలపై వైద్యులను విచారిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. మరోవ్యక్తిని కూడా... స్థానిక హైమా ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సు డోరు తగిలి పాత చీరాల గేటు సమీపంలో నివాసముండే సుద్దపల్లి సాయి అనేవ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. అయితే బాధితుణ్ణి అతని స్నేహితులు చికిత్స నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితుణ్ణి ఆటోలో తీసుకొచ్చిన అతని స్నేహితులే అచేతనంగా.. రక్త గాయాలతో ఉన్న బాధితుణ్ణి ఆ ఇద్దరు స్నేహితులు బాధితుడి కాళ్లు, చేతులు పట్టుకొని అతి కష్టం మీదు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి బెడ్పై పడుకోపెట్టారు. ఆ తర్వాతే సిబ్బంది బాధితుడి వద్దకు చేరి హడావుడిగా చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ కోసం బాధితుని తల్లి రత్న కుమారి పడరాని పాట్లు పడింది. చాలా సేపటి వరకు అంబులెన్స్ దొరకకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె వైద్య సిబ్బందిని విచారణ చేస్తున్న జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ కర్త డాక్టర్ ఉష వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేదని ఉన్న అంబులెన్స్ కూడా పూర్తిగా పాడై పోయిందని, డ్రైవర్ కూడా లేడని డాక్టర్ ఉష బాధితుని తల్లి రత్న కుమారికి చెప్పడం విశేషం. నిరుపేదలు ఎక్కువగా చికిత్స పొందే ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం దారుణమని బాధితుని తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. అయితే ఆస్పత్రి ఆవరణలో నిత్యం ఉండే 108 అంబులెన్స్ కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని ఒంగోలు ఆస్పత్రిలో చేర్చేందు వెళ్లిందని సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ ఉష ఆస్పత్రి పర్యవేక్షకుని పిలిచి వివరణ తీసుకున్నారు. ప్రతినెలా ఎన్ని కేసులు ఒంగోలు పంపుతున్నారని ప్రశ్నించారు. అయితే ఎంపీ ల్యాడ్స్ ద్వారా చీరాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. -
చీరాలలో టీడీపీ నేతల హైడ్రామా..
సాక్షి, చీరాల (ప్రకాశం): చీరాల మండల పరిషత్ అబివృద్ధి అధికారి వ్యవహరిస్తున్న తీరుతో వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అన్నిశాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక జాబితా జిల్లా అధికారులకు పంపినది ఒకటి ఉండగా.. టీడీపీ నేతల బెదిరింపులకు, ఆదేశాలకు తలొగ్గి వారి మెప్పు పొందేందుకు మరొక జాబితాను తయారు చేశాడు ఆ అధికారి. దీంతో బుధవారం చీరాల గ్రామ వలంటీర్ల శిక్షణ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తమకు సంబంధించిన అనుచరులతో కలిసి హై డ్రామా సృష్టించారు. ఆదివారం ప్రకటించిన జాబితా ఫైనల్కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయంలో నానా హంగామా సృష్టించి బెదిరింపుకుల పాల్పడటంతో ఎంపీడీవో మరొక జాబితా తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం చీరాల ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల గేటు ముందు టీడీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో కలిసి నానా హైరానా సృష్టించారు. చీరాల్లో పోలీసులు 30 యాక్టు, 144 సెక్షన్ను విధించడంతో తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు వన్టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసిన అనంతరమే పోలీసులు వలంటీర్లను శిక్షణ కేంద్రం లోపలికి అనుమతించారు. ఒన్టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, రాజేశ్వరరావు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని తోటవారిపాలెం, తదితర గ్రామాలకు చెందినవారు వలంటీర్ ఇంటర్వ్యూలో అర్హత సాధించామంటూ మరో జాబితాలతో మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాషా, కొందరు టీడీపీ నేతలను వెంటబెట్టుకుని శిక్షణ కేంద్రంలోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వలంటీర్లుగా నియామకం పొందిన జాబితా చూపించాలని కోరారు. దీంతో వారు తమ వద్ద ఉన్న జాబితా చూపించగా మండల పరిషత్ సిబ్బంది వద్ద ఉన్న తుది జాబితాతో సరిపోకపోవడంతో వారిని శిక్షణకు అనుమతించలేదు. ఒక దశలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని పోలీసులు హెచ్చరించి పంపించారు. టీడీపీ నేతలు మాత్రం దురుసుగా వ్యవహరించడంతో కొందరిని పోలీస్స్టేషన్కు తరలించారు. రెండు జాబితాలు తయారు చేసిన ఎంపీడీవో నమ్మక ద్రోహం చేశారని వారు వాపోయారు. మిగిలిన ఆ 61 పోస్టులు ఎక్కడ? 446 పోస్టులకు గాను 385 మందిని గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేశారు. మిగిలిన 61 మందిని ఎంపిక చేయకండా ఎంపీడీవో అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. చీరాల ఇన్చార్జి ఎంపీడీవో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమనాలను రేకెత్తించడంతో పాటు, టీడీపీ నాయకులు సూచించిన వారిని నియామకం చేసేందుకు పాల్పడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. -
పస్తులతో పోరాటం..
తరాల తరబడి ఆకలి పోరాటం వారిది. చేతి వృత్తినే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే బట్టలు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేస్తుంటే వారికి మాత్రం రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలీ కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.300 కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ రూ.300తోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు అన్ని సర్దుకుపోవాల్సిన పరిస్థితిల్లో కార్మికులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): చేనేత కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాస్టర్వీవర్లు (పెట్టుబడిదారులు) మాత్రం కోటీశ్వరులుగా మారుతుంటే వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికులు మాత్రం అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. ఇప్పటికీ 2016లో ఉన్న మజూరీ(కూలీ)లే అమలవుతున్నాయి. ఇదేమని గొంతెత్తి అడిగితే అలాంటి వారికి పని కల్పించకుండా మాస్టర్ వీవర్లందరూ ఒకే విధంగా వ్యవహరించడంతో కనీసం పని కూడా లేక అవస్థలు పడుతున్నారు. అందుకే అవస్థలన్నీ మౌనంగానే ఎదుర్కొంటున్నారు నేత కార్మికులు. కొద్ది నెలల పాటు ఆందోళన చేస్తే కార్మికశాఖ, చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం రేట్లను కూడా అమలు చేయకుండా మాస్టర్వీవర్లు మోసానికి ఒడిగడుతున్నారు. చీరాల ప్రాంతంలో 17 వేల మగ్గాలకు పైగా ఉండగా, 50 వేల మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మాస్టర్వీవర్ల వద్ద కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంటి వద్దే మగ్గం పెట్టుకొని మాస్టర్వీవర్ ఇచ్చే ముడిసరుకుతో వస్త్రాలను తయారు చేసి ఇస్తుంటారు. ఇందుకు గాను వస్త్రాల రకాలను బట్టి కూలీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం సాదా చీరకు రూ.1700 వరకు చెల్లిస్తున్నారు. ఈ చీర నేయాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. కుప్పడం చీరకు రూ.8500 నుంచి రూ.9వేల వరకు చెల్లిస్తారు. ఈ చీర నేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. కంచి బోర్డర్కు రూ.7000 వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఇందులో కార్మికుడు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్లు కట్టినందుకు, అంచులు అతికినందుకు, కడ్డీలు చుట్టినందుకు, గమ్ము పెట్టింనందుకు, ఇతర పనులకుగాను ఒక్కో బారుకు రూ.1000ల వరకు కార్మికుడే ఖర్చు భరాయించాలి. ఉదాహరణకు కంచి బోర్డర్ చీరలు నేస్తే మాస్టర్ వీవర్ రూ.7000 ఇస్తే అందులో రూ.1000లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అంతే సరాసరిన రోజంతా భార్యభర్తలు కలిసి పని చేస్తే రూ.300 పడుతుంది. దీంతో కుటుంబమంతా జీవించడం అసాధ్యంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. పిల్లలను చదివించలేని పరిస్థితి ఎదురుకావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు కూడా మగ్గంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా మాస్టర్వీవర్లు మానవత్వంగా వ్యవహరించడం లేదు. మజూరీలను పెంచాలని కార్మికులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న దిక్కేలేదు. గత రెండు నెలలుగా మజూరీలను పెంచాలని చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టానికీ కరువే కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. 2016 నుంచి పెంచని మజూరీలు చేనేత కార్మికులు, మాస్టర్వీవర్లు ఒప్పందం మేరకు కార్మికశాఖ ఆద్వర్యంలో రెండేళ్లకు ఒకసారి కూలీలు పెంచేవిధంగా ఒప్పందం చేసుకుంటారు. కానీ 2016 నుంచి ఇప్పటి వరకు మాస్టర్ వీవర్లు కార్మికుల కూలీలు పెంచేందుకు ముందుకురావడం లేదు. గత కొన్ని నెలలుగా కార్మికులు మజూరీలు పెంచేందుకు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, కార్మికశాఖ కార్యాలయాల ముట్టడిలను చేపట్టారు. ఇప్పటికీ కార్మికులు, మాస్టర్ వీవర్ల మద్య మజూరీల ఒప్పందంపై 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం శూన్యంగా మారింది. బుధవారం జరిగిన చర్చలకు మాస్టర్ వీవర్లు ఎవ్వరూ హాజరుకాలేదు. పైపెచ్చు తమవద్ద పనిచేసే కార్మికులతో తమకు కూలీలు పెంచాల్సిన అవసరం లేదంటూ కార్మికశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా బలవంతంగా సంతకాలు చేయించి అందిస్తున్నారు. తమతో మాస్టర్ వీవర్లు బలవంతంగా సంతకాలు చేయించారని, నిజంగా వారికి కూలీలు పెంచాల్సిన అవసరం లేదని కార్మికశాఖ అధికారుల ముందే కార్మికులు చెప్పాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాస్టర్ వీవర్లను బెదిరించిన కార్మికులనే భయాందోళనలకు గురిచేస్తున్నారని వారి ఆరోపణ. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న కూలీలకు అదనంగా 20 శాతం కూలీ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే పని బంద్ అర్ధాకలితో అవస్థలు పడుతున్న చేనేత కార్మికులు తమ దుర్భర పరిస్థితులపై కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే అంతే సంగతులు... ఆ రోజు నుంచి సదరు మాస్టర్వీవర్ ఆ కార్మికుడికి పని చూపించడు. మిగతా మాస్టర్వీవర్లూ అతనికి పని కల్పించరు. ఒకవేళ కల్పించినా నాసిరకపు రకాలను నేయించడంతో పాటు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే కార్మిక శాఖ అధికారులకు చేసిన ఫిర్యాదులు కూడా కార్మికులు వెనక్కి తీసుకోవడం తప్పితే వారిపై ఉద్యమం చేసేందుకు నిలబడలేని పరిస్థితి. -
సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
సాక్షి, ఒంగోలు : చీరాల రామాపురం బీచ్లో రెండు రోజుల క్రితం గల్లంతైన కార్తీక్రెడ్డి మృతదేహం గురువారం చీరాల వాడరేవుకు కొద్ది దూరంలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహం రెండు రోజుల పాటు సముద్రపు నీటిలో ఉండటంతో చీకిపోయింది. కార్తీక్రెడ్డి శరీరాన్ని చేపలు కొరుక్కు తినడంతో శరీరంపై అక్కడక్కడా గాయాలు ఏర్పడ్డాయి పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ టీచర్స్ కాలనీకి చెందిన చల్లమల్లి వెంకట నారాయణరెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి (28) ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కార్తీక్రెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి చీరాల రామాపురం బీచ్కు సరదాగా గడిపేందుకు వచ్చాడు. సోమవారం రాత్రి వారంతా కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరి 18న ఉదయం చీరాల రామాపురం బీచ్కు చేరుకున్నారు. అంతా కలిసి సరదాగా సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కార్తీక్రెడ్డి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన అతని స్నేహితులు సమీపంలోని మత్స్యకారులకు తెలుపగా వారు సముద్రంలో వెతికారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తండ్రి వెంకట నారాయణరెడ్డి వచ్చి ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్రెడ్డి ఆచూకీ కోసం సముద్ర తీరంలో గాలిస్తుండగా విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కార్తీక్రెడ్డి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇది నిజంకాదా? నార్కో అనాలసిస్ టెస్ట్కు చంద్రబాబు సిద్ధమా?
-
చంద్రబాబు..దేవన్ష్పై ప్రమాణం చేస్తావా?: ఆమంచి
సాక్షి, చీరాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు. నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడుతున్నా. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తా అని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్. ప్రజలకు ఏమి అవసరమో ...ఆయనకు అవగాహన లేదు. చంద్రబాబు అతి తక్కువ నిధులు ఇచ్చింది చీరాల నియోజకవర్గానికే. ప్రజలు కట్టే పన్నులతో మేము అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మహిళలపై గౌరవం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టెలీకాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ మహిళలో అక్రమ సంబంధం అంటగట్టమని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది వాస్తవం కాదా?. దీనిపై నార్కో ఎనాలసిస్ పరీక్షకు సిద్ధమా?. లేకుంటే నీ మనవడు దేవన్ష్పై ప్రమాణం చేసి చెబుతావా?’ అని సవాల్ విసిరారు. -
ఇల్లాలే హంతకురాలు..
సాక్షి, చీరాల రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ ఇల్లాలు తన భర్తను చంపించింది. తండ్రి చనిపోవడం..తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. ఈ సంఘటన చీరాలలో వెలుగు చూసింది. పట్ట పగలు అంతా చూస్తుండగా ఐదు రోజుల క్రితం మాణిక్యరావు అనే యువకుడిని ఇద్దరు కలసి అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో చీరాల టూటౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో సీఐ రాజమోహన్రావు ఆధ్వర్యంలో డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రంగారెడ్డి నగర్కు చెందిన పాశం మాణిక్యరావు (30), కృష్ణకుమారిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమారై, కుమారుడు ఉన్నారు. బెస్తపాలెంలో ఆర్యాస్ ఫ్యాషన్ పేరుతో బట్టల షాపు నిర్వహిస్తున్నారు. నిత్యం సెల్ఫోన్తో కాలక్షేపం చేసే కృష్ణకుమారికి ఫేస్బుక్ ద్వారా తమిళనాడు రాష్ట్రం గుడియాట్టానికి చెందిన వెంకట్ నాథన్ శివ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం పాటు వీరు స్నేహం కొనసాగించారు. అనంతరం వెంకట్ నాథన్ శివతో తెగతెంపులు చేసుకుంది. వెంకట్ నాథన్ శివ స్నేహితుడు మధన్ కుమార్ మనోగరన్తో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమారి తన భర్త పాశం మాణిక్యరావుకు మధన్ కుమార్ మనోగరన్ను కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో మధన్ అప్పుడప్పుడూ చీరాల వచ్చి కృష్ణకుమారి ఇంట్లో బస చేసేవాడు. భార్య ప్రవర్తనపై మాణిక్యరావుకు అనుమానం కలిగింది. ఎలాంటి బంధుత్వం లేని తమిళనాడుకు చెందిన యువకుడితో భార్య సన్నిహితంగా ఉంటడం భర్తకు నచ్చలేదు. తప్పుడు ప్రవర్తన మానుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలూ జరిగాయి. భార్య పథకం ప్రకారమే హత్య విసుగు చెందిన ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఇదే విషయాన్ని మధన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి మాణిక్యరావును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ప్రణాళిక రచించారు. ఏ విధంగా హత్య చేయాలనే విషయంపై మధన్ తన సోదరుడైన దీపక్తో చర్చించాడు. దీపక్ అతని స్నేహితుడైన బ్లేడ్ అనేవ్యక్తి సాయంతో పది రోజుల క్రితం చీరాల చేరుకున్నారు. మాణిక్యరావుపై రెక్కీ నిర్వహించారు. గత నెల 29వ తేదీ ఉదయం వాకింగ్కు వెళ్లిన మాణిక్యరావును కొత్తపేటలోని ఏకేపీ జూనియర్ కళాశాల సమీపంలో దీపక్ అతని స్నేహితుడు బ్లేడు ద్విచక్ర వాహనంపై అనుసరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్లు ధరించి మాణిక్యరావును అడ్డుకున్నారు. ఆ వెంటనే దీపక్, అతని స్నేహితుడు బ్లేడు కలిసి మాణిక్యరావు మెడపై కత్తితో తీవ్రంగా పొడిచి పరారయ్యారు. మాణిక్యరావు రక్తమోడుతున్న పరిస్థితిలో సమీపంలోనే ఉన్న టూటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని దీపక్ అనే వ్యక్తి తనను పొడిచాడని పోలీసులకు చెప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్పందించిన పోలీసులు ఆయన్ను చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరులోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదులో కదిలిన డొంక తన కుమారుడిని పాత గొడవల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దీపక్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడనే మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ రాజ మోహనరావు, ఎస్ఐ నాగేశ్వరరావుతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. మాణిక్యరావు భార్య కృష్ణకుమారిని కూడా తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ తెలిపారు. కేసులో దీపక్, అతని స్నేహితుడు బ్లేడు, మరికొందరిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కేసును ఐదు రోజుల్లో ఛేదించిన సీఐ రాజమోహన్రావు, ఎస్ఐ నాగేశ్వరరావు మరి కొందరు కానిస్టేబుళ్లను డీఎస్పీ నాగరాజు అభినందించారు. -
చీరాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి ప్రచారం
-
మా అన్నకు సంబంధం లేదు: ఆమంచి
సాక్షి, చీరాల: ఎన్నికల్లో గెలవడానికి అధికార టీడీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. అధికార పార్టీ అండతో చీరాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్యాయంగా తన అన్నపై కేసు పెట్టారని తెలిపారు. ప్రమాదంలో కాలు చెయ్యి విరిగి సుదీర్ఘ కాలం వైద్యం తరువాత ఇప్పుడే పాక్షికంగా కోలుకున్న తన అన్న మీద హత్యాయత్నం కేసుపెట్టి, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజలిపేటలో యువకుల మధ్య జరిగిన గొడవలో తమ అన్నకు సంబంధం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో చీరాల టీడీపీ నేతల ప్రోద్భలంతో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తన అన్నను ఒక్కడిని ఇబ్బంది పెడితే చీరాలలో వేలాది మంది అన్నలు, తమ్ముళ్లుతో కలసి ఎన్నికలలో దీటైన సమాధానం ఇస్తామని, టీడీపీ బెదిరింపులకు భయపడబోనని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. -
బాలుడు స్కూలుకు వేళ్లలేదని మేనమామ దాష్టికం
-
ఏపీకి వైఎస్ జగన్ తప్ప మరో ఆప్షన్ లేదు: ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ సీపీలో చేరతా. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. నేను పార్టీ మారడానికి.. నా అసెంబ్లీ సమస్యలే కాదు, అనేకం ఉన్నాయి. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నాలుగున్నరేళ్లుగా నేను చీరాల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసాను అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమో! ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయనకు 70 ఏళ్లు దాటయాని, అల్జీమర్స్ వచ్చిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ రోజు ఒకమాట చెప్పి, తర్వాత మరో మాట చెబుతారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అతీత శక్తులు నడిపిస్తున్నాయని, సమాజంతో సంబంధం లేని వ్యక్తులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ఆమంచి మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేకున్నా తన నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు. పసుపు-కుంకుమ పేరు చెడగొట్టారు.. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాల్లో మేడలే. గత నాలుగేళ్లుగా రూ.6400 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వలేదు. వడ్డీ రుణం మాఫీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ చేయలేదు. పసుపు-కుంకుమ పేరును చంద్రబాబు చెడగొట్టారు. పసుపు-కుంకుమను జారుడు బండపై పోశారు. అది గాల్లోకి కలిసిపోతోంది. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేకే వైఎస్సార్ సీపీలో చేరాను. తెలుగుదేశంలో కులం పిచ్చి ముదిరిపోయింది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం యత్నిస్తోంది. చిన్న విషయానికి హైదరాబాద్ వదిలేశారు.. కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదు. తుని ఘటనలో మా సోదరుడిపై తప్పుడు కేసు పెట్టారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. మనం ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అనుభవొం ఉందని అధికారం ఇస్తే చిన్న విషయానికి హైదరాబాద్ నుంచి పారిపోయారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది. అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు. రోశయ్య ఆశీస్సులు తీసుకున్నా.. గతంలో పవన్ కల్యాణ్తో చాలాసార్లు భేటీ అయ్యాను. అయితే రాష్ట్ర సమస్యలపై చర్చించానే కానీ, జనసేనలో చేరతానని చెప్పలేదు. పార్టీ మారే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశీస్సులు తీసుకున్నాను. అయిదు రోజుల క్రితం ఆయనను కలిశాను. నీ మనసుకు నచ్చిన విధంగా చేయమన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే ఆమంచి
సాక్షి, హైదరాబాద్ : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ... త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. (టీడీపీకి ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా) ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. కొద్ది రోజుల క్రితం ఆమంచి పార్టీ మారుతున్నారని వార్తల నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చీరాల నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీలో లేనివారి ప్రమేయం ఎక్కువగా కావడం వల్లే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి తెలిపారు. మరోవైపు ఆమంచి రాజీనామాతో ... టీడీపీ నేత కరణం బలరామ్ను...చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. -
ప్రకాశం జిల్లాలో టీడీపీకీ ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా ఆయన టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కూడా. 2014లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. -
చీరాలలో జగన్ పుట్టిన రోజు సంబరాలు
-
వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా మెడికల్ క్యాంప్
-
చీరాల సమోసా చిరుతీపి
ఆంధ్రప్రదేశ్లోని చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. సుమారు మూడు దశాబ్దాలుగా చీరాల పేరు మిఠాయికి కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మునీర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది స్వీట్ సమోసా. సమోసా అంటే త్రికోణాకారంలో ఉండేది అనుకుంటే పొరపాటు. పై భాగాన్ని మైదా పిండితోనే తయారుచేస్తారు. ఫిల్లింగ్ మాత్రం ప్రత్యేకంగా జీడిపప్పులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్లతో తయారుచేస్తున్నారు మునీర్. సమోసాలను ఏరోజుకారోజు తాజాగా తయారుచేస్తారు మునీర్. దోరగా వేయించిన సమోసాలను బెల్లం పాకంలో వేసి చాలాసేపు ఊరిన తరవాత తింటారు. అందువల్ల ఇవి బాగా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి.చీరాల సమోసాను మునీర్ స్వయంగా రూపొందించారు. డెబ్భయ్యో పడిలో పడిన మునీర్ తాను యువకుడుగా ఉన్నప్పుడు ఒంగోలులో అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. వాటితో పాటు ఆయా ఋతువులలో వచ్చే అన్నిరకాల పండ్లను సుమారు పది సంవత్సరాల పాటు అమ్మారు. ఈ వ్యాపారాలేవీ తన ఆర్థిక ఇబ్బందులను తీర్చకపోవడంతో, చీరాల వెళ్లి, సమోసా వ్యాపారం ప్రారంభించారు.సాధారణంగా తయారుచేసే ఉల్లిపాయ, బంగాళదుంప బదులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ తో స్టఫింగ్ చేసి సమోసా రూపొందించారు మునీర్. ‘‘30 సంవత్సరాల క్రితం చీరాల వచ్చేసి సమోసా వ్యాపారం ప్రారంభించాను. ఆ రోజుల్లో చీరాలలో సమోసాలు తయారుచేసేవారు లేకపోవడంతో నా వ్యాపారం బాగా సాగింది. కొద్ది రోజులకే పోటీ ఎదురైంది. ఆ పోటీ తట్టుకోవడానికి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనుకున్నాను. చేతికి దొరకిన వాటితో రకరకాలుగా ప్రయత్నించాను. చిట్టచివరకుఈ ఆలోచన వచ్చింది. సమోసాలో ఇదొక కొత్త ప్రయోగం కావడంతోను, ఇందులో ఉపయోగించేవన్నీ విలక్షణమైనవి కావడంతోను స్వీట్ సమోసా ప్రారంభించిన వెంటనే మంచి ఆదరణ వచ్చింది’ అంటారు మునీర్.భార్య సహాయంతో ఇంటి దగ్గరే తయారుచేసి, వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని, సాయంత్రం అవుతుండగా దర్బార్ రోడ్డులోని ఎస్బిఐ ఏటిఎం దగ్గరకు వస్తారు. అమ్మకాలు ప్రారంభించిన రెండు మూడు గంటల లోపే సమోసాలన్నీ అమ్ముడైపోతాయి. స్వీట్ సమోసాకి అంత డిమాండ్ ఉంది. ఇందులో ఉపయోగించే వస్తువుల వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల, ఇప్పటికీ స్వీట్ సమోసా విషయంలో పోటీ లేదు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ సమోసాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందువల్లే ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మంచి క్వాలిటీతో తయారుచేస్తుండటం వల్ల ఈ సమోసా ధర 7 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు 25 రూపాయలకు పెరిగింది. వీటి గిరాకీ కూడా అలాగే పెరిగింది. ఆర్డర్ల మీద కూడా మునీర్ సమోసాలు సప్లయి చేస్తుంటారు. ఇదంతా ఒంటి చేతిమీదే జరుగుతుంది. తయారుచేసుకున్న సమోసాలను నూనెలో వేయించి తీసాక, సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి రెండు మూడు నిమిషాలు ఉంచి బయటకు తీస్తాడు. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్చంద్ లోకేష్కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
టీడీపీలో మినీ వార్
చీరాల: నియోజకవర్గ కేంద్రం చీరాలలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారింది. ఒకప్పుడు పార్టీకి బలమైన పునాదులుండగా ప్రస్తుతం చీలికలు.. పేలికలుగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి వైపు ఒకవర్గం ఉండగా మాజీమంత్రి పాలేటి రామారావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. మూడో వర్గానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సారధ్యం వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇటీవల చీరాల నియోజకవర్గంలోనే రెండు మినీ మహానాడులు జరిగాయంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి చేరిన తర్వాత మున్సిపల్ చైర్మన్తో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు చేరినప్పటికీ పాలేటి రామారావు వర్గీయులు మాత్రం ఆమంచితో కలవలేదు. ఆమంచి కూడా మొదటి నుంచి వస్తున్న తన సొంత క్యాడర్కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే కానీ టీడీపీలో ఉన్న మాజీ నాయకులు, సీనియర్ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమంచి మధ్య వర్గ పోరును కూడా జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పరిష్కరించలేకపోయారు. దీంతో చీరాల టీడీపీ మూడు ముక్కలాటగా మారింది. పోరు.. హోరు.. చీరాల నియోజకవర్గలో పోటా పోటీ కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, మినీ మహానాడు వంటి అంశాలే దీనికి ఉదాహరణ. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే ఆమంచి ఆధ్వర్యంలో మినీ మహానాడును ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్లోని ఓపెన్ థియేటర్లో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేకు పోటీగా మాజీమంత్రి పాలేటీ వర్గీయుడైన ఎంపీపీ గవిని శ్రీనివాస్ స్థానిక ఐఎంఏ హాలులో మినీ మహానాడు నిర్వహించారు. అలానే ఎమ్మెల్యే ఇంటింటి తెలుగుదేశం, దళితతేజం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పాలేటి కూడా తమ వర్గీయులతో దళిత తేజం, ఇంటింటి టీడీపీ నిర్వహించి వార్డులు, బూత్ కమిటీలను కూడా పోటీగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలను, పట్టణంలోని వార్డుల కమిటీలను కూడా పాలేటి నియమించారంటే టీడీపీలో పోరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను పాలేటి నిర్వహించడం వి«శేషం. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ క్యాడర్ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. మరో 8 నెలల్లో టీడీపీ పాలన పూర్తి కానుంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో అనే మీమాంసలో నాయకులున్నారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక జరగకపోవడం, మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగకపోవం గమనార్హం. చివరకు పార్టీ రాష్ట్ర, జిల్లా పదవులతో పాటుగా ఇతర నామమాత్రపు పోస్టులు చీరాల్లో ఎవ్వరికి దక్కకపోవడంతో పార్టీలో తామెందుకు కొనసాగుతాన్నామనే అంతర్మధనం మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 9 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఎలాంటి గుర్తింపు లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు కల్పించకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా....? లేక ప్రతిపక్షంలో ఉన్నామా...? అని పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరికొందరైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. -
గౌతమిది హత్యే
చీరాల రూరల్: భర్త, అత్త మామల వేధింపుల కారణంగానే గౌతమి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె మృతికి కారణమైన భర్తను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణం కొట్లబజారు రామ మందిరం వీధికి చెందిన కోట పాండురంగారావు కుమారుడు కోట వెంకట రామకృష్ణ మణికంఠ పవన్కుమార్ అలియాస్ మణికంఠతో గుంటూరుకు చెందిన గాదుమల్ల వెంకట రత్నం కుమారై గౌతమికి 2014లో వివాహం జరిగింది. ఆ తర్వాత మణికంఠ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి చీరాలలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇది గౌతమికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గౌతమి పుట్టింటి వారు విక్రయించిన ఆస్తులకు సంబంధించి వాటా తీసుకురాకపోవడంతో భర్త, అత్తమామలు ఆమెను ఇబ్బంది పెట్టారు. వారి బాధలు భరించలేని గౌతమి గత నెల 26వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి వేటపాలెం మండలం రామాపురం బీచ్లో ముగిని ఆత్మహత్యకు పాల్పడింది. గౌతమి మృతికి ఆమె భర్త, అత్త మామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పాండురంగారావు, పుష్ప అమృతవల్లిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన మణికంఠ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్ఐ అనూక్ న్నారు. -
అతివేగంతో ఉన్న రైలును అందుకోలేక...
సాక్షి, ప్రకాశం : చీరాల రైల్వే స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అతి వేగంతో ఉన్న రైలు ను ఎక్కేందుకు యత్నించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడిని దర్శి మండలం సామంతపూడికి చెందిన కడకలుపు వెంకట శివ (18)గా గుర్తించారు. ఆ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. శివ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ విభాగంలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అక్కడ హాస్టల్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి చెన్త్నెలో జరిగే ఎడ్యుకేషన్ సెమినార్లో పాల్గొనేందుకు బాపట్ల నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో బయల్దేరాడు. అయితే మంచినీటి కోసం దిగిన అతను.. రైలు కదులుతుండటం గమనించిన రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలు వేగం ఎక్కువగా ఉండటంతో అతడి కాలు జారడంతో బోగి.. ప్లాట్ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో శివ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే స్పందించిన స్నేహితులు క్షతగాత్రుడిని చికిత్సకు తరలించేందుకు చీరాల 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అప్పటికే వాహనం మరో ప్రాంతానికి వెళ్లి ఉండటంతో చేసేది లేక ఆటోలో చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్.. క్షతగాత్రుడు వెంకట శివను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీఆర్పీ ఎస్ఐ రామిరెడ్డి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు వెంకటాద్రి, సత్యవతితో పాటు తోటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శోకంలో సన్నిహితులు... ప్రైవేట్ స్కూలు టీచర్గా పనిచేసే వెంకటాద్రికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు. వెంకట శివ చివరివాడు. కుటుంబ సభ్యులంతా గారాబంగా చూసుకునేవారు. అతడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. చదువులో కూడా వెంకట శివ అందరికంటే ముందుండేవాడు. చలాకీగా అందరితో కలసిమెలసి తిరిగేవాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన ఆ కుటుంబానికి కుమారుడి మరణం తీరని లోటు మిగిల్చింది. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
చీరాలరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తనయుడిని కత్తితో కసితీరా పొడిచి కడతేర్చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జాండ్రపేటలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. జాండ్రపేటలోని నేతాజీ నగర్కు చెందిన షేక్ బుజ్జి, మస్తానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలున్నారు. బుజ్జి మటన్ దుకాణం నడుపుతుంటాడు. అతడు నిత్యం మద్యం తాగి కుటుంబంలో గొడవలు పడుతుంటాడు. ఈ క్రమంలో అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ పడుకునేందుకు మంచం వేసుకుంటున్నాడు. బుజ్జి ఆఖరి కుమారుడు బాబి (19) అన్నం తింటున్నాడు. మంచం వేస్తే నడిచేందుకు అడ్డుగా ఉంటుందని, అన్నం తిన్న తర్వాత మంచం వేసుకోవాలని బాబి తన తండ్రి బుజ్జికి సూచించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బుజ్జి.. తన కుమారుడు బాబి పొట్టలో కసితీరా కత్తితో పొడిచాడు. చివరకు కుమారుడి పొట్టలోని పేగులు సైతం బయటపడ్డాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాబి మృతి చెందాడు. మృతుడు టైలర్గా పనిచేస్తూ కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్టౌన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమచారం. -
చీరాలలో హెబ్బా పటేల్ సందడి
-
చీరాలలో హెబ్బా పటేల్ సందడి
చీరాల: సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. స్థానిక దర్బార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్యూ మొబైల్ షాపును శనివారం ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బిన్యూ షోరూం ఎండీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 షోరూంలను ప్రారంభించామని, చీరాలలో 38వ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. అలానే బాపట్ల, పొన్నూరు, హిందూపూర్లలో కూడా షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో వంద షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిన్యూ షోరూం ప్రారంభించేందుకు ప్రముఖ నటి హెబ్బా పటేల్ చీరాలకు వచ్చిందని తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. -
ఆమంచి వర్గీయుల దాడిలో మహిళ మృతి
-
బ్రేకింగ్: చీరాలలో ఆమంచి వర్గీయుల రౌడీయిజం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్రగాయలతో ఉన్న సుబ్బులు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా ఆస్పత్రి వద్ద ఆమంచి వర్గీయులు మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. దీంతో సుబ్బులు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అయితే చేతిలో అంగబలం, అధికార బలం ఉన్న ఆమంచి వర్గం రెచ్చిపోయింది. ఆందోళనకు దిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మృతదేహాన్ని గ్రామంలోకి రానీకుండా అడ్డుకోవడానికి అనుచరులను గవినివారిపాలెంలో పెద్ద ఎత్తున్న మొహరించారు. అధికారానికి పోలీసుల వత్తాసు : న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు కూడా ఆమంచి వర్గీయులకు వత్తాసు పలికారు. నాయకుల మెప్పు కోసం సుబ్బులు కుటుంబ సభ్యులను, వారికి మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ వారిని విడిచిపెట్టాలంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. -
చీరాలలో రేష్మీ సందడి
చీరాల: స్థానిక ముంతావారి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి, ప్రముఖ యాంకర్ గౌతమ్ రేష్మీ హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె ప్రేక్షకులకు అభివాదం చేశారు. రేష్మీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.రమేష్బాబు, స్టోర్స్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. రేష్మీని చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులు -
ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మహత్య
► పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం ► పెళ్లైన 24 గంటల్లోపే రైలు కిందపడిన వైనం ► అవయవాలు దానం ఇవ్వాలని ఫోన్లో విజ్ఞప్తి ► ఇరు కుటుంబాల్లో నెలకొన్న విషాదం చీరాల : వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డు వచ్చాయి. పెద్దలను ఎదిరించలేక ఆ జంట కలిసికట్టుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం రైల్వేస్టేషన్లో జరిగింది. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని పెద్దలు బెదిరించారు. దీంతో కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవించాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. స్నేహితుడికి ఫోన్ చేసి.. పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్లో తెలియజేశాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రాథేయపడ్డాడు. తలలు మాత్రమే పట్టాలపై ఉంచి.. సందీప్, మౌనిక తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు ప్రేమికుల మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులతో తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. తల్లడిల్లిన మౌనిక తల్లిదండ్రులు... అమృతలూరు(వేమూరు) : వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండల గ్రామం మోదుకూరు గ్రామానికి చెందిన గోగిరెడ్డి పెద్దిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె మౌనిక తమ కళాశాలలో చదువుతున్న సందీప్ను మంగళవారం ఉదయం విజయవాడలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఆ నవజంట సందీప్ ఇంటికి వెళ్లారు. వారిని చూసి తల్లిదండ్రులు క్రోపోద్రిక్తులయ్యారు. ఇంటి నుంచి గెంటేశారు. దీంతో వివాహమై పట్టుమని 10 గంటలు కూడా కాకముందే వారు లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. వేటపాలెం సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తె అర్ధంతరంగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. -
వేటపాలెంలో యువతి దారుణ హత్య
- గొంతు కోసి పరారైన ఆటో డ్రైవర్ సాక్షి, వేటపాలెం (చీరాల): ఆటోడ్రైవర్ ఓ యువతిని గొంతుకోసి హతమార్చిన ఘటన శనివారం రాత్రి ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన యువతి శవనం తేజ(22)ఎంటెక్ పూర్తి చేసి చీరాల పట్టణంలోని టీవీఎస్ షోరూంలో పనిచేస్తోంది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్కు చెందిన ఆటోడ్రైవర్ గోపీచంద్ ఆ యువతితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో గోపీచంద్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో తేజను రామానగర్లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనక తలుపు పగలగొట్టి ఇద్దరూలోనికి వెళ్లారు. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గోపీచంద్ తేజ గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. గోపీచంద్ స్నేహితులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ ప్రేమ్కాజల్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి యువతి మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ఆశలు బుగ్గి
∙ చీరాలలో భారీ అగ్నిప్రమాదం ∙ కాలి బూడిదైన సురేష్ మహల్ ∙ ఆధునిక వసతులతో సిద్ధమైన థియేటర్ ∙ ప్రారంభానికి ముందు రోజు ప్రమాదం ∙ రూ.కోటిన్నరకు పైగా ఆస్తినష్టం ∙ తీవ్ర నిరాశలో సినీ అభిమానులు జిల్లాలో ప్రముఖ పట్టణమైన చీరాలలో నేటికీ టూరింగ్ టాకీసుల వంటి పురాతన థియేటర్లు మినహా ఆధునిక వసతులతో కూడిన సినిమా హాలు ఒక్కటీ లేదు. మోడ్రన్ థియేటర్లో సినిమా చూడాలంటే అటు గుంటూరో.. ఇటు ఒంగోలో వెళ్లాల్సిందే. సినిమా కోసం యాభై, అరవై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం ఇక్కడి సినిమా అభిమానులకు ప్రయాసే. ఈ పరిస్థితుల్లో అత్యాధునిక వసతులతో కూడిన మల్టీప్లెక్స్ ఏసీ థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కానీ, దురదృష్టవశాత్తు ప్రారంభానికి ఒక్కరోజు ముందు అగ్నికి ఆహుతైపోయింది. యాజమాన్యానికి పెద్దమొత్తంలో ఆస్తినష్టం.. అభిమానులకు నిరాశకు తీవ్ర నిరాశను మిగిల్చింది. చీరాల: పట్టణంలోని చర్చిరోడ్డులో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన సురేష్ మహల్ ఉంది. దీనిని ఏసీ థియేటర్ను నవీకరించి, అన్ని హంగులతో రెండు స్క్రీన్లుగా మార్చారు. కొత్త ఫర్నీచర్, సౌండ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు ఆధునీకరణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం సినీనటుడు దగ్గుబాటి రానా చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రానా నటించిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమాతో పునఃప్రారంభించాలనుకున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం థియేటర్లో పనులు చేస్తున్న సమయంలో ఏసీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పనివారు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపట్లోనే పొగ, మంటలు థియేటర్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చీరాల డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్కాజల్, తహశీల్దార్ ఆర్.శ్రీనివాసులు, వన్టౌన్ సీఐ సూర్యనారాయణలు సిబ్బందితో వచ్చి థియేటర్ను పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారి నుంచి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి.పెద్దిరెడ్డి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా.. లేక మరేదైనా కారణాలున్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉందని, థియేటర్కు అగ్నిమాపక అనుమతులు కూడా లేవని చెప్పారు. ప్రమాదంలో దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు... సురేష్మహల్ అగ్నిప్రమాదానికి గురైందనే సమాచారం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. నిత్యం వాహనాలతో రద్దీతో ఉండే రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. చీరాలలో మొదటిసారిగా ఏసీ థియేటర్ ప్రారంభం కానుందని, గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా చీరాలలోనే సినిమా చూడవచ్చని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. వారిని అదుపు చేసేందుకు పోలీస్ సిబ్బంది ఇబ్బంది. -
ఆ గడ్డ నేరాలకు అడ్డా..!
► నేర సామ్రాజ్యం వైపు అడుగులేస్తున్న చిన్న ముంబై యువకులు ► హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదం షరామామూలే ► తరచూ అరాచకాలకు పాల్పడుతున్న కిరాయి మూకలు ► రోజురోజుకూ దిగజారుతున్న పోలీసు ప్రతిష్ట చిన్న ముంబైగా పేరొందిన చీరాలలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. సుమారు 400 ఏళ్ల క్రితం ఏర్పడిన చీరాల నేడు జిల్లాలోనే నేరాలకు నిలయంగా..ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, హత్యాయత్నాలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదాలు నిత్య కృత్యమయ్యాయి. నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ కళ్లప్పగించి చూస్తోంది. పోలీసు అధికారులైతే అవినీతి మరకలంటించుకుని ఖాకీ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికవరీల సంగతి గాలికొదిలేశారు. – చీరాల చీరాల: ఒకప్పుడు జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రమే ప్యాక్షన్, కిరాయి హత్యలు జరిగేవి. ప్రస్తుతం అది ఒంగోలు నుంచి చీరాలకు మారింది. గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. పాత కక్షలు నేపథ్యంలో మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్లో అతని సమీప బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హత్య చేశారు. నెల క్రితం వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో మరో హత్య జరిగింది. పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువుల వద్దకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజురెడ్డి తన భార్యతో కలిసి కాపలాగా వచ్చాడు. పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. విషయం రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. చివరకు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కొట్టి చంపేశారు. వారం క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగు చేసే తిరుమల శ్రీహరిని అతని సొంత బావ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చంపేందుకు కొందరు సుఫారీలు తీసుకుంటున్నారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు ఓ ముఠా సుఫారీ తీసుకుంది. నగదు పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడి ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జోరుగా జూదం పేదలు అధికంగా జీవించే చీరాలలో జూదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపురుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ల్లో కూడా చీరాల ఆరితేరింది. ఇటీవల వరసుగా అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. విద్యార్థులే బెట్టింగ్లకు బలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మసకబారిన పోలీసు ప్రతిష్ట గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు ప్రతిష్ట మసకబారింది. సబ్ డివిజన్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు అవినీతి మరకలంటించుకున్నారు. బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయనందుకు ఓ ఎస్ఐ, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని చివరకు సస్పెండయ్యారు. సీఐ స్థాయి అధికారి వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించి అభాసుపాలై సస్పెండయ్యాడు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ వ్యాపారులు, వైద్యశాలలు, కళాశాలల వద్ద భారీగా నిధులు సేకరించి అక్రమాలకు పాల్పడడంతో సీనియర్ సీఐ ఇటీవలే సస్పెండయ్యారు. కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్కు తీసుకొచ్చి ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె స్టేషన్çపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయంలో అక్కడ విధులు నిర్వర్తించే ఎస్ఐ, సీఐ సస్పెండ్కు గురయ్యారు. నో రికవరీలు ఇటీవల దొంగలు చీరాల ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుస్టేషన్కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన దుస్తులు, కొంత నగదు అపహరించారు. డీజీకె పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు విలువైన మద్యం బాటిళ్లతో పాటు రూ..50 వేలకు పైగా నగదు అపహరించారు. సాల్మన్ సెంటర్లో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదు దోచుకెళ్లారు. ఇలాంటి ఎన్నో చోరీ కేసుల్లో పోలీసులు సవర బంగారాన్ని కూడా రికవరీ చేయలేకపోయారు. -
చీరాలలో రాచరిక పాలన
► అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి ఇష్టారాజ్యం ► ఆయన అండతో రెచ్చిపోతున్న అనుచరులు ► అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల ధ్వంసం ► సామగ్రి విక్రయించి సొమ్ము చేసుకున్న చోటా నేత చీరాలలో రాజరిక పాలన నడుస్తోంది. చట్టం.. న్యాయం.. అక్కడ చట్టుబండలే. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. అధికారులు, కోర్టులు జాంతానై. సర్వం ఎమ్మెల్యేనే. ఆయన ఆదేశిస్తారు.. అనుచరులు పాటిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చీరాల ప్రజలకు బాగా తెలుసు. ఆమంచి అనుచరులు తమ స్వలాభం కోసం చివరకు ప్రభుత్వ పాఠశాలను కూడా వదల్లేదు. ధ్వంసం చేసి దాని సామగ్రిని కిలోల కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మండల పరిషత్లో తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు విద్యాశాఖ అధికారులు దగ్గరుండి శిథిల పాఠశాలను తొలగించాలి. చీరాల టౌన్: పాఠశాల దేవాలయంతో సమానం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించే ఈ దేవాలయాన్ని అధికార పార్టీ నాయకులు అధికారుల అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా కూల్చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను నిలువునా కూల్చివేయడంతో అధికార పార్టీ నేతల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పది రోజుల క్రితం చీరాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో శిథిలావస్థకు చేరి ప్రమాదంగా ఉన్న పాఠశాలలు, తుఫాన్ షెల్టర్లు కూల్చి వేయాలని ఎమ్మెల్యే అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెంలో 1 నుంచి 3 తరగతి వరకు, 4 నుంచి 5 తరగతి వరకు 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఆనుకుని తుఫాన్ షెల్టర్ కూడా ఉంది. తుఫాన్ షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా ఉండటంతో పాటు స్కూల్కు ఆనుకుని ఉండటంతో స్కూల్ భవనం కొతం శిథిలావస్థకు చేరకుంది. కీర్తివారిపాలెం తుఫాన్ షెల్టర్తో పాటు శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్థానిక అధికార పార్టీ నాయకులను ఆదేశించారు. చట్ట ప్రకా రం అన్ని అనుమతులు తీసుకుని మండల తీర్మానంతో పాటు పంచాయతీ పాలకవర్గం అనుమతితో స్కూల్ భవనాన్ని తొలగించాలి. అనుమతులు..జాంతానై ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఎలాంటి తీర్మానాలు లేకుండానే అధికార పార్టీ నాయకుడినన్న గర్వంతో చదువుల కోవెలను క్రేన్ సాయంతో ఇష్టానుసారం పగలగొట్టించాడు. ప్రభుత్వ స్కూల్ను టీడీపీ నాయకుడు అనుమతి లేకుండా ధ్వసం చేస్తున్నాడని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ స్కూల్ను పగలకొట్టడం ఎందుకని ప్రశ్నించిన గ్రామస్తులతో సంబంధిత టీడీపీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. అంతా నా ఇష్టం.. అడ్డు వస్తే మీకే నష్టం.. అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామంలోని స్కూల్ను అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నా పంచాయితీరాజ్, విద్యాశాఖ, ఎంపీడీవోలు కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తడం సమంజసం కాదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నుంచి వచ్చిన ఇనుము, ఇతర సామగ్రిని సైతం టీడీపీ నేత అమ్ముకుంటున్నాడు. పంచాయతీ అనుమతి ఇవ్వలేదు: మా గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనాలు తొలగించాలని మండల పరిషత్ నుంచి పంచాయతీకి ఎలాంటి తీర్మానాలు రాలేదు. కీర్తివారిపాలెంలో ప్రభుత్వ స్కూల్ను పగలగొట్టేందుకు ఎవరికీ పంచాయతీ అనుమతి ఇవ్వలేదు. – ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు నాకేమీ తెలియదు : కీర్తివారిపాలెం ఎంపీపీ స్కూల్ను పగలకొడుతున్నారని నాకు తెలియదు. ఎవరు పగలకొడుతున్నారో కనుక్కుంటా. శిథిల భవనాలు తొలగించాలంటే మండల పరిషత్ నుంచి అనుమతులు అవసరం. సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. తీర్మానం లేకుండా ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటా. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో -
చీరాలలో రాచరిక పాలన
⇔అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి ఇష్టారాజ్యం ⇔ఆయన అండతో రెచ్చిపోతున్న అనుచరులు ⇔అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల ధ్వంసం ⇔సామగ్రి విక్రయించి సొమ్ము చేసుకున్న చోటా నేత చీరాలలో రాజరిక పాలన నడుస్తోంది. చట్టం.. న్యాయం.. అక్కడ చట్టుబండలే. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. అధికారులు, కోర్టులు జాంతానై. సర్వం ఎమ్మెల్యేనే. ఆయన ఆదేశిస్తారు.. అనుచరులు పాటిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చీరాల ప్రజలకు బాగా తెలుసు. ఆమంచి అనుచరులు తమ స్వలాభం కోసం చివరకు ప్రభుత్వ పాఠశాలను కూడా వదల్లేదు. ధ్వంసం చేసి దాని సామగ్రిని కిలోల కింద అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మండల పరిషత్లో తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు విద్యాశాఖ అధికారులు దగ్గరుండి శిథిల పాఠశాలను తొలగించాలి. – చీరాల టౌన్ పాఠశాల దేవాలయంతో సమానం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించే ఈ దేవాలయాన్ని అధికార పార్టీ నాయకులు అధికారుల అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా కూల్చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను నిలువునా కూల్చివేయడంతో అధికార పార్టీ నేతల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పది రోజుల క్రితం చీరాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో శిథిలావస్థకు చేరి ప్రమాదంగా ఉన్న పాఠశాలలు, తుఫాన్ షెల్టర్లు కూల్చి వేయాలని ఎమ్మెల్యే అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెంలో 1 నుంచి 3 తరగతి వరకు, 4 నుంచి 5 తరగతి వరకు 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు ఆనుకుని తుఫాన్ షెల్టర్ కూడా ఉంది. తుఫాన్ షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా ఉండటంతో పాటు స్కూల్కు ఆనుకుని ఉండటంతో స్కూల్ భవనం కొతం శిథిలావస్థకు చేరకుంది. కీర్తివారిపాలెం తుఫాన్ షెల్టర్తో పాటు శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని కూడా తొలగించాలని ఎమ్మెల్యే స్థానిక అధికార పార్టీ నాయకులను ఆదేశించారు. చట్ట ప్రకా రం అన్ని అనుమతులు తీసుకుని మండల తీర్మానంతో పాటు పంచాయతీ పాలకవర్గం అనుమతితో స్కూల్ భవనాన్ని తొలగించాలి. అనుమతులు..జాంతానై ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాత్రం ఎలాంటి తీర్మానాలు లేకుండానే అధికార పార్టీ నాయకుడినన్న గర్వంతో చదువుల కోవెలను క్రేన్ సాయంతో ఇష్టానుసారం పగలగొట్టించాడు. ప్రభుత్వ స్కూల్ను టీడీపీ నాయకుడు అనుమతి లేకుండా ధ్వసం చేస్తున్నాడని పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ స్కూల్ను పగలకొట్టడం ఎందుకని ప్రశ్నించిన గ్రామస్తులతో సంబంధిత టీడీపీ నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.. అంతా నా ఇష్టం.. అడ్డు వస్తే మీకే నష్టం.. అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. గ్రామంలోని స్కూల్ను అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నా పంచాయితీరాజ్, విద్యాశాఖ, ఎంపీడీవోలు కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తడం సమంజసం కాదని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం నుంచి వచ్చిన ఇనుము, ఇతర సామగ్రిని సైతం టీడీపీ నేత అమ్ముకుంటున్నాడు. నాకేమీ తెలియదు : కీర్తివారిపాలెం ఎంపీపీ స్కూల్ను పగలకొడుతున్నారని నాకు తెలియదు. ఎవరు పగలకొడుతున్నారో కనుక్కుంటా. శిథిల భవనాలు తొలగించాలంటే మండల పరిషత్ నుంచి అనుమతులు అవసరం. సభ్యుల తీర్మానం కూడా ఉండాలి. తీర్మానం లేకుండా ధ్వంసం చేయడం సరికాదు. అధికారులతో విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటా. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో -
వివాహేతర సంబంధ నేపథ్యంలో మహిళ మృతి
వెంకటపాలెం (తుళ్లూరు రూరల్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహిత మృతి చెందిన సంఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వద్ద తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25), ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. దీంతో అశోక్ సింగరాయకొండలోనే ఉంటూ సిమెంట్ పని చేస్తూ భార్యను ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే రాజధానిలో పనులు అధికంగా ఉంటాయని వెంకటపాలెంకు వలస వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పని ముగించుకుని అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా భార్య తీయలేదు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న గ్రామ పంచాయతీ గుమస్తా పి.సత్యనారాయణ బయటకు వస్తూ అశోక్ను తోసుకుంటూ వెళ్లాడు. దీనిపై భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, అశోక్ భార్యకు నిప్పు అంటించడంతో పెద్దగా కేకలు వేసింది. అశోక్ మంటలు ఆర్పి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తుళ్లూరు ఎస్సై సందీప్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి వద్ద నుంచి వాగ్మూలాన్ని తీసుకున్నారు. చికిత్స పొందుతున్న ప్రశాంతి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు. -
లాగేసుకున్నారు..!
► కోస్టల్ కారిడార్ రహదారి కోసం నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ ► చీరాలలో వంద ఎకరాలు సేకరించిన ప్రభుత్వ యంత్రాంగం ► రూ.25 లక్షల విలువైన భూమికి రూ.5 లక్షల పరిహారం ► పైసా చెల్లించకుండానే పనులు ప్రారంభం ► ఆందోళనబాట పట్టిన రైతులు టీడీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు భరోసా లేకుండా పోయింది. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ పేరుతో అడ్డగోలుగా లాగేసుకుంటున్నారు. కనీసం చట్టపరంగా కూడా వ్యవహరించడం లేదు. పరిహారంపై ఎటూ తేల్చకుండానే భూములు సేకరించి ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. ఇలా ఒక్క చీరాలలోనే జాతీయ కోస్టల్ రహదారి కోసం వంద ఎకరాల రైతుల భూములను సేకరించారు. అయితే పరిహారంలో మాత్రం రైతులకు చుక్కలు చూపెడుతున్నారు. విలువైన భూములకు పరిహారం నామమాత్రంగా ఉంది. చీరాల: జిల్లాలోని ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి కృష్ణాజిల్లా కత్తిపూడి వరకు జాతీయ కోస్తా రహదారి హైవే నంబర్ 216ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించే పనులు మొదలుపెట్టారు. దీని కోసం జిల్లాలో 172.45 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటున్నారు. దీని పరిధిలో విలువైన భూములతో పాటు రొయ్యల చెరువులు పోనున్నాయి. అక్కడ సుమారు ఎకరం రొయ్యల చెరువు రూ.20 నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుంది. గతంలో వాన్పిక్ సమయంలో ఎకరం కోటి రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కనీసం రూ.20 లక్షల పైనే ఎకరం ధర ఉన్నప్పటికీ పరిహారం మాత్రం ఎకరాకు రూ.3 నుంచి రూ 5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని వలన సుమారు 130 మందికిపైగా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. 3ఈ నోటీసులు జారీ చేయకుండానే... భూములు సేకరించాలంటే ముందుగా రైతులకు 3ఈ నోటీసు అందించి వారి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అయితే 70 శాతం మంది రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ పనులు పూర్తి చేస్తున్నారు. వేటపాలెం మండలంలో 40 మంది రైతుల నుంచి 42 ఎకరాలు, చీరాల మండలంలో 92 మంది రైతుల నుంచి 70 ఎకరాలకు పైనే పట్టా భూములు సేకరిస్తున్నారు. అయితే రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో నష్టపరిహారం సైతం ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం అదే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. విలువైన భూములు... త్రోవగుంట నుంచి కడవకుదురు రైల్వే ట్రాకు సమీపంగా పందిళ్లపల్లి, నాయినిపల్లి, పుల్లరిపాలెం, తోటవారిపాలెం, ఈపూరుపాలెం మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. వేటపాలెం మండలంలో ఎక్కువ నష్టపోయేది రొయ్యల చెరువుల రైతులే. అక్కడి రైతులు రొయ్యల చెరువులు తవ్వించుకోవడంతో పాటు నిర్మాణాలు, చేనుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.25 లక్షల వరకు డిమాండ్ ఉంది. కౌలు రేట్లే ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది. అంత విలువైన భూములకు సాధారణ భూముల్లా కేవలం రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. చీరాల మండలంలో వేరుశనగ, ఇతర పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వేరుశనగ పంట ఉంది. ఈ భూములకు కూడా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తామని చెబుతోంది. వాన్పిక్ ఏర్పాటు సమయంలో భూములు ఎకరా కోటి వరకు పలకగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు రాకపోవడంతో ఎకరా రూ.25 లక్షల వరకు ఉంది. విలువైన భూములకు పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో చీరాల, వేటపాలెం మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం చెల్లించకుండానే... సేకరించిన భూములకు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండానే జాతీయ రహదారి పనులు మొదలుపెట్టారు. పరిహారం వ్యవహారం కొలిక్కి రాకుండా పనులు మొదలు పెట్టడంతో పాటు చీరాల మండలం తోటవారిపాలెం ప్రాంతంలో రైతుల భూములలో ఉన్న మోటార్లు తొలగించారు. రైతులు భూసేకరణతో పాటు ప్రస్తుతం భూములలో ఉన్న పంటకు, మోటార్లకు నిర్మించుకున్న షెడ్లుకు, రొయ్యల చెరువు రైతులకు మోటార్లు, చెరువు తవ్విన వ్యయాన్ని కూడా నష్టపరిహారంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే భూసేకరణ చేయడంతో పాటు రోడ్డు పనులు కూడా మొదలుపెట్టడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. రైతుల ఆందోళనను కూడా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా జాతీయ కోస్టల్ రహదారి పనులు మొదలు పెట్టడం గమనార్హం. -
చీరాల.. ఐపీ ఖిల్లా
► పక్కాగా నమ్మించి డబ్బు తీసుకుని మోసం ► రూ.7 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ఫైనాన్స్ వ్యాపారి ► వడ్డీలకు ఆశపడి అసలు కూడా నష్టపోతున్న అభాగ్యులు చీరాల : చీరాల పట్టణం మోసాలకు అడ్డాగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు రకరకాల మోసాలు. మోసపోయేవాళ్లు ఉండాలేగానీ మోసం చేయడానికి మాత్రం ఇక్కడ కోకొల్లలుగా ఉంటారు. కాకపోతే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రస్తుతం చీరాల్లో ఐపీ మోసాలు కొనసాగుతున్నాయి. ఐపీలు పెట్టేవారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు తెస్తారు. చాలామంది వ్యాపారులు, చిరువ్యాపారులు దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో వేసుకుంటే వడ్డీ తక్కువ వస్తుందని భావించి ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి అడిగిందే తడవుగా మోసగాళ్లకు అప్పులిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వడ్డీలు చెల్లించే మోసగాళ్లు.. ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు అప్పు చేసి చివరకు ఐపీ పేరుతో అప్పులిచ్చిన వారికి కుచ్చుటోపీ పెడతారు. వడ్డీ సంగతి అలా ఉంచితే.. చివరకు అసలు కూడా కోల్పోయి అప్పులిచ్చిన వారు రోడ్డున పడతారు. ఈ తరహా మోసాలు ప్రస్తుతం చీరాల్లో అధికంగా జరుగుతున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం పేరుతో దగా... స్థానిక ఎంజీసీ మార్కెట్లో ఒక వ్యక్తి దశాబ్ద కాలంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తుండటంతో స్థానిక వ్యాపారులతో పాటు పట్టణంలోని మధ్యతరగతి కుటుంబాల వారు సైతం అడిగిందే తడవుగా అతనికి అప్పులిచ్చారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారులు ఫైనాన్స్ రూపంలో ఇచ్చేశారు. జనం వద్ద రూ.100కి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకుని అతను మాత్రం ఇతరులకు రూ.100కి రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీకి ఇచ్చి వసూలు చేసేవాడు. తనవద్ద అప్పు తీసుకున్న వారు ఎవరైనా సకాలంలో డబ్బు చెల్లించకుంటే అంతే సంగతులు. తనవద్ద ఉండే యువకులను పంపి బెదిరించి భయపెట్టి వసూలు చేసేవాడు. అలా కోట్లలోనే వడ్డీలకు తిప్పేవాడు. ఫైనాన్స్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అయితే ఏమైందోఏమోగానీ కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. బాగా సంపాదించాడు కదా తాము ఇచ్చిన డబ్బులో అసలైనా వస్తాయని ఆశించారు. కానీ, అప్పులిచ్చిన వారికి కొద్దిరోజులకు ఐపీ నోటీసులు ఇంటికి పంపాడు. మొత్తం రూ.7 కోట్లకుగానూ రూ.5 కోట్లకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. కొద్దిరోజులు మొహం చాటేసిన ఆ ఫైనాన్స్ వ్యాపారి.. ఐపీ నోటీసులు ఇచ్చిన తరువాత మరలా చీరాల వచ్చి తనకు రావాల్సిన బకాయిలను దర్జాగా వసూలు చేసుకుంటున్నాడు. అయితే ఈ ఫైనాన్స్ వ్యాపారి జనం సొమ్మును కొంత దాచిపెట్టడంతో పాటు మరికొంత సొమ్ముతో తన తనయుడితో వ్యాపారం చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అంటే జనం సొమ్ముతో జల్సా అన్నమాట. మోసగాళ్లు ఎంతో మంది... నమ్మించి అప్పుచేయడం.. ఆ తరువాత కోట్లకు ఐపీలు పెట్టి మోసం చేయడం. చీరాల్లో చాలామందికి ఇది పరిపాటిగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని ఒక వస్త్రవ్యాపారి తనయుడు ఒక ప్రైవేట్ వైద్యశాలలో వాటాదారుడిగా ఉండి రూ.3 కోట్లకుపైగా ఐపీ పెట్టినట్లు సమాచారం. సదరు వ్యాపారి కొద్దిరోజులుగా చీరాలలో కనిపించకుండా వేరే ప్రాతంలో తిరుగుతున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వ్యక్తులు అతని కోసం తిరుగుతున్నారు. అలాగే గొల్లపాలేనికి చెందిన వస్త్రవ్యాపారి కూడా కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే తన దుకాణంలోని వస్త్రాలను బయటకు పంపి దుకాణం మూసేశాడు. సదరు వ్యాపారి అప్పులిచ్చిన వారికి రూ.2 కోట్లకు ఎగనామం పెట్టేశాడు. కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందని అశపడిన చాలామంది జనం చీరాల్లో ఐపీల బారినపడి చివరకు రోడ్డున పడుతున్నారు. రోడ్డున పడిన బాధితులు... ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారికి కొంతమంది వస్త్రవ్యాపారులు అప్పులివ్వగా చాలామంది మాత్రం చిరువ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ముంతావారిసెంటర్లో రోడ్ల పక్కన హోటళ్లు, ఇతర చిరువ్యాపారులు చేసేవారు తీవ్రంగా మోసపోయారు. ఒకరు తన కూతురు వివాహం కోసం అక్కరకు వస్తాయని ఆశించి ఇచ్చిన డబ్బును మోసపోయారు. బ్యాంకులో ఇస్తే రూపాయి కూడా వడ్డీ రాదని భావించి రూ.2 వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారికి ఇచ్చి అన్యాయమయ్యారు. ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. వడ్డీవద్దు.. అసలైనా ఇప్పించండని వేడుకుంటున్నారు. -
చీరాలలో రాష్ట్రాస్థాయి ఎడ్ల పోటీలు
-
రౌడీ షీటర్ను హత్య చేసిన ప్రత్యర్థులు
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్కు చుక్కలు చూపించింది..
చీరాల : మూడు నెలల క్రితం ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను అంగీకరించిన యువకుడికి మాయలేడీ చుక్కలు చూపించింది. బాధితుడి కథనం మేరకు.. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన వింజమూరి సురేశ్ కుమార్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. జనవరిలో తన ఫేస్బుక్కు ఓ యువతి చల్లా పల్లవి అనే పేరుతో, ప్రొఫైల్ పిక్చర్లో మలయాళ హీరోయిన్ ఫొటో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. రిక్వెస్ట్ను సురేశ్ అంగీకరించి ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. వాట్సాప్లో మెసేజ్లు చేసుకున్నారు. తాను ఇన్ఫోసిస్లో జావా డెవలపర్ టీం లీడర్గా పనిచేస్తానని చెప్పింది. తన తండ్రి ఒంగోలులో డీఎస్పీగా పనిచేస్తున్నాడని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చింది. తర్వాత తన అసలు పేరు మౌనిక, సొంతూరు చీరాల కొత్తపేటని చెప్పింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రేమను అంగీకరించాడు. చివరకు ఒకరోజు ‘మన ప్రేమను మా నాన్న అంగీకరించలేదని, నిద్ర మాత్రలు మింగానని చెప్పింది. దీంతో సురేశ్ ఒంగోలులో డీఎస్పీకి ఫోన్ చేయగా మౌనిక పేరుతో తనకు కూతురే లేదని చెప్పాడు. తర్వాత మూడు రోజుల్లోనే మౌనిక.. సురేశ్కు ఫోన్చేసి తన బావతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నానని సమాచారం అందించింది. హోటల్లో ఉన్న మౌనికను కలిసేందుకు సురేశ్ వెళ్లాడు. అక్కడ నల్లగా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ తాను మౌనికగా పరిచయం చేసుకుంది. విషయం అర్థమైన సురేశ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా గది తలుపులు మూసేసి ఇక్కడి నుంచి వెళ్తే మీ కుటుంబమంతా జైలుకెళ్తుందని బెదిరించి దండలు మార్పించింది. సురేశ్ బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మౌనికను, ఆమె నాయనమ్మ అని చెప్పుకుంటున్న వృద్ధురాలిని తీసుకుని విజయవాడ రైల్లో బయలుదేరారు. మధ్యలో సురేశ్ బంధువులు వచ్చి వారిని అడ్డుకోవడంతో.. అక్కడి నుంచి మౌనిక, వృద్ధురాలు పారిపోయారు. తరువాత విచారణ చేయగా అసలు ఆమె పేరు మౌనిక కాదని.. ఉయ్యాల కనక మహాలక్ష్మి (35) అని, అనేక కేసుల్లో నిందితురాలని తేలింది. ఆమెకు పెళ్లై భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం సురేశ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి కులం పేరుతో దూషించాడని కనకమహాలక్ష్మి ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుడు కూడా ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనాలు, చైన్స్నాచింగ్, చీటింగ్లో ఆమె ముద్దాయి. ఆమెపై తిరుపతి సీసీఎస్, క్రైం, నార్కెట్పల్లి పీస్లో అరెస్టు వారెంట్, కందుకూరులో అనుమానాస్పదురాలిగా కేసులున్నాయి. ఈ కేసు నుంచి నువ్వు బయట పడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా బెదించిందని బాధితుడు వాపోయాడు.