Civil Services Exam
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
పండక్కి ఊరెళ్తున్నారా? మీ ఇంటి తాళాన్ని యజమానికి ఇచ్చి వెళ్తున్నారా?
అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.ఏదో జరుగుతుంది..యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్రూమ్లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్ వాట్సప్తో బట్టబయలుఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్ను ల్యాప్ట్యాప్లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలుసమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు. ఇంట్లో కరెంట్ పనులు చేయించాలనిపోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్లైన్లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ స్టడీ హాల్స్లో భద్రత కరువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో.. స్టడీ హాల్స్లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి. అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు? చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. విద్యుత్ వైర్లకు దగ్గరగా.. చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు. ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు. వీధి లైట్లు లేక ఇబ్బందులు.. అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు. అమ్మాయిల భద్రత గాలికి.. హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది. ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.జోరుగా గంజాయి అమ్మకాలు అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది. ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్వోఎస్ బూత్ పోల్స్ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.టౌన్ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం.. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్ను పార్కింగ్కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి భవనాలు అశోక్నగర్లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. -
వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.‘స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్గా అప్సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.... స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్ఒఎస్తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఒఎస్ లాగే ఐఏఎస్లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.See a lot of outrage on my timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the Rights Activists to also examine why this quota has still not been implemented in the IPS/ IFoS and certain sectors like defence. My limited point is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 22, 2024 -
దేశసేవకు మించింది లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్ సర్వీస్లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. తాను సివిల్స్కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. కల కోసం శ్రమించాను.. సివిల్ సర్వీసెస్లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్ఈసీ వరంగల్లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్ కలకు అక్కడే బీజం పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం.. నేటి యువతకు సివిల్స్ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మాక్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వొచ్చు. సాధిస్తానన్న నమ్మకంతో చదివా.. సివిల్ సర్వీసెస్ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్నెట్ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్లైన్లోనే మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్ ప్రిపేరవుతున్నా సోషల్ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను. -
యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్లో రాణించేందుకు నిపుణుల మెలకువలు అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు ఎన్ని సార్లు రాయొచ్చంటే: సాధారణ అభ్యర్థులు: 06 OBC అభ్యర్థులు: 09 SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ). -
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ‘విదేశీ విద్యా దీవెన’: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. చదవండి: Dec 20th: AP పొలిటికల్ అప్డేట్స్ జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. ►కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు.. ►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు ►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు ► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి. ►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. ► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి. ► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి. ►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది. ►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా. ► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. ►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. ►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం ► గవర్నమెంట్లో శాచురేషన్, ట్రాన్స్పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. ►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. ►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. ►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. ►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. ►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. ► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్గా ఎదగాలి. ► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. ►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ఉపయోగం ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది. అర్హత ప్రమాణాలు ఇవి.. ♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి. ♦ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి. ♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు. ♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు. ♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు. ♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
సివిల్స్లో నారీ భేరి
న్యూఢిల్లీ: సివిల్ సర్విసెస్–2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు. టాప్–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్లో టాప్–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్ ఈసారి సివిల్స్ తొలి ర్యాంకర్ ఇషితా కిశోర్ ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్ కాలేజీ నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. సివిల్స్లో కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్ సాధించారు. మూడో ర్యాంకర్ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్ మయూర్ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్ చదివారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక టాప్–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రిజర్వ్ లిస్టులో 178 మంది అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. నా కల నెరవేరింది సివిల్స్లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. సివిల్స్లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఈసారి సివిల్స్లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ రెండో ర్యాంకు ఊహించలేదు ‘‘సివిల్స్ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా. స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’ – గరీమా లోహియా, సివిల్స్ రెండో ర్యాంకర్ 15 రోజుల్లోగా మార్కుల వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్ http//www.upsc. gov.in ద్వారా ఫలితాలు, సివిల్స్ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత సాధించారు. విజేతలకు మోదీ అభినందనలు సివిల్స్–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్కు 667వ ర్యాంక్ ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న రామ్భజన్ కుమార్ సివిల్స్లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్భజన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్భజన్కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరారు. -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్లోనే అధికమని మొన్న ఏప్రిల్లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
శతమానం భారతి: లక్క్ష్యం 2047 సివిల్ సర్వీసులు
రాజ్యాంగ నిర్మాణ సభలో ఆనాటి సభ్యులు చాలామంది ఐసీఎస్ను రద్దు చేయాలని సూచించారు! పాలనకు ఆయువు పట్టయిన భారత సివిల్ సర్వీసు (ఐసీఎస్) లను రద్దు చేయాలని వారు సూచించడానికి తగిన కారణమే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఉన్న ఈ వ్యవస్థలో ఆనాటి ఐసీఎస్ అధికారులు అనేకమంది నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనం సాగిస్తుండేవారు. అయితే రద్దు అనేది పరిష్కారం కాదనీ, ఐసీఎస్ను కొనసాగించడమే మేలని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీఎస్ ఒక్కటే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్ వంటి సర్వీసులను కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక, మానవహక్కుల సాధన సుళువు అవుతుందని పటేల్ భావించారు. బ్రిటిష్ ఇండియాలో ఐసీఎస్ 1854లో ప్రారంభం అయింది. అందుకు నేపథ్యం.. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారులను ఇండియన్ సివిల్ సర్వీసులలో నియమించాలని బ్రిటిష్ అధికారి మెకాలే ప్రతిపాదించడం. ఆ ప్రతిపాదనతో ఆయన పార్లమెంటుకు నివేదికను సమర్పించిన అనంతరం సివిల్ సర్వీస్ కార్యరూపం దాల్చింది. 1855లో బ్రిటన్లో తొలి ఐసీఎస్ పరీక్ష జరిగింది. తర్వాత 1922 లో తొలిసారి భారతదేశంలోనే ఈ పరీక్షను నిర్వహించారు. అమృతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రజాప్రయోజనార్థం సంస్కరించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. (చదవండి: నేను నమ్ముతున్నాను) -
సీఎం జగన్ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్కుమార్కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్కుమార్కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
‘అదనపు’ అవకాశాన్ని పరిశీలించండి: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల పరీక్షకు హాజరు కాలేకపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ వారు చేస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అదనపు అవకాశం కోసం యూపీఎస్పీని ఆశ్రయించాలని పిటిషన ర్లకు సూచించింది. సివిల్స్ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. నిర్దేశిత తేదీన ఏ కారణం వల్లనైనా ఒకసారి పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి ఆ అవకాశం కల్పించే వెసులుబాటు లేదని యూపీఎస్పీ చెబుతోంది. -
‘సివిల్స్’ అటెంప్ట్లు, వయోపరిమితిని సడలించం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్ ఎగ్జామ్ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ సక్రమంగా పాటిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. -
సివిల్స్ అభ్యర్థులకు సడలింపులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆన్లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం దేశంలో ఆన్లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్ఫామ్ల క్రమబద్ధీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖలు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్.. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి టెండరు జారీకాలేదు ఆంధ్రప్రదేశ్లో రూ.384.26 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించి టెండరు జారీచేయలేదని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. 400 పడకల ఆస్పత్రి (అదనంగా 50 పడకలు సూపర్ స్పెషాలిటీ వింగ్) బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)కి అప్పగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎన్ఆర్డీఎంఎస్లో ఏపీ లేదు న్యాచురల్ రీసోర్స్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్ఆర్డీఎంఎస్)లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లను చేర్చలేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమల్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఆదర్శ సంపర్క్లో మౌలిక వసతులు ఆదర్శ సంపర్క్ పథకంలో భాగంగా లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళంలోని శాలిహుండం బౌద్ధ ఆనవాళ్లు, నాగార్జున కొండల్లో పర్యాటకులకు మౌలికవసతులు కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చేనేతకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోండి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను రక్షించేలా కేంద్రం వారికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తక్షణమే చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ కోరారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయించాలని, నూలు కొనుగోళ్లపై నేత కార్మికులకు సబ్సిడీని అందించే పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. దీన దయాళ్ హెల్త్ కార్గ్ ప్రోత్సాహ యోజనను పునరుద్ధరించడంతోపాటు రూ.30 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న సొసైటీలే ఈ పథకానికి అర్హులన్న నిబంధనలను తొలగించాలని సూచించారు. నూలు వస్త్రంపై విధించిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. -
సివిల్స్కు సిద్ధమవుతారా.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు..సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్ సర్వీసెస్–2022 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ, పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్... సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. గతేడాది కంటే పెరిగిన పోస్టులు సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్లు, 2020లో 796 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పది లక్షల వరకు పోటీ సివిల్స్కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తం మూడు దశలు సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ) ప్రిలిమినరీ ఇలా తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు.. ఒక్కో పోస్ట్కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్.. ఇలా ► సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్. ► ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ► అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ► తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు. ► మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. ► మెయిన్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్కు కేటాయించే మార్కులు 275. ► పర్సనాలిటీ టెస్ట్లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్లో నెగ్గాలంటే సివిల్స్ ప్రిలిమ్స్లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి. ► జనరల్ స్టడీస్ పేపర్గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ► రెండో పేపర్ సీశాట్లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం ► అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్ను కోర్ టాపిక్స్తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అనుసంధాన వ్యూహం సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్లపై ప్రత్యేక దృష్టి ప్రిలిమ్స్లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి. పేపర్–2కు ఇలా అర్హత పేపర్గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్తో అనుసంధానం సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్లను డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదివితే మెయిన్స్కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సిలబస్పై అవగాహన ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది. పుస్తకాలు సిలబస్పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు ► పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్(సస్టెయినబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్. ► పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్ప్రిటేషన్. దీర్ఘకాలిక వ్యూహం సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్ను మెయిన్ ఎగ్జామినేషన్తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. – శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం ► అర్హత:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in/mainmenu2.php ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు సివిల్స్లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్బాబు, విజయ్బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్బాబు ఐఆర్ఎస్ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్బాబు చెప్పారు. టెన్త్లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
సివిల్స్లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్కు.. సివిల్స్లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్లోని మలక్పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్లోని ఆర్కేపురం. కామర్స్లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్రెడ్డి సివిల్స్లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
సాక్షి, అమరావతి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్లో ఎనలేని క్రేజ్. ఏటా వేలమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరులక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. దీనికి సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kpias.com లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఏడాదిన్నర. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, ముల్టీపుల్ చాయిస్ కొశ్చన్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9666637219, 9666283534, 9912671555. పనిదినాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సంప్రదించవచ్చు. -
సివిల్స్ ఫలితాలపై యూపీఎస్సీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సివిల్ సర్వీసుల పరీక్షా ఫలితాలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గురువారం వివరణ ఇచ్చింది. ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు-2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను నిర్వహించామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదలుచుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్ధులను ఎంపిక చేశారని తప్పుదారి పట్టించే ప్రచారం తమ దృష్టికి వచ్చిందని యూపీఎస్సీ పేర్కొంది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా నియామకాల కోసం భారత ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షా నిబంధనలను కమిషన్ తూచాతప్పకుండా అనుసరించిందని తెలిపింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా 927 ఖాళీల కోసం తొలి విడతగా 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, నిబంధనల ప్రకారం రిజర్వ్ జాబితాను నిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో యూపీఎస్సీ వెల్లడించింది. దశాబ్ధాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది. సాధారణ ప్రమాణాల్లో ఎంపికైన రిజర్వ్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు వారికి ఉపయోగకరంగా ఉంటే వారి రిజర్వ్ స్టేటస్ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. చదవండి : మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్ -
శెభాష్ దేవాశిష్
భువనేశ్వర్: ఒడిశా సివిల్ సర్వీసెస్–2018 పరీక్షల్లో దేవాశిష్ పండా టాపర్గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్గడ్ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్గా, ఆకాశ కుమార్ పండా తీయ టాపర్గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్ పోర్టల్లో ప్రసారం చేశారు. సుందర్గడ్ జిల్లా ప్రజలు దేవాశిష్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
ఐదుసార్లు ఫెయిల్
ఉమ జీవితంలోని వరుస అపజయాలు ఆమెను దృఢపరచి, ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసేందుకు ఉపయోగపడ్డాయి. గత ఏడాది చేసిన ఆరో ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించిన ఉమకు స్ఫూర్తిని ఇచ్చినవారు స్టీవ్ జాబ్స్ సహా ఎందరో ఉన్నారు. ‘‘నా బాల్యమంతా తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక, ఎంబిఏ చదవాలనుకున్నాను. సిఎస్ఈ చదువుతానని ఏ రోజూ అనుకోలేదు. మా ప్రొఫెసర్ అబూబకర్ ప్రోత్సాహం మీద 2011 లో మొదటిసారి పరీక్ష రాశాను. తగినంత కృషి చేయకపోవడం వల్లనో ఏమో ఫెయిల్ అయ్యాను’ అంటారు ఉమ. ఒకేసారి మూడు ఉద్యోగాలు! చదువు పూర్తి అవుతుండగానే, మూడు పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ఒకేసారి మూడు ఆఫర్ లెటర్స్ అందుకున్నారు ఉమ. ఒకదాన్ని ఎంచుకుని అందులో చేరారు. ‘‘నాన్న గతించేవరకు నా జీవితం పూలబాటలో నడిచింది. కొన్ని రోజులకే అమ్మ కూడా పోవడంతో, భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది’ అని గుర్తుచేసుకుంటారు ఉమా మహేశ్వరి. కార్పొరేట్ సంస్థలలో ఆమె ఐదు సంవత్సరాలు పని చేశారు. అలా పని చేస్తూనే, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యారు. ఐదుసార్లు రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు! సాధారణంగా ఇన్నిసార్లు ఓటమి చెందితే మళ్లీ రాయరు. చుట్టూ ఉన్నవారంతా ‘ఇంకేం చదువుతావులే మానేయ్’ అని హేళన చేసినా, ఉమలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది. 2017లో ఉద్యోగాన్ని వదిలి, పరీక్ష కోసం దీక్షగా కూర్చొని ప్రిపేర్ అయ్యారు. చదువుతుండగానే తెల్లారేది అప్పటికే పెళ్లయింది ఉమకు. ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, చదువుకోవటానికి కొంత సమయం కేటాయించారు. ‘‘ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చదువు, ఆ తరవాత ఇంటి పనులు, అమ్మాయిని స్కూల్కి రెడీ చేయడం, మధ్యాహ్నం భోజన సమయం వరకు మళ్లీ చదువుకుని, సాయంత్రం మా అమ్మాయి ఇంటికి వచ్చాక తనతో గడపడం, తరవాత మళ్లీ చదువుకోవడం.. ఇదీ నా షెడ్యూల్. మెయిన్స్కి మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు చదివాను’’ అని తెలిపారు ఉమా మహేశ్వరి.ఇంటిని, పిల్లలను చూసుకుంటూనే సిఎస్ఈలో రెండోస్థానం సాధించిన అనూ కుమారి కూడా ఉమకు ఒక ఇన్స్పిరేషన్. హర్యానాకు చెందిన అనూ కుమారి సాధించిన విజయాలు, ఉమ అత్తమామలకు, భర్తకు కూడా ఉమ మీద నమ్మకాన్ని పెంచాయి. పట్టుదల ఉంటే బిడ్డ తల్లికి కూడా అన్నీ సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. చివరి ప్రయత్నంలో 2018లో ఉమ సివిల్స్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇప్పుడు తన పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. ‘‘నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు, ఆ నమ్మకమే నిన్ను విజయం వైపుగా నడిపిస్తుంది’’ అన్న స్టీవ్ జాబ్స్ మాటలు తన విజయానికి బాటలు వేశాయి అంటారు ఉమా మహేశ్వరి. – వైజయంతి -
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
సివిల్ సర్వీస్లకు మరో 66 మంది
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 66 మంది పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల భర్తీకి మొత్తం 1,058 ఖాళీలకు 990 మందికి నియామక పత్రాలిచ్చారు. తాజాగా రిజర్వ్ జాబితాలో ఉంచిన మరో 66 మందిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో జనరల్ 48, ఓబీసీ 16 మంది ఉండగా, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరి వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. -
‘సివిల్స్’కు వయో పరిమితి 32 ఏళ్లు
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు ఆగస్టు 1, 2018నాటికి జనరల్ అభ్యర్థులు 32ఏళ్లకు మించని వారు అయి ఉండాలి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను రాజ్యసభలో తెలిపారు. సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన జితేంద్ర సింగ్.. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని.. అభ్యర్థులు సరైన సమాచారం ఇవ్వని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. దీంతో వయోపరిమితిపై అభ్యర్థుల అనుమానాలకు ఫుల్స్టాప్ పడినట్లే. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ (డీఓపీ అండ్ టీ) తెలిపిన మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితిని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ సర్వీస్లో అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశలల్లో జరుగుతుందన్న విషయం విదితమే. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు. సివిల్ సర్వీసెస్ రాసేందుకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థి భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హతపత్రం చూపించి సివిల్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు- 4 సార్లుయ ఓబీసీ అభ్యర్థులు- 7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల ఎంపికకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ నుంచి సుమారు 12 వేల మంది ఈ పరీక్షకు హాజరు కాగా, 600 మంది మెయిన్స్కు అర్హత పొందారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దానికి మూడు వారాల ముందు ఈ–అడ్మిట్ కార్డులు, టైం టేబుల్ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు మెయిన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా డిటెయిల్డ్ అప్లికేషన్ ఫారం(డీఏఎఫ్)ను నింపాలి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 6 మధ్య యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ ఫారం అందుబాటులో ఉంటుంది. -
మెట్రో రైలు ముందు దూకేశాడు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఈరోజు ఉదయం ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్ విహార్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్లోని గెస్ట్హౌస్లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్సైట్తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం(3న) జరగనున్న ఈ పరీక్ష కోసం 101 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు సుమారు 49 వేల మంది అభ్యర్థులు హజరుకానున్నారు. మొదటి పేపర్కు ఉదయం 9.20 వరకు, రెండో పేపర్కు మధ్యాహ్నం 2.20 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సాంకేతిక పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. యూపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ–అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది. -
సివిల్స్ కేటాయింపులో మార్పులకు యోచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్ విజేతలను ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇదే దురిశెట్టి అనుదీప్ గెలుపుబాట
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే ఒక మారథాన్. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్ఎస్ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్. రెండో అటెంప్ట్లోనే ఐఆర్ఎస్కు ఎంపికైన అనుదీప్.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుందా? అని ప్రశ్నించుకోవాలి. దీనికి సానుకూల సమాధానం లభిస్తే.. మన మనసే విజయానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. లక్ష్యం దిశగా కదిలేందుకు తోడ్పాటునందిస్తుంది. నా విషయంలో ప్రస్తుత విజయంలో ఇదే కీలక అంశం. సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత సర్వీసు ఐఏఎస్ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్ఎస్ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్పైనే! స్వీయ విశ్లేషణ 2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ తొలి దశ ప్రిలిమ్స్లో విజయం సాధించాను. మెయిన్ ఎగ్జామినేషన్లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్ సర్వీసెస్కు ప్రిపరేషన్ అనేది మెగా మారథాన్ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో పద పరిమితి, అందుబాటులో ఉన్న సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆన్సర్ షీట్పై పెన్ను కదిలించాలి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం బ్రేక్ పడినా.. విజయావకాశాలకూ బ్రేక్ పడినట్లే. ఈ విషయంలోనే నాలో పొరపాటు ఉందని గుర్తించాను. తప్పులను సరిదిద్దుకుంటూ.. వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్కు ప్రిపరేషన్ సయమంలో రైటింగ్ ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇది పరీక్ష హాల్లో సానుకూల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) లభించింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. లక్ష్యం.. ఐఏఎస్ 2013లో విజయంతో ఐఆర్ఎస్కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐఏఎస్ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్ఎస్ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్తో అధిక శాతం రీడింగ్పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్లో విజయం సాధించలేకపోయాను. 2016లో పరీక్షకు దూరంగా.. వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయింది. దీంతో 2016లో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్’ దూరం కాలేదు. ‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్స్టాప్ పెట్టాను. 2017 నోటిఫికేషన్లో అటెంప్ట్ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్ ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్–1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అందరూ చదివేది ఆ పుస్తకాలే.. ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్, మెటీరియల్ కోణంలో ఆలోచిస్తే.. పేపర్లకు సంబంధించి అభ్యర్థుల్లో అధిక శాతం మంది చదివే పుస్తకాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ మెటీరియల్, ఎకనామిక్స్కు మిశ్రా అండ్ పూరి.. ఇలా ప్రతి సబ్జెక్టుకు మార్కెట్లో మెటీరియల్ పరంగా ట్రేడ్ మార్క్ పుస్తకాలు ఉంటాయి. అభ్యర్థులందరూ దాదాపు అవే పుస్తకాలు ఉపయోగించుకుంటారు. కానీ, విజయం లభించేది కొందరికే. కారణం.. మెటీరియల్ చదివేటప్పుడు అనుసరించే ధోరణి, దృక్పథం. అంతేకాకుండా.. పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను గుర్తించగలిగే విలక్షణ నైపుణ్యం. దీనికోసం చేయాల్సిందల్లా గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం. దినపత్రికలు, ఇంటర్నెట్ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్కు ముందు ప్రిపరేషన్ నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్ను అలవరచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం, సమయ పాలన అలవడతాయి. ఇవే విజేతలకు, పరాజితులకు మధ్య ప్రధాన వ్యత్యాసాలు లేదా కారణాలు. అంతేగానీ విజేతలు హైపర్ యాక్టివ్ అనే ఆలోచనను వదులుకోవాలి. సివిల్ సర్వీసెస్లో విజయం అంటే ఏళ్లతరబడి చదివితేగానీ సాధ్యం కాదు’ అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే ఒక శాస్త్రీయ పద్ధతిలో కష్టపడి చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. స్మితా సబర్వాల్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. మాధ్యమం సమస్య.. ఓ అపోహ చాలా మంది సివిల్స్ ఔత్సాహికుల్లో ఉండే మరో ప్రధాన అపోహ.. పరీక్ష రాసే మాధ్యమం. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పరీక్ష రాస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్ల అవి కొంత తగ్గుతాయని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయంలో ఇది కేవలం అపోహ మాత్రమే. మనం ఏ మాధ్యమంలో అటెంప్ట్ ఇచ్చినా.. రాసిన సమాధానంలో ఫ్లేవర్ ఉంటే ఫలితం మనకు ఫేవర్గా ఉంటుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పరంగా రేషనలైజేషన్ విషయంలో యూపీఎస్సీ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందువల్ల మాధ్యమం విషయంలో ఆందోళన అనవసరం. ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్య.. మెటీరియల్. ఇది ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటోంది. దీంతో దీన్ని అర్థం చేసుకుని తెలుగులోకి అనువదించుకోవడం కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా సమయ పాలన సమస్య కూడా కనిపిస్తోంది. అయితే కచ్చితంగా ప్రాంతీయ మాధ్యమంలోనే అటెంప్ట్ ఇవ్వాలనుకున్న అభ్యర్థులు తొలి అటెంప్ట్కు ఏడాది ముందుగానే మెటీరియల్ సేకరించుకుని సదరు మాధ్యమంలోకి అనువదించుకుని ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల తొలి అటెంప్ట్ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనువదించుకునే క్రమంలో సబ్జెక్టు నిపుణులు లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఒకవేళ తొలి అటెంప్ట్లో నిరాశాజనక ఫలితం ఎదురైనా ఆందోళన చెందకుండా అదే మాధ్యమంలో ప్రిపరేషన్ సాగించాలి. కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్లే ఓటమి ఎదురైందనే భావనతో ఇంగ్లిష్ మీడియంకు మారితే.. కొత్త సమస్యలు ఎదురవుతాయి. సివిల్ సర్వీసెస్ ఫలితాల పరంగా ఇటీవల కాలంలో మరో అపోహ.. ‘సివిల్స్లో విజయం సాధించిన వారిలో బీటెక్, ఎంబీఏ, లేదా ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. పరీక్ష శైలి వారికి ఉపయోగపడే విధంగా ఉంటోంది’ అనేది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ప్రస్తుత పరీక్ష విధానంలో ఆప్షనల్స్కు ప్రాధాన్యం తగ్గింది. జనరల్ స్టడీస్కు ప్రాధాన్యం పెరిగింది. దీంతో బీఏ పట్టభద్రులైనా, ఎంబీఏ పట్టభద్రులైనా.. అందరికీ ఒకే విధమైన అంశాలు ఉంటాయి. అయితే సమాధానాలు ఇచ్చే సమయంలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. ఒక అంశాన్ని అనలిటికల్ అప్రోచ్తో సమాధానం ఇవ్వగలగడం. ఇదే వారికి కొంత అడ్వాంటేజ్గా మారుతుండొచ్చు. దీనికి కారణంగా అకడెమిక్గా బీటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్లలో అనుసరిస్తున్న కరిక్యులంను పేర్కొనొచ్చు. ఇంటర్వ్యూ.. ఇంటర్ప్రెటర్ చివరి దశ ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్ప్రెటర్ (అనువాదకుడు) సదుపాయాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఇంటర్ప్రెటర్స్ను కేటాయిస్తోంది. వీరు బోర్డు సభ్యులు, అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు. కానీ, దీనివల్ల ఎదురయ్యే సమస్య.. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తం చేసిన భావం సరిగా బోర్డు సభ్యులకు చేరకపోవడం. ఈ విషయంలో నా సలహా.. ఇంగ్లిష్లో బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీలైనంత మేరకు ఇంటర్ప్రెటర్ అవకాశం లేకుండా నేరుగా సమాధానాలు ఇచ్చేలా సన్నద్ధం కావాలి. అప్పుడే బోర్డు సభ్యులకు, అభ్యర్థులకు మధ్య ‘ఐ’ కాంటాక్ట్, ఇంటరాక్షన్ విషయాల్లో సరైన సమాచార మార్పిడి జరుగుతుంది. దురిశెట్టి అనుదీప్ సివిల్స్ ప్రస్థానం 2012 తొలి ప్రయత్నం – మెయిన్స్లో నిరాశ. 2013 రెండో ప్రయత్నం– ఐఆర్ఎస్కు ఎంపిక. 2014, 2015 మూడు, నాలుగు ప్రయత్నాలు – మెయిన్స్లో పరాజయం. 2017 అయిదో ప్రయత్నం – ఆలిండియా టాప్ ర్యాంకు. ఇంటర్వ్యూ సాగిందిలా.. ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్లో జరిగింది. అజిత్ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు.. చదివింది బీటెక్ కదా.. సివిల్స్వైపు ఎందుకు రావాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్ సర్వీసెస్ అని నిర్ణయించుకున్నాను. బీటెక్ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడానికి కారణం? ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకున్నాను. ఇప్పటికే ఐఆర్ఎస్లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్కు హాజరవడానికి కారణం? మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్ఎస్ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్ అని భావిస్తున్నాను. ఐఏఎస్ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది. స్వచ్ఛ్ భారత్ పథకంపై మీ ఉద్దేశం? కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం? ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ హాబీగా ‘మెడిటేషన్’ను పేర్కొన్నారు? ఇది మీకు ఎలా ఉపయోగపడింది? జీవితంలో నిరాశకు గురైన సందర్భాలు, మానసిక వ్యాకులతకు గురైన పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడటానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి సందర్భాల్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా తొందరగా తిరిగి మానసికోల్లాసం లభిస్తుంది. నాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం విధులు ఇలా.. ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను అనిపించింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. అయితే ఆలిండియా టాపర్గా నిలవడం మాటల్లో వర్ణించలేనిది. సివిల్స్ ఔత్సాహికులకు నా సలహా.. మీపై మీరు నమ్మకం పెంచుకోండి. వ్యూహాత్మకంగా అడుగులు వేయండి. ఆప్షనల్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వండి. చదివిన ప్రతి అంశాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోండి. -
మెకానికల్ ఇంజినీర్లు పనికిరారు : సీఎం
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్నగర్ జిల్లాకు పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను ముఖ్యమంత్రి అభినందించారు. 9 ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యశర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా తెలంగాణ విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రభుత్వ పరంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను తెలంగాణలోని హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు. -
నాన్న మాటలే స్ఫూర్తి..
తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరంక్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చినా సివిల్స్నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలోఅంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడాదాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్ఎస్ సాధించాడు.అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూనే...మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్–1 ర్యాంకును సొంతంచేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే... సాక్షి, హెదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్కు 180 మందిని, ఐఎఫ్ఎస్కు 42 మందిని, ఐపీఎస్కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్లో బిట్స్పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను. ఫైనల్ ఇయర్లోనే నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే సివిల్స్కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒరాకిల్లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్లో చేరా. జాబ్ చేస్తూనే ఒకవైపు గూగుల్లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో జీఎస్టీ, కస్టమ్స్లో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నా. ఆప్షనల్ ఆంత్రోపాలజీ మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది. ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు ఐఆర్ఎస్కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్కు సీరియస్గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం. అంతా సొంత ప్రిపరేషనే... మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. విద్య, ఆరోగ్యం: యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు. ప్రొఫైల్ పదో తరగతి మార్కులు: 86 శాతం ఇంటర్ మార్కులు: 97 శాతం ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం తెలుగు తేజాలు 1 దురిశెట్టి అనుదీప్ 43 శీలం సాయి తేజ 100 నారపు రెడ్డి మౌర్య 144 జి/.మాధురి 196 సాయి ప్రణీత్ 206 నాగవెంకట మణికంఠ 245 వాసి చందీష్ 374 రిషికేశ్రెడి 512 ప్రవీణ్చంద్ 513 ప్రసన్నకుమారి 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై.అక్షయ్ కుమార్ 816 భార్గవ్ శేఖర్ 884 వంశీ దిలీప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. సివిల్స్ టాపర్లను అభినందించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన ఉభయ రాష్ట్రాల తెలుగు అభ్యర్థులందరినీ అభినందిçస్తూ... వారి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
తెలుగు విద్యార్థికి సివిల్స్లో మొదటి ర్యాంక్
-
సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి
సాక్షి, న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్-2017 మెయిన్స్ తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది. గతేడాది జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ నిర్వహించింది. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది. ర్యాంకు టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) 1 దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి) 43 శీలం సాయితేజ 100 నారపురెడ్డి శౌర్య 144 మాధురి 195 వివేక్ జాన్సన్ 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై అక్షయ్ కుమార్ 816 భార్గవ శేఖర్ -
మైనార్టీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఏటా వంద మందిని ఎంపిక చేసి వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం మే 8వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి.. 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది పాత జిల్లాల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని వేసి నగరంలోని ఐదు ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఎంపిక చేశారు. స్టైఫండ్, మెటీరియల్ కూడా.. ఎంపికైన విద్యార్థులకు కోచింగ్కు అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా ఉపకార వేతనం కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లోకల్ విద్యార్థికి రూ.2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5 వేలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు అదనంగా రూ.3500 ఇస్తారు. కోచింగ్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.51 లక్షలు వెచ్చించనుంది. మైనార్టీల ప్రగతికి తోడ్పాటు ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపేట్టిన సివిల్ సర్వీస్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు నగరంలోని టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇవ్వలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.– ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్,సీఈడీఎం డైరెక్టర్ -
ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో అధునాతన సాంకేతికత, సృజనను వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ముగిసిన రెండ్రోజుల సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం, ఫైళ్లను ముందుకు కదిలించడంలో నెలకొన్న జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.‘నాలుగు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తే మనిషికి మోక్షం లభిస్తుంది. కానీ ఒక ఫైల్ అలాంటి యాత్రలు 32 చేసినా ఫలితం ఉండట్లేదు’ అని మోదీ అన్నారు. కొత్త విధానాలు, చట్టాలు చేసే సమయంలో ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని అన్నారు. ప్రభుత్వ విధానాల అమలులో వ్యూహాత్మకంగా ఆలోచించాలని, ఉన్నతాధికారులు సాంకేతికతను వినియోగించుకుంటే అది వారికి అదనపు బలమవుతుందని అన్నారు. సివిల్ అధికారుల శక్తి, సామర్థ్యాలు గొప్పవని, అవి జాతి ప్రయోజనాలకు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి వ్యూహాలు, ప్రాధమ్య కార్యక్రమాలతో కూడిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లాల అధికారులు, కేంద్ర, రాష్ట్రాల సంస్థలకు అవార్డులు అందజేశారు. మణిపూర్లోని కరంగ్ని దేశంలోనే తొలి నగదు రహిత దీవిగా తీర్చిదిద్దిన అధికారులకు మోదీ అవార్డును బహూకరించారు. -
సివిల్ సర్వీసెస్ ఎంపిక రద్దు చేయడం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం ఉన్నట్లుగా అప్పిలేట్ మెడికల్ బోర్డు ధ్రువీకరించాక, అంగవైకల్య కోటాలో సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడాన్ని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేయడం చెల్లదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన రిజ్వాన్ బాషా షేక్ అంగవైకల్యం కోటా కింద 2016లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించారు. బాషాకు 30 శాతం దృష్టి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డు ధ్రువీక రించింది. దీనిపై బాషా కేంద్ర వైద్య వ్యక్తిగత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి చెందిన అప్పిలేట్ మెడికల్ బోర్డులో అప్పీల్ చేసుకున్నారు. దృష్టి లోపం 40 శాతం ఉన్నట్లు అప్పీల్లో తేలింది. బాషా అంగవైకల్యంపై అందిన ఫిర్యాదును యూపీఎస్సీ చైర్మన్ నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ 30 శాతమే దృష్టి లోపం ఉందని 2017 నవంబర్ 7న తేల్చడంతో బాషా సివిల్ సర్వీసెస్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని బాషా క్యాట్లో సవాల్ చేయగా ఒకసారి మెడికల్ అప్పిలేట్ బోర్డు అంగవైకల్యాన్ని నిర్ధారించాక దాన్ని నిపుణుల కమిటీకి పంపడం సరికాదంది. సివిల్ సర్వీసెస్కు బాషా ఎంపికను రద్దు చేయడం చెల్లదని జస్టిస్ రెడ్డి కాంతారావు, సభ్యులు మిన్నీ మాథ్యూస్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
సివిల్ సర్వీసెస్ అధికారులకు అవార్డులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందించనున్నారు. వివిధ శాఖల అధికారుల నుంచి మొత్తం 623 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సేవలందిస్తున్న అడిషనల్ సెక్రటరీ /జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్/ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాతావరణ పరిరక్షణకు, విపత్తుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంక్షేమానికి కృషి చేసిన వారికి కూడా అవార్డులు అందజేస్తారు. -
సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలనుంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలని ఉందని యంగ్ టెర్రరిస్ట్ డానిష్ ఫరూఖ్ భట్ చెబుతున్నాడు. తాను చేసిన భారీ తప్పిదాన్ని తెలుసుకుని 22 ఏళ్ల ఫరూఖ్ పశ్చాత్తాపపడుతున్నాడు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడంతో కొందరు ఉగ్రవాదులతో కలిసి తొలిసారిగా వెలుగులొకి వచ్చాడు ఈ కశ్మీర్ యువకుడు. ఇటీవల పోలీసులు చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన, మార్పులు కార్యక్రమాలతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నాడు. ‘కొందరు ఉగ్రవాదులు, దేశ వ్యతిరేఖ శక్తులు నన్ను చెడువైపు ప్రోత్సహించాయి. దాంతో కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదులతో కలిసి తిరిగాను. మా కాలేజీ (డూన్ పీజీ కాలేజీ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) యాజమాన్యం నన్ను మళ్లీ చేర్చుకుని అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. చెడు మార్గాన్ని వదిలేసి మంచివాడిగా బతకాలనుకుంటున్నాను. కొన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర గ్రూపులతో సంబంధాలు కొనసాగించాను. భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ చేయను. కుటుంబం కోసం, దేశం పనిచేయాలని నిర్ణయించుకున్నానని’ ఫరూఖ్ భట్ వివరించాడు. ఫరూఖ్ తండ్రి ఫరూఖ్ అహ్మద్ భట్ మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి ఫోన్ కొన్నిరోజులు స్విచ్ ఆఫ్ కావడంతో ఎంతో ఆందోళన చెందాను. ఉగ్రవాది అంటూ పేరు పడుతుందని చాలా బాధపడ్డాం. చివరికి పోలీసుల సహకారంతో చెడు విధానాలకు స్వస్తి పలికాడు. వాడు తప్పు తెలుసుకుని మారినందుకు సంతోషంగా ఉందని’ చెప్పారు అహ్మద్ భట్. -
సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ : సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ ఎగ్జామ్ను క్లియర్ చేసిన అభ్యర్థుల రోల్ నెంబర్లను www.upsc.gov.in పొందుపరిచినట్టు యూపీఎస్సీ పేర్కొంది. ఈ ఎగ్జామ్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఈ వెబ్సైట్లో ఇంటర్వ్యూ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయసు, విద్యార్హతల సర్టిఫికేట్లు, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వంటి ఇతర ఒరిజనల్ డాక్యుమెంట్లను పట్టుకుని రావాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది. క్వాలిఫై కానీ అభ్యర్థుల మార్కు షీట్లను కూడా తుది ఫలితాల వెల్లడి నుంచి 15 రోజుల్లో యూపీఎస్సీ తన వెబ్సైట్లో పెట్టనుంది. -
ముంగిట్లోకి సర్కారు సేవలు
న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం. ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు. ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. -
జూన్ 3న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి అధికారుల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2018 జూన్ 3న ఉంటుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ విడుదలవుతుందనీ, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 6 అని యూపీఎస్సీ పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత స్థాయి అధికారుల నియామకానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2017 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్ష కోసం డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)ను ఆన్లైన్లో నింపి పంపాలని యూపీఎస్సీ సూచించింది. ఆగస్టు 17–31 మధ్య ఆ ఫామ్ ఠీఠీఠీ. upటఛి. జౌఠి. జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సివిల్స్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 28న ప్రారంభమవుతాయి. -
నేను నిజంగానే వికలాంగుడిని
హైకోర్టుకు విన్నవించిన రోణంకి గోపాలకృష్ణ సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షల్లో తప్పుడు ఆంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటా ద్వారానే ర్యాంకు సాధించినట్లు తనపై పిటిషనర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రోణంకి గోపాలకృష్ణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. తాను నిజంగానే వికలాంగుడినని, 2002లో జరిగిన ఓ ప్రమాదంలో తన కుడి చేయికి తీవ్ర గాయం కావడంతో ‘లోకోమోటర్ ఫిజికల్ డిజెబిలిటీ’తో బాధపడుతున్నానని వివరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం ద్వారా గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గోపాలకృష్ణను ఆదేశించింది. ఈ మేరకు గోపాల కృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. వికలాంగుల కోటాలోనే మొదటి ఉద్యోగం సాధించా శ్రీకాకుళం జిల్లా మెడికల్ బోర్డు తనను ‘శాశ్వత లోకోమోటర్ డిజెబుల్డ్ పర్సన్’గా ధ్రువీ కరిస్తూ 2002లో సర్టిఫికేట్ జారీ చేసిందని గోపాలకృష్ణ తెలిపారు. ‘విశాఖపట్నం కింగ్జార్జ్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, శ్రీకాకుళం రిమ్స్ ఆసుప్రతులు నా వైకల్యాన్ని ధ్రువీకరించాయి. 2006 డీఎస్సీలో అంగవైకల్య కోటా కింద ఎంపికైటీచర్గా నియమితులయ్యా. అదే కోటా కింద గ్రూప్–1కు ఎంపికయ్యా. 2016లో యూపీఎస్సీ పరీ క్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించా. అన్నీ నిర్ధారించుకున్న తరువాతే యూపీఎస్సీ మూడో ర్యాంకు కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యా నికి విచారణార్హతే లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని పిటిషనర్కు భారీ జరిమానా విధిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని గోపాలకృష్ణ కోర్టును కోరారు. -
రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
- కేంద్రం, యూపీఎస్సీ, ఏపీ సర్కార్లకు కూడా - పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షల్లో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటాలో ర్యాంకు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం వ్యవహా రంలో పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారా లశాఖ కార్యదర్శి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సంయుక్త కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ఆదేశిం చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీ లతో కూడిన ధర్మాస నం మంగళవారం ఉత్త ర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీ క్షలో తప్పుడు అంగ వైకల్య ధ్రువీకరణ పత్రంతో లబ్ధి పొందడం వల్లే గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్ కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ మురళీకృష్ణ స్వయం గా వాదనలు వినిపిస్తూ, అంగవైకల్యం లేనప్పటికీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి వికలాంగుల కోటా కింద ఉత్తీర్ణత సాధించి ర్యాంకు పొందారని తెలిపారు. దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. గోపాలకృష్ణ ఓబీసీకి చెందిన వారని, ఈ కేటగిరీ కింద 110.66 అర్హత మార్కులని మురళీకృష్ణ తెలిపారు. గోపాలకృష్ణ కేవలం 91.34 మార్కులు సాధించారని, వికలాంగుల కోటాలో 75.34 అర్హత మార్కులని తెలిపారు. ఓబీసీ కింద అర్హత మార్కులు సాధించలేని గోపాల కృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో వికలాంగుల కోటాలో అర్హత సాధించారని, తద్వా రా జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చిందని వివరించారు. వికలాంగుల కోటాలో పరీక్ష రాసేం దుకు అదనపు సమయం సైతం పొందారని తెలిపా రు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘రోణంకి’పై విచారణకు ఆదేశించండి
- అతనికి కేటాయించిన ర్యాంకును చట్ట విరుద్ధంగా ప్రకటించండి - హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు మూడో ర్యాంక్ కేటాయించ డాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధ్రువీకరణపత్రంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ ఈ వ్యాజాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి, యూపీఎస్ సీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. సివిల్ –2016లో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు వచ్చిందని తెలిపారు. అయితే గోపాలకృష్ణ తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడికల్ విభాగంలో 45% మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించా రన్నారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 అని, అయితే గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే సాధించారన్నారు. వికలాంగ కోటా కింద అర్హతకు 75.34 మార్కులని, దీంతో అతను మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. సమయంతోనూ లబ్ధి మెయిన్స్లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా గోపాలకృష్ణ లబ్ధి పొందారని పిటిషనర్ పేర్కొన్నారు. వాస్తవానికి గోపాలకృష్ణకు పెద్ద వైకల్యమేదీ లేదని పిటిషనర్ వివరించారు. గోపాలకృష్ణ వైకల్యంపై పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని, అతనికి ఐఏఎస్ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. -
సివిల్స్ టాపర్ తొలివేతనం ఎవరికో తెలుసా?
మంగళూరు : సివిల్స్ ఆలిండియా టాపర్ గా నిలిచి దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన కేఆర్ నందిని తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు విరాళంగా ఇస్తున్నారు.. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన వెంటనే నందిని, విద్యకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తొలి వేతనాన్ని ఆల్వా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత విద్యా పథకానికి ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఆల్వా ఫౌండేషన్ ను సందర్శించిన ఆమె, ఈ ప్రకటన చేసినట్టు ఆ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఫౌండేషన్ చైర్మన్ ఎం మోహన్ ఆల్వాను కలిసిన నందిని, చదువుకోవాలనుకునే విద్యార్థులకు తాను సహాయం చేయడం కొనసాగిస్తానని చెప్పారు. ఆల్వా ఉచిత ఎడ్యుకేషన్ స్కీమ్ కింద లబ్దిపొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం విశేషం. నందిని సాధించిన ఘనతకు మోహన్ ఆల్వా ఆమెకు లక్ష రూపాయలను బహుమతిగా అందించారు. కన్నడ సాహిత్యంతో తనకున్న సంబంధం, తన లక్ష్యాలను సాధించడానికి చాలా సహకరించాయని నందిని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన నందిని, తన నేపథ్యానికి భిన్నంగా కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు. నందిని తండ్రి కేవీ రమేశ్, తల్లి విమలమ్మ కూడా ఈ ఫౌండేషన్ సందర్శనలో కూతురితో పాటు పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యంగా నాలుగో ప్రయత్నంలో ఆమె ఈ ఘనతను సాధించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని కెంబోడి ప్రాంతానికి చెందిన వారు కేఆర్ నందిని. -
ఓరుగల్లు యువతి ప్రతిభ
-
అమ్మ కలల్ని నిజం చేశా..
మిక్కిలినేని మను చౌదరి చిన్నప్పటి నుంచి ఆ విద్యార్థి తల్లి అతణ్ని కలెక్టర్ చేయాలనుకుంది. నువ్వు పెద్దయ్యాక కలెక్టర్ కావాలి అని చెబుతూ ఉండేది. అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న ఆ పిల్లాడు తల్లి మాటలను సీరియస్గా తీసుకున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో ‘నీ లక్ష్యం ఏంటీ’ అని టీచర్లు అడిగితే తడుముకోకుండా కలెక్టర్నవుతా అనే చెప్పేవాడు. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి అమ్మ ఆశయమే తనకు సరైన లక్ష్యమని తెలుసుకున్నాడు. సివిల్సే లక్ష్యంగా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 36వ ర్యాంకు సాధించాడు మిక్కిలినేని మను చౌదరి. సక్సెస్ స్పీక్స్ మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు. నాన్న రాజబాబు ఓరియెంట్ సిమెంట్లో సీనియర్ కెమిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ భారతి గృహిణి. తమ్ముడు ఎంబీఏ చదువుతున్నాడు. 2015లో పీజీడీఎం పూర్తిచేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. తొలి ప్రయత్నంలోనే విజయం దక్కడం నాకు, నా కుటుంబానికి అమితానందాన్ని కలిగించింది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీలు అవుతుంటాయి. అందులో భాగంగా నా విద్యాభ్యాసం పలు ప్రాంతాల్లో సాగింది. నాలుగో తరగతి వరకు ఆదిలాబాద్లోని దేవాపూర్లో చదివా. అక్కడి నుంచి నాన్నకు మహారాష్ట్ర జల్గావ్కు బదిలీ అయింది. ఇక అయిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివాను. జల్గావ్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. తర్వాత ఢిల్లీలో పీజీడీఎం చేశాను. ఇంజనీరింగ్ నుంచే చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇంజనీరింగ్లో చేరిన తర్వాతే సమాజంపై అవగాహన ఏర్పడింది. ఇంజనీరింగ్లో భిన్న వర్గాల వారితో కలిసి చదువుకోవడం కారణంగా సామాజిక స్పృహ అలవడింది. మూడో ఏడాదిలో ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం, చదవాల్సిన పుస్తకాలు మొదలైన సమాచారాన్ని ఇంటర్నెట్లో శోధించడం ప్రారంభించా. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ కోసం ఢిల్లీ వెళ్లాను. ఎప్పటికప్పుడు సీనియర్లతో, ర్యాంకు సాధించిన వారితో మాట్లాడుతూ సన్నద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకున్నాను. ఎంబీఏ తర్వాత పూర్తిసమయాన్ని సివిల్స్ ప్రిపరేషన్కు కేటాయించా. సివిల్స్కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. కోచింగ్లో ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? తదితర గైడెన్స్ మాత్రమే ఇస్తారు. చదవాల్సిన బాధ్యత పూర్తిగా విద్యార్థిపైనే ఉంటుంది. ఆప్షనల్ .. సైకాలజీ సాధారణంగా అభ్యర్థులు సైన్స్ లేదా సోషల్ సైన్సెస్ సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకుంటారు. అయితే సైకాలజీ ఈ రెండు అంశాల కలబోతగా ఉంటుంది. నేను ఎంబీఏలో చదివిన హుమ్యాన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ బిహేవియర్ పుస్తకాలు సైకాలజీ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం. ఈ పుస్తకాల్లో సైకాలజీకి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయి. దీంతో సైకాలజీపై కాస్త ఆసక్తి పెరిగింది. పైగా సివిల్స్ పరీక్షలో సైకాలజీలో గతంలో మంచి మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించి సైకాలజీ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకున్నాను. బ్యాలెన్స్డ్గా సమాధానాలు ఎంబీఏ తర్వాత 2015 ఏప్రిల్లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లో చేరా. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు ఒకేసారి ప్రిపరేషన్ ప్రారంభించా. మెయిన్స్ కోసం రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేశా. సీనియర్లు, గత విజేతలు రాసిన నోట్స్ ఫాలో అయ్యా. 2015 మెయిన్స్ టాపర్లు రాసిన పేపర్లు నెట్లో అందుబాటులో ఉంటాయి. వారు రాసిన విధానంలో కొన్ని సానుకూల అంశాలను వెతికి అదే మోడల్లో రాశాను. డిస్క్రిప్టివ్ పద్ధతిలో సమాధానాలు రాసేటప్పుడు సమతూకం పాటించాలి. చదివిన పుస్తకాలు సివిల్స్కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మొదట ఆరో తరగతి నుంచి +2 వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఔపోసన పట్టాలి. తర్వాత సబ్జెక్టుల వారీగా రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. పాలిటీ–లక్ష్మీకాంత్; ఎన్విరాన్మెంటల్– శంకర్ ఐఏఎస్ పుస్తకం; జాగ్రఫీ– ఎన్సీఈఆర్టీ + కరెంట్ అఫైర్స్ + గో చెంగ్ లియాంగ్ పుస్తకం; ఎకానమీ– ఎన్సీఈఆర్టీ + కరెంట్ అఫైర్స్ + క్లాస్ నోట్స్; మోడర్న్ హిస్టరీ– బిపిన్చంద్ర; మిడీవల్ హిస్టరీ– తమిళనాడు స్టేట్ లెవల్ ఇంటర్ ఫస్టియర్ పుస్తకం; ప్రాచీన చరిత్ర– ఆర్.ఎస్. శర్మ పుస్తకం + క్లాస్ నోట్స్. ఇంటర్వూ్య సాగిందిలా ఇంటర్వూ్య బోర్డ్లో చైర్మన్ పీకే. జోషి + నలుగురు సభ్యులు ఉన్నారు. ఇంటర్వూ్యలో ముఖ్యంగా ఎంబీఏకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సిక్స్ సిగ్మా అంటే ఏమిటి? మార్కెటింగ్, సేల్స్కు మధ్య తేడా ఏమిటి? డబ్ల్యూపీఐ, సీపీఐపై ప్రశ్నలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. తెలంగాణలో, ఏపీలో ఉన్న ముఖ్య సమస్యలు ఏమిటి? కొత్తగూడెం దేనికి పేరొందింది? మొదలైన ప్రశ్నలతో దాదాపు 25–30 నిమిషాల పాటు ఇంటర్వూ్య సాగింది. కోచింగ్కు వెళ్లలేని వారు సరైన మెటీరియల్ సేకరించుకొని చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ఇప్పడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే.. ఇంటర్నెట్లో అవసరమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో మాత్రం అప్రమత్తత అవసరం. ప్రొఫైల్ పదో తరగతి (2006 – 2007): 87 శాతం 10+2 (2007 – 2009): 82 శాతం ఇంజనీరింగ్ (మెకానికల్) (2009 – 2013): 75 శాతం పీజీడీఎం (2013 – 2015): 9.4 సీజీపీఏ సివిల్ సర్వీసెస్–2016 ర్యాంకు: 36. -
సివిల్స్లో మెరిశారు
పాలకొల్లు (సెంట్రల్)/అత్తిలి : జిల్లా ఆడపడుచులు సివిల్స్లో మెరిశారు. బుధవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాల్లో పాలకొల్లుకు చెందిన చోడిశెట్టి మాధవి 104వ ర్యాంకును కైవసం చేసుకోగా, అత్తిలి గ్రామానికి చెందిన మేడపాటి శ్వేత 870వ∙ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాధవి అరుణ్కుమార్, రాజేశ్వరి దంపతుల కుమార్తె. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి అక్కడే సివిల్స్కు ప్రిపేరయ్యా రు. మాధవి మాట్లాడుతూ తాను సివిల్స్ రాయడం ఇది రెండోసారి అని.. తనకు లభించిన 104వ ర్యాంకును బట్టి ఐఆర్ఎస్ లభించే అవకాశం ఉందని చెప్పారు. ఐఏఎస్ కావాలనేది తన తాతయ్య గంటా రామచంద్రరావు కోరిక అని, అందుకోసం మళ్లీ పరీక్షలు రాస్తానని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే.. అత్తిలికి చెందిన మేడపాటి శ్వేత తొలి ప్రయత్నంలోనే 870వ ర్యాంకు సాధించారు. 2015లో ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఢిల్లీలో కోచింగ్ తీసుకుని 2016లో సివిల్స్ రాశారు. ఆమె తండ్రి మేడపాటి మూర్తి పీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. తల్లి అత్తిలి బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని. శ్వేత సోదరి శృతి బీటెక్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలోని కొటక్ మహీంద్ర బ్యాంక్లో డెప్యూటీ మేనేజర్గా పని చేస్తోంది. -
సంస్కరణల సంకల్పముంది
► పరివర్తన తేవటంలో అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి ► ధైర్యంగా, నిజాయితీగా పనిచేయండి.. సమస్యలొస్తే నేనున్నా ► సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను కొనసాగించేందుకు బలమైన రాజకీయ సంకల్పం తనకుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో అధికారులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. అధికారులు విశాల దృక్పథంతో.. దేశాన్ని పరివర్తనం చేయటంలో ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరికీ భయపడొద్దని నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ‘రాజకీయ సంకల్పం సంస్కరణలు (రిఫామ్) తీసుకొస్తుంది. కానీ, బ్యూరోక్రసీ దాన్ని అమలు (పెర్ఫామ్)చేస్తుంది. ప్రజల భాగస్వామ్యం పరివర్తనం (ట్రాన్స్ఫామ్) తీసుకొస్తుంది. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులొస్తే నా మద్దతుంటుంది’ అని అన్నారు. నిర్ణయాలు తీసుకున్నాక.. విధానపరమైన సమస్యలొస్తే కాగ్, సీబీఐ, సీవీసీ (త్రీ సీస్)తో ఇబ్బందులపై పలువురు అధికారులు మాట్లాడిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లెక్కల ద్వారా ఏమైనా మార్పొస్తుందా? ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కాగ్కు ఫలితమే కావాలి. కాగ్ లెక్కల ప్రకారమే ముందుకెళ్లాలంటే దేశంలో మార్పు తీసుకురాలేం? మనం కూడా ఎలాంటి మార్పునూ గమనించలేం’ అని తెలిపారు. సీనియర్ అధికారులు తమకంతా తెలుసనే సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చి జూనియర్ల ఆలోచనలకు సరైన మార్గదర్శనం చేయాలన్నారు. అధికారుల గురించి ప్రజలు ఆలోచించే తీరు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘అధికారులు చెడ్డోళ్లు కానప్పుడు వారు దురాలోచనలతో పనిచేయరు. అలాంటప్పుడు సామాన్యుడు ఒక అభిప్రాయాన్ని పెంచుకునే బదులు ఫిర్యాదు చేస్తాడు? కారణమేంటో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరిగినపుడు ప్రజల అభిప్రాయాన్ని మార్చటం కష్టమేం కాదనుకుంటున్నా’ అని అన్నారు. కశ్మీర్ వరదలప్పుడు ఆర్మీ చేసిన సాయానికి ప్రజలు చప్పట్లు కొట్టారని.. అదే ప్రజలు తర్వాత ఆర్మీపై రాళ్లు రువ్వారన్నారు. కానీ ఒక్క క్షణం ఆర్మీ చేసిన పని ప్రజలను హత్తుకుందన్నారు. అధికారులు జట్టుగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలొస్తాయన్నారు. అందుకే ఫోన్లు వద్దంటా! అధికారులతో తనెప్పుడు సమావేశమైనా మొబైల్ ఫోన్లు లేకుండానే వారిని రమ్మంటానని ప్రధాని తెలిపారు. సమావేశం జరుగుతుండగానే అధికారులు మొబైల్లో సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటుంటారన్నారు. ‘ఈ మధ్య జిల్లాస్థాయి అధికారులు కూడా సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోతున్నారు. అందుకే నా సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాను. సోషల్ మీడియా ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. సొంత డబ్బా కొట్టుకునేందుకు కాదు’ అని ప్రధాని చురకలంటించారు. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్కు మారిపోతోందని అలాంటప్పుడు మొబైల్ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలన్నారు. ‘నేను కోచింగ్కు వెళ్లలేదు. అందుకే అధికారిని కాలేకపోయాను. అధికారినే అయివుంటే ఈ 16 ఏళ్లలో డైరెక్టర్ స్థాయిలో ఉండేవాడినేమో. నా అదృష్టం కొద్ది ప్రజా సేవలో ఉన్నాను’ అని మోదీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పథకాల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు. ఆదివారం ‘నీతి’ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ విజన్ 2030 రోడ్ మ్యాప్తో 15 ఏళ్లపాటు అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో మూడేళ్లు, ఏడేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి వ్యూహాలు రూపొందిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం దినమంతా ఈ సమావేశం జరగనుంది. -
ముందుగా వచ్చిన మంత్రి.. అధికారులు లేట్!
సాధారణంగా ఏవైనా కార్యక్రమాలకు మంత్రులు, ఇతర వీవీఐపీలను పిలిస్తే వాళ్లు కార్యక్రమం ప్రారంభ సమయం తర్వాత ఓ అరగంటకో, గంటకో వస్తుంటారు. వాళ్లకోసం వేచి చూసి.. చూసి కళ్లు కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను పిలిచారు. ఆయన ఉదయం 9.40 గంటలకే వచ్చేశారు. కానీ 9.57 గంటల వరకు కార్యక్రమం మొదలు కాలేదు. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. తాను ముందుగానే వచ్చినా కార్యక్రమాన్ని సమయానికి ఎందుకు ప్రారంభించలేదని అక్కడున్న అధికారుల మీద మండిపడ్డారు. మీ నిబద్ధత స్థాయి ఏమైనా పడిపోయిందేమో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైన కార్యక్రమాలని, ఇలాంటి వాటిని గౌరవనీయమైన పద్ధతిలో్ నిర్వహించాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రెండు రోజుల కార్యక్రమాన్ని రాజ్నాథ్ ప్రారంభించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసిన అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలోనే శుక్రవారం నాడు అవార్డులు అందజేస్తారు. -
‘సివిల్స్’లో మార్పులు?
దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మొదలు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదివిన వారు సైతం పోటీపడుతున్న పరీక్ష. ఇంతటి ప్రాధాన్యమున్న పరీక్షలో చేయాల్సిన మార్పులకు సంబంధించి బి.ఎస్.బస్వాన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు జరగనున్నాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. నివేదికలోని అంశాలు బహిర్గతం కానప్పటికీ, కనీస వయోపరిమితి మొదలు పరీక్ష పేపర్ల వరకు వివిధ అంశాలపై కమిటీ సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం.. 2015, ఆగస్టులో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్.బస్వాన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎన్.నవ్లావాలా, మాజీ యూజీసీ సభ్యులు హరిప్రతాప్ గౌతమ్, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధే, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా, మేనేజ్మెంట్ ప్రొఫెసర్ బి.మహదేవన్, యూపీఎస్సీ సభ్య కార్యదర్శి ఎం.పి.తంగిరాల సభ్యులుగా ఉన్న కమిటీ వాస్తవానికి 2016 ఫిబ్రవరిలోనే నివేదిక అందించాల్సి ఉంది. కానీ, ఆర్నెల్ల గడువు పొడిగింపుతో ఆగస్టు 9న నివేదిక అందజేసింది. ఈ నివేదికను బహిరంగపరచలేమని.. అయితే అర్హతలు, అటెంప్ట్లు నుంచి ఇంటర్వూ్య విధానం వరకు మార్పులు సూచించిన మాట వాస్తవమేనంటూ సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీఓపీటీ) సమాధానం ఇచ్చింది. వయోపరిమితి తగ్గింపు బస్వాన్ కమిటీ సిఫార్సుల్లో కీలకమైంది, అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం వయోపరిమితి తగ్గింపు. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో 32 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 26 ఏళ్లకు కుదించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. దీన్ని నాలుగుకు తగ్గిస్తూ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అర్హతల్లో నిబంధనలు ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులెవరైనా సివిల్స్కు హాజరుకావొచ్చు. అయితే ఈ పరీక్ష ద్వారా భర్తీచేసే సర్వీసులను దృష్టిలో పెట్టుకుని ఆయా సర్వీసులకు అవసరమైన అంశాల్లో అకడమిక్ నేపథ్యం ఉండే విధంగా అర్హత నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సర్వీస్ ఔత్సాహికులు తప్పనిసరిగా లా ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన. అంతేకాకుండా కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీలోనూ తప్పనిసరిగా 50 శాతం మార్కులు పొందాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. సర్వీస్ను బట్టి అదనపు పేపర్లు íసివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 24 సర్వీసుల్లో పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇప్పటివరకు అన్ని సర్వీసుల ఔత్సాహికులు ఒకే రకమైన పేపర్లు రాయాల్సిన విధానం అమలవుతోంది. అయితే బస్వాన్ కమిటీ ఈ అంశంలో కీలక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అవి.. సర్వీస్కు అనుగుణంగా ఒకటి లేదా రెండు ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం. (ఉదాహరణకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ పోస్టుల భర్తీ క్రమంలో అకౌంటెన్సీ నైపుణ్యాలను పరీక్షించేలా çసంబంధిత సబ్జెక్టులతో ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం వంటివి). అదే విధంగా ఆప్షనల్ సబ్జెక్టులను పూర్తిగా తొలగించడం. ఇంటర్వూ్యలో మార్పులు సివిల్స్ ఎంపిక ప్రక్రియలోని తుది దశ ఇంటర్వూ్యపైనా బస్వాన్ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం.. ప్యానెల్ ఇంటర్వూ్యకు ముందు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలి. త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహిస్తున్న మాదిరిగా రెండు, మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ఇంటర్వూ్య ప్రక్రియను కొనసాగించి అభ్యర్థుల్లోని మానసిక ద్రుఢత్వాన్ని, ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా చూడాలి. పరీక్షలో ముఖ్యంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆన్లైన్ విధానాన్ని అనుసరించాలని.. ఫలితంగా ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మెరుగైన సర్వీస్ కోరుకుంటే? ప్రస్తుతం ఐఆర్ఎస్, ఇతర గ్రూప్–ఎ సర్వీస్లకు ఎంపికైన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వయోపరిమితి అనుమతించిన మేరకు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే అభ్యర్థులు తమకు లభించిన సర్వీస్కు రాజీనామా చేసి మెరుగైన సర్వీస్కు సన్నద్ధమయ్యేలా నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల విజేతల్లో రిపీటర్స్ సంఖ్య 20–30 శాతం ఉంటోంది. వీరు అప్పటికే ఉన్న సర్వీసుల్లో ఖాళీ ఏర్పడటం, వాటి కోసం తర్వాతి సంవత్సరంలో చేపట్టే నియామక ప్రక్రియ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతోంది. ఇది ఆయా విభాగాల్లో పనితీరుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి సమీక్ష సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియను ఐదేళ్లకోసారి సమీక్షించి.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ సబ్ కమిటీ సైతం సివిల్స్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఔత్సాహికులకు అంతర్జాతీయ సంబంధాలపై లోతైన అవగాహనను పరీక్షించేలా అదనపు పేపర్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. lఆందోళన అనవసరం బస్వాన్ కమిటీ సిఫార్సులు, వాటి అమలుపై సివిల్స్–2017 ఔత్సాహికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిటీ నివేదిక ఇంకా పరిశీలనలోనే ఉంది. మరోవైపు సివిల్స్–2017 షెడ్యూల్ కూడా కొంత ముందుకు జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బస్వాన్ కమిటీ సిఫార్సులు 2017 సివిల్స్లో అమలయ్యే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా ఏవైనా మార్పులు చేసేటప్పుడు యూపీఎస్సీ కచ్చితంగా కనీసం ఏడాది ముందే వాటిని ప్రకటిస్తుంది. – వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ lఅభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి సివిల్స్ ఔత్సాహికుల గరిష్ట వయోపరిమితి తగ్గింపు మంచిదే. కానీ, దాన్ని 26 ఏళ్లుగా నిర్ణయిస్తే కొన్ని వర్గాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందులో మంచిని పరిశీలిస్తే.. ప్రస్తుతమున్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఫలితంగా వేల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సివిల్స్పైనే దృష్టి పెట్టి తమ కెరీర్లో ఇతర లక్ష్యాలపై దృష్టిసారించలేకపోతున్నారు. పర్యవసానంగా చివర్లో నిరాశాజనక పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. వయోపరిమితి తగ్గింపు వల్ల సివిల్స్కు నాలుగైదేళ్లకే పరిమితమై తర్వాత తమ కోర్ కెరీర్ వైపు దృష్టి సారించే అవకాశం లభిస్తుంది. అయితే ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న సిఫార్సులన్నీ కూడా అనధికారికమే. వీటిని వీలైనంత త్వరగా వెల్లడించి అభ్యర్థులకు కొంత సమయం ఇచ్చే విధంగా వ్యవహరించాలి. – డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఐఏఎస్ అధికారి. -
సివిల్స్ పోస్టులు గత అయిదేళ్లలో కనిష్టం
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో భర్తీ కోసం 980 ఖాళీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జారీ చేసిన నోటిఫికేషన్ సంఖ్యాపరంగా గత అయిదేళ్లలో అత్యల్పంగా నిలువనుంది. 2011లో కేవలం 880 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది 1,079 ఖాళీలను, 2015లో 1,164 పోస్టులను భర్తీ చేసింది. 2013లో 1,228, 2014లో 1,364 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది జూన్ 18న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉంది. -
ఐఏఎస్ కావాల్సిన యువతి...
ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఇప్పటికే ఎంబీఏ పూర్తిచేసి, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె.. అంతలోనే తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్తున్న సఫారీ కారు అదే రోడ్డులో వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్ను ఢీకొంది. ఆ స్కూటర్పై అక్కాచెల్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావని వెళ్తున్నారు. ఆ కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి, నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. స్కూటర్ దిగమర్రు పంటకాలువలో పడిపోయింది. అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానికులు నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పావని చికిత్స పొందుతోంది. కాగా, గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ దుఃఖం నుంచి కుటుంబం కోలుకోకముందే గౌతమి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తు వల్లే ప్రమాదం టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకి అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది. మద్యం మత్తులో మోటారు సైకిల్ను ఢీకొట్టారని అంటున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారు. -
రైతు రుణాలపై ఢిల్లీలో జేసీ ప్రజెంటేషన్
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారు.. అందుకు ఏయే విధానాలను అనుసరిస్తున్నారు అనే విషయాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డు 2016-17 ఎంపికల్లో భాగంగా ‘లోన్ చార్జ్ క్రియేషన్స్ మాడ్యూల్ ప్రాజెక్టు’పై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. -
పెళ్లి కోసం మతం మారాలట!
మీరట్: సివిల్ సర్వీసెస్-2015 టాపర్ టీనా దాబి.. రెండో ర్యాంకర్ షఫీ ఖాన్ను పెళ్లాడతానన్న ప్రకటనపై అఖిల భారతీయ హిందూ మహాసభ అభ్యంతరం తెలిపింది. ఆమె తల్లిదండ్రులకు రాసిన లేఖలో...ఈ పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని లేదా ఖాన్ను మత మార్పిడికి ఒప్పించాలంది. ‘ఖాన్ను టీనా పెళ్లి చేసుకోవాలనుకోవడం షాక్కు గురిచేసింది. ఇది లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉంది. ఇది జరగకూడదు. అరుునా వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖాన్ మతం మార్చుకోవాలి. దీని కోసం మా సభ్యులు మీకు సాయం చేస్తారు’ అని సంస్థ జాతీయ కార్యదర్శి మున్నా శర్మ టీనా తండ్రి జశ్వంత్కి లేఖ పంపారు. -
మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్: పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ ఇండియా చేతులు కలిపాయి. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ బుధవారం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... టీఎస్-క్లాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్లాస్ల నిర్వహణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, మొబైల్ టెక్నాలజీల సాయంతో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. డెంగీ లాంటి వ్యాధులు ఎప్పుడు, ఎలా ప్రబలే అవకాశముందో కూడా అజూర్ క్లౌడ్ ప్లాట్ఫాం ద్వారా ముందుగానే అంచనా వేసేందుకు అవకాశాలున్నాయని, దీన్ని కూడా తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. అలాగే టెలివిజన్ల ద్వారా పల్లెల్లో, సుదూర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిందని, తెలంగాణలో దీనిపై పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భన్సాలీ తెలిపారు. -
కాగితపు హాల్టికెట్లు ఇవ్వం: యూపీఎస్సీ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కాగితపు అడ్మిట్ కార్డు (హాల్టికెట్లు) ఇవ్వబోమని యూపీఎస్సీ తెలిపింది. ఈ-అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే వెబ్సైట్లోకి అప్లోడ్ చేసింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులే సొంతంగా ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలని కోరింది. ఒకవేళ ప్రింట్ తీసుకున్న హాల్టికెట్పై ఫొటో లేకపోయినా, సరిగా కనపడకపోరుునా వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన దానికి సారూప్యంగా ఉండే ఫొటోతోపాటు ఏదేని గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులను కోరింది. -
సివిల్ సర్వీసెస్పై అవగాహన
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ యువత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టాలని సివిల్ సర్వీసెస్ శిక్షకుడు ఆకుల రాఘవేంద్ర అన్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సీఎస్ఈ విభాగంలో మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసించిన వారు సివిల్ సర్వీసెస్ను ఎలా సాధించాలో వివరించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎంఎల్ఎస్ దేవకుమార్, ఉస్మానియా వర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ గణేష్ పాల్గొన్నారు. -
సివిల్స్ గరిష్ట వయోపరిమితి తగ్గింపు?
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు గరిష్ట వయో పరిమితిని ప్రస్తుతమున్న 32 సంవత్సరాల్ని తగ్గించాలంటూ యూపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై సూచనల కోసం ఈ కమిటీని యూపీఎస్సీ ఏర్పాటుచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి బీఎస్ బస్వాన్ చైర్మన్గా ఉన్న కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. దాని సూచనలపై కేంద్ర వ్యక్తిగత శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రి త్వ శాఖతో చర్చించాలనే ఆలోచనలో యూపీఎస్సీ ఉంది. వయో పరిమితితో పాటు పరీక్ష నిర్వహణ విధానం, మొత్తం పేపర్లు, వాటి తయారీ, సమయం, వెయిటేజ్ మార్కులు, మూల్యాంకనంపై కూడా సూచనలు చేసింది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షకు కనీస వయసు 21 ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. -
సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం 500 బస్సులు అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వంద కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్న దృష్ట్యా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సుల నిర్వహణ కోసం డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
‘కరెంట్’లో నిర్లక్ష్యానికి పరిహారం
సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిందే.. లేదంటే వినియోగదారులకు రూ.100-4000 వరకు పరిహారం చెల్లించాలి - పరిహారం మొత్తాన్ని 90 రోజుల్లో విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలి - కొత్త ప్రమాణాలను జారీ చేసిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలతో విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేసినా కరెంటోళ్లు సకాలంలో స్పందించడం లేదా? కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం వారాల తరబడి జాప్యం చేస్తున్నారా? ఇంట్లో చెడిపోయిన విద్యుత్ మీటర్ను మార్చమంటే పట్టించుకోవడం లేదా? ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి విద్యుత్ శాఖ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, పౌర సేవలు అందించడంలో విఫలమైతే బాధిత వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరులో కచ్చితంగా అమలు చేయాల్సిన కొత్త ప్రమాణాలను ప్రకటిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా నిర్వహించిన బహిరంగ విచారణల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా.. డిస్కంల పనితీరు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కొత్త ప్రమాణాలను జారీ చేస్తున్నట్లు ఈఆర్సీ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారులకు రూ.100 నుంచి రూ.4 వేల వరకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ ప్రమాణాల అమలు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లింపుపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. పరిహారం మొత్తం బిల్లులో సర్దుబాటు ఈఆర్సీ ఆదేశాల ప్రకారం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత, మీటర్లు, బిల్లులు, ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదులను వినియోగదారుల సేవా కేంద్రాల వద్ద డిస్కంలు నమోదు చేసుకోవాలి. ప్రమాణాల అమలుపై వినియోగదారుల వారీగా సమాచారాన్ని క్రోడీకరించాలి. ఒకవేళ ప్రమాణాల మేరకు సేవలు అందించకుంటే 90 రోజుల వ్యవధిలో నిర్దేశించిన పరిహారాన్ని సంబంధిత వినియోగదారుడు/వినియోగదారులకు చెల్లించాలి. అయితే నగదు రూపంలో కాకుండా పరిహారాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయాలి. పరిహారం చెల్లించే విషయంలో డిస్కంలు విఫలమైతే వినియోగదారులు ‘ఫోరం ఫర్ రిడ్రస్సల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్స్(సీజీఆర్ఎఫ్)ను సంప్రదించవచ్చని ఈఆర్సీ పేర్కొంది. కొత్త కనెక్షన్ జాప్యమైతే ఒక్కో రోజుకు పరిహారం వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కొత్త కనెక్షన్ను మంజూరు చేయాలి. తర్వాత జరిగే జాప్యంపై ఒక్కో రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కనెక్షన్ కోసం లైన్ల విస్తరణ చేయాల్సి ఉంటే... ఎల్టీ కనెక్షన్ను 30 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.200), హెచ్టీ 11 కేవీ కనెక్షన్ను 45 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.400), హెచ్టీ 33 కేవీ కనెక్షన్ను 60 రోజుల్లో(లేకుంటే ఒక్కోరోజుకి రూ.1000 పరిహారం), ఎక్స్ట్రా హెచ్టీ సప్లైను 180 రోజుల్లో(లేకుంటే ఒక్కో రోజుకి రూ.1000 పరిహారం) మంజూరు చేయాలి. ఇతర ప్రమాణాలు ఇవీ.. ► యాజమాన్య పేరు మార్పు, కేటగిరీ మార్పులను 7 రోజుల్లో పరిష్కరించాలి. లో టెన్షన్ సింగిల్ ఫేజ్ నుంచి లో టెన్షన్ త్రీ ఫేజ్కు 30 రోజుల్లో మార్చాలి. ► విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి. అదనపు సమాచారం అవసరమైతే 7 రోజుల సమయం తీసుకోవచ్చు. ఉల్లంఘిస్తే మాత్రం రోజుకి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. ► సరిగ్గా పనిచేయని మీటర్లపై ఫిర్యాదులను పట్టణ ప్రాంతాల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో పరిష్కరించాలి. లేదంటే రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాలి. ► విద్యుత్కు అంతరాయం కలిగించాల్సి ఉంటే 24 గంటల ముందే వినియోగదారులకు తెలియజేయాలి. రోజుకు 12 గంటలకు మించి కోత ఉండొద్దు. సాయంత్రం 6 గంటల్లోపు సరఫరాను పునరుద్ధరించాలి. దీన్ని ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారుడు ఒక్కడే అయితే రూ.400లు, ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరికి రూ.200 పరిహారం చెల్లించాలి. -
బీసీ స్టడీ సర్కిళ్ల కార్యాచరణకు ఆమోదం
రూ. 25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల(బీసీ) స్టడీ సర్కిళ్లకు సంబంధించి రూ.25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది (2016-17) కొత్తగా 500 మందికి జీఆర్ఈ/జీమాట్, టోఫెల్/ఐఎల్ఈటీఎస్లకు శిక్షణ అందించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోస్టులు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు కెరీర్ కౌన్సెలింగ్ తదితరాలను కలుపుకుని మొత్తం 500 మందికి శిక్షణ అందిస్తుంది. జీఆర్ఈ/టోఫెల్ తదితరాలకు సంబంధించి బీసీ విద్యార్థులు కోరుకున్న ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో బోధన ఇప్పించేం దుకు నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్కు సంబంధించి వంద మందికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ను ప్రభుత్వం ఆదేశిం చింది. రాష్ట్రంలోని 10 స్టడీ సర్కిళ్లలో నలుగురు డెరైక్టర్లు మాత్రమే రెగ్యులర్ పోస్టులతో పనిచేస్తుండగా, ఖాళీగా ఉన్న మరో 6 జిల్లాల డెరైక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్టడీ సర్కిళ్ల మేనేజింగ్ కమిటీని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్తగా పరిశ్రమలు, ఉపాధి, గ్రామీణాభి వృద్ధి శాఖల కమిషనర్లను సభ్యులుగా చేర్చుకోవాలని శనివారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో మేనేజ్మెంట్ కమిటీ కమిషనర్ జీడీ అరుణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్రావు, హైదరాబాద్ ఏజేసీ అశోక్కుమార్, కన్వీనర్, బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ చంద్రశేఖర్, ఎస్టీ శాఖ డీడీ నికొలస్, మహిళా, శిశుసంక్షేమ డీడీ లక్ష్మీ, ఎస్సీ శాఖ డీడీ హనుమంతనాయక్ పాల్గొన్నారు. -
సివిల్స్ ఉత్తీర్ణులు ఆరుగురిపై అనర్హత వేటు
-ఆందోళనలో ఆరుగురు విద్యార్థులు -చట్టాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి చెన్నై: జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో తమిళనాడుకు చెందిన 80 మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. ఓబీసీ కేటగిరికి చెందిన ఆరుగురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హఠాత్తుగా వారిని అనర్హులుగా ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షలకుపైగా ఉన్నందున ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి రానందున అనర్హులుగా పరిగణిస్తూ ఉత్తీర్ణతను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బాధితులను మీడియా పలుకరించగా సివిల్స్కు దరఖాస్తు చేసుకున్నప్పుడే అన్ని సర్టిఫికెట్లను సమర్పించామని, వాటిని బాగా పరిశీలించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతించారని తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నేడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దశలో అనర్హులని అకస్మాత్తుగా ప్రకటించడం అన్యాయమని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చట్టపరమైన పోరాటం చేస్తామని వారు తెలిపారు. -
సివిల్స్ విజేతలతో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్కు ఎంపికైన విజేతలు బుధవారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన వారిని కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల అకాంక్షల వంటి అంశాల మీద తన అలోచనలను కేటీఆర్ వారితో చర్చించారు. సూమారు 20 మంది సివిల్ ర్యాంకర్లు మంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధించిన మీకు ఇక ఉద్యోగమే అసలైన పరీక్షలా ఉంటుందన్నారు. ముఖ్యంగా అధికారులుగా ప్రజల అకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలని కోరారు. పరిపాలనలో అనేక ఒడిదుడుకులుంటాయని, ఎప్పడూ తమ ఆశయాన్ని వదులుకోవద్దన్నారు. ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి మిమ్మల్ని ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఉద్యోగ ప్రయాణంలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురవుతాయన్నారు. కానీ, తొలినాళ్లలో ఉన్న స్తూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లుకు దూరంగా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని హితవుపలికారు. ప్రజల భాగసామ్యంతో పనిచేస్తూ, వారిలో సమిష్టి తత్వం నెలకొల్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. చాల సందర్భాల్లో పరిపాలనలో నిధులకన్నా, మంచి అలోచనలతో చేసే పనులకు ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా పనిచేయాలని కోరారు. మంత్రిని కలవడం పట్ల ర్యాంకర్లు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన సలహాలు సూచనలు తమకి సరికొత్త దిశానిర్ధేశం చేశాయన్నారు. ప్రజలకోసం పనిచేయాలనే తమ అలోచనలకి మరింత ఊతం ఇచ్చాయన్నారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్ష ప్రిపేరేషన్ కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి వారి సలహాలను తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు. -
ఐఏఎస్ ఎవరైనా కావొచ్చు
లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చంటున్నారు సివిల్స్ 101వ ర్యాంకర్ వాసన విద్యాసాగర్నాయుడు. తన మాతృభూమి నరసాపురం పట్టణానికి బుధవారం ఆయన విచ్చేశారు. ఐఏఎస్ కావాలన్న అమ్మ కోరికను 24 ఏళ్ల వయసులో నెరవేర్చానన్నారు. తన విద్యాభ్యాసం, సివిల్స్ ప్రిపరేషన్ విశేషాలను ఇలా పంచుకున్నారు. ప్రశ్న :మీ కుటుంబ నేపథ్యం జవాబు : నాన్న త్యాగరాజు హైదరాబాద్లో రైల్వే సీనియర్ వర్క్స్టడీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. నాన్న వాళ్లది భీమవరం, అమ్మ సొంతూరు నరసాపురం. దీంతో నాకు నరసాపురంతో అనుబంధం ఎక్కువ. ప్రశ్న : ఐఏఎస్ అయ్యేందుకు ప్రేరణ జవాబు :మా అమ్మ, తాత గారు పోతుల నర్సింహరావు (అమ్మనాన్న). తాతగారు కష్టపడి పైకొచ్చారు. చిన్నస్థాయి వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కష్టపడి చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ప్రేరణ కలిగించేది. దీంతో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా చేసుకున్నా. ప్రశ్న : మీ విద్యార్హతలు జవాబు : నరసాపురం క్రిస్టియన్ ఆసుపత్రి (మిసమ్మ ఆసుపత్రి)లో 1992 మార్చి 25న జన్మిం చాను. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ లోని డోర్నకల్లో చదివా. 8వ తరగతి నుంచి బీటెక్ వరకు హైదరాబాద్లో చదివా. 2013లో బీటెక్ పూర్తయింది. ప్రశ్న : సివిల్స్కు ఎలా సిద్ధమయ్యారు జవాబు: సొంతంగానే. ఉన్నత స్థాయిలో శిక్షణ ఏమీ తీసుకోలేదు. హైదరాబాద్లో మూడు నెలలు, ఢిల్లీలో ఓ నెలపాటు సాధారణ శిక్షణ తీసుకున్నా. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. సబ్జెక్ట్ల పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాను. ప్రశ్న : ఉన్నత స్థాయి శిక్షణ లేకుండానే ఐఏఎస్ సాధించవచ్చా జవాబు : తప్పకుండా సాధించవచ్చు. ఇందుకు నాతో పాటు చాలా మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. మా బ్యాచ్లో రిక్షావాలా కుమారుడు ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే మనుమడూ ఎంపికయ్యారు. సివిల్స్ సాధించడం కష్టం, ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 2014లో తొలిసారి సివిల్స్ రాసా 2015లో రెండో ప్రయత్నంలో 101వ ర్యాంక్ వచ్చింది. నా ఆప్షన్ సబ్జెక్ట్ హిస్టరీ. ప్రశ్న : మీరు సైన్స్ విద్యార్థి కదా మరి చరిత్ర ఎలా జవాబు : అదే తప్పు. ఐఏఎస్కు ప్రిపేర్ కావాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్లు చదవాలనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టుల్లో డిగ్రీ చదివించాలి. ఐఏఎస్కు కావాల్సింది ఏదైనా డిగ్రీ మాత్రమే. అది సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఏదైనా కావొచ్చు. ప్రశ్న : మీరు ఐఏఎస్ కాకుంటే.. జవాబు : 2013లో బీటెక్ పూర్తయ్యింది. ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశా. ఒకవేళ ఐఏఎస్ కాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఆప్షన్గా పెట్టుకున్నాను. ప్రశ్న : యువతకు మీరిచ్చే సందేశం జవాబు : 2035 నాటికి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఇది మన దేశానికి ఉన్న బలం. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. ఏదో సాధించాలనే తపన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. యువత పుస్తకాలు ఎక్కువ చదవాలి. నా చిన్నప్పుడు నాన్నగారు గిఫ్టులుగా బొమ్మలు కాకుండా పుస్తకాలు ఇచ్చేవారు. బహుశా ఇదే నన్ను ఐఏఎస్ను చేసిందేమో. ప్రశ్న : పోస్టింగ్ విషయంలో మీ ఆప్షన్ జవాబు : ముందు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ. మొత్తానికి తెలుగు రాష్ట్రాలే. -
స్టడీ సర్కిళ్లకు కొత్త రూపు
♦ రాష్ట్ర సర్కారు నిర్ణయం ♦ నిరుద్యోగ అభ్యర్థులకు నిపుణులతో పక్కాగా శిక్షణ ♦ వీడియో బోధన, డిజిటల్ క్లాసులతో ఆధునిక హంగులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న స్టడీసర్కిళ్లకు కొత్తరూపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో మొక్కుబడిగా ఆయా పోటీపరీక్షలకు శిక్షణనిచ్చేలా కాకుండా వాటి ద్వారా అణగారిన వర్గాలకు కచ్చితమైన ప్రయోజనం కలిగేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆయా రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిళ్ల ద్వారా ఆయా పోటీపరీక్షలకు శిక్షణను అందిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా యూపీఎస్సీ (సివిల్స్ ప్రిలిమ్స్) మొదలుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నారు. అయితే పలు అంశాల్లో అధ్యాపకుల కొరత, అభ్యర్థులకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర ఆధునిక సౌకర్యాలు, రిఫరెన్స్ బుక్స్ వంటివి స్టడీసర్కిళ్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో సివిల్స్తో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలకు శిక్షణనిస్తున్న ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న స్థాయిలో అధునాతన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసి వీడియోకాన్ఫరెన్స్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన శిక్షణను అందించాలని యోచిస్తోంది. ఇకపై బ్యాచ్ల వారీగా తరగతులు నిరుద్యోగ అభ్యర్థులు సివిల్స్లో ర్యాంకులు సాధించి సత్తా చాటేలా చేయాలని బీసీ సంక్షేమశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ఉదయం, సాయంత్రం పలు బ్యాచ్లుగా తరగతులను నిర్వహించనుంది. విద్యార్థుల సంఖ్యనూ 500కు పెంచాలని యోచిస్తోంది. ఐటీ, వెబ్డిజైన్, కాడ్ వంటివాటిలో శిక్షణనివ్వనుంది. ఎస్టీ స్టడీసర్కిళ్లలో డిజిటల్ తరగతులు డిజిటల్ క్లాస్రూమ్స్ను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీ స్టడీసర్కిళ్లకు విడిగా గవర్నింగ్బాడీని ఏర్పాటుచేసి, రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులతో శిక్షణను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 జిల్లాల్లో ఎస్సీ స్టడీసర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది మరో 5 జిల్లాల్లో వాటిని ప్రారంభించనున్నారు. -
సివిల్స్ టాపర్కు 52 శాతం మార్కులే
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈ ఏడాది తొలి స్థానం దక్కించుకున్న టీనా డాబీకి వచ్చిన మార్కులు 52.49 శాతమే. మార్కుల వివరాల్ని ఆదివారం యూపీఎస్సీ వెల్లడించింది. పరీక్షను కఠినతరం చేయడంతో టాప్లో నిలిచిన అభ్యర్థుల మార్కులు బాగా తగ్గాయి. డాబీ మొత్తం 2,025(మెయిన్ 1,750, ఇంటర్వ్యూ 275)గాను 1,063 (52.49) మార్కులుసాధించింది. 2వ స్థానంలో నిలిచిన అమిర్ ఉల్ షఫీ ఖాన్ 1,018 (50.27 శాతం) మార్కులు, మూడో ర్యాంకర్ జస్మీత్ సింగ్ సంధు 1,014 (50.07) మార్కులు సాధించారు. ఈ ఏడాది మొత్తం 1,078 మంది అవసరముండగా, జనరల్లో 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ విభాగంలో 89 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసింది. 172 మంది అభ్యర్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వెయిటింగ్ జాబితాలో చివరిస్థానంలో ఉన్న శీష్ రామ్కు 697(34.41) మార్కులు వచ్చాయి. -
The "Steel-Frame" Strengthened
Civil Services UPSC has recently announced the selected list of civil services examination 2015-16. There were many inspiring personalities from the list and aspirants are at high spirits now, as prelims examination for 2016-17 is nearing, which shall be held on August 7, 2016. At this juncture, Mohan Kanda, retd. IAS officer throws light on civil services in India and guides new aspirants.. Civil Services and the Nation It is in enabling that change and in converting it into an all out assault on the evils of deprivation, exclusion and the denial of the quality of life that every citizen has a right to expect - that the civil service will have a major and meaningful responsibility to shoulder. We have, naturally, moved away from the days when the Civil Service was envisaged as the "steel - frame" of country's polity. Several changes, many highly desirable, have altered the scope of, as well as the expectations from, the bureaucracy. Growth and development are seen today more as a result of an effort of a team comprising many players including the elected representatives, the corporate sector, academicians, scientists, the civil society organizations and the Civil Services among many others. For this team to perform effectively, however, many catalytic factors need to be put in places such as a sharp vision, a clear road map and an enabling policy environment. The design, implementation, monitoring and evaluation of the plan of action all need to the conceived with a participatory approach and carried out in an inclusive manner. Challenges and Opportunities What more can a young citizen of India ask for today than to "be the change that you wish to see in the world" - as Gandhiji said? And which career can offer the heady excitement, sense of fulfilment, public recognition, the constitutional guarantee of security and reasonable emoluments than one in the Civil Service? I can think of no country whose Constitution mentions the Civil Service explicitly in an exclusive provision and offers protection to its members in an emphatic manner, in the manner in which the Indian Constitution does. In order to remain contemporarily relevant, the Civil Servant will need to be able to identify the weakness such as indifference, corruption and incompetence that continue to render our system impotent; and be able to play a positive and aggressive role in the process of mitigating their impact. The significance of the challenges and opportunities that come with the task entrusted to the Civil Services in this gigantic national effort can hardly be overstated. Attributes of a Civil Servant What can cause greater clarity in one's mind than to remember that it is the common man who pays your salary- and is thus one's real master? Assiduity, sincerity, integrity and a clear sense of priorities are some of the important attributes that a good Civil Servant needs to possess. The Civil Services offer a vast canvas of activities and varied sets of functions. It would therefore be of great advantage for a Civil Servant to identify, over time, a role that most suits his or her attitude. Effort and inclination will then be in sync-synergetic and mutually reinforcing. For the benefit of aspirants of the Civil Service, as well as recent entrants I have collected some case studies from my own experience together with a few hypothetical problems created by the UPSC, in the book "Ethics in Governance - Resolution of Dilemmas with Case Studies". Candidates from rural areas To address a concern that is frequently expressed I would like to assure the candidates from rural areas appearing for Civil Services Examination- that the system has tried to correct any inbuilt bias in favour of those from the urban areas. For instance, candidates can take the examinations in their mother tongue and can also opt for interviews to be conducted in that language. And the constitution of Boards of members that conduct the interviews is done in such a manner that it ensures a fair degree of empathy with people coming from varied backgrounds. Balanced Approach One last word of advice from me concerns the imperative to striking a "balance". This is an attribute that should inform one's attitude not merely in the interview but in the discharge of duties that one will be expected to perform in the event of one's selection. Extreme stances and artificial views are often neither desirable nor easy to justify. It is important to remain objective and impartial in forming one's opinions and in defending them. Those in service will do well to remember the advice tendered by Sri C.B. Rao, IAS (Retd.) (which he was kind enough to share with me), to fresh recruits - to remember that they are "the luckiest and not the brightest" that they are "selected and not chosen," that "integrity is more important than intelligence" and that they should strive to be "law-abiding and not rule - abiding Civil Servants". -
విజేతలకు అసలైన పరీక్ష
పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా... సమర్ధతకు మారుపేరుగా పరిగణించే సివిల్ సర్వీసుకు ఎంపిక కావడం కోసం ఏటా లక్షలాదిమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షల్లో ఇటీవలికాలంలో వెల్లడవుతున్న ఫలితాలు ఆశాజనకంగా, స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్నాయి. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే సివిల్ సర్వీస్ పరిమిత మన్న పాత అభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నాయి. నిరుడు వెల్లడైన ఫలితాల్లో తొలి నాలుగు స్థానాలనూ యువతులే సాధించారు. ప్రథమ ర్యాంక్ తెచ్చుకున్నామె వికలాంగురాలు కూడా. ఈసారి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన యువతి టీనా దాబి వయసు కేవలం 22 ఏళ్లు. పైగా ఆమెకిది తొలి ప్రయత్నం. దళిత వర్గంనుంచి వచ్చిన టీనా ఇక్కడ పాతుకుపోయి ఉన్న పితృస్వామిక భావ జాలాన్ని, లింగ వివక్షను పారదోలడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నది. ఆ విషయాల్లో ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్న హర్యానాను తన కార్య క్షేత్రంగా ఎంచుకోబోతున్నట్టు ప్రకటించింది. అమ్మానాన్నలిద్దరూ ఇంజనీర్లు కావడంవల్ల కలిగిన ఆర్ధిక వెసులుబాటు, ప్రతిభకు పదునుపెట్టుకునే అవకాశం ఆమెను ఢిల్లీలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థ లేడీ శ్రీరాం కళాశాలకు చేర్చి ఉండొచ్చు గానీ...బయటి సమాజంలో ఆడపిల్ల ఎలాంటి వివక్షకు గురవుతున్నదో ఒక యువతిగా ఆమె అవగాహనలోకి వచ్చింది. ఆ వివక్షను రూపుమాపాలన్న కృత నిశ్చయమూ ఏర్పడింది. రెండో ర్యాంకర్గా నిలిచిన యువకుడు అతర్ అమిర్ స్వస్థలం నిత్యం ఉద్రిక్తతలతో సతమతమయ్యే జమ్మూ–కశ్మీర్లోని అనంతనాగ్. రెండో ప్రయత్నంలో ఇంత ఉన్నతమైన ర్యాంక్ను చేజిక్కించుకున్న అతర్కుకూడా ఇక్కడి సమస్యల విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది. తను పుట్టి పెరిగిన ప్రాంతం మిలిటెన్సీ ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కశ్మీర్లోనిది. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుబడతానని అతర్ చెబుతున్నాడు. ఎన్నో సంక్లిష్టతలతో, వడబోతలతో కూడుకుని ఉండే సివిల్ సర్వీస్ పరీక్షల్లో వెనకబడిన ప్రాంతాలనుంచి వచ్చినవారు విజేతలుగా నిలవడం మెచ్చదగిన విషయం. వీరిలో చాలామంది బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. అందు వల్ల సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడినవారు. 361వ ర్యాంక్ సాధించిన 21 ఏళ్ల అన్సార్ అహమద్ షేక్ పొందిన అనుభవాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. పూణేలో పీజీ చేయడానికి వెళ్లినప్పుడు మైనారిటీ అయిన కారణంగా తలదాచుకోవడానికి ఆశ్రయం దొరక్క ఇబ్బందులు పడిన తీరును అతను వివరించాడు. తన మిత్రుడి పేరు శుభంను సొంతం చేసుకుంటే తప్ప దిక్కూ మొక్కూ లేకపోయిందని అన్సార్ చెప్పిన మాటలు మన సమాజం పాటిస్తున్న విలువలను ప్రశ్నిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ మెరుగైన ర్యాంకులు సాధించినవారిలో కూడా పలువురు వెనకబడిన ప్రాంతాలవారూ, నిరుపేద కుటుంబాలకు చెందినవారున్నారు. నల్ల గొండ జిల్లాకు చెందిన చామకూరి శ్రీధర్ ఒకవైపు పేదరికంతో, మరోవైపు అంగ వైకల్యంతో పోరాడుతూనే అహోరాత్రాలూ శ్రమించి 348వ ర్యాంక్ సాధించాడు. విజేతలుగా నిలిచినవారిలో చాలామంది కులం, మతం, ప్రాంతం, పుట్టుక కారణంగా సమాజంలో తమకెదురైన ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించిన వారు. కళ్లల్లో ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఇటువైపు వచ్చినవారు. సమకాలీన సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా అవగాహనతోపాటు వాటి పరిష్కారం తమకు సాధ్యమేనని విశ్వసిస్తున్నవారు. అందుకు అవసరమైన సంక ల్పమూ, పట్టుదలా ఉన్నవారు. వీరంతా ఏ బహుళజాతి సంస్థలోనో ఉన్నతో ద్యోగాన్ని సాధించి లక్షల్లో వేతనం పొందగలిగే సత్తా ఉన్నవారు. దాంతో పోలిస్తే తక్కువ జీతమూ, అధిక శ్రమ, ఎన్నో బాధ్యతలు ఉండే సివిల్ సర్వీసులను ఎంచుకోవడం వెనకున్న నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించేవారుంటే మంచిదే. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి కలిగే దురహంకారంతో వ్యవహరించే వారే అధికంగా తారసపడే కార్యనిర్వాహకవర్గం అలాంటి అంశాలను గుర్తించగలిగే స్థాయిలో ఉందా? మూడేళ్లక్రితం యూపీలోని నోయిడా జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్పాల్, హర్యానాలో సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, జమ్మూ–కశ్మీర్లో ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్ వంటివారి అనుభవాలు అందుకు భరోసా నివ్వడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధించడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను నాలుగేళ్ల క్రితం కేసుల పేరుతో ఎంతగా వేధించారో అందరికీ గుర్తుంది. చట్టాలు ఏం చెబుతున్నా, న్యాయం ఏదైనా తాము అనుకున్నదే అమలు జరగా లని కోరుకునే పాలకుల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే మంచి పోస్టుల్లో కొనసాగడం...లేనట్టయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ కావడం చాలా చోట్ల సివిల్ సర్వీసు అధికారులకు ఎదురవుతున్న అనుభవం. ఒకటి రెండు బదిలీల తర్వాత కూడా ‘దారికి’ రానివారిని మరిన్ని బదిలీలతో వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలెన్ని ఎదురైనా సేవాభావంతో, కర్తవ్యదీక్షతో పనిచేసి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలిపిన ఎస్ఆర్ శంకరన్, బి.డి. శర్మ వంటివారు కూడా లేకపోలేదు. ఇప్పుడు కోట్లాదిమంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న అనేక పథకాలకు వారు రూపశిల్పులు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవ హరించడం... రాజకీయ ఒత్తిళ్లున్నా, కక్ష సాధింపులున్నా నిబద్ధతతో పనిచేయడం కత్తిమీది సాము. అందుకు ఎంతో ఓపిక, పట్టుదల, అసహాయులపట్ల ప్రేమ అవసరం. ఆ లక్షణాలను కోల్పోకుండా పనిచేసినప్పుడే ఈ విజేతలంతా సివిల్ సర్వీసుకు వన్నె తెస్తారు. -
జాతి సిగలో నగర కీర్తి
► సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు ► ఉభయ రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకు నగరవాసికే సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నగర ఆణిముత్యం మెరిసింది. నగర ‘కీర్తి’ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 14 వర్యాంకు సాధించిన సీహెచ్.కీర్తి అత్యుత్తమ ప్రతిభను చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ర్యాంకే అత్యుత్తమం కావడం విశేషం. వైజాగ్కు చెందిన కీర్తి కుటుంబం పదేళ్ల కిందటే నగరానికి వచ్చి స్థిరపడింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ నగరంలోనే అభ్యసించిన ఆమె.. ఉత్తమ ర్యాంకు వచ్చే వరకు విశ్రమించలేదు. రెండు సార్లు ఓ మాదిరి ర్యాంకు పొందినా అసంతృప్తే వెంటాటింది. మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని చదివి మూడో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకును అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ఈ తరహాలోనే మరిన్ని ర్యాంకులు నగరాన్ని వరించాయి. నగరానికి చెందిన యువతీ యువకులే కాకుండా.. ఇక్కడ శిక్షణ పొందిన వారు మెరిశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి... విజయ కీర్తి పతాకం ఎగురవేశారు. నగరానికి చెందిన ఎడ్మ రిషాంత్రెడ్డికి 180, ప్రవళిక 232, ఉప్పల్కు చెందిన డాక్టర్ ప్రియాంక 529వ ర్యాంకు సాధించారు. వివిధ జిల్లాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వందలోపు ర్యాంకులు సాధించిన వల్లూరి క్రాంతి (65వ ర్యాంకు), సీహెచ్. రామకృష్ణ (84వ ర్యాంకు)లు కూడా ఇతర జిల్లాల వారే. ఇలా వెయ్యిలోపు 50కిపైగా ర్యాంకులు పొందిన వారు నగరంలోని శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న వారేనని ఆయా ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. స్టడీ సెంటర్ల కేంద్రాల నిర్వాహకులు, ర్యాంకులు పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. -
కల్లోల ప్రాంతం నుంచి సివిల్స్ టాపర్!
నిత్యం మిలిటెన్సీ సమస్యతో అట్టుడికిపోయే కశ్మీర్ నుంచి ఓ అభ్యర్థి ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో టాప్ ర్యాంకు సాధించాడు. కశ్మీర్కు చెందిన అథార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో సెంకండ్ టాపర్గా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్లోని మాండి ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన ఆమిర్ రెండో ప్రయత్నంలోనే టాప్-2 ర్యాంకు సాధించాడు. గత ఏడాది సివిల్స్లో అతడికి 560 ర్యాంకు రాగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్)కు ఎంపికయ్యాడు. ఈసారి తనకు మంచి ర్యాంకు వస్తుందని ఆశించానని, కానీ ఏకంగా టాప్ సెంకండ్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమిర్ చెప్పాడు. కశ్మీర్ నుంచి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు సివిల్స్కు ప్రయత్నిస్తున్నారని, ఇది సానుకూల ధోరణి అని అతను అభిప్రాయపడ్డాడు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఉత్తమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని ఆమిర్ ధీమాగా చెప్పాడు. తన తాత తనకు స్ఫూర్తి అని తెలిపాడు. -
తెలుగోళ్లు.. దమ్ము చూపించారు!
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 92 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. 2015 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, అందులో సుమారు 92 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామానికి చెందిన రైతు భోజన్న కుమారుడు వడ్నం నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 794వ ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నవాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి.. చేకూరి కీర్తి (14) హెచ్ఎస్ శ్రీకాంత్ (56) వల్లూరు క్రాంతి (65) సీహెచ్ రామకృష్ణ (84) వసన విద్యాసాగర్ నాయుడు (101) జొన్నలగడ్డ స్నేహజ (103) ఏ దీప్తి (113) వేమూరి విఎల్ అంబరీష్ (150) పోతరాజు సాయి చైతన్య (158) నివేదిత నాయుడు (159) పి.కృష్ణకాంత్ (169) ఏ పవన్ కుమార్ రెడ్డి (179) వై. రిషాంత్ రెడ్డి (180) ఆర్ విశ్వనాథ్ (181) వరుణ్ గుంటుపల్లి (183) ఆర్ మహేష్ కుమార్ (189) పసుమర్తి వీజీ సతీష్ (191) సలిజామల వెంకటేశ్వర్ (216) బట్ర ప్రీత్ పాల్ కౌర్ (225) కింతాడ ప్రవల్లిక (232) పి ఉదయ్ కుమార్ (234) శశాంక్ రెడ్డి (240) బండ్ల దినేష్ ఆదిత్య (270) గున్ను సుధీర్ (318) సుధాకర్ (324) వై విష్ణువర్ధన్ రెడ్డి (325) ఉప్పలూరి మీనా (326) కొడాలి గోకుల్ (345) సీహెచ్ శ్రీధర్ (348) జీ ఎల్ నరిసింహం (350) కంది ప్రవీణ్ (363) కీర్తిశ్రీ (380) శ్రుతి విజయకుమార్ (381) మల్లెల శ్రీకాంత్ (388) హరికృష్ణ (408) పి దిలీప్ కుమార్ (415) మద్దికుంట సిద్దార్థ (419) ఎం కృష్ణ కౌండిన్య (422) డి గౌరీ శంకర్ (457) డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461) నాగిరెడ్డిగారి మధులత (496) హెచ్ విష్ణు ప్రసాద్ (506) ముమ్మక సుదర్శన్ (526) అల ప్రియాంక (529) ఆర్ కృష్ణ ప్రసాద్ (531) కట్టా సింహాచలం (538) నార్నవారి మనీష్ శంకర్ రావు (552) దేవరాజు శివ ప్రకాష్ (572) వై విజయసింహారెడ్డి (588) ఆర్ఎస్ విద్యావతి (600) జి. ప్రదీప్ (609) ఎం కార్తీక (610) కె కృష్ణమూర్తి (615) పి శ్రుతి (617) ఆర్ ఆనంద్ (621) ఆర్ శివ ప్రసాద్ (622) ఎం గాయత్రి (642) శ్రీధర వెంకటేశ్వర్లు (683) ఎస్ భారతి (684) బి రవితేజ (694) సిగిలిపల్లి కృష్ణారావు (704) దారం వెంకటేశ్వరరావు (708) ఏ సురేష్ (718) బండారు బాల మహేంద్ర (730) చింత కుమార్ (768) సాయి సందీప్ కుమార్ (780) పురుషోత్తమ్ కుమార్ (828) కామినేని సంజయ్ రావు (830) పుష్పలత (845) ఎస్ భారత్ (866) చిలక సుధారాణి (876) విజయ్ కుమార్ (880) హెచ్ హనుమంతరాజు (898) పిల్లి ప్రేమకుమార్ (900) బి ప్రవీణ్ కుమార్ (907) ఆర్ భరత్ (914) ఇంటి నిహారిక (930) కుర్రా శ్రీనివాస్ (953) కారెల ముఖేష్ కుమార్ (972) ఎల్లసిరి శివప్రసాద్ (973) బి బాలస్వామి (977) జె విజయకృష్ణ (988) సీహెచ్ ప్రదీప్ కుమార్ (998) దాసరి కార్తీక్ (1000) మేకల సంధ్యా సమీర (1001) సుర్వే స్వాతి (1003) సాలి గౌతమి (1004) పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012) కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021) కొలకలూరి అరవింద్ (1022) నేగి సుష్మ (1029) దొండపర్తి వెంకట హరీష్ (1035) కె ఎస్ రమేష్ భారతి (1046) -
రోల్ మోడల్ గా ఉంటా: సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించానని ఫస్ట్ ర్యాంకర్ టీనా దాబే వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష-2015లో టాపర్ గా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. చెప్పలేని ఆనందానుభూతికి లోనపుతున్నానని, వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. సహనం, స్పష్టత, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఫస్ట్ ర్యాంక్ సాధించానని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఎంచుకుంటానని తెలిపింది. హర్యానా కేడర్ తరపున పనిచేయడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో పాసవడంతో యువతులకు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు టీనా చెప్పింది. తన కుమార్తె టాపర్ నిలవడం టీనా తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ పాసవడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తనకు మాటలు రావడం లేదని టీనా తల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కూతురే తన హీరో అని ఆమె వ్యాఖ్యానించారు. -
మహిళలూ.. దరఖాస్తులు పంపండి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు(సీఎస్ఈ) మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) కోరింది. మానవ వనరుల్లో లింగ సమానత్వం ప్రతిబింబించేలా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని 2016 సీఎస్ఈ ప్రకటన విడుదల సందర్భంగా పేర్కొంది. ఈ పరీక్షలను యూపీఎస్సీ ప్రతిఏటా ప్రిలిమినరీ,మెయిన్స్, ముఖాముఖి అనే 3 దశల్లో నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈసారి 1079 ఖాళీల భ ర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ మే 27 అని కమిషన్ తెలిపింది. -
మార్పునకు వారధులవ్వండి
ప్రయోగాలు చేయకుంటే మార్పు సాధ్యం కాదు * ‘సివిల్ సర్వీసెస్ డే’ సదస్సులో ప్రధాని మోదీ * అలసట వీడి ఉత్సాహంగా పనిచేయాలని అధికారులకు సూచన న్యూఢిల్లీ: సివిల్ సర్వెంట్లు ఎవరికి వారు కాకుండా కలసికట్టుగా పనిచేయాలని, ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి వారధుల్లా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై పనిచేస్తూ.. ఉత్తమఫలితాలు రాబట్టేలా ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. ‘మొదట్లో సివిల్ సర్వెంట్ రెగ్యులేటర్గా ఉండేవారు. మారుతున్న పరిస్థితులతో ఆయన ఓ నిర్వాహకుడిగా, మేనేజర్గా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు విధులు నిర్వహించినా సరిపోవటం లేదు. వీటితోపాటు వ్యవస్థలో మార్పునకు ఓ వారథిగానూ నిలవాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. కూర్చుని పనిచేస్తున్నపుడు ప్రయోగాలు చేయలేమని.. ప్రయోగాలు చేయకుండా మార్పు ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రత్యేకమైన పనులు చేయటం ద్వారా ఉద్యోగంలో సంతృప్తి కలుగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘అలసటను దరిచేయనీయకండి. ఉత్సాహంగా ఉండండి’ అని మోదీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే పనులు విజయవంతమవుతాయని ప్రధాని తెలిపారు. అనంతనాగ్కు స్వచ్ఛ అవార్డు ఎప్పుడూ అనిశ్చితితో ఉండే దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు ప్రధాని ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డు దక్కింది. ఈ జిల్లాలో ఉన్న 1,555 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. ఏపీలోని అనంతపురం జిల్లా కూడా ఇదే కేటగిరీలో అవార్డుకు ఎంపికైంది. ప్రధాని చేతుల మీదుగా అనంతపురం జిల్లా కలెక్టర్ కె. శశిధర్ ఈ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛభారత్, జన్ధన్ యోజన అమలుతీరు, భూసార కార్డుల పంపిణీ వంటి వివిధ అంశాల్లోనూ పురోగతి చూపిన జిల్లాల అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు. నీటి సంరక్షణ కార్యక్రమాలకు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగించుకోవాలని మోదీ సూచించారు. ‘లెఫ్ట్’ కన్నా చీకటి పాలన బసీరత్: మమతబెనర్జీ హయాంలో పశ్చిబెంగాల్లో వామపక్ష కాలం కంటే చీకటి పాలనకొనసాగిందని ప్రధాని మోదీ విమర్శించారు. 24పరగణాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. ‘2011 ప్రచారంలో మమత ‘పరివర్తన్’ నినాదాన్ని ఎత్తుకుంటే మార్పు వస్తుందనుకున్నారు. కానీ.. ఆమే పూర్తిగా మారిపోయి రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేసింది’ అని మోదీ ఎద్దేవా చేశారు. -
జన్ ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ‘సివిల్ సర్వీసెస్ డే’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డిపా జిట్లను స్వీకరించాయని తెలిపారు. ఇది ప్రజల స్వయం సమృద్ధికి సంకేతమన్నారు. ప్రధాని మోదీ గురువారం ‘సివిల్ సర్వీసెస్ డే’ గురించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను బాగా అమలు చేసిన అధికారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు. సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు. -
తెలుగు చేవ తగ్గుతోందా?
సీశాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైన సమస్య ప్రాంతీయ భాషా నేపథ్యమున్న అభ్యర్థులు నెగ్గుకురాలేకపోతున్నారన్న నిపుణులు సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్: దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 అఖిల భారత సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రాంతీయ భాషల అభ్యర్థుల ప్రాభవం తగ్గుతోందా? హిందీ, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు.. మెట్రో నేపథ్యమున్న అభ్యర్థులకే పరీక్ష విధానం అనుకూలంగా ఉంటోందా? ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులపైనా పడుతోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష-2015 ఫలితాల ద్వారా ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సివిల్స్... ఈ పరీక్షలో విజయం కోసం తపస్సులా కృషి చేసే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో వేలల్లోనే ఉంటుంది! వారి కష్టం ఫలితాల్లోనూ కనిపించేది. 2005 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏటా 80 నుంచి 100 మంది వరకు తుది విజేతలుగా నిలిచారు. ఇదేకాలంలో రెండుసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కూడా తెలుగు అభ్యర్థులు (రేవు ముత్యాల రాజు, అడపా కార్తీక్) సొంతం చేసుకున్నారు. కానీ 2011 నుంచి తుది విజేతలుగా నిలిచే అభ్యర్థుల సంఖ్య తగ్గుతోందని, సగటున 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోందని నిపుణులు అంటున్నారు. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మార్పులే ఇందుకు కారణమని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ 2015 రాత పరీక్ష ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు 500 మంది వరకు హాజరుకాగా.. తాజా ఫలితాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైన వారు గరిష్టంగా 80 మందికి మించి ఉండరని అంచనా. సీశాట్ నుంచి మొదలైన సమస్య సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఇతర ప్రాంతీయ భాషా అభ్యర్థుల సంఖ్య క్రమేణా తగ్గడం సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైంది. 2011 నుంచి ప్రిలిమినరీ పరీక్షలో రెండో పేపర్గా సీశాట్ను ప్రవేశపెట్టారు. అప్పటివరకు అభ్యర్థులకు రెండో పేపర్గా తమకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్ను రాసుకునే వెసులుబాటు ఉండేది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో, అదేవిధంగా అభ్యర్థుల్లో అన్నిరకాల సామర్థ్యాలను అంచనా వేయాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన సీశాట్.. అందుకు విరుద్ధంగా కేవలం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యమున్న వారికే అనుకూలంగా ఉందనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో 2014 నుంచి సీశాట్లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ను తొలగించారు. సీశాట్ పేపర్ (జనరల్ స్టడీస్ పేపర్-2)ను కేవలం అర్హత పరీక్షగానే పేర్కొంటూ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో 200 మార్కులకు కనీసం 33 శాతం మార్కులు సాధించాలని యూపీఎస్సీ పేర్కొంది. ఈ కనీస అర్హత మార్కుల నిబంధన కూడా ప్రాంతీయ భాషల అభ్యర్థులు, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. కారణం.. ఈ పేపర్లో పేర్కొన్న అంశాలన్నీ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్గా, ఇంగ్లిష్ ఓరియెంటేషన్గా ఉండటమే. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ను తొలగించినప్పటికీ.. రీడింగ్ కాంప్రహెన్షన్ను కొనసాగించడం ప్రాంతీయ భాషా అభ్యర్థులకు శరాఘాతమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెయిన్స్లో మార్పులతో మరింతగా.. 2013లో మెయిన్ పరీక్షలోనూ యూపీఎస్సీ మార్పులు ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఒక ప్రాంతీయ భాష, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఎస్సే, రెండు జీఎస్ పేపర్లు, రెండు ఆప్షనల్ సబ్జెక్ట్స్ (నాలుగు పేపర్ల)లలో సివిల్స్ మెయిన్స పరీక్షలు జరిగేవి. కానీ 2013 నుంచి ఈ విధానంలో మార్పు తెచ్చింది. 2014లో మరోసారి మార్పులు చేసింది. 2012 వరకు ఉన్న రెండు ఆప్షనల్ సబ్జెక్ట్లను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్కు కుదించింది. జనరల్ స్టడీస్ పేపర్లను నాలుగుకు పెంచింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 శాతం, ఇండియన్ లాంగ్వేజ్లో 30 శాతం(2015లో 25 శాతంగా మార్పు) కనీస అర్హత మార్కులు సాధిస్తేనే.. అభ్యర్థులు మిగతా పేపర్లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. ఇప్పుడు ప్రాంతీయ మాధ్యమంలో చదివిన అభ్యర్థులకు ఇదే సమస్యగా మారింది. మెయిన్ ఎగ్జామినేషన్లో పేర్కొన్న 4 జనరల్ స్టడీస్ పేపర్ల విషయంలోనూ ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. దేశంలో విద్యా వ్యవస్థకు.. యూపీఎస్సీ సివిల్స్లో ప్రవేశపెడుతున్న మార్పులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకే ప్రాంతీయ భాష నేపథ్యం ఉన్న అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులు నెగ్గుకు రాలేకపోతున్నారని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మళ్లీ ఆప్షనల్.. అదే పరిష్కారం అన్ని ప్రాంతాలు, నేపథ్యాల అభ్యర్థులు సివిల్ సర్వీసెస్లో ప్రాతినిథ్యం వహించేలా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్కు ఆస్కారం కల్పించాలంటే.. మళ్లీ ప్రిలిమ్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఫలితంగా అభ్యర్థులు తాము అకడమిక్గా చదువుకున్న సబ్జెక్ట్లలో పట్టున్న సబ్జెక్ట్లను ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడం, తద్వారా మెయిన్స్కు విజయావకాశాలకు ఆస్కారం ఉంటుంది. సీశాట్ వల్ల గత నాలుగేళ్లుగా ఇంటర్వ్యూకు ఎంపికవుతున్న తెలుగు అభ్యర్థుల సంఖ్య 70 నుంచి 80 మధ్యలో.. తుది జాబితాలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోంది. తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా ఎంచుకున్న వారి విజయావకాశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2010లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో 12వ ర్యాంకు రాగా.. 2013లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్కు 887వ ర్యాంకు రావడమే ఇందుకు నిదర్శనం. సీశాట్ వల్ల అన్ని ప్రాంతీయ భాషల అభ్యర్థులకు సివిల్స్ అందని ద్రాక్షగా మారిపోతోంది. - వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ ఇంగ్లిష్ నేపథ్యానికి అనుకూలం వాస్తవమే ప్రస్తుతమున్న సివిల్స్ ఎంపిక విధానం ఇంగ్లిష్ నేపథ్యం ఉన్న వారికి అనుకూలం అనే మాట వాస్తవమే. పరీక్షలో విజయానికి అనుకూలించే మెటీరియల్ పరంగా ఇంగ్లిష్లో అపారమైన వనరులున్నాయి. ప్రాంతీయ భాషల అభ్యర్థులు వాటిని అనువాదం చేసుకుని చదువుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇక సీశాట్లో పేర్కొన్న రీడింగ్ కాంప్రహెన్షన్ను కూడా తొలగిస్తే లోకల్ లాంగ్వేజ్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుంది. - శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అవన్నీ అపోహలే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రస్తుత విధానం కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలన్నీ అపోహలే. అభ్యర్థులు తమకు నచ్చిన మాధ్యమంలో పరీక్ష రాసుకునే వీలుంది. అయితే విజేతలుగా నిలుస్తున్న అభ్యర్థుల నేపథ్యాలను పరిగణించడం కారణంగా కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్యధిక శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులవైపు అడుగుపెడుతున్నారు. ఇదే క్రమంలో సివిల్స్కు హాజరయ్యే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. - ప్రొఫెసర్ వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యులు -
సివిల్ సర్వీసెస్ వయోపరిమితి కుదింపు?
♦ జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గింపు ♦ ఎప్పట్నుంచి వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత లేమి సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చేదువార్త! ఇప్పటివరకు జనరల్ అభ్యర్థులకు ఉన్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లకు కుదించింది. ఈ మేరకు గురువారం upsc.govt.in వెబ్సైట్లో ఓవర్వ్యూ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కేటగిరీ కింద వయోపరిమితి అంశంలో దీన్ని పొందుపరిచింది. అయితే ఈ కుదింపు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందన్న విషయాన్ని అందులో తెలపలేదు. 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి (జనరల్)ను 32 ఏళ్లుగా పేర్కొంది. మరోవైపు 2016లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల టైం టేబుల్లో.. వచ్చే ఏప్రిల్ 23న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 7న ప్రిలిమ్స్, డిసెంబర్ 3 నుంచి ఐదురోజుల పాటు మెయిన్ పరీక్షలు ఉంటాయని వివరించింది. అయితే ఈ వయోపరిమితి కుదింపు ఏప్రిల్ 23న జారీ కాబోయే సివిల్స్ నోటిఫికేషన్కు వర్తిస్తుందా లేదా అన్నది యూపీఎస్సీ తన వెబ్సైట్లో ఎక్కడా తెలపలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చేరి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్ర ఆవేదన లో పడ్డారు. -
తమిళనాడు తరహాలో సివిల్స్ శిక్షణ
బీసీ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటేలా రాష్ర్ట బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ సెంటర్ (బీసీ స్టడీసర్కిల్స్)ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తమిళనాడులోని బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ, విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి విధానాలు అధ్యయనం చేసేందుకు ఈ నెల 7,8న హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్లు చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక క్యాంపస్లో హాస్టల్, ఇతర సౌకర్యాలతో 320 మందికి 6 నెలల పాటు ప్రిలిమ్స్, 200 మందికి 4 నెలల పాటు మెయిన్స్ శిక్షణ అందజేస్తున్నారు. అంతేకాకుండా మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారికి ఢిల్లీలోని తమిళనాడు హౌజ్లో 15 రోజుల పాటు ఇంటర్వ్యూ విధానంపై ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నారు. బీసీ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఇప్పటికే ఈ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 ఆఖరి తేదీ కాగా, ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్కు మొత్తం 140 మందికి శిక్షణనిస్తారు. అందులో హైదరాబాద్లో 60 మందికి, వరంగల్లో 40 మందికి, కరీంనగర్లో 40 మందికి కోచింగ్ ఇస్తారు. -
మహిళా, ఎస్సీ/ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్లు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. కీలకమైన చాలా విభాగాలకు ఆయా శాఖలపై పట్టున్న అధికారులు లేరు. కొరతను అధిగమించేందుకు కేంద్రం రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఎక్కువ మంది మహిళా, ఎస్సీ, ఎస్టీ,, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గుర్తించి కేంద్రానికి డిప్యుటేషన్పై పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. డిప్యూటీ సెక్రెటరీ, డెరైక్టర్ స్థాయిలో కొరత ఎక్కువగా ఉందని పేర్కొంది. సివిల్ సర్వీసెస్ బోర్డుకు ప్యానెల్ రికమెండ్ చేసిన అధికారులు చివరి దశలో నామినేషన్ను ఉపసంహరించుకున్నా, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నా, కేడర్ నుంచి రిలీవ్ చేసేందుకు నిరాకరించినా.. అటువంటి అధికారులను ఐదేళ్లు సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి డిబార్ చేస్తామని, విదేశీ పోస్టుకూ పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. -
156 మంది ఐపీఎస్లకు శిక్షణ పూర్తి
* రేపు పాసింగ్ ఔట్ పరేడ్ * ఎన్పీఏ డెరైక్టర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2013 బ్యాచ్కు చెందిన 156 మంది ఐపీఎస్లకు 46 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్వీపీ ఎన్పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ తెలిపారు. వారికి ఈ నెల 31న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారమిక్కడ పోలీసు అకాడమీలో విలేకరులతో చెప్పారు. గత రెండేళ్లుగా యువత ఐపీఎస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందన్నారు. ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ వంటి సాంకేతిక విద్యను అభ్యసించి, కొన్నాళ్లు ఉద్యోగం సైతం చేసిన వారు ఇటువైపు వస్తుండటం మంచి పరిణామన్నారు. పోలీసు విభాగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం అది కూడా పెరుగుతోందని చెప్పారు. శిక్షణ పొందిన వారిలో భారత్కు చెందిన వారు 141 మంది కాగా, మిగతా 15 మంది భూటాన్, నేపాల్, మాల్దీవులకు చెందిన వారున్నట్లు తెలిపారు. వీరికి అన్ని కోణాల్లో విస్తృత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సైబర్క్రైం, ఐటీ, మహిళల అక్రమ రవాణా, ఫోరెన్సిక్ వంటి వాటితో పాటు గ్రేహౌండ్స్తో కలసి పనిచేయడం, అడవుల్లో సాహసాలు వంటి క్షేత్రస్థాయి పరిజ్ఞానం కల్పించామన్నారు. శిక్షణలో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు, రద్దీ సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ అవగాహన కోసం నాసిక్ కుంభమేళా ఉత్సవాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ప్రొబెషనరీ పీరియడ్ కోసం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. -
గ్రామపంచాయతీలకు మహర్దశ
♦ తొలిదశలో 1,000 పంచాయతీలకు సొంత భవనాలు ♦ ఈ ఏడాది రూ.120 కోట్లు వెచ్చించనున్న గ్రామీణాభివృద్ధి శాఖ ♦ అక్టోబరులో పనుల ప్రారంభానికి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. శిథిల, అద్దె భవనాల్లో నడుస్తున్న పంచాయతీలకు సొంత భవనాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పల్లెప్రగతి, గ్రామజ్యోతి తదితర పథకాల ద్వారా పౌర సేవలు, ఉపాధిహామీ, ఆసరా పింఛన్ తదితర ఆర్థిక చెల్లింపులు, విద్య, వైద్య, పారిశుధ్య తదితర కార్యక్రమాలపట్ల అవగాహన సదస్సులు, గ్రామ కమిటీల సమావేశాలు ఇకపై పంచాయతీ కార్యాలయాల నుంచే నిర్వహించాల్సి ఉన్నందున విశాలమైన భవనాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 8695 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 375 పంచాయతీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన మరో 4500 గ్రామపంచాయతీల భవనాలు శిథిలావస్థకు చేరినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ ఏడాది రూ.120 కోట్లు పంచాయతీ భవనాల నిర్మాణానికి కేటాయించారు. తొలిదశలో ఒక్కో గ్రామపంచాయతీ భవనానికి రూ.12 లక్షల చొప్పున 1,000 గ్రామ పంచాయతీలకు కొత్త/ సొంత భవనాలు నిర్మించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దశలవారీగా వచ్చే మూడేళ్లలో మరో నాలుగు వేల భవనాలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు జిల్లాలవారీగా భవనాల ఆవశ్యకత ఉన్న గ్రామాలను ఎంపిక చేసి నెలాఖరు కల్లా నివేదిక సమర్పించాలని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్లో కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
డిసెంబర్ 18 నుండి సివిల్స్ మెయిన్స్
ఢిల్లీ: సివిల్స్ మెయిన్ పరీక్షల నిర్వహణ తేదీలను యూపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. డిసెంబర్ 18 నుండి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 9,45,908 మంది అభ్యర్థులు సివిల్స్కు దరఖాస్తు చేసుకోగా, 15,008 మంది ప్రలిమినరీ దశను దాటి మెయిన్ ఎగ్జామ్కు అర్హత సాధించారు. సివిల్స్ పరీక్షల ద్వారా దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వాటిలో నియామకాలు చేపట్టనున్నారు. -
సివిల్స్ మెయిన్స్కు 15 వేల మంది అర్హత..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఈ ఏడాది 15 వేల మందికిపైగా అభ్యర్థులు అర్హత సాధించారు. గత ఆగస్టులో నిర్వహించిన పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 'మొత్తం 15,008 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు' అని యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సెక్రటరీ అషిమ్ ఖురానా చెప్పారు. సివిల్స్ ప్రిలిమ్స్- 2015 పరీక్షలకు రికార్డు స్థాయిలో 9,45,908 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4.63 లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయిన 50 రోజుల్లోనే ఫలితాలు వెలువడటం గమనార్హం. ఇంత తక్కువ వ్యవధిలో ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటిసారని ఖురానా పేర్కొన్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు.. డిసెంబర్ 18, 2015న మెయిన్స్ పరీక్షల కోసం సంపూర్ణ వివరాలతో కూడిన దరఖాస్తును ఆన్ లైన్ లో పూరించాల్సి ఉంటుందని చెప్పారు. మరింత సమాచారం కోసం http://www.upsc.gov.in చూడటం లేదా 011-23385271, 011-23098543, 011-23381125 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. -
‘పల్లె సేవాకేంద్రాల’ ప్రక్రియ ప్రారంభం
* పెలైట్ ప్రాజెక్ట్ కింద 125 గ్రామాలు ఎంపిక * అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల పౌర సేవలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాల (వన్స్టాప్షాప్)’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,695 గ్రామాల్లో దశల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. సాధారణ పౌర సేవలతో పాటు రెవెన్యూ, ఆర్థిక సేవలను కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ వన్స్టాప్షాప్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్రంలోని తొమ్మిది (హైదరాబాద్ మినహా)జిల్లాల్లో 125 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో అక్టోబర్ 2న ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు మండల రెవెన్యూ కార్యాల యం నుంచి లభించే వివిధ రకాల పౌరసేవలు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపు లు, ఆసరా లబ్ధిదారులకు పింఛను చెల్లింపు లు కూడా ఈ కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. నేటి నుంచి శిక్షణ పల్లె సమగ్ర సేవాకేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్గా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 125 గ్రామాల నుంచి తగిన విద్యార్హతలున్న మహిళల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఆన్లైన్ సేవాకేంద్రం నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో శనివారం నుంచి రెండురోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లె సమగ్ర సేవాకేంద్రాలను గ్రామ పంచాయతీ భవనంలోనే ఏర్పాటు చేస్తారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మహిళకు వివిధ రకాల సేవలకు గాను లబ్ధిదారులు చెల్లించిన మొత్తం నుంచి కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం నిర్వాహకురాలికి నెలకు కనీసం రూ.7వేలు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
భరోసా కల్పిస్తేనే ప్రజల్లో నమ్మకం
- సివిల్ సర్వీసెస్ అధికారులతో గవర్నర్ నరసింహన్ - కంప్యూటర్లతో కుస్తీ పట్టొద్దు - క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి - ఎంసీఆర్హెచ్ఆర్డీల స్పెషల్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, కీలకమైన శాఖల్లో పనిచేసే అఖిల భారత స్థాయి అధికారులు మరింత బాధ్యతగా ప్రవర్తించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారుల నుంచి భరోసా లభించినప్పుడే ప్రజలకు వారిపై నమ్మకం కలుగుతుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని చెప్పారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ హెచ్ఆర్డీ) రూపొందించిన స్పెషల్ ఫౌండేషన్ కోర్సును సోమవారం ఆయన ప్రారంభించారు. కోర్సు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 2012-13 బ్యాచ్కు చెందిన 141 మంది ఐఈఎస్, ఐఎస్ఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును పర్యవేక్షించేందుకు కంప్యూటర్లపై ఆధారపడొద్దని, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో కీలకంగా వ్యవహరించే సివిల్ సర్వీసెస్ అధికారులు, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా దృష్టి సారించాలన్నారు. తోటి ఉద్యోగులు, అధికారులను కలుపుకుని ప్రజలకు సంతృప్తినిచ్ఛేలా వ్యవహరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించాలంటే.. పట్టణాల్లో లభించే వసతులను పల్లెలకు తీసుకెళ్లాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని(టెక్నాలజీ) మంచి పనుల కోసమే వినియోగించాలని కోరారు. ప్రజాప్రతినిధులు పథకాలను రూపొందిస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, వారు ఆశించిన మేరకు పనిచేస్తేనే సార్థకత ఉంటుందన్నారు. ప్రజలకు తప్పనిసరిగా కావాల్సిన ఆహారం, ఉపాధి, విద్య, ఆరోగ్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ సూచించారు. సర్వీసులో మొదటి 12 ఏళ్లే కీలకం సివిల్ సర్వీసు అధికారులకు తమ సర్వీసులోని మొదటి 10 నుంచి 12 ఏళ్లు ఎంతో కీలకమని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఇతరుల నుంచి నైపుణ్యాలను గ్రహించేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని, ఇందుకోసం పరిశోధనలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్పై దృష్టి పెట్టాలన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కుమార్ అగ్రవాల్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారులకు అందిస్తున్న ప్రత్యేక ఫౌండేషన్ కోర్సు వలన నైపుణ్యంతో పాటు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీ తిరుపతయ్య, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
-
పట్టుదల + ప్రణాళిక =సివిల్స్ విజయం
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఏటా లక్షల మంది పోటీ పడుతున్న ఈ పరీక్షలో ఎంపికయ్యేది సుమారు 1200 మంది మాత్రమే. వారిలో ఒక్కరిగా నిలవాలంటే కఠోర శ్రమ, పట్టుదల తప్పనిసరి. ఒక్కోసారి ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మూడు సార్లు మధ్యలోనే అపజయం ఎదురైనా పట్టుదలతో నాలుగో ప్రయత్నంలో 66వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు గుంటూరుకు చెందిన మైలవరపు కృష్ణ తేజ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా దేశానికి తన సేవలు అందిస్తానంటున్న కృష్ణతేజ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే.. మాది గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. నాన్న శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి. అమ్మ భువనేశ్వరి గృహిణి. పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యనభ్యసించాను. గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీ డియెట్ పూర్తి చేశాను. నర్సారావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు సివిల్స్పై ఆసక్తి. దాంతో 2010లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. దానికోసమే హైదరాబాద్ వచ్చా. చదివింది ఇంజనీరింగే అయినా జాగ్రఫీ అంటే నాకు ఆసక్తి. సివిల్స్లో దాన్నే ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నా. ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లోనూ జాగ్రఫీ ఫ్యాకల్టీగా చేరాను. రెండేళ్లుగా ఆ సంస్థలోనే సివిల్స్ అభ్యర్థులకూ ఆ సబ్జెక్టును బోధిస్తున్నాను. ముందుకంటే మెరుగైన ప్రిపరేషన్! గతంలో మూడుసార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసినప్పటికీ మెయిన్స్ దశలోనే వెనుదిరిగాను. అయినా నిరుత్సాహ పడకుండా నాలుగోసారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. రోజుకు సుమారు 9 గంటలు ప్రిపరేషన్కు కేటాయించాను. క్రమం తప్పకుండా తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు చదివాను. ప్రతిరోజూ కొంత సబ్జెక్టును లక్ష్యంగా నిర్దేశించుకున్నా. వీలైనన్ని ఎక్కువ రాత పరీక్షలు రాశా. ప్రతిభను అంచనా వేసుకుని విశ్లేషించుకున్నా. ఇవన్నీ నాలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి. సిలబస్ను పూర్తిగా ఆస్వాదిస్తూ మెరుగ్గా ప్రిపరేషన్ కొనసాగించాను. యోగా చేయడం ద్వారా ఒత్తిడి, అలసట నుంచి బయటపడ్డాను. చదివిన పుస్తకాలు: మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్టు జాగ్రఫీ కోసం కుల్లర్, మాజిద్ హుస్సేన్, జి.సి. లియాంగ్ తదితర పుస్తకాలను చదివాను. జాగ్రఫీ ఆప్షనల్ ఎంచుకున్న వారికి ముఖ్యంగా అట్లాస్పై అవగాహన తప్పనిసరి. స్ఫూర్తి, ప్రోత్సాహం: సివిల్ సర్వీసెస్లో అడుగుపెట్టేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వేలూరు నరేంద్రనాథ్ నాకు స్ఫూర్తి. నా గురువు బీజేబీ కృపాదానం, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అధికారిణి మల్లవరపు బాలలత సబ్జెక్టు సందేహాలను తీర్చడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రోత్సహించేవారు. ‘దేశంలోని అత్యున్నత పోటీ పరీక్షలో గెలుపొందడానికి ఈ రోజు ఏం చేశాను’ అని రోజూ పడుకునే ముందు ప్రశ్నించుకోవాలని వారు సూచించిన సలహా నిత్యం నా కర్తవ్యాన్ని గుర్తుచేసేది. ఇంటర్వ్యూ సాగిందిలా! ఎలాంటి ఒత్తిడిలేని, సానుకూల వాతావరణంలో దాదాపు అరగంటసేపు ఇంటర్వ్యూ సాగింది. ఐదుగురు సభ్యులున్న మన్బీర్సింగ్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించింది. విభిన్న అంశాలపై లోతుగా ప్రశ్నలు అడిగారు. ఒక్కోదానిపై వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అడగడం ద్వారా ఆయా అంశా ల్లో నా పరిజ్ఞానం ఎంతో పరీక్షించారు. కేవలం మేక్ ఇన్ ఇండియాపైనే సుమారు 7 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చాను. అడిగిన ప్రశ్నలు: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో రాష్ట్రాలను ఎలా పరిరక్షించాలని నువ్వు అనుకుంటున్నావు? లీ క్యుయాంగ్ హ్యూ ఎవరు? సింగపూర్లో ఆయన చేసిన పబ్లిక్ పాలసీని వివరించు? ఆయన విధానాలను నువ్వు సమ్మతిస్తావా? పొగాకు పంటను నిషేధించడాన్ని నువ్వు సమ్మతిస్తావా? గుంటూరులో పొగాకు పండించడం సమంజసమేనా? మహిళ సాధికారత అంటే ఏంటి? ఉద్యోగినులకు ఉన్న బాధ్యతలు ఏంటి? పిల్లలను బేబీకేర్ సెంటర్లలో ఉంచి తల్లి ఉద్యోగాలకు వెళ్లడం ఎంత వరకు సమంజసం? మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయగలవు? ఎవరికైనా సాధ్యమే! సివిల్స్ చాలా కష్టసాధ్యమైన పరీక్ష. కానీ అసాధ్యం కాదు. కష్టపడి చదివితే సాధారణ విద్యార్థులు సైతం విజేతలుగా నిలవొచ్చు. సివిల్స్ సిలబస్ సముద్రంలా విస్తృతమైంది. అంతా చదివేయాలని తొందరపడొద్దు. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లో ఎవరూ వంద శాతం మాస్టర్ కాలేరు. టెక్నిక్స్ తెలుసుకుని చదవాలి. కోచింగ్ తీసుకుంటే చాలా వరకు శ్రమ తగ్గుతుంది. విస్తృతమైన సబ్జెక్టుపై అవగాహన ఏర్పడుతుంది. తెలుగు మీడియంలో సివిల్స్కు సన్నద్ధమయ్యేవారు ముందు నుంచే సొంత నోట్సును ప్రిపేర్ చేసుకోవాలి. మార్కెట్లో మెటీరియల్ అందుబాటులో ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తదితర ఆప్షనల్స్ను ఎంచుకోవడం మంచిది. లక్ష్యం: సోషల్ సర్వీస్పై నాకు ముందునుంచీ ఆసక్తి ఎక్కువ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా పనిచేస్తాను. -
యూఎస్లో జాబ్కు గుడ్ బై చెప్పి మరీ ...
లక్నో : ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తామని చెప్పామంటే.. ఎవరైనా మనవైపు వెర్రిగా చూస్తారు. అదే అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం... దానికి రాజీనామా చేస్తామంటే బంధువులు, స్నేహితులు మనవైపు ఎలా చూస్తారో ఓ సారి ఊహించుకోండి. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన నిహారికా భట్ యూఎస్లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి... భారత్ వచ్చేసి... సివిల్స్ సర్వీసెస్ పరీక్ష పై దృష్టి పెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఈ పరీక్షలు రాసి 146 ర్యాంకు సాధించింది. లక్నో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రిమెంటేషన్ విభాగంలో నిహారిక ఇంజనీరింగ్ పట్టా అందుకుంది. అనంతరం యూఎస్ వెళ్లింది. ఆక్కడ మిచిగాన్ యూనివర్శిటీలో ఎమ్టెక్ చేస్తూనే యూఎస్ ప్రభుత్వ సంస్థ ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) విభాగంలో పరిశోధకురాలిగా చేరింది. అక్కడ దాదాపు ఏడాదిన్నర పాటు మానవుని ఆర్యోగంపై నానో పార్టికల్స్ ప్రభావం అన్న అంశంపై నిహారిక పరిశోధనలు చేసింది. అయినా దేశ సేవకు ఏదో చేయాలనే తలంపుతో అక్కడి నుంచి వచ్చి సివిల్స్ పై దృష్టి పెట్టింది. మొదటి ప్రయత్నంలోనే నిహారిక అనుకున్నది సాధించింది. ఆమె తండ్రి లక్నోలో వైద్యునిగా విధులు నిర్వర్తిస్తుంటే.. తల్లి మాత్రం సాధారణ గృహిణి అని నిహారిక తెలిపింది. సివిల్స్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో యూఎస్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసి సివిల్స్ ఎంచుకున్నావని యూపీఎస్సీ సభ్యులు తనను అడిగారని 146వ ర్యాంకు సాధించిన నిహారిక ఆనందంతో చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని టాపర్ గా నిలిచినందుకు నిహారిక సంతోషంతో ఉబ్బితబ్బిబవుతుంది. -
‘సాక్షి’తో సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇరా
-
సివిల్స్ ర్యాంకర్ల మనోభావాలు...
సివిల్స్ తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు ర్యాంకుల పట్ల తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇవీ... -సాక్షి, హైదరాబాద్ ఐఎఫ్ఎస్కు వెళతా నాకు ఫారిన్ సర్వీసెస్ అంటే ఇష్టం. ఇంటర్నేషనల్ లా అంశంలో ఆసక్తి ఉంది. అందుకే ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఏఎఫ్ఎస్)ను ఎంచుకోవాలనుకుంటున్నా. 2011లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశా. ఆ తరువాత రెండేళ్లు ఉద్యోగం చేసి ఏడాదిపాటు సెలవు పెట్టి శిక్షణ తీసుకున్నా. అమ్మ ఛాయారతన్, నాన్న రతన్ ఇద్దరూ సివిల్ సర్వేంట్లే కావడంతో ఇంటర్వ్యూ మెళకువలను నేర్పించి ఎంతగానో తోడ్పడ్డారు. - సాకేత రాజ ముసినిపల్లి, 14వ ర్యాంకర్ మళ్లీ పరీక్ష రాస్తా... మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కొండ్రిపోలు గ్రామం. రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో ఐఏఎస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ రాకుంటే మంచి ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. ఓయూలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి క్యాపిటల్ ఐక్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశా. - అదావత్ సైదులు, 1,174వ ర్యాంకు పేదల సంక్షేమమే లక్ష్యం... మొదటి ప్రయత్నంలోనే 18వ ర్యాంకుతో సివిల్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. మొదటి ఆప్షన్ ఐఏఎస్, రెండోది ఐపీఎస్. ఏ రంగంలో పని చేసినా పేదల సంక్షేమమే నా లక్ష్యం. పేదల అభ్యున్నతి కోసం అంకిత భావంతో సేవలందిస్తా. - సాయికాంత్ వర్మ, 18వ ర్యాంకర్ కష్టాలే సివిల్స్ వైపు నడిపించాయి మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవపల్లి. తల్లిదండ్రులు పడిన కష్టాలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. వారిది వ్యవసాయ కుటుంబం. రోజుకు 8గంటలు కష్టపడి చదివా. బీటెక్ చేసినా అప్షనల్గా ఆంత్రోపాలజీ ఎంపిక చేసుకొని విజయం సాధించా. - లక్ష్మీ భవ్య, 88వ ర్యాంకర్ దేశ సేవ కోసమే.. దేశానికి విస్తృతస్థాయిలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్స్ను ఎంచుకున్నా. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. సీబీఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్లో ఉద్యోగంలో చేరినా సంతృప్తి చెందకే సివిల్స్ వైపు అడుగులేశా. - రాకేష్, 122వ ర్యాంకర్ ఫ్యాకల్టీ నుంచి సివిల్స్కు.. గతంలో మూడుసార్లు ర్యాంకులు రాకున్నా నిరుత్సాహ పడకుండా సివిల్స్కు సిద్ధమయ్యా. హార్డ్ వర్క్, డెడికేషన్ , ఫోకస్ ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టి చదివా. సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే రెండేళ్లుగా ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో ఎకానమి, జాగ్రఫీ సబ్జెక్టులలో విద్యార్థులకు తరగతు లు బోధిస్తున్నా. - వీఆర్ కృష్ణతేజ, 66వ ర్యాంకర్ నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ మాది కృష్ణాజిల్లాలోని గుళ్లపూడి అనే పల్లెటూరు. మూడో విడత పరీక్షలో 318 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై ప్రస్తుతం నాగపూర్లో శిక్షణ తీసుకుంటున్న నాకు ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యం నాలుగో ప్రయత్నంలో నెరవేరింది. - గౌతమ్, 30వర్యాంకు గ్రామాల్లో సేవ చేస్తా... కలెక్టర్గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. బెంగళూరులో బీటెక్ కంప్యూటర్ సైన్స్, అహ్మదాబాద్లో ఎంబీఏ చేశా. హైదరాబాద్లోని కేపీఎంజీ అనే సివిల్ సర్వీసెస్ అడ్వయిజరీ సంస్థలో పనిచేస్తూ అనుదినం ఐఏఎస్లతో అభిప్రాయాలు పంచుకోవటంతో నాకూ ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. సివిల్స్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఓపిక ఎంతో అవసరం. - గిరియప్ప లక్ష్మీకాంత్రెడ్డి, 21వ ర్యాంకర్ గురి ఎప్పుడు లక్ష్యం వైపే.. పోటీలో ఉన్న వారి గురి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది. బీటెక్ చేసే క్రమంలోనే సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నా. నా విజయం వెనుక తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ఆశీస్సులు ఉన్నాయి. -మహ్మద్ రోషన్, 44వ ర్యాంకర్ ఆడియో ద్వారా పాఠాలు విన్నా ఆడియో విని.. బ్రెయిలీ లిపిలో సివిల్స్ పరీక్షలు రాశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా. మాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఓయూలో ఎం.ఎ.బిఈడీ పూర్తి చేశా. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. - స్వాతి (అంధురాలు), 796వ ర్యాంకర్ వినికిడి శక్తి కోల్పోయినా.. సివిల్స్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన 22 ఏళ్ల నేహా వీరవల్లి 1221 ర్యాంకు సాధించారు. వికలాంగుల కోటాలో తనకు ఐఏఎస్ లేదా మరేదైనా మంచి సర్వీసు వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. రెండో తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) రావడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయారు. సివిల్స్లో రెండో ప్రయత్నంలో 1,221 ర్యాంకు సాధించారు. నేహా సాధించిన విజయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి సోమవారం తనను కలిసేందుకు ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ‘ఆర్సీ రెడ్డి’కి టాప్ ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు సివిల్స్ 2015 ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డెరైక్టర్ ఆర్సీ రెడ్డి తెలిపారు. 100లోపు 18, 49, 66 ర్యాంకులతోపాటు మొత్తం 36 మందికిపైగా మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారని, పట్టుదల, శ్రమతో సివిల్స్లో విజయం సాధించొచ్చని తెలిపారు. -
సివిల్స్లో తెలుగు తేజాలు
టాప్-100లో 10 మందికి ర్యాంకులు * మొత్తంగా 100 వరకు ర్యాంకులు * సాధించిన తెలంగాణ, ఏపీ విద్యార్థులు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శనివారం ఢిల్లీలో విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2014 తుది ఫలితాల్లో దాదాపు వంద మంది వరకు ర్యాంకులు సాధించా రు. హైదరాబాద్లో చదువుకున్న వారితోపాటు ఢిల్లీలో చదువుకున్న తెలుగు విద్యార్థులు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తొలి వంద ర్యాంకుల్లో 10 మంది తెలుగువారు స్థానం సంపాదించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన సాకేతరాజ ముసినిపల్లి జాతీయ స్థాయిలో 14వ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన రిటైర్డ్ ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాయారతన్, మాజీ ఐపీఎస్ అధికారి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం.రతన్ దంపతుల కుమారుడు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. మూడు విడతలుగా జరిగిన ఈ పరీక్షల తుది ఫలితాల్లో మొత్తం 1,236 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో 590 మంది జనరల్ కేటగిరీకి చెందినవారుకాగా, 354 మంది ఓబీసీ, 194 మంది ఎస్సీ, 98 మంది ఎస్టీ కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితోపాటు మరో 254 మందితో రిజర్వు జాబి తాను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో జనరల్లో 127 మందిని, ఓబీసీలో 105 మందిని, ఎస్సీల్లో 19 మం దిని, ఎస్టీల్లో ముగ్గురితో ఈ జాబితాను రూపొందించింది. ప్రస్తుతం 73 మంది వరకు సివిల్స్కు ఎంపికైన వారి వివరాలు అందాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారు దాదాపు వంద మంది వరకు ఉంటారని ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి. రెడ్డి, ప్రతినిధి వేగిరెడ్డి హరిచక్రవర్తి, అనలాగ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్ వెల్లడించారు. టాప్ 200 ర్యాం కులు సాధించిన వారిలో సాకేత రాజ ముసినిపల్లి (14వ ర్యాంకు), సీఎం సాయికాంత్ వర్మ (18), లక్ష్మీకాంత్రెడ్డి (21), మహ్మద్ రోషన్ (44), రాజగోపాల సుంకర (49వ ర్యాంకు), క్రాంతికుమార్ పాటి (50వ ర్యాంకు), వి.ఆర్.కె.తేజ మైలవరపు (66వ ర్యాంకు), రెడ్డి వేదిత (71వ ర్యాంకు), లక్ష్మీభవ్య తన్నీ రు (88వ ర్యాంకు), సతీష్ రెడ్డి పింగిళి (97వ ర్యాంకు), రక్షిత కె మూర్తి (117వ ర్యాంకు), భరత్రెడ్డి బొమ్మారెడ్డి (120వ ర్యాంకు), రాకేష్ చింతగుంపుల (122వ ర్యాంకు), వై రఘువంశీ (190వ ర్యాంకు) ఉన్నారు. అలాగే 200 ర్యాంకుపైన సాధించిన వారు 59 మందికిపైగా ఉన్నారు. సివిల్స్ ర్యాంకర్లకు వైఎస్ జగన్ అభినందనలు సివిల్ సర్వీసు 2014 తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ శ్రమతో అత్యత్తమ ఫలితాలు సాధించిన వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. -
ఆహా..నేహా
- పీహెచ్ కోటాలో నేహాకు సివిల్స్లో చాన్స్ - వినికిడి లోపమున్నా జయించిన యువతి - ఐఏఎస్ సాధించడమే లక్ష్యమంటున్న నేహా - సివిల్స్లో విశాఖకు 4 ర్యాంకులు సాక్షి, విశాఖపట్నం : సివిల్ సర్వీసెస్ పోస్టులకు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో విశాఖ నగరానికి నాలుగు మెరుగైన ర్యాంకులు లభించాయి. శనివారం యూపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. రాత్రి వరకూ లభించిన వివరాల మేరకు నలుగురికి మంచి ర్యాంకులు వచ్చాయి. నగరంలోని డిక్లో సివిల్స్ శిక్షణ పొందిన డాక్టర్ అభినవ్ భిట్టాకు 825, డాక్టర్ వెంకటేశ్కు 844, జి.నాగసతీష్కు 1088 ర్యాంకు లభించాయని ఆ సంస్థ డైరక్టర్ కృష్ణ వెల్లడించారు. అయితే ఎక్కడా కోచింగ్ లేకుండానే కూర్మన్నపాలేనికి చెందిన ఎస్బీఐ ఉద్యోగిని నేహా వీరవల్లికి 1221 ర్యాంకు సాధించారు. పీహెచ్ కోటాలో ఐఏఎస్ను ఆమె ఆశిస్తున్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం: ఐఏఎస్... సమాజానికి సేవ చేయడానికే కాదు పేరుప్రతిష్టలకూ కొదవలేని ఉద్యోగం ఇది! దీని కోసం కల కనడమే కాదు... దాన్ని సాకారం చేసుకోవడానికి చదువునే తారకమంత్రం చేసుకున్నారు నేహా వీరవల్లి! చిన్న వయసులోనే బ్రెయిన్ ఫీవర్ దాడి చేసి వినికిడి శక్తిని లాగేసుకున్నా ఆమె అధైర్యపడలేదు. పుస్తకాలు, పత్రికలతో కుస్తీ పట్టి విధికే సవాలు విసిరారు. 22 ఏళ్ల వయసుకే సివిల్స్లో 1221 ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఒకవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రోజుల్లో ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. ‘కేవలం పుస్తకాలను బట్టీ పట్టేస్తేనే ఫలితం సాధించలేం. సమాజాన్ని అవగాహన చేసుకుంటూ విద్యను దానికి అన్వయం చేసినప్పుడే సివిల్స్ గోల్ సాధన సులువవుతుంది. చిన్నప్పటి నుంచి పేపర్ రీడింగ్, పత్రికలకు వ్యాసాల రచన, మనోవికాస పుస్తకాల పఠనం నాకెంతో ఉపయోగపడ్డాయి’ అని చెప్పారు నేహా. శనివారం సివిల్స్ ఫలితాల నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలుకరించింది. ఆమె తల్లి శిరీష సహాయంతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘సివిల్స్... అందులోనూ ఐఏఎస్ అధికారి కావడమంటే నాకు చిన్నప్పటి నుంచి క్రేజ్. ఏళ్ల తరబడి హైదరాబాద్, ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్నవారికే సాధ్యం కావట్లేదు... వినికిడి సమస్య ఉన్న మీ అమ్మాయికి సాధ్యమా? అని చాలామంది మా అమ్మానాన్నలతో అనేవారు. వారెప్పుడు ఆ మాటలను పట్టించుకోలేదు. నాన్న శశికుమార్ విశాఖ స్టీల్ప్లాంట్లో ఫోర్మన్గా పనిచేస్తున్నారు. అమ్మ శిరీష ఇంటర్ వరకే చదువుకున్నారు. లక్ష్య సాధనలో అమ్మ సహకారం ఎంతో ఉంది. నా లక్ష్యం ఏమిటో అర్థం చేసుకొని ఆ దిశగానే ప్రోత్సహించారు. తమ్ముడు అనూజ్ మాత్రం ఇంజనీరింగ్ లక్ష్యంతో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. ప్లస్2 వరకూ స్టీల్ప్లాంట్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదివా. గాజువాకలోని ఎంవీఆర్ కాలేజీలో బీఎస్సీలో చేరా. ఒకవైపు పాఠాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూనే సివిల్స్ సాధనకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ పట్టు సాధించా. డిగ్రీ సెకండియర్లో ఉండగానే ఎస్బీఐలో క్లరికల్ ఎగ్జామ్కు హాజరయ్యా. బ్యాంకు ఉద్యోగాలు వరుస కట్టాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపింది. డిగ్రీ పూర్తి కాగానే ఎస్బీఐ స్టీల్ప్లాంట్ శాఖలో ఉద్యోగంలో చేరా. అలాగని సివిల్స్ను మరచిపోలేదు. 2013లో తొలి ప్రయత్నం చేశా. ఇంటర్వ్యూ వరకూ వెళ్లగలిగినా 16 మార్కులు తేడాతో సర్వీసు రాలేదు. అయినా పట్టు వదలకుండా రెండో ప్రయత్నంలో ప్రయత్నించా. 1221 ర్యాంకు వచ్చింది. పీహెచ్ కోటాలో ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఒకవేళ మరేదైనా సర్వీసు వచ్చినా ఐఏఎస్ వచ్చేవరకూ విశ్రమించను. బ్రెయిన్ ఫీవర్ వల్లే సమస్య...: నేను సెకెండ్ క్లాస్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) వచ్చింది. మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపించడం వల్ల వినికిడి శక్తి పోయింది. అది తీరని లోటే అయినా సమస్యగా ఏనాడూ నేను భావించలేదు. తోటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించేందుకు ప్రతి నిమిషం తపించా. పాఠాలు చదువుకుంటూ నోట్స్ రాసుకునేదాన్ని. దినపత్రికల్లో వచ్చే వ్యాసాలను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేదాన్ని. ఆర్టికల్స్ రాసేదాన్ని. అలా రైటింగ్ స్కిల్స్ పెంచుకున్నా. సివిల్స్ మెయిన్స్లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఆప్షన్స్. ఇంటర్వ్యూ కూడా బాగా చేశా. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం ఉపయోగపడింది.’ -
సివిల్స్లోనూ అమ్మాయిలు టాప్ లేపారు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2014 ఫలితాల్లో అమ్మాయిలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సర్వీసు నియామకాలకు సంబంధించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొదటి అయిదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఇరా సింఘాల్ మొదటి ర్యాంకు సాధించగా, రేణు రాజ్, నిధి గుప్తా, వందనా రావ్ వరుసగా 2, 3, 4 ర్యాంకులలో నిలిచారు. ఓవరాల్ ఐదో ర్యాంకు సాధించిన సుహర్ష భగత్.. పురుషుల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూడొచ్చు. ఇక తెలుగు విద్యార్థులు సాకేత్ రాజా 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డి 21వ ర్యాంకు పొందారు. గత ఆగస్టు 24న 2,137 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయగా, వారిలో 1,236 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. నిజానికి దేశవ్యాప్తంగా 1,364 సివిల్ సర్వెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ సఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులు తుది దశకు ఎంపిక కావడం గమనార్హం. -
సీశాట్.. అర్హత పరీక్ష మాత్రమే!
సివిల్స్ ఆశావహులంతా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగా.. సివిల్స్ ప్రిలిమ్స్లో మార్పుల ప్రకటన వెలువడింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2015 నుంచి పేపర్ 2(సీశాట్)ను కేవలం అర్హత పరీక్షగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని పేపర్ 2 నుంచి గతేడాదిలాగే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ నెల 16న వెలువడాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ సైతం వాయిదా పడింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ పరిణామాలు అభ్యర్థుల్లో పలు సందేహాలకు దారితీసి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సీశాట్కు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై నిపుణుల విశ్లేషణ.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్-2(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇక నుంచి అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందిన మార్కులు మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కనీస అర్హత మార్కులు 33 శాతం పొందాలి. అంటే.. ప్రిలిమ్స్ పేపర్-2లో 33 శాతం మార్కులు పొందితేనే పేపర్-1 (జనరల్ స్టడీస్) మూల్యాంకనం జరుగుతుంది.అంతేకాకుండా గతేడాది మాదిరిగానే పేపర్-2 ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో సీశాట్ను అర్హత పరీక్షగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, నాన్-మ్యాథ్స్/సైన్స్ విద్యార్థులకు అనుకూలమని కొందరు అభిప్రాయపడుతుంటే.. మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులకు తాజా నిర్ణయం శరాఘాతమని మరికొందరు పేర్కొంటున్నారు. సీశాట్పై వ్యతిరేకత ఎందుకు? 2010 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలోని రెండు పేపర్లలో.. రెండో పేపర్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండేది. ఈ విధానాన్ని మార్చుతూ 2011 నుంచి రెండో పేపర్ను కూడా అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండేలా సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే కొత్త పేపర్కు రూపకల్పన చేశారు. ఈ పేపర్ సిలబస్లో పేర్కొన్న.. కాంప్రహెన్షన్, బేసిక్ న్యూమరసీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్.. సివిల్ సర్వీసెస్లో విధులు నిర్వర్తించే అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాల్సినవిగా పేర్కొన్నారు. కానీ ఆ సిలబస్ అంశాలపై గ్రామీణ, ప్రాంతీయ భాష అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, బేసిక్ న్యూమరసీ వంటి అంశాలు పట్టణ ప్రాంత విద్యార్థులకు, మ్యాథ్స్, సైన్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది రెండో పేపర్లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ ప్రశ్నల ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడిక తాజాగా సీశాట్ను కేవలం అర్హత పరీక్షగానే ప్రభుత్వం పేర్కొంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని కూడా గతేడాదిలాగే తొలగిస్తున్నట్లు పేర్కొంది. మరి కొత్తగా లభించే ప్రయోజనం ఒకవైపు పేపర్-2ను కేవలం అర్హత పరీక్షగా పేర్కొంటూనే.. మరోవైపు అందులో కనీస మార్కులు పొందితేనే పేపర్-1 మూల్యాంకనం జరుగుతుంది అనే నిర్ణయంతో కొత్తగా లభించే ప్రయోజనం ఏంటి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. గతేడాది వరకు రెండు పేపర్లు కలిపి కటాఫ్ నిర్ణయించే విధానం ఉండేది. దాంతో పేపర్-2లో అత్యధిక మార్కులు పొందడం ద్వారా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మలి దశ మెయిన్స్కు ఎంపికయ్యారని, దీనివల్ల కొన్ని వర్గాలకే ఎక్కువ లబ్ధి చేకూరిందని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్లో పొందిన మార్కులనే మలి దశకు పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయం అన్ని నేపథ్యాల అభ్యర్థులకు సమాన అవకాశం ఇచ్చినట్లయిందని అంటున్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు అనుకూలమా..! సీశాట్ను అర్హత పరీక్షగా మార్చడం ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులకు అనుకూలమా? అంటే.. ఎక్కువ మంది నిపుణులు అవుననే అంటున్నారు. ఎందుకంటే..ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులు తమ అకడమిక్స్ స్థాయి నుంచే జనరల్ స్టడీస్లో పేర్కొన్న అంశాలపై అవగాహన పొందుతారు. తాజా నిర్ణయం ప్రకారం- జనరల్ స్టడీస్ పేపర్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెయిన్స్కు అర్హుల జాబితా రూపొందించడం వల్ల వీరికి లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి పేపర్-2లోని అంశాలు పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయిలోనివే. అయితే అభ్యర్థులు ఆ తరగతుల తర్వాత తమ అకడమిక్ గమ్యాలను మార్చుకుని ఆ అంశాలకు దూరమవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. కానీ మూడు లేదా నాలుగు నెలల కసరత్తుతో బేసిక్ న్యూమరసీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల్లో సులువుగానే రాణించొచ్చు’ అనే అభిప్రాయముంది. వారికి శరాఘాతమా..! పేపర్-2లో గరిష్ట మార్కులు సాధించి మెయిన్స్కు ఎంపికవ్వాలని భావిస్తున్న మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగ్ అభ్యర్థులకు తాజా నిర్ణయం శరాఘాతమని నిపుణుల అభిప్రాయం. సీశాట్ అమల్లోకి వచ్చిన 2011 నుంచి గతేడాది వరకు పేపర్-2లోనే 150 నుంచి 180 మార్కులు పొంది మెయిన్స్కు ఎంపికైన ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో చదివిన వారే. వీరంతా మెయిన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సైకాలజీ వంటి ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్లనే ఆప్షనల్గా ఎంచుకున్నప్పటికీ.. తమకున్న అనలిటికల్ స్కిల్స్, కంపేరిటివ్ అప్రోచ్ కారణంగా మెయిన్స్లోనూ సులభంగా గట్టెక్కుతున్నారు. తుది జాబితాలోనూ పైచేయి సాధిస్తున్నారు. గత నాలుగేళ్ల ఫలితాల గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2011 నుంచి ఇప్పటి వరకు సివిల్స్ విజేతల్లో 40 శాతంపైగా టెక్నికల్/మ్యాథ్స్ నేపథ్యం ఉన్న వారే. మరికొద్ది రోజుల్లో స్పష్టత! తాజా ప్రకటన ప్రకారం- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి విధి విధానాలపై మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ఇప్పటికే నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. అదే విధంగా 2011 అభ్యర్థులకు 2015లో అవకాశం ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంపైనా స్పష్టత రానుంది. కాబట్టి 2011 అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ పరంగా సంసిద్ధంగా ఉండటం మంచిది. మార్పు తథ్యం.. మార్చాలి వ్యూహం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పు తథ్యమని తేలిపోయింది. ఇక అభ్యర్థులు అందుబాటులో ఉండే మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సానుకూల ఫలితం పొందేందుకు కృషి చేయాలి. ఈ క్రమంలో టెక్నికల్/మ్యాథమెటిక్స్; ఆర్ట్స్/హ్యుమానిటీస్ అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు.. ఇంజనీరింగ్ /మ్యాథ్స్ అభ్యర్థులు ఇలా: ఇంజనీరింగ్/మ్యాథ్స్ అభ్యర్థులకు పేపర్-2లోని అంశాలపై ఇప్పటికే అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అధిక శాతం పేపర్-1 (జనరల్ స్టడీస్)కు కేటాయించాలి. జనరల్ స్టడీస్, ఆర్ట్స్ విద్యార్థులకే అనుకూలమనే ప్రతికూల భావనను వీడి ముందుకు సాగాలి. గత కొన్నేళ్లుగా జనరల్ స్టడీస్ పేపర్లోని ప్రశ్నలను పరిశీలిస్తే అధిక శాతం ప్రశ్నలు సమకాలీన అంశాలకు సంబంధంగానే ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సబ్జెక్ట్కు సంబంధించి తాజాగా చోటు చేసుకుంటున్న పరిమాణాలపై దినపత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకోవాలి. తర్వాత వాటికి సంబంధించి కాన్సెప్ట్స్ను మెటీరియల్ ఆధారంగా చదవాలి. ఆర్ట్స్/ హ్యుమానిటీస్ నేపథ్యంతో: తాజా నిర్ణయాన్ని ఆర్ట్స్ విద్యార్థులు తమకు అనుకూలంగా భావించి; పేపర్-2ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదు. పేపర్-2లోనూ కచ్చితంగా అర్హత మార్కులు (33 శాతం) పొందితేనే పేపర్-1 మూల్యాంకన చేస్తారనేది గుర్తుంచుకోవాలి. లేదంటే పేపర్-1లో నూటికి తొంభై శాతం మార్కులు పొందినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులు పేపర్-2 ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. సమయ స్ఫూర్తి, నిర్ణయాత్మక శక్తిని పరీక్షించే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల ప్రిపరేషన్ను సులభతరం చేసుకోవాలి. అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం నిరంతరం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు చదవడం అలవర్చుకోవాలి. 33 శాతం కనీస అర్హత మార్కులు పొందే విధంగా ప్రయత్నించాలి. సిలబస్లో పేర్కొన్న మొత్తం విభాగాల్లో తమకు బాగా అనుకూలమైన అంశాల్లో మరిం త పట్టు సాధించే విధంగా కృషి చేయాలి. ఇందుకోసం వాస్తవ సమస్యలు- వాటి పరిష్కారానికి అనుసరించిన విధానాలు - నిర్ణయాలు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. బేసిక్ న్యూమరసీ ప్రశ్నలు నిజంగానే బేసిక్గా ఉంటున్నాయి. కాబట్టి ఆందోళన చెందొద్దు. జీఎస్ ప్రశ్నలు పెరుగుతాయా? ఇప్పటి వరకు 200 మార్కులకు జనరల్ స్టడీస్; మరో 200 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో జనరల్ స్టడీస్లో ప్రశ్నలు, మార్కుల సంఖ్య పెరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అవకాశాలు లేకపోలేదని, ఒకవేళ వీటిని పెంచినా ఆశ్చర్య పోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. గ్రామీణ యువతకు సదవకాశం సీశాట్ విషయంలో ప్రభుత్వ తాజా నిర్ణయం గ్రామీణ యువతకు సదవకాశం కల్పించేందుకు ఎంతో ఆస్కారం ఉంది. గత నాలుగేళ్లుగా రెండో పేపర్లోని అంశాల కారణంగా ఎందరో గ్రామీణ అభ్యర్థులు ఫలితాల్లో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఆ సమస్య తొలగినట్లే. కానీ కనీస అర్హత మార్కులు పొందాలని పేర్కొనడాన్ని గుర్తించి ప్రిపరేషన్ సాగించాలి. -ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆర్ట్స్కు పూర్వ వైభవం తాజా నిర్ణయంతో సివిల్ సర్వీసెస్లో ఆర్ట్స్ నేపథ్యానికి పూర్వ వైభవం రావడం ఖాయం. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు పేపర్-2 ద్వారా, ఆర్ట్స్ విద్యార్థులు పేపర్-1 ద్వారా కటాఫ్ స్థాయి దాటి మెయిన్స్కు వెళ్లాలని భావిస్తూ ప్రిపరేషన్ సాగించారు. కానీ ఇప్పుడు పేపర్-1 మార్కులనే మలి దశకు పరిగణనలోకి తీసుకోనున్న నేపథ్యంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులకు కచ్చితంగా కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో కటాఫ్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా ప్రిపరేషన్ సాగించాలి. -వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ ముందుగా పేర్కొంటే బాగుండేది ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రక్రియలో పలు మార్పులు చేస్తున్నారు. వాటికి సంబంధించి చివరి నిమిషంలో ప్రకటిస్తున్నారు. ఇది అభ్యర్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. తాజా నిర్ణయం కూడా ఇలాంటిదే. మరొక్క రోజులో నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీశాట్పై కొత్త ప్రకటన చేశారు. మార్పుల గురించి కొంత ముందుగా ప్రకటన చేస్తే అభ్యర్థులు సంసిద్ధులయ్యేందుకు అవకాశం లభించేంది. -శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ -
సివిల్స్ సమరానికి సన్నద్ధమవ్వండిలా..
దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీపడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియకు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల్లో వడపోత ఉంటుంది. తొలి దశ ప్రిలిమినరీకి యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం- మే 16న నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే ఏళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులతోపాటు తాజా గ్రాడ్యుయేట్లు సైతం గురిపెట్టిన సివిల్స్లో విజయానికి నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు.. ప్రాథమిక అంశాలపై పట్టు.. వర్తమాన వ్యవహారాలపై అవగాహన.. తులనాత్మక అధ్యయనం.. విశ్లేషణాత్మక దృక్పథం.. ఇవీ సివిల్స్ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలన్నది నిపుణుల మాట! పరీక్షకు సంబంధించి న సిలబస్లోని అంశాల కాన్సెప్ట్స్ మొదలు వాటికి సంబంధించిన సమకాలీన పరిణామాల వరకు అన్నిటిపై సమగ్ర అవగాహన పెంచుకుంటూ శాస్త్రీయంగా అడుగులు వేయాలి. అప్పుడే విజయం దరిచేరుతుందని నిపుణులు చెబుతున్నారు. సిలబస్ అధ్యయనం సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్లో భాగంగా మొదట చేయాల్సిన పని సిలబస్ అధ్యయనం. నిర్దేశిత సిలబస్ను ఆసాంతం క్షుణ్నంగా పరిశీలించాలి. ముఖ్యంగా మొదటిసారి పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. సిలబస్ పరిశీలన ద్వారా తమకు అవగాహన ఉన్న అంశాలేవి? పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిన అంశాలేవి? అనేది తెలుస్తుంది. ఇది ప్రిపరేషన్కు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే పరీక్షకు హాజరై విఫలమై, మరోసారి ప్రయత్నిస్తున్న అభ్యర్థులు కూడా సిలబస్ను పరిశీలించాలి. గత పరీక్షల్లో తమ ప్రదర్శనను బేరీజు వేసుకోవాలి. సిలబస్లో ఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారో గుర్తించాలి. తాజా ప్రిపరేషన్లో వాటికి కొంత అధిక సమయం కేటాయించాలి. సిలబస్ పరిశీలన ఆధారంగా అవగాహన లేని అంశాలను లోతుగా అధ్యయనం చేసే విషయంలో ఒక అంచనాకు రావాలి. ఆందోళన అనవసరం సివిల్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ.. ఇలా అన్ని నేపథ్యాల అంశాలు ఉంటాయి. దీంతో పరీక్షకు పోటీపడే ప్రతి అభ్యర్థి తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని అంశాల్లో కొంత ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ; సైన్స్ విద్యార్థులు జనరల్ నాలెడ్జ్లోని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీలకు ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిలబస్లో పేర్కొన్న అంశాలన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో తమ అకడమిక్ నేపథ్యం లేని అంశాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు తమకు పరిచయం లేని అంశాలకు కనీసం మూడు గంటలు కేటాయించాలి. గత ప్రశ్నపత్రాల పరిశీలన సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే మరో సాధనం.. గత ప్రశ్నపత్రాల పరిశీలన. దీని ద్వారా ప్రధానంగా ప్రశ్నల శైలి అర్థమవుతుంది. సివిల్స్ పరీక్షలో ఇటీవల కాలంలో నేరుగా వస్తున్న ప్రశ్నలు తగ్గాయి. పరోక్ష లేదా విశ్లేషణాత్మక దృక్పథాన్ని, నిర్దిష్ట అంశంలో పూర్తిస్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలకు వెయిటేజీ పెరుగుతోంది. ఉదాహరణకు.. Which of the following is/are the function/ functions of the cabinet Secretariat? 1) Preparation of agenda for cabinet meetings 2) Secretarial assistance to Cabinet committees 3) Allocation of financial resources to the ministers Select the correct answers using the code given below a) 1 b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 Ans: c ఈ ప్రశ్నను పరిశీలిస్తే కేబినెట్ సెక్రటేరియట్ స్వరూపంతోపాటు విధులు గురించి పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలరు. కాబట్టి గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఒక అంశం నుంచి ఎన్ని కోణాల్లో ప్రశ్నలు ఎదురుకావొచ్చో తెలుస్తుంది. దాని ఆధారంగా ప్రిపరేషన్లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించుకోవాలి. మెటీరియల్ ఎంపిక సివిల్స్ విజయంలో మెటీరియల్ ఎంపికది ఎంతో కీలక పాత్ర. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్కు సంబంధించి పదుల సంఖ్య లో పుస్తకాలు, వెబ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాలను ఎంపిక చేసుకునే ముందు సిలబస్లోని అన్ని అంశాలు ఉన్నాయా? లేవా? ఉంటే నిర్దిష్ట అంశంపై అన్ని కోణాల్లో సమాచారం ఉందా? అనేది పరిశీలించాలి. సమగ్ర సమాచారం ఉన్న మెటీరియల్నే ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలపై విశ్లేషణాత్మక సమాచారం ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి. ఫలితంగా ప్రిలిమ్స్కు సమాంతరంగా మెయిన్స్కు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. గైడ్లు, ప్రశ్న-సమాధానం తరహా పుస్తకాలకు ప్రాధాన్యమివ్వడం సరికాదు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ రెండు దశల రాత పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) అభ్యర్థులకు కలిసొచ్చే అంశం పరీక్ష విధానం. మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు పేపర్లుగా ఉండే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ సబ్జెక్ట్లు మినహా మిగతా అన్ని విభాగాలు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉమ్మడి అంశాలే. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ సన్నద్ధత లభిస్తుంది. సమకాలీన అంశాలతో.. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రాథమిక (కాన్సెప్ట్స్) అంశాలను సమకాలీన (కాంటెంపరరీ) పరిణామాలతో బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. గత కొన్నేళ్లుగా సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సమకాలీనంగా చోటు చేసుకున్న అంశాల నేపథ్యంపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్లమెంట్ ఏదైనా రాజ్యంగ సవరణ చేస్తే రాజ్యాంగంలో ప్రకరణల సవరణకు పార్లమెంటుకున్న అధికారాలు, తాజా సవరణ ఏ ప్రకరణ పరిధిలోనిది లేదా ఇది ఎన్నో సవరణ వంటి ప్రశ్నలు ఎదురుకావచ్చు. అంతర్గత సంబంధం సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం అంతర్గత సంబంధం ఉన్న సబ్జెక్ట్లు లేదా అంశాలను గుర్తించి తులనాత్మక అధ్యయనం సాగించడం. ప్రస్తుత సిలబస్ ప్రకారం ఎకానమీ-పాలిటీ, జాగ్రఫీ-ఎన్విరాన్మెంట్-బయో డైవర్సిటీ అంశాలు అంతర్గత సంబంధం ఉన్నవిగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎఫ్డీఐల బిల్లు ఎకానమీ పరిధిలోకి రాగా.. దాని ఆమోద ప్రక్రియ పాలిటీ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి చదివితే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కు సమప్రాధాన్యం సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్కు సమ ప్రాధాన్యం కనిపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు తమకు ఇష్టంగా అనిపించిన లేదా సులువుగా భావించిన సబ్జెక్ట్లకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ విధానం సరికాదు. ప్రిపరేషన్ సమయంలో అన్ని అంశాలను చదివేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రస్తుత సమయంలో ఇలా సివిల్ సర్వీసెస్-2015 ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 23న, మెయిన్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 18 నుంచి జరగనున్నాయి. అభ్యర్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా టైంమేనేజ్మెంట్ పాటిం చాలి. జూన్ 30వరకు ప్రిలిమ్స్, మెయిన్స్లకు ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలి. జూలై నుంచి పూర్తిగా ప్రిలిమినరీ పరీక్ష కు కేటాయించాలి. జూలై నుంచి ఆగస్ట్ 10 మధ్యలో కనీసం మూడు, నాలుగు మోడల్ టెస్ట్లు లేదా గ్రాండ్ టెస్ట్లకు హాజరై తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. ప్రిలిమ్స్ రెండో పేపర్ సివిల్స్ ప్రిలిమ్స్లోని రెండో పేపర్ (సీ-శాట్) విషయంలో అభ్యర్థులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇది మ్యాథ్స్ నేపథ్యం ఉన్నవారికే అనుకూలంగా ఉందని, ఫలితంగా తమ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సులభంగానే ఈ పేపర్లోని న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా ఒక సమస్యను పరిశీలించడం, దాన్ని వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యాల ఆధారంగా డెసిషన్ మేకింగ్ విభాగం ప్రశ్నలకు కూడా సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు ఆందోళన వీడితే విజయానికి చేరువగా సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఈ పరీక్షకు లక్షల మంది పోటీ పడతారని, తాము వారికి సరితూగగలమా అనే ఆందోళనతో ఉంటారు. ముందుగా దీన్ని వదులుకుంటే మానసికంగా విజయానికి చేరువ అయినట్లే. ప్రిలిమ్స్లో విజయానికి పుస్తకాల ఎంపిక ఎంతో కీలకం. ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం సీనియర్లు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా తులనాత్మక అధ్యయనం అలవర్చుకోవడం ఎంతో ప్రధానం. ఫలితంగా విభిన్న అంశాలపై అవగాహన లభిస్తుంది. ప్రస్తుత సమయంలో తాజా అభ్యర్థులు రెండు నెలలు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి ప్రిపరేషన్ సాగించి తర్వాత పూర్తిగా ప్రిలిమినరీకి కేటాయించడం ద్వారా సత్ఫలితాలు ఆశించొచ్చు. - మహ్మద్ ముషరగ్ అలీ ఫరూకీ, సివిల్స్-2014 విజేత (జాతీయ ర్యాంకు 80). సిలబస్లోని అన్ని అంశాలపైనా దృష్టిసారించాలి సాధారణంగా అభ్యర్థులు చేసే పొరపాటు ముఖ్యమైనవి ఏమిటి? ప్రాధాన్యం లేనివి ఏమిటి? అని ఆలోచించడం! కానీ, పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సివిల్స్ వంటి అత్యున్నత పరీక్షకు సన్నద్ధత క్రమంలో ఇంపార్టెంట్, నాన్-ఇంపార్టెంట్ అని ఆలోచించే ధోరణి ఏమాత్రం సరికాదు. సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాలు కవర్ అయ్యేలా అధ్యయనం చేయాలి. ప్రతి యూనిట్ను కనీసం మూడుసార్లు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్ని అంశాల్లో మాస్టర్స్ కాలేకపోయినా వాటి ప్రాథమిక విషయాలను ఒంటబట్టించుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్, న్యూఢిల్లీ. -
సీ-శాట్ విధానాన్ని రద్దు చేయండి
ప్రధాని, రాష్ట్రపతికి ఏపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విజ్ఞప్తి కడప కార్పొరేషన్: సివిల్ సర్వీసు పరీక్షల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత సీ-శాట్ విధానాన్ని రద్దు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించారు. ఆ ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విధానం వల్ల ఐఐటీ, ఐఐఎం లలో చదివి గణితం, ఆంగ్లంపై పట్టున్న వారికే లబ్ధి చేకూరుతోందన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో మిగతా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. -
రాజకీయ ప్రమేయం అవసరం
అధికార యంత్రాంగంపై ప్రధాని మోదీ {పజాస్వామ్యంలో అది అనివార్యం రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉంది అధికారులు ఒక బృందంగా పనిచేయాలి సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధాని ఉద్బోధ న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగంలో రాజకీయ ప్రమేయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రాజకీయ ప్రమేయాన్ని సుపరిపాలనకు ఆటంకాలుగా చూడరాదని అధికారులకు సూచించారు. రాజకీయ జోక్యానికి, ప్రమేయానికి తేడా ఉందని.. జోక్యం వల్ల వ్యవస్థ నాశనమయితే.. ప్రమేయం అవసరమూ, అనివార్యమూ అని ఆయన పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం, రాజకీయ ప్రమేయం చేయీ చేయీ కలిపి ప్రయాణిస్తాయి. ఈ దేశాన్ని మనం నడపాలంటే మనకు రాజకీయ జోక్యం అవసరం లేదు. కానీ రాజకీయ ప్రమేయం అవసరం, అనివార్యం. లేదంటే ప్రజాస్వామ్యం పనిచేయదు’’ అని చెప్పారు. ‘‘చట్టసభల సభ్యులను ప్రజలు ఎన్నుకొంటారు కాబట్టి.. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రమేయం అవసరం. అధికార వ్యవస్థ నుంచి అవరోధాలు, కష్టాలు అనే పదాలను తొలగించాల్సిన అవసరముంది’’ అన్నా రు. సుపరిపాలనకు అకౌంటబిలిటీ (జవాబుదారీతనం), రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత) అనే ‘ఆర్ట్’ అవసరమన్నారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉందని.. దానిని గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మొబైల్ పాలన చూసే రోజు ఎంతో దూరంలో లేదంటూ.. అధికార యంత్రాంగంలో సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాలకు ఊతమివ్వాల్సిన అవసరముందని చెప్పారు. దేశాన్ని ఏకీకరణ చేసిన తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్పటేల్ కృషిని గుర్తు చేస్తూ.. ఈనాడు సామాజిక, ఆర్థిక ఏకీకరణ అవసరమని పేర్కొన్నారు. అధికారులు విడివిడిగా పనిచేసే పద్ధతిని విడనాడి.. ఒక బృందంలా పనిచేయాలని కోరారు. సివిల్ సర్వీసెస్ విభాగాలన్నీ సంస్థాగత సమాచారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు.. సివిల్ సర్వీసెస్లో చేరాలనుకుంటున్న యువతతో సమయం గడపాలని.. ప్రభుత్వానికి ఉత్తమ నైపుణ్యం గలవారు లభించేలా చూడాలని సూచించారు. ఏడాదికి ఒకసారైనా కాలేజీ విద్యార్థులతో ముచ్చటించాలని చెప్పారు. ఈ సందర్భంగా 2012-13, 2013-14 సంవత్సరాలకు ప్రభుత్వ పరిపాలనలో ఉత్తమ ప్రతిభా అవార్డులను ప్రధాని ఆయా అధికారులకు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విలక్షణ సేవ చేసినందుకు గౌరవం పొందిన అధికారులకు అభినందనలు తెలుపుతూ.. అవార్డు పొందిన వారి నుంచి తెలుసుకోవాల్సింది, వారిని అనుకరించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ - టుమారో ఈజ్ హియర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రోబోల్లా బతకొద్దు.. కుటుంబంతో గడపండి... అధికారులు జీవిత ప్రాముఖ్యతకు విలువనివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. లేదంటే ఏదో ఒక ఫైలులో ఒక పేజీ లాగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఆందోళనలతో నిండిపోయిన జీవితం ఏదీ సాధించలేదు.. ప్రత్యేకించి మీరు దేశాన్ని నడపాల్సి ఉన్నపుడు! మీరు చక్కగా సమయపాలన చేస్తారు. కానీ.. మీ కుటుంబంతో మీరు నాణ్యమైన సమయం గడుపుతున్నారా? దయచేసి దీని గురించి ఆలోచించండి. రోబోల లాగా జీవించవద్దు.. మీ కుటుంబాలతో నాణ్యమైన సమయం గడపండి. మన జీవితాలు రోబోలుగా మారితే.. అది మొత్తం ప్రభుత్వంపైనా, వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. మీ జీవితాలు ఒక ఫైలు లాగా మారకూడదు. ఒక ప్రభుత్వం ఉంటే.. ఫైళ్లు ఉంటాయి. మరో ప్రత్యామ్నాయం లేదు. అది (ఫైలు) మీ రెండో అర్ధాంగి. మీరు జీవితం గురించి పట్టించుకోకపోతే.. అది ఫైళ్లలో చిక్కుకుపోతుంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉత్తేజంగా ఉండాలంటూ.. ‘‘మీరు అలా ఎందుకు కూర్చున్నారు? అంత సీరియస్గా ఉండాలా? ప్రపంచ భారాన్ని మోస్తున్నట్లు? నేను మిమ్మల్నేం కొత్త పని చేయమని అడగబోవట్లేదు...’’ అంటూ మోదీ చతురోక్తులు వేయటంతో అధికారులంతా నవ్వేశారు. అలాగే.. ‘‘మీరు బాగా చదువుతారు. ప్రపంచంలో ఉత్తములైన వారు రాసిన పుస్తకాలు చాలా చదివి ఉంటారు. ప్రాథమికంగా మీ స్వభావమే అది. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. కాలేజీలో ‘యూనియన్ బాజీ’లు (యూనియన్ పోటీలు) చేసే వారు ఇక్కడికి రారు. పుస్తకాల్లో కూరుకుపోయిన వాళ్లు ఇక్కడికి వస్తారు’’ అని వ్యాఖ్యానించటంతో అధికారులు ఘొల్లుమన్నారు. -
‘సీ-శాట్’ను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
తనను కలసిన ఆశావహ అభ్యర్థులకు జగన్మోహన్రెడ్డి హామీ హైదరాబాద్: సివిల్ సర్వీసు ప్రవేశ పరీక్షల్లో గణిత అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ప్రస్తుతపరీక్షా విధానంలో మార్పుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఆశావహ అభ్యర్థులు కోరారు. పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి వై ప్రదీప్రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ విద్యార్థి విభాగం నేత రఘునాథ్రెడ్డి నాయకత్వంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 మంది ఆశావహ అభ్యర్థులు సోమవారం జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. 2011 ముందు యూపీఎస్సీ అనుసరించిన పరీక్షా విధానం అందరికీ అవకాశాలు కల్పించేదిగా ఉందని వారు జగన్కు తెలిపారు. సీ శాట్ ఏర్పాటుతో గణితం, ఆంగ్లంలలో పట్టున్న వారికే సివిల్స్లో అవకాశాలొస్తున్నాయని వివరించారు. గ్రామీణ విద్యార్థులతోపాటు పట్టణ ప్రాంతాల్లో సాధారణ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. సీ-శాట్ విధానం...ఐఐటీ, ఐఐఎం వంటి కోర్సులు చేసిన వారికి లబ్ధి కలిగించేదిగా ఉందని, ఈ విధానం అమల్లోకొచ్చాక వెలువడిన సివిల్ సర్వీసు ఫలితాల్ని విశ్లేషిస్తే వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని వివరించారు. గతంలో ఆర్ట్స్, సైన్సు, కామర్స్, ఎకనమిక్స్, పాలిటీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర అన్నివర్గాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి వారివారి సామర్ధ్యాన్ని గుర్తించి సమానావకాశాలు కల్పించేలా సివిల్ సర్వీసు పరీక్షలు ఉండేవన్నారు. సీ-శాట్ వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు లబ్ధి కలుగుతుండగా, ఇతరులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయమై పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం కల్పించాలని వారు జగన్ను కోరారు. సీ-శాట్ను రద్దుచేసి పాత విధానంలోనే సివిల్ సర్వీసు పరీక్షలు నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. ఈ విషయాన్ని పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావిస్తామని జగన్...తనను కలసిన ప్రతినిధులకు హామీ ఇచ్చారు. -
'సగం హామీలు నెరవేర్చినా ఫర్వాలేదు'
న్యూఢిల్లీ: ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో సగం నెరవేర్చినా ఫర్వాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సుపరిపాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. 'సివిల్ సర్వీసెస్ డే' సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలు తమ పాలనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రశంసిస్తున్న ప్రజలు వచ్చే ఐదేళ్లలో హామీలు నెరవేర్చకుంటే చెప్పులు విసురుతారని పేర్కొన్నారు. వంద శాతం హామీలు అమలు చేయలేకపోయినా కనీసం 50 శాతమైనా చేస్తే ఫరవ్వాలేదన్నారు. పారదర్శక పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచుతామన్నారు. అధికారుల పనితీరును మెరుగు పరిచేందుకు పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. -
సివిల్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. జాట్లకు రిజర్వేషన్ కల్పించే వివాదం కోర్టులో ఉండగానే ఆదివారం రాత్రి యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 27 నుంచి మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించే అవకాశం ఉంది. యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల నోటిఫికేషన్లో జాట్ల విషయాన్ని పేర్కొనలేదు. గతంలోని యూపీఏ ప్రభుత్వం జాట్లకు కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వారిని ఓబీసీల్లో చేర్చింది. అయితే, దీనిపై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో కేంద్ర నిర్ణయం చెల్లుబాటుకాదని పేర్కొంటూ తుది తీర్పు వెలువరించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ తీర్పు వచ్చాకే ఫలితాలు వస్తాయని భావించగా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.inలో ఉంది. -
వ్యక్తిత్వంలో విజయానికి..
సివిల్స్- 2014 పర్సనాలిటీ టెస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధిస్తే..లక్షల్లో ఉండే పోటీని తట్టుకొని మలిదశ మెయిన్స్కు చేరుకున్నట్లే! మెయిన్స్ మెట్టు కూడా దాటితే అభ్యర్థితో పోటీకి నిలిచిన వారు లక్షల నుంచి వేలల్లోకి తగ్గినట్లే! చివరి అడుగైన పర్సనాలిటీ టెస్ట్లో విజయం సాధిస్తే కల సాకారమైనట్ల్లే! సివిల్స్-2014 ఇంటర్వ్యూలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన పర్సనాలిటీ టెస్ట్లో విజయానికి ఉపయోగపడే మార్గాలు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. మరోవైపు పర్సనాలిటీ టెస్ట్కు సిద్ధమవుతున్నారు. రెండు దశల రాత పరీక్షలలో(సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్) విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ పేరిట యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు దాదాపు 20 కేంద్ర సర్వీసుల పోస్టుల్లో నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)ది కీలక పాత్ర. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకూ.. దాదాపు సంవత్సరానికిపైగా సాగే సివిల్స్ ఎంపిక క్రతువులో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమించి ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. కొంతమంది మొదటిసారే ఇంటర్వ్యూలో విజయం సాధిస్తుండగా.. మరికొందరు చివరి అటెంప్ట్లో కానీ గెలుపు గమ్యం చేరుకోలేకపోతున్నారు. వ్యక్తిత్వాన్ని, మానసిక పరిణితిని పరీక్షించే పర్సనాలిటీ టెస్ట్లో చిన్నపాటి పొరపాట్లతో అవకాశాలు చేజార్చుకుంటున్నారు. అయితే కొద్దిపాటి మెళకువలతో ఇంటర్వ్యూలో ఉత్తమంగా రాణించి కలలను సాకారం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సానుకూల దృక్పథం: సివిల్స్ ఇంటర్వ్యూలో విజయానికి మొదటి సాధనం.. సానుకూల దృక్పథం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, ప్రాంతీయ మీడియంలలో చదివిన అభ్యర్థుల్లో ఆశించిన స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండటంలేదు. మెట్రో నగరాలు, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణులతో పోల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఇంటర్వ్యూలో రాణించగలమా? లేదా? అనే సందేహాన్ని విడనాడాలి.ప్రిలిమ్స్లో లక్షల పోటీని, మెయిన్సలో వేలమందిని ఎదుర్కొని 1:2 లేదా 1:2.5 పోటీ వరకు వచ్చాం కదా.. ! అనే ఆత్మస్థైర్యం, సానుకూల వైఖరులను అలవర్చుకోవాలి. స్వతహాగా బిడియస్తులైతే ఇప్పటినుంచే బృంద చర్చల ద్వారా ఆ సమస్యను అధిగమించాలి. పర్సనాలిటీ టెస్ట్.. ఉద్దేశం: సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు అసలు పర్సనాలిటీ టెస్ట్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థి భావవ్యక్తీకరణ, నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, ఎదుటివారి అభిప్రాయాలను స్వీకరించగలిగే మనస్తత్వం, సామాజిక సమస్యలపై అవగాహన వంటి లక్షణాలను పరీక్షించడం. ముఖ్యంగా అభ్యర్థులకు భవిష్యత్తు లక్ష్యం గురించి స్పష్టత ఉండాలి. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడికల్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల గ్రాడ్యుయేట్లు ఎక్కువగా సివిల్స్ వైపు వస్తున్నారు. దాంతో భవిష్యత్తు లక్ష్యం గురించి అడుగుతున్నారు. ఓ ఎంఎన్సీలో మూడేళ్లుగా పనిచేస్తూ, గతేడాది తొలి అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థిని అడిగిన ప్రశ్న.. ‘మీరు ఎంతో పేరున్న ఇన్స్టిట్యూట్లో బీటెక్ చదివారు. ప్రస్తుతం లక్షల్లో వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకోవడానికి కారణం?’ ఈ ప్రశ్న కు ఆ అభ్యర్థి చెప్పిన సమాధానంతో బోర్డ్ సభ్యులు సంతృప్తి చెందలేదు. కారణం.. సివిల్ సర్వీసెస్ ద్వారా సంఘంలో హోదా లభిస్తుందని, ఉన్నత స్థానంలో ఉండొచ్చని చెప్పడమే! అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు సామాజిక అభ్యున్నతికి దోహదపడేందుకు సమున్నత మార్గంగా సివిల్ సర్వీసెస్ నిలుస్తుందనే భావం వచ్చేలా, తమ వ్యక్తిగత లక్ష్యం కూడా అదే అని బోర్డును ఒప్పించే విధంగా సమాధానం చెప్పాలి. నిర్ణయాత్మకత, సమయస్ఫూర్తి, భావవ్యక్తీకరణ: సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్లో రాణించేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తి, భావ వ్యక్తీకరణ. ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసే ఉద్యోగిగా సివిల్ సర్వెంట్కు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎంతో అవసరం. ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి చూడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు, స్వీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అధికారులను మెప్పించే నేర్పు వంటి లక్షణాలు కూడా కలిగుండాలి. ఈ లక్షణాలు ప్రతిబింబించేలా ఇంటర్వ్యూ సమయంలో వ్యవహరించాలి. పరిపాలన, నిర్వహణకు సంబంధించి నిర్ణయాత్మక శక్తి, సమయస్ఫూర్తి సివిల్ సర్వెంట్లకు ప్రధాన లక్షణంగా నిలుస్తుంటే.. భావ వ్యక్తీకరణ సామర్థ్యం మరో కీలకమైన అవసరం. తాము చెప్పే విషయం స్పష్టంగా, సూటిగా, ఎలాంటి తడబాటు లేకుండా చెప్పగలగాలి. సంభాషణలో అభ్యర్థి మాట్లాడే పదాలు కూడా ప్రధానమే. అనవసరపు పదాడంబరాల జోలికి వెళ్లకూడదు. సరళమైన భాషలోనే తమ అభిప్రాయాలను చెప్పాలి. ఇంగ్లిష్ దినపత్రికలు లేదా వ్యాసాల్లోని పదాలను వినియోగించాలని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే.. అలాంటి వ్యాసాలు లేదా ఎడిటోరియల్స్ రాసేది సంబంధిత రంగంలో నిపుణులని గుర్తించాలి. అభ్యర్థులు ‘నేర్చుకునే’ కోణంలో ఆ స్థాయిలో ముందుకు సాగడం సబబే. కానీ.. కీలకంగా నిలిచే 20 నుంచి 25 నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో ప్రయోగాలు చేయకూడదనేది నిపుణుల అభిప్రాయం. వాక్చాతుర్యం.. సమతుల్యత: ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ శైలి మారుతోంది. అభ్యర్థుల బయోడేటా, హాబీలకు సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడుగుతుండగా.. మిగతా ప్రశ్నలు చర్చకు దారితీసే విధంగా ఉంటున్నాయి. గతేడాది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఒక చిన్నపాటి డిబేట్కు దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే అభ్యర్థుల్లోని వాక్చాతుర్యం, చర్చించే నైపుణ్యం, ఆయా అంశాలపై వారికున్న వాస్తవ అభిప్రాయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ‘మీ అభిప్రాయం ఏంటి?’ వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పు డు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చక్కటి వాక్పటిమతో ఆకట్టుకునే రీతిలో సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయా విభాగాల్లో అవినీతి తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు మరింత సమతుల్యత పాటించాలి. నిందాపూర్వకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు. సమస్యను వివరిస్తూనే పరిష్కార మార్గాలను సూచించే విధంగా స్పందించాలి. అప్పుడే బోర్డ్ సభ్యుల మన్ననలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బయోడేటా.. డ్రస్సింగ్.. విషింగ్: పర్సనాలిటీ టెస్ట్ విషయంలో అభ్యర్థులు తమ బయోడేటాలో పేర్కొన్న అంశాలపైనా కసరత్తు చేయాలి. తద్వారా నాణ్యమైన సమాధానాలు మదిలో నిక్షిప్తం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి. చాలామంది చేసే పొరపాటు ‘హాబీ’గా పేర్కొన్న అంశం గురించి లోతైన అవగాహన పెంచుకోకపోవడం! అభ్యర్థి హాబీ గురించి సుదీర్ఘ చర్చ జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదా: సినిమాలు చూడటం ఇష్టం అని పేర్కొంటే.. సినిమాల ఆవిర్భావం నుంచి ఇటీవల ఆస్కార్ విజేతల వరకు ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. డ్రెస్సింగ్.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్కు హాజరవుతున్న అభ్యర్థులు గుర్తించాల్సిన అంశమిది. కాబట్టి మొదటగా డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హుందాతనం ఉండాలి తప్ప.. ఆడంబరం పనికిరాదు. పురుష అభ్యర్థులు లేత రంగు షర్ట్లు, ముదురు రంగు ప్యాంటులు, షూస్ ధరించడం మంచిది. సూట్ ధరించే విషయంలో ఆయా అభ్యర్థులు తమ అలవాటును బట్టి వ్యవహరించాలి. మహిళా అభ్యర్థులు చీరలు ధరించడం మంచిది. విషింగ్ అంటే.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాక బోర్డ్ సభ్యులను పలకరించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సభ్యులందరినీ చూస్తూ అభివందనం చేయడంపై ప్రాక్టీస్ చేయాలి. మన సంప్రదాయం ఉట్టిపడేలా నమస్తే అని సంబోధించడం మేలు. స్వస్థలం మొదలు అన్నిటిపై అవగాహన సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ స్వస్థలం నుంచి సమకాలీన పరిణామాల వరకూ.. అన్ని అంశాలపై సమాచార సేకరణ చేసుకోవాలి. తమ స్వస్థలం చారిత్రక ప్రాశస్త్యం కలిగుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. అదే విధంగా అభ్యర్థుల ఇంటిపేర్లు కూడా కొన్ని సందర్భాల్లో చర్చకు దారి తీస్తాయి. అదే ఇంటిపేరు కలిగిన ప్రముఖులు, వారు చేసిన సేవలు వంటి వాటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయి. ఇంటర్వ్యూల శైలి విభిన్నంగా మారుతోంది. ప్రధానంగా అభ్యర్థుల్లోని పాలనాదక్షతను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించి మీరే కలెక్టర్ అయితే ఏం చేస్తారు? వంటివి. అదేవిధంగా ఇటీవల కాలంలో మన దేశం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి ఉద్దేశాలు వంటి వాటిపైనా దృష్టిసారించాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం గల అభ్యర్థులు.. ఇంటర్వ్యూ అంటే ఆందోళన పోగొట్టుకోవాలి. ఏ బోర్డ్ సభ్యులైనా అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా వ్యవహరిస్తారు. దీన్ని గమనించి ముందుగా మానసికంగా సంసిద్ధత పొందితే పర్సనాలిటీ టెస్ట్లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లక్ష్యంపై ప్రశ్నలకు స్పష్టత సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఉండాలి. సివిల్స్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల్లో నూటికి 90 శాతం మంది చెప్పే సమాధానం. అయితే ఇంటర్వ్యూ ఆసాంతం ఇదే ప్రశ్న-సమాధానంపై జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు, ఇప్పటికే పలు ఎంఎన్సీల్లో మంచి హోదాల్లో లక్షల వేతనంతో పని చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరహా అభ్యర్థులు తమ అకడమిక్ నాలెడ్జ్ను పరిపాలన విభాగాల్లో అన్వయించేందుకు గల మార్గాలను తెలియజేసే విధంగా నైపుణ్యం పొందాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలను దృష్టిలో పెట్టుకుని డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఐసీటీ వంటి విధానాల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు తమ నైపుణ్యాలు ఉపయోగపడతాయనే రీతిలో సమాధానాలు ఇవ్వాలి. ఇక వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఎదురవుతున్న మరో ప్రశ్న.. మీరు సేవే లక్ష్యంగా సివిల్స్వైపు రావాలనుకుంటున్నారా?ఎంపిక కాకపోతే ఏం చేస్తారు? దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంపిక కాకపోయినా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పడం మంచిది. అంతేతప్ప ఎంపిక కాకపోతే పూర్వ వృత్తికి వెళతాననే సమాధానాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్పై పట్టు సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించాలి. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, అంతర్జాతీయ ఒప్పందాలు; పలు ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశం, నేపథ్యం, క్షేత్ర స్థాయిలో అమలు తీరుతెన్నులు, సమస్యలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. ఈసారి వరల్డ్ కప్ క్రికెట్ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ప్రాంతీయ ప్రాధాన్యత అంశాల్లో భాగంగా రెండు ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పథకాలు, అవి ఆయా రాష్ట్రాల పురోగతికి దోహదం చేసే విధానం, ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలు (నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ తదితర)పై పరిజ్ఞానం పొందాలి. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ మంచి సర్వీస్ రావాలంటే.. సివిల్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేసే 20కు పైగా కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థులు తమకు నచ్చిన సర్వీస్లో స్థానం పొందడానికి పర్సనాలిటీ టెస్ట్లో చూపే ప్రతిభ కీలకంగా మారుతోంది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షలో అధిక మార్కులు సాధించినా, ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పొందడం వల్ల తుది జాబితాలో నిలుస్తున్నారు. కానీ తమకు నచ్చిన సర్వీస్కు ఎంపిక కాలేకపోతున్నారు. దీన్ని గుర్తించి మెయిన్స్లో బాగా రాశాం కదా? అనే ధోరణితో ఇంటర్వ్యూ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పర్సనాలిటీ టెస్ట్లో కూడా ఉత్తమంగా రాణించేందుకు కసరత్తు చేయాలి. ఇటీవల కాలంలో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ సంబంధిత ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక విభాగాధిపతిగా తమ నిబద్ధత, నిజాయతీని ప్రతిబింబించే విధంగా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రస్తుత సమయంలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. - కె.శశాంక, సివిల్స్-2012, ఆల్ ఇండియా ర్యాంకు 16 ఆ రోజు వ్యవహరించే శైలే కీలకం సివిల్స్ లక్ష్యం దిశగా ఎన్నేళ్లు కష్టపడినా.. ఇంటర్వ్యూ రోజు 25 నుంచి 30 నిమిషాలు పాటు వ్యవహరించే శైలి ఎంతో కీలకం. ఆ సమయాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించుకుంటే సానుకూల ఫలితాలు అందుకోవచ్చు. తమ విషయ పరిజ్ఞానం, తమ నైపుణ్యాలను సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజ సేవకు ఎలా వినియోగిస్తారో బోర్డ్ సభ్యులను మెప్పించేలా చెప్పగలగాలి. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. తమ పర్సనాలిటీ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా అకడమిక్ నేపథ్య సబ్జెక్ట్ నాలెడ్జ్ను పునశ్చరణ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దినపత్రికలు చదవాలి. - కృత్తిక జ్యోత్స్న, సివిల్స్-2013 ఆల్ ఇండియా ర్యాంకు 30 మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్లో విజయసాధనకు మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మంచి ఉపకరణాలు. మాక్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు డ్రెస్ కోడ్ మొదలు కంటెంట్ పరంగా మెరుపరచుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు లభిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్ తో తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. - జె.కీర్తి, సివిల్స్-2012 ఆల్ ఇండియా ర్యాంకు 89 సివిల్స్ ఇంటర్వ్యూ- దృష్టి సారించాల్సిన అంశాలు మేక్ ఇన్ ఇండియా స్కీం భూ సేకరణ చట్టంలో మార్పులు జనధన్ యోజన ఒబామా పర్యటన - భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం ఇన్సూరెన్స్లో ఎఫ్డీఐల పెంపు - పర్యవసానాలు అంతర్జాతీయ ఒప్పందాలు {పణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు- ఉద్దేశాలు అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో పెరుగుతున్న అంతర్గత ఉగ్రవాదం- ఇతర దేశాలపై ప్రభావం శాసన, పరిపాలన వ్యవస్థల్లో తరచుగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి రావడానికి కారణాలు జాతీయ స్థాయి విద్యా సంస్థల విస్తరణ నిర్ణయం సివిల్స్ 2012, 2013 పర్సనాలిటీ టెస్ట్ కటాఫ్స్ 275 మార్కులకు నిర్వహించే సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్లో 2012, 2013 కటాఫ్స్ వివరాలు.. సంవత్సరం జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ 2012 211 208 209 197 2013 236 229 210 205 సివిల్స్ - 2014 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్: మొత్తం పోస్ట్లు - 1291 {పిలిమ్స్కు హాజరైంది - 4,51,602 మెయిన్స్కు అర్హత సాధించింది - 16,993 ఇంటర్వ్యూకు అర్హత లభించేది - సుమారు 2,500 -
తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం!
* మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నిండుకున్న ప్రభుత్వ లోగో సర్టిఫికెట్లు * ధ్రువీకరణ పత్రాల్ని తెల్లకాగితాలపై ప్రింట్ చేసి ఇస్తున్న వైనం * నిర్వాహకుల మొర ఆలకించని జిల్లా కార్యాలయ అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులభంగా, వేగంగా అందించే పౌరసేవల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా రెవెన్యూ తదితర సేవలందించేందుకు ప్రభుత్వం మీ సేవ, ఈ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పద్ధతిలో సేవలందించడమే వీటి ప్రధాన లక్ష్యం. కానీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి తలకిందులైంది. ఆన్లైన్ పద్ధతిలో కోరిన ధ్రువీకరణ వస్తున్నప్పటికీ.. అవన్నీ కంప్యూటర్ వరకే పరిమితమవుతున్నాయి. వాటిని ప్రభు త్వ ధ్రువీకరణతో ఇవ్వడం ఆయా కేంద్రాల నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ లోగోతో ముద్రించిన ధ్రువీకరణ పత్రాలు మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 526 ఆన్లైన్ కేంద్రాలున్నాయి. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 165 కేంద్రాలుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 139 ఆన్లైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 222 ఈసేవ కేంద్రాల ద్వారా పౌరసేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రధానంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, ఈసీ తదితర ధ్రువీకరణ పత్రాలన్నీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా పొందుతున్నారు. కానీ వారం రోజులుగా జిల్లాలోని పలు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో తెలంగాణ లోగోతో ఉన్న సర్టిఫికెట్లు నిండుకున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరిన్ని దరఖాస్తులివ్వాలంటూ జిల్లా కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు. ఉపకార‘వేతలు’:2014-15 సంవత్సరానికి సంబ ంధించి ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టింది. వార్షిక సంవత్సరం చివర్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావడం, మరోైవె పు పరీక్షలు సైతం ముంచుకొస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితిల్లో మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నూతన కుల, ఆదాయ ధ్రువీకరణ కోసం అర్జీలు పెట్టుకోగా.. నిర్వాహకులు సర్టిఫికెట్లు లేవం టూ సమాధానం చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. దరఖాస్తుకు గడువు ముం చుకొస్తుండగా.. కుల, ఆదాయ ధ్రువీకరణ లేకపోవడంతో విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఈసీలు, పహానీల అవసరం భారీగా ఉంటుంది. కానీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు నిండుకోవడంతో తెల్లకాగితాలపైనే పొందాల్సివస్తోందని యా చారం గ్రామస్తుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. -
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివా...
సక్సెస్ స్టోరీ ఇంజనీరింగ్ పూర్తవగానే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో మంచి ఉద్యోగం లభించింది. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లోనూ ప్రతిభ చూపి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో కొలువు సొంతం చేసుకున్నాడు. అయితే తనకోసమే కాకుండా సమాజానికీ సేవ చేయాలని భావించాడు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎంచుకున్నాడు. రెండుసార్లు ప్రిలిమ్స్, మెయిన్స్లో నెగ్గి ఇంటర్వ్యూ తర్వాత వెనుదిరిగినా నిరాశ చెందలేదు. ఈసారి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.. హైదరాబాద్ కుర్రాడు కె. భార్గవ్ తేజ. అతని సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే.. పుట్టి పెరిగింది.. హైదరాబాద్లోనే. నాన్న రాధా మనోహర్రావు బీహెచ్ఈఎల్లో మేనేజర్. అమ్మ మాలతి గృహిణి. అక్క యూఎస్లో ఉంటోంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఐఎఫ్ఎస్లో విజయం సాధించగలిగాను. ఫస్ట్ అఛీవ్మెంట్! బీహెచ్ఈఎల్లోని ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి వరకు చదివాను. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడిని. ఇంటర్లో 97 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్లో 1900 ర్యాంకు సొంతం చేసుకుని 75 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. చిన్నతనంలోనే బీజం! ఉన్నతస్థాయి ఉద్యోగులతోనే సమాజంలో కోరుకున్న మార్పు సాధ్యమవుతుంది. అందుకే అత్యున్నత సర్వీసుల్లో చేరాలని చిన్నతనంలోనే లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. దానికనుగుణంగానే సివిల్స్ను ఎంచుకున్నాను. విస్తృత పోటీని తట్టుకుని.. కఠినమైన ప్రిలిమ్స్, మెయిన్స్లో నెగ్గి రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు చేరుకోగలిగాను. కానీ ఫైనల్ కటాఫ్లో స్వల్ప తేడాతో వెనుదిరిగాను. సివిల్స్కు ప్రిపేరయ్యే క్రమంలో అటవీ సంరక్షణపై ఆసక్తి పెరిగింది. అందుకే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను రాశాను. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను. సాఫ్ట్వేర్ టు ఫారెస్ట్ సర్వీస్ బీటెక్ పూర్తిచేసిన తర్వాత టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో ఉద్యోగం సొంతం చేసుకున్నాను. మంచి భవిష్యత్తుతోపాటు సమాజంలో మనం కోరుకునే మార్పు, అభివృద్ధి సివిల్ సర్వీసెస్తోనే సాధ్యం. అన్నింటికంటే ప్రధానంగా సొసైటీకి సేవ చేయాలనే నా సంకల్పానికి సివిల్స్ సరిగ్గా సరిపోతుంది. అందుకే సివిల్స్ ఎంచుకున్నాను. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ రెండింటికీ ప్రిలిమ్స్ ఉమ్మడిగానే ఉంటుంది. కాబట్టి అధిక స్కోరు లక్ష్యంగా ప్రిపేరయ్యాను. అప్పుడే ప్రిలిమ్స్ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఇంజనీరింగ్, మ్యాథ్స్ నేపథ్యం ఉంది కాబట్టి పేపర్ -2 (సీశాట్)లో ఎక్కువ మార్కులు సాధించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. పేపర్ -1 జనరల్ స్టడీస్ విషయంలో సివిల్స్, ఐఎఫ్ఎస్ మెయిన్స్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమయ్యాను. ఆప్షన్స్.. ఎంపిక ఐఎఫ్ఎస్ ప్రిపరేషన్లో ఆప్షన్స్ ఎంచుకోవడంలో మొదటిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అకడమిక్ విద్యలో అభ్యసించని ఏవైనా రెండు ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి వచ్చింది. దాంతో వివిధ ఆప్షనల్స్కు సంబంధించిన పూర్తి సిలబస్ను పరిశీలించాను. వాటిల్లో జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కూ ఉపయుక్తంగా ఉంటూ, భవిష్యత్తులో ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా రాణించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకునేందుకు వీలైన ఆప్షనల్స్ను ఎంచుకున్నాను. అవే.. ఫారెస్ట్రీ, జియాలజీ. రిఫరెన్స్ బుక్స్.. సెల్ఫ్ నోట్స్ ఫారెస్ట్రీ ఆప్షనల్ కోసం ఫారెస్ట్రీ బుక్ - మణికందన్, జియాలజీ ఆప్షనల్ కోసం బేసిక్స్ ఆఫ్ జియాలజీ - పి.ముఖర్జీ బుక్స్ చదివాను. వివిధ అంశాల ప్రాథమిక, విస్తృత అవగాహన కోసం మాత్రమే ఈ బుక్స్ను ఉపయోగించుకున్నాను. కోచింగ్ తీసుకోలేదు. ఇంటర్నెట్ను ఉపయోగించి వివిధ ఉప అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్లతో సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కొత్త సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడింది. నా దృష్టిలో ఇంటర్నెట్ మాత్రమే బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. మెయిన్స్.. వ్యూహాలు మెయిన్స్లో ప్రధానంగా సమయపాలన ఎంతో ప్రధానం. అడిగిన ప్రశ్నలకు సూటిగా, వర్డ్ లిమిట్కు మించకుండా సమాధానాలు రాసేలా ప్రిపేరయ్యాను. చాలా ప్రశ్నలకు పాయింట్ల వారీగా సమాధానాలు రాయడమే కాకుండా వీలైనన్ని ఎక్కువ పటాలను గీశాను. చిన్నతనం నుంచే వేగంగా రాయడం అలవాటు. అది మెయిన్స్లో ఎంతగానో ఉపయోగపడింది. ఇంటర్వ్యూ అప్పటికే రెండుసార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న అనుభవంతో ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. గతంలో జరిగిన పొరపాట్లు, లోపాలను సరిదిద్దుకున్నాను. కొన్నాళ్లు ఇంజనీరింగ్ సబ్జెక్టులను, వర్క్ ప్రొఫైల్ తదితర అంశాలను అధ్యయనం చేశాను. అభ్యర్థుల్లోని నిజాయతీ, సమాజం, పరిసరాలపై వారికుండే శ్రద్ధ తదితర అంశాలను ఇంటర్వ్యూ చేసేవారు పరిగణనలోకి తీసుకుంటారు. అందుకనుగుణంగానే వారి ప్రశ్నల సరళి ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రొఫైల్, ఆసక్తులు అలవాట్లకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో పనిచేస్తున్నందున టాక్సేషన్ అంశాలపై కూడా ఎక్కువగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అటవీ అంశాలపై చర్చలా ఇంటర్వ్యూ సాగింది. నా భావాలను పూర్తిగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభించింది. స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ హార్డ్ వర్క్! ఐఎఫ్ఎస్ రాయాలనుకునేవారు పక్కా ప్రణాళికతో వీలైనంత ముందుగానే ప్రిపరేషన్ను ప్రారంభించాలి. ప్రిలిమ్స్లో సివిల్స్ కటాఫ్ కంటే ఐఎఫ్ఎస్ కటాఫ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి పేపర్-2లో ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్ను దృష్టిలో ఉంచుకుని ప్రిలిమ్స్కు ప్రిపేరవ్వాలి. రెగ్యులర్గా చేతితో రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. లోపాలుంటే సరిదిద్దుకోవాలి. స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ హార్డ్ వర్క్! -
సివిల్స్-2015 సక్సెస్ ప్లాన్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్.. దేశ అత్యున్నత సర్వీసుల్లోకి ప్రవేశం కల్పించే ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తోంది. సంప్రదాయ డిగ్రీ మొదలు టెక్నికల్ గ్రాడ్యుయేట్ల వరకు.. ఫ్రెషర్స్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకూ.. దేశవ్యాప్తంగా లక్షల మంది సివిల్స్కు పోటీపడతారు. లక్షల ప్యాకేజీల కార్పొరేట్ కొలువులను కాదనుకొని.. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమయ్యేవారు ఎందరో! ఉద్యోగ భద్రత.. సంఘంలో గౌరవప్రదమైన హోదా.. సమాజానికి సేవ చేసే అవకాశం.. వెరసి సివిల్స్కు పోటీ పెరుగుతోంది. తీవ్ర పోటీ దృష్ట్యా ఔత్సాహికులుదీర్ఘకాలిక పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తే సక్సెస్ సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2015 క్యాలెండర్ను యూపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో.. అభ్యర్థులు అనుసరించాల్సిన విధానాలు, విజయానికి మార్గాలు!! 200 రోజులు.. ప్రిలిమ్స్-2015కు అందుబాటులో ఉన్న సమయం.. 100 రోజులు.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు మధ్య లభించే సమయం.. సిలబస్పై పట్టు.. తొలి మెట్టు మానసిక సంసిద్ధత కోణంలో సాధించాలనే సంకల్పం ప్రధాన పాత్ర వహిస్తే.. పరీక్ష ప్రిపరేషన్ పరంగా సిలబస్పై పట్టు సాధించడం తొలి మెట్టు. ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభానికి ముందుగా యూపీఎస్సీ నిర్దేశించిన సిలబస్ను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి అవగాహన పొందాలి. కేవలం ప్రిలిమ్స్ సిలబస్నే కాకుండా మెయిన్స్ సిలబస్ను కూడా పరిశీలించాలి. ఫలితంగా రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలపై ఏకకాలంలో ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. అదేవిధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీనివల్ల ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ; ప్రశ్నలు అడుగుతున్న తీరు; అభ్యర్థులకు తాము బలహీనంగా ఉన్న అంశాలు; మరింతగా దృష్టి సారించాల్సిన అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ఇది క్రమబద్ధమైన ప్రిపరేషన్కు దోహదపడుతుంది. ఆప్షనల్.. ముందుగానే స్పష్టత మెయిన్స్లో రెండు పేపర్లుగా ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో అభ్యర్థులు ముందుగానే స్పష్టతకు రావాలి. అందుకోసం వ్యక్తిగత అభిరుచి, అకడమిక్ నేపథ్యం, స్కోరింగ్ ఆప్షనల్, మెటీరియల్ లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అభ్యర్థులు తమ విద్యా నేపథ్యంతో సంబంధంలేని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ; లిటరేచర్; ఫిలాసఫీ వంటి సబ్జెక్ట్లను ఎంచుకొని విజయం సాధిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్ల సిలబస్లో పేర్కొన్న అంశాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉండటం, మెటీరియల్ లభ్యతే అందుకు కారణంగా చెప్పొచ్చు. అయితే, అభ్యర్థులు ఆప్షనల్ ఎంపికలో తమ ఆసక్తికి కూడా ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్తో ప్రారంభించి ఇటీవల కాలంలో సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే.. జనరల్ స్టడీస్, కాంటెంపరరీ ఇష్యూస్కు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ స్టడీస్తో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. దీనివల్ల అన్ని విభాగాలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే వీలు లభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు కలిసొచ్చే మరో అంశం.. డిస్క్రిప్టివ్ అప్రోచ్ను అనుసరించడం. దీన్ని గుర్తించి ఒక సబ్జెక్ట్ నిర్దిష్ట అంశాన్ని చదివేటప్పుడు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఒక అంశం నుంచి విభిన్న కోణాల్లో స్పృశిస్తూ చదవాలి. అప్పుడు ప్రిలిమ్స్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు; మెయిన్స్లోని డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. వన్ షాట్ టు బర్డ్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ను ‘వన్ షాట్ టు బర్డ్స్’ తీరులో సాగించాలి. అంటే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ ఒకే సమయంలో పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ప్రిలిమ్స్లోని జనరల్ స్టడీస్; మెయిన్స్లోని జీఎస్ పేపర్లలో పేర్కొన్న అంశాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్ పరీక్ష-సమాధానం శైలిని పరిగణనలోకి తీసుకుని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం వల్ల సమయం ఎంతో ఆదా అవుతుంది. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు మధ్య ఉన్న తక్కువ వ్యవధిలో కొత్తగా మెయిన్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ కోణంలో చదివితే రెండు పరీక్షల మధ్య సమయం రివిజన్కు ఉపయోగపడుతుంది. కోర్ + కాంటెంపరరీ అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. కోర్ టాపిక్స్ను సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకోవడం. ఇటీవల కాలంలో పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వంటి అంశాల నుంచి అడిగే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా అంతర్లీనంగా కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు తాజాగా ఏదైనా రాజ్యాంగ సవరణ చేపడితే.. ఆ సవరణకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ అంటే కేవలం కొశ్చన్-ఆన్సర్ అనే పద్ధతిలో ప్రిపరేషన్కు స్వస్తి పలికి; కోర్ సబ్జెక్ట్తో సమన్వయం చేసుకుంటూ చదవాలి. గ్రూప్-1తో సమన్వయం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సివిల్స్ ప్రిపరేషన్ను గ్రూప్-1తో సమన్వయం చేసుకోవచ్చు. త్వరలో తెలంగాణలో గ్రూప్-1 ప్రకటన వెలువడొచ్చు. ఈ పరీక్షలో పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి సివిల్స్లోనూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్ పేపర్-2 ప్రత్యేకంగా అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సింది ప్రిలిమ్స్ పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్). డెసిషన్ మేకింగ్; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ విభాగాలతో ఉండే ఈ పేపర్లో విజయానికి కొంత కసరత్తు చేయాలి. టెన్త, +2 స్థాయిలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. ఫలితంగా బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్లో రాణించొచ్చు. అదేవిధంగా ఇంగ్లిష్ పత్రికల ఎడిటోరియల్స్ చదవడం కూడా లాభిస్తుంది. అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో.. ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు-లక్ష్యాలు-ఉద్దేశాలపై అవగాహన ఉండాలి. జాతీయ స్థాయిలో కొత్తగా ప్రారంభించిన పథకాలు-లక్ష్యాలపై అవగాహన పెంచుకోవాలి. సమయపాలన అభ్యర్థులకు టైం ప్లానింగ్లో స్పష్టత ఉండాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే..- జూన్ నెలాఖరుకు ప్రిలిమ్స్ (మెయిన్స్ కోణంలోనూ) ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ సగటున 8 గంటలు చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. * జూలై నుంచి ప్రిలిమ్స్ పరీక్ష తేదీ (ఆగస్ట్ 23) వరకు పూర్తిగా రివిజన్కు కేటాయించాలి. * ఈ రెండు నెలలు మెయిన్స్ ప్రిపరేషన్కు విరామం ఇచ్చి.. పూర్తిగా ప్రిలిమ్స్పైనే దృష్టి కేంద్రీకరించాలి. * ప్రిలిమ్స్ మరుసటి రోజు నుంచే డిసెంబర్ 18న మొదలయ్యే మెయిన్స్కు ఉపక్రమించాలి. * ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో లభించే దాదాపు నాలుగు నెలల సమయంలో ఆప్షనల్ సబ్జెక్ట్లోని రెండు పేపర్లకు, జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లకు సమ ప్రాధాన్యం లభించే విధంగా టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఇలా.. ఇప్పటి నుంచే ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే సివిల్స్ లో విజయావకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. సివిల్స్-2015 షెడ్యూల్ ప్రకటన తేదీ: మే 16, 2015 దరఖాస్తు చివరి తేదీ: జూన్ 12, 2015 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 23, 2015 మెయిన్స్ పరీక్షలు: డిసెంబర్ 18 నుంచి (5 రోజులు) సివిల్ సర్వీసెస్ పరీక్ష తీరుతెన్నులు మొత్తం మూడు దశల్లో (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్) ఉండే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్లు రాత పరీక్షలు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్-1: జనరల్ స్టడీస్ - 200 మార్కులు పేపర్-2: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 200 మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్-1: జనరల్ ఎస్సే పేపర్-2 : జనరల్ స్టడీస్-1(ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ) పేపర్-3: జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్) పేపర్-4: జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) పేపర్-5: జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్) పేపర్-6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1 పేపర్-7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2 ప్రతి పేపర్కు 250 మార్కులు చొప్పున 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ-275 మార్కులు)కు ఎంపిక చేస్తారు. రెగ్యులర్ ప్రాక్టీస్ సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఇప్పటి నుంచే ఎలాంటి విరామం లేకుండా రెగ్యులర్గా ప్రిపరేషన్ సాగించాలి. చదివే అంశాలకు సంబంధించి రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యం. ఇది మెయిన్స్లో కలిసొస్తుంది. అంతేకాకుండా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా లాభిస్తుంది. నిర్దిష్ట యూనిట్ పూర్తి కాగానే అందులో మోడల్ కొశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం, ఇందుకోసం సమయాన్ని నిర్దేశించుకోవడం వంటి టెక్నిక్స్ అనుసరించాలి. మెటీరియల్ ఎంపిక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సీనియర్లు, ఇతర మార్గాల ద్వారా సరైన మెటీరియల్ను ఎంపిక చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకునే ముందు అందులో.. సిలబస్ మేరకు అన్ని అంశాలు కవరయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా మెటీరియల్ ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితం ఆశించొచ్చు. - శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం ఇటీవల కాలంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్స్-2015 అభ్యర్థులు.. జూలై-2015కు ముందు ఒక సంవత్సర కాలంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విజయవంతమైన శాటిలైట్ ప్రయోగాలు, అంతర్జాతీయ ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు సబ్జెక్ట్పై అవగాహనతోపాటు పరీక్షలో రాణించే విధంగా మాక్ టెస్ట్లకు హాజరవ్వడం కూడా లాభిస్తుంది. - వి. గోపాలకృష్ణ,డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సివిల్స్ విజయంలో రైటింగ్, షార్ట్ నోట్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చదివిన ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. అదేవిధంగా మెయిన్స్ కోణంలో రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తం. పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా సమాధానాలు రాసే విధంగా సిద్ధమవ్వాలి. జనరల్ ఎస్సేకు దిన పత్రికల్లోని ఎడిటోరియల్స్, యోజన వంటివాటిలో వ్యాసాలు చదివి ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. - కృత్తిక జ్యోత్స్న, 30వ ర్యాంకర్, సివిల్స్-2014 -
విజయానికి ‘వర్తమానం’!
వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే సివిల్ సర్వీసెస్ పరీక్షనైనా.. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వంటి మేలిమి ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు ఉపకరించే గ్రూప్స్ పరీక్షల్లోనైనా విజయానికి ‘వర్తమానం’పై పట్టు సాధించాల్సిందే! ‘గ్లోబల్ గ్రామ’ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిందే! ఇంతటి కీలకమైన కరెంట్ అఫైర్స్పై స్పెషల్ ఫోకస్.. కరెంట్ అఫైర్స్లో సమకాలీన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ పరిణామాలుంటాయి. అంతర్జాతీయ అంశాల్లో వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారి వివరాలు, సదస్సులు, ఆందోళనలు, ద్వైపాక్షిక సంబంధాలు, కూటములు వంటి వాటిపై దృష్టిసారించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు కీలకమైనవి. ఎన్నికలు, పార్టీల బలాబలాలు, కొత్తగా పదవులు చేపట్టిన నేతలు వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ రెండు చోట్ల పోటీ చేశారు.. వాటిలో ఒకటి వడోదర కాగా రెండోది ఏమిటి?. ఇలాంటి ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఎదురవుతాయి. నియామకాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు-వాటి చైర్మన్లు తదితరాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రీయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వేలోని అంశాలు, కొత్త నియామకాలు వంటివి ముఖ్యమైనవి. ఆర్థికం, శాస్త్రసాంకేతికం ఆర్థిక రంగానికి సంబంధించి బడ్జెట్, సామాజిక-ఆర్థిక సర్వేలలోని ప్రధాన అంశాలపై దృష్టిసారించాలి. బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాలు వంటివి ముఖ్యమైనవి. శాస్త్రసాంకేతిక రంగంలో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి; ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి. వ్యక్తులు, అవార్డులు, క్రీడలు నియామకాలు, ఎన్నిక-ఎంపికల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెసే, ఆస్కార్, భారత రత్న, పద్మ పురస్కారాలు ముఖ్యమైనవి. సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డులపైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్ట్టిసారించాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా, గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలు- విజేతలు, రికార్డులు, మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి. వెయిటేజీ ఎంత? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శి, ఎస్ఐ/పోలీస్ కానిస్టేబుల్, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఎస్ఎస్సీ.. ఇలా ఏ పరీక్ష తీసుకున్నా వాటిలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. గతంలో గ్రూప్స్ జనరల్ స్టడీస్ పేపర్లలో కరెంట్ అఫైర్స్ నుంచి 30-35 వరకు ప్రశ్నలు అడిగారు. కొన్ని పరీక్షల్లో 10-20 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పట్టు సాధించడమెలా? ఓ అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవడాన్ని అలవరచుకోవాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థవంతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం. కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది. పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్పై పట్టుతో పాటు వివిధ రంగాల(ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ..)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. వీలైతే కరెంట్ అఫైర్స్ను అందించే వెబ్సైట్లను ఉపయోగించుకోవచ్చు. ఏ పరీక్షకైనా ఎన్ని నెలల సమాచారంపై దృిష్టిసారించాలనేది ఒక ప్రధానాంశం. సాధారణంగా రెండు నెలల ముందునుంచి ఏడాది వెనకకు వెళ్లాల్సి ఉంటుంది. - ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, కరెంట్ అఫైర్స్ నిపుణులు. ప్రాధాన్యం పెరుగుతోంది ఇటీవల కాలంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదలు గ్రూప్-4 వరకు అన్ని నియామక పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. డెరైక్ట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా పేర్కొనే వార్తల్లో వ్యక్తులు, అవార్డులు వంటివే కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసు కుంటున్న తాజా పరిణామాలపైనా ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలే కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలోనూ కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ముగిసిన సివిల్స్ మెయిన్ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటే రక్షణ రంగంలో ఎఫ్డీఐలు, భూసేకరణ చట్టం-2013 నుంచి ప్రశ్నలు వచ్చాయి. అంటే అభ్యర్థుల సమకాలీన అంశాల పరిజ్ఞానాన్ని లోతుగా పరీక్షిస్తున్నారు. కాబట్టి ఔత్సాహికులు కరెంట్ అఫైర్స్కు కూడా అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ ప్రిపరేషన్ను కూడా తులనాత్మకంగా ఉండేలా చూసుకుంటే తాము రాసే పరీక్షలో మెరుగైన ఫలితాలు ఖాయం. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. విజయానికి కీలకం... కరెంట్ అఫైర్స్ నేటి పోటీ ప్రపంచంలో అనునిత్యం జరుగుతున్న పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ కీలక విభాగంగా మారింది. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంశాలను వాటి నేపథ్యానికి ముడిపెడుతూ పరోక్షంగా అడుగుతుండగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పరీక్షలు, ఇతర నియామక పరీక్షల్లో నేరుగా అడుగుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆయా విధులు సమర్థంగా నిర్వహించడానికి కూడా కరెంట్ అఫైర్స్పై అవగాహన ఎంతగానో తోడ్పడుతుంది. సిలబస్లో మార్పులు-చేర్పులు వంటివి వర్తించని కరెంట్ అఫైర్స్పై అవగాహన పెంచుకుంటే ఆ స్థాయిలో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక.. కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదలవనున్న తరుణంలో ఔత్సాహికులు పరీక్షకు ఏడాది ముందుకాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకుంటే పోటీలో ముందంజలో నిలుస్తారు. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ. -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా 2014 మోడల్ పేపర్
OPTIONAL SUBJECT ANTHROPOLOGY (PAPER-I) Time: 3 Hours Max. Marks: 250 Instructions: n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions Nos. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. SECTION-A Q1. Write notes on the following in about 150 words each: 10 × 5 = 50 a) Double Descent 10 b) Genealogical Method 10 c) Major sub-divisions of Anthropology 10 d) Ecological Anthropology 10 e) Field work tradition in Anthropology 10 Q2. a) Critically examine the role of anthropology in Contemporary India. 15 b) Is culture unique to human beings? Critically examine. 15 c) Discuss the role of anthropology in the understanding of health and disease. What specific understanding is available with respect to infections and non-infectious diseases? 20 Q3. a) Discuss the nature of law and justice in simple societies citing suitable examples. 20 b) Define marriage and describe the various types of marriages in human societies 15 c) Define Status and Role. Distinguish between Ascribed and Achieved Status. 15 Q4. a) What is functionalism? Discuss the functional approach to the understanding of Religion. 20 b) What is understood by Rites of Passage? Describe the various phases of the 'Rites of Passage' and their significance. 20 c) Differentiate between State and Stateless Societies. 10 SECTION-B Q5. Write notes on the following in about 150 words each. 10 ×5 = 50 a) Cross-sectional methods of studying human growth. 10 b) Genetic Counselling 10 c) Epidemiological Anthropology 10 d) Asian Homo erectus 10 e) Fertility and Fecundity 10 Q6. a) What are the different stages of Growth? Describe any one of them in detail. 20 b) Describe Turner and Klinefelter Syndromes in human. 15 c) What are the stresses at high altitudes? How do better cardio- respiratory functions help the native highlanders in combating low environmental pressure? 15 Q7. a) Discuss the factors affecting gene frequencies among human populations. 20 b) Elucidate the skeletal differences between humans and chimpanzees. 15 c) Discuss the relevance of menarche, menopause and other bio-events to fertility. 15 Q8. a) Discuss ageing and senescence. Describe either the biological or social theories of ageing. 20 b) Describe the absolute dating methods in Archaeology, highlighting the importance of each method. 15 c) Describe the Neolithic culture of India. 15 ANTHROPOLOGY (PAPER-II) Time: 3 Hours Max. Marks: 250 Instructions: n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions Nos. 1 and 5 are compulsory and out of the remaining, 3 are to be attempted choosing at least ONE question from each section. SECTION-A Q1. Write short notes on the following in about 150 words each. 10 × 5 = 50 a) Neolithic cultures of N-E India b) Tribe-Caste continuum c) Great tradition and Little tradition d) Major linguistic divisions of India. e) Contribution of H.H. Risley to the 'Aryan' debate. Q2. a) Describe what is known of Harappan Religion. Have some of its elements continued into later Hinduism? Discuss. 20 b) Describe the concept of 'Sacred Complex' with an ethnographic example. 15 c) Do you think caste persists in contemporary India? Critically discuss. 15 Q3. a) Define the concept 'Dominant Caste' and examine its relevance in the contemporary Indian village with suitable examples. 20 b) Discuss the contribution of Islam to the composite culture of India. 15 c) Discuss the importance of the ethno-archaeological approach to the study of indigenous craft in India. 15 Q4. a) Discuss the contributions of S.C. Roy to understanding the tribes of India. 20 b) Describe the evolutionary significance of the fossil finds of the Narmada Basin. 15 c) Outline the distribution of Dravidian languages in India and describe their cultural significance. 15 SECTION-B Q5. Write short notes on the following in about 150 words each. 10 × 5 = 50 a) Biogenetic variations of Indian tribes b) Social and economic marginalization of tribal people c) Forest policy and tribes d) The concept of PTG e) Impact of Christianity on tribes Q6. a) Critically examine the constitutional provisions for safe-guarding the interests of Scheduled Tribes in India. 20 b) Discuss the impact of land alienation on the tribes of central India. 15 c) Critically evaluate the National Tribal Policy. 15 Q7. a) Discuss the impact of globalization on the livelihood of the tribal populations. 20 b) What are the significant factors responsible for tribal unrest? 15 c) Discuss the rise of ethno-nationalism among Indian tribes with specific example. 15 Q8. a) Critically assess the role of anthropologists in rural development. 20 b) Critically examine the role of NGOs in promoting health and education in tribal areas. 15 c) Describe the history of tribal administration in the colonial period. 15 -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా 2014 ప్రశ్న పేపర్స్
ఏ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యే అభ్యర్థులకైనా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేయడం ఎంతో ప్రయోజనకరం. సివిల్స్ మెయిన్ పరీక్షలు ఇటీవలే ముగిశాయి. మెయిన్లో మార్పులు ప్రవేశ పెట్టిన తర్వాత రెండోసారి నిర్వహించిన పరీక్షలివి. ఈ నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రయోజనార్థం సివిల్ సర్వీసెస్ మెయిన్ 2014 ప్రశ్నపత్రాలను అందజేస్తున్నాం... GENERAL STUDIES (PAPER-III) Time: 3 Hours. Max. Marks: 250 Question paper Specific Instructions: All questions are compulsory. Answer all the questions in NOT MORE than 200 words each. content of the answer is more impor tant than its length. All questions carry equal marks. 12½´20=250 1. Normally countries shift from agriculture to industry and then later to services, but India shifted directly from agriculture to services. What are the reasons for the huge growth of services vis-a-vis industry in the country? Can India become a developed country without a strong industrial base? 2. "While we flaunt india's demo gra-phic dividend, we ignore the dropp-ing rates of employability". what are we missing while doing so? Wh-ere will the jobs that india desper-ately needs come from? Explain. 3. There is also a point of view that Agricultural Produce Market Com-mittees (APMCs) set up under the State Acts have not only impeded the development of agriculture but also have been the cause of food inflation in India. Critically examine. 4. "In the villages itself no form of credit organization will be suitable except the cooperative society" – All India Rural Credit Survey. Discuss this statement in the background of agricultural finance in India. What constraints and challenges do financial institutions supplying agricultural finance face? How can technology be used to better reach and serve rural clients? 5. The Right to fair compensation and Transparency in Land Acquisition Rehabilitation and Rese ttlement Act, 2013 has come into effect from 1st january, 2014. What are the key issues which would get addressed with the Act in place? What impli-cations would it have on industriali-zation and agriculture in India? 6. Capitalism has guided the world economy to unprecedented prosperity. However, it often encourages short- sightedness and countributes to wide disparities between the rich and the poor. In this light, would it be correct to believe and adopt capitalism for bringing inclusive growth in India? Discuss. 7. Explain how Private Public Part-nership arrangements, in long gestation infrastructure projects, can transfer unsustainable liabilities to the future. What arrangements need to be put in place to ensure that successive generations capacities are not compromised? 8. National Urban Transport Policy emphasises on 'moving people' instead of 'moving vehicles'. Discu-ss critically the success of the various strategies of the Government in this regard. 9. Foreign Direct Investment (FDI) in the defence sector is now set to be liberalized. What influence this is expected to have on Indian defence and economy in the short and long run? 10. Scientific research in Indian uni-versities is declining, because a career in science is not as attractive as are business professions, engine-ering or administration, and the universities are becoming consumer - oriented. Critically comment. 11. Can overuse and free availability of antibiotics without Doctor's prescription, be contributors to the emergence of drug resistant diseases in India? What are the available mechanisms for monitoring and control? Critically discuss the various issues involved. 12. In a globalized world, Intelle ctual Property Rights assume significan-ce and are a source of litigation. Br-oadly distinguish between the terms -Copyrights, Patents and Trade Secrets. 13. Should the pursuit of carbon credits and clean development mechanisms set up under UNF CCC be maintained even though there has been a massive slide in the value of a carbon credit? Discuss with respect to India's energy needs for economic growth. 14. Drought has been recognized as a disaster in view of its spatial exp-anse, temporal duration, slow on-set and lasting effects on vulnera-ble sections. With a focus on the september 2010 guidelines from the National Disaster Managem-ent Authority (NDMA), Discuss the mechanisms for preparedne-ss to deal with likely El Nino and La Nina fallouts in india. 15. Environmental Impact Assess-ment studies are increasingly undertaken before a project is cleared by the Government. Discuss the environm-ental impacts of coal-fired thermal plants located at coal pitheads. 16. "The diverse nature of India as a multi- religious and multi- ethnic society is not immune to the impact of radicalism which is seen in her neighbourhood". Discuss along with strategies to be adopted to counter this environment. 17. International civil aviation laws provide all countries complete and exclusive sovereignty over the airspace above their territory. What do you understand by 'airspace'? What are the implications of these laws on the space above this airspace? Discuss the challe-nges which this poses and sugge-st ways to contain the threat. 18. How does illegal transborder migra-tion pose a threat to India's security? Discuss the strategies to curb this, bringing out the factors which give impetus to such migration? 19. In 2012 the longitudinal marking for high- risk areas for piracy was moved from 65 degrees east to 78 degrees east in the Arabian Sea by the International Maritime Organiz-ation.What impact does this have on India's maritime security concerns? 20. China and Pakistan have entered into an agreement for developm-ent of an economic corridor. Wh-at threat does this pose for india's security? Critically examine. General Studies (Paper-IV) Time: 3 Hours. Max. Marks: 250 Question paper Specific Instructions: * There are FOURTEEN questions divided in two Sections. * All the questions are compulsory. Answer questions in NOT MORE than the word limit specified for each in the parenthesis. Content of the answer is more important than its length. Section - A 1. a) All human beings aspire for happiness. Do you agree? What does happiness mean to you? Explain with examples. (150 Words) 10 b) What does ethics seek to promote in human life? Why is it all the more important in public administration? (150 Words) 10 2. a) In the context of defence services, 'patriotism' demands readiness to even lay down one's life in protecting the nation. According to you, What does patriotism imply in everyday civil life? Explain with illustrations and justify your answer. (150 Words) 10 b) What do you understand by 'probity' in public life? What are the difficulties in practici-ng it in the present times? How can these difficulties be overcome? (150 Words) 10 3. a) "Integrity without knowledge is weak and useless, but knowledge without integrity is dangerous and dreadful". What do you understa-nd by this statement? Explain your stand with illustrations from the modern context (150 Words) 10 b) "Human beings should always be treated as 'ends' in themselves and never as merely 'means'". Explain the meaning and signific-ance of this statement, giving its implications in the modern techno- economic society. (150 Words) 10 4. a) Which eminent personality has inspired you the most in the context of ethical conduct in life? Give the gist of his/her teachings. Giving specific examples describe how you have been able to apply these teachings for your own ethical development. (150 Words) 10 b) There is heavy ethical responsi-bility on the public servants because they occupy positions of power, handle huge amounts of public funds, and their decisions have wide-ranging impact on society and environment. What steps have you taken to improve your ethical competence to handle such responsibility? (150 Words) 10 5. a) The current society is plagued with widespread trust- deficit. What are the consequences of this situation for personal well -being and for societal well-being? What can you do at the personal level to make yourself trust worthy? (150 Words) 10 b) It is often said that poverty leads to corruption. However, there is no dearth of instances where affl-uent and powerful people indulge in corruption in a big way. What are the basic causes of corruption among people? Support your answer with examples? (150 Words) 10 6. What factors affect the formati-on of a person's attitude towards social problems? in our society, contras-ting attitudes are preva lent about many social problems. What contra-sting attitudes do you notice about the caste system in our society? How do you explain the existence of these contrasting attitudes? (150 Words) 10 7. What does accountability mean in the context of public service? What measures can be adopted to ensure individual and collective accountab-ility of public servants? (150 Words) 10 8. We are witnessing increasing instances of sexual violence against women in the country. Despite existing legal provisions against it, the number of such incidences is on the rise. Suggest some innovative measures to tackle this menace. (150 Words) 10 SECTION - B 9. Now-a-days there is no incre-asing thrust on economic development all around the globe. At the same time, there is also an increasing concern about environmental degradation caused by development. Many a time, we face a direct conflict between developmental activity and environ-mental quality. It is neither feasible to stop or curtail the developmental process, nor it is advisable to keep degrading the environment, as it threatens our very survival. Discuss some feasible strategies which could be adopted to eliminate this conflict and which could lead to sustainable development. (250 Words) 20 10. Suppose one of your close friends, who is also aspiring for civil services, comes to you for discussing some of the issues related to ethical conduct in public service. He raises the following points: i) In the present times, when unethical environment is quite prevalent, individual attempts to stick to ethical principles may cause a lot of problems in one's career. It may also cause hardship to the family members as well as risk to one's life. Why shoud we not be pragmatic and follow the path of least resistance, and be happy with doing whatever good we can? ii) When so many people are ad-opting wrong means and are grossly harming the system, what difference would it make if only a small minority tries to be ethical? They are going to be rather ineffective and are bound to get frustrated. iii) If we become fussy about ethical considerations, will it not ham-per the economic progress of our country? After all, in the present age of high competition, we cannot afford to be left behind in the race of development. iv) It is understandable that we sho-uld not get involved in grossly unethical practices, but giving and accepting small gratificati-ons and doing small favours incr-eases everybody's motivation. It also makes the system more efficient. What is wrong in adopting such practices? Critically analyze the above vie-wpoints. On the basis of this anal-ysis, what will be your advice to your friend? (250 Words) 20 11. You are a no-nonsense, honest officer. You have been transferred to a remote district to head a department that is notorious for its inefficiency and callousness. You find that main cause of the poor state of affairs is the indiscipline of a section of employees. They do not work themselves and also disrupt the working of others. You first-warned the troublemakers to mend their ways or else face disciplinary action. When the warning had little effect, you issued a show cause notice to the ringleaders. As a retaliatory measure, these troub-lemakers instigated a woman employee amongst them a file a complaint of sexual harassment against you with the Women's Commission. The Commission promptly seeks your explanation. The matter is also publicized in the media the embarrass you further. Some of the options to handle this situation could be as follows. i) Give your explanation to the commission and go soft on the disciplinary action. ii) Ignore the commission and proceed firmly with the disciplinary action. iii) Brief your higher-ups, seek directions from them and act accordingly. suggest any other possible option(s). Evaluate all of them and suggest the best course of action, giving your reasons for it. (250 Words) 20 12. Suppose you are the CEO of a company that manufactures spe-cialized electronic equipment used by a government depart ment. You have submitted your bid for the supply of this equipment to the department. Both the quality and cost of your offer are better than those of the competitors. Yet the concerned officer is demanding a hefty bribe for approving the tender. Getting the order is important both for you and for your company. Not getting the order, would mean closing a production line. It may also affect your own career. Howe-ver, as a value- conscious person, you do not want to give bribe. Valid arguments can be advanced both for giving the bribe and getting the order and for refusing to pay the bribe and risking the loss of the order. What those arguments could be? Could there be any better way to get out of this dilemma? If so, outline the main elements of this third way, pointing out its merits (250 Words) 20 13. Rameshwar successfully cleared the prestigious civil services examinati-on and was excited about the oppor-tunity that he would get through the civil services to serve the country. However, soon after joining the services, he realized that things are not as rosy as he had imagined. He found a number of mal practices prevailing in the department assigned to him. For example funds under various schemes and grants were being misappropriated. The official facilities were frequently being used for personal needs by the officers and staff. After some time, he noticed that the process of recruiting the staff was also not up to the mark. Prospective candidates were required to write an examination in which a lot of cheating was going on. Some candidates were provied external help in the examination. Rameshwar brought these incid-ents to the notice of his seniors. However, he was advised to keep his eyes, ears and mouth shut and ignore all these things which were taking place with the connivance of the higher -ups. Rameshwar felt highly disillusioned and uncomfortable. He comes to you seeking your advice. Indicate various options that you think are available in this situation. How would you help him to evalua-te these options and choose the most appropriate path to be adopted? (250 Words) 20 14. In our country, the migration of rural people to towns and cities is increasing drastically, This is causing serious problems both in the rural as well as in the urban areas. In fact things are becoming really unmanageable. Can you analyze this problem in detail and indicate not only the socio-economic but also the emotional and attitudinal factors responsible for this problem? Also, distinctly bringout why- a) educated rural youth are trying to shift to urban areas; b) landless poor people are migrating to urban slums; c) even some farmers are selling off their land and trying to settle in urban areas taking up petty jobs. What feasible steps can you suggest which will be effective in controlling this serious problem of our country? (250 Words) 20 -
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన చేపట్టాలి
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరునెలలు దాటినా ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన జరగలేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ బుధవారం లోక్సభలో జీరోఅవర్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. అధికారుల విభజన జరగని కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కేంద్ర సిబ్బంది, శిక్షణవ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పెండింగ్లో ఉందని, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని బాల్క సుమన్ కోరారు. -
సీశాట్ పై అభిప్రాయాలు తెలపండి: కేంద్రం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లోగా అభిప్రాయాలు వెల్లడించాలని ఆదివారం విజ్ఞప్తి చేసింది. సీశాట్ పై అన్ని కోణాల్లో సమీక్ష జరుపుతామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్ లో ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు. యూపీఎస్సీ ప్రవేశపెట్టిన సీశాట్ వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
సివిల్స్ శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు బీసీ స్టడీసర్కిళ్లలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించనున్న అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ కమిషనర్ ఎ.వాణీప్రసాద్ బుధవారం తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 5ను చివరి తేదీగా ప్రకటించారు. అర్హత పరీక్ష మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 16వ తేదీ ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను 11వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
సివిల్స్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
22 అధికార భాషల్లోనూ ప్రశ్నాపత్రాలు ఉండాలి వాయిస్ ఆఫ్ తెలంగాణ డిమాండ్ పంజగుట్ట: సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రశ్న పత్రాలను అన్ని ప్రాంతీయ భాషల్లోనూ రూపొందిం చాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు లింగాల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. సివిల్స్ పరీక్షల నిర్వహణలో కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానం కారణం గా ప్రాంతీయ భాష విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. హిందీ విద్యార్థుల పట్ల మక్కువతో కేంద్రం స్థానిక భాషల విద్యార్థులపై వివక్ష ప్రదర్శిస్తోం దని, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి స్టార్) ప్రశ్నాపత్రాన్ని కేవలం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో రూపొందించడం సబబు కాదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో పాండురంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు ఉండే విధంగా ప్రశ్నాపత్రాలు ఉండాలన్నారు. కానీ ప్రస్తుత యూపీఎస్సీ విధానం చూస్తుంటే కేవలం హిందీ వారికి ప్రయోజనకం చేకూర్చాలనే ఉద్దేశం అర్థమవుతోందన్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రాలను గుర్తింపు పొందిన 22 భాషల్లోనూ తయారు చేయాలన్నారు. ఇంగ్లీష్ ప్రశ్నావళిలోని కఠిన పదాలు, భాషాపండింతులకు కూడా అర్థంకాని వ్యాకరణం వల్ల ప్రాంతీయ విద్యార్థులు పరీక్షలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు 28,600 మంది తెలుగు విద్యార్థులు హాజరవగా వారిలో కేవలం 535 మంది మాత్రమే మెయిన్స్కు హాజరవడం దీనికి నిదర్శనమన్నారు. -
బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ శిక్షణ
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2015 ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ సంచాలకులు మల్లిఖార్జున్ తెలిపారు. HTPP://TSBCSTUDYCIRCLES.CGG.GOV.IN అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉందని, ఆన్లైన్ ద్వారా నవంబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నవంబర్ 16న జరిగే ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైనవారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగ ర్లోగల బీసీ స్టడీసర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 040-24611408, 18004250039 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్న పేపర్స్
OPTIONAL SUBJECTS ANTHROPOLOGY (PAPER-I) Time: 3 Hours Max Marks: 250 Instructions n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. SECTION-A Q1. Write notes on the following in about 150 words each: 10 ×5 = 50 a) How do you situate Anthropo- logy in Social Sciences? 10 b) Various types of descent 10 c) Totemism 10 d) Linguistic Anthropology 10 e) Carbon-14 method of dating 10 Q2. a) Why has the concept of Culture Relativism been so dear to Anthropologists? (250 words) 20 b) Bring out the distinguishing features of culture and civilization. (250 words) 15 c) Where do you situate live-in relationship' within the institution of marriage? (250 words) 15 Q3. a) Discuss the impact of globalization on tribal economy. (350 words) 20 b) In what ways is Functionalism different from Structural Functi- onalism? (350 words) 20 c) Differentiate between Economics and Economic Anthropology. (150 words) 10 Q4. a) Discuss the impact of urbanization and feminist movement on family. (250 words) 20 b) Bring out the contribution of Turner and Geertz in symbolic and interpretive theories in Anthropology. (250 words) 15 c) How does taboo serve as a means of social control? (250 words) 15 SECTION-B Q5. Write notes on the following in about 150 words each. 10 ×5 = 50 a) Role of primatology in Anthro- pological studies 10 b) Differentiation between Child Growth and Development 10 c) Ageing and Senescence 10 d) Twin method in human genetics 10 e) Demographic transition 10 Q6. a) Give a broad outline of Paleo- lithic culture emphasizing upon its tool technology. (250 words) 20 b) What do you understand by 'Genetic Load' in a population? How is it measured and what are the important factors that can influence it? (250 words) 15 c) Justify "Though human growth is under tight genetic control but it is influenced by various environmental factors." (250 words) 15 Q7. a) Discuss the relevance of Case Study method of data collection. (250 words) 20 b) Elaborate upon major human adaptations to heat and cold. (250 words) 15 c) What are genetic markers and what is their usefulness? Why are blood groups considered as good genetic markers? Illustrate with examples. (250 words) 15 Q8. a) Discuss how Neo-Darwinism integrated the fields of Genetics and Evolution. (250 words) 20 b) What is meant by epidemiological transition? Elaborate upon its causes and consequences highlighting major health problems of our adult population today. (250 words) 15 c) Differentiate between Race and Racism. What are three major races of the world? Give important biological criteria used frequently for such a classification. ANTHROPOLOGY (PAPER-II) Time: 3 Hours Max Marks: 250 Instructions n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. SECTION-A Q1. Write short notes on the following in about 150 words each. 10 × 5 = 50 a) Sufi tradition of Islam. b) Threat to tribal languages in India. c) Examine the debates related to Ramapithecus. d) Discuss how Louis Dumont explained caste system. e) Discuss salient features of Mesolithic culture in India with special reference to western India. Q2. Answer the following in about 250 words each. a) Examine Nature-man-spirit complex as an ecological concept. 15 b) Indian Paleolithic culture can neither be conceived chronologically homogenous nor as a uniform cultural phase. Discuss. 15 c) Discuss the significance of study of religious centres to the understanding of Indian civilization.20 Q3. Answer the following in about 375 words each. a) Examine the anthropological contributions dealing with tribes and Indian civilization. 25 b) What is Jajmani system? Exami- ne the views on Jajmani system as an egalitarian as well as exploitative system. Give reasons for its decline. 25 Q4. Answer the following in about 250 words each. a) Indian farmers are not slow to react to economic opportunities. Discuss this statement. 15 b) Examine the criticisms on the concept of dominant caste. 15 c) Discuss the contributions of H.D. Sankalia to prehistoric anthropology in India. 20 SECTION-B Q5. Write short notes on the following in about 150 words each. 10 × 5 = 50 a) Government Action towards Left Wing Extremism. b) Role of Gramasabha under PESA. c) Impacts of sanctuaries and natio- nal parks on tribal populations. d) Linguistic classification of Indian tribes. e) Ethnic movements in India. Q6. Answer the following in about 250 words each. a) Fifth Schedule and Sixth Schedule of the constitution are built on the foundations laid by the colonial Government. Discuss. 20 b) Discuss the significance of cultural and administrative factors in tribal development. 15 c) Examine the impacts of green revolution on rural poor. 15 Q7. Answer the following in about 250 words each. a) Discuss the criticism levelled against anthropology in the context of 'Isolation, and assimilation debate' on tribal populations. 20 b) Assess the contributions of early 20th century ethnographic tradition to Indian anthropology. 15 c) Discuss how British policies dispossessed tribals of their communal properties and agricultural lands. 15 Q8. Answer the following in about 250 words each: a) Discuss alternatives for shifting cultivators in the context of ecological costs and humanistic concerns. 20 b) Examine the impact of non-tribal contact on socio-cultural institutions of tribal people with suitable examples. 15 c) Discuss the Social disabilities suffered by scheduled castes. 15 HISTORY (PAPER-I) Time: 3 Hours Max. Marks: 250 Instructions n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, 3 are to be attempted choosing at least 1 from each section. SECTION-A Q1. Identify the following places marked on the outline map in the Question-cum-Answer Booklet supplied to you and write short notes of about 30 words on each of them in the space provided in the Booklet. Locational hints for each of the places marked on the map are given below seriatim: 2l/2× 20 = 50 i) A Palaeolithic and Mesolithic site. 2l/2 ii) Mesolithic site. 2l/2 iii) An important halting place. 2l/2 iv) A Pre-Harappan site. 2l/2 v) An important Harappan site. 2l/2 vi) Site of important fossils. 2l/2 vii) A Sea-port. 2l/2 viii) A Palaeolithic site. 2l/2 ix) A Neolithic, Megalithic and Chalcolithic site. 2l/2 x) A Harappan site. 2l/2 xi) A Palaeolithic site. 2l/2 xii) A Neolithic site. 2l/2 xiii) A Chalcolithic site. 2l/2 xiv) A Chalcolithic site. 2l/2 xv) A site of Buddhist Monastery. 2l/2 xvi) Painted Grey Ware site. 2l/2 xvii) Site related to a famous Indian Philosopher. 2l/2 xviii) Historical Rock-cut caves. 2l/2 xix) Famous Fort. 2l/2 xx) Capital of famous Kingdom. 2l/2 Q2. a) Evaluate various views regarding human settlements as gleaned from the Vedic sources. 15 b) Discuss the water management and its conservation planning in the Harappan (Indus- Saraswati) cities. 20 c) In the absence of a written script Chalcolithic pottery gives us a fascinating insight into the culture and life styles of the people of those times. Comment critically. 15 Q3. a) On the basis of contemporary sources assess the nature of banking and usuary in ancient India. 15 b) Social norms for women in the Dharmasastra and Arthasastra tradition were framed in accordance with the Varnashrama tradition. Evaluate critically. 20 c) "The varna concept may always have been largely a theoretical model and never an actual description of society." Comment in the context of Ancient India. 15 Q4. a) Evaluate the contribution of the Puranas in disseminating secular knowledge among the masses in ancient India. 15 b) Evaluate the ownership of land in ancient India on the basis of literary and epigraphic sources. 15 c) Explain as to how the early Buddhist Stupa art, while using folk motifs and narratives and common cultural symbols, succeeded in transforming these themes for expounding the Buddhist ideals. 20 SECTION-B Q5. Write short notes in not more than 150 words on each of the following: 10 × 5 = 50 a) Evaluate the Malfuzat texts as sources of medieval history. 10 b) Discuss the state of society and economy of the Bahmani kingdom as gleaned from historical sources. 10 c) Give a sketch of Indian trade with Europe during the Mughal period. 10 d) Analyze the steps taken by Razia Sultan to strengthen her position as an independent ruler despite the various obstacles. 10 e) Bhakti and mysticism of Lal Ded emerged as a social force in Kashmir. Comment. 10 Q6. a) Evaluate the conditions of industries in India from 1200-1500 CE. 20 b) On the basis of contemporary sources evaluate the system of agriculture and irrigation of the Vijayanagar kingdom. 15 c) Critically evaluate the educational development during the Sultanate period. 15 Q7. a) On the basis of the accounts of Europeans bring out the agrarian crisis of the 17th century CE India. 20 b) Evaluate critically the conditions of labour from 1200-1500 CE on the basis of historical sources. 15 c) Discuss and evaluate critically various trends in the historiography of bhakti. 15 Q8. a) Analyze how the political process of state formation of Mewar from 10th-15th century CE was challenged in the 16th century CE by the imperialist policy of Akbar. 15 b) Assess the Lekhapaddhati as an important source for evaluating the society and economy of the thirteenth century CE with special reference to Gujarat. 15 c) Assess the development of Science and Technology in the Mughal period. 20 HISTORY (PAPER-II) Time: 3 Hours Max. Marks: 250 Instructions n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. SECTION-A (Modern India) 1. Critically examine the following statements in about 150 words each. 10 × 5 = 50 a) "Dupleix made a cardinal blunder in looking for the key of India in Madras: Clive sought and found it in Bengal." b) Swami Vivekananda opined that "We should give our ancient spirituality and culture and get in return Western science, technology, methods of raising the standard of life, business integrity and technique of collective effort." c) "Ryotwari falls into three stages – early, middle and late, and the only description common to all is that it is a mode of settlement with small farmers, so small, indeed, that their average holding is, on recent figures, only about 61/2 acres." d) "Many of us who worked for the congress programme lived in a kind of intoxication during the year 1921. We were full of excitement and optimism.... We had a sense of freedom and a pride in that freedom." e) "Gandhi's body is in jail but his soul is with you, India's prestige is in your hands, you must not use any violence under any circumstances. YOU will be beaten but you must not resist; you must not raise a hand to ward off blows." 2. a) "Weaving", says R.C. Dutt, "was the national industry of the people and spinning was the pursuit of millions of women." Indian textiles went to England and other parts of Europe, to China and Japan and Burma and Arabia and Persia and parts of Africa. Elucidate. 25 b) "The first point to note is the continuing importance of religion and philosophy as vital ingredients in the modern Indian Renaissance. Indeed, there is as much reason for regarding it as a reformation as there is for treating it as a Renaissance." Critically examine. 25 3. a) "At the dawn of the twentieth century Lord Curzon, the viceroy of India, was full of hostility towards the Indian National Congress and he confidentially reported to the Secretary of State in November 1900: My own belief is that the Congress is tottering to its fall, and one of my greatest ambitions while in India is to assist it to a peaceful demise." Examine. 25 b) "Though the Act of 1919 was superseded by that of 1935, the preamble to the former was not repealed - the preservation of the smile of the Cheshire cat after its disappearance, and the latter said nothing about Dominion Status." Elucidate. 25 4. a) "Notwithstanding the quest for modernity and the antagonism that guided Nehru's attitude towards the inequalities inherent in the social structure in rural India, the Congress Party did not carry out a concerted campaign against discrimination based on caste. Nehru's own perception was that industrial growth was bound to break the stranglehold of this feudal remnant. This, however, did not happen in India." Examine. 25 b) "The reorganization resulted in rationalizing the political map of India without seriously weakening its unity. If anything, its result has been functional, in as much as it removed what had been a major source of discord, and created homogeneous political units which could be administered through a medium that the vast majority of the population understood. Indeed, it can be said with the benefit of hindsight that language, rather than being a force for division, has proved a cementing and integrating influence." Examine. 25 SECTION-B (World History) 5. Critically examine the following statements in about 150 words each. 10 × 5 = 50 a) "For Kant, Enlightenment is mankind's final coming of age, the emancipation of the human consciousness from an immature state of ignorance and error." b) "Six hundred thousand men had died. The Union was preserved, the slaves freed. A nation 'conceived in liberty and dedicated to the proposition that all men are created equal' had survived its most terrible ordeal." c) "Colonialism not only deprives a society of its freedom and its wealth, but of its very character, leaving its people intellectually and morally disoriented." d) "If the 1917 Bolshevik Revolution in Russia (that resulted in the creation or the Union of Soviet Socialist Republics or Soviet Union) inaugurated an international competition for the hearts and minds of people all over the globe, the Chinese Revolution raised the stakes of that struggle." e) "Decolonization has finished. It definitely belongs to the past. Yet somehow it has refused to become history." 6. a) "In spite of the careful framing of the Charter, the role of UNO as peacekeeper and international mediator has been somewhat lacklustre and muted and that continues to be so even after the end of Cold War." Elucidate. 25 b) "Change in Britain came comparatively peacefully through democratic process in the first half of the nineteenth century and a model of a functioning democracy through ballot box was successfully put in place." Elaborate. 25 7. a) "New imperialism was a nationalistic, not an economic phenomena." Critically examine. 25 b) "By the 1980's the communist system of the Soviet Union was incapable of maintaining the country's role as a Superpower." Elucidate. 25 8. a) "The European Union is the new sick man of Europe." Critically evaluate. 25 b) "There must be an end to white monopoly on political power, and a fundamental restructuring of our political and economic systems to ensure that the inequalities of apartheid are addressed and our society thoroughly democratized." Discuss. 25 -
సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్నాపత్రాలు
OPTIONAL SUBJECTS PUBLIC ADMINISTRATION (PAPER-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Question Nos. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE question from each Section. SECTION-A 1. Attempt the following in about 150 words each. 10 × 5 = 50 a) "The Charter Act of 1853 marked the beginning of parliamentary system in India." Explain. b) "Civil service neutrality is founded on the application of the principles of Rule of Law." Comment. c) "The second generation reforms in the Panchayati Raj institutions have changed Panchayats from an agency of development at local level into a political institution." Discuss. d) "Finance Commission in India performs the job of statistics aggregation." Comment. e) "Planning enables comprehensive and scientific understanding of problems." Examine the statement in the context of planning methodology. 2. a) "Bureaucratic agencies, characterized by established procedures, specialization, leadership, clear objectives, are not ideal to handle disaster management." Examine with reference to the need for administrative flexibility in managing disasters. (In about 250 words) 20 Marks b) "The liberal-democratic ideology of the West influenced the shaping of value premises of the Indian Constitution." Discuss. (In about 250 words) 20 Marks c) "Autonomy to public sector undertakings is a myth." Analyse in the context of the use of government expenditures by politicians who control governments at different levels. (In about 150 words) 10 Marks 3. a) "Laws are enacted without involving the police in the conception stage, with the result implementation of these laws leaves much to be desired." Examine the role of police in protection of children. (In about 250 words) 20 Marks b) "Central Secretariat is the nodal agency for administering the Union subjects and establishing coordination among the various activities of the government." Discuss. (In about 250 words) 20 Marks c) Is there a need to dispense with the Office of the Governor? Examine in the context of coalition governments. (In about 150 words) 10 Marks 4. a) "There is a tendency of centralism in Indian federalism, but it is not because of its institutional framework but because of its socialist goals and centrally devised plan development." Explain the statement in the context of Union-State relationship. (In about 250 words) 20 Marks b) "Use of Information and Communication Technology (ICT) in Panchayat's functions enhances efficiency, transparency and accountability and also induces mass ICT culture." Examine. (In about 250 words) 20 Marks c) "Judicial review of administrative tribunal's decisions defeats the very objective of establishing tribunals." Comment with reference to Central Administrative Tribunal. (In about 150 words) 10 Marks SECTION-B 5. Attempt the following in not more than 150 words each. 10 × 5 = 50 a) "Public Administration today tends to be less public in quantitative terms, but more responsive to public needs than before in qualitative terms." Examine with reference to citizen-centric administration. b) "Performance budgeting failed because it was applied to sectors/ programmes where quantitative evaluation was not feasible." Examine the principles underlying performance budgeting techniques. c) "The design of the Indian Police was to subjugate the Indian People in the aftermath of 1857." Analyse in the context of the Indian Police Act of 1861. d) "Reducing the size (geographical area) of the district will provide relief to the overburdened and overworked collector." Comment. e) "The concept of social audit is more comprehensive than that of traditional audit." Comment. 6. a) "Gandhian model of decentralization is similar to the process of reinventing governance." Analyse in the context of good governance. (In about 250 words) 20 Marks b) "Accounting is the essence of producing promptly and clearly the facts relating to financial conditions and operations that are required as a basis of management." Substantiate the statement in the context of accounting methods and techniques in government. (In about 250 words) 20 Marks c) Explain the important recommendations of V. T. Krishnamachary Committee (1962) on Indian and State Administrative Services and problems of District Administration. (In about 150 words) 10 Marks 7. a) "The 73rd Amendment, it is felt, may accentuate fiscal indiscipline by establishing between States and Local Governments a system of transfers similar to the one in place between the Central and State Governments." (World Bank) Comment. (In about 250 words) 20 Marks b) "Municipal Administration in India faces both structural and operational challenges." Examine in the context of post-74th Amendment Act. (In about 250 words) 20 Marks c) "Self-Help Groups (SHGs) have contributed to a change in the role of rural women in development-from symbolic participation to empowerment." Discuss. (In about 150 words) 10 Marks 8. a) "There is both criminalisation of politics and politicisation of criminals in India." Examine and identify the challenges they cause for law and order administration. (In about 250 words) 20 Marks b) "The basic ethical problem for an administrator is to determine how he/she can use discretionary power in a way that is consistent with democratic values." Comment with reference to corruption in administration. (In about 250 words) 20 Marks c) Justify the constitutional provision to treat certain expenditure as charged upon the Consolidated Fund of India. (In about 150 words) 10 Marks GEOGRAPHY (Paper- I) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. n Illustrate your answers with suitable sketches, maps and diagrams. These shall be drawn in the space provided for answering the question itself. SECTION-A 1. Write short notes on the following in about 150 words each: 10 × 5 = 50 a) Differences between Normal cycle and Arid cycle of Davis. b) Differentiate Storm Surges and Seiches. c) Uniqueness of fauna in the Notogean realm. d) Impact of Pleistocene Ice Age on the crust of the Earth. e) Types of endemic plants and their degree of vulnerability to extinction. 2. Answer the following in about 250 words each. a) With suitable examples, bring out the impact of local winds on the climate of an area. 20 Marks b) What are the characteristics that make CHC a serious threat to the ecosystem? Give examples. 15 Marks c) What is 'Base level'? Explain the types of base level. 15 Marks 3. Answer the following in about 250 words each. a) "Offshore Acoustic Study helped the development of the concept of sea floor spreading." Explain. 20 Marks b) Discuss Dew point and the various forms of condensation. 15 Marks c) Bring out the relationship between climate and vegetation in the Mountain Biome. 15 Marks 4. Answer the following in about 400 words each: 25 × 2 = 50 a) Compare the Subsidence and Glacial control theories on the formation of coral reefs. b) Explain the levels of Noise pollution and the legislative measures to control it. SECTION B 5. Write short notes on the following in about 150 words each. 10 × 5 = 50 a) "Ellen Churchill Semple is an ardent supporter of Determi- nism." Explain. b) Role of Venezuela in the production and export of oil. c) Misra's theoretical stages of Rural - Urban Process. d) Countries most affected in case of shut-down of Nuclear power. e) Relevance of Heartland theory in Contemporary world. 6. Answer the following in about 250 words each. a) What is Geriatrics ? What are the problems associated with Geria- tric population? 20 Marks b) Discuss the changing pattern of production and export of Coffee in the world. 10 Marks c) What are the basic postulates in the Central Place Model of Christaller? 20 Marks 7. Answer the following in about 250 words each. a) "Urban Solid Waste Management poses the greatest challenge in Metropolitan planning." Elaborate. 20 Marks b) Analyse the reasons for a comparatively poorer development of fishing grounds in tropical areas. 15 Marks c) Explain the parameters for assessment and the spatial pattern of Human Development Index in the world. 15 Marks 8. Write about the following in about 400 words each. 25 × 2 = 50 a) "Urban Geography is nothing but city 'in' area and city 'as' area." Elaborate. b) Analyse the causes for changes in the pattern of world trade. GEOGRAPHY (Paper-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. n Word limit in questions, wherever specified, should be adhered to. n Illustrate your answers with suitable sketches, maps and diagrams, wherever considered necessary. SECTION A 1. On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical/ commercial/ economic/ ecological/ environmental/ cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Mishmi Hills ii) Lipulekh Pass iii) Beas River iv) Rihand Dam v) Amarnath b) Explain the topographical and structural characteristics of the Siwalik Range. (150 words) 10 c) Discuss the mechanism of Indian Monsoon. (150 words) 10 d) Identify the main industrial clusters of India and account for their development. (150 words) 10 e) Explain the method of delineating crop-association regions with reference to India. (150 words) 10 2. a) Discuss the potentiality and present status of horticulture in the Western and Central Himalaya. (250 words) 20 b) Delineate the coalfields of India and mention their distinctive features. (150 words) 15 c) Explain the role of multinationals in globalization of industries in India. (150 words) 15 3. a) Distributional pattern of industries in India does not provide requisite basis for division of the country into distinct industrial regions. Elaborate. (250 words) 20 b) Discuss the role of institutional factors in shaping the pattern of Indian agriculture. (150 words) 15 c) What do you understand by 'Young India? How can the present state of population composition be converted into an asset for the country? (150 words) 15 4. a) Comment on the feasibility of interlinking of rivers of India and its possible contribution to resolution of water crisis. (250 words) 20 b) Define agricultural productivity. Mention the methods of its measurement and bring out the disparities in its regional distribution. (150 words) 15 c) Discuss the problems in realization of benefits of globalization and liberalization in industrial sector of India. (150 words) 15 SECTION-B 5. For Question Nos. 5(a) to 5(d), write on each in about 150 words and answer Question No. 5(e) as directed therein: a) City-regions as territorial unit for regional planning and development 10 b) Snags in the Food Security Policy of India 10 c) Demographic dividend and its implications on Indian socio-economic environment 10 d) Planning and development of 'Tribal Regions' in India 10 e) On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical / commercial / economic / ecological / environmental / cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Rajgir ii) Sindri iii) National Highway No.24 iv) Churk v) Indira Gandhi Canal 6. a) Write a note on geopolitics of the Indian Ocean realm. (250 words) 20 b) Comment on the basis of creation of new States in India in 2000. (150 words) 15 c) Enumerate the basic indicators of development and explain their application in identification of the spatial diversity in development in India. (150 words) 15 7. a) Write a note on the emergence of National Settlement System in colonial India and discuss the factors contributing to urbanization in post-independence period. (250 words) 20 b) Define slums and explain their problems. (150 words) 15 c) Discuss the objectives of "Vision 2020" in creation of viable village complex in India for "Inclusive Rural Development" programme. (150 words) 15 8. a) Identify the earthquake-prone zones and suggest strategy for their management. (250 words) 20 b) Describe the impact of linguistic diversity on the development of various regions of India. (150 words) 15 c) Describe how urbanization creates air and water pollution in India. (150 words) 15 TELUGU (Paper II) (LITERATURE) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. n Answers must be written in TELUGU. SECTION-A 1. కింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి. 5 × 10 = 50 ఎ. కింది పద్యాన్ని సౌందర్య కళాదృష్టితో వివేచించండి. 10 అతిరుచి రాగతుం డయిన యాతనికిన్ హృదయ ప్రమోద మా తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాప వ ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టిన యట్టిరైరి సం పత దళినీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్. బి. కింది పద్యంలోని నిర్మాణ, అలంకార ధ్వని విశేషాలను పరిశీలించండి. 10 వెరవున లావునం గృషికి వేయి విధంబు ల మేలొనర్చినం దొరకొనునే ఫలంబు? తఱితోదగు వర్ష ము లేకయున్న; నె ప్పరుసున లెస్స సేసినను బౌరుషముల్ ఫలియించుటెల్ల నా దీరణమునం బ్రసన్నమగు దైవముచేతన చూవె ఫల్గుణా! సి. కింది పద్యాన్ని సామాజిక దృష్టితో అనుశీలించండి. 10 మరిచ ధూళీపాళి పరిచితంబులు మాణి బంధాశ్మ లవణ పాణింథమ ములు బహుల సిద్ధార్థ జంబాల సారంబులు పటురామఠామోద భావితములు తింత్రీణీక రసోపదేశ ధూర్ధరములు జంబీర నీరాభి చుంబితములు హైయంగవీన ధారాభిషిక్తంబులు లలిత కుస్తుంబరూల్లంఘితములు శాకపాక రసావళీ సౌష్ఠవములు భక్ష్య భోజ్య లేహ్యంబులు పానకములు మున్నుగాగల యోగిరంబులు సమృద్ధి వెలయగొనివచ్చె నొండొండ వివిధములను; డి. కింది పద్యంలో కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. 10 దివిజ నుతైయెున శారదా దేవి పూజ కుపకరించు కార్యం బిది యొప్పు ననుచు; నధిక మోదంబుతో నతడా దరించి సంతతంబు తదేక నిష్ఠత దలిర్ప సమధిక మధు మద గరిమా సమ చంచల చంచరీక సంచయ సంచా ర మనోరమ సుమనో రమ నమరగ నా పూవు దోట ననిశము బెంచెన్. ఇ. కింది పద్యంలో అలంకార వైచిత్రిని ప్రస్తావించండి. 10 ఆడించెదవు బొమ్మలాటవాడును బోలె సర్వచరాచర జంతువులను కనుకట్టు గట్టెదు గారడీడును బోలె మిథ్యా ప్రపంచంబు తథ్యముగను వేర్పేఱదోతువు వేష దారియు బోలె బహు విధ దేవతా భద్ర కళల దెలివి మాన్పుదువు జక్కులవాని చందాన బ్రజల సంపద్రంగవల్లి జేర్చి యిట్టివే కద నీ విద్య లెన్ని ైయెున నింక నేయట ఘనుడవో యెఱుగరాదు చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ! హతవిమత జీవ! శ్రీకాకుళాంధ్రదేవ! 2. ఎ. రాచరిక వ్యవస్థకు ప్రతినిధి దుష్యంతుడు - చర్చించండి. 25 బి. తిక్కన తీర్చిన రాయబార సంవాద శైలిపై అభిప్రాయాలను వివరించండి. 25 3. ఎ. గుణనిధి కథ మూలంగా ఆనాటి సామాజిక భూమికను విశ్లేషించి నేటికీ ఉపకరించే సందేశాన్ని గుర్తించండి. 25 బి. శృంగార, పుణ్య వస్తు వర్ణనా కర్ణనీయం కళాపూర్ణోదయం - పరిశీలించండి. 25 4. ఎ. ఆంధ్ర నాయక శతకంలో కవి పాటించిన వస్తుధ్వనిని గురించి వివరించండి. 25 బి. రామాయణ రచనలో మొల్ల చేపట్టిన నూతన కల్పనలను అనుశీలించండి. 25 SECTION-B 5 ణ 10 = 50 5. కింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి. ఎ. కింది కవితా పంక్తులను మనస్తత్వ దృష్టితో పరిశీలించండి. 10 నవవికస్వర దివ్య సౌందర్యమూర్తి విశ్వసుందరి పరమ పవిత్రమూర్తి యుదయలక్ష్మి యవతరించె; నెదురువోయి స్వాగతం బిమ్ము గీతికా ప్రసవ మొసగి అవిరళ స్వేచ్ఛ వెన్కముందరయ బోక వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల బూని విహరించు బశ్చిమ భూధరమున; రజని రానున్నదంచు దెల్పంగ రాదె? శ్యామలాంబర పరిణాహ సరసిలోన బ్రణయలీలా విహార విలాసినులగు తారకల గాంచుమా! నీ హృదయమునందు భావ నక్షత్ర కాంతులు పర్వునేమె! బి. కింది పద్యాన్ని సామాజిక దృష్టితో వ్యాఖ్యానించండి.10 ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్ బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే దెప్పుడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్. సి. కింది కవితా పంక్తుల్లో కనిపించే ప్రతీకాత్మకతను వ్యాఖ్యానించండి. 10 పతితులార! భ్రష్టులార! దగాపడిన తమ్ములార! మీకోసం కలం పట్టి, ఆకాశపు దారులంట అడావుడిగ వెళిపోయే, అరుచుకుంటు వెళిపోయే జగన్నాథుని రథచక్రాల్, రథ చక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను! భూకంపం పుట్టిస్తాను! నట ధూర్జటి నిటాలాక్షి పగిలిందట! నిటాలాగ్ని రగిలిందట! నిటాలాగ్ని! నిటాలార్చి! నిటాలాక్షి పటాలుమని ప్రపంచాన్ని భయపెట్టింది! డి. కింది పద్యంలో చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని గుర్తించండి. 10 ఇంతకుమించి యాపద లికేమని కల్గు, రథంబు చేత ద్రొ క్కింతురటయ్య భూ ప్రజల, నెంతగనున్న సిరుల్ భుజింత్రు పా లింతురు, రాజులైన వదలింతురు, తప్పులు కల్గినవ్ విచా రింతురు కాక, చంపుట సరే ప్రజ నిట్టు లకారణంబుగన్? ఇ. కింది కవితా పంక్తులను కళా సౌందర్య దృష్టితో పరిశీలించండి. 10 కోకిలాది శకుంతముల కాకలీ స్వరములు తప్ప వేరు గొంతుకలు పల్కిన తీరు కానిపించదచట గువ్వల మువ్వపు వ్రేళుల కొసల తాకిడులను తప్ప అచట చిగురు కొమ్మలు అ న్య స్పర్శ నెరుంగ లేదు. 6. ఎ. సంప్రదాయ సమాజంలో ఆధునికతను సంతరించుకున్న ఆణిముత్యాలు గురజాడ కథలు - చర్చించండి. 25 బి. శారద లేఖలు స్త్రీ చైతన్యానికి మూలాలు - వివరించండి. 25 7. ఎ. శ్రీశ్రీ ఆశించిన సమాజాన్ని కవితల ఆధారంగా చిత్రీకరించండి. 25 బి. కృష్ణపక్షంలో విషాద సౌందర్య నైరాశ్యాల అన్వేషణను పరిశీలించండి. 25 8. ఎ. అల్ప జీవి స్వగతం - ఆత్మ న్యూనతా భావ వ్యక్తీకరణను విశ్లేషించండి. 25 బి. ఎన్.జి.ఓ. నాటకంలోని పాత్రల మానసిక చిత్రణను అనుశీలించండి. 25 -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్న పేపర్స్
OPTIONAL SUBJECTS PUBLIC ADMINISTRATION (PAPER-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Question Nos. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE question from each Section. SECTION-A 1. Attempt the following in about 150 words each. 10 × 5 = 50 a) "The Charter Act of 1853 marked the beginning of parliamentary system in India." Explain. b) "Civil service neutrality is founded on the application of the principles of Rule of Law." Comment. c) "The second generation reforms in the Panchayati Raj institutions have changed Panchayats from an agency of development at local level into a political institution." Discuss. d) "Finance Commission in India performs the job of statistics aggregation." Comment. e) "Planning enables comprehensive and scientific understanding of problems." Examine the statement in the context of planning methodology. 2. a) "Bureaucratic agencies, characterized by established procedures, specialization, leadership, clear objectives, are not ideal to handle disaster management." Examine with reference to the need for administrative flexibility in managing disasters. (In about 250 words) 20 Marks b) "The liberal-democratic ideology of the West influenced the shaping of value premises of the Indian Constitution." Discuss. (In about 250 words) 20 Marks c) "Autonomy to public sector undertakings is a myth." Analyse in the context of the use of government expenditures by politicians who control governments at different levels. (In about 150 words) 10 Marks 3. a) "Laws are enacted without involving the police in the conception stage, with the result implementation of these laws leaves much to be desired." Examine the role of police in protection of children. (In about 250 words) 20 Marks b) "Central Secretariat is the nodal agency for administering the Union subjects and establishing coordination among the various activities of the government." Discuss. (In about 250 words) 20 Marks c) Is there a need to dispense with the Office of the Governor? Examine in the context of coalition governments. (In about 150 words) 10 Marks 4. a) "There is a tendency of centralism in Indian federalism, but it is not because of its institutional framework but because of its socialist goals and centrally devised plan development." Explain the statement in the context of Union-State relationship. (In about 250 words) 20 Marks b) "Use of Information and Communication Technology (ICT) in Panchayat's functions enhances efficiency, transparency and accountability and also induces mass ICT culture." Examine. (In about 250 words) 20 Marks c) "Judicial review of administrative tribunal's decisions defeats the very objective of establishing tribunals." Comment with reference to Central Administrative Tribunal. (In about 150 words) 10 Marks SECTION-B 5. Attempt the following in not more than 150 words each. 10 × 5 = 50 a) "Public Administration today tends to be less public in quantitative terms, but more responsive to public needs than before in qualitative terms." Examine with reference to citizen-centric administration. b) "Performance budgeting failed because it was applied to sectors/ programmes where quantitative evaluation was not feasible." Examine the principles underlying performance budgeting techniques. c) "The design of the Indian Police was to subjugate the Indian People in the aftermath of 1857." Analyse in the context of the Indian Police Act of 1861. d) "Reducing the size (geographical area) of the district will provide relief to the overburdened and overworked collector." Comment. e) "The concept of social audit is more comprehensive than that of traditional audit." Comment. 6. a) "Gandhian model of decentralization is similar to the process of reinventing governance." Analyse in the context of good governance. (In about 250 words) 20 Marks b) "Accounting is the essence of producing promptly and clearly the facts relating to financial conditions and operations that are required as a basis of management." Substantiate the statement in the context of accounting methods and techniques in government. (In about 250 words) 20 Marks c) Explain the important recommendations of V. T. Krishnamachary Committee (1962) on Indian and State Administrative Services and problems of District Administration. (In about 150 words) 10 Marks 7. a) "The 73rd Amendment, it is felt, may accentuate fiscal indiscipline by establishing between States and Local Governments a system of transfers similar to the one in place between the Central and State Governments." (World Bank) Comment. (In about 250 words) 20 Marks b) "Municipal Administration in India faces both structural and operational challenges." Examine in the context of post-74th Amendment Act. (In about 250 words) 20 Marks c) "Self-Help Groups (SHGs) have contributed to a change in the role of rural women in development-from symbolic participation to empowerment." Discuss. (In about 150 words) 10 Marks 8. a) "There is both criminalisation of politics and politicisation of criminals in India." Examine and identify the challenges they cause for law and order administration. (In about 250 words) 20 Marks b) "The basic ethical problem for an administrator is to determine how he/she can use discretionary power in a way that is consistent with democratic values." Comment with reference to corruption in administration. (In about 250 words) 20 Marks c) Justify the constitutional provision to treat certain expenditure as charged upon the Consolidated Fund of India. (In about 150 words) 10 Marks GEOGRAPHY (Paper-II) Time: 3 Hours Max. Marks: 250 INSTRUCTIONS n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions No. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. n Word limit in questions, wherever specified, should be adhered to. n Illustrate your answers with suitable sketches, maps and diagrams, wherever considered necessary. SECTION A 1. On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical/ commercial/ economic/ ecological/ environmental/ cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Mishmi Hills ii) Lipulekh Pass iii) Beas River iv) Rihand Dam v) Amarnath b) Explain the topographical and structural characteristics of the Siwalik Range. (150 words) 10 c) Discuss the mechanism of Indian Monsoon. (150 words) 10 d) Identify the main industrial clusters of India and account for their development. (150 words) 10 e) Explain the method of delineating crop-association regions with reference to India. (150 words) 10 2. a) Discuss the potentiality and present status of horticulture in the Western and Central Himalaya. (250 words) 20 b) Delineate the coalfields of India and mention their distinctive features. (150 words) 15 c) Explain the role of multinationals in globalization of industries in India. (150 words) 15 3. a) Distributional pattern of industries in India does not provide requisite basis for division of the country into distinct industrial regions. Elaborate. (250 words) 20 b) Discuss the role of institutional factors in shaping the pattern of Indian agriculture. (150 words) 15 c) What do you understand by 'Young India? How can the present state of population composition be converted into an asset for the country? (150 words) 15 4. a) Comment on the feasibility of interlinking of rivers of India and its possible contribution to resolution of water crisis. (250 words) 20 b) Define agricultural productivity. Mention the methods of its measurement and bring out the disparities in its regional distribution. (150 words) 15 c) Discuss the problems in realization of benefits of globalization and liberalization in industrial sector of India. (150 words) 15 SECTION-B 5. For Question Nos. 5(a) to 5(d), write on each in about 150 words and answer Question No. 5(e) as directed therein: a) City-regions as territorial unit for regional planning and development 10 b) Snags in the Food Security Policy of India 10 c) Demographic dividend and its implications on Indian socio-economic environment 10 d) Planning and development of 'Tribal Regions' in India 10 e) On the outline map of India provided to you, mark the location of all of the following. Write in your QCA Booklet the significance of these locations, whether physical / commercial / economic / ecological / environmental / cultural, in not more than 30 words for each entry: 2 × 5 = 10 i) Rajgir ii) Sindri iii) National Highway No.24 iv) Churk v) Indira Gandhi Canal 6. a) Write a note on geopolitics of the Indian Ocean realm. (250 words) 20 b) Comment on the basis of creation of new States in India in 2000. (150 words) 15 c) Enumerate the basic indicators of development and explain their application in identification of the spatial diversity in development in India. (150 words) 15 7. a) Write a note on the emergence of National Settlement System in colonial India and discuss the factors contributing to urbanization in post-independence period. (250 words) 20 b) Define slums and explain their problems. (150 words) 15 c) Discuss the objectives of "Vision 2020" in creation of viable village complex in India for "Inclusive Rural Development" programme. (150 words) 15 8. a) Identify the earthquake-prone zones and suggest strategy for their management. (250 words) 20 b) Describe the impact of linguistic diversity on the development of various regions of India. (150 words) 15 c) Describe how urbanization creates air and water pollution in India. (150 words) 15 -
ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలుసివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ఆయా రాష్ట్రాల్లో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయలకు మించకూడదు. ఏదైనా ఉద్యోగం లేదా కోర్సు చేస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు. ఎంపిక: స్క్రీనింగ్ టెస్టు ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: నవంబరు 5 స్క్రీనింగ్ టెస్టు తేది: నవంబరు 16 వెబ్సైట్లు: తెలంగాణ అభ్యర్థులకు: http://tsbcstudycircles.cgg.gov.in ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు: http://apbcwelfare.cgg.gov.in -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్న పేపర్స్
General Studies (Paper-IV) Time: 3 Hours Max.Marks: 250 Instructions * There are Fourteen questions divided in two Sections and printed both in Hindi and in English. * All questions are compulsory. Answer questions in NOT MORE than the word limit specified for each in the parenthesis. Content of the answer is more important than its length. Section-A 1. What do you understand by values and ethics? In what way is it important to be ethical along with being professionally com-petent? (150 words) 10 Marks 2. a) What do you understand by the following terms in the context of public service (250 words) 3´5 =15 Marks i) Integrity ii) Perseverance iii) Spirit of service iv) Commitment v) Courage of conviction b) Indicate two more attributes which you consider important for public service. Justify your answer. (100 words) 10 Marks 3. Some people feel that values keep changing with time and situation, while others strongly believe that there are certain universal and eternal human values. Give your perception in this regard with due justification (150 words) 10 Marks 4. What is emotional intelligence and how can it be developed in people? How does it help an individual in taking ethical decisions? (150 words) 10 Marks 5. a) What do you understand by the term voice of conscience? How do you prepare yourself to heed to the voice of conscience (150 words) 10 Marks b) What is meant by crisis of conscience? Narrate one incident in your life when you were faced with such a crisis and how you resolved the same. (150 words) 10 Marks 6. Given below are three quotations of great moral thinkers/ philo-sophers. For each of these quotations, bring out what it means to you in the present context: a) There is enough on this earth for every one's need but for no one's greed. - Mahatma Gandhi (150 words) 10 Marks b) Nearly all men can withstand adversity, but if you want to test a man's character, give him power - Abraham Lincoln. (150 words) 10 Marks c) I count him braver who overcomes his desires than him who overcomes his enemies - Aristotle (150 words) 10 Marks 7. The good of an individual is contained in the good of all. What do you understand by this statement? How can this principal be implemented in public life. (150 words) 10 Marks 8. It is often said that politics and ethics do not go together. What is your opinion in this regard? Justify your answer with illustrations. (150 words) 10 Marks Section-B In the following questions, carefully study the cases presented and then answer the questions that follow. 9. A public information officer has received an application under RTI Act. Having gathered the information, the PIO discovers that the information pertains to some of the decisions taken by him, which were found to be not altogether right. There were other employees also who were party to these decisions. Disclosure of the information is likely to lead to disciplinary action with possibility of punishment against him as well as some of his colleagues, non-disclosure or part disclosure of camouflaged disclosure of information will result into lesser punishment or no punishment. The PIO is otherwise an honest and conscientious person but this particular decision on which the RTI application has been filled, turned out to be wrong. He comes to you for advice. The following are some sugges-ted options. Please evaluate the merits and demerits of each of the options. i) The PIO could refer the matter to his superior officer and seek his advice and act strictly in accordance with the advice, even though he is not completely in agreement with the advice of the superior. ii) The PIO could proceed on leave and leave the matter to be dealt by his successor in office or request for transfer of the application to another PIO. iii) The PIO could weigh the consequences of disclosing the information truthfully, including the effect on his career and reply in a manner that would not place him or his career in jeopardy, but at the same time a little compromise can be made on the contents of the information. iv) The PIO could consult his other colleagues who are party to the decision and take action as per their advice. Also please indicate (without necessarily restricting to the above options) what you would like to advise, giving proper reasons. (250 words) 20 Marks 10. You are working as an Executive Engineer in the construction cell of a municipal corporation and are presently in-charge of the construction of a flyover. There are two junior Engineers under you who have the responsibility of day-to-day inspection of the site and are reporting to you, while you are finally reporting to the Chief Engineer who heads the cell. While the construction is heading towards completion, the Junior Engineers have been regularly reporting that all construction is taking place as per design specifications. However, in one of your surprise inspections, you have noticed some serious deviations and lacunae which in your opinion, are likely to affect the safety of the flyover. Rectification of these lacunae at this stage would require a substantial amount of demolition and rework which will cause a tangible loss to the contractor and will also delay completion. There is a lot of public pressure on the corporation to get this construction completed because of heavy traffic congestion in the area, When you brought this matter to the notice of the Chief Engineer, he advised you that in his opinion it is not a very serious lapse and may be ignored. He advised for further expediting the project, for completion in time. However, you are convinced that this was a serious matter which might affect public safety and should not be left unaddressed. What will you do in such a situation? Some of the options are given below. Evaluate the merits and demerits of each of these options and finally suggest what course of action you would like to take, giving reasons. (250 words) 20 Marks i) Follow the advice of the Chief Engineer and go ahead. ii) Make an exhaustive report of the situation bringing out all facts and analysis along with your own viewpoints stated clearly and seek for written orders from the Chief Engineer. iii) Call for explanation from the junior Engineers and issue orders to the contractor for necessary correction within targeted time. iv) Highlight the issue so that it reaches superiors above the Chief Engineer. v) Considering the rigid attitude of the Chief Engineer, seek transfer from the project or report sick. 11. Sivakasi in TamilNadu is known for its manufacturing clusters on firecrackers and matches. The local economy of the area is largely dependent on firecrackers industry. It has led to tangible economic development and improved standard of living in the area. So far as child labour norms for hazardous industries like fire crackers industry are concerned, International Labour Organization (ILO) has set the minimum age as 18 years. In India, however, this age is 14 years. The units in industrial clusters of firecrackers can be classified into registered and non-registered entities. One typical unit is household based work. Though the law is clear on the use of child labour employment norms in registered/ non registered units, it does not include household based works. Household-based work means children working under the supervision of their parents/ relatives. To evade child labour norms, several units project themselves as household based works but employ children from outside. Needless to say that employing children saves the costs for these units leading to higher profits to the owners. On your visit to one of the units at Sivakasi, the owner takes you around the unit which has about 10-15 children below 14 years of age. The owner tells you that in his household-based unit, the children are all his relatives. You notice that several children smirk, when the owner tells you this. On deeper enquiry, you figure out that neither the owner not the children are able to satisfactorily establish their relationship which each other a) Bring out and discuss the ethical issues involved in the above case. b) What would be your reaction after your above visit? (300 words) 25 Marks 12. You are heading a leading technical institute of the country. The institute is planning to convene an interview panel shortly under your chairmanship for selection of the post of professors. A few days before the interview, you get a call from the personal secretary (PS) of a senior government functionary seeking your intervention in favour of the selection of a close relative of the functionary for this post. The PS also informs you that he is aware of the long pending and urgent proposals of your institute for grant of funds for modernization, which are awaiting the functionary's approval. He assures you that he would get these proposals cleared. a) What are the options available to you? b) Evaluate each of these options and choose the options which you would adopt giving reasons (250 words) 20 Marks 13. As a senior officer in the Finance Ministry, you have access to some confidential and crucial information about policy decisions that the Government is about to announce. These decisions are likely to have far reaching impact on the housing and construction industry. If the builders have access to this information beforehand they can make huge profits. One of the builders has done a lot of quality work for the government and is known to be close to your immediate superior, who asks you to disclose this information to the said builder. a) What are the options available to you? b) Evaluate each of these options and choose the option which you would adopt giving reasons. (250 words) 20 Marks 14. You are the Executive Director of an upcoming Infotech Company which is making a name for itself in the market. Mr. A, who is a star performer, is heading the marketing team. In a short period of one year, he has helped in doubling the revenues as well as creating a high brand equity for the Company so much so that you are thinking of promoting him. However, you have been receiving information from many corners about his attitude towards the female colleagues, particularly his habit of making loose comments on women. In addition, he regularly sends indecent SMS's to all the team members including his female colleagues. One day, late in the evening Mrs. X who is one of Mr.A's team members, comes to you visibly disturbed. She complains against the continued misconduct of Mr.A, who has been making undesirable advances towards her and has even tried to touch her inappropriately in his cabin. She tenders her resignation and leaves your office. a) What are the options available to you? b) Evaluate each of these options and choose the option you would adopt, giving reasons. (250 words) 20 Marks OPTIONAL SUBJECT PUBLIC ADMINISTRATION (PAPER-I) Time: 3 Hours Max. Marks: 250 Instructions n There are EIGHT questions divided in two SECTIONS. n Candidate has to attempt FIVE questions in all. n Questions no. 1 and 5 are compulsory and out of the remaining, THREE are to be attempted choosing at least ONE from each section. Section - A Answer the following questions in not more than 150 words each. Q 1. 10 × 5 = 50 a) How did traditional public administration "resolve a fundamentally irresolvable problem - creating an administration strong enough to be effective but not so strong enough to endanger accountability"? 10 Marks b) The theory of 'organizational incompetence' has two separate and distinct faces. Examine Chris Argyris' views on this. 10 Marks c) "In the globalized public administration, hierarchy creates more ethical problems than it solves.. .'' Comment. 10 Marks d) Public Administration in the neo-liberal era is governed less by instruments of internal accountability and more by those of external accountability. Elaborate. 10 Marks e) Discuss the view that "tribunals should have the same degree of independence from the executive as that enjoyed by the Supreme Court and the High Courts, especially for those tribunals that look over the functions of High Courts.'' 10 Marks Q 2. a) "New Public Management may have neither been the saviour its enthusiasts promised nor the devil its critics worried it would be." Discuss. 25 Marks b) "The design of the physical structure, the anatomy of the organization came first, and was indeed the principal consideration." "An organization is a system of interrelated social behaviours of participants." Analyse these statements and evaluate the contributions of the respective approaches to administration theory. 25 Marks Q 3. a) "Decisions are not made by 'organizations', but by 'human beings' behaving as members of organizations." How do Bernard and Simon conceptualize the relation between the decisions of the individual employee and the organizational authority? 20 Marks b) "A variety of different organizational arrangements can be used to provide different public goods and services." Explain the theory underlying this proposition and its potential contribution. 15 Marks c) What is the nature of psychological contract pursued by organizational management through authority and the employees through exertion of upward influence? 15 Marks Q 4. a) Structural theory is, by and large, grounded in classical principles of efficiency, effectiveness and productivity. Explain. 25 Marks b) "Public interest is still inadequate as a ground concept to evaluate public policy." Discuss. 25 Marks SECTION - B Q 5. Answer the following questions in not more than 150 words each. 10 × 5 = 50 a) "Comparative Public Administration both resembles and differs from modern organization theory." Elaborate. 10 Marks b) "In organizational analysis there is always gender around." (Gouldner). Argue. 10 Marks c) What is administrative elitism? How does it evolve in public administration? Elaborate your response with reference to historical examples. 10 Marks d) The success rate of e-government projects in most developing countries is stated to be rather low. Assess the reason. 10 Marks e) What new models of budgetary capacity and incapacity have emerged after the decline of Planning Programming Budgeting and Zero-based Budgeting? 10 Marks Q 6. a) "For those who use the euphemism of 'shared power' for participation, the appropriate literature for guidance is practical politics, not organization and management." "Strong state and strong civil society are the need to develop both participatory democracy and responsive government as mutually reinforcing and supportive." Bring out the myths and realities associated with public participation. 20 Marks b) ".... in most cases .... newly independent states, of the nations of Africa, Asia and Latin America, despite their differences .... are in transition." (Ferrel Heady). What common features are indicative of characteristics of their administrative patterns (cultures)? 15 Marks c) "To talk about the regulatory framework is to talk about governance." Analyse the statement in the context of public-private partnerships and identify the elements of regulation. 15 Marks Q 7. a) "Economic reforms are a work in progress with the state reluctant to fully relinquish its reins." Discuss the statement with regard to implementation of economic reforms in India. 15 Marks b) "The policy process was not structured in the way required by bureaucratic planning." "Arguably, incrementalism now stands most in contrast to neo-liberal nationality that impose markets against both gradual change and democratic liberalism." Analyse these two statements. 20 Marks c) Budget allocation involves series of tensions between actors with different backgrounds, orientations and interests and between short-term goals and long-term institutional requirements. Discuss. 15 Marks Q 8. a) Read the following instances carefully and suggest what specific perspectives on organizational psychology of motivation would help the concerned organization to reconcile the needs of the following four persons with the needs of the organization: 30 Marks i) Mr. A comes to his office with clocklike punctuality; does his work with impeccable honesty and integrity; takes order from above gladly; responds well to overtures by peers; but neither mixes with anyone himself nor seeks anyone's company. What is more, he seems quite happy in his isolation. ii) Mr. B is an efficient charge-hand at the welding shop. He is very outgoing and makes friends fast, but falls out with them very fast too. He is, however, easily pacified when anyone asks him to calm down in the name of the organization. iii) Dr. C is completely happy and absorbed when he is teaching in the classes, and does not at all mind when his workload gets heavier and covers new areas. But he gets angry when the finance section raises objections about his medical bills; and is furious that the higher administration is yet to give him full tenure. iv) Mr. D is a metallurgist in the forge shop of the steel plant, and has received honours for his innovativeness in modifying conventional alloys. He also paints well and values his painting skills far more than his metallurgy and is extremely unhappy that the company house journal did not finally carry his water sketch on its front cover. b) Suppose the Government of India is thinking of constructing a dam in a mountain valley girded by forests and inhabited by ethnic communities. What rational techniques of policy analysis should it resort to for coping with likely uncertainties and unforeseen contingencies? 20 Marks -
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2013 ప్రశ్న పేపర్స్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 24న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 4.52 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వగా.. 16,933 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. సివిల్స్ మెయిన్ పరీక్షలు డిసెంబరు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యే అభ్యర్థులకైనా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేయడం ఎంతో ప్రయోజనకరం. అంతేకాకుండా సివిల్స్ మెయిన్లో మార్పులు ప్రవేశ పెట్టిన తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న పరీక్షలివి.ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రయోజనార్థం సివిల్ సర్వీసెస్ మెయిన్ 2013 ప్రశ్నపత్రాలను అందజేస్తున్నాం... Essay (Compulsory) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before atte-mpting questions: * The Essay must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. * Word limit, as specified should be adhered to. * Any page or portion of the page left blank in the answer book must be clearly struck off. Write an essay on any ONE of the following topics in NOT MORE than 2500 words. 250 Marks 1. Be the change you want to see in others - Gandhiji. 2. Is the Colonial mentality hind-ering India's success? 3. GDP (Gross Domestic Product) along with GDH (Gross Dome-stic Happiness) would be the right indices for judging the well - being of a country. 4. Science and Technology is the panacea for the growth and security of the nation. GENERAL STUDIES (PAPER-I) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions: * There are Twenty-Five Questions Printed both in Hindi and in English. n All questions are compulsory. * The number of marks carried by a question / part is indicated against it. * Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. * Word limit in questions, if specified, should be adhered to. * Any page or portion of the page left blank in the Question-Cum-Answer Booklet must be clearly struck off. Answer the questions in NOT MORE than the word limit specified for each in the paren-thesis. Content of the answer is more important than its length. 1. Though not very useful from the point of view of a connected political history of South India, the Sangam literature portrays the social and economic conditions of its time with remarkable vividness. Comment. (200 words). 10 Marks 2. (a) Discuss the 'Tandava' dance as recorded in early Indian inscri-ptions. (100 words) 5 Marks (b) Chola architecture repres-ents a high watermark in the evolution of temple archit-ecture. Discuss. (100 words) 5 Marks 3. Defying the barriers of age, gender and religion, the Indian women became the torch bearer during the struggle for freedom in India. Discuss. (200 words) 10 Marks 4. Several foreigners made India their homeland and participated in various movements. Analyze their role in the Indian struggle for freedom. (200 words) 10 Marks 5. ''In many ways, Lord Dalhousie was the founder of modern India.'' Elaborate. (200 words) 10 Marks 6. Critically discuss the objectives of Bhoodan and Gramdan Move-ments initiated by Acharya Vinoba Bhave and their success. (200 words) 10 Marks 7. Write a critical note on the evolution and significance of the slogan, 'Jai Jawan Jai kisan'. (200 words) 10 Marks 8. Discuss the contributions of Maulana Abul Kalam Azad to pre and post independent India. (200 words) 10 Marks 9. Analyze the circumstances that led to the Tashkent Agreement in 1966. Discuss the highlights of the Agreement. (200 words) 10. Critically examine the compulsions which prompted India to play a decisive role in the emergence of Bangladesh. (200 words) 10 Marks 11. " 'Latecomer' Industrial Revolution in Japan involved certain factors that were markedly different from what West had experienced". Analyze. (200 words) 10 Marks 12. "Africa was chopped into States artificially created by accidents of European competition." Ana-lyze. (200 words) 10 Marks 13. "American Revolution was an economic revolt against mercantilism." Substantiate. (200 words) 10 Marks 14. What policy instruments were deployed to contain the Great Economic Depression? (200 words) 10 Marks 15. Discuss the various social problems which originated out of the speedy process of urbanization in India. (200 words) 10 Marks 16. "Male membership needs to be encouraged in order to make women's organization free from gender bias." Comment. (200 words) 10 Marks 17. Critically examine the effect of globalization on the aged population in India. (200 words) 10 Marks 18. Growing feeling of regionalism is an important factor in generation of demand for a separate State. Discuss. (200 words) 10 Marks 19. (a) What do you understand by the theory of 'continental drift'? Discuss the prominent evidences in its support. (100 words) 5 Marks (b) The recent cyclone on east coast of India was called 'Phailin'. How are the tropical cyclones named across the world? Elaborate. (100 words) 5 Marks 20. (a) Bring out the causes for the formation of heat islands in the urban habitat of the world. (100 words) 5 Marks (b) What do you understand by the phenomenon of 'temperature inversion' in meteorology? How does it affect we-ather and the habitants of the place? (100 words) 5 Marks 21. Major hot deserts in northern hemisphere are located between 20-30 deg N latitudes and on the western side of the continents. Why? (200 words) 10 Marks 22. (a) Bring out the causes for more frequent occurrence of landslides in the Himalayas than in the Western Ghats. (100 words) 5 Marks (b) There is no formation of deltas by rivers of the Western Ghats. Why? (100 words) 5 Marks 23. (a) Do you agree that there is a growing trend of opening new sugar mills in southern States of India? Discuss with Justification. (100 words) 5 Marks (b) Analyze the factors for the highly decentralized cotton textile industry in India. (100 words) 5 Marks 24. With growing scarcity of fossil fuels, the atomic energy is gaining more and more significance in India. Discuss the availability of raw material required for the ge-neration of atomic energy in Ind-ia and in the world. (200 words) 10 Marks 25. It is said that India has substantial reserves of shale oil and gas, which can feed the needs of the country for quarter century. However, tapping of the resource does not appear to be high on the agenda. Discuss critically the availability and issues involved. (200 words) 10 Marks General Studies (Paper-II) Time: Three Hrs Max.Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before atte-mpting questions n There are Twenty-Five Questions Printed both in Hindi and English. * All questions are compulsory * The number of marks carried by a question/ part is indicated against it. * Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. * Word limit in questions, if speci-fied, should be adhered to. * Any page of portion of the page left blank the Question-Cum-Answer Booklet must be clearly struck off. Answer the questions in NOT MORE than the word limit specified at the end of each question in the parenthesis. Cont-ent of the answer is more impor-tant than its length. 1. The role of individual MPs (Member of Parliament) has di-minished over the year and as a result healthy constructive deb-ates on policy issues are not usually witnessed. How far can this be attributed to the anti-de-fection law which was legislated but with a different intention? (200 words) 10 Marks 2. Discuss Section 66A of IT Act, with reference to its alleged violation of Article 19 of the Co-nstitution. (200 words)10 Marks 3. Recent directives from Ministry of Petroleum and Natureal Gas are preceived by the 'Nagas' as a threat to override the exceptional status enjoyed by the State. Discuss in light of Article 371A of the Indian Constitution. (200 words) 10 Marks 4. "The Supreme Court of India keeps a check on arbitrary power of the Parliament in amending the Constitution' Discuss criti-cally. (200 words) 10 Marks 5. Many State Government further bifurcate geographical admini-strative areas like Districts and Talukas for better governance. In light of the above, can it also be justified that more member of smaller states would bring in effective governance at State level? Discuss. (200 words) 10 Marks 6. Constitutional mechanisms to resolve the inter-state water disputes have failed to address and solve the problems. Is the failure due to structural or pro-cess inadequacy or both? Dis-cuss. (200 words) 10 Marks 7. Discuss the recommendations of the 13th Finance Commission which have been a departure from the previous commissions for strengthening the local gove-rnment finances. (200 words) 10 Marks 8. The product diversification of financial institutions and insu-rance companies, resulting in overlapping of products and ser-vices strengthens the case for the merger of the two regulatory age-ncies, namely SEBI and IRDA justify. (200 words) 10 Marks 9. The concept of Mid Day Meal (MIDM) scheme is almost a century old in India with early beginnings in Madras Presidency in pre-independent India. The scheme has again been given impetus in most states in the last two decades. Critically examine its twin objectives, latest mandates and success. (200 words) 10 Marks 10. Pressure group politics is sometimes seen as the informal face of politics. With regards to the above, assess the structure and functioning of pressure groups in India. (200 words) 10 Marks 11. The legitimacy and accountabi-lity of Self Help Groups (SHGs) and their patrons, the micro-finance outfits, needs systematic assessment and scrutiny for the sustained success of the concept. Discuss. (200 words) 10 Marks 12. The Central Government freque-ncy complains on the poor performance of the State Governments in eradicating suffering of the vulnerable sections of the society. Restructuring of Centrally sponsored schemes across the sectors for ameliorating the cause of vulnerable sections of population aims at providing flexibility to the States in better implementation. Critically evaluate. (200 words) 10 Marks 13. Electronic cash transfer system for the welfare schemes is an ambitious project to minimize corruption, eliminate wastage and facilitate reforms. Comment. (200 words) 10 Marks 14. The basis of providing urban amenities in rural areas (PURA) is rooted in establishing conne-ctivity. Comment. (200 words) 10 Marks 15. Identify the Millennium Develo-pment Goals (MDGs) that are related to health. Discuss the success of the actions taken by the government for achieving the same. (200 words) 10 Marks 16. Though Citizens charters have been formulated by many public service delivery organizations, there is no corresponding impro-vement in the level of citizen's satisfaction and quality of ser-vices being provided. Analyze. (200 words) 10 Marks 17. "A national Lokpal, however strong it may be, cannot resolve the problems of immorality in public affairs." Discuss. (200 words) 10 Marks 18. The proposed withdrawal of International Security Assistance Force (ISAF) from Afghanistan in 2014 is fraught with major security implications for the countries of the region. Examine in light of the fact that India is faced with a plethora of challe-nges and needs to safeguard its own strategic interests. (200 words) 10 Marks 19. What do you understand by "The String of Pearls"? How does it impact India? Briefly outline the steps taken by India to counter this. (200 words) 10 Marks 20. Economic ties between India and Japan while growing in the recent years are still far below their potential. Elucidate the policy constraints which are inhi-biting this growth. (200 words) 10 Marks 21. The protests in Shahbag Square in Dhaka in Bangladesh reveal a fundamental split in society between the nationalists and Isla-mic forces. What is its signi-ficance for India? (200 words) 10 Marks 22. Discuss the political develop-ments in Maldives in the last two years. Should they be of any cause of concern to India? (200 words) 10 Marks 23. In respect of India-Sri Lanka relations, discuss how domestic factors influence foreign policy. (200 words) 10 Marks 24. What is meant by Gujral do-ctrine? Does it have any rele-vance today? Discuss. (200 words) 10 Marks 25. The World Bank and the IMF, collectively known as the Bretton Woods Institutions, are the two intergovernmental pillars sup-porting the structure of the world's economic and financial order. Superficially, the World Bank and the IMF exhibit many common characteristics, yet their role, functions and mandate are distinctly different. Elucidate. (200 words) 10 Marks GENERAL STUDIES (PAPER-III) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before atte-mpting questions: n There are Twenty-Five Questions Printed both in Hindi and in English. * All questions are compulsory. * The number of marks carried by a question / part is indicated against it. * Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. * Word limit in questions, wherever specified, should be adhered to. * Any page or portion of the page left blank the Answer book must be clearly struck off. Answer questions in NOT MORE than the word limit spec-ified at the end of each question in the parentheses. Content of the answer is more important than its length. 1. With a consideration towards the strategy of inclusive growth, the new Companies Bill, 2013 has indirectly made CSR a mandatory obligation. Discuss the challenges expected in its implementation in right earnest. Also discuss other provisions in the Bill and their implications. (200 words) 10 Marks 2. What were the reasons for the introduction of Fiscal Responsi-bility and Budget Management (FRBM) Act, 2003? Discuss critically its salient features and their effectiveness. (200 words) 10 Marks 3. What is the meaning of the term 'tax expenditure'? Taking hous-ing sector as an example, discu-ss how it influences the bud-getary policies of the gover-nment. (200 words) 10 Marks 4. Food Security Bill is expected to eliminate hunger and malnutrition in India. Critically discuss various apprehensions in its effective implementation along with the concerns it has generated in WTO. (200 words) 10 Marks 5. What are the different types of agriculture subsidies given to farmers at the national and at state levels? Critically analyze the agricultural subsidy regime with reference to the distortions created by it. (200 words) 10 Marks 6. India needs to strengthen meas-ures to promote the pink revo-lution in food industry for ensu-ring better nutrition and health. Critically elucidate the state-ments. (200 words) 10 Marks 7. Examine the impact of libera-lization on companies owned by Indians. Are they competing with the MNCs satisfactorily? Dis-cuss. (200 words) 10 Marks 8. Establish relationship between land reforms, agriculture produ-ctivity and elimination of pove-rty in the Indian economy. Dis-cuss the difficulties in designing and implementation of agri-culture - friendly land reforms in India. (200 words) 10 Marks 9. (a) Discuss the impact of FDI entry into Multi - trade retail sector on supply chain management in commodity trade pattern of the economy. (100 words) 5 Marks (b) Though India allowed Foreign Direct Investment (FDI) in what is called multi - brand retail through the joint venture route in September 2012, the FDI, even after a year, has not picked up. Discuss the reasons. (100 words) 5 Marks 10. Discuss the rationale for introducing Goods and Services Tax (GST) in India. Bring out critically the reasons for the delay in roll out for its regime. (200 words) 10 Marks 11. Write a note on India's green energy corridor to alleviate the problem of conventional ene-rgy. (200 words) 10 Marks 12. Adoption of PPP model for infrastructure development of the country has not been free of criticism. Critically discuss pros and cons of the model. (200 words) 10 Marks 13. Bringing out the circumstances in 2005 which forced amend-ment to the section 3(d) in Indian patent Law, 1970, discuss how it has been utilized by the Supreme Court in its judgement in rejecting Novratis' patent application for 'Glivec'. Discuss briefly the pros and cons of the decision. (200 words) 10 Marks 14. What do you understand by Fixed Dose Drug Combinations (FDCs)? Discuss their merits and demerits. (200 words) 10 Marks 15. What do you understand by Umpire Decision Review System in Cricket? Discuss its various components. Explain how silicone tape on the edge of a bat may fool the system? (200 words) 10 Marks 16. (a) What is a digital signature? What does its authentication mean? Give various salient builtin features of a digital signature. (100 words) 5 Marks (b) How does the 3D printing technology work? List out the advantages and disadvantages of the technology. (100 words) 10 Marks 17. (a) What is an FRP composite material? How are they manu-factured? Discuss their applications in aviation and auto mobile industries. (100 words) 5 Marks (b) What do you understand by Run-of-river hydroelectricity project? How is it different from any other hydroelectricity project? (100 words) 5 Marks 18. How important are vulnerability and risk assessment for pre-disaster management? as an administrator, what are key areas that you would focus on in a Disaster Management System. (200 words) 10 Marks 19. What are the consequences of Illegal mining? Discuss the Ministry of Environment and Forest's concept of GO AND NO GO zones for coal mining sector. (200 words) 10 Marks 20. Enumerate the National Water Policy of India. Taking river Ganges as an example, discuss the strategies which may be adopted for river water pollution control and management. What are the legal provisions of management and handling of hazardous wastes in India? (200 words) 10 Marks 21. Money laundering poses a serious security threat to a country's economic sovereignty. What is its significance for India and what steps are required to be taken to control this menace? (200 words) 10 Marks 22. What are social networking sites and what security impli-cations do these sites present? (200 words) 10 Marks 23. Cyber warfare is considered by some defense analysts to be a larger threat than even Al Queda or terrorism. What do you understand by Cyber warfare? Outline the cyber threats which India is vulnerable to and bring out the state of the country's preparedness to deal with the same. (200 words) 10 Marks 24. Article 244 of the Indian Const-itution relates to administration of scheduled areas and tribal areas. Analyze the impact of non - implementation of the provisions of the Fifth schedule on the growth of Left Wing extremism. (200 words) 10 Marks 25. How far are India's internal security challenges linked with border management particularly in view of the long porous borders with most countries of South Asia and Myanmar? (200 words) 10 Marks -
పౌరసేవలపై త్వరలో కాల్సెంటర్
ఎస్డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య న్యూఢిల్లీ: పౌర సేవలకు సంబంధించిన సమాచారం ఇక అడిగిన వెంటనే అందనుంది. దీంతోపాటు ఫిర్యాదుచేసేందుకు కూడా ఓ అవకాశం లభించనుంది. ఇందుకు సంబంధించి త్వరలో కాల్సెంటర్ను ఏర్పాటు చేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ సుభాష్ ఆర్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్కు సంబంధించిన సమాచారం ఈ సెంటర్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీంతోపాటు తమ సమస్యలను నగరపౌరులు ఈ సెంటర్లో నమోదు చేయవచ్చన్నారు. అంకితభావంతో పనిచేస్తా అధిష్టానం తనకు కీలక బాధ్యతలను అప్పగించిందని బీజేపీ నాయకుడు, ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ అయిన సుభాష్ ఆర్య పేర్కొన్నారు. అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ను కొనసాగించడమే తన లక్ష్యమన్నారు. ఎస్డీఎంసీ పరిధిలో పారిశుధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాన న్నారు. అవినీతిని అంతమొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎస్డీఎంసీలో ఇన్స్పెక్టర్ రాజ్ లేకుండా చేస్తానని, పనితీరును మెరుగుపరుస్తానని ఆయన పేర్కొన్నారు. -
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ 2013 ప్రశ్నపత్రాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 24న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 4.52 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వగా.. 16,933 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. సివిల్స్ మెయిన్ పరీక్షలు డిసెంబరు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యే అభ్యర్థులకైనా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేయడం ఎంతో ప్రయోజనకరం. అంతేకాకుండా సివిల్స్ మెయిన్లో మార్పులు ప్రవేశ పెట్టిన తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న పరీక్షలివి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రయోజనార్థం సివిల్ సర్వీసెస్ మెయిన్ 2013 ప్రశ్నపత్రాలను అందజేస్తున్నాం... Essay (Compulsory) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before atte-mpting questions: n The Essay must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. n Word limit, as specified should be adhered to. n Any page or portion of the page left blank in the answer book must be clearly struck off. Write an essay on any ONE of the following topics in NOT MORE than 2500 words. 250 Marks 1. Be the change you want to see in others - Gandhiji. 2. Is the Colonial mentality hindering India's success? 3. GDP (Gross Domestic Product) along with GDH (Gross Domestic Happiness) would be the right indices for judging the well being of a country. 4. Science and Technology is the panacea for the growth and security of the nation. GENERAL STUDIES (PAPER-I) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions: n There are Twenty-Five Questions Printed both in Hindi and in English. n All questions are compulsory. n The number of marks carried by a question / part is indicated against it. n Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. n Word limit in questions, if specified, should be adhered to. n Any page or portion of the page left blank in the Question-Cum-Answer Booklet must be clearly struck off. Answer the questions in NOT MORE than the word limit specified for each in the parenthesis. Content of the answer is more important than its length. 1. Though not very useful from the point of view of a connected political history of South India, the Sangam literature portrays the social and economic conditions of its time with remarkable vividness. Comment. (200 words). 10 Marks 2. (a) Discuss the 'Tandava' dance as recorded in early Indian inscri-ptions. (100 words) 5 Marks (b) Chola architecture repres-ents a high watermark in the evolution of temple architecture. Discuss. (100 words) 5 Marks 3. Defying the barriers of age, gender and religion, the Indian women became the torch bearer during the struggle for freedom in India. Discuss. (200 words) 10 Marks 4. Several foreigners made India their homeland and participated in various movements. Analyze their role in the Indian struggle for freedom. (200 words) 10 Marks 5. ''In many ways, Lord Dalhousie was the founder of modern India.'' Elaborate. (200 words) 10 Marks 6. Critically discuss the objectives of Bhoodan and Gramdan Movements initiated by Acharya Vinoba Bhave and their success. (200 words) 10 Marks 7. Write a critical note on the evolution and significance of the slogan, 'Jai Jawan Jai kisan'. (200 words) 10 Marks 8. Discuss the contributions of Maulana Abul Kalam Azad to pre and post independent India. (200 words) 10 Marks 9. Analyze the circumstances that led to the Tashkent Agreement in 1966. Discuss the highlights of the Agreement. (200 words) 10. Critically examine the compulsions which prompted India to play a decisive role in the emergence of Bangladesh. (200 words) 10 Marks 11. " 'Latecomer' Industrial Revolution in Japan involved certain factors that were markedly different from what West had experienced". Analyze. (200 words) 10 Marks 12. "Africa was chopped into States artificially created by accidents of European competition." Ana-lyze. (200 words) 10 Marks 13. "American Revolution was an economic revolt against mercantilism." Substantiate. (200 words) 10 Marks 14. What policy instruments were deployed to contain the Great Economic Depression? (200 words) 10 Marks 15. Discuss the various social problems which originated out of the speedy process of urbanization in India. (200 words) 10 Marks 16. "Male membership needs to be encouraged in order to make women's organization free from gender bias." Comment. (200 words) 10 Marks 17. Critically examine the effect of globalization on the aged population in India. (200 words) 10 Marks 18. Growing feeling of regionalism is an important factor in generation of demand for a separate State. Discuss. (200 words) 10 Marks 19. (a) What do you understand by the theory of 'continental drift'? Discuss the prominent evidences in its support. (100 words) 5 Marks (b) The recent cyclone on east coast of India was called 'Phailin'. How are the tropical cyclones named across the world? Elaborate. (100 words) 5 Marks 20. (a) Bring out the causes for the formation of heat islands in the urban habitat of the world. (100 words) 5 Marks (b) What do you understand by the phenomenon of 'temperature inversion' in meteorology? How does it affect weather and the habitants of the place? (100 words) 5 Marks 21. Major hot deserts in northern hemisphere are located between 20-30 deg N latitudes and on the western side of the continents. Why? (200 words) 10 Marks 22. (a) Bring out the causes for more frequent occurrence of landslides in the Himalayas than in the Western Ghats.(100 words) 5 Marks (b) There is no formation of deltas by rivers of the Western Ghats. Why? (100 words) 5 Marks 23. (a) Do you agree that there is a growing trend of opening new sugar mills in southern States of India? Discuss with Justification. (100 words) 5 Marks (b) Analyze the factors for the highly decentralized cotton textile industry in India.(100 words) 5 Marks 24. With growing scarcity of fossil fuels, the atomic energy is gaining more and more significance in India. Discuss the availability of raw material required for the generation of atomic energy in India and in the world. (200 words) 10 Marks 25. It is said that India has substantial reserves of shale oil and gas, which can feed the needs of the country for quarter century. However, tapping of the resource does not appear to be high on the agenda. Discuss critically the availability and issues involved. (200 words) 10 Marks General Studies (Paper-II) Time: Three Hrs Max.Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before atte-mpting questions n There are Twenty-Five Questions Printed both in Hindi and English. n All questions are compulsory n The number of marks carried by a question/ part is indicated against it. n Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. n Word limit in questions, if speci-fied, should be adhered to. n Any page of portion of the page left blank the Question-Cum-Answer Booklet must be clearly struck off. Answer the questions in NOT MORE than the word limit specified at the end of each question in the parenthesis. Content of the answer is more important than its length. 1. The role of individual MPs (Member of Parliament) has di-minished over the year and as a result healthy constructive deb-ates on policy issues are not usually witnessed. How far can this be attributed to the anti-de-fection law which was legislated but with a different intention? (200 words) 10 Marks 2. Discuss Section 66A of IT Act, with reference to its alleged violation of Article 19 of the Constitution. (200 words)10 Marks 3. Recent directives from Ministry of Petroleum and Natureal Gas are preceived by the 'Nagas' as a threat to override the exceptional status enjoyed by the State. Discuss in light of Article 371A of the Indian Constitution. (200 words) 10 Marks 4. "The Supreme Court of India keeps a check on arbitrary power of the Parliament in amending the Constitution' Discuss critically. (200 words) 10 Marks 5. Many State Government further bifurcate geographical administrative areas like Districts and Talukas for better governance. In light of the above, can it also be justified that more member of smaller states would bring in effective governance at State level? Discuss. (200 words) 10 Marks 6. Constitutional mechanisms to resolve the interstate water disputes have failed to address and solve the problems. Is the failure due to structural or pro-cess inadequacy or both? Dis-cuss. (200 words) 10 Marks 7. Discuss the recommendations of the 13th Finance Commission which have been a departure from the previous commissions for strengthening the local government finances. (200 words) 10 Marks 8. The product diversification of financial institutions and insu-rance companies, resulting in overlapping of products and ser-vices strengthens the case for the merger of the two regulatory agencies, namely SEBI and IRDA justify. (200 words) 10 Marks 9. The concept of Mid Day Meal (MIDM) scheme is almost a century old in India with early beginnings in Madras Presidency in preindependent India. The scheme has again been given impetus in most states in the last two decades. Critically examine its twin objectives, latest mandates and success. (200 words) 10 Marks 10. Pressure group politics is sometimes seen as the informal face of politics. With regards to the above, assess the structure and functioning of pressure groups in India. (200 words) 10 Marks 11. The legitimacy and accountabi-lity of Self Help Groups (SH Gs) and their patrons, the micro-finance outfits, needs systematic assessment and scrutiny for the sustained success of the concept. Discuss. (200 words) 10 Marks 12. The Central Government frequency complains on the poor performance of the State Governments in eradicating suffering of the vulnerable sections of the society. Restructuring of Centrally sponsored schemes across the sectors for ameliorating the cause of vulnerable sections of population aims at providing flexibility to the States in better implementation. Critically evaluate. (200 words) 10 Marks 13. Electronic cash transfer system for the welfare schemes is an ambitious project to minimize corruption, eliminate wastage and facilitate reforms. Comment. (200 words) 10 Marks 14. The basis of providing urban amenities in rural areas (PURA) is rooted in establishing conne-ctivity. Comment. (200 words) 10 Marks 15. Identify the Millennium Development Goals (MDGs) that are related to health. Discuss the success of the actions taken by the government for achieving the same. (200 words) 10 Marks 16. Though Citizens charters have been formulated by many public service delivery organizations, there is no corresponding improvement in the level of citizen's satisfaction and quality of services being provided. Analyze. (200 words) 10 Marks 17. "A national Lokpal, however strong it may be, cannot resolve the problems of immorality in public affairs." Discuss. (200 words) 10 Marks 18. The proposed withdrawal of International Security Assistance Force (ISAF) from Afghanistan in 2014 is fraught with major security implications for the countries of the region. Examine in light of the fact that India is faced with a plethora of challenges and needs to safeguard its own strategic interests. (200 words) 10 Marks 19. What do you understand by "The String of Pearls"? How does it impact India? Briefly outline the steps taken by India to counter this. (200 words) 10 Marks 20. Economic ties between India and Japan while growing in the recent years are still far below their potential. Elucidate the policy constraints which are inhi-biting this growth. (200 words) 10 Marks 21. The protests in Shahbag Square in Dhaka in Bangladesh reveal a fundamental split in society between the nationalists and Islamic forces. What is its significance for India? (200 words) 10 Marks 22. Discuss the political develop-ments in Maldives in the last two years. Should they be of any cause of concern to India? (200 words) 10 Marks 23. In respect of India-Sri Lanka relations, discuss how domestic factors influence foreign policy. (200 words) 10 Marks 24. What is meant by Gujral do-ctrine? Does it have any rele-vance today? Discuss. (200 words) 10 Marks 25. The World Bank and the IMF, collectively known as the Bretton Woods Institutions, are the two intergovernmental pillars supporting the structure of the world's economic and financial order. Superficially, the World Bank and the IMF exhibit many common characteristics, yet their role, functions and mandate are distinctly different. Elucidate. (200 words) 10 Marks GENERAL STUDIES (PAPER-III) Time Allowed: Three Hours Maximum Marks: 250 Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions: n There are Twenty-Five Questions Printed both in Hindi and in English. n All questions are compulsory. n The number of marks carried by a question / part is indicated against it. n Answers must be written in the medium authorized in the Admission Certificate which must be stated clearly on the cover of this Question - Cum - Answer (QCA) Booklet in the space provided. No marks will be given for answers written in medium other than the authorized one. n Word limit in questions, wherever specified, should be adhered to. n Any page or portion of the page left blank the Answer book must be clearly struck off. Answer questions in NOT MORE than the word limit specified at the end of each question in the parentheses. Content of the answer is more important than its length. 1. With a consideration towards the strategy of inclusive growth, the new Companies Bill, 2013 has indirectly made CSR a mandatory obligation. Discuss the challenges expected in its implementation in right earnest. Also discuss other provisions in the Bill and their implications. (200 words) 10 Marks 2. What were the reasons for the introduction of Fiscal Responsi-bility and Budget Management (FRBM) Act, 2003? Discuss cri-tically its salient features and their effectiveness. (200 words) 10 Marks 3. What is the meaning of the term 'tax expenditure'? Taking housing sector as an example, discuss how it influences the budgetary policies of the government. (200 words) 10 Marks 4. Food Security Bill is expected to eliminate hunger and malnutrition in India. Critically discuss various apprehensions in its effective implementation along with the concerns it has generated in WTO. (200 words) 10 Marks 5. What are the different types of agriculture subsidies given to farmers at the national and at state levels? Critically analyze the agricultural subsidy regime with reference to the distortions created by it. (200 words) 10 Marks 6. India needs to strengthen measures to promote the pink revolution in food industry for ensuring better nutrition and health. Critically elucidate the statements. (200 words) 10 Marks 7. Examine the impact of libera-lization on companies owned by Indians. Are they competing with the MNCs satisfactorily? Discuss. (200 words) 10 Marks 8. Establish relationship between land reforms, agriculture productivity and elimination of poverty in the Indian economy. Discuss the difficulties in designing and implementation of agriculture - friendly land reforms in India. (200 words) 10 Marks 9. (a) Discuss the impact of FDI entry into Multi - trade retail sector on supply chain management in commodity trade pattern of the economy. (100 words) 5 Marks (b) Though India allowed Foreign Direct Investment (FDI) in what is called multi - brand retail through the joint venture route in September 2012, the FDI, even after a year, has not picked up. Discuss the reasons. (100 words) 5 Marks 10. Discuss the rationale for introducing Goods and Services Tax (GST) in India. Bring out critically the reasons for the delay in roll out for its regime. (200 words) 10 Marks 11. Write a note on India's green energy corridor to alleviate the problem of conventional energy. (200 words) 10 Marks 12. Adoption of PPP model for infrastructure development of the country has not been free of criti-cism. Critically discuss pros and cons of the model. (200 words) 10 Marks 13. Bringing out the circumstances in 2005 which forced amendment to the section 3(d) in Indian patent Law, 1970, discuss how it has been utilized by the Supreme Court in its judgement in rejecting Novratis' patent application for 'Glivec'. Discuss briefly the pros and cons of the decision. (200 words) 10 Marks 14. What do you understand by Fixed Dose Drug Combinations (FDCs)? Discuss their merits and demerits. (200 words) 10 Marks 15. What do you understand by Umpire Decision Review System in Cricket? Discuss its various components. Explain how silicone tape on the edge of a bat may fool the system? (200 words) 10 Marks 16. (a) What is a digital signature? What does its authentication mean? Give various salient built-in features of a digital signature. (100 words) 5 Marks (b) How does the 3D printing technology work? List out the advantages and disadvantages of the technology. (100 words) 10 Marks 17. (a) What is an FRP composite material? How are they manu-factured? Discuss their applicati-ons in aviation and auto mobile industries. (100 words) 5 Marks (b) What do you understand by Run-of-river hydroelectricity project? How is it different from any other hydroelectricity project? (100 words) 5 Marks 18. How important are vulnerability and risk assessment for pre-disaster management? as an administrator, what are key areas that you would focus on in a Disaster Management System. (200 words) 10 Marks 19. What are the consequences of Illegal mining? Discuss the Ministry of Environment and Forest's concept of GO AND NO GO zones for coal mining sector. (200 words) 10 Marks 20. Enumerate the National Water Policy of India. Taking river Ganges as an example, discuss the strategies which may be adopted for river water pollution control and management. What are the legal provisions of management and handling of hazardous wastes in India? (200 words) 10 Marks 21. Money laundering poses a serious security threat to a country's economic sovereignty. What is its significance for India and what steps are required to be taken to control this menace? (200 words) 10 Marks 22. What are social networking sites and what security implications do these sites present? (200 words) 10 Marks 23. Cyber warfare is considered by some defense analysts to be a larger threat than even Al Queda or terrorism. What do you understand by Cyber warfare? Outline the cyber threats which India is vulnerable to and bring out the state of the country's preparedness to deal with the same. (200 words) 10 Marks 24. Article 244 of the Indian Const-itution relates to administration of scheduled areas and tribal areas. Analyze the impact of non - implementation of the provi-sions of the Fifth schedule on the growth of Left Wing extremism. (200 words) 10 Marks 25. How far are India's internal security challenges linked with border management particularly in view of the long porous borders with most countries of South Asia and Myanmar? (200 words) 10 Marks -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి
16,933 మందికి మెయిన్స్ అర్హత డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2014 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఈ ఆగస్ట్ 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,52,334 మంది హాజరు కాగా, వారిలో 16,933 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సంవత్సరం ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 50 రోజుల వ్యవధిలో విడుదల చేసి రికార్డు సృష్టించామని, దీంతో అర్హత పొందిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుందని యూపీఎస్సీ కార్యదర్శి ఆశిమ్ ఖురానా తెలిపారు. ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన వారి సంఖ్య(4,52,334) కూడా గత సంవత్సరం హాజరైన వారి సంఖ్య(3,24,279)తో పోలిస్తే 40% పెరిగిందన్నారు. ఈ సంవత్సరం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్కు 1,106 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, వారిని కూడా ఈ ప్రిలిమ్స్ పరీక్ష ద్వారానే ఎంపిక చేశామని ఖురానా తెలిపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నవంబర్ 22 నుంచి జరుగుతాయని యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) తదితర ప్రతిష్టాత్మక విభాగాలకు ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడుస్థాయిల్లో జరుగుతుంది. పరీక్ష ప్రక్రియ పూర్తయ్యాకే సమాచారం.. సమాచార హక్కు చట్టం కింద తాము సాధించిన మార్కుల వివరాలను కోరుతూ దరఖాస్తులు చేయవద్దని యూపీఎస్సీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. మొత్తం ప్రక్రియ ముగిసి, ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించిన తరువాత మాత్రమే అభ్యర్థులు పొందిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీ వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అందువల్ల ఆర్టీఐ చట్టం ప్రకారం ఆ వివరాల కోసం దరఖాస్తు చేయవద్దని అభ్యర్థులను కోరింది. ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ 2(సీశ్యాట్) ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకే అనుకూలంగా ఉందని, ఆ పేపర్ విధానాన్ని మార్చాలని కోరుతూ ప్రిలిమ్స్ పరీక్ష ముందు అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించారు. దాంతో ఆ పేపర్లోని ఇంగ్లిష్ విభాగ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. -
అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం
సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) గురించి పెద్ద రగడే జరుగు తోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న సీశాట్ను తొలగించవలసిందని ఢిల్లీలో నిరస నలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రతిభాస్వామ్యానికి వ్యతిరేకు లుగా చిత్రిస్తున్నారు. ప్రాంతీయ భాషలలో చదువుకున్న వారికి కూడా ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యం ఇవ్వా లంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయమని కోరుతున్నం దుకే ఇలా విమర్శలు కురిపిస్తున్నారన్న మాట వాస్తవం. సీశాట్ను తొలగించ మని కోరే వారంతా ఆంగ్ల భాషకు శత్రువులైనట్టు, సొంత భాష మీద విపరీత ప్రేమను చూపిస్తున్న చాందసులన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తు న్నారు. ప్రాంతీయ భాషలలో కూడా ప్రశ్న పత్రం అందించాలని కోరడమే నేరంగా పేర్కొంటున్నారు. మౌఖిక పరీక్షలో ప్రాంతీయ మాధ్య మాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న సంగతి చెబితే, ఇంగ్లిష్ మాట్లాడేవారే సివిల్ సర్వెంట్గా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా రని వింత వాదన వినిపిస్తున్నారు. సేవాగుణానికీ, పాలనా సామర్థ్యానికి భాషతో సంబంధం లేదన్న వాదనలను పెడచెవిన పెడుతున్నారు. నిజంగానే సీశాట్ను వ్యతిరేకిస్తున్న వారంతా ప్రతిభాస్వామ్యానికి బద్ధ శత్రువులేనా? యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే ప్రతిభాస్వామ్యానికి కొలమానమా? ఇప్పుడు నిర్వహిస్తున్నది నిజంగానే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టేనా? సీశాట్ పరీక్ష అనంతరం తలెత్తిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. సీశాట్ ఎందుకు వచ్చింది? యూపీఎస్సీ దృష్టిలో సివిల్ సర్వీసెస్ పట్ల అభ్యర్థి అభిరుచికి కొలమానం ఏమిటి? లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారంలో నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, మౌఖిక భావ ప్రకటనా నైపుణ్యం, ప్రాథమిక స్థాయి గణితం, జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - అని యూపీఎస్సీ సిలబస్ను బట్టి తెలు స్తుంది. ఈ అంశాలలో వెనుకబడిన వారు సివిల్ సర్వీసెస్కు అనర్హులని యూపీఎస్సీ నిర్ధారిస్తున్నది. యూపీఎస్సీ 2011లో సీశాట్ను ప్రవేశపెట్టిన పుడు అంతా పురోగమన చర్యగా భావించారు. 2010 సంవత్సరం వరకు అభ్యర్థులు అనేక ఐచ్ఛికాంశాల నుంచి ఒకదానిని ఎంచుకునేవారు. అయితే అన్ని ఐచ్ఛికాంశాల ప్రశ్నపత్రాలను ఒకే స్థాయిలో రూపొందించడం అసాధ్యం కావడం, ఐచ్ఛికాంశాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండడం, ఆ జాబితాలో రెండు మూడు ఐచ్ఛికాంశాలను ఎంచుకున్న వారే అధికంగా కృతార్థులు కావడం వంటి సమస్యలను తరు వాత గమనించారు. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్కేలింగ్ విధా నం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఐచ్ఛికాంశం స్థానంలో అభ్యర్థుల ఆప్టిట్యూడ్ను పరీక్షించే ఉమ్మడి పరీక్షను ప్రవేశపెట్టింది. అదే సీశాట్. ఐచ్ఛికాంశాలను తొలగించడం వల్ల సమతౌల్యం సాధించే అవకాశం ఉందని అప్పుడు అభ్యర్థులంతా భావించారు. శాపంగా మారిన పరీక్ష అయితే సీశాట్తో అనుభవాలు వేరుగా ఉన్నాయి. భాషాపరంగా వివిధ రకాల చదువుల నేపథ్యాల నడుమ 1979 నుంచి కాపాడుకుంటూ వచ్చిన తటస్థ వైఖరిని నాశనం చేసే విధంగా సీశాట్ రూపు దాల్చింది. యూపీఎస్ సీయే సీశాట్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఆప్టిట్యూడ్ టెస్ట్ను ప్రవేశపె ట్టడం వెనుక ఉన్న హేతువును బలహీనపరిచింది. సివిల్ సర్వీసెస్ పట్ల అభి రుచితో పాటు, సరైన దృక్పథం ఉన్నవారు కూడా వైదొలగే రీతిలో ప్రశ్నలను రూపొందించడం శోచనీయం. సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. ప్రాంతీయ భాషల మీద వేటు ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నట్టు సీశాట్ మీద నిరసన అంటే సాధారణ ఇంగ్లిష్ మీద పోరాటం కాదని అంతా అర్థం చేసుకోవాలి. సీశాట్ ను వ్యతిరేకిస్తున్నవారంతా ఇంగ్లిష్లో రాయగల కనీస పరిజ్ఞానం ఉన్నవారే. మెయిన్స్లో ఉండే తప్పనిసరి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని సమర్థంగా ఎదుర్కొనగ లిగినవారే కూడా. అసలు ఈ కారణంతోనే ఇలాంటి వారిని ప్రాథమిక పరీ క్షలో గట్టెక్కనీయకుండా తప్పిస్తున్నారు. ఇతర విభాగాలలో మంచి పట్టు ఉన్న అభ్యర్థులు కూడా కాంప్రహెన్షన్లో తక్కువ మార్కులు సాధించడం వల్ల అపజయం పాలవుతున్నారు. సీశాట్లో ఇచ్చే ప్రశ్నలు, అభ్యర్థికి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్న అభిరుచి ఏపాటిదో వెల్లడించేందుకు ఉపకరించేవి కా కుండా, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంత అన్నది తేల్చడానికే సరిపోతాయన్న రీతిలో ఉంటున్నాయి. జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు తెచ్చుకునేలా రూపొం దిస్తూ ఉంటే, సీశాట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనువుగా రూపొం దుతోంది. సీశాట్లో అర్హత సాధించిన వారి మార్కులను పరిశీలిస్తే, మూడింట రెండువంతులు ఇందులోనే సాధిస్తున్నారు. జనరల్ స్టడీస్లో తెచ్చుకుంటున్న మార్కులు కేవలం మూడింట ఒక వంతు. 2010లో హిందీతో పాటు, ఇతర ప్రాంతీయ భాషలను మెయిన్స్లో రాత పరీక్ష మాధ్యమంగా ఎంచుకుని రాసిన అభ్యర్థులు 4,156 మంది. సీశాట్ ప్రవేశ పెట్టిన 2011లో ఆంగ్లేతర భాషలలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 1,682. కటాఫ్ను తగ్గించిన ఆప్టిట్యూడ్ ఇంతకీ ఇంత ‘ఆప్టిట్యూడ్’ ఉన్న అభ్యర్థులు మెయిన్స్లో చూపించిన ప్రతిభ ఎంతటిది? సీశాట్ను ప్రవేశ పెట్టాక మెయిన్స్లో కటాఫ్ మార్కును దారు ణంగా దించవలసి వచ్చింది. ఉదాహరణకు 2014లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1750 మార్కులకు గాను, కనిష్టంగా 564 (32 శాతం) మార్కులు మాత్రమే సాధించారు. 2014 ‘టాపర్’ జనరల్ స్టడీస్లో సాధించిన మార్కులు కేవలం 33.8 శాతం. సీశాట్ ప్రవేశపెట్టక ముందు టాపర్లుగా నిలిచిన నాగరాజన్, అద్దంకి శ్రీధర్బాబు వంటి వారు జనరల్ స్టడీస్లో 70 శాతం మార్కులు సాధించారు. సివిల్ సర్వీసెస్కు కీలక మైన జనరల్ స్టడీస్లో ప్రతిభ లేని వారు ఇప్పుడు టాపర్లుగా నిలుస్తున్నా రంటే అందుకు కారణం, ఇంగ్లిష్, గణితాలేనని చెప్పకతప్పదు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతానికి దేశ సమస్యలపై అవగాహన లేదని యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్ కొంత కాలం క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, సామాజిక సమస్యల కంటె, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీశాట్ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సీశాట్ అమలులోకి వచ్చిన తరు వాత వచ్చిన గణనీయమైన మార్పు - విజేతలలో ఇంజనీరింగ్, మెడిసిన్ నేపథ్యం ఉన్న వారి సంఖ్య విశేషంగా పెరిగింది. 2004 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2011 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది. ఆ చదువుల నేపథ్యంతో ఐఏఎస్కు ఎంపికయ్యే వారి సంఖ్య మూడింట రెండు వంతుల వరకు ఉంది. సీశాట్తో మారిన యూపీఎస్సీ ఎంపిక తీరు 2004 2011 ఇంజనీరింగ్ 23.40 41.76 మెడిసిన్ 8.39 13.11 సైన్స్ 5.30 4.90 హ్యుమానిటీస్ 16.56 9.21 సీశాట్ను ప్రవేశపెట్టడం వెనుక రహస్య ప్రణాళిక ఉంది. డీపీ అగర్వాల్ 2008లో యూపీఎస్సీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీలో బోధిస్తూ ఈ పద విని చేపట్టిన అగర్వాల్ అన్ని అంశాలను ఇంజనీరింగ్ నేపథ్యంతో ఆలోచిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్, ఐఐఎంల నుంచి సివిల్స్ వైపు అభ్యర్థులను ఆకర్షించే విధంగా పరీక్ష విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఖన్నా కమిటీ సిఫారసుల మేరకే జరిగాయని ఆయన అంటున్నారు. ఆ కమిటీ అగర్వాల్ సూచనల మేరకే పని చేసింది. ఏ విధంగా చూసినా సీశాట్ గురించి పునరాలోచించవలసిన సమయం వచ్చింది. ప్రేమ విఘ్నేశ్వరరావు. కె. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ -2014 ‘కీ’
ఆగస్టు 24, 2014న యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ -2014, జనరల్ స్టడీస్ పేపర్-1 (బుక్లెట్ సిరీస్- బి) కు అనుభవజ్ఞులైన సాక్షి నిపుణులతో ‘కీ’ని రూపొందించి అందిస్తున్నాం. గులాబీ రంగులో ఉన్న ఆప్షన్ను సరైన సమాధానంగా గుర్తించగలరు. యూపీఎస్సీ విడుదల చేసే జవాబులనే అంతిమంగా పరిగణించాలి. 1. The Partition of Bengal made by Lord Curzon in 1905 lasted until a) The First World War when Indian troops were needed by the British and the partition was ended b) King George V abrogated Cur-zon's Act at the Royal Durbar in Delhi in 1911 c) Gandhiji launched his Civil Disobedience Movement d) The Partition of India in 1947 when East Bengal became East Pakistan 2. The 1929 Session of Indian National Congress is of significance in the hi-story of the Freedom Movement bec-ause the a) Attainment of Self-Government was declared as the objective of the Congress b) Attainment of Poorna Swaraj was adopted as the goal of the Congress c) Non-Cooperation Movement was launched d) Decision to participate in the Round Table Conference in London was taken 3. With reference to the famous Sattriya dance, consider the following state-ments : 1) Sattriya is a combination of music, dance and drama. 2) It is a centuries-old living tra-dition of Vaishnavites of Assam. 3) It is based on classical Ragas and Talas of devotional songs com-posed by Tulsidas, Kabir and Mi-rabai. Which of the statements given above is/are correct? a) 1 only b) 1 and 2 only c) 2 and 3 only d) 1, 2 and 3 4. Chaitra 1 of the national calendar based on the Saka Era corresponds to which one of the following dates of the Gregorian calendar in a normal year of 365 days? a) 22nd March (or 21st March) b) 15th May (or 16th May) c) 31st March (or 30th March) d) 21st April (or 20th April) 5. With reference to the Indian history of art and culture, consider the following pairs: Famous work of sculpture : Site 1) A grand image Of Buddha's Mah-aparinirvana with numerous celestial musicians above and the sorrowful figures of his followers below : Ajanta 2) A huge image of: Varaha Avatar (boar incarnation) of Vishnu, as he rescues Goddess Earth from the deep and chaotic waters, sculpted on rock : Mount Abu 3) "Arjuna's Penance"/ "Descent of Gange sculpted on the surface of huge boulders : Mamallapuram Which of the pairs given above is/arc correctly matched? a) 1 and 2 only b) 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 6. The Ghadr (Ghadar) was a a) Revolutionary association of Indians with headquarters at San Francisco b) Nationalist organization opera-ting from Singapore c) Militant organization with headquarters at Berlin d) Communist movement for India's freedom with headquarters at Tashkent 7. With reference to India's culture and tradition, what is 'Kalaripayattu'? a) It is an ancient Bhakti cult of Shaivism still prevalent in some parts of South India b) It is an ancient style bronze and brasswork still found in southern part of Coromandel area c) It is an ancient form of dance-drama and a living tradition in the northern part of Malabar d) It is an ancient martial art and a living tradition in some parts of South India 8. Consider the following pairs: 1. Garba : Gujarat 2. Mohiniattam : Odisha 3. Yakshagana : Karnataka Which of the pairs given above is/are correctly matched? a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 9. With reference to Buddhist history, tradition and culture in India, consider the following pairs : Famous shrine 1) Tabo monastery and temple com-plex 2) Lhotsava Lhakhang temple, Nako 3) Alchi temple complex Location Spiti Valley Zanskar Valley Ladakh Which of the pairs given above is/are correctly matched? a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 10. Consider the following statements: 1) Bijak' is a composition of the teachings of Saint Dadu Dayal. 2) The Philosophy of Pushti Marg was propounded by Madhavacharya. Which of the statements given above is/are correct? a) 1 only b) 2 only c) Both 1 and 2 d) Neither 1 nor 2 11. A community of people called Manganiyars is well-known for their a) Martial arts in North-East India b) Musical tradition in North-West India c) Classical vocal music in South India d) Pietra dura tradition in Central India 12. What was/were the object / objects of Queen Victoria's Proclamation (1858)? 1) To disclaim any intention to annex Indian States 2) To place the Indian administr- ation under the British Crown 3) To regulate East India Comp- any's trade with India Select the correct answer using the code given below. a) 1 and 2 only b) 2 only c) 1 and 3 only d) 1, 2 and 3 13. Ibadat Khana at Fatehpur Sikri was a) The mosque for the use of Royal Family b) Akbar's private prayer chamber c) The hall in which Akbar held discussions with scholars of various religions d) The room in which the nobles belonging to different religions gathered to discuss religious affairs 14. In the context of food and nutritional security of India, enhancing the 'Seed Replacement Rates' of various crops helps in achieving the food production targets of the future. But what is/are the constraint/ constraints in its wider/greater implementation? 1) There is no National Seeds Policy in place 2) There is no participation of private sector seed companies in the supply of quality seeds of vegetables and planting materials of horticultural crops. 3) There is a demand-supply gap regarding quality seeds in case of low value and high volume crops. Select the correct answer using the code given below a) 1 and 2 b) 3 only c) 2 and 3 d) None 15. With reference to 'Eco-Sensitive Zones', which of the following statements is/are correct? 1) Eco-Sensitive Zones are the areas that are declared under the Wildlife (Protection) Act, 1972. 2) The purpose of the declaration of Eco-Sensitive Zones is to prohibit all kinds of human activities in those zones except agriculture. Select the correct answer using the code given below. a) 1 only b) 2 only c) Both 1 and 2 d) Neither 1 nor 2 16. Consider the following statements: 1) Animal Welfare Board of India is established under the Environment (Protection) Act, 1986. 2) National Tiger Conservation Authority is a statutory body. 3) National Ganga River Basin Authority is chaired by the Prime Minister. Which of the statements given above is/are correct? a) 1 only b) 2 and 3 only c) 2 only d) 1, 2 and 3 17. Consider the following pairs: Vitamin Deficiency disease 1) Vitamin C : Scurvy 2) Vitamin D : Rickets 3) Vitamin E : Night blindness Which of the pairs given above is/are correctly matched? a) 1 and 2 only b) 3 only c) 1, 2 and 3 d) None 18. There is some concern regarding the nano particles of some chemical elements that are used by the industry in the manufacture of various products. Why? 1) They can accumulate in the environment, and contaminate water and soil. 2) They can enter the food chains. 3) They can trigger the production of free radicals. Sclect the correct answer using the code given below. a) 1 and 2 only b) 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 only 19. Which of the following organizations brings out the publication known as World Economic Outlook? a) The International Monetary Fund b) The United Nations Development Programme c) The World Economic Forum d) The World Bank 20. With reference to Union Budget, which of the following is/are covered under Non-Plan Expenditure? 1) Defence expenditure 2) Interest payments 3) Salaries and pensions 4) Subsidies Select the correct answer using the code given below. a) 1 only b) 2 and 3 only c) 1, 2, 3 and 4 d) None 21. Which of the following have coral reefs? 1) Andaman and Nicobar Islands 2) Gulf of Kachchh 3) Gulf of Mannar 4) Sunderbans Select the correct answer using the code given below. a) 1, 2 and 3 only b) 2 and 4 only c) 1 and 3 only d) 1, 2, 3 and 4 22. In India, the problem of soil erosion is associated with which of the following? 1) Terrace cultivation 2) Deforestation 3) Tropical climate Select the correct answer using the code given below. a) 1 and 2 only b) 2 only c) 1 and 3 only d) 1, 2 and 3 23. The seasonal reversal of winds is the typical characteristic of a) Equatorial climate b) Mediterranean climate c) Monsoon climate d) All of the above climates 24. With reference to the cultural history of India, the term 'Panchayatan' refers to a) an assembly of village elders b) a religious sect c) a style of temple construction d) an administrative functionary 25. Consider the following rivers: 1) Barak 2) Lohit 3) Subansiri Which of the above flows /flow through Arunachal Pradesh? a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 26. Consider the following pairs: Wetlands 1) Harike Wetlands 2) Keoladeo Ghana National Park 3) Kolleru Lake Confluence of rivers 1) Confluence of Beas and Satluj/ Sutlej 2) Confluence of Banas and Chambal 3) Confluence of Musi and Krishna Which of the above pairs is/are correctly matched? a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 27. Which one of the following pairs does not form part of the six systems of Indian Philosophy? a) Mimamsa and Vedanta b) Nyaya and Vaisheshika c) Lokayata and Kapalika d) Sankhya and Yoga 28. Consider the following pairs: Hills Region 1) Cardamom Hills 1)Coromandel Coast 2) Kaimur Hills 2) Konkan Coast 3) Mahadeo Hills 3) Central India 4) Mikir Hills 4) North-East India Which of the above pairs are correctly matched? a) 1 and 2 b) 2 and 3 c) 3 and 4 d) 2 and 4 29. Which one of the following Schedules of the Constitution of India contains provisions regarding anti-defection? a) Second Schedule b) Fifth Schedule c) Eighth Schedule d) Tenth Schedule 30. The most important strategy for the conservation of biodiversity together with traditional human life is the establishment of a) biosphere reserves b) botanical gardens c) national parks d) wildlife sanctuaries 31. Turkey is located between a) Black Sea and Caspian Sea b) Black Sea and Mediterranean Sea c) Gulf of Suez and Mediterranean Sea d) Gulf of Aqaba and Dead Sea 32. What is the correct sequence of occurrence of the following cities in South-East Asia as one proceeds from south to north? 1) Bangkok 2) Hanoi 3) Jakarta 4) Singapore Select the correct answer using the code given below. a) 4 – 2 – 1 – 3 b) 3 – 2 – 4 – 1 c) 3 – 4 – 1 – 2 d) 4 – 3 – 2 – 1 33. The scientific view is that the increase in global temperature should not exceed 2 °C above pre-industrial level. If the global temperature increases beyond 3 °C above the pre-industrial level, what can be its possible impact/impacts on the world? 1) Terrestrial biosphere tends toward a net carbon source. 2) Widespread coral mortality will occur. 3) All the global wetlands will permanently disappear. 4) Cultivation of cereals will not be possible anywhere in the world. Select the correct answer using the code given below. a) 1 only b) 1 and 2 only c) 2, 3 and 4 only d) 1, 2, 3 and 4 34. The national motto of India, 'Satyameva Jayate' inscribed below the Emblem of India is taken from a) Katha Upanishad b) Chandogya Upanishad c) Aitareya Upanishad d) Mundaka Upanishad 35. In the Constitution of India, promotion of international peace and security is included in the a) Preamble to the Constitution b) Directive Principles of State Policy c) Fundamental Duties d) Ninth Schedule 36. What are the benefits of imple-menting the Integrated Watershed Development Programme'? 1) Prevention of soil runoff 2) Linking the country's perennial rivers with seasonal rivers 3) Rainwater harvesting and recharge of groundwater table 4) Regeneration of natural vegetation Select the correct answer using the code given below. a) 1 and 2 only b) 2, 3 and 4 only c) 1, 3 and 4 only d) 1. 2, 3 and 4 37. Which of the following are assoc iated with 'Planning' in India? 1) The Finance Commission 2) The National Development Council 3) The Union Ministry of Rural De-velopment 4) The Union Ministry of Urban De-velopment 5) The Parliament Select the correct answer using the code given below. a) 1,2 and 5 only b) 1, 3 and 4 only c) 2 and 5 only d) 1, 2, 3, 4 and 5 38. Which of the following is/are the function/functions of the Cabinet Secretariat? 1) Preparation of agenda for Cabinet Meetings 2) Secretarial assistance to Cabinet Committees 3) Allocation of financial resources to the Ministries Select the correct answer using the code given below. a) 1 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 39. Consider the following statements: A Constitutional Government is one which 1) Places effective restrictions on. individual liberty in the interest of State Authority 2) Places effective restrictions on the Authority of the State in the interest of individual liberty Which of the statements given above is/are correct? a) 1 only b) 2 only c) Both 1 and 2 d) Neither 1nor 2 40. Which of the following are the discretionary powers given to the Governor of a State? 1) Sending a report to the President of India for imposing the President's rule 2) Appointing the Ministers 3) Reserving certain bills passed by the State Legislature for consideration of the President of India 4) Making the rules to conduct the business of the State Government Select the correct answer using the code given below. a) 1 and 2 only b) 1 and 3 only c) 2, 3 and 4 only d) I, 2, 3 and 4 41. In medieval India, the designations Mahattara' and 'Pattakila' were used for a) military officers b) village headmen c) specialists in Vedic rituals d) chiefs of craft guilds 42. Lichens, which are capable of initiating ecological succession even on a bare rock, are actually a symbiotic association of a) algae and bacteria b) algae and fungi c) bacteria and fungi d) fungi and mosses 43. If you travel through the Himalayas, you are likely to see which of the following plants naturally growing there? 1) Oak 2) Rhododendron 3) Sandalwood Select the correct answer using the code given below. a) 1 and 2 only b) 3 only b) 1 and 3 only d) 1, 2 a. 3 44. Which of the following are some important pollutants released by steel industry in india 1) Oxides of sulphur 2) Oxides of nitrogen 3) Carbon monoxide 4) Carbon dioxide Select the correct answer using the code given below. a) 1, 3 and 4 only b) 2 and 3 only c) 1 and 4 only d) 1, 2, 3 and 4 45. Which of the following Kingdoms were associated with the life of the Buddha? 1) Avanti 2) Gandhara 3) Kosala 4) Magadha Select the correct answer using the code given below. a) 1, 2 and 3 b) 2 and 4 c) 3 and 4 only d) 1, 3 and 4 46. Every year, a month long ecologically important campaign/ festival is held during which certain communities/ tribes plant saplings of fruitbearing trees. Which of the following are such communities/tribes? a) Bhutia and Lepcha b) Gond and Korku c) Irula and Toda d) Sahariya and Agariya 47. The sales tax you pay while purchasing a toothpaste is a a) tax imposed by the Central Government b) tax imposed by the Central Government but collected by the State Govenunent c) tax imposed by the State Government but collected by the Central Governrnent d) tax imposed and collected by the State Government 48. What does venture capital mean? a) A short-term capital provided to industries b) A long-term start-up capital provided to new entrepreneurs c) Funds provided to industries at times of incurring losses d) Funds provided for replacement and renovation of industries 49. The main objective of the 12th Five-Year Plan is a) inclusive growth and poverty reduction b) inclusive and sustainable growth c) sustainable and inclusive gro- wth to reduce unemployment d) faster, sustainable and more inclusive growth 50. With reference to Balance of Payments, which of the following constitutes/ constitute the Current Account? 1) Balance of trade 2) Foreign assets 3) Balance of invisibles 4) Special Drawing Rights Select the correct answer using the code given below. a) 1 only b) 2 and 3 c) 1 and 3 d) 1, 2 and 4 51. The terrns 'Marginal Standing Facility Rate' and Vet Demand and Time Liabilities', sometimes appearing in news, are used in relation to a) banking operations b) communication networking c) military strategies d) supply and demand of agricul-tural products 52. What is/are the facility/facilities the beneficiaries can get from the services of Business Correspondent (Bank Saathi) in branchless areas? 1) It enables the beneficiaries to draw their subsidies and social security benefits in their villages. 2) It enables the beneficiaries in the rural areas to make deposits and withdrawals. Select the correct answer using the code given belo,. a) I only b) 2 only c) Both 1 and 2 d) Neither 1nor 2 53. In the context of Indian economy, which of the following is/are the purpose/purposes of 'Statutory Reserve Requirements? 1) To enable the Central Bank to control the amount of advances the banks can create 2) To make the people, deposits with banks safe and liquid 3) To prevent the commercial bank from making excessive profits 4) To force the banks to have sufficient vault cash to meet their day-to-day requirements Select the correct answer using the code given below. a) 1 only b) 1 and 2 only c) 2 and 3 only d) 1, 2, 3 and 4 54. Recently, a series of uprisings of people referred to as 'Arab Spring' originally started from a) Egypt b) Lebanon c) Syria d) Tunisia 55. Consider the following countries 1) Denmark 2) Japan 3) Russian Federation 4) United kingdom 5) United States of America Which of the above are the members of the 'Arctic Council? a) 1, 2 and 3 b) 2, 3 and 4 c) 1, 4 and 5 d) 1, 3 and 5 56. Consider the following pairs Region often In news Country 1) Chechnya: Russian Federation 2) Darfur : Mali 3) Swat Valley: Iraq Which of the above pairs is/are correctly matchcd? a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 57. With reference to Agni-IV Missile, which of the following statements is/are correct, 1) It is a surface-to-surface missile. 2) It is fuelled by liquid propellant only. 3) It can deliver one-tonne nuclear warheads about 7500 km away. Select the correct answer using the code given below a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 (Continued in Chukkani page..) -
యూపీఎస్సీపై పిల్కూ తిరస్కృతి
రేపే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలివేయవచ్చన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయంపై దాఖలైన పిల్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సివిల్స్ పరీక్షకు హాజరవుతున్న నగ్వాన్ అనే న్యాయవాది ఈ పిల్ను దాఖలు చే శారు. అయితే వ్యక్తిగత కారణంపై కోర్టుకు వచ్చారని, ఇది ప్రజాప్రయోజనవ్యాజ్యం ఎలా అవుతుందం టూ కోర్టు ప్రశ్నించింది. ఇంతకుముందు ఇలాంటి పిటిషన్నే వేరే ధర్మాసనం ముందు దాఖలు చేశారని పేర్కొంటూ అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వ్యతిరేకించటంతో ఈ అంశంపై క్యాట్ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్ రెండో పేపర్(సీశాట్-2)లో ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరని కేంద్రం తెలిపింది. దృష్టిలోపం ఉన్నవారికి అదనపు సమయం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న దృష్టిలోపం గల అభ్యర్థులకు ప్రతి పేపర్కు 40 నిమిషాల చొప్పున అదనపు సమయం ఇవ్వనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సివిల్స్-2011 అభ్యర్థులకు మరో చాన్స్... 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అదనపు అవకాశం ఇవ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. -
యూపీఎస్సీపై రిట్కు తిరస్కృతి
ఇంగ్లిష్ పరీక్షపై నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్ న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగంలోని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయవలసిన అవసరంలేదని యూపీఎస్సీ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై దాఖలైన రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంపై రిట్పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు తగిన వేదిక కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంగ్లీష్ ప్రశ్నలు వదిలేయండి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పులకు సంబంధించి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సీశాట్-2గా పిలిచే ప్రిలిమ్స్ రెండో పేపర్లో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కాంప్రహెన్షన్ స్కిల్స్ విభాగంలో అభ్యర్థులకు వచ్చే మార్కులను గ్రేడింగ్లో పరిగణించబోమని అందులో స్పష్టం చేసింది. పేపర్-1(సీశాట్-1)లో 200 మార్కులకు గాను సాధించే మార్కులు, పేపర్-2లో ఇంగ్లీష్ విభాగం మార్కులు తీసేయగా వచ్చే మార్కులను కలిపి మెరిట్ను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆంగ్ల భాషా నైపుణ్యానికి సంబంధించిన 9 ప్రశ్నలకు(22.5 మార్కులు) సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని వదిలిపెట్టవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ నెల 24న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. సీశాట్-2లో ప్రశ్నల సరళిపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. -
ప్రిలిమినరీ పరీక్షపై స్టేకు నో
1,291 ఖాళీల్లో అంధులకు రెండే పోస్టులా? కేంద్రంపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: సివిల్సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, అంధులైన అభ్యర్థులకు రెండేరెండు సీట్లు రిజర్వు చేయడం పట్ల యూపీఎస్సీపై, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాలపై మండిపడింది. అంధులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రెండు సీట్లు మాత్రమే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలు విచారించారు. పిటిషనర్ అభ్యర్థనలో న్యాయముందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే, దీనికారణంగా ప్రిలిమినరీ పరీక్ష ఆపడానికి నిరాకరించింది. అంధులకు రెండుసీట్లు రిజర్వు అయ్యాయనే నెపంతో పరీక్ష రాసిన అంధ అభ్యర్థులనెవరినీ అనర్హులుగా ప్రకటించవద్దని యూపీఎస్సీని ఆదేశించింది. అంతేకాక మెయిన్స్ పరీక్షలు జరిగేలోగా వికలాంగుల కోటాను సరిదిద్దాలని ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,291సివిల్సర్వీసెస్ పోస్టుల్లో వికలాంగులకు 26 పోస్టులు కేటాయించగా, అంధులకు రెండు సీట్లే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. బధిరులకు, ఇతర వికలాంగులకు మాత్రం చెరి 12 పోస్టుల చొప్పున కేటాయించారని పిటిషన్లో తెలిపారు. కాగా, వికలాంగుల చట్టం సెక్షన్ 33 ప్రకారం మొత్తం ఖాళీల్లో మూడు శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించాలని, అందులో ఒకశాతం అంధులకు రిజర్వు చేయాలనే నిబంధన ఉందని‘సంభావన’ పేర్కొంది. అయితే, యూపీఎస్సీ మాత్రం దీనిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిని న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసును వచ్చేనెల మూడుకు వాయిదా వేసింది. అప్పటిలోగా పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ నిర్వహించుకోవచ్చునని పేర్కొంది. -
కేటాయింపు పొందిన ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సులో ప్రవేశం లేదు
డీఓపీటీ ఉత్తర్వు జారీ న్యూఢిల్లీ: గత ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లలో కేటాయింపు పొంది, తిరిగి ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాదలిచిన అభ్యర్థులు ఫౌండేషన్ కోర్సుకు హాజరు కావడం కుదరదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లకు, కేంద్ర సర్వీసులకు, గ్రూప్-ఏ సర్వీసులకు 2013 సంవత్సరపు పరీక్షద్వారా కేటాయింపు పొందిన అభ్యర్థులు, తమకు సూచించిన సంస్థల్లో వచ్చే నెల 1నుంచి ఫౌండేషన్ కోర్సుకు హాజరుకావలసి ఉంటుందని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) తన ఉత్తర్వులో పేర్కొంది. ఇలాగే సర్వీసుల కేటాయింపు పొందినా, ఈ నెల 24వ తేదీన జరగనున్న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులను మాత్రం ఫౌండేషన్ కోర్సుకు అనుమతించబోమని డీఓపీటీ స్పష్టంచేసింది. గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రాతిపదికగా వివిధ సర్వీసులకు 1,122మంది అభ్యర్థుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిఫార్సు చేసింది. వారిలో 981మంది అభ్యర్థులకు మాత్రమే సర్వీసుల కేటాయింపు జరిగింది. వివిధ కారణాలవల్ల 141మంది అభ్యర్థులకు కేటాయింపు జరగలేదు. కొంతమంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో సర్వీసులను మాత్రమే తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారని, నిబంధనల ప్రకారం ప్రధాన జాబితా, రిజర్వ్డ్ జాబితాలనుంచి కేటాయింపులు పూర్తయిన తర్వాతే అలాంటి అభ్యర్థులకు కేటాయింపుల చేయడం సాధ్యమవుతుందని డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కొందరు అభ్యర్థులు కచ్చితంగా ఓబీసీలేనా అన్నది కూడా నిర్ధారించుకోవలసి ఉందని, ముఖ్యమైన పత్రాలు సమర్పించనందున మరి కొందరి అభ్యర్థిత్వాలను తాత్కాలికమైనవిగా పరిగణిస్తున్నామని, కొందరి వైద్య పరీక్షలు కూడా పెండింగ్లో ఉన్నాయని డీఓపీటీ తెలిపింది. ఈ అంశాలన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నామని, కొందరు అభ్యర్థులకు సర్వీసు కేటాయింపులు జరగకపోటవడానికి కారణాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని, అభ్యర్థులు తమకు ఇచ్చిన కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని డీఓపీటీ తన ఉత్తర్వులో పేర్కొంది. -
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షా మోడల్ పేపర్
General Studies Paper - I 74. Which one among the following statements regarding the social and religious reform ideas of Raja Rammohan Roy is NOT correct? a) His efforts led to the formation of Brahmo Samaj in 1828 b) He considered different religious as embodiments of universal theism c) His Vedantic monism was strengthened after 1815 since an exposure to Christian Unitarianism d) He paid attention exclusively to the problems/ issues of the emerging middle class of India 75. Consider the following statements: In the 1560's Akbar began to patronize the formation of the Mughal school of painting with the illustration of Dastan-i-Amir Hamza because 1. Akbar inherited Humayun's taste for painting 2. Akbar was especially interested in book illustration 3. Akbar was persuaded to take interest in painting by Abul Fazi a) 1, 2 and 3 are correct b) 2 and 3 are correct c) 1 and 2 are correct d) 1 and 3 are correct 76. Khwaja Mansur, is exclusively famous for his skills in a) Calligraphy b) Depiction of events c) Portrait presentation d) Drawing birds and animals 77. Which of the following statements about Fourth Anglo - Mysore War are correct? 1. The Madras Council Sugges- ted a policy of rigorous and intense attack on Mysore 2. Lord Wellesley tried to revive the Triple Alliance 3. Tipu sent emissaries to Arabia, Versailles, Mauritius and Kab-ul enlisting support against the English 4. The War was of a very short duration through decisive. Select the correct answer using the code given below: a) 2, 3 and 4 b) 1, 3 and 4 c) 2 and 4 only d) 1 and 3 only 78. In addition to Maculay's Minutes on Education, another landmark Draft is also attributed to him. Identify the Draft from the following. a) Draft of Indian Penal Code b) Draft of Indian Forest Policy c) Draft of the Zamindari Abo-lition Act d) Draft of the Maritime Trade Policy 79. Which among the following stat-ements regarding Lord Ripon's plan for local self - government in India is/ are correct? 1. The district should be the maximum area served by one Committee or Local Board. 2. The Local Boards should consist of a large majority of nominated official members and be presided over by an official member as Chairman. a) 1 only b) 2 only c) Both 1 and 2 d) Neither 1 nor 2 80. Read the following statement and identify the author of it. "I shall work for an India in which the poorest shall feel that it is their country, in whose making they have an effective voice, an India in which there shall be no high class and low class of people, an India in which all communities shall live in perfect harmony." a) Baba Saheb Ambedkar b) Mahatma Gandhi c) Gurudev Tagore d) Pt. Nehru 81. Which of the following is/ are correct with respect to the bio-geochemical cycles of the ecosystem 1. Hydrological cycle consumes 15% of all solar energy received by the earth 2. Clostridium and pseudo-monas are important bacteria involved in denitrification in nitrogen cycle a) Only 1 b) Only 2 c) Both 1 and 2 d) Neither 1 nor 2 82. Which of the following is wrongly matched for the marine biome? a) Hadal Zone - Deep Sea Trenches b) Neritic Zone - Continental Shelf c) Bathyal Zone - Deep Sea Plains d) Abyssal Zone - Trans-continental Slope 83. Which of the following accounts for lack of delta formation by Narmada, the biggest east flowing river of peninsular India? 1. It flows via a rift valley which continues into Arabian Sea 2. The east coast is a faulted coa-st hence the continental shelf close to west coast is deep 3. Narmada is geologically younger a) Only 2 b) 1 and 3 Only c) Only 1 d) 1, 2 and 3 84. Which of the following vegetation zones of the Himalayas shows the character of Boreal Forest? a) Alpine forest b) Montane Moist temperate forest c) Tundra forest d) Montane wet temperate forest 85. The vegetation type of Thar Region has been influenced by which of the following? a) Indo-Malayan b) Indo-African c) Indo-Tibetan d) Paleo-Mediterranean 86. Bhur plains in upper part of Ganga-Yamuna doab is geographically which of the following? a) Aeolian b) Lacustrine c) Glacial d) Fluvial 87. Which of the following explains the black soils of West Bengal? a) The presence of arsenic in the alluvial soils b) The volcanic Rajmahal hills c) The presence of pleistocene glacial deposits mixed with alluvial soils d) The grantic hills of Medinipur and Bankura 88. Chiria is India's single largest iron ore deposit. It is in which of the following regions? a) Odisha b) Jharkhand c) Chhattisgarh d) M.P. 89. Chandapathar is India's only known deposit of molybdenum. These mines are in which of the following? a) Madhya Pradesh b) West Bengal c) Jharkhand d) Chhattisgarh 90. Dhands are alkaline lakes in the dry courses of river of which of the following regions? a) Bundhelkhand b) Baghelkhand c) Malwa Badlands d) Thar 91. Consider the following: 1. Western Ghats display excellent scarplands unlike Eastern Ghats 2. Western Ghats are rich in biodiversity unlike Eastern Ghats 3. Western Ghats are tectonic unlike Eastern Ghats Which of the above is/ are correct? a) Only 1 b) Only 2 c) 1 and 2 d) 1, 2 and 3 92. Consider the following: 1. Rich in phosphates and water soluble salts 2. Lack of loamy character 3. Poor in humus Which of the above is/ are correct for desert soils of Rajasthan? a) 1 and 3 b) 1 and 2 c) 2 and 3 d) 1, 2 and 3 93. Consider the following 1. Presence of light elements 2. Mapping on spiral arms of spiral galaxies Which of the above is/ are evidence for a young star of a spiral galaxy? a) Only 1 b) Only 2 c) Both 1 and 2 d) Neither 1 nor 2 94. Consider the following: 1. Extinction of many mammals 2. Universal glaciation 3. Formation of larger lakes in temperate latitudes Which of the above is/ are correct for pleistocene epoch of earth's geological time? a) Only 2 b) 1 and 2 c) Only 1 d) 1, 2 and 3 95. Which of the following is a gas of great interest to Man in Lunar atmosphere? a) Acetylene b) Helium-3 c) Helium - 1 d) Phosgene 96. Which of the following would be an outcome if earth captures the Moon? a) Earth's revolution speed will decrease b) Earth's rotation speed will decrease c) Earth's revolution speed will increase d) Earth's rotation speed will increase 97. Which of the following usually make up galactic centres? a) Quasars b) Pulsars c) Black Holes d) Neutron stars 98. The Ministry of Environment and Forests of India provides some financial assistance to the State/Union Territory Governme- nts for protection and managem-ent of the Protected Areas. What are the main Centrally Sponsored Schemes among the following? 1. Integrated Development of Wildlife Habitats 2. Project Tiger 3. Project Elephant a) 1 only b) 2 and 3 only c) 1 and 2 only d) All of the above 99. Consider the following protected areas: 1. Mayurjharna 2. Wayanad 3. Periyar 4. Amba Barwa Which of the above are declared Elephant Reserves? a) 1and 2 only b) 1, 2 and 3 only c) 2, 3 and 4 only d) All of the above 100. A suspension called Milk of Magnesia, is used as an antacid to neutralize stomach acid and as a laxative. What does it contain? a) MgCO3 b) MgSO4-7H2O c) MgCl2 - 6H2O d) Mg(OH)2 -
ఇంగ్లిష్ మార్కులను పరిగణించం
సివిల్స్ ప్రిలిమ్స్ పై ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సెంకడ్ పేపర్లో ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాలకు సంబంధించిన మార్కులను అభ్యర్థుల ఉత్తీర్ణత లెక్కింపులో పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 24నే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పరీక్షలో అంతర్భాగమైన ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల (పదవ తరగతి స్థాయిలోనివి) విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని, అందువల్ల ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిన అవసరంలేదని అభ్యర్థులు గమనించాలని ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో పేపర్-2కు 200మార్కులను, రెండు గంటల వ్యవధిని కేటాయించారు. పేపర్-2 పరీక్ష వ్యవధి 2గంటలు యథాతథంగా ఉంటుందని, ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల విభాగం మినహా మిగతా ప్రశ్నలకు జవాబులు రాయడానికి అభ్యర్థులు ఈ మొత్తం వ్యవధిని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. కాగా, యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్గా రజనీ రజ్దాన్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షా మోడల్ పేపర్
General Studies Paper - I 38. The following is a quasi judicial body- it has the power to summon people to give evidence; call for witnesses; ask for any information or document of a public nature relevant to its duties i. Election Commission of India ii. Union Public Services Com-mission iii. Speaker of Lok Sabha iv. Chairman of Rajya Sabha a) ii only b) i and ii only c) iii and iv only d) i, ii, iii and iv 39. President of India does not decide on the following i. Number of members of the Union Public Service Com-mission ii. Number of judges of a High Court iii. Number of judges of Supreme Court iv. Number of Election Co-mmissioners a) iii only b) iii and iv only c) ii, iii and iv only d) i, ii, iii and iv 40. When the state legislature passes a Bill on a subject in the Concurrent List on which a Central law already exists and happens to contradict the same, the following is the correct constitutional course of action to ensure that the state law is not invalid-partially or fully a) Have it passed by the Parliament as well b) Take the permission of the President to introduce the Bill in the State Legislature c) Governor should keep the Bill for Presidential assent after its passage in the State Legislature d) Seek the opinion of the Higher Judiciary before introduction of the Bill in the state legislature 41. Consider the following statements: 1. Laos is facing the ire of its neighbours over a dam that it plans to build on the Mekong River. 2. Laos is a small landlocked country in Southeast Asia surrounded by Vietnam, Mya-nmar and Cambodia. 3. Laos plans to build the new Don Sahong dam with the help of China on the Mekong River. Which of the above statement/s is/ are correct? a) 3 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 42. As per the European Commi- ssion's 2014 Convergence Repo- rt, which assessed eight Member States' readiness to join the single currency, which of the following countries can become the latest country to adopt the euro as its currency on 1st January 2015? a) Bulgaria b) The Czech Republic c) Romania d) Lithuania 43. Consider the following statements 1.The Ganga clean-up programme and mission for clean water has attracted interest from foreign nations like Israel and Denmark. 2. Israel and Denmark are global leaders in water technology and water management. 3. Israel loses just about 8% of water, they put in the pipes. It is the best figure in the world. Which of the above statement/s is/ are correct? a) 3 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 44. Consider the following statements: 1. For first time that a G7 summit took place in Brussels and was hosted by the European Union. 2. The Group of 7 (G7), is a group consisting of the finance ministers and central bank governors of seven advanced economies: Canada, France, Germany, Italy, Japan, the United Kingdom and the United States. 3. The European Union is also represented within the G7. 4. Russia, which was invited to join as the last member, was excluded from the forum. Which of the above statement/s is /are correct? a) 2 only b) 1 and 2 only c) 1, 2 and 4 only d) 1, 2, 3 and 4 45. Consider the following statements: 1. El Niño is disastrous for the world's coral reefs. 2. Coral Triangle is called Earth's underwater Amazon. 3. The Coral Triangle is a Southeast Asian bio region in Indian oceans consisting of Indonesia, Malaysia, the Philippines, East Timor, Papue New Guinea and the Solomon Islands. Which of the above statement/s is/ are correct? a) 3 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 46. Vultures have been pushed to the verge of extinction in the country; there is a serious threat to eagles as well. The common species in Indian countryside some years ago are rarely seen these days. This is attributed to a) The destruction of their nesting sites by new invasive species b) Use of veterinary painkiller and anti-inflammatory drug, Diclofenac by cattle owners c) Scarcity of food available to them d) A widespread, persistent and fatal disease among them. 47. Turing Test is related to a) Artificial Intelligence b) A test to ascertain strength of material c) Diagnostic test to check avian flu d) Test to find the presence of pollutants in water 48. Consider the following statements: 1. There are six National waterways in all in India 2. The Government of India has set up Inland Waterways Authority of India (IWAI), a statutory body under Ministry of surface transport. Which of the above statement/s is/ are correct? a) 1 only b) 2 only c) Both 1 and 2 d) None 49. Consider the following statements: 1. The Golden Quadrilateral is a highway network connecting many of the major industrial, agricultural and cultural centres of India. 2. The Golden Quadrilateral is the largest highway project in India and the fifth longest in the world. 3. Only National Highways are used in the Golden Quadrilateral. Which of the above statement/s is/ are correct? a) 3 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 50. Consider the following statements: A highly threatened species also called "scaly anteaters," subjected to a colossal illegal trade internationally for food, use in traditional medicine, as fashion accessories, scales, skins, and meat. There is Rapid loss and deterioration of available habitat, which places added pressure on their dwindling numbers. There is high demand for nearly all of their body parts, principally from China. Identify it: a) Crocodiles b) Pangolins c) Black-necked Crane d) Flying Squirrel 51. A natural antioxidant that also gives tomatoes their colour is: a) Phytofluene b) Lycopene c) Anthocyanins d) Rhodopin 52. As per the recent research findings, find the correct statement about extinct species, dinosaurs. a) Dinosaurs weren't cold-blooded. b) Dinosaurs weren't warm-blooded. c) Dinosaurs fall in an intermediary category "mesotherms". d) None of the above statements is correct. 53. Consider the following statements: 1. JE is a disease caused by the mosquito-borne Japanese encephalitis virus. 2. Domestic pigs and wild birds (Herons) are reservoirs of the virus. 3. Acute Encephalitis Syndrome (AES) is caused by Japanese encephalitis virus among other virus. Which of the above statement/s is/ are correct? a) 1 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 54. With regard to The India-Bhutan bilateral relations which of the following statements are correct? 1.The PM announced doubling of scholarships being provided to Bhutanese students in India which will now be worth Rs. two crore. 2. The PM promised to assist Bhutan in setting up a digital library which will provide acc-ess to Bhutanese youth to two million books and periodicals. 3. Hydroelectric co- operations got a raw deal during the PM visit to Bhutan. a) 1 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 55. Female cloned calf produced through the 'Hand-guided Cloning Technique' was born recently. The donor cell was taken from the ear of an elite Murrah buffalo. It is the 7th buffalo clone produced by NDRI. What is the name of the calf? a) Nilima b) Lalima c) Samrupa d) Dolly 56. A project backed by the Bill and Melinda Gates Foundation, to grow the special banana Varieties- Super Banana, genetically engineered to improve the lives of millions of people in Africa will be enriched with: a) Vitamin C b) Vitamin B c) Vitamin A d) Vitamin D 57. Consider the following statements: 1.The World Day to Combat Desertification (WDCD) is celebrated every year on 5th June. 2.India is not a signatory to United Nations Convention to Combat Desertification (UNCCD). 3. India aims to become "land degradation neutral" by 2030. 4. The theme of this year`s WDCD is 'Land Belongs to the Future, Let's Climate Proof It'. Which of the above statements are correct? a) 1, 3 and 4 only b) 3 and 4 only c) 1, 2 and 3 only d) None of the above 58. Sanjaya Rajaram was in the news for: a) Being chosen for World Food Prize b) Being appointed as the deputy governor of RBI c) Being appointed as the scientific advisor of the new PM d) Being chosen as the member of economic advisors to the US president. 59. Consider the following statements: 1. Corals are plants. 2. Corals maintain a symbiotic relationship with dinoflagellates, a type of microbe that lives inside the coral's tissue, where it photosynthesises, passing sugar to its host. 3. With the rise in temperatures the dinoflagellates stop making sugar and produce harmful free radicals and steadily fade to white. Which of the above statement/s is/ are correct? a) 3 only b) 2 and 3 only c) 1 and 2 only d) 1, 2 and 3 60. Dental caries and periodontal diseases is considered the most important global oral health problems. What is the cause of such disease? i. Deficiency Fluoride ii. Not having enough saliva iii. Eating foods that are high in sugar and other carbohydrates a) i only b) ii and iii only c) ii only d) i, ii and iii 61. In which state of India we find the most occurrence and distribution of fish Whale shark, the largest living non-mammalian vertebrate and declared vulnerable by IUCN? a) Gujarat b) Tamil Nadu c) Andhra Pradesh d) Maharashtra 62. The UNESCO has planned to establish a centre for Natural World Heritage Management and Training at: a) Forest Management institute, Bhopal b) The Wildlife Institute of India, Dehradun c) Forest Research Institute, Dehradun d) Centre for Wildlife Studies (CWS), Bangalore (collaboration) 63. What is the mascot for 2014 FIFA World Cup? a) Zakumi b) Three-banded armadillo c) Slavek and Slavko d) Wenlock and Mandeville 64. Which of the following statements not correct? a) Geckos are lizards found in warm climates throughout the world. b) Lizards are mammals. c) Most geckos cannot blink, but they often lick their eyes to keep them clean and moist. d) New gecko species have been found in the Western Ghats of Maharashtra. 65. Citronella is a) A natural insect repellent, wh-ich can combat dengue. b) A new variety of citrous fruit to overcome Vit.C deficiency. c) A microbe which converts landfills wastes into Methane. d) A folk tale on the line of Cinderella. 66. Consider the following statements: 1. Many Sanskrit works on music were translated into Persian during the medieval period. 2. The early Chishti Sufis were fond of musical assemblies called Sama. Which of the above statements stand true with regard to music in the medieval period of India? a) 1only b) 2 only c) Both 1 and 2 d) None 67. Consider the following statements: 1. Due to the fast diminishing salinity of the estuarine rivers in the state of West Bengal, Hilsa catch has increased. 2. Hilsas are conditioned to take in less water into their system, so their kidneys remain near-dormant. And abrupt adaptation in sweet water becomes difficult as Hilsas prefer a middle zone or ecotone while travelling from the sea to the rivers. Which of the above statement/s is / are correct? a) 1 only b) 2 only c) Both 1 and 2 d) None 68. The river has its source in Sikkim and said to be its lifeline, flows for almost the entire length of the state and forms the border between Sikkim and West Bengal before joining the Brahmaputra (or Jamuna when it enters Bangl- adesh) as a tributary in Bangla- desh. What's the name of the river? a) Ganga b) Mahananda c) Teesta d) Raidak 69. Budhha was often sick, so much so that one of his disciples -an emperor Prasenjita -had offered him his own personal physician. The physician followed Gautam Budhha with large wagon full of all kinds of medicine, books on medicine. Among the following identify that personal physician of Gautam Buddha? a) Shushruta b) Charak c) Jeevaka d) Nagarjuna 70. Excavations at the sites of the places mentioned in the Mahabharata are related to which one of the following cultures? a) Northern Black polished ware b) Red and Black polished ware c) Painted grey ware d) None of the above 71. Which one of the following statements about the teachings of Kabir is NOT correct? a) He was not against pilgrimage and idol worship b) He believed in universal c) He emphasized on one God and the spread of devotionalism d) He did not consider it necessary to abandon the normal life of a householder 72. Consider the following statements: 1. Gandhiji failed to realize that the Khilafat was an extra - territorial issue. 2. The cause of Khilafat was discribed by 1923 as Mustafa Kemal Pasha set up a secular republican government in Turkey. Which of the above statements stand true with regard to Khilafat movement in India? a) 1only b) 2 only c) Both 1 and 2 d) None 73. Consider the following statements: 1. In north - western India, the Civil Disobedience Moveme- nt took a mass character under the leadership of Khan Abdul Ghaffar Khan. 2. The Nehru Report (1928) had argued that the 'next immediate step' for India must be Dominion Status Which of the above statements is/ are true? a) 1only b) 2 only c) Both 1 and 2 d) None -
గణిత ప్రావీణ్యం కాదు పాలన అభిరుచిని గుర్తించాలి
ఇంటర్వ్యూ: దేశంలో లక్షలాది మంది యువత కలల కెరీర్ సివిల్స్. అలాంటి ఉన్నత కెరీర్లోకి సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయాల్సిన పరీక్షపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2011లో ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్).. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఔత్సాహికుల ఆశలపై నీళ్లుచల్లేలా ఉందనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశానికి ఉత్తమమైన పాలనాదక్షులను ఎంపిక చేయాల్సిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో.. గణితం, ఇంగ్లిష్పై పట్టు ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారంటున్నారు ఆర్.సి.రెడ్డి స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి. సివిల్ సర్వీసెస్కు ఎంపిక పరీక్ష.. పాలన అభిరుచిని గుర్తించేలా ఉండాలని, అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలని అంటున్న ఆర్.సి.రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. బాధ్యతలకు తగ్గ ఎంపిక విధానం ఉండాలి సివిల్స్ ఎంపిక ప్రక్రియ మూస ధోరణిలో అందరినీ ఒకే గాటన కట్టేలా ఉండకూడదు. చేపట్టాల్సిన బాధ్యతలకు తగ్గట్టు ఎంపిక విధానం ఉండాలి. చేయబోయే పనికి అవసరమైన ప్రతిభా సామర్థ్యాలను పరీక్ష ద్వారా గుర్తించాలి. అయితే, యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అభ్యర్థి అభిరుచి తెలుసుకునేందుకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అవసరమే. అందుకోసం పరీక్షలో పరిపాలనా సంబంధమైన ప్రశ్నలను ఇచ్చి పరిష్కరించమనాలి. అధికారులుగా తమకు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో గుర్తించేందుకు అది చక్కటి మార్గం. ఆప్టిట్యూడ్ పేపర్లో 6 ప్రశ్నలు మాత్రమే పాలనా ప్రతిభను పరీక్షించేవిగా ఉంటున్నాయి. మిగతా ప్రశ్నలన్నీ మ్యాథ్స్కు సంబంధించినవే! దాంతో గణితేతరులు తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. మూడేళ్ల నుంచి సీశాట్ నిర్వహిస్తున్నా.. ఇటీవల సమాచార హక్కుచట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడి కావడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. గణితేతర అభ్యర్థులకు మార్కులు తగ్గాయనేందుకు యూపీఎస్సీ ఇచ్చిన సమాచారమే నిదర్శనం. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ క్లిష్టంగా ఉంది 1979 నుంచి 2011 వరకూ ఉన్న సిలబస్తో అన్ని విభాగాల అభ్యర్థులూ పోటీపడేందుకు అవకాశం ఉండేది. 2011లో ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ చేర్చారు. 6 ప్రశ్నలు తప్ప మిగతావన్నీ ఏ మాత్రం పాలనా అభిరుచికి సంబంధం లేనివి. సీశాట్ను పరిశీలిస్తే ఇంగ్లిష్ కాంప్రహెన్షన్.. సగటు విద్యార్థి స్టాండర్డ్కు మించి ఉంది. క్లిష్టమైన ప్యాసేజ్లు ఇస్తున్నారు. దాంతో తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల విద్యార్థులకు ప్రిలిమినరీ పరీక్ష కష్టంగా మారింది. కీలకమైన బాధ్యతలు చేపట్టే అధికారికి అన్ని అంశాలపై పరిజ్ఞానం ఉండటం అవసరమే. అయితే మరీ ఇంత క్లిష్టత ఉండ కూడదు. ఇంగ్లిష్పై అవగాహనతోపాటు గణాంకాలపై పట్టు ఉండాలనే ఉద్దేశంతో గతంలో ‘స్టాటిస్టికల్ ఎనాలసిస్’ నుంచి కూడా ప్రశ్నలిచ్చేవారు. హిందీ అభ్యర్థులకు కొంత అనుకూలమే! ఇతర ప్రాంతీయ భాషల వారితో పోల్చితే హిందీ మాధ్యమం వారికి సీశాట్ కొంత అనుకూలమనే చెప్పాలి. ఎందుకం.టే.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. హిందీలో ప్రశ్నపత్రం ఉండటం వల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఆ భాషలో చదువుకున్న అభ్యర్థులకు తేలికవుతుంది. ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులకు ఈ వెసులుబాటు లేదు. పాలనలో రాణించేవారిని గుర్తించేలా పరీక్ష ఉండాలి.. మూడేళ్లుగా సివిల్స్ సర్వీసెస్కు ఎంపికవుతున్న అభ్యర్థులను గమనిస్తే.. ఐఐటీలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్ నేపథ్యాల నుంచి వచ్చినవారే జాబితాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతమాత్రాన ఐఐటీల్లో చదివిన వారు అనర్హులని చెప్పట్లేదు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు పరిపాలనలో రాణిస్తారని నిర్ధారించడం సరికాదంటున్నాను. శాస్త్ర, సాంకేతిక రంగాల నిపుణులు కూడా దేశానికి అవసరమే. పాలనాపరమైన ఉద్యోగానికి కాకుండా.. ఐఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ జాబ్స్కు ఎంపిక కోసం మ్యాథ్స్, రీజనింగ్ వంటివి కావాలి. అభ్యర్థులకు కనీస పరిజ్ఙానం అవసరమని భావిస్తే మెయిన్స్లో ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుత విధానంతో ప్రిలిమినరీ దశలోనే గణితేతర ప్రతిభావంతుల్ని బయటకు పంపించడం సరికాదు. అభ్యర్థుల్లో పాండిత్యాన్ని కాకుండా.. పాలనలో ఎంతవరకూ రాణించగలరనే అంశాన్ని గుర్తించేలా ప్రశ్నల రూపకల్పన చేయాలి. భావోద్వేగ నైపుణ్యంపై ప్రశ్నలు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాలనలో కీలకమైన బాధ్యతలు అప్పగించే ముందు ఆయా వ్యక్తులను అంచనా వేసేందుకు కొన్ని ప్రామాణికాలను అనుసరిస్తున్నారు. అన్ని స్థాయిల వ్యక్తులతో మెలిగేతీరు.. మాటతీరు.. కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించే శైలి.. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటివి పరిశీలిస్తున్నారు. మన దేశంలోనూ ఆర్మీలో ఎంపికకు సర్వీస్ సెలక్షన్ బోర్డ(ఎస్ఎస్బీ) అభ్యర్థుల నాయక త్వ లక్షణాలను పరిశీలిస్తుంది. సివిల్ సర్వెంట్గా అభ్యర్థిలో భావోద్వేగ నైపుణ్యం(ఎమోషనల్ ఇంటెలిజెంట్)ను కనిపెట్టేలా ప్రశ్నలుం డాలి. దైనందిన వ్యవహారాల్లో ఎదుర య్యే సవాళ్లను, సమస్యలను పరిష్కరించేందుకు వారు చూపే చొరవను పసిగట్టగలగాలి. వారి మానవ నైజం తెలియాలి. అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి పాలనాపరమైన ఇబ్బందులు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నపత్రంలో పొందుపర్చవచ్చు. పేరుకే ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. ఒక్క ప్రశ్న కూడా దానిపై ఇవ్వడం లేదు. తెలివితేటలు అనేక రకాలు.. ఫలానా అంశాలు తెలిస్తేనే తెలివిగలవారంటూ నిర్ధారించడం సరికాదు. పాలన, గణిత ప్రతిభాపాటవం, శాస్త్ర, సాంకేతిక, భాష, నటన, చిత్రలేఖన అంశాల్లో తెలివితేటలు పలు రకాలుగా ఉంటాయి. సివిల్సర్వీసెస్ పరీక్ష నిష్ణాతులను కాకుండా.. పరిజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసేలా ఉండాలి. సులభమైన ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఇవ్వాలి. అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్షలో పాలనా పరమైన అభిరుచిని, నాయకత్వ లక్షణాలను పరిశీలించాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్.. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు పెద్ద అడ్డంకి ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో గట్టెక్కాలంటే 240/400 పైగా మార్కులు తెచ్చుకోవాల్సిందే. 2013 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన జనరల్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు 241. 2013లో 3,23,949 మంది ప్రిలిమ్స్ రాస్తే.. మెయిన్స్కు అర్హత సాధించింది 14,959 మంది మాత్రమే. వీరిలో గణితం నేపథ్యం ఉన్నవారే అధికం. పేపర్-2లో ఆర్ట్స్, హుమానిటీస్ అభ్యర్థులు మ్యాథ్స్వారితో పోటీపడలేకపోతున్నారు. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ మెయిన్స్కు అర్హత సాధించలేకపోతున్నారు. గణితం నేపథ్యం కలిగిన అభ్యర్థులు పేపర్-1లో తక్కువ మార్కులు సాధించినా.. పేపర్-2లో స్కోరు చేసి విజేతలుగా నిలుస్తున్నారు. అంటే.. గణితేతర అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోవడానికి ఆప్టిట్యూడ్ టెస్ట్ అడ్డంకి అనేది స్పష్టమవుతోంది. ఇవన్నీ మూడేళ్ల తర్వాత బయటకు వచ్చాయి కాబట్టే సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆప్టిట్యూడ్ టెస్ట్లో మ్యాథ్స్ సంబంధమైన ఒక్కో ప్రశ్నకు ఇచ్చిన సమయం 90 సెకన్లు. గణితేతర అభ్యర్థికి ప్రశ్నను అర్థం చేసుకునేందుకూ ఆ సమయం చాలదు. -
24నే సివిల్స్ ప్రిలిమ్స్
న్యూఢిల్లీ: ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 24వ తేదీననే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గురువారం లోక్సభలో ప్రకటించారు. ఈ సమావేశాల తరువాత ఈ అంశంపై యూపీఎస్సీ సహా సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ‘సీశాట్ పేపర్పై అనుకూలంగా, వ్యతిరేకంగా.. భిన్నరకాల వాదనలున్నాయి. అందువల్ల దీనిపై రాజకీయ పార్టీలతో, ఇతర సంబంధిత వర్గాలతో లోతైన చర్చ, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్పై కూడా చర్చించాల్సి ఉంది. ఇదంతా ఈ 15 రోజుల్లో పూర్తికాదు. అందువల్ల షెడ్యూల్ ప్రకారమే 24న ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది’ అని వెంకయ్యనాయుడు వివరించారు. -
రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం!
న్యూఢిల్లీ:యూపీఎస్సీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనకు ఇక్కడతో ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా యూపీఎస్సీఅర్హత పరీక్ష జరగడానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విన్నవించారు. దీనిపై గురువారం లోక్ సభలో ప్రసంగించిన ఆయన.. ఈ సమస్యకు భవిష్యత్తులో తగిన పరిష్కారం కనుగొనేందుకు యత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 'ఆగస్టు 24 వ తేదీన యూపీఎస్సీ పరీక్ష జరుగనుంది. ఇప్పుడు ఈ వివాదం సరికాదు. ఈ తాజా గందరగోళంతో విద్యార్థులను మరింత ఆందోళనలోకి నెట్టవద్దు.'అని తెలిపారు. 2014లో యూపీఎస్సీ పరీక్షా విధానంపై విద్యార్థులు గళం విప్పారు. ముంగానే ఈ పరీక్షా విధానం ఖరారైంది. రాత్రికి రాత్రి మార్పులు తీసుకురావడం అసాధ్యం'అంటూ తనదైన శైలిలో వెంకయ్య తెలిపారు. అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్షం!
విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు నో న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మెరిట్ నిర్ధారణలో ఇంగ్లిష్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమంటూ సోమవారం సిబ్బంది, శిక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ ప్రకటన సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని విమర్శించాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పోరు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సాగదీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్తివారీ ఆరోపించారు. మరిం త చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమస్యపై ఆగస్టు 24లోగా పరిష్కారం సాధ్యం కాదని టీఎంసీ సభ్యుడు డెరిక్ఒబ్రీన్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ అంటే లోహే కా పేఢ్.. సివిల్స్ ప్రశ్నపత్రంలోని అనువాద లోపాలను ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ ఎత్తి చూపారు. ‘నార్త్ పోల్’ను హిందీలో ‘ఉత్తరీ ఖంభా’ అని, ‘స్టీల్ ప్లాంట్’ను ‘లోహే కా పేఢ్’ అని అనువదించారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సూచనకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘తప్పకుండా అఖిలపక్ష భేటీ ఉంటుంది. అవసరమైతే అలాంటి సమావేశాలను మరికొన్నింటిని నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ఇది సున్నితమైన అంశం. పరీక్షావిధానంలో భారీ మార్పులు అవసరమా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ‘ఈ అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను తెలిపాయి. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా మళ్లీ అఖిలపక్ష భేటీ ఏంటీ?’ అని సీపీఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. కాగా, సివిల్స్ ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి హిందీకి చేసిన అనువాదంలో తప్పులేం లేవని ప్రభుత్వం ప్రకటించింది. -
పార్లమెంటులో ‘యూపీఎస్సీ’ రగడ
తక్షణమే చర్చ చేపట్టాలన్న విపక్షం కొనసాగుతున్న సివిల్స్ అభ్యర్థుల నిరసన న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షపై వివాదం మరింత తీవ్రమైంది. సీశాట్ 2 పేపర్లోని ఇంగ్లిష్ విభాగం మార్కులను మెరిట్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోబోమన్న ప్రభుత్వ ప్రకటనకు సంతృప్తి చెందని అభ్యర్థులు జంతర్మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. సీశాట్ పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని, ఆగస్టు 24న నిర్వహించ తలపెట్టిన ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. వారికి మద్ధతుగా.. సీశాట్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోని ప్రతిపక్ష సభ్యులు పలుమార్లు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించేంతవరకు ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. లోక్సభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించడంతో సభ పావుగంట పాటు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన అనంతరం చర్చ కోరుతూ నోటీస్ ఇవ్వాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ వారికి సూచించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తక్షణమే దీనిపై చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే సహా 9 ప్రతిపక్ష పార్టీలు చైర్మన్కు నోటీస్ ఇచ్చాయి. సంబంధంలేని అంశాలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తవద్దని, నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని చైర్మన్ వారికి సూచించినప్పటికీ శాంతించని సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు. కాగా, సీశాట్ వివాదానికి ప్రభుత్వం చూపిన పరిష్కారం ‘సత్వరమే తీసుకున్న సరైన నిర్ణయం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించారు. ప్రిలిమినరీ పరీక్ష మెరిట్ నిర్ధారణలో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!
టాప్ స్టోరీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2ను రద్దు చేయాలంటూ.. కొద్దిరోజులుగా సివిల్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం సోమవారం స్పందించింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది. అయితే అభ్యర్థులు సీశాట్ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు సీశాట్ వివాదం ఏమిటి? దీనిపట్ల అభ్యర్థుల్లో అంత వ్యతిరేకత ఎందుకు? సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. అత్యుత్తమ కెరీర్కు బాటలు వేస్తూనే.. సమాజ సేవకు ధీటైన మార్గంగా నిలుస్తోంది.. సివిల్ సర్వీసెస్ పరీక్ష! ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టే సదవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో ‘ఇంగ్లిష్’ తమకు అందనీయకుండా చేస్తోందని సివిల్స్ ఔత్సాహి కులు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్టిట్యూడ్పై ఆందోళన సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.. ఇలా మూడు దశలుంటాయి. 2010 వరకు ప్రిలిమినరీ పరీక్ష విధానం కొఠారి కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉండేది. గతంలో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్(150 మార్కులు) పేపర్, ఒక ఆప్షనల్ పేపర్(300 మార్కులు) ఉండేవి. యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఎస్కే ఖన్నా ఏక సభ్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచి ప్రిలిమ్స్ స్థానంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టారు. అభ్యర్థుల్లో ఎనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో రెండు పేపర్లు ఒక్కోదానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ వరకు ఫర్వాలేదుకానీ, రెండో పేపర్ మాత్రం ఇంగ్లిష్ బాగా వచ్చిన వారికి అనుకూలంగా ఉందని హిందీ రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హిందీ, ప్రాంతీయ భాషల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటున్నారు. ‘సివిల్స్-2013 తుది ఫలితాలు గత జూన్లో విడుదలయ్యాయి. టాప్ 24 ర్యాంకర్లలో ఏ ఒక్కరూ భారతీయ భాషను ఎంపిక చేసుకోని వారే! హిందీ మాధ్యమం టాపర్కు 107 ర్యాంకు వచ్చింది. హిందీ మాధ్యమం అభ్యర్థుల సక్సెస్ రేటు ఇప్పుడు మూడు కంటే దిగువకు చేరుకుంది. సీశాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది 15 శాతం ఉండేది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ‘2008లో ఐఏఎస్లో చేరిన వారిలో ఇంజనీర్లు 30 శాతం మంది ఉంటే, హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు 30 శాతం ఉన్నారు. సీశాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఏఎస్లో ప్రవేశించిన ఇంజరింగ్ గ్రాడ్యుయేట్లు 50 శాతానికి చేరగా.. హ్యుమానిటీస్ చదివినవారి వాటా 15 శాతానికి పడిపోయింది’ అంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతికూలం - ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్కు సంబంధించి 8 ప్రశ్నలు (20 మార్కులు) ఉన్నాయి! దీనివల్ల ఇంగ్లిష్ బాగా వచ్చినవారు లాభపడుతున్నారు. తమకు నష్టం వాటిల్లుతోంది. - ప్రశ్నపత్రం (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా మిగిలినవి) హిందీ అనువాదం ఇస్తున్నా, అది సరిగా ఉండటం లేదు. గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా అనువ దిస్తున్నారని, ఇది అభ్యర్థుల ను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు అర్థం కావడం లేదు. ఈ విభాగాల్లోనూ ఇంగ్లిష్ అభ్యర్థులతోపాటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాభపడుతున్నారు. హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు నష్టపోతున్నారు. - అందరికీ అవకాశాలుండేలా సివిల్స్ ప్రిలిమ్స్ను మార్చాలి. ‘ప్రస్తుత వివాదం మాట అటుంచి ప్రిలిమ్స్ పేపర్-2.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిరాశాజనకంగా ఉందనే వాదన మొదట్నుంచీ ఉంది’ అంటున్నారు సివిల్స్ శిక్షణలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బి.జె.బి.కృపాదానం. అనుకూలం ఉన్నతాధికారులుగా సమాజానికి సేవ చేయబోయే వ్యక్తులకు బుద్ధికుశలత, నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ సామర్థ్యం అవసరం. ‘క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలడన్నదాన్ని అంచనా వేసేందుకు సీశాట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్పై ప్రశ్నలు ఇస్తున్నారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తదితర విభాగాలకు చెందిన ప్రశ్నలూ ఈ కోవకు చెందుతాయి. ఇలా ఇవ్వడం సబబే. ఇవి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటున్నాయన్నది నిజం కాదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థి అకడమిక్ నేపథ్యం ప్రభావం ఉంటుందనుకోవడం లేదు’ అని కొందరు సబ్జెక్టు నిపుణులు, సివిల్స్ ఔత్సాహికులు చెబుతున్నారు. ఇందులోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ పీవో, క్యాట్ తదితర పరీక్షలతో పోలిస్తే సీశాట్లో ఇస్తున్న ప్రశ్నలు మరీ అంత కష్టంగా లేవంటున్నారు. పార్లమెంటులోనూ సెగలు అభ్యర్థుల ఆందోళనతోపాటు ఎంపీలు కూడా గళమెత్తడంతో సీశాట్ వివాదంపై గతంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి అరవింద్ వర్మ నేతృత్వంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం వెలువడింది. కాబట్టి అభ్యర్థులు అనవసర ఆందోళనలకు తావివ్వకుండా తమ ప్రిపరేషన్ను కొనసాగించాలని బ్రెయిన్ ట్రీ అకాడెమీ డెరైక్టర్ వి.గోపాలకృష్ణ సూచిస్తున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే కదా? ‘ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్పై ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఆ మాత్రం ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే! దైనందిన విధులకు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం అనేది అడ్డంకిగా మారుతుంది. ఇక అనలిటికల్, రీజనింగ్ నైపుణ్యాలు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చాలా ముఖ్యం. వీటిని పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వడం సబబే. కష్టపడి, విశ్లేషణాత్మకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.. ఇలా ఏ నేపథ్యమున్న వారైనా వీటికి సమాధానాలు గుర్తించగలరన్నది నా అభిప్రాయం. జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమంటే అసలు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకుండా చేయాలని కాదు కదా! ప్రపంచీకరణ నేపథ్యంలో సివిల్స్లో వచ్చిన మార్పులు ఆవశ్యకం.. అభిలషణీయం. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ పరీక్ష నిపుణులు -
ఇంగ్లిష్ మార్కులను పరిగణించం!
సివిల్స్ సీశాట్ 2 పరీక్ష విధానంలో మార్పునకు ప్రభుత్వం ఆమోదం లోక్సభలో ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్ శాంతించని అభ్యర్థులు; పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని డిమాండ్ ఆగస్టు 24ననే ప్రిలిమ్స్: యూపీఎస్సీ; వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వివాదం ముదురుతుండటంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ‘సీశాట్(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)’ రెండో పేపర్లోని ఇంగ్లిష్ విభాగంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని సోమవారం ప్రకటించింది. అయితే, తాము సీశాట్ విధానంలో మార్పులను కోరడం లేదని, మొత్తంగా ఆ పేపర్ను తొలగించాలన్నది తమ డిమాండ్ అని గత 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సివిల్స్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన మార్పులను చేర్చి ముందు ప్రకటించినట్లుగానే ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 24ననే నిర్వహిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ‘‘ సీశాట్ పేపర్ 2 లోని ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్’ విభాగంలోని మార్కులను మెరిట్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని కేంద్ర సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో ప్రకటించారు. అలాగే, 2011లో సివిల్స్ పరీక్ష రాసినవారికి 2015లో మరో అవకాశమిస్తామని కూడా వెల్లడించారు. సీశాట్ పేపర్ 2ను తొలగించడం, ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయడం.. ఈ డిమాండ్లతో ఇప్పటివరకు ముఖర్జీ నగర్లో ఆందోళన నిర్వహిస్తున్న అభ్యర్థులు.. తమ నిరసన స్థలాన్ని సోమవారం జంతర్మంతర్కు మార్చారు. పార్లమెంటులో రభస.. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. రాజ్యసభలో గందరగోళం చెలరేగి సభ ఒకసారి వాయిదా పడింది. జితేంద్రసింగ్ ప్రకటన రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, తృణమూల్, అన్నాడీఎంకే, సమాజ్వాదీ, జేడీయూ పార్టీల సభ్యులను శాంతింపచేయలేదు. సివిల్స్ అభ్యర్థులు ఈ పరీక్షను తమ మాతృభాషలో రాసే అవకాశముందా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. సీశాట్ వివాద పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించాలని డిమాండ్ చేశారు. కాగా, నేపాల్ పర్యటన నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జితేంద్రసింగ్లు ఈ అంశంపై తాజా పరిణామాలను వివరించారు. -
పార్లమెంటుకు ‘ప్రిలిమ్స్’ సెగ!
పరీక్ష విధానంపై పార్లమెంటులో ఆందోళన సివిల్స్ అభ్యర్థులకు అన్యాయం జరగనివ్వబోమని ప్రభుత్వం హామీ న్యూఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై తలెత్తిన వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2ను మార్చాలన్న విపక్షాల డిమాండ్తో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడగా లోక్సభలో ఈ అంశాన్ని తక్షణమే చర్చకు చేపట్టాలంటూ విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని హామీ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని వారంలోగా నివేదిక అందించాల్సిందిగా కోరినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ అభ్యర్థులు నిరసనల వంటి భౌతిక చర్యలకు దిగరాదని కోరారు. ప్రాంతీయ అభ్యర్థులపై వివక్ష: శరద్ యాదవ్ ప్రభుత్వ ప్రకటనపై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షలో ప్రాంతీయ భాషల అభ్యర్థులపై వివక్ష ఉంటోందన్నారు. ఈ పరీక్షలో పాసయ్యే తమిళం, తెలుగు, హిందీ, ఇతర భాషల అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోతుంటే అదే సమయంలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించాలని కోరారు. యూపీఎస్సీ పరీక్ష నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంపీ డి. రాజా డిమాండ్ చేశారు. దేశంలో 500 భాషల్లో పరీక్షను నిర్వహించాలా? అంటూ ఇంగ్లిష్ భాషకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీ గిల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడ్డారు. లోక్సభలోనూ నిరసనలు... లోక్సభలోనూ ఈ అంశంపై విపక్షాలు నిరసనలకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ను ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ కోరగా అందుకు ఆమె నిరాకరించారు. మాతృభాషలోనే రాసేందుకు అనుమతించాలి: కేశవరావు సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలను మాతృభాషలో రాసేందుకు అనుమతించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఒక సమస్యను పార్లమెంటు చర్చించిందంటే ఆ సమస్య దేశ సమస్యగా కేంద్రం అర్థం చేసుకోవాలి. సమస్య లేకుండా చేయాలనే మేమంతా కోరుతున్నాం. మీ వద్ద ఉన్న నిగ్వేకర్ కమిటీ నివేదికను పక్కన పెట్టేశారు. ముందుగా హాల్టిక్కెట్ల పంపిణీని ఆపండి. ఇది ఆందోళన తీవ్రతను తగ్గిస్తుంది. 2012 నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ పరీక్ష(సీశాట్)లో రెండు సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించాల్సిన చోట ఆంగ్లాన్ని ప్రవేశపెట్టారు. ఆ పరీక్షను తమ భాషలో నిర్వహించాలని హిందీతోపాటు ఇతర మాతృ భాషల అభ్యర్థులు కోరుతున్నారు.’’ అని కేంద్రాన్ని అన్నారు.గ ఏమిటీ వివాదం... సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2లో కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రశ్నలను ఆంగ్లంలోనే అడగడం వల్ల హిందీ, ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే ప్రశ్నలు కఠినంగా ఉండటంతోపాటు సైన్స్ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలానే ఉంటున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
సివిల్స్లో సీశాట్తో అన్యాయం!
తెలుగు మీడియం అభ్యర్థుల గగ్గోలు పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షలో(ప్రిలిమినరీ) భాగంగా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) పేపర్ వల్ల తెలుగు మీడియం, ఇతర ప్రాంతీయ మాధ్యమాల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సివిల్స్కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ప్రిలిమ్స్లో 200 మార్కులకు నిర్వహించే సీశాట్ పేపర్లో ఆంగ్లం, గణితం చదివిన అభ్యర్థులే ఉత్తీర్ణులవుతున్నారని, గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమంలో చదివినవారు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని వారు వాపోతున్నారు. సివిల్స్ తెలుగు ప్రశ్నపత్రం కోసం అభ్యర్థనలు పంపండి అభిల భారత సర్వీసుల సిలబస్పై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరవింద్ వర్మ కమిటీకి తెలుగు ప్రశ్నపత్రం రూపకల్పనపై అభ్యర్థనలు పంపాలని ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంలో తెచ్చిన మార్పులు తెలుగులో పరీక్ష రాసే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిటీకి తమ అభ్యర్థనలు పంపించాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది. అభ్యర్థనల్ని లేఖ/ఫోన్కాల్/ఈ-మెయిల్ ద్వారా (అరవింద్ వర్మ (మాజీ ఐఏఎస్), కె-67ఏ (ఎఫ్ఎఫ్), హౌజ్ ఖాస్ ఎన్క్లేవ్, న్యూ ఢిల్లీ-110016, ఫోన్లు: 011-26859476, 981007908, ఈ-మెయిల్: (ఠ్చిటఝ్చ్చటఠిజీఛీః జిౌఝ్చజీ. ఛిౌఝ) కమిటీకి చేరవేయాలని సూచించింది. -
సివిల్ పరీక్ష రెండో పేపర్లో ఏ ప్రశ్నలు ఎక్కువ.?
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్లో బేసిక్ న్యూమరసీ నుంచి ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి? వాటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? - ఎస్.కీర్తన, కూకట్పల్లి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ రెండో పేపర్లో బేసిక్ న్యూమరసీ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. 2013లో నిర్వహించిన పరీక్షలో ఈ అంశం నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కనీసం 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బేసిక్ న్యూమరసీలోని అంశాలన్నీ 6వ తరగతి నుంచి 10వ తరగతి గణితం పుస్తకాల్లో ఉన్నవే. కాబట్టి ముందుగా ఈ పుస్తకాల్లో ఉన్న ప్రాథమిక సంఖ్యామానం, కసాగు, గసాభా, లాభం - నష్టం, బారువడ్డీ, చక్రవడ్డీ, సరాసరి, నిష్పత్తి - అనుపాతం, శాతాలు, క్షేత్రమితి అంశాలపై పట్టు సాధించాలి. వీటిలోంచి వచ్చే ప్రశ్నలు సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. ముందుగా సూత్రాలను నేర్చుకుని, హైస్కూల్ గణితంలో ఉన్న ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బ్యాంక్ పీవోస్, సివిల్స్లో వచ్చిన గత ప్రశ్నలనూ సాధన చేయాలి. దానివల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. 2013 సివిల్స్ పేపర్-2లో బేసిక్ న్యూమరసీ నుంచి వచ్చిన కింది ప్రశ్నలను పరిశీలించండి. Basic Numeracy questions 1. In a rare coin collection, there is one gold coin for every three non-gold coins. 10 more gold coins are added to the collection and the ratio of gold coins to non-gold coins would be 1: 2. Based on the information; the total number of coins in the collection now becomes 1) 90 2) 80 3) 60 4) 50 2. A gardener has 1000 plants: He wants to plant them in such a way that the number of rows and the number of columns remains the same. What is the minimum number of plants that he needs more for this purpose? 1) 14 2) 24 3) 32 4) 34 3. A sum of RS. 700 has to b used to give seven cash prizes to the students of a school for their overall academic performance. If each prize is Rs. 20 less than its preceding prize, what is the least value of the prize? 1) Rs. 30 2) Rs. 40 3) Rs. 60 4) Rs. 80 4. Out of 120 applications for a post, 70 are male and 80 have a driver's license. What is the ratio between the minimum to maximum number of males having driver's license? 1) 1 to 2 2) 2 to 3 3) 3 to 7 4) 5 to 7 5. In a garrison, there was food for 1000 soldiers for one month. After 10 days, 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to carry on with the remaining food? 1) 25 days 2) 20 days 3) 15 days 4) 10 days 6. The tank-full petrol in Arun's motor-cycle lasts for 10 days. If he starts using 25% more every day, how many days will the tank-full petrol last? 1) 5 2) 6 3) 7 4) 8 7. A person can walk a certain distance and drive back in six hours. He can al so walk both ways in 10 hours. How much time will he take to drive both ways? 1) Two hours 2) Two and a half hours 3) Five and a half hours 4) Four hours 8. A thief running at 8 km/hr is chased by a policeman whose speed is 10 km/hr. If the thief is 100 m ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be 1) 2 min 2) 3 min 3) 4 min 4) 6 min 9. A train travels at a certain average speed for a distance of 63 km and then travels a distance of 72 km at an average speed of 6 km/hr more than its original speed. If it takes 3 hours to complete the total journey, what is the original speed of the train in km/hr? 1) 24 2) 33 3) 42 4) 66 Key 1. Let the number of gold coins be x Then the number of non gold coins is 3x According to the condition x + 10 : 3x = 1: 2 2x + 20 = 3x x = 20 Therefore, in the coin collection Number of coins = x + 3x + 10 = 20 + 60 + 10 = 90 2. The minimum number of plants that he needs should be a perfect square number, i.e 312 < 1000 < 322 961 < 1000 < 1024 So, 24 is the minimum number of tree are needed 3. Let the least value of the prize be Rs x. Then x + x + 20 + x + 40 + x + 60 + x + 80 + x + 100 + x + 120 = 700 7x + 420 = 700 7x = 700 - 420 7x = 280 x = 40 4. Here male applicants = 70 So female applicants = 120 - 70 = 50 Maximum number of female applicants having driving license = 50 Minimum number of male applicants having driving license = 80 50 = 30 Maximum number of male applicants having driving license = 70 Hence, The required ratio = 30 : 70 = 3 : 7 5. Total food for 30 days = 1000 × 30 = 30,000 Food exhausted in 10 days = 10 × 1000 = 10,000 Food left for 2000 soldiers = 30,000 - 10,000 = 20,000 Food remaining for rest of the period 6. Petrol used in 1 day = x Hence, Petrol used in 10 days = 10x According to the condition Petrol used in 1 day = 1025x Number of days, tank full petrol will last 7. Time taken by the person to walk one way Time taken to drive one way = 6 - 5 = 1 hr Time taken to drive both ways = 1 + 1 = 2 hrs 8. Relative Speed = 19 - 8 = 2 km/hr So, time required for the policeman to catch the thief is 9. Let the original speed of the train be x km/hr Then x2 - 32x - 126 = 0 (x - 42)(x + 3) = 0 x = 42 or - 3 Hence, the original speed of the train is 42 km/hr INPUTS: BANDA RAVIPAL REDDY, DIRECTOR, SIGMA, HYDERABAD. -
‘సివిల్స్ ప్రిలిమ్స్ను వాయిదా వేయాలి’
న్యూఢిల్లీ: వచ్చే నెల 24న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా కేంద్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది. సిలబస్పై స్పష్టత వచ్చేవరకూ పరీక్ష నిర్వహించరాదని కోరినట్టు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. సివిల్స్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్)ను రద్దు చేయాలంటూ సివిల్స్ ఆశావహులు సోమవారం యూపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుత సిలబస్ హిందీ భాష ఆశావహులకు అనుకూలంగా లేదన్నారు. వీరిలో కొందరు మంగళవారం జితేంద్రను కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. సిలబస్పై సత్వరం నిర్ణయం తీసుకోవాలని యూపీఎస్సీతోపాటు సంబంధిత కమిటీని కూడా కోరామన్నారు.