Civil Services Exam
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
పండక్కి ఊరెళ్తున్నారా? మీ ఇంటి తాళాన్ని యజమానికి ఇచ్చి వెళ్తున్నారా?
అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.ఏదో జరుగుతుంది..యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్రూమ్లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్ వాట్సప్తో బట్టబయలుఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్ను ల్యాప్ట్యాప్లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలుసమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు. ఇంట్లో కరెంట్ పనులు చేయించాలనిపోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్లైన్లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ స్టడీ హాల్స్లో భద్రత కరువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో.. స్టడీ హాల్స్లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి. అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు? చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. విద్యుత్ వైర్లకు దగ్గరగా.. చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు. ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు. వీధి లైట్లు లేక ఇబ్బందులు.. అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు. అమ్మాయిల భద్రత గాలికి.. హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది. ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.జోరుగా గంజాయి అమ్మకాలు అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది. ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్వోఎస్ బూత్ పోల్స్ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.టౌన్ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం.. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్ను పార్కింగ్కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి భవనాలు అశోక్నగర్లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. -
వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.‘స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్గా అప్సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.... స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్ఒఎస్తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఒఎస్ లాగే ఐఏఎస్లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.See a lot of outrage on my timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the Rights Activists to also examine why this quota has still not been implemented in the IPS/ IFoS and certain sectors like defence. My limited point is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 22, 2024 -
దేశసేవకు మించింది లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్ సర్వీస్లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. తాను సివిల్స్కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. కల కోసం శ్రమించాను.. సివిల్ సర్వీసెస్లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్ఈసీ వరంగల్లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్ కలకు అక్కడే బీజం పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం.. నేటి యువతకు సివిల్స్ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మాక్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వొచ్చు. సాధిస్తానన్న నమ్మకంతో చదివా.. సివిల్ సర్వీసెస్ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్నెట్ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్లైన్లోనే మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్ ప్రిపేరవుతున్నా సోషల్ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను. -
యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్లో రాణించేందుకు నిపుణుల మెలకువలు అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు ఎన్ని సార్లు రాయొచ్చంటే: సాధారణ అభ్యర్థులు: 06 OBC అభ్యర్థులు: 09 SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ). -
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ‘విదేశీ విద్యా దీవెన’: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. చదవండి: Dec 20th: AP పొలిటికల్ అప్డేట్స్ జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. ►కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు.. ►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు ►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు ► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి. ►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. ► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి. ► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి. ►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది. ►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా. ► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. ►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. ►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం ► గవర్నమెంట్లో శాచురేషన్, ట్రాన్స్పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. ►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. ►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. ►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. ►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. ►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. ► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్గా ఎదగాలి. ► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. ►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ఉపయోగం ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది. అర్హత ప్రమాణాలు ఇవి.. ♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి. ♦ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి. ♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు. ♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు. ♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు. ♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
సివిల్స్లో నారీ భేరి
న్యూఢిల్లీ: సివిల్ సర్విసెస్–2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు. టాప్–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్లో టాప్–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్ ఈసారి సివిల్స్ తొలి ర్యాంకర్ ఇషితా కిశోర్ ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్ కాలేజీ నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. సివిల్స్లో కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్ సాధించారు. మూడో ర్యాంకర్ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్ మయూర్ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్ చదివారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక టాప్–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రిజర్వ్ లిస్టులో 178 మంది అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. నా కల నెరవేరింది సివిల్స్లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. సివిల్స్లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఈసారి సివిల్స్లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ రెండో ర్యాంకు ఊహించలేదు ‘‘సివిల్స్ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా. స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’ – గరీమా లోహియా, సివిల్స్ రెండో ర్యాంకర్ 15 రోజుల్లోగా మార్కుల వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్ http//www.upsc. gov.in ద్వారా ఫలితాలు, సివిల్స్ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత సాధించారు. విజేతలకు మోదీ అభినందనలు సివిల్స్–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్కు 667వ ర్యాంక్ ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న రామ్భజన్ కుమార్ సివిల్స్లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్భజన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్భజన్కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరారు. -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్లోనే అధికమని మొన్న ఏప్రిల్లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
శతమానం భారతి: లక్క్ష్యం 2047 సివిల్ సర్వీసులు
రాజ్యాంగ నిర్మాణ సభలో ఆనాటి సభ్యులు చాలామంది ఐసీఎస్ను రద్దు చేయాలని సూచించారు! పాలనకు ఆయువు పట్టయిన భారత సివిల్ సర్వీసు (ఐసీఎస్) లను రద్దు చేయాలని వారు సూచించడానికి తగిన కారణమే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఉన్న ఈ వ్యవస్థలో ఆనాటి ఐసీఎస్ అధికారులు అనేకమంది నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనం సాగిస్తుండేవారు. అయితే రద్దు అనేది పరిష్కారం కాదనీ, ఐసీఎస్ను కొనసాగించడమే మేలని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీఎస్ ఒక్కటే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్ వంటి సర్వీసులను కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక, మానవహక్కుల సాధన సుళువు అవుతుందని పటేల్ భావించారు. బ్రిటిష్ ఇండియాలో ఐసీఎస్ 1854లో ప్రారంభం అయింది. అందుకు నేపథ్యం.. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారులను ఇండియన్ సివిల్ సర్వీసులలో నియమించాలని బ్రిటిష్ అధికారి మెకాలే ప్రతిపాదించడం. ఆ ప్రతిపాదనతో ఆయన పార్లమెంటుకు నివేదికను సమర్పించిన అనంతరం సివిల్ సర్వీస్ కార్యరూపం దాల్చింది. 1855లో బ్రిటన్లో తొలి ఐసీఎస్ పరీక్ష జరిగింది. తర్వాత 1922 లో తొలిసారి భారతదేశంలోనే ఈ పరీక్షను నిర్వహించారు. అమృతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రజాప్రయోజనార్థం సంస్కరించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. (చదవండి: నేను నమ్ముతున్నాను) -
సీఎం జగన్ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్కుమార్కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్కుమార్కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
‘అదనపు’ అవకాశాన్ని పరిశీలించండి: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల పరీక్షకు హాజరు కాలేకపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ వారు చేస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అదనపు అవకాశం కోసం యూపీఎస్పీని ఆశ్రయించాలని పిటిషన ర్లకు సూచించింది. సివిల్స్ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. నిర్దేశిత తేదీన ఏ కారణం వల్లనైనా ఒకసారి పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి ఆ అవకాశం కల్పించే వెసులుబాటు లేదని యూపీఎస్పీ చెబుతోంది. -
‘సివిల్స్’ అటెంప్ట్లు, వయోపరిమితిని సడలించం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్ ఎగ్జామ్ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ సక్రమంగా పాటిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. -
సివిల్స్ అభ్యర్థులకు సడలింపులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆన్లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం దేశంలో ఆన్లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్ఫామ్ల క్రమబద్ధీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖలు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్.. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి టెండరు జారీకాలేదు ఆంధ్రప్రదేశ్లో రూ.384.26 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించి టెండరు జారీచేయలేదని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. 400 పడకల ఆస్పత్రి (అదనంగా 50 పడకలు సూపర్ స్పెషాలిటీ వింగ్) బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)కి అప్పగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎన్ఆర్డీఎంఎస్లో ఏపీ లేదు న్యాచురల్ రీసోర్స్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్ఆర్డీఎంఎస్)లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లను చేర్చలేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమల్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఆదర్శ సంపర్క్లో మౌలిక వసతులు ఆదర్శ సంపర్క్ పథకంలో భాగంగా లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళంలోని శాలిహుండం బౌద్ధ ఆనవాళ్లు, నాగార్జున కొండల్లో పర్యాటకులకు మౌలికవసతులు కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చేనేతకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోండి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను రక్షించేలా కేంద్రం వారికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తక్షణమే చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ కోరారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయించాలని, నూలు కొనుగోళ్లపై నేత కార్మికులకు సబ్సిడీని అందించే పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. దీన దయాళ్ హెల్త్ కార్గ్ ప్రోత్సాహ యోజనను పునరుద్ధరించడంతోపాటు రూ.30 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న సొసైటీలే ఈ పథకానికి అర్హులన్న నిబంధనలను తొలగించాలని సూచించారు. నూలు వస్త్రంపై విధించిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. -
సివిల్స్కు సిద్ధమవుతారా.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు..సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్ సర్వీసెస్–2022 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ, పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్... సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. గతేడాది కంటే పెరిగిన పోస్టులు సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్లు, 2020లో 796 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పది లక్షల వరకు పోటీ సివిల్స్కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తం మూడు దశలు సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ) ప్రిలిమినరీ ఇలా తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు.. ఒక్కో పోస్ట్కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్.. ఇలా ► సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్. ► ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ► అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ► తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు. ► మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. ► మెయిన్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్కు కేటాయించే మార్కులు 275. ► పర్సనాలిటీ టెస్ట్లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్లో నెగ్గాలంటే సివిల్స్ ప్రిలిమ్స్లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి. ► జనరల్ స్టడీస్ పేపర్గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ► రెండో పేపర్ సీశాట్లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం ► అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్ను కోర్ టాపిక్స్తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అనుసంధాన వ్యూహం సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్లపై ప్రత్యేక దృష్టి ప్రిలిమ్స్లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి. పేపర్–2కు ఇలా అర్హత పేపర్గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్తో అనుసంధానం సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్లను డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదివితే మెయిన్స్కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సిలబస్పై అవగాహన ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది. పుస్తకాలు సిలబస్పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు ► పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్(సస్టెయినబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్. ► పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్ప్రిటేషన్. దీర్ఘకాలిక వ్యూహం సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్ను మెయిన్ ఎగ్జామినేషన్తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. – శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం ► అర్హత:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in/mainmenu2.php ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు సివిల్స్లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్బాబు, విజయ్బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్బాబు ఐఆర్ఎస్ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్బాబు చెప్పారు. టెన్త్లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
సివిల్స్లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్కు.. సివిల్స్లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్లోని మలక్పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్లోని ఆర్కేపురం. కామర్స్లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్రెడ్డి సివిల్స్లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
సాక్షి, అమరావతి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్లో ఎనలేని క్రేజ్. ఏటా వేలమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరులక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. దీనికి సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kpias.com లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఏడాదిన్నర. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, ముల్టీపుల్ చాయిస్ కొశ్చన్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9666637219, 9666283534, 9912671555. పనిదినాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సంప్రదించవచ్చు. -
సివిల్స్ ఫలితాలపై యూపీఎస్సీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సివిల్ సర్వీసుల పరీక్షా ఫలితాలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గురువారం వివరణ ఇచ్చింది. ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు-2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను నిర్వహించామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదలుచుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్ధులను ఎంపిక చేశారని తప్పుదారి పట్టించే ప్రచారం తమ దృష్టికి వచ్చిందని యూపీఎస్సీ పేర్కొంది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా నియామకాల కోసం భారత ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షా నిబంధనలను కమిషన్ తూచాతప్పకుండా అనుసరించిందని తెలిపింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా 927 ఖాళీల కోసం తొలి విడతగా 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, నిబంధనల ప్రకారం రిజర్వ్ జాబితాను నిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో యూపీఎస్సీ వెల్లడించింది. దశాబ్ధాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది. సాధారణ ప్రమాణాల్లో ఎంపికైన రిజర్వ్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు వారికి ఉపయోగకరంగా ఉంటే వారి రిజర్వ్ స్టేటస్ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. చదవండి : మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్ -
శెభాష్ దేవాశిష్
భువనేశ్వర్: ఒడిశా సివిల్ సర్వీసెస్–2018 పరీక్షల్లో దేవాశిష్ పండా టాపర్గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్గడ్ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్గా, ఆకాశ కుమార్ పండా తీయ టాపర్గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్ పోర్టల్లో ప్రసారం చేశారు. సుందర్గడ్ జిల్లా ప్రజలు దేవాశిష్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
ఐదుసార్లు ఫెయిల్
ఉమ జీవితంలోని వరుస అపజయాలు ఆమెను దృఢపరచి, ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసేందుకు ఉపయోగపడ్డాయి. గత ఏడాది చేసిన ఆరో ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించిన ఉమకు స్ఫూర్తిని ఇచ్చినవారు స్టీవ్ జాబ్స్ సహా ఎందరో ఉన్నారు. ‘‘నా బాల్యమంతా తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక, ఎంబిఏ చదవాలనుకున్నాను. సిఎస్ఈ చదువుతానని ఏ రోజూ అనుకోలేదు. మా ప్రొఫెసర్ అబూబకర్ ప్రోత్సాహం మీద 2011 లో మొదటిసారి పరీక్ష రాశాను. తగినంత కృషి చేయకపోవడం వల్లనో ఏమో ఫెయిల్ అయ్యాను’ అంటారు ఉమ. ఒకేసారి మూడు ఉద్యోగాలు! చదువు పూర్తి అవుతుండగానే, మూడు పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ఒకేసారి మూడు ఆఫర్ లెటర్స్ అందుకున్నారు ఉమ. ఒకదాన్ని ఎంచుకుని అందులో చేరారు. ‘‘నాన్న గతించేవరకు నా జీవితం పూలబాటలో నడిచింది. కొన్ని రోజులకే అమ్మ కూడా పోవడంతో, భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది’ అని గుర్తుచేసుకుంటారు ఉమా మహేశ్వరి. కార్పొరేట్ సంస్థలలో ఆమె ఐదు సంవత్సరాలు పని చేశారు. అలా పని చేస్తూనే, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యారు. ఐదుసార్లు రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు! సాధారణంగా ఇన్నిసార్లు ఓటమి చెందితే మళ్లీ రాయరు. చుట్టూ ఉన్నవారంతా ‘ఇంకేం చదువుతావులే మానేయ్’ అని హేళన చేసినా, ఉమలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది. 2017లో ఉద్యోగాన్ని వదిలి, పరీక్ష కోసం దీక్షగా కూర్చొని ప్రిపేర్ అయ్యారు. చదువుతుండగానే తెల్లారేది అప్పటికే పెళ్లయింది ఉమకు. ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, చదువుకోవటానికి కొంత సమయం కేటాయించారు. ‘‘ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చదువు, ఆ తరవాత ఇంటి పనులు, అమ్మాయిని స్కూల్కి రెడీ చేయడం, మధ్యాహ్నం భోజన సమయం వరకు మళ్లీ చదువుకుని, సాయంత్రం మా అమ్మాయి ఇంటికి వచ్చాక తనతో గడపడం, తరవాత మళ్లీ చదువుకోవడం.. ఇదీ నా షెడ్యూల్. మెయిన్స్కి మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు చదివాను’’ అని తెలిపారు ఉమా మహేశ్వరి.ఇంటిని, పిల్లలను చూసుకుంటూనే సిఎస్ఈలో రెండోస్థానం సాధించిన అనూ కుమారి కూడా ఉమకు ఒక ఇన్స్పిరేషన్. హర్యానాకు చెందిన అనూ కుమారి సాధించిన విజయాలు, ఉమ అత్తమామలకు, భర్తకు కూడా ఉమ మీద నమ్మకాన్ని పెంచాయి. పట్టుదల ఉంటే బిడ్డ తల్లికి కూడా అన్నీ సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. చివరి ప్రయత్నంలో 2018లో ఉమ సివిల్స్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇప్పుడు తన పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. ‘‘నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు, ఆ నమ్మకమే నిన్ను విజయం వైపుగా నడిపిస్తుంది’’ అన్న స్టీవ్ జాబ్స్ మాటలు తన విజయానికి బాటలు వేశాయి అంటారు ఉమా మహేశ్వరి. – వైజయంతి -
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
సివిల్ సర్వీస్లకు మరో 66 మంది
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 66 మంది పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల భర్తీకి మొత్తం 1,058 ఖాళీలకు 990 మందికి నియామక పత్రాలిచ్చారు. తాజాగా రిజర్వ్ జాబితాలో ఉంచిన మరో 66 మందిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో జనరల్ 48, ఓబీసీ 16 మంది ఉండగా, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరి వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. -
‘సివిల్స్’కు వయో పరిమితి 32 ఏళ్లు
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు ఆగస్టు 1, 2018నాటికి జనరల్ అభ్యర్థులు 32ఏళ్లకు మించని వారు అయి ఉండాలి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను రాజ్యసభలో తెలిపారు. సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన జితేంద్ర సింగ్.. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని.. అభ్యర్థులు సరైన సమాచారం ఇవ్వని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. దీంతో వయోపరిమితిపై అభ్యర్థుల అనుమానాలకు ఫుల్స్టాప్ పడినట్లే. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ (డీఓపీ అండ్ టీ) తెలిపిన మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితిని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ సర్వీస్లో అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశలల్లో జరుగుతుందన్న విషయం విదితమే. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు. సివిల్ సర్వీసెస్ రాసేందుకు అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థి భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు, భారతీయ సంతతి ఇమిగ్రేట్లు, తమ అర్హతపత్రం చూపించి సివిల్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు జనరల్ అభ్యర్థులు- 4 సార్లుయ ఓబీసీ అభ్యర్థులు- 7సార్లు వికలాంగులు (జనరల్)- 7 సార్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల ఎంపికకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ నుంచి సుమారు 12 వేల మంది ఈ పరీక్షకు హాజరు కాగా, 600 మంది మెయిన్స్కు అర్హత పొందారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దానికి మూడు వారాల ముందు ఈ–అడ్మిట్ కార్డులు, టైం టేబుల్ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు మెయిన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా డిటెయిల్డ్ అప్లికేషన్ ఫారం(డీఏఎఫ్)ను నింపాలి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 6 మధ్య యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ ఫారం అందుబాటులో ఉంటుంది. -
మెట్రో రైలు ముందు దూకేశాడు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఈరోజు ఉదయం ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్ విహార్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్లోని గెస్ట్హౌస్లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్సైట్తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం(3న) జరగనున్న ఈ పరీక్ష కోసం 101 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు సుమారు 49 వేల మంది అభ్యర్థులు హజరుకానున్నారు. మొదటి పేపర్కు ఉదయం 9.20 వరకు, రెండో పేపర్కు మధ్యాహ్నం 2.20 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సాంకేతిక పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. యూపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ–అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది. -
సివిల్స్ కేటాయింపులో మార్పులకు యోచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్ విజేతలను ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇదే దురిశెట్టి అనుదీప్ గెలుపుబాట
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే ఒక మారథాన్. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్ఎస్ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్. రెండో అటెంప్ట్లోనే ఐఆర్ఎస్కు ఎంపికైన అనుదీప్.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుందా? అని ప్రశ్నించుకోవాలి. దీనికి సానుకూల సమాధానం లభిస్తే.. మన మనసే విజయానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. లక్ష్యం దిశగా కదిలేందుకు తోడ్పాటునందిస్తుంది. నా విషయంలో ప్రస్తుత విజయంలో ఇదే కీలక అంశం. సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత సర్వీసు ఐఏఎస్ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్ఎస్ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్పైనే! స్వీయ విశ్లేషణ 2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ తొలి దశ ప్రిలిమ్స్లో విజయం సాధించాను. మెయిన్ ఎగ్జామినేషన్లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్ సర్వీసెస్కు ప్రిపరేషన్ అనేది మెగా మారథాన్ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో పద పరిమితి, అందుబాటులో ఉన్న సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆన్సర్ షీట్పై పెన్ను కదిలించాలి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం బ్రేక్ పడినా.. విజయావకాశాలకూ బ్రేక్ పడినట్లే. ఈ విషయంలోనే నాలో పొరపాటు ఉందని గుర్తించాను. తప్పులను సరిదిద్దుకుంటూ.. వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్కు ప్రిపరేషన్ సయమంలో రైటింగ్ ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇది పరీక్ష హాల్లో సానుకూల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) లభించింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. లక్ష్యం.. ఐఏఎస్ 2013లో విజయంతో ఐఆర్ఎస్కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐఏఎస్ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్ఎస్ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్తో అధిక శాతం రీడింగ్పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్లో విజయం సాధించలేకపోయాను. 2016లో పరీక్షకు దూరంగా.. వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయింది. దీంతో 2016లో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్’ దూరం కాలేదు. ‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్స్టాప్ పెట్టాను. 2017 నోటిఫికేషన్లో అటెంప్ట్ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్ ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్–1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అందరూ చదివేది ఆ పుస్తకాలే.. ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్, మెటీరియల్ కోణంలో ఆలోచిస్తే.. పేపర్లకు సంబంధించి అభ్యర్థుల్లో అధిక శాతం మంది చదివే పుస్తకాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ మెటీరియల్, ఎకనామిక్స్కు మిశ్రా అండ్ పూరి.. ఇలా ప్రతి సబ్జెక్టుకు మార్కెట్లో మెటీరియల్ పరంగా ట్రేడ్ మార్క్ పుస్తకాలు ఉంటాయి. అభ్యర్థులందరూ దాదాపు అవే పుస్తకాలు ఉపయోగించుకుంటారు. కానీ, విజయం లభించేది కొందరికే. కారణం.. మెటీరియల్ చదివేటప్పుడు అనుసరించే ధోరణి, దృక్పథం. అంతేకాకుండా.. పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను గుర్తించగలిగే విలక్షణ నైపుణ్యం. దీనికోసం చేయాల్సిందల్లా గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం. దినపత్రికలు, ఇంటర్నెట్ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్కు ముందు ప్రిపరేషన్ నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్ను అలవరచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం, సమయ పాలన అలవడతాయి. ఇవే విజేతలకు, పరాజితులకు మధ్య ప్రధాన వ్యత్యాసాలు లేదా కారణాలు. అంతేగానీ విజేతలు హైపర్ యాక్టివ్ అనే ఆలోచనను వదులుకోవాలి. సివిల్ సర్వీసెస్లో విజయం అంటే ఏళ్లతరబడి చదివితేగానీ సాధ్యం కాదు’ అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే ఒక శాస్త్రీయ పద్ధతిలో కష్టపడి చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. స్మితా సబర్వాల్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. మాధ్యమం సమస్య.. ఓ అపోహ చాలా మంది సివిల్స్ ఔత్సాహికుల్లో ఉండే మరో ప్రధాన అపోహ.. పరీక్ష రాసే మాధ్యమం. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పరీక్ష రాస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్ల అవి కొంత తగ్గుతాయని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయంలో ఇది కేవలం అపోహ మాత్రమే. మనం ఏ మాధ్యమంలో అటెంప్ట్ ఇచ్చినా.. రాసిన సమాధానంలో ఫ్లేవర్ ఉంటే ఫలితం మనకు ఫేవర్గా ఉంటుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పరంగా రేషనలైజేషన్ విషయంలో యూపీఎస్సీ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందువల్ల మాధ్యమం విషయంలో ఆందోళన అనవసరం. ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్య.. మెటీరియల్. ఇది ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటోంది. దీంతో దీన్ని అర్థం చేసుకుని తెలుగులోకి అనువదించుకోవడం కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా సమయ పాలన సమస్య కూడా కనిపిస్తోంది. అయితే కచ్చితంగా ప్రాంతీయ మాధ్యమంలోనే అటెంప్ట్ ఇవ్వాలనుకున్న అభ్యర్థులు తొలి అటెంప్ట్కు ఏడాది ముందుగానే మెటీరియల్ సేకరించుకుని సదరు మాధ్యమంలోకి అనువదించుకుని ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల తొలి అటెంప్ట్ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనువదించుకునే క్రమంలో సబ్జెక్టు నిపుణులు లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఒకవేళ తొలి అటెంప్ట్లో నిరాశాజనక ఫలితం ఎదురైనా ఆందోళన చెందకుండా అదే మాధ్యమంలో ప్రిపరేషన్ సాగించాలి. కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్లే ఓటమి ఎదురైందనే భావనతో ఇంగ్లిష్ మీడియంకు మారితే.. కొత్త సమస్యలు ఎదురవుతాయి. సివిల్ సర్వీసెస్ ఫలితాల పరంగా ఇటీవల కాలంలో మరో అపోహ.. ‘సివిల్స్లో విజయం సాధించిన వారిలో బీటెక్, ఎంబీఏ, లేదా ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. పరీక్ష శైలి వారికి ఉపయోగపడే విధంగా ఉంటోంది’ అనేది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ప్రస్తుత పరీక్ష విధానంలో ఆప్షనల్స్కు ప్రాధాన్యం తగ్గింది. జనరల్ స్టడీస్కు ప్రాధాన్యం పెరిగింది. దీంతో బీఏ పట్టభద్రులైనా, ఎంబీఏ పట్టభద్రులైనా.. అందరికీ ఒకే విధమైన అంశాలు ఉంటాయి. అయితే సమాధానాలు ఇచ్చే సమయంలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. ఒక అంశాన్ని అనలిటికల్ అప్రోచ్తో సమాధానం ఇవ్వగలగడం. ఇదే వారికి కొంత అడ్వాంటేజ్గా మారుతుండొచ్చు. దీనికి కారణంగా అకడెమిక్గా బీటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్లలో అనుసరిస్తున్న కరిక్యులంను పేర్కొనొచ్చు. ఇంటర్వ్యూ.. ఇంటర్ప్రెటర్ చివరి దశ ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్ప్రెటర్ (అనువాదకుడు) సదుపాయాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఇంటర్ప్రెటర్స్ను కేటాయిస్తోంది. వీరు బోర్డు సభ్యులు, అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు. కానీ, దీనివల్ల ఎదురయ్యే సమస్య.. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తం చేసిన భావం సరిగా బోర్డు సభ్యులకు చేరకపోవడం. ఈ విషయంలో నా సలహా.. ఇంగ్లిష్లో బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీలైనంత మేరకు ఇంటర్ప్రెటర్ అవకాశం లేకుండా నేరుగా సమాధానాలు ఇచ్చేలా సన్నద్ధం కావాలి. అప్పుడే బోర్డు సభ్యులకు, అభ్యర్థులకు మధ్య ‘ఐ’ కాంటాక్ట్, ఇంటరాక్షన్ విషయాల్లో సరైన సమాచార మార్పిడి జరుగుతుంది. దురిశెట్టి అనుదీప్ సివిల్స్ ప్రస్థానం 2012 తొలి ప్రయత్నం – మెయిన్స్లో నిరాశ. 2013 రెండో ప్రయత్నం– ఐఆర్ఎస్కు ఎంపిక. 2014, 2015 మూడు, నాలుగు ప్రయత్నాలు – మెయిన్స్లో పరాజయం. 2017 అయిదో ప్రయత్నం – ఆలిండియా టాప్ ర్యాంకు. ఇంటర్వ్యూ సాగిందిలా.. ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్లో జరిగింది. అజిత్ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు.. చదివింది బీటెక్ కదా.. సివిల్స్వైపు ఎందుకు రావాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్ సర్వీసెస్ అని నిర్ణయించుకున్నాను. బీటెక్ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడానికి కారణం? ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకున్నాను. ఇప్పటికే ఐఆర్ఎస్లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్కు హాజరవడానికి కారణం? మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్ఎస్ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్ అని భావిస్తున్నాను. ఐఏఎస్ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది. స్వచ్ఛ్ భారత్ పథకంపై మీ ఉద్దేశం? కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం? ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ హాబీగా ‘మెడిటేషన్’ను పేర్కొన్నారు? ఇది మీకు ఎలా ఉపయోగపడింది? జీవితంలో నిరాశకు గురైన సందర్భాలు, మానసిక వ్యాకులతకు గురైన పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడటానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి సందర్భాల్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా తొందరగా తిరిగి మానసికోల్లాసం లభిస్తుంది. నాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం విధులు ఇలా.. ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను అనిపించింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. అయితే ఆలిండియా టాపర్గా నిలవడం మాటల్లో వర్ణించలేనిది. సివిల్స్ ఔత్సాహికులకు నా సలహా.. మీపై మీరు నమ్మకం పెంచుకోండి. వ్యూహాత్మకంగా అడుగులు వేయండి. ఆప్షనల్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వండి. చదివిన ప్రతి అంశాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోండి. -
మెకానికల్ ఇంజినీర్లు పనికిరారు : సీఎం
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్నగర్ జిల్లాకు పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను ముఖ్యమంత్రి అభినందించారు. 9 ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యశర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా తెలంగాణ విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రభుత్వ పరంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను తెలంగాణలోని హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు. -
నాన్న మాటలే స్ఫూర్తి..
తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరంక్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చినా సివిల్స్నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలోఅంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడాదాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్ఎస్ సాధించాడు.అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూనే...మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్–1 ర్యాంకును సొంతంచేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే... సాక్షి, హెదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్కు 180 మందిని, ఐఎఫ్ఎస్కు 42 మందిని, ఐపీఎస్కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్లో బిట్స్పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను. ఫైనల్ ఇయర్లోనే నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే సివిల్స్కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒరాకిల్లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్లో చేరా. జాబ్ చేస్తూనే ఒకవైపు గూగుల్లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో జీఎస్టీ, కస్టమ్స్లో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నా. ఆప్షనల్ ఆంత్రోపాలజీ మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది. ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు ఐఆర్ఎస్కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్కు సీరియస్గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం. అంతా సొంత ప్రిపరేషనే... మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. విద్య, ఆరోగ్యం: యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు. ప్రొఫైల్ పదో తరగతి మార్కులు: 86 శాతం ఇంటర్ మార్కులు: 97 శాతం ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం తెలుగు తేజాలు 1 దురిశెట్టి అనుదీప్ 43 శీలం సాయి తేజ 100 నారపు రెడ్డి మౌర్య 144 జి/.మాధురి 196 సాయి ప్రణీత్ 206 నాగవెంకట మణికంఠ 245 వాసి చందీష్ 374 రిషికేశ్రెడి 512 ప్రవీణ్చంద్ 513 ప్రసన్నకుమారి 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై.అక్షయ్ కుమార్ 816 భార్గవ్ శేఖర్ 884 వంశీ దిలీప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. సివిల్స్ టాపర్లను అభినందించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన ఉభయ రాష్ట్రాల తెలుగు అభ్యర్థులందరినీ అభినందిçస్తూ... వారి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
తెలుగు విద్యార్థికి సివిల్స్లో మొదటి ర్యాంక్
-
సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి
సాక్షి, న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్-2017 మెయిన్స్ తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది. గతేడాది జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ నిర్వహించింది. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది. ర్యాంకు టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) 1 దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి) 43 శీలం సాయితేజ 100 నారపురెడ్డి శౌర్య 144 మాధురి 195 వివేక్ జాన్సన్ 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై అక్షయ్ కుమార్ 816 భార్గవ శేఖర్ -
మైనార్టీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఏటా వంద మందిని ఎంపిక చేసి వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం మే 8వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి.. 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది పాత జిల్లాల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని వేసి నగరంలోని ఐదు ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఎంపిక చేశారు. స్టైఫండ్, మెటీరియల్ కూడా.. ఎంపికైన విద్యార్థులకు కోచింగ్కు అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా ఉపకార వేతనం కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లోకల్ విద్యార్థికి రూ.2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5 వేలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు అదనంగా రూ.3500 ఇస్తారు. కోచింగ్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.51 లక్షలు వెచ్చించనుంది. మైనార్టీల ప్రగతికి తోడ్పాటు ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపేట్టిన సివిల్ సర్వీస్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు నగరంలోని టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇవ్వలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.– ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్,సీఈడీఎం డైరెక్టర్ -
ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో అధునాతన సాంకేతికత, సృజనను వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ముగిసిన రెండ్రోజుల సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం, ఫైళ్లను ముందుకు కదిలించడంలో నెలకొన్న జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.‘నాలుగు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తే మనిషికి మోక్షం లభిస్తుంది. కానీ ఒక ఫైల్ అలాంటి యాత్రలు 32 చేసినా ఫలితం ఉండట్లేదు’ అని మోదీ అన్నారు. కొత్త విధానాలు, చట్టాలు చేసే సమయంలో ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని అన్నారు. ప్రభుత్వ విధానాల అమలులో వ్యూహాత్మకంగా ఆలోచించాలని, ఉన్నతాధికారులు సాంకేతికతను వినియోగించుకుంటే అది వారికి అదనపు బలమవుతుందని అన్నారు. సివిల్ అధికారుల శక్తి, సామర్థ్యాలు గొప్పవని, అవి జాతి ప్రయోజనాలకు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి వ్యూహాలు, ప్రాధమ్య కార్యక్రమాలతో కూడిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లాల అధికారులు, కేంద్ర, రాష్ట్రాల సంస్థలకు అవార్డులు అందజేశారు. మణిపూర్లోని కరంగ్ని దేశంలోనే తొలి నగదు రహిత దీవిగా తీర్చిదిద్దిన అధికారులకు మోదీ అవార్డును బహూకరించారు. -
సివిల్ సర్వీసెస్ ఎంపిక రద్దు చేయడం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం ఉన్నట్లుగా అప్పిలేట్ మెడికల్ బోర్డు ధ్రువీకరించాక, అంగవైకల్య కోటాలో సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడాన్ని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేయడం చెల్లదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన రిజ్వాన్ బాషా షేక్ అంగవైకల్యం కోటా కింద 2016లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించారు. బాషాకు 30 శాతం దృష్టి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డు ధ్రువీక రించింది. దీనిపై బాషా కేంద్ర వైద్య వ్యక్తిగత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి చెందిన అప్పిలేట్ మెడికల్ బోర్డులో అప్పీల్ చేసుకున్నారు. దృష్టి లోపం 40 శాతం ఉన్నట్లు అప్పీల్లో తేలింది. బాషా అంగవైకల్యంపై అందిన ఫిర్యాదును యూపీఎస్సీ చైర్మన్ నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ 30 శాతమే దృష్టి లోపం ఉందని 2017 నవంబర్ 7న తేల్చడంతో బాషా సివిల్ సర్వీసెస్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని బాషా క్యాట్లో సవాల్ చేయగా ఒకసారి మెడికల్ అప్పిలేట్ బోర్డు అంగవైకల్యాన్ని నిర్ధారించాక దాన్ని నిపుణుల కమిటీకి పంపడం సరికాదంది. సివిల్ సర్వీసెస్కు బాషా ఎంపికను రద్దు చేయడం చెల్లదని జస్టిస్ రెడ్డి కాంతారావు, సభ్యులు మిన్నీ మాథ్యూస్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
సివిల్ సర్వీసెస్ అధికారులకు అవార్డులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందించనున్నారు. వివిధ శాఖల అధికారుల నుంచి మొత్తం 623 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సేవలందిస్తున్న అడిషనల్ సెక్రటరీ /జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్/ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాతావరణ పరిరక్షణకు, విపత్తుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంక్షేమానికి కృషి చేసిన వారికి కూడా అవార్డులు అందజేస్తారు. -
సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలనుంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలని ఉందని యంగ్ టెర్రరిస్ట్ డానిష్ ఫరూఖ్ భట్ చెబుతున్నాడు. తాను చేసిన భారీ తప్పిదాన్ని తెలుసుకుని 22 ఏళ్ల ఫరూఖ్ పశ్చాత్తాపపడుతున్నాడు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడంతో కొందరు ఉగ్రవాదులతో కలిసి తొలిసారిగా వెలుగులొకి వచ్చాడు ఈ కశ్మీర్ యువకుడు. ఇటీవల పోలీసులు చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన, మార్పులు కార్యక్రమాలతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నాడు. ‘కొందరు ఉగ్రవాదులు, దేశ వ్యతిరేఖ శక్తులు నన్ను చెడువైపు ప్రోత్సహించాయి. దాంతో కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదులతో కలిసి తిరిగాను. మా కాలేజీ (డూన్ పీజీ కాలేజీ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) యాజమాన్యం నన్ను మళ్లీ చేర్చుకుని అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. చెడు మార్గాన్ని వదిలేసి మంచివాడిగా బతకాలనుకుంటున్నాను. కొన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర గ్రూపులతో సంబంధాలు కొనసాగించాను. భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ చేయను. కుటుంబం కోసం, దేశం పనిచేయాలని నిర్ణయించుకున్నానని’ ఫరూఖ్ భట్ వివరించాడు. ఫరూఖ్ తండ్రి ఫరూఖ్ అహ్మద్ భట్ మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి ఫోన్ కొన్నిరోజులు స్విచ్ ఆఫ్ కావడంతో ఎంతో ఆందోళన చెందాను. ఉగ్రవాది అంటూ పేరు పడుతుందని చాలా బాధపడ్డాం. చివరికి పోలీసుల సహకారంతో చెడు విధానాలకు స్వస్తి పలికాడు. వాడు తప్పు తెలుసుకుని మారినందుకు సంతోషంగా ఉందని’ చెప్పారు అహ్మద్ భట్. -
సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ : సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ ఎగ్జామ్ను క్లియర్ చేసిన అభ్యర్థుల రోల్ నెంబర్లను www.upsc.gov.in పొందుపరిచినట్టు యూపీఎస్సీ పేర్కొంది. ఈ ఎగ్జామ్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఈ వెబ్సైట్లో ఇంటర్వ్యూ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయసు, విద్యార్హతల సర్టిఫికేట్లు, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వంటి ఇతర ఒరిజనల్ డాక్యుమెంట్లను పట్టుకుని రావాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది. క్వాలిఫై కానీ అభ్యర్థుల మార్కు షీట్లను కూడా తుది ఫలితాల వెల్లడి నుంచి 15 రోజుల్లో యూపీఎస్సీ తన వెబ్సైట్లో పెట్టనుంది. -
ముంగిట్లోకి సర్కారు సేవలు
న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం. ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు. ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. -
జూన్ 3న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి అధికారుల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2018 జూన్ 3న ఉంటుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ విడుదలవుతుందనీ, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 6 అని యూపీఎస్సీ పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత స్థాయి అధికారుల నియామకానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2017 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్ష కోసం డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)ను ఆన్లైన్లో నింపి పంపాలని యూపీఎస్సీ సూచించింది. ఆగస్టు 17–31 మధ్య ఆ ఫామ్ ఠీఠీఠీ. upటఛి. జౌఠి. జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సివిల్స్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 28న ప్రారంభమవుతాయి. -
నేను నిజంగానే వికలాంగుడిని
హైకోర్టుకు విన్నవించిన రోణంకి గోపాలకృష్ణ సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షల్లో తప్పుడు ఆంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటా ద్వారానే ర్యాంకు సాధించినట్లు తనపై పిటిషనర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రోణంకి గోపాలకృష్ణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. తాను నిజంగానే వికలాంగుడినని, 2002లో జరిగిన ఓ ప్రమాదంలో తన కుడి చేయికి తీవ్ర గాయం కావడంతో ‘లోకోమోటర్ ఫిజికల్ డిజెబిలిటీ’తో బాధపడుతున్నానని వివరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం ద్వారా గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గోపాలకృష్ణను ఆదేశించింది. ఈ మేరకు గోపాల కృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. వికలాంగుల కోటాలోనే మొదటి ఉద్యోగం సాధించా శ్రీకాకుళం జిల్లా మెడికల్ బోర్డు తనను ‘శాశ్వత లోకోమోటర్ డిజెబుల్డ్ పర్సన్’గా ధ్రువీ కరిస్తూ 2002లో సర్టిఫికేట్ జారీ చేసిందని గోపాలకృష్ణ తెలిపారు. ‘విశాఖపట్నం కింగ్జార్జ్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, శ్రీకాకుళం రిమ్స్ ఆసుప్రతులు నా వైకల్యాన్ని ధ్రువీకరించాయి. 2006 డీఎస్సీలో అంగవైకల్య కోటా కింద ఎంపికైటీచర్గా నియమితులయ్యా. అదే కోటా కింద గ్రూప్–1కు ఎంపికయ్యా. 2016లో యూపీఎస్సీ పరీ క్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించా. అన్నీ నిర్ధారించుకున్న తరువాతే యూపీఎస్సీ మూడో ర్యాంకు కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యా నికి విచారణార్హతే లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని పిటిషనర్కు భారీ జరిమానా విధిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని గోపాలకృష్ణ కోర్టును కోరారు. -
రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
- కేంద్రం, యూపీఎస్సీ, ఏపీ సర్కార్లకు కూడా - పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షల్లో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటాలో ర్యాంకు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం వ్యవహా రంలో పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారా లశాఖ కార్యదర్శి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సంయుక్త కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ఆదేశిం చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీ లతో కూడిన ధర్మాస నం మంగళవారం ఉత్త ర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీ క్షలో తప్పుడు అంగ వైకల్య ధ్రువీకరణ పత్రంతో లబ్ధి పొందడం వల్లే గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్ కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ మురళీకృష్ణ స్వయం గా వాదనలు వినిపిస్తూ, అంగవైకల్యం లేనప్పటికీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి వికలాంగుల కోటా కింద ఉత్తీర్ణత సాధించి ర్యాంకు పొందారని తెలిపారు. దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. గోపాలకృష్ణ ఓబీసీకి చెందిన వారని, ఈ కేటగిరీ కింద 110.66 అర్హత మార్కులని మురళీకృష్ణ తెలిపారు. గోపాలకృష్ణ కేవలం 91.34 మార్కులు సాధించారని, వికలాంగుల కోటాలో 75.34 అర్హత మార్కులని తెలిపారు. ఓబీసీ కింద అర్హత మార్కులు సాధించలేని గోపాల కృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో వికలాంగుల కోటాలో అర్హత సాధించారని, తద్వా రా జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చిందని వివరించారు. వికలాంగుల కోటాలో పరీక్ష రాసేం దుకు అదనపు సమయం సైతం పొందారని తెలిపా రు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘రోణంకి’పై విచారణకు ఆదేశించండి
- అతనికి కేటాయించిన ర్యాంకును చట్ట విరుద్ధంగా ప్రకటించండి - హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్–2016 పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు మూడో ర్యాంక్ కేటాయించ డాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధ్రువీకరణపత్రంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ ఈ వ్యాజాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి, యూపీఎస్ సీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. సివిల్ –2016లో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు వచ్చిందని తెలిపారు. అయితే గోపాలకృష్ణ తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడికల్ విభాగంలో 45% మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించా రన్నారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 అని, అయితే గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే సాధించారన్నారు. వికలాంగ కోటా కింద అర్హతకు 75.34 మార్కులని, దీంతో అతను మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. సమయంతోనూ లబ్ధి మెయిన్స్లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా గోపాలకృష్ణ లబ్ధి పొందారని పిటిషనర్ పేర్కొన్నారు. వాస్తవానికి గోపాలకృష్ణకు పెద్ద వైకల్యమేదీ లేదని పిటిషనర్ వివరించారు. గోపాలకృష్ణ వైకల్యంపై పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని, అతనికి ఐఏఎస్ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. -
సివిల్స్ టాపర్ తొలివేతనం ఎవరికో తెలుసా?
మంగళూరు : సివిల్స్ ఆలిండియా టాపర్ గా నిలిచి దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన కేఆర్ నందిని తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు విరాళంగా ఇస్తున్నారు.. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన వెంటనే నందిని, విద్యకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తొలి వేతనాన్ని ఆల్వా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత విద్యా పథకానికి ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఆల్వా ఫౌండేషన్ ను సందర్శించిన ఆమె, ఈ ప్రకటన చేసినట్టు ఆ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఫౌండేషన్ చైర్మన్ ఎం మోహన్ ఆల్వాను కలిసిన నందిని, చదువుకోవాలనుకునే విద్యార్థులకు తాను సహాయం చేయడం కొనసాగిస్తానని చెప్పారు. ఆల్వా ఉచిత ఎడ్యుకేషన్ స్కీమ్ కింద లబ్దిపొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం విశేషం. నందిని సాధించిన ఘనతకు మోహన్ ఆల్వా ఆమెకు లక్ష రూపాయలను బహుమతిగా అందించారు. కన్నడ సాహిత్యంతో తనకున్న సంబంధం, తన లక్ష్యాలను సాధించడానికి చాలా సహకరించాయని నందిని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన నందిని, తన నేపథ్యానికి భిన్నంగా కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు. నందిని తండ్రి కేవీ రమేశ్, తల్లి విమలమ్మ కూడా ఈ ఫౌండేషన్ సందర్శనలో కూతురితో పాటు పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యంగా నాలుగో ప్రయత్నంలో ఆమె ఈ ఘనతను సాధించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని కెంబోడి ప్రాంతానికి చెందిన వారు కేఆర్ నందిని. -
ఓరుగల్లు యువతి ప్రతిభ
-
అమ్మ కలల్ని నిజం చేశా..
మిక్కిలినేని మను చౌదరి చిన్నప్పటి నుంచి ఆ విద్యార్థి తల్లి అతణ్ని కలెక్టర్ చేయాలనుకుంది. నువ్వు పెద్దయ్యాక కలెక్టర్ కావాలి అని చెబుతూ ఉండేది. అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న ఆ పిల్లాడు తల్లి మాటలను సీరియస్గా తీసుకున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో ‘నీ లక్ష్యం ఏంటీ’ అని టీచర్లు అడిగితే తడుముకోకుండా కలెక్టర్నవుతా అనే చెప్పేవాడు. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి అమ్మ ఆశయమే తనకు సరైన లక్ష్యమని తెలుసుకున్నాడు. సివిల్సే లక్ష్యంగా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 36వ ర్యాంకు సాధించాడు మిక్కిలినేని మను చౌదరి. సక్సెస్ స్పీక్స్ మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు. నాన్న రాజబాబు ఓరియెంట్ సిమెంట్లో సీనియర్ కెమిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ భారతి గృహిణి. తమ్ముడు ఎంబీఏ చదువుతున్నాడు. 2015లో పీజీడీఎం పూర్తిచేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. తొలి ప్రయత్నంలోనే విజయం దక్కడం నాకు, నా కుటుంబానికి అమితానందాన్ని కలిగించింది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీలు అవుతుంటాయి. అందులో భాగంగా నా విద్యాభ్యాసం పలు ప్రాంతాల్లో సాగింది. నాలుగో తరగతి వరకు ఆదిలాబాద్లోని దేవాపూర్లో చదివా. అక్కడి నుంచి నాన్నకు మహారాష్ట్ర జల్గావ్కు బదిలీ అయింది. ఇక అయిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివాను. జల్గావ్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. తర్వాత ఢిల్లీలో పీజీడీఎం చేశాను. ఇంజనీరింగ్ నుంచే చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇంజనీరింగ్లో చేరిన తర్వాతే సమాజంపై అవగాహన ఏర్పడింది. ఇంజనీరింగ్లో భిన్న వర్గాల వారితో కలిసి చదువుకోవడం కారణంగా సామాజిక స్పృహ అలవడింది. మూడో ఏడాదిలో ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం, చదవాల్సిన పుస్తకాలు మొదలైన సమాచారాన్ని ఇంటర్నెట్లో శోధించడం ప్రారంభించా. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ కోసం ఢిల్లీ వెళ్లాను. ఎప్పటికప్పుడు సీనియర్లతో, ర్యాంకు సాధించిన వారితో మాట్లాడుతూ సన్నద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకున్నాను. ఎంబీఏ తర్వాత పూర్తిసమయాన్ని సివిల్స్ ప్రిపరేషన్కు కేటాయించా. సివిల్స్కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. కోచింగ్లో ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? తదితర గైడెన్స్ మాత్రమే ఇస్తారు. చదవాల్సిన బాధ్యత పూర్తిగా విద్యార్థిపైనే ఉంటుంది. ఆప్షనల్ .. సైకాలజీ సాధారణంగా అభ్యర్థులు సైన్స్ లేదా సోషల్ సైన్సెస్ సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకుంటారు. అయితే సైకాలజీ ఈ రెండు అంశాల కలబోతగా ఉంటుంది. నేను ఎంబీఏలో చదివిన హుమ్యాన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ బిహేవియర్ పుస్తకాలు సైకాలజీ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం. ఈ పుస్తకాల్లో సైకాలజీకి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయి. దీంతో సైకాలజీపై కాస్త ఆసక్తి పెరిగింది. పైగా సివిల్స్ పరీక్షలో సైకాలజీలో గతంలో మంచి మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించి సైకాలజీ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకున్నాను. బ్యాలెన్స్డ్గా సమాధానాలు ఎంబీఏ తర్వాత 2015 ఏప్రిల్లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లో చేరా. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు ఒకేసారి ప్రిపరేషన్ ప్రారంభించా. మెయిన్స్ కోసం రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేశా. సీనియర్లు, గత విజేతలు రాసిన నోట్స్ ఫాలో అయ్యా. 2015 మెయిన్స్ టాపర్లు రాసిన పేపర్లు నెట్లో అందుబాటులో ఉంటాయి. వారు రాసిన విధానంలో కొన్ని సానుకూల అంశాలను వెతికి అదే మోడల్లో రాశాను. డిస్క్రిప్టివ్ పద్ధతిలో సమాధానాలు రాసేటప్పుడు సమతూకం పాటించాలి. చదివిన పుస్తకాలు సివిల్స్కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మొదట ఆరో తరగతి నుంచి +2 వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఔపోసన పట్టాలి. తర్వాత సబ్జెక్టుల వారీగా రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. పాలిటీ–లక్ష్మీకాంత్; ఎన్విరాన్మెంటల్– శంకర్ ఐఏఎస్ పుస్తకం; జాగ్రఫీ– ఎన్సీఈఆర్టీ + కరెంట్ అఫైర్స్ + గో చెంగ్ లియాంగ్ పుస్తకం; ఎకానమీ– ఎన్సీఈఆర్టీ + కరెంట్ అఫైర్స్ + క్లాస్ నోట్స్; మోడర్న్ హిస్టరీ– బిపిన్చంద్ర; మిడీవల్ హిస్టరీ– తమిళనాడు స్టేట్ లెవల్ ఇంటర్ ఫస్టియర్ పుస్తకం; ప్రాచీన చరిత్ర– ఆర్.ఎస్. శర్మ పుస్తకం + క్లాస్ నోట్స్. ఇంటర్వూ్య సాగిందిలా ఇంటర్వూ్య బోర్డ్లో చైర్మన్ పీకే. జోషి + నలుగురు సభ్యులు ఉన్నారు. ఇంటర్వూ్యలో ముఖ్యంగా ఎంబీఏకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సిక్స్ సిగ్మా అంటే ఏమిటి? మార్కెటింగ్, సేల్స్కు మధ్య తేడా ఏమిటి? డబ్ల్యూపీఐ, సీపీఐపై ప్రశ్నలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. తెలంగాణలో, ఏపీలో ఉన్న ముఖ్య సమస్యలు ఏమిటి? కొత్తగూడెం దేనికి పేరొందింది? మొదలైన ప్రశ్నలతో దాదాపు 25–30 నిమిషాల పాటు ఇంటర్వూ్య సాగింది. కోచింగ్కు వెళ్లలేని వారు సరైన మెటీరియల్ సేకరించుకొని చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ఇప్పడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే.. ఇంటర్నెట్లో అవసరమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో మాత్రం అప్రమత్తత అవసరం. ప్రొఫైల్ పదో తరగతి (2006 – 2007): 87 శాతం 10+2 (2007 – 2009): 82 శాతం ఇంజనీరింగ్ (మెకానికల్) (2009 – 2013): 75 శాతం పీజీడీఎం (2013 – 2015): 9.4 సీజీపీఏ సివిల్ సర్వీసెస్–2016 ర్యాంకు: 36. -
సివిల్స్లో మెరిశారు
పాలకొల్లు (సెంట్రల్)/అత్తిలి : జిల్లా ఆడపడుచులు సివిల్స్లో మెరిశారు. బుధవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాల్లో పాలకొల్లుకు చెందిన చోడిశెట్టి మాధవి 104వ ర్యాంకును కైవసం చేసుకోగా, అత్తిలి గ్రామానికి చెందిన మేడపాటి శ్వేత 870వ∙ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాధవి అరుణ్కుమార్, రాజేశ్వరి దంపతుల కుమార్తె. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి అక్కడే సివిల్స్కు ప్రిపేరయ్యా రు. మాధవి మాట్లాడుతూ తాను సివిల్స్ రాయడం ఇది రెండోసారి అని.. తనకు లభించిన 104వ ర్యాంకును బట్టి ఐఆర్ఎస్ లభించే అవకాశం ఉందని చెప్పారు. ఐఏఎస్ కావాలనేది తన తాతయ్య గంటా రామచంద్రరావు కోరిక అని, అందుకోసం మళ్లీ పరీక్షలు రాస్తానని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే.. అత్తిలికి చెందిన మేడపాటి శ్వేత తొలి ప్రయత్నంలోనే 870వ ర్యాంకు సాధించారు. 2015లో ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఢిల్లీలో కోచింగ్ తీసుకుని 2016లో సివిల్స్ రాశారు. ఆమె తండ్రి మేడపాటి మూర్తి పీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. తల్లి అత్తిలి బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని. శ్వేత సోదరి శృతి బీటెక్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలోని కొటక్ మహీంద్ర బ్యాంక్లో డెప్యూటీ మేనేజర్గా పని చేస్తోంది. -
సంస్కరణల సంకల్పముంది
► పరివర్తన తేవటంలో అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి ► ధైర్యంగా, నిజాయితీగా పనిచేయండి.. సమస్యలొస్తే నేనున్నా ► సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను కొనసాగించేందుకు బలమైన రాజకీయ సంకల్పం తనకుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో అధికారులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. అధికారులు విశాల దృక్పథంతో.. దేశాన్ని పరివర్తనం చేయటంలో ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరికీ భయపడొద్దని నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ‘రాజకీయ సంకల్పం సంస్కరణలు (రిఫామ్) తీసుకొస్తుంది. కానీ, బ్యూరోక్రసీ దాన్ని అమలు (పెర్ఫామ్)చేస్తుంది. ప్రజల భాగస్వామ్యం పరివర్తనం (ట్రాన్స్ఫామ్) తీసుకొస్తుంది. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులొస్తే నా మద్దతుంటుంది’ అని అన్నారు. నిర్ణయాలు తీసుకున్నాక.. విధానపరమైన సమస్యలొస్తే కాగ్, సీబీఐ, సీవీసీ (త్రీ సీస్)తో ఇబ్బందులపై పలువురు అధికారులు మాట్లాడిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లెక్కల ద్వారా ఏమైనా మార్పొస్తుందా? ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కాగ్కు ఫలితమే కావాలి. కాగ్ లెక్కల ప్రకారమే ముందుకెళ్లాలంటే దేశంలో మార్పు తీసుకురాలేం? మనం కూడా ఎలాంటి మార్పునూ గమనించలేం’ అని తెలిపారు. సీనియర్ అధికారులు తమకంతా తెలుసనే సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చి జూనియర్ల ఆలోచనలకు సరైన మార్గదర్శనం చేయాలన్నారు. అధికారుల గురించి ప్రజలు ఆలోచించే తీరు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘అధికారులు చెడ్డోళ్లు కానప్పుడు వారు దురాలోచనలతో పనిచేయరు. అలాంటప్పుడు సామాన్యుడు ఒక అభిప్రాయాన్ని పెంచుకునే బదులు ఫిర్యాదు చేస్తాడు? కారణమేంటో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరిగినపుడు ప్రజల అభిప్రాయాన్ని మార్చటం కష్టమేం కాదనుకుంటున్నా’ అని అన్నారు. కశ్మీర్ వరదలప్పుడు ఆర్మీ చేసిన సాయానికి ప్రజలు చప్పట్లు కొట్టారని.. అదే ప్రజలు తర్వాత ఆర్మీపై రాళ్లు రువ్వారన్నారు. కానీ ఒక్క క్షణం ఆర్మీ చేసిన పని ప్రజలను హత్తుకుందన్నారు. అధికారులు జట్టుగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలొస్తాయన్నారు. అందుకే ఫోన్లు వద్దంటా! అధికారులతో తనెప్పుడు సమావేశమైనా మొబైల్ ఫోన్లు లేకుండానే వారిని రమ్మంటానని ప్రధాని తెలిపారు. సమావేశం జరుగుతుండగానే అధికారులు మొబైల్లో సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటుంటారన్నారు. ‘ఈ మధ్య జిల్లాస్థాయి అధికారులు కూడా సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోతున్నారు. అందుకే నా సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాను. సోషల్ మీడియా ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. సొంత డబ్బా కొట్టుకునేందుకు కాదు’ అని ప్రధాని చురకలంటించారు. ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్కు మారిపోతోందని అలాంటప్పుడు మొబైల్ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలన్నారు. ‘నేను కోచింగ్కు వెళ్లలేదు. అందుకే అధికారిని కాలేకపోయాను. అధికారినే అయివుంటే ఈ 16 ఏళ్లలో డైరెక్టర్ స్థాయిలో ఉండేవాడినేమో. నా అదృష్టం కొద్ది ప్రజా సేవలో ఉన్నాను’ అని మోదీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పథకాల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు. ఆదివారం ‘నీతి’ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ విజన్ 2030 రోడ్ మ్యాప్తో 15 ఏళ్లపాటు అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో మూడేళ్లు, ఏడేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి వ్యూహాలు రూపొందిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం దినమంతా ఈ సమావేశం జరగనుంది. -
ముందుగా వచ్చిన మంత్రి.. అధికారులు లేట్!
సాధారణంగా ఏవైనా కార్యక్రమాలకు మంత్రులు, ఇతర వీవీఐపీలను పిలిస్తే వాళ్లు కార్యక్రమం ప్రారంభ సమయం తర్వాత ఓ అరగంటకో, గంటకో వస్తుంటారు. వాళ్లకోసం వేచి చూసి.. చూసి కళ్లు కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను పిలిచారు. ఆయన ఉదయం 9.40 గంటలకే వచ్చేశారు. కానీ 9.57 గంటల వరకు కార్యక్రమం మొదలు కాలేదు. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. తాను ముందుగానే వచ్చినా కార్యక్రమాన్ని సమయానికి ఎందుకు ప్రారంభించలేదని అక్కడున్న అధికారుల మీద మండిపడ్డారు. మీ నిబద్ధత స్థాయి ఏమైనా పడిపోయిందేమో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైన కార్యక్రమాలని, ఇలాంటి వాటిని గౌరవనీయమైన పద్ధతిలో్ నిర్వహించాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రెండు రోజుల కార్యక్రమాన్ని రాజ్నాథ్ ప్రారంభించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసిన అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలోనే శుక్రవారం నాడు అవార్డులు అందజేస్తారు. -
‘సివిల్స్’లో మార్పులు?
దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మొదలు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదివిన వారు సైతం పోటీపడుతున్న పరీక్ష. ఇంతటి ప్రాధాన్యమున్న పరీక్షలో చేయాల్సిన మార్పులకు సంబంధించి బి.ఎస్.బస్వాన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు జరగనున్నాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. నివేదికలోని అంశాలు బహిర్గతం కానప్పటికీ, కనీస వయోపరిమితి మొదలు పరీక్ష పేపర్ల వరకు వివిధ అంశాలపై కమిటీ సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం.. 2015, ఆగస్టులో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్.బస్వాన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎన్.నవ్లావాలా, మాజీ యూజీసీ సభ్యులు హరిప్రతాప్ గౌతమ్, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధే, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా, మేనేజ్మెంట్ ప్రొఫెసర్ బి.మహదేవన్, యూపీఎస్సీ సభ్య కార్యదర్శి ఎం.పి.తంగిరాల సభ్యులుగా ఉన్న కమిటీ వాస్తవానికి 2016 ఫిబ్రవరిలోనే నివేదిక అందించాల్సి ఉంది. కానీ, ఆర్నెల్ల గడువు పొడిగింపుతో ఆగస్టు 9న నివేదిక అందజేసింది. ఈ నివేదికను బహిరంగపరచలేమని.. అయితే అర్హతలు, అటెంప్ట్లు నుంచి ఇంటర్వూ్య విధానం వరకు మార్పులు సూచించిన మాట వాస్తవమేనంటూ సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీఓపీటీ) సమాధానం ఇచ్చింది. వయోపరిమితి తగ్గింపు బస్వాన్ కమిటీ సిఫార్సుల్లో కీలకమైంది, అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం వయోపరిమితి తగ్గింపు. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో 32 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 26 ఏళ్లకు కుదించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. దీన్ని నాలుగుకు తగ్గిస్తూ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అర్హతల్లో నిబంధనలు ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులెవరైనా సివిల్స్కు హాజరుకావొచ్చు. అయితే ఈ పరీక్ష ద్వారా భర్తీచేసే సర్వీసులను దృష్టిలో పెట్టుకుని ఆయా సర్వీసులకు అవసరమైన అంశాల్లో అకడమిక్ నేపథ్యం ఉండే విధంగా అర్హత నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సర్వీస్ ఔత్సాహికులు తప్పనిసరిగా లా ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన. అంతేకాకుండా కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీలోనూ తప్పనిసరిగా 50 శాతం మార్కులు పొందాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. సర్వీస్ను బట్టి అదనపు పేపర్లు íసివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 24 సర్వీసుల్లో పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇప్పటివరకు అన్ని సర్వీసుల ఔత్సాహికులు ఒకే రకమైన పేపర్లు రాయాల్సిన విధానం అమలవుతోంది. అయితే బస్వాన్ కమిటీ ఈ అంశంలో కీలక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అవి.. సర్వీస్కు అనుగుణంగా ఒకటి లేదా రెండు ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం. (ఉదాహరణకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ పోస్టుల భర్తీ క్రమంలో అకౌంటెన్సీ నైపుణ్యాలను పరీక్షించేలా çసంబంధిత సబ్జెక్టులతో ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం వంటివి). అదే విధంగా ఆప్షనల్ సబ్జెక్టులను పూర్తిగా తొలగించడం. ఇంటర్వూ్యలో మార్పులు సివిల్స్ ఎంపిక ప్రక్రియలోని తుది దశ ఇంటర్వూ్యపైనా బస్వాన్ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం.. ప్యానెల్ ఇంటర్వూ్యకు ముందు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలి. త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహిస్తున్న మాదిరిగా రెండు, మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ఇంటర్వూ్య ప్రక్రియను కొనసాగించి అభ్యర్థుల్లోని మానసిక ద్రుఢత్వాన్ని, ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా చూడాలి. పరీక్షలో ముఖ్యంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆన్లైన్ విధానాన్ని అనుసరించాలని.. ఫలితంగా ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మెరుగైన సర్వీస్ కోరుకుంటే? ప్రస్తుతం ఐఆర్ఎస్, ఇతర గ్రూప్–ఎ సర్వీస్లకు ఎంపికైన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వయోపరిమితి అనుమతించిన మేరకు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే అభ్యర్థులు తమకు లభించిన సర్వీస్కు రాజీనామా చేసి మెరుగైన సర్వీస్కు సన్నద్ధమయ్యేలా నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల విజేతల్లో రిపీటర్స్ సంఖ్య 20–30 శాతం ఉంటోంది. వీరు అప్పటికే ఉన్న సర్వీసుల్లో ఖాళీ ఏర్పడటం, వాటి కోసం తర్వాతి సంవత్సరంలో చేపట్టే నియామక ప్రక్రియ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతోంది. ఇది ఆయా విభాగాల్లో పనితీరుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి సమీక్ష సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియను ఐదేళ్లకోసారి సమీక్షించి.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ సబ్ కమిటీ సైతం సివిల్స్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఔత్సాహికులకు అంతర్జాతీయ సంబంధాలపై లోతైన అవగాహనను పరీక్షించేలా అదనపు పేపర్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. lఆందోళన అనవసరం బస్వాన్ కమిటీ సిఫార్సులు, వాటి అమలుపై సివిల్స్–2017 ఔత్సాహికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిటీ నివేదిక ఇంకా పరిశీలనలోనే ఉంది. మరోవైపు సివిల్స్–2017 షెడ్యూల్ కూడా కొంత ముందుకు జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బస్వాన్ కమిటీ సిఫార్సులు 2017 సివిల్స్లో అమలయ్యే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా ఏవైనా మార్పులు చేసేటప్పుడు యూపీఎస్సీ కచ్చితంగా కనీసం ఏడాది ముందే వాటిని ప్రకటిస్తుంది. – వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ lఅభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి సివిల్స్ ఔత్సాహికుల గరిష్ట వయోపరిమితి తగ్గింపు మంచిదే. కానీ, దాన్ని 26 ఏళ్లుగా నిర్ణయిస్తే కొన్ని వర్గాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందులో మంచిని పరిశీలిస్తే.. ప్రస్తుతమున్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఫలితంగా వేల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సివిల్స్పైనే దృష్టి పెట్టి తమ కెరీర్లో ఇతర లక్ష్యాలపై దృష్టిసారించలేకపోతున్నారు. పర్యవసానంగా చివర్లో నిరాశాజనక పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. వయోపరిమితి తగ్గింపు వల్ల సివిల్స్కు నాలుగైదేళ్లకే పరిమితమై తర్వాత తమ కోర్ కెరీర్ వైపు దృష్టి సారించే అవకాశం లభిస్తుంది. అయితే ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న సిఫార్సులన్నీ కూడా అనధికారికమే. వీటిని వీలైనంత త్వరగా వెల్లడించి అభ్యర్థులకు కొంత సమయం ఇచ్చే విధంగా వ్యవహరించాలి. – డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఐఏఎస్ అధికారి. -
సివిల్స్ పోస్టులు గత అయిదేళ్లలో కనిష్టం
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో భర్తీ కోసం 980 ఖాళీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జారీ చేసిన నోటిఫికేషన్ సంఖ్యాపరంగా గత అయిదేళ్లలో అత్యల్పంగా నిలువనుంది. 2011లో కేవలం 880 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది 1,079 ఖాళీలను, 2015లో 1,164 పోస్టులను భర్తీ చేసింది. 2013లో 1,228, 2014లో 1,364 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది జూన్ 18న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉంది. -
ఐఏఎస్ కావాల్సిన యువతి...
ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఇప్పటికే ఎంబీఏ పూర్తిచేసి, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె.. అంతలోనే తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్తున్న సఫారీ కారు అదే రోడ్డులో వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్ను ఢీకొంది. ఆ స్కూటర్పై అక్కాచెల్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావని వెళ్తున్నారు. ఆ కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి, నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. స్కూటర్ దిగమర్రు పంటకాలువలో పడిపోయింది. అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానికులు నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పావని చికిత్స పొందుతోంది. కాగా, గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ దుఃఖం నుంచి కుటుంబం కోలుకోకముందే గౌతమి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తు వల్లే ప్రమాదం టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకి అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది. మద్యం మత్తులో మోటారు సైకిల్ను ఢీకొట్టారని అంటున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారు. -
రైతు రుణాలపై ఢిల్లీలో జేసీ ప్రజెంటేషన్
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారు.. అందుకు ఏయే విధానాలను అనుసరిస్తున్నారు అనే విషయాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డు 2016-17 ఎంపికల్లో భాగంగా ‘లోన్ చార్జ్ క్రియేషన్స్ మాడ్యూల్ ప్రాజెక్టు’పై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. -
పెళ్లి కోసం మతం మారాలట!
మీరట్: సివిల్ సర్వీసెస్-2015 టాపర్ టీనా దాబి.. రెండో ర్యాంకర్ షఫీ ఖాన్ను పెళ్లాడతానన్న ప్రకటనపై అఖిల భారతీయ హిందూ మహాసభ అభ్యంతరం తెలిపింది. ఆమె తల్లిదండ్రులకు రాసిన లేఖలో...ఈ పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని లేదా ఖాన్ను మత మార్పిడికి ఒప్పించాలంది. ‘ఖాన్ను టీనా పెళ్లి చేసుకోవాలనుకోవడం షాక్కు గురిచేసింది. ఇది లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా ఉంది. ఇది జరగకూడదు. అరుునా వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖాన్ మతం మార్చుకోవాలి. దీని కోసం మా సభ్యులు మీకు సాయం చేస్తారు’ అని సంస్థ జాతీయ కార్యదర్శి మున్నా శర్మ టీనా తండ్రి జశ్వంత్కి లేఖ పంపారు. -
మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్: పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ ఇండియా చేతులు కలిపాయి. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ బుధవారం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... టీఎస్-క్లాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్లాస్ల నిర్వహణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, మొబైల్ టెక్నాలజీల సాయంతో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. డెంగీ లాంటి వ్యాధులు ఎప్పుడు, ఎలా ప్రబలే అవకాశముందో కూడా అజూర్ క్లౌడ్ ప్లాట్ఫాం ద్వారా ముందుగానే అంచనా వేసేందుకు అవకాశాలున్నాయని, దీన్ని కూడా తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. అలాగే టెలివిజన్ల ద్వారా పల్లెల్లో, సుదూర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిందని, తెలంగాణలో దీనిపై పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భన్సాలీ తెలిపారు. -
కాగితపు హాల్టికెట్లు ఇవ్వం: యూపీఎస్సీ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కాగితపు అడ్మిట్ కార్డు (హాల్టికెట్లు) ఇవ్వబోమని యూపీఎస్సీ తెలిపింది. ఈ-అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే వెబ్సైట్లోకి అప్లోడ్ చేసింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులే సొంతంగా ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలని కోరింది. ఒకవేళ ప్రింట్ తీసుకున్న హాల్టికెట్పై ఫొటో లేకపోయినా, సరిగా కనపడకపోరుునా వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన దానికి సారూప్యంగా ఉండే ఫొటోతోపాటు ఏదేని గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులను కోరింది. -
సివిల్ సర్వీసెస్పై అవగాహన
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ యువత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టాలని సివిల్ సర్వీసెస్ శిక్షకుడు ఆకుల రాఘవేంద్ర అన్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సీఎస్ఈ విభాగంలో మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసించిన వారు సివిల్ సర్వీసెస్ను ఎలా సాధించాలో వివరించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎంఎల్ఎస్ దేవకుమార్, ఉస్మానియా వర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ గణేష్ పాల్గొన్నారు. -
సివిల్స్ గరిష్ట వయోపరిమితి తగ్గింపు?
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు గరిష్ట వయో పరిమితిని ప్రస్తుతమున్న 32 సంవత్సరాల్ని తగ్గించాలంటూ యూపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై సూచనల కోసం ఈ కమిటీని యూపీఎస్సీ ఏర్పాటుచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి బీఎస్ బస్వాన్ చైర్మన్గా ఉన్న కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. దాని సూచనలపై కేంద్ర వ్యక్తిగత శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రి త్వ శాఖతో చర్చించాలనే ఆలోచనలో యూపీఎస్సీ ఉంది. వయో పరిమితితో పాటు పరీక్ష నిర్వహణ విధానం, మొత్తం పేపర్లు, వాటి తయారీ, సమయం, వెయిటేజ్ మార్కులు, మూల్యాంకనంపై కూడా సూచనలు చేసింది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షకు కనీస వయసు 21 ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. -
సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం 500 బస్సులు అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వంద కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్న దృష్ట్యా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సుల నిర్వహణ కోసం డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
‘కరెంట్’లో నిర్లక్ష్యానికి పరిహారం
సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిందే.. లేదంటే వినియోగదారులకు రూ.100-4000 వరకు పరిహారం చెల్లించాలి - పరిహారం మొత్తాన్ని 90 రోజుల్లో విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలి - కొత్త ప్రమాణాలను జారీ చేసిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలతో విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేసినా కరెంటోళ్లు సకాలంలో స్పందించడం లేదా? కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం వారాల తరబడి జాప్యం చేస్తున్నారా? ఇంట్లో చెడిపోయిన విద్యుత్ మీటర్ను మార్చమంటే పట్టించుకోవడం లేదా? ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి విద్యుత్ శాఖ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, పౌర సేవలు అందించడంలో విఫలమైతే బాధిత వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరులో కచ్చితంగా అమలు చేయాల్సిన కొత్త ప్రమాణాలను ప్రకటిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా నిర్వహించిన బహిరంగ విచారణల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా.. డిస్కంల పనితీరు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కొత్త ప్రమాణాలను జారీ చేస్తున్నట్లు ఈఆర్సీ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారులకు రూ.100 నుంచి రూ.4 వేల వరకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ ప్రమాణాల అమలు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లింపుపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. పరిహారం మొత్తం బిల్లులో సర్దుబాటు ఈఆర్సీ ఆదేశాల ప్రకారం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత, మీటర్లు, బిల్లులు, ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదులను వినియోగదారుల సేవా కేంద్రాల వద్ద డిస్కంలు నమోదు చేసుకోవాలి. ప్రమాణాల అమలుపై వినియోగదారుల వారీగా సమాచారాన్ని క్రోడీకరించాలి. ఒకవేళ ప్రమాణాల మేరకు సేవలు అందించకుంటే 90 రోజుల వ్యవధిలో నిర్దేశించిన పరిహారాన్ని సంబంధిత వినియోగదారుడు/వినియోగదారులకు చెల్లించాలి. అయితే నగదు రూపంలో కాకుండా పరిహారాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయాలి. పరిహారం చెల్లించే విషయంలో డిస్కంలు విఫలమైతే వినియోగదారులు ‘ఫోరం ఫర్ రిడ్రస్సల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్స్(సీజీఆర్ఎఫ్)ను సంప్రదించవచ్చని ఈఆర్సీ పేర్కొంది. కొత్త కనెక్షన్ జాప్యమైతే ఒక్కో రోజుకు పరిహారం వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కొత్త కనెక్షన్ను మంజూరు చేయాలి. తర్వాత జరిగే జాప్యంపై ఒక్కో రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కనెక్షన్ కోసం లైన్ల విస్తరణ చేయాల్సి ఉంటే... ఎల్టీ కనెక్షన్ను 30 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.200), హెచ్టీ 11 కేవీ కనెక్షన్ను 45 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.400), హెచ్టీ 33 కేవీ కనెక్షన్ను 60 రోజుల్లో(లేకుంటే ఒక్కోరోజుకి రూ.1000 పరిహారం), ఎక్స్ట్రా హెచ్టీ సప్లైను 180 రోజుల్లో(లేకుంటే ఒక్కో రోజుకి రూ.1000 పరిహారం) మంజూరు చేయాలి. ఇతర ప్రమాణాలు ఇవీ.. ► యాజమాన్య పేరు మార్పు, కేటగిరీ మార్పులను 7 రోజుల్లో పరిష్కరించాలి. లో టెన్షన్ సింగిల్ ఫేజ్ నుంచి లో టెన్షన్ త్రీ ఫేజ్కు 30 రోజుల్లో మార్చాలి. ► విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి. అదనపు సమాచారం అవసరమైతే 7 రోజుల సమయం తీసుకోవచ్చు. ఉల్లంఘిస్తే మాత్రం రోజుకి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. ► సరిగ్గా పనిచేయని మీటర్లపై ఫిర్యాదులను పట్టణ ప్రాంతాల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో పరిష్కరించాలి. లేదంటే రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాలి. ► విద్యుత్కు అంతరాయం కలిగించాల్సి ఉంటే 24 గంటల ముందే వినియోగదారులకు తెలియజేయాలి. రోజుకు 12 గంటలకు మించి కోత ఉండొద్దు. సాయంత్రం 6 గంటల్లోపు సరఫరాను పునరుద్ధరించాలి. దీన్ని ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారుడు ఒక్కడే అయితే రూ.400లు, ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరికి రూ.200 పరిహారం చెల్లించాలి. -
బీసీ స్టడీ సర్కిళ్ల కార్యాచరణకు ఆమోదం
రూ. 25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల(బీసీ) స్టడీ సర్కిళ్లకు సంబంధించి రూ.25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది (2016-17) కొత్తగా 500 మందికి జీఆర్ఈ/జీమాట్, టోఫెల్/ఐఎల్ఈటీఎస్లకు శిక్షణ అందించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోస్టులు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు కెరీర్ కౌన్సెలింగ్ తదితరాలను కలుపుకుని మొత్తం 500 మందికి శిక్షణ అందిస్తుంది. జీఆర్ఈ/టోఫెల్ తదితరాలకు సంబంధించి బీసీ విద్యార్థులు కోరుకున్న ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో బోధన ఇప్పించేం దుకు నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్కు సంబంధించి వంద మందికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ను ప్రభుత్వం ఆదేశిం చింది. రాష్ట్రంలోని 10 స్టడీ సర్కిళ్లలో నలుగురు డెరైక్టర్లు మాత్రమే రెగ్యులర్ పోస్టులతో పనిచేస్తుండగా, ఖాళీగా ఉన్న మరో 6 జిల్లాల డెరైక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్టడీ సర్కిళ్ల మేనేజింగ్ కమిటీని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్తగా పరిశ్రమలు, ఉపాధి, గ్రామీణాభి వృద్ధి శాఖల కమిషనర్లను సభ్యులుగా చేర్చుకోవాలని శనివారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో మేనేజ్మెంట్ కమిటీ కమిషనర్ జీడీ అరుణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్రావు, హైదరాబాద్ ఏజేసీ అశోక్కుమార్, కన్వీనర్, బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ చంద్రశేఖర్, ఎస్టీ శాఖ డీడీ నికొలస్, మహిళా, శిశుసంక్షేమ డీడీ లక్ష్మీ, ఎస్సీ శాఖ డీడీ హనుమంతనాయక్ పాల్గొన్నారు. -
సివిల్స్ ఉత్తీర్ణులు ఆరుగురిపై అనర్హత వేటు
-ఆందోళనలో ఆరుగురు విద్యార్థులు -చట్టాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి చెన్నై: జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో తమిళనాడుకు చెందిన 80 మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. ఓబీసీ కేటగిరికి చెందిన ఆరుగురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హఠాత్తుగా వారిని అనర్హులుగా ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షలకుపైగా ఉన్నందున ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి రానందున అనర్హులుగా పరిగణిస్తూ ఉత్తీర్ణతను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బాధితులను మీడియా పలుకరించగా సివిల్స్కు దరఖాస్తు చేసుకున్నప్పుడే అన్ని సర్టిఫికెట్లను సమర్పించామని, వాటిని బాగా పరిశీలించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతించారని తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నేడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దశలో అనర్హులని అకస్మాత్తుగా ప్రకటించడం అన్యాయమని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చట్టపరమైన పోరాటం చేస్తామని వారు తెలిపారు. -
సివిల్స్ విజేతలతో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్కు ఎంపికైన విజేతలు బుధవారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన వారిని కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల అకాంక్షల వంటి అంశాల మీద తన అలోచనలను కేటీఆర్ వారితో చర్చించారు. సూమారు 20 మంది సివిల్ ర్యాంకర్లు మంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధించిన మీకు ఇక ఉద్యోగమే అసలైన పరీక్షలా ఉంటుందన్నారు. ముఖ్యంగా అధికారులుగా ప్రజల అకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలని కోరారు. పరిపాలనలో అనేక ఒడిదుడుకులుంటాయని, ఎప్పడూ తమ ఆశయాన్ని వదులుకోవద్దన్నారు. ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి మిమ్మల్ని ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఉద్యోగ ప్రయాణంలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురవుతాయన్నారు. కానీ, తొలినాళ్లలో ఉన్న స్తూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లుకు దూరంగా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని హితవుపలికారు. ప్రజల భాగసామ్యంతో పనిచేస్తూ, వారిలో సమిష్టి తత్వం నెలకొల్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. చాల సందర్భాల్లో పరిపాలనలో నిధులకన్నా, మంచి అలోచనలతో చేసే పనులకు ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా పనిచేయాలని కోరారు. మంత్రిని కలవడం పట్ల ర్యాంకర్లు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన సలహాలు సూచనలు తమకి సరికొత్త దిశానిర్ధేశం చేశాయన్నారు. ప్రజలకోసం పనిచేయాలనే తమ అలోచనలకి మరింత ఊతం ఇచ్చాయన్నారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్ష ప్రిపేరేషన్ కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి వారి సలహాలను తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు. -
ఐఏఎస్ ఎవరైనా కావొచ్చు
లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చంటున్నారు సివిల్స్ 101వ ర్యాంకర్ వాసన విద్యాసాగర్నాయుడు. తన మాతృభూమి నరసాపురం పట్టణానికి బుధవారం ఆయన విచ్చేశారు. ఐఏఎస్ కావాలన్న అమ్మ కోరికను 24 ఏళ్ల వయసులో నెరవేర్చానన్నారు. తన విద్యాభ్యాసం, సివిల్స్ ప్రిపరేషన్ విశేషాలను ఇలా పంచుకున్నారు. ప్రశ్న :మీ కుటుంబ నేపథ్యం జవాబు : నాన్న త్యాగరాజు హైదరాబాద్లో రైల్వే సీనియర్ వర్క్స్టడీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. నాన్న వాళ్లది భీమవరం, అమ్మ సొంతూరు నరసాపురం. దీంతో నాకు నరసాపురంతో అనుబంధం ఎక్కువ. ప్రశ్న : ఐఏఎస్ అయ్యేందుకు ప్రేరణ జవాబు :మా అమ్మ, తాత గారు పోతుల నర్సింహరావు (అమ్మనాన్న). తాతగారు కష్టపడి పైకొచ్చారు. చిన్నస్థాయి వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కష్టపడి చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ప్రేరణ కలిగించేది. దీంతో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా చేసుకున్నా. ప్రశ్న : మీ విద్యార్హతలు జవాబు : నరసాపురం క్రిస్టియన్ ఆసుపత్రి (మిసమ్మ ఆసుపత్రి)లో 1992 మార్చి 25న జన్మిం చాను. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ లోని డోర్నకల్లో చదివా. 8వ తరగతి నుంచి బీటెక్ వరకు హైదరాబాద్లో చదివా. 2013లో బీటెక్ పూర్తయింది. ప్రశ్న : సివిల్స్కు ఎలా సిద్ధమయ్యారు జవాబు: సొంతంగానే. ఉన్నత స్థాయిలో శిక్షణ ఏమీ తీసుకోలేదు. హైదరాబాద్లో మూడు నెలలు, ఢిల్లీలో ఓ నెలపాటు సాధారణ శిక్షణ తీసుకున్నా. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. సబ్జెక్ట్ల పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాను. ప్రశ్న : ఉన్నత స్థాయి శిక్షణ లేకుండానే ఐఏఎస్ సాధించవచ్చా జవాబు : తప్పకుండా సాధించవచ్చు. ఇందుకు నాతో పాటు చాలా మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. మా బ్యాచ్లో రిక్షావాలా కుమారుడు ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే మనుమడూ ఎంపికయ్యారు. సివిల్స్ సాధించడం కష్టం, ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 2014లో తొలిసారి సివిల్స్ రాసా 2015లో రెండో ప్రయత్నంలో 101వ ర్యాంక్ వచ్చింది. నా ఆప్షన్ సబ్జెక్ట్ హిస్టరీ. ప్రశ్న : మీరు సైన్స్ విద్యార్థి కదా మరి చరిత్ర ఎలా జవాబు : అదే తప్పు. ఐఏఎస్కు ప్రిపేర్ కావాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్లు చదవాలనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టుల్లో డిగ్రీ చదివించాలి. ఐఏఎస్కు కావాల్సింది ఏదైనా డిగ్రీ మాత్రమే. అది సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఏదైనా కావొచ్చు. ప్రశ్న : మీరు ఐఏఎస్ కాకుంటే.. జవాబు : 2013లో బీటెక్ పూర్తయ్యింది. ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశా. ఒకవేళ ఐఏఎస్ కాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఆప్షన్గా పెట్టుకున్నాను. ప్రశ్న : యువతకు మీరిచ్చే సందేశం జవాబు : 2035 నాటికి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఇది మన దేశానికి ఉన్న బలం. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. ఏదో సాధించాలనే తపన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. యువత పుస్తకాలు ఎక్కువ చదవాలి. నా చిన్నప్పుడు నాన్నగారు గిఫ్టులుగా బొమ్మలు కాకుండా పుస్తకాలు ఇచ్చేవారు. బహుశా ఇదే నన్ను ఐఏఎస్ను చేసిందేమో. ప్రశ్న : పోస్టింగ్ విషయంలో మీ ఆప్షన్ జవాబు : ముందు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ. మొత్తానికి తెలుగు రాష్ట్రాలే. -
స్టడీ సర్కిళ్లకు కొత్త రూపు
♦ రాష్ట్ర సర్కారు నిర్ణయం ♦ నిరుద్యోగ అభ్యర్థులకు నిపుణులతో పక్కాగా శిక్షణ ♦ వీడియో బోధన, డిజిటల్ క్లాసులతో ఆధునిక హంగులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న స్టడీసర్కిళ్లకు కొత్తరూపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో మొక్కుబడిగా ఆయా పోటీపరీక్షలకు శిక్షణనిచ్చేలా కాకుండా వాటి ద్వారా అణగారిన వర్గాలకు కచ్చితమైన ప్రయోజనం కలిగేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆయా రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిళ్ల ద్వారా ఆయా పోటీపరీక్షలకు శిక్షణను అందిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా యూపీఎస్సీ (సివిల్స్ ప్రిలిమ్స్) మొదలుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నారు. అయితే పలు అంశాల్లో అధ్యాపకుల కొరత, అభ్యర్థులకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర ఆధునిక సౌకర్యాలు, రిఫరెన్స్ బుక్స్ వంటివి స్టడీసర్కిళ్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో సివిల్స్తో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలకు శిక్షణనిస్తున్న ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న స్థాయిలో అధునాతన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసి వీడియోకాన్ఫరెన్స్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన శిక్షణను అందించాలని యోచిస్తోంది. ఇకపై బ్యాచ్ల వారీగా తరగతులు నిరుద్యోగ అభ్యర్థులు సివిల్స్లో ర్యాంకులు సాధించి సత్తా చాటేలా చేయాలని బీసీ సంక్షేమశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ఉదయం, సాయంత్రం పలు బ్యాచ్లుగా తరగతులను నిర్వహించనుంది. విద్యార్థుల సంఖ్యనూ 500కు పెంచాలని యోచిస్తోంది. ఐటీ, వెబ్డిజైన్, కాడ్ వంటివాటిలో శిక్షణనివ్వనుంది. ఎస్టీ స్టడీసర్కిళ్లలో డిజిటల్ తరగతులు డిజిటల్ క్లాస్రూమ్స్ను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీ స్టడీసర్కిళ్లకు విడిగా గవర్నింగ్బాడీని ఏర్పాటుచేసి, రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులతో శిక్షణను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 జిల్లాల్లో ఎస్సీ స్టడీసర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది మరో 5 జిల్లాల్లో వాటిని ప్రారంభించనున్నారు. -
సివిల్స్ టాపర్కు 52 శాతం మార్కులే
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈ ఏడాది తొలి స్థానం దక్కించుకున్న టీనా డాబీకి వచ్చిన మార్కులు 52.49 శాతమే. మార్కుల వివరాల్ని ఆదివారం యూపీఎస్సీ వెల్లడించింది. పరీక్షను కఠినతరం చేయడంతో టాప్లో నిలిచిన అభ్యర్థుల మార్కులు బాగా తగ్గాయి. డాబీ మొత్తం 2,025(మెయిన్ 1,750, ఇంటర్వ్యూ 275)గాను 1,063 (52.49) మార్కులుసాధించింది. 2వ స్థానంలో నిలిచిన అమిర్ ఉల్ షఫీ ఖాన్ 1,018 (50.27 శాతం) మార్కులు, మూడో ర్యాంకర్ జస్మీత్ సింగ్ సంధు 1,014 (50.07) మార్కులు సాధించారు. ఈ ఏడాది మొత్తం 1,078 మంది అవసరముండగా, జనరల్లో 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ విభాగంలో 89 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసింది. 172 మంది అభ్యర్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వెయిటింగ్ జాబితాలో చివరిస్థానంలో ఉన్న శీష్ రామ్కు 697(34.41) మార్కులు వచ్చాయి. -
The "Steel-Frame" Strengthened
Civil Services UPSC has recently announced the selected list of civil services examination 2015-16. There were many inspiring personalities from the list and aspirants are at high spirits now, as prelims examination for 2016-17 is nearing, which shall be held on August 7, 2016. At this juncture, Mohan Kanda, retd. IAS officer throws light on civil services in India and guides new aspirants.. Civil Services and the Nation It is in enabling that change and in converting it into an all out assault on the evils of deprivation, exclusion and the denial of the quality of life that every citizen has a right to expect - that the civil service will have a major and meaningful responsibility to shoulder. We have, naturally, moved away from the days when the Civil Service was envisaged as the "steel - frame" of country's polity. Several changes, many highly desirable, have altered the scope of, as well as the expectations from, the bureaucracy. Growth and development are seen today more as a result of an effort of a team comprising many players including the elected representatives, the corporate sector, academicians, scientists, the civil society organizations and the Civil Services among many others. For this team to perform effectively, however, many catalytic factors need to be put in places such as a sharp vision, a clear road map and an enabling policy environment. The design, implementation, monitoring and evaluation of the plan of action all need to the conceived with a participatory approach and carried out in an inclusive manner. Challenges and Opportunities What more can a young citizen of India ask for today than to "be the change that you wish to see in the world" - as Gandhiji said? And which career can offer the heady excitement, sense of fulfilment, public recognition, the constitutional guarantee of security and reasonable emoluments than one in the Civil Service? I can think of no country whose Constitution mentions the Civil Service explicitly in an exclusive provision and offers protection to its members in an emphatic manner, in the manner in which the Indian Constitution does. In order to remain contemporarily relevant, the Civil Servant will need to be able to identify the weakness such as indifference, corruption and incompetence that continue to render our system impotent; and be able to play a positive and aggressive role in the process of mitigating their impact. The significance of the challenges and opportunities that come with the task entrusted to the Civil Services in this gigantic national effort can hardly be overstated. Attributes of a Civil Servant What can cause greater clarity in one's mind than to remember that it is the common man who pays your salary- and is thus one's real master? Assiduity, sincerity, integrity and a clear sense of priorities are some of the important attributes that a good Civil Servant needs to possess. The Civil Services offer a vast canvas of activities and varied sets of functions. It would therefore be of great advantage for a Civil Servant to identify, over time, a role that most suits his or her attitude. Effort and inclination will then be in sync-synergetic and mutually reinforcing. For the benefit of aspirants of the Civil Service, as well as recent entrants I have collected some case studies from my own experience together with a few hypothetical problems created by the UPSC, in the book "Ethics in Governance - Resolution of Dilemmas with Case Studies". Candidates from rural areas To address a concern that is frequently expressed I would like to assure the candidates from rural areas appearing for Civil Services Examination- that the system has tried to correct any inbuilt bias in favour of those from the urban areas. For instance, candidates can take the examinations in their mother tongue and can also opt for interviews to be conducted in that language. And the constitution of Boards of members that conduct the interviews is done in such a manner that it ensures a fair degree of empathy with people coming from varied backgrounds. Balanced Approach One last word of advice from me concerns the imperative to striking a "balance". This is an attribute that should inform one's attitude not merely in the interview but in the discharge of duties that one will be expected to perform in the event of one's selection. Extreme stances and artificial views are often neither desirable nor easy to justify. It is important to remain objective and impartial in forming one's opinions and in defending them. Those in service will do well to remember the advice tendered by Sri C.B. Rao, IAS (Retd.) (which he was kind enough to share with me), to fresh recruits - to remember that they are "the luckiest and not the brightest" that they are "selected and not chosen," that "integrity is more important than intelligence" and that they should strive to be "law-abiding and not rule - abiding Civil Servants". -
విజేతలకు అసలైన పరీక్ష
పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా... సమర్ధతకు మారుపేరుగా పరిగణించే సివిల్ సర్వీసుకు ఎంపిక కావడం కోసం ఏటా లక్షలాదిమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షల్లో ఇటీవలికాలంలో వెల్లడవుతున్న ఫలితాలు ఆశాజనకంగా, స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్నాయి. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే సివిల్ సర్వీస్ పరిమిత మన్న పాత అభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నాయి. నిరుడు వెల్లడైన ఫలితాల్లో తొలి నాలుగు స్థానాలనూ యువతులే సాధించారు. ప్రథమ ర్యాంక్ తెచ్చుకున్నామె వికలాంగురాలు కూడా. ఈసారి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన యువతి టీనా దాబి వయసు కేవలం 22 ఏళ్లు. పైగా ఆమెకిది తొలి ప్రయత్నం. దళిత వర్గంనుంచి వచ్చిన టీనా ఇక్కడ పాతుకుపోయి ఉన్న పితృస్వామిక భావ జాలాన్ని, లింగ వివక్షను పారదోలడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నది. ఆ విషయాల్లో ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్న హర్యానాను తన కార్య క్షేత్రంగా ఎంచుకోబోతున్నట్టు ప్రకటించింది. అమ్మానాన్నలిద్దరూ ఇంజనీర్లు కావడంవల్ల కలిగిన ఆర్ధిక వెసులుబాటు, ప్రతిభకు పదునుపెట్టుకునే అవకాశం ఆమెను ఢిల్లీలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థ లేడీ శ్రీరాం కళాశాలకు చేర్చి ఉండొచ్చు గానీ...బయటి సమాజంలో ఆడపిల్ల ఎలాంటి వివక్షకు గురవుతున్నదో ఒక యువతిగా ఆమె అవగాహనలోకి వచ్చింది. ఆ వివక్షను రూపుమాపాలన్న కృత నిశ్చయమూ ఏర్పడింది. రెండో ర్యాంకర్గా నిలిచిన యువకుడు అతర్ అమిర్ స్వస్థలం నిత్యం ఉద్రిక్తతలతో సతమతమయ్యే జమ్మూ–కశ్మీర్లోని అనంతనాగ్. రెండో ప్రయత్నంలో ఇంత ఉన్నతమైన ర్యాంక్ను చేజిక్కించుకున్న అతర్కుకూడా ఇక్కడి సమస్యల విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది. తను పుట్టి పెరిగిన ప్రాంతం మిలిటెన్సీ ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కశ్మీర్లోనిది. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుబడతానని అతర్ చెబుతున్నాడు. ఎన్నో సంక్లిష్టతలతో, వడబోతలతో కూడుకుని ఉండే సివిల్ సర్వీస్ పరీక్షల్లో వెనకబడిన ప్రాంతాలనుంచి వచ్చినవారు విజేతలుగా నిలవడం మెచ్చదగిన విషయం. వీరిలో చాలామంది బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. అందు వల్ల సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడినవారు. 361వ ర్యాంక్ సాధించిన 21 ఏళ్ల అన్సార్ అహమద్ షేక్ పొందిన అనుభవాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. పూణేలో పీజీ చేయడానికి వెళ్లినప్పుడు మైనారిటీ అయిన కారణంగా తలదాచుకోవడానికి ఆశ్రయం దొరక్క ఇబ్బందులు పడిన తీరును అతను వివరించాడు. తన మిత్రుడి పేరు శుభంను సొంతం చేసుకుంటే తప్ప దిక్కూ మొక్కూ లేకపోయిందని అన్సార్ చెప్పిన మాటలు మన సమాజం పాటిస్తున్న విలువలను ప్రశ్నిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ మెరుగైన ర్యాంకులు సాధించినవారిలో కూడా పలువురు వెనకబడిన ప్రాంతాలవారూ, నిరుపేద కుటుంబాలకు చెందినవారున్నారు. నల్ల గొండ జిల్లాకు చెందిన చామకూరి శ్రీధర్ ఒకవైపు పేదరికంతో, మరోవైపు అంగ వైకల్యంతో పోరాడుతూనే అహోరాత్రాలూ శ్రమించి 348వ ర్యాంక్ సాధించాడు. విజేతలుగా నిలిచినవారిలో చాలామంది కులం, మతం, ప్రాంతం, పుట్టుక కారణంగా సమాజంలో తమకెదురైన ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించిన వారు. కళ్లల్లో ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఇటువైపు వచ్చినవారు. సమకాలీన సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా అవగాహనతోపాటు వాటి పరిష్కారం తమకు సాధ్యమేనని విశ్వసిస్తున్నవారు. అందుకు అవసరమైన సంక ల్పమూ, పట్టుదలా ఉన్నవారు. వీరంతా ఏ బహుళజాతి సంస్థలోనో ఉన్నతో ద్యోగాన్ని సాధించి లక్షల్లో వేతనం పొందగలిగే సత్తా ఉన్నవారు. దాంతో పోలిస్తే తక్కువ జీతమూ, అధిక శ్రమ, ఎన్నో బాధ్యతలు ఉండే సివిల్ సర్వీసులను ఎంచుకోవడం వెనకున్న నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించేవారుంటే మంచిదే. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి కలిగే దురహంకారంతో వ్యవహరించే వారే అధికంగా తారసపడే కార్యనిర్వాహకవర్గం అలాంటి అంశాలను గుర్తించగలిగే స్థాయిలో ఉందా? మూడేళ్లక్రితం యూపీలోని నోయిడా జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్పాల్, హర్యానాలో సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, జమ్మూ–కశ్మీర్లో ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్ వంటివారి అనుభవాలు అందుకు భరోసా నివ్వడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధించడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను నాలుగేళ్ల క్రితం కేసుల పేరుతో ఎంతగా వేధించారో అందరికీ గుర్తుంది. చట్టాలు ఏం చెబుతున్నా, న్యాయం ఏదైనా తాము అనుకున్నదే అమలు జరగా లని కోరుకునే పాలకుల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే మంచి పోస్టుల్లో కొనసాగడం...లేనట్టయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ కావడం చాలా చోట్ల సివిల్ సర్వీసు అధికారులకు ఎదురవుతున్న అనుభవం. ఒకటి రెండు బదిలీల తర్వాత కూడా ‘దారికి’ రానివారిని మరిన్ని బదిలీలతో వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలెన్ని ఎదురైనా సేవాభావంతో, కర్తవ్యదీక్షతో పనిచేసి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలిపిన ఎస్ఆర్ శంకరన్, బి.డి. శర్మ వంటివారు కూడా లేకపోలేదు. ఇప్పుడు కోట్లాదిమంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న అనేక పథకాలకు వారు రూపశిల్పులు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవ హరించడం... రాజకీయ ఒత్తిళ్లున్నా, కక్ష సాధింపులున్నా నిబద్ధతతో పనిచేయడం కత్తిమీది సాము. అందుకు ఎంతో ఓపిక, పట్టుదల, అసహాయులపట్ల ప్రేమ అవసరం. ఆ లక్షణాలను కోల్పోకుండా పనిచేసినప్పుడే ఈ విజేతలంతా సివిల్ సర్వీసుకు వన్నె తెస్తారు. -
జాతి సిగలో నగర కీర్తి
► సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు ► ఉభయ రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకు నగరవాసికే సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నగర ఆణిముత్యం మెరిసింది. నగర ‘కీర్తి’ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 14 వర్యాంకు సాధించిన సీహెచ్.కీర్తి అత్యుత్తమ ప్రతిభను చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ర్యాంకే అత్యుత్తమం కావడం విశేషం. వైజాగ్కు చెందిన కీర్తి కుటుంబం పదేళ్ల కిందటే నగరానికి వచ్చి స్థిరపడింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ నగరంలోనే అభ్యసించిన ఆమె.. ఉత్తమ ర్యాంకు వచ్చే వరకు విశ్రమించలేదు. రెండు సార్లు ఓ మాదిరి ర్యాంకు పొందినా అసంతృప్తే వెంటాటింది. మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని చదివి మూడో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకును అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ఈ తరహాలోనే మరిన్ని ర్యాంకులు నగరాన్ని వరించాయి. నగరానికి చెందిన యువతీ యువకులే కాకుండా.. ఇక్కడ శిక్షణ పొందిన వారు మెరిశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి... విజయ కీర్తి పతాకం ఎగురవేశారు. నగరానికి చెందిన ఎడ్మ రిషాంత్రెడ్డికి 180, ప్రవళిక 232, ఉప్పల్కు చెందిన డాక్టర్ ప్రియాంక 529వ ర్యాంకు సాధించారు. వివిధ జిల్లాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వందలోపు ర్యాంకులు సాధించిన వల్లూరి క్రాంతి (65వ ర్యాంకు), సీహెచ్. రామకృష్ణ (84వ ర్యాంకు)లు కూడా ఇతర జిల్లాల వారే. ఇలా వెయ్యిలోపు 50కిపైగా ర్యాంకులు పొందిన వారు నగరంలోని శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న వారేనని ఆయా ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. స్టడీ సెంటర్ల కేంద్రాల నిర్వాహకులు, ర్యాంకులు పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. -
కల్లోల ప్రాంతం నుంచి సివిల్స్ టాపర్!
నిత్యం మిలిటెన్సీ సమస్యతో అట్టుడికిపోయే కశ్మీర్ నుంచి ఓ అభ్యర్థి ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో టాప్ ర్యాంకు సాధించాడు. కశ్మీర్కు చెందిన అథార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో సెంకండ్ టాపర్గా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్లోని మాండి ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన ఆమిర్ రెండో ప్రయత్నంలోనే టాప్-2 ర్యాంకు సాధించాడు. గత ఏడాది సివిల్స్లో అతడికి 560 ర్యాంకు రాగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్)కు ఎంపికయ్యాడు. ఈసారి తనకు మంచి ర్యాంకు వస్తుందని ఆశించానని, కానీ ఏకంగా టాప్ సెంకండ్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమిర్ చెప్పాడు. కశ్మీర్ నుంచి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు సివిల్స్కు ప్రయత్నిస్తున్నారని, ఇది సానుకూల ధోరణి అని అతను అభిప్రాయపడ్డాడు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఉత్తమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని ఆమిర్ ధీమాగా చెప్పాడు. తన తాత తనకు స్ఫూర్తి అని తెలిపాడు. -
తెలుగోళ్లు.. దమ్ము చూపించారు!
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 92 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. 2015 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, అందులో సుమారు 92 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామానికి చెందిన రైతు భోజన్న కుమారుడు వడ్నం నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 794వ ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నవాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి.. చేకూరి కీర్తి (14) హెచ్ఎస్ శ్రీకాంత్ (56) వల్లూరు క్రాంతి (65) సీహెచ్ రామకృష్ణ (84) వసన విద్యాసాగర్ నాయుడు (101) జొన్నలగడ్డ స్నేహజ (103) ఏ దీప్తి (113) వేమూరి విఎల్ అంబరీష్ (150) పోతరాజు సాయి చైతన్య (158) నివేదిత నాయుడు (159) పి.కృష్ణకాంత్ (169) ఏ పవన్ కుమార్ రెడ్డి (179) వై. రిషాంత్ రెడ్డి (180) ఆర్ విశ్వనాథ్ (181) వరుణ్ గుంటుపల్లి (183) ఆర్ మహేష్ కుమార్ (189) పసుమర్తి వీజీ సతీష్ (191) సలిజామల వెంకటేశ్వర్ (216) బట్ర ప్రీత్ పాల్ కౌర్ (225) కింతాడ ప్రవల్లిక (232) పి ఉదయ్ కుమార్ (234) శశాంక్ రెడ్డి (240) బండ్ల దినేష్ ఆదిత్య (270) గున్ను సుధీర్ (318) సుధాకర్ (324) వై విష్ణువర్ధన్ రెడ్డి (325) ఉప్పలూరి మీనా (326) కొడాలి గోకుల్ (345) సీహెచ్ శ్రీధర్ (348) జీ ఎల్ నరిసింహం (350) కంది ప్రవీణ్ (363) కీర్తిశ్రీ (380) శ్రుతి విజయకుమార్ (381) మల్లెల శ్రీకాంత్ (388) హరికృష్ణ (408) పి దిలీప్ కుమార్ (415) మద్దికుంట సిద్దార్థ (419) ఎం కృష్ణ కౌండిన్య (422) డి గౌరీ శంకర్ (457) డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461) నాగిరెడ్డిగారి మధులత (496) హెచ్ విష్ణు ప్రసాద్ (506) ముమ్మక సుదర్శన్ (526) అల ప్రియాంక (529) ఆర్ కృష్ణ ప్రసాద్ (531) కట్టా సింహాచలం (538) నార్నవారి మనీష్ శంకర్ రావు (552) దేవరాజు శివ ప్రకాష్ (572) వై విజయసింహారెడ్డి (588) ఆర్ఎస్ విద్యావతి (600) జి. ప్రదీప్ (609) ఎం కార్తీక (610) కె కృష్ణమూర్తి (615) పి శ్రుతి (617) ఆర్ ఆనంద్ (621) ఆర్ శివ ప్రసాద్ (622) ఎం గాయత్రి (642) శ్రీధర వెంకటేశ్వర్లు (683) ఎస్ భారతి (684) బి రవితేజ (694) సిగిలిపల్లి కృష్ణారావు (704) దారం వెంకటేశ్వరరావు (708) ఏ సురేష్ (718) బండారు బాల మహేంద్ర (730) చింత కుమార్ (768) సాయి సందీప్ కుమార్ (780) పురుషోత్తమ్ కుమార్ (828) కామినేని సంజయ్ రావు (830) పుష్పలత (845) ఎస్ భారత్ (866) చిలక సుధారాణి (876) విజయ్ కుమార్ (880) హెచ్ హనుమంతరాజు (898) పిల్లి ప్రేమకుమార్ (900) బి ప్రవీణ్ కుమార్ (907) ఆర్ భరత్ (914) ఇంటి నిహారిక (930) కుర్రా శ్రీనివాస్ (953) కారెల ముఖేష్ కుమార్ (972) ఎల్లసిరి శివప్రసాద్ (973) బి బాలస్వామి (977) జె విజయకృష్ణ (988) సీహెచ్ ప్రదీప్ కుమార్ (998) దాసరి కార్తీక్ (1000) మేకల సంధ్యా సమీర (1001) సుర్వే స్వాతి (1003) సాలి గౌతమి (1004) పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012) కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021) కొలకలూరి అరవింద్ (1022) నేగి సుష్మ (1029) దొండపర్తి వెంకట హరీష్ (1035) కె ఎస్ రమేష్ భారతి (1046) -
రోల్ మోడల్ గా ఉంటా: సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించానని ఫస్ట్ ర్యాంకర్ టీనా దాబే వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష-2015లో టాపర్ గా నిలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. చెప్పలేని ఆనందానుభూతికి లోనపుతున్నానని, వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. సహనం, స్పష్టత, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఫస్ట్ ర్యాంక్ సాధించానని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఎంచుకుంటానని తెలిపింది. హర్యానా కేడర్ తరపున పనిచేయడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో పాసవడంతో యువతులకు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు టీనా చెప్పింది. తన కుమార్తె టాపర్ నిలవడం టీనా తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్ పాసవడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తనకు మాటలు రావడం లేదని టీనా తల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తన కూతురే తన హీరో అని ఆమె వ్యాఖ్యానించారు.