Cricket World Cup 2023
-
షమీ.. నీ కమిట్మెంట్కు సలాం.. వరల్డ్కప్ మొత్తం పెయిన్ కిల్లర్స్తోనే..!
టీమిండియా స్వింగ్ సుల్తాన్ మొహమ్మద్ షమీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 వరల్డ్కప్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన షమీ.. మెగా టోర్నీ ఆధ్యాంతం గాయంతో సతమతమయ్యాడని సమాచారం. దీర్ఘకాలిక మడమ సమస్యతో బాధపడుతున్న షమీ నొప్పిని అధిగమించేందుకు ప్రతి మ్యాచ్కు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వాడాడని అతని సహచరుడొకరు ప్రముఖ న్యూస్ ఛానెల్తో చెప్పాడు. గాయం కారణంగా అప్పటికే కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కోల్పోయిన షమీ.. హార్దిక్ గాయపడ్డాక బెంచ్పై కూర్చోకూడదని నిర్ణయించకున్నాడట. అందుకే రిస్క్ చేసి మరీ బరిలోకి దిగాడట. ఆట పట్ల షమీకి ఉన్న అంకితభావం గురించి తెలిసి అభిమానులు అతన్ని పోరాట యోధుడితో పోలుస్తున్నారు. షమీ.. నీ కమిట్మెంట్కు సలాం అని కొనియాడుతున్నారు. కాగా, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్ వరకు అద్భతమైన ఆటతీరు కనబర్చి, తుది సమరంలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో షమీ 7 మ్యాచ్ల్లో 3 ఐదు వికెట్ల ఘనతల సాయంతో 24 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వరల్డ్కప్ అనంతరం విరామం తీసుకున్న షమీ.. తొలుత సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి ఫిట్నెస్ క్లియెరెన్స్ దక్కకపోవడంతో సిరీస్ మొత్తనికి దూరంగా ఉన్నాడు. షమీ గైర్హాజరీలో టీమిండియా.. తొలి టెస్ట్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. షమీ స్థానంలో రెండో టెస్ట్కు ఆవేశ్ ఖాన్ను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన సంవత్సరం
2023.. భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన సంవత్సరంగా చిరకాలం గుర్తుండిపోనుంది. భారీ అంచనాల నడుమ స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడి అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి అభిమానులకు తీవ్ర గుండెకోతను మిగిల్చింది. లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల నడుమ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది. ఈసారి కప్ మనదే అని ధీమాగా ఉండిన భారతీయులు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. టోర్నీ గడిచి దాదాపు నెల రోజులు అవుతున్నా అభిమానులు, ఆటగాళ్లు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ చేదు అనుభూతి మినహాయిస్తే భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 2023కు ఘన స్వాగతం పలికింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆతర్వాత న్యూజిలాండ్పై టీ20 సిరీస్ (3-0), వన్డే సిరీస్లు (2-1) నెగ్గి, కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో (టెస్ట్లు) నెగ్గిన భారత్.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయి 2023లో తొలి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఏప్రిల్, మే మసాల్లో టీమిండియా ఆటగాళ్లు సహా ప్రపంచ క్రికెట్ మొత్తం ఐపీఎల్తో బిజీగా ఉండింది. జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షమైంది. ఇంగ్లండ్లోని ఓవల్లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. దీని తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో, వన్డే సిరీస్ను 2-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను 2-3 తేడాతో కోల్పోయింది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత స్వదేశంలో ఆసీస్తో 3 వన్డేలు ఆడిన భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం అదే ఆసీస్తో స్వదేశంలోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన భారత్ 4-1 తేడాతో జగజ్జేతను ఓడించింది. దీని తర్వాత భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. వన్డే, టెస్ట్ సిరీస్లు జరగాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ ఏడాదంతా భారత క్రికెట్ జట్టుకు సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పాలి. -
'ఆ ఓటమిని' జీర్ణించుకోలేకపోతున్నాను.. రోహిత్ శర్మ భావోద్వేగం
2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారిగా సోషల్మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో స్టేట్మెంట్ను రిలీజ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరల్డ్కప్ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియట్లేదని హిట్మ్యాన్ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు. ఆ మనోవేదనను అధిగమించి మైదానంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు. View this post on Instagram A post shared by Team Ro (@team45ro) చిన్నతనం నుంచి వన్డే వరల్డ్కప్లు చూస్తూ పెరిగానని, వరల్డ్కప్ గెలవడం అనేది గొప్ప బహుమతిగా భావించేవాడినని గుర్తు చేసుకున్నాడు. వరల్డ్కప్ గెలవడం కోసం జట్టు మొత్తం కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించిందని, అంతిమంగా ఫలితం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్కప్ గెలవడం కోసం జట్టుగా చేయవలసిందంతా చేశామని, ఫలితం ఊహించిన విధంగా రాకపోవడం జట్టు మొత్తాన్ని తీవ్ర బాధించిందని వాపోయాడు. ఫైనల్లో ఓటమి అనంతరం తన జర్నీ అనుకున్నంత ఈజీగా సాగలేదని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. అంతిమంగా ఆటలో గెలుపోటములు సహజమని, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించాడు. కాగా, హిట్మ్యాన్ వరల్డ్కప్ ఓటమి అనంతరం ఆసీస్తో టీ20 సిరీస్కు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్తో రోహిత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. -
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్లో టాప్లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్లో నిలిచాయి. -
ప్రేయసిని పెళ్లాడిన సఫారీ పేస్ గన్
సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. వివాహానికి సంబంధించిన పలు ఫోటోలను కొయెట్జీ తన సోషల్మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. కొయెట్జీ భాగస్వామి ఎవరన్న విషయమై పూర్తి సమాచారం లేనప్పటికీ.. గతంలో ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కొయెట్జీ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో గెరాల్డ్ కొయెట్జీ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల ఈ పేస్ గన్ అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చి సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. మెగా టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన కొయెట్జీ.. 19.80 సగటున 20 వికెట్లు పడగొట్టి, టోర్నీ లీడింగ్ వికెట్టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తన స్వల్ప కెరీర్లో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కొయెట్జీ.. 43 వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ.. త్వరలో స్వదేశంలో భారత్తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్లకు కూడా ఎంపికయ్యాడు. వరల్డ్కప్ సంచలన ప్రదర్శనల నేపథ్యంలో కొయెట్జీకి ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది. ఇతని కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పోటీ పడే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ను పోలిన బౌలింగ్ శైలి కొయెట్జీని ప్రత్యేకంగా నిలబెడుతుందని యాశ్ అన్నాడు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో 2 టెస్ట్లు, 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. సిరీస్లో భాగంగా తొలి టీ0 డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ వరల్డ్కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రకు షాక్
వన్డే వరల్డ్కప్ 2023లో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్గా (10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో ఇవాల్టి నుంచి (నవంబర్ 28) ప్రారంభమైన తొలి టెస్ట్లో రచిన్కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కలేదు. రచిన్ భీకర ఫామ్లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టడం విశేషం. బ్యాటర్గానే కాకుండా బౌలింగ్లోనూ (స్పిన్నర్గా) రాణించే సత్తా ఉన్న రచిన్ను న్యూజిలాండ్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అజాజ్ పటేల్, ఐష్ సోధి, పార్ట్ టైమ్ స్పిన్నర్గా గ్లెన్ ఫిలిప్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, కైల్ జేమీసన్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టును నజ్ముల్ హసన్ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్ హసన్ (12), షాంటో (37) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (42), మోమినుల్ హక్ (3) క్రీజ్లో ఉన్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్కు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 Auction: ఆ ఇద్దరి కోసం క్యూ కట్టనున్న ఫ్రాంచైజీలు
ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్కప్-2023 హీరోలకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది కాదనలేని సత్యం. దుబాయ్ వేదికగా జరిగే ఈ మెగా ఆక్షన్లో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారత్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన వరల్డ్కప్లో రచిన్ బ్యాట్తో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. భారత్ మూలాలున్న రచిన్ తన పెద్దల సొంతగడ్డపై పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో రచిన్ 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 578 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో విరాట్, రోహిత్, డికాక్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ట్రవిస్ హెడ్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ బ్యాటర్ ప్రపంచకప్లోకి లేట్గా ఎంట్రీ ఇచ్చినా టోర్నీని ఘనంగా ముగించాడు. భారత్తో జరిగిన ఫైనల్లో చిరస్మరణీయ శతకం (137) సాధించిన హెడ్ తన జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు. రచిన్, హెడ్ ఇద్దరు బ్యాట్తో పాటు బంతితోనూ మాయ చేయగల సమర్దులు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరి కోసం ఎగబడే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వరల్డ్కప్ బౌలింగ్ హీరోలు దిల్షన్ మధుషంక (శ్రీలంక), గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు. ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్ ప్రకారం చూస్తే.. రచిన్, మధుషంక కోసం ఆర్సీబీ.. హెడ్ కోసం ఢిల్లీ.. కొయెట్జీ కోసం సీఎస్కే పోటీపడవచ్చని తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల జాబితా చూసినా వారికి ఈ రోల్స్లో ఆటగాళ్ల అవసరం ఉంది. మిగులు బడ్జెట్ గుజరాత్ వద్ద అధికంగా (38.15 కోట్లు) ఉండగా, ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కోల్కతా నైట్రైడర్స్కు (12 మందిని) ఉంది. పైన పేర్కొన్న ఆటగాళ్ల కోసం పోటీపడే ఫ్రాంచైజీల్లో ఢిల్లీ వద్ద 28.95 కోట్లు, సీఎస్కే వద్ద 31.4 కోట్లు, ఆర్సీబీ వద్ద 23.25 కోట్ల పర్స్ వ్యాల్యూ మిగిలి ఉంది. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడిపై కేసు నమోదు
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్పై భారత్లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం మార్ష్ వరల్డ్కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీఘర్కు చెందిన ఆర్టిఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. మార్ష్ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం కలిగించిందని ఆరోపించాడు. కేశవ్ తన ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్కు పంపించాడు. మార్ష్ భారత్లో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని అతను డిమాండ్ చేశాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 19) జరిగిన వరల్డ్కప్ 2023 ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరో సారి జగజ్జేతగా నిలిచింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచామన్న గర్వంతో మార్ష్ వరల్డ్కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో తెగ వైరలయ్యాయి. మార్ష్పై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశాడు. ఏమా ఖండకావరం అంటూ ధ్వజమెత్తారు. భారత అభిమానులయితే మార్ష్ ఓ రేంజ్లో ఏకి పారేశారు. -
ఆరు సార్లు జగజ్జేతలు.. అయినా ఎలాంటి హడావుడి లేదు.. సాధారణ వ్యక్తుల్లా..!
వన్డే వరల్డ్కప్ 2023 గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నిన్ననే స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి జగజ్జేతలుగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎయిర్పోర్ట్లో అతి సాధారణమైన స్వాగతం లభించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటిలాగే ఇళ్లకు పయనమయ్యారు. ఎయిర్పోర్ట్లో ఆసీస్ క్రికెటర్లు సాధారణ ప్యాసింజర్లలా తమ లగేజ్ను తామే మోసుకెళ్లారు. తమ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించినా ఆస్ట్రేలియన్లు ఎలాంటి హడావుడి చేయలేదు. ఆసీస్ క్రికెటర్లు సైతం తామేదో సాధించామని ఫీలవుతున్నట్లు ఎక్కడా కనపడలేదు. సాధారణంగా ఏ జట్టైనా ప్రపంచ ఛాంపియన్గా నిలిస్తే, స్వదేశంలో వారికి అపురూపమైన స్వాగతం లభిస్తుంది. సత్కారాలు, ఆరుపులు, కేకలతో అభిమానులు నానా హంగామా చేస్తారు. No Drama, no jingoism, no political leader present to take the credit, no hero worship, no one to carry his luggage, no one going mad in streets. This is Pat Cummins and Australian people after winning the World Cup 2023. So much to learn from them.pic.twitter.com/u30cB6dBOW — Dr Nimo Yadav (@niiravmodi) November 22, 2023 అయితే ఆసీస్ జట్టు ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచి తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టినప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనపడలేదు. ఎలాంటి డ్రామాకు ఆస్కారం లేకుండా అతి తక్కువ మంది ఫోటోగ్రాఫర్ల సమక్షంలో ఆసీస్ ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు. ఆసీస్ ఆటగాళ్లు సాధించినదానికి క్రెడిట్ తీసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాలేదు. అరుపులు, కేకలు అస్సలు లేవు. వ్యక్తి పూజ అంతకంటే లేదు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వెళ్తున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్మీడియాలో పోస్ట్ చేసి ఆస్ట్రేలియన్ల సింప్లిసిటీని కొనియాడాడు. వారి నుంచి చాలా నేర్చుకోవాలని కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో గెలపొంది ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్కప్లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
శ్రీలంక క్రికెట్కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్కప్ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
CWC 2023 Final: బోల్తా కొట్టించింది పిచ్ వ్యూహమేనా?
2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలుపొంది, అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి మూడోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. నాకౌట్ మ్యాచ్ల్లో చతికిలపడటం టీమిండియాకు కొత్తేమీ కానప్పటికీ, ఈ దఫా మాత్రం అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది. ఆశలు రేకెత్తించి, ఆఖరి మెట్టుపై ఉసూరుమనిపించడంతో ఫ్యాన్స్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ఈ ఓటమి 140 కోట్ల మంది భారతీయులకు గుండె కోత మిగిల్చింది. ఫైనల్లో భారత్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ పలువురు నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒత్తిడి, టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలని మెజారిటీ శాతం అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన అతే కొంపముంచిందని అంటున్నారు. తమ పేసర్లు భీకరమైన ఫామ్లో ఉన్నప్పుడు నిదానమైన ట్రాక్ రూపొందించడమే పెద్ద తప్పని అభిప్రాయపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం బెడిసికొట్టిందని, అదే మనపై ప్రత్యర్ధి పైచేయి సాధించేలా చేసిందని అంటున్నారు. పిచ్ ఎప్పటిలాగే ఉన్నా టీమిండియాకు లబ్ది చేకూరేదే అని అభిప్రాయపడుతున్నారు. మన పేసర్లపై నమ్మకం లేక స్లో పిచ్ను తయారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. జట్టు అన్ని విభాగాల్లో (బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్) పటిష్టంగా ఉన్నప్పుడు నిదానమైన పిచ్ను తయారు చేయడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు. పిచ్ విషయంలో బీసీసీఐ వ్యూహం మిస్ ఫైర్ అయ్యిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అన్నాడు. పిచ్ స్లోగా ఉండటం, ఆదిలోనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనైందని తెలిపాడు. షాట్లు ఆడేందుకు భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారని అభిప్రాయపడ్డాడు. కాగా, అహ్మదాబాద్ పిచ్పై గతంలో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. ఇక్కడి రెగ్యులర్ పిచ్పై అత్యంత భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే వరల్డ్కప్ ఫైనల్లో రెగ్యులర్ వికెట్ కాకుండా స్లో ట్రాక్ను రూపొందించడంతో టీమిండియా పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మంచు ప్రభావం చేత పిచ్ మరింత నిదానంగా మారి, దాదాపు నిర్జీవమైన పిచ్గా మారిపోయింది. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు హెడ్, లబూషేన్ క్రీజ్లో పాతుకుపోయి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. -
2023 ప్రపంచకప్లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్ అతడే.. లిస్ట్లో కోహ్లి, జడ్డూ
2023 వన్డే ప్రపంచకప్లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్గా ఆసీస్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్ను ఐసీసీ ఎంపిక చేసింది. లబూషేన్ 82.66 రేటింగ్ పాయింట్లతో ఫీల్డర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఆసీస్కే చెందిన డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 82.55 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగం టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. 72.72 రేటింగ్ పాయింట్లతో రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో.. 56.79 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లి ఆరో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్ మూడో స్థానంలో, నెదర్లాండ్స్ ఆటగాడు సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ ఐదులో, ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్వెల్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. మైదానంలో కనబర్చిన ప్రతిభ (పరుగుల నియంత్రణ, రనౌట్లు, త్రోలు) ఆధారంగా రేటింగ్ పాయింట్లు కేటాయించబడ్డాయి. ICC named Marnus Labuschagne as the biggest fielding impact in World Cup 2023. - Kohli & Jadeja are the only Indians in Top 10. 🔥🎯 pic.twitter.com/ZtO2kRz7U6 — Johns. (@CricCrazyJohns) November 20, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
ఆల్ టైమ్ హై రికార్డు సెట్ చేసిన 2023 వరల్డ్కప్
2023 వన్డే ప్రపంచకప్ హాజరు విషయంలో ఆల్టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈ ఎడిషన్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్కప్గా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రపంచకప్కు 1,250,307 మంది హాజరైనట్లు ఐసీసీ ప్రకటించింది. 13 వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో ఇదే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్కప్గా రికార్డైంది. ఇందులో ఒక్క ఫైనల్ మ్యాచ్కే లక్ష మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 92453 మంది హాజరయ్యారు. ఇదిలా ఉంటే, నవంబర్ 19న జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. రికార్డు స్థాయిలో ప్రేక్షకుల బ్రహ్మరథం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్ను రికార్డుస్థాయిలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. పది జట్లు పోటీపడిన ఈ మెగా ఈవెంట్ 48 మ్యాచ్లను 12,50,307 మంది ప్రేక్షకులు చూశారని ఐసీసీ ధ్రువీకరించింది. అంటే సగటున ఒక్కో మ్యాచ్కు 26000 మంది హాజరైనట్లు తెలిపింది. ఆసీస్, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్ను 10,16,420 మంది వీక్షించి రికార్డు సృష్టించగా... దీన్ని తాజా ప్రపంచకప్ బద్దలుకొట్టింది. -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. స్టార్ ఆటగాడు ఔట్
నవంబర్ 23 నుంచి భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్కప్లో ఆసీస్ లీడింగ్ రన్ స్కోరర్ (11 మ్యాచ్ల్లో 535 పరుగులు) డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. విశ్రాంతి కోసం వార్నర్ చేసుకున్న విజ్ఞప్తిని ఆసీస్ క్రికెట్ బోర్డు పరిగణలోకి తీసుకుంది. దీంతో వరల్డ్కప్ ముగిసిన అనంతరమే వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సీనియర్లెవ్వరినీ ఎంపిక చేయలేదు. ఆసీస్ టీమ్కు మాథ్యూ వేడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ స్థానంలో ఆరోన్ హార్డీని జట్టులోకి తీసుకుంది. మరోవైపు భారత సెలెక్టర్లు కూడా ఈ సిరీస్కు సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. వీరి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. 5 మ్యాచ్ల ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు నిన్ననే టీమిండియాను ప్రకటించారు. కాగా, వన్డే వరల్డ్కప్ 2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆ జట్టు టీమిండియాను ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో గెలిచి ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. సిరీస్లో తొలి మ్యాచ్ (నవంబర్ 23) వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జేసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ (చివరి రెండు మ్యాచ్లకు మాత్రమే). -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
పదేళ్ల నుంచి ఇంతే.. ఆశలు రేకెత్తిస్తారు, ఆఖర్లో ఉసూరుమనిపిస్తారు..!
వన్డే వరల్డ్కప్ 2023లో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్) బోల్తా పడి 140 కోట్ల మంది భారతీయులకు గుండెకోత మిగిల్చింది. సెమీస్ లేదా ఫైనల్స్లో ఇలా చేతులెత్తేయడం భారత్కు ఇది కొత్తేమీ కాదు. గత పదేళ్ల కాలంలో టీమిండియా తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో సెమీస్ లేదా ఫైనల్స్లో ఓటమిపాలైంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస వైఫల్యాల తీరును పరిశీలిస్తే.. ఆయా టోర్నీల ఆరంభాల్లో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు నాకౌట్ మ్యాచ్ అనగానే ఒత్తిడికి లోనై చతికిలపడతారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో ఇదే తంతు కొనసాగుతుంది. వరల్డ్కప్ 2023లోనూ సెమీస్ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేశారు. ఎన్నో అంచనాల నడుమ ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక ఓడారు. ఆశలు రేకెత్తించి, ఆఖర్లో ఊసూరుమనిపించడం టీమిండియా ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ సర్ధి చెప్పుకోవడం తప్పించి చేసిందేమీ లేదు. అభిమానులు సైతం ఇదే అనుకుంటూ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుండటంతో వారిలో సీరియస్నెస్ కొరవడింది. విచ్చలవిడిగా డబ్బు, పబ్లిసిటీ లభిస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే భారత క్రికెటర్లు ఇకనైనా అలసత్వం వీడాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా గెలుపును అంత సీరియస్గా తీసుకోదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆసీస్ ఆటగాళ్ల నుంచి మనవాళ్లు ఎంతైనా నేర్చుకోవాలి. ప్రతిభ గల జట్టును బెంచ్ మార్క్గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు కానీ అనక తప్పదు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రస్తానం.. 2014 టీ20 వరల్డ్కప్: ఫైనల్లో ఓటమి 2015 వన్డే వరల్డ్కప్: సెమీస్లో ఓటమి 2016 టీ20 వరల్డ్కప్: సెమీస్లో ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్లో ఓటమి 2019 వన్డే వరల్డ్కప్: సెమీస్లో ఓటమి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2022 టీ20 వరల్డ్కప్: సెమీఫైనల్లో ఓటమి 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2023 వన్డే వరల్డ్కప్: ఫైనల్లో ఓటమి -
ఆ వ్యాఖ్యలు పాంటింగ్ చేసినవేనా???
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ బీసీసీఐని క్రికెట్ మాఫియాతో పోల్చాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అయితే పాంటింగ్ నిజంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అని ఫ్యాక్ట్ చేయగా.. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలింది. ఈ ప్రచారంపై భారత్లోనే ఉన్న పాంటింగ్ స్పందించాల్సి ఉంది. కాగా, ASG అనే ట్విటర్ అకౌంట్ నుంచి పాంటింగ్ ఫాక్స్ క్రికెట్తో మాట్లాడుతూ బీసీసీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్నటి నుంచి సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. Ricky Ponting on Fox Cricket: "This is a win of justice against cricket mafia. Your money and power is still not winning World Cups for you. How embarrassing." Ponting owned India and BCCI 😂 pic.twitter.com/pc5LnseQi7 — ASG (@ahadfoooty) November 19, 2023 సదరు ట్వీట్లో ఏముందంటే.. ఇది క్రికెట్ మాఫియాపై (బీసీసీఐని ఉద్దేశిస్తూ) న్యాయం సాధించిన విజయం.. డబ్బు, పలుకుబడితో ప్రపంచ కప్ గెలవలేరని పాంటింగ్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ నిజంగానే బీసీసీఐని అలా అన్నాడనుకుని పొరబడ్డ కొందరు భారత క్రికెట్ అభిమానులు పాంటింగ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్లో పిలిచి పెత్తనం ఇచ్చినందుకు (ఢిల్లీ క్యాపిటల్స్) బీసీసీఐకి సరైన గుణపాఠమే నేర్పాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
Pat Cummins: నిశ్శబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా..!
వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. కాగా, ఫైనల్ మ్యాచ్కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 1.3 లక్షల మంది ప్రేక్షకులను (ఫైనల్కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య) సైలెంట్గా ఉంచడంలో దొరకే సంతృప్తి ఇంకొక దాంట్లో దొరకదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. అన్నట్లుగానే కమిన్స్ నిన్న జరిగిన ఫైనల్లో భారత్ను ఓడించి నరేంద్ర మోదీ స్టేడియం మొత్తాన్ని సైలెంట్గా ఉంచగలిగాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. నిశబ్దంలో ఉన్న కిక్కే వేరప్పా అనే సినిమా డైలాగ్తో కామెంట్స్ చేస్తున్నారు. -
Virat Kohli: ఆ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడి అడుగుజాడల్లోనే..!
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఎడిషన్లో 11 మ్యాచ్లు ఆడిన కోహ్లి 95.62 సగటున 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 765 పరుగులు చేశాడు. కోహ్లి వన్డే వరల్డ్కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. అతను టీ20 వరల్డ్కప్లో మాత్రం రెండుసార్లు ఈ ఘనతను సాధించాడు. 2014, 2016 ఎడిషన్లలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి ఈ ఎడిషన్లో ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయినప్పటికీ.. టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు సైతం గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2003 ఎడిషన్లో సచిన్ కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నప్పటికీ టీమిండియాకు టైటిల్ను అందించలేకపోయాడు. క్రికెట్కు సంబంధించి ప్రతి విషయంలోనూ సచిన్ అడుగుజాడల్లో నడిచే కోహ్లి ఈ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడినే ఫాలో అయ్యాడు. Sad to experience both these moments in past 20 years. 💔 pic.twitter.com/8txpsrKw1l — Abhishek Ojha (@vicharabhio) November 19, 2023 ఇదిలా ఉంటే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023 Final: ఇప్పటికంటే 2015లోనే ఎక్కువ..!
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్ 19) జరిగిన ఈ మ్యాచ్కు అశేష జనవాహిని హాజరై టీమిండియాను ప్రోత్సహించారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. అధికారక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్కు 92453 మంది హాజరైనట్లు సమాచారం. 2015 వరల్డ్కప్తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువ. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాటి ఫైనల్కు 93013 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదో సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. తాజాగా జరిగిన 2023 ఎడిషన్ ఫైనల్లో అదే ఆసీస్ టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. According to official attendance numbers, the 2015 World Cup in MCG had higher attendance than the 2023 World Cup final in Ahmedabad👀🤯 pic.twitter.com/j2kapHeAfB — CricTracker (@Cricketracker) November 20, 2023 నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది. స్వదేశంలోనే మరో 3 రోజుల్లో భారత్, ఆసీస్ టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో గెలిచి ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా, రెండో టీ20 నవంబర్ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్ నవంబర్ 28న (గౌహతి), నాలుగు (నాగ్పూర్), ఐదు టీ20లు (హైదరాబాద్) డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి. కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
క్రికెట్ జోష్ ముగిసింది.. బరిలో 8 సినిమాలు.. పోటీ పడుతున్న సలార్
కొద్దిరోజుల్లో 2023కు గుడ్బై చెప్పే సమయం ఆసన్నమైంది. దసర పండుగ వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిత్ర పరిశ్రమ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకంటే..? క్రికెట్, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయి. క్రికెట్ కారణంగా కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటే మరికొన్ని అనుకోని కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. నిన్నటితో క్రికెట్ ప్రపంచం నుంచి ప్రేక్షకులు మెళ్లిగా సినిమా ప్రపంచం వైపు మళ్లుతున్నారు. త్వరలో క్రిస్టమస్ పండగ రానుంది... అంతేకాకుండా 2023 సంవత్సరానికి గుడ్బై చెప్పే సమయం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో రానున్న 40 రోజుల్లో విడుదలయ్యే సినిమాలు ఏవి..? ఏడాది చివర్లో భారీ సిక్సర్ కొట్టే సినిమా ఏది..? ఇదే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యే మూవీ ఏది..? అనే అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినీ అభిమానులు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 22 వరకు వరసగా విడుదలయ్యే చిత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆదికేశవతో వస్తున్న వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైష్ణవ్, శ్రీలీల రొమాంటిక్ లుక్తో చూడముచ్చటగా కనిపించారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై వైష్ణవ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో రుద్ర అనే పాత్రలో వైష్ణవ్ కనిపిస్తే... వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనుంది. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 'కోట బొమ్మాళి పీఎస్'లో శివాని రాజశేఖర్ లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా గురించి విడుదలకి ముందే హైప్ క్రియేట్ అయింది. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనుంది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్గా దీనిని తెరకెక్కించారు. క్రూరమైన యానిమల్గా రణ్బీర్ రణ్బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. హ్యట్రిక్పై కన్నేసిన షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేర్లలో 'డంకీ' చిత్రం టాప్లో ఉంది. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్జోష్లో ఉన్న షారుక్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్, జవాన్ రెండు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. డంకీ చిత్రం ద్వారా సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని షారుక్ ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం సలార్తో పోటీకి దిగనుంది. చివర్లో దిగుతున్న డైనోసార్ (సలార్) భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న చిత్రం సలార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడి క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో భారీ బడ్జెట్ చిత్రంగా సలార్ ఉంది. లైన్లో ఉన్న నాని, నితిన్, విష్వక్సేన్ ఈ చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తకరమైన చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాని చిత్రం 'హాయ్ నాన్న' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 8న ఏకంగా మూడు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వరుణ్తేజ్- 'ఆపరేషన్ వాలంటైన్', విష్వక్సేన్- 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', నితిన్- 'ఎక్స్ట్రా ఆర్డినరీమేన్' ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్గా తన తొలి వరల్డ్కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. !
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో 140 కోట్ల భారతీయుల గుండెలను ముక్కలు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తక్కువ స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. ఆరంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna — Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023 అయితే హెడ్.. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ సంబురాలు మినహా నరేంద్ర మోదీ స్టేడియంలో నిశబ్దం ఆవహించింది. ఆసీస్ ఆటగాళ్లు తమ జీవితాల్లో అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. హెడ్, లబూషేన్, మ్యాక్స్వెల్, కమిన్స్ ఇలా.. ప్రతి ఒక్క ఆసీస్ ఆటగాడు విజయ గర్వంతో ఊగిపోయారు. అయితే ఒక్క ఆసీస్ ఆటగాడి విజయదరహాసం మాత్రం శృతి మించింది. 2015 ఎడిషన్ ఫైనల్లోనూ ఆసీస్ గెలుపులో భాగమైన మిచెల్ మార్ష్ భారత్పై విజయానంతరం వరల్డ్కప్ ట్రోఫీని అగౌరవపరిచాడు. జగజ్జేతగా నిలిచామన్న గర్వంతో అతను మితిమీరి ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం బీర్ తాగుతూ వరల్డ్కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు మార్ష్ అనుచిత ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మతి తప్పినదా ఏంటి అంటూ తూర్పారబెడుతున్నారు. ప్రతి క్రికెటర్ ఎంతో అపురూపంగా భావించే వరల్డ్కప్ ట్రోఫీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఎంత గెలిస్తే మాత్రం ఇంత అహం పనికిరాదంటూ గడ్డి పెడుతున్నారు. -
భారత్ ఓటమి.. విరాట్, అనుష్క హార్ట్ బ్రోకెన్ ఫోటో వైరల్
క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరి పోరాటంలో 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి ప్రపంచ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూ జట్టు.. ఎక్కడా కూడా తడబాటు పడకుండా తమ ప్లాన్ను అమలుచేసింది. దీంతో దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది. 2003 తర్వాత అదే జట్టుతో ఫైనల్ ఫైట్ మళ్లీ ఎదురైంది.. అప్పటి ఓటమి లెక్కలు సరిచేసి ఇప్పుడు గెలిచి రివేంజ్ తీర్చుకుంటారనుకుంటే... మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్ సమరం ఓటమితో ముగిసింది. భారత్ ఓటమితో విరాట్ కోహ్లీ తీవ్రమైన నిరుత్సాహానికి గురైయాడు.. ఆ సమయంలో విరాట్కు ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ ఆనుష్క శర్మ అండగా నిలబడింది. విరాట్ను దగ్గరకు తీసుకుని ఎంతో ఉద్వేగంతో కౌగిలించుకుని ఓదార్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమ్ ఇండియా ఓటమి తర్వాత అనుష్క కూడా గుండె పగిలినట్లు కనిపించింది. అయితే, మ్యాచ్ తర్వాత ఆమె భర్త విరాట్కు పూర్తి మద్దతుగా నిలిచి ధైర్యాన్ని నింపేలా ఓదార్చింది.నెటిజన్లు ఈ జంటపై ప్రేమను కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భర్తకు ఇలా సపోర్ట్ చేయడం ఎంతో అవసరమని మరోకరు తెలిపారు. బాలీవుడ్ నటి అనుష్క విరాట్కు మద్దతు ఇచ్చే విధానం క్రికెట్,సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రపంచకప్ ఫైనల్స్లో భారత్ ఓటమిని పలువురు సెలబ్రిటీలు కూడా జట్టుకు తమ తిరుగులేని మద్దతును తెలిపారు. షారుక్ ఖాన్ కాజోల్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్, ఆయుష్మాన్ ఖురానా . ప్రతి ఒక్కరూ భారత్ ఓటమిపై తమ బాధను వ్యక్తం చేశారు. అయితే టోర్నమెంట్లో భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. అనుష్క శర్మ తదుపరి చిత్రం 'చక్దా ఎక్స్ప్రెస్' (Chakda 'Xpress) చిత్రంతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహింస్తున్నారు. What a tragedy! @AnushkaSharma and @theathiyashetty must be devastated beyond words. Life's just so unfair, isn't it? 😔 pic.twitter.com/WcIBMJnUUH — ⚡ai_Prabha⚡ (@_Prabhas2K01) November 19, 2023 -
ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్ను ఇచ్చారు. వరల్డ్కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
అప్పుడు అందరి కళ్లు అనుష్క శర్మ డ్రెస్ మీదే.. ఎందుకో తెలుసా?
ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ మెస్మరైజ్ ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతున్న మ్యాచ్ను చూసేందుకు ఆమె ముంబైకి వచ్చింది. ఆట జరుగుతున్నప్పుడు క్రీజ్లో విరాట్ దుమ్ములేపుతుంటే.. స్టాండింగ్లో ఉన్న అనుష్క చప్పట్లు కొడుతూ.. అప్పడప్పుడు విరాట్కు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ సంతోషంగా కనిపించింది. ఆ సమయంలో కెమెరాలు కూడా ఆమెను పదేపదే స్క్రీన్పై చూపించాయి. తాను మైదానంలో వేలాదిమంది మధ్యలో ఉన్నానని సంగతి మర్చిపోయి, ఎంతో ఉత్సాహంతో ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేసింది. వాంఖడే స్టేడియంలో విరాట్ ఆట ఎంత హిట్టో.. ఆ సమయంలో ఉత్సాహంగ కనిపించిన అనుష్క నవ్వులు కూడా అంతే హిట్ అయ్యాయి. అప్పుడు అందరి దృష్టి ఆమె డ్రెస్పై పడింది. అనుష్క ఈ మ్యాచ్ కోసం కో-ఆర్డ్ సమిష్టిలో అద్భుతంగా కనిపించింది. అనుష్క ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, కానీ ఆమె తన స్టైలిష్ ప్రదర్శనలతో తన అభిమానులను ఎలా ఆకర్షించాలో ఖచ్చితంగా తెలుసు. ఆకుపచ్చ పూల డిజైన్లతో ఉన్న షర్ట్లో ఆమె చాలా అందంగా కనిపించింది. అనుష్క శర్మ దుస్తులు ధృవ్ కపూర్ లేబుల్ నుంచి వచ్చాయి. ఫ్లోరల్ డిజైన్తో కూడిన ఆ షర్ట్ ధర రూ.19,500 కాగా షర్ట్, మ్యాచింగ్ షార్ట్లతో కూడిన కో-ఆర్డ్ సెట్ మొత్తం కావాలంటే రూ. 27,500 అని తెలుస్తోంది. తాజాగా విరాట్ చేసిన సెంచరికి ఒక ప్రత్యేకత ఉంది. 50 సెంచరీలతో టాప్ ప్లేస్లోకి చేరడం.. ఆ సమయంలో అనుష్క ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లు ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో అనుష్క ధరించిన డ్రెస్ ఎంత ఉండవచ్చని సోషల్ మీడియాలు భారీగా కామెంట్లు వస్తున్నాయి. -
టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్
వరల్డ్కప్ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. కోల్కతా వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక 49.4 ఓవర్లలో 21 పరుగులకు ఆలౌటయ్యారు. డేవిడ్ మిల్లర్ సెంచరీతో (101) సత్తా చాటగా.. క్లాసెన్ 47 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్కు విజయం అంత ఈజీగా దక్కలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 62 పరుగులతో పాటు 2 వికెట్లు తీసిన ట్రవిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. డగౌట్లో కూర్చోవడం కంటే క్రీజ్లో ఉండటమే తేలిక అనిపించింది. రెండు గంటలపాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అంతంగా ఫలితం అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. స్టార్క్, హాజిల్వుడ్ ఊహించని విధంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ అనుకూలిస్తుందనుకున్న పిచ్పై వారు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభంలో మేము ఈ విభాగంలో చాలా బలహీనంగా ఉండి మ్యాచ్లు చేజార్చుకున్నాం. 37 ఏళ్ల వయసులోనూ వార్నర్ మైదానంలో పాదరసంలా కదులుతున్నాడు. ఈ రోజు ట్రవిస్ హెడ్ది. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు అమూల్యమైన పరుగులు మెరుపు వేగంతో చేశాడు. నాణ్యమైన సఫారీ స్పిన్నర్లను హెడ్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మాలో కొద్దిమందికి ఇదివరకే వన్డే వరల్డ్కప్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. కొంతమంది టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. మరోసారి ఫైనల్కు చేరినందుకు ఆనందంగా ఉంది. భారత్తో ఫైనల్ ఇంకా ప్రత్యేకం. ఫైనల్ మ్యాచ్లో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం నిండిపోతుంది. ప్రేక్షకులు భారత్కు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు. అలాంటి వాతావరణం ఊహించుకుంటేనే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. -
CWC 2023: వరల్డ్కప్ చరిత్రలో ఒకే ఒక్కడు.. క్వింటన్ డికాక్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ ఎడిషన్ ప్రారంభం నుంచి అద్బుతమైన ఆటతీరు కనబర్చి వరుస విజయాలు సాధించిన సఫారీలు.. సెమీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. లీగ్ దశ మొత్తంలో ఇరదీసిన సౌతాఫ్రికా బ్యాటర్లు నిన్నటి నాకౌట్ మ్యాచ్లో చేతులెత్తేశారు. టోర్నీ టాప్ 10 రన్ స్కోరర్ల జాబితాలో ఉన్న డికాక్, డస్సెన్, మార్క్రమ్ ఆసీస్తో మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. డికాక్ 3, డస్సెన్ 6, మార్క్రమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడినప్పటికీ.. క్వింటన్ డికాక్ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్తో వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికిన డికాక్ తన కెరీర్ ఆఖరి మ్యాచ్తో వరల్డ్కప్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్లో 10 మ్యాచ్ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేసి విరాట్ కోహ్లి (10 మ్యాచ్ల్లో 711 పరుగులు) తర్వాత సెకెండ్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచిన డికాక్.. ఈ ఎడిషన్లో 20 క్యాచ్లు కూడా పట్టి ప్రపంచకప్ చరిత్రలో 500 ప్లస్ పరుగులు, 20 క్యాచ్లు పట్టిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్గా ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాడు. అలాగే ఓ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో గిల్క్రిస్ట్ (2003లో 21 క్యాచ్లు), టామ్ లాథమ్ (2019లో 21 క్యాచ్లు), అలెక్స్ క్యారీ (2019లో 20 క్యాచ్లు) తర్వాత అత్యధిక క్యాచ్లు (2023లో 20 క్యాచ్లు) అందుకున్న వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, రెండో సెమీస్లో సౌతాఫ్రికాపై గెలవడంతో ఆస్ట్రేలియా ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి ఫైనల్కు చేరింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ల మధ్య నవంబర్ 19న వరల్డ్కప్ ఫైనల్ జరుగనుంది. -
టీమిండియాకు బిగ్ షాక్
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన (చీలమండ గాయం) స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వరల్డ్కప్ అనంతరం భారత్ ఆడబోయే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్లకు దూరం కానున్నాడు. హార్థిక్ గాయానికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. ఈ మధ్యలోనే భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాను వారి గడ్డపై ఢీకొట్టాల్సి ఉంది. కాగా, వరల్డ్కప్ అనంతరం నవంబర్ 23 నుంచి భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 10 నుంచి 2024 జనవరి 7 వరకు సౌతాఫ్రికాతో 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్ ఫైనల్ బెర్త్లు ఖరారైన విషయం తెలిసిందే. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. -
CWC 2023: మా ఆయన దేవుడి బిడ్డ.. కోహ్లి సతీమణి భావోద్వేగం
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విరాట్ ఈ ఘనత సాధించిన అనంతరం అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ కోహ్లి! నీ తలరాతను గొప్పగా రాశాడు. నీ ప్రేమను దక్కించుకున్న నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూస్తుంటే, నీ ప్రదర్శనను గమనిస్తుంటే నాకనిపిస్తుంది. ఆడేకొద్దీ, పెరిగే కొద్దీ నీ సత్తా సామర్థ్యం పెరుగుతోంది. ఆటకోసం నిరంతరం నిజాయితీగా శ్రమించే నీవు నిజంగా దేవుడి బిడ్డవే’ అంటూ భావోధ్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగో సారి వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే. అనంతరం నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించి ఎనిమిదో సారి ఫైనల్స్కు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ల మధ్య నవంబర్ 19న తుది సమరం జరుగనుంది. -
‘ఆ రికార్డు’ కూడా కోహ్లికి సాధ్యమే.. మరో 10 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు చేస్తాడు..!
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్లాంటి బ్యాటర్కు ఏదీ అసాధ్యం కాదు. శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్గా నిలబెడుతోంది’ అని అన్నారు. జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు. అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి. -
CWC 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్.. అరుదైన రికార్డు
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. కాగా, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్ ఫైనల్స్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే, కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్కప్ ఫైనల్స్కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
CWC 2023 2nd Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్,సీన్ అబాట్ల స్థానాల్లో మ్యాక్స్వెల్, స్టార్క్ రీఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్ -
ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. మరోసారి తన బుద్ది చూపించిన పాక్ నటి
క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. న్యూజిలాండ్పై విజయంతో భారత్ ఫైనల్కు చేరింది. 1983, 2003, 2011, 2023 ఇప్పటికి నాలుగుసార్లు భారత్ ఫైనల్కు చేరింది. అందులో 1983, 2011లో టైటిల్ విన్నర్గా నిలిచింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరగనున్న ఫైనల్ పోరుకు సై అంటూ భారత్ రెడీగా ఉంది. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు వెళ్లిన టీమిండియాపై ప్రపంచం మొత్తం శుభాకాంక్షలతో అభినందిస్తుంటే.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియాపై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ.. మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. గతంలో భారత్ను ఓడిస్తే బంగ్లాదేశ్ కుర్రాడితో డేట్ చేస్తానంటూ ఆమె ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. టీమిండియా గెలుపు ఆనందంలో ఉంటే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్కు వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అని పాక్ నటి సెహర్ షిన్వారీ ఎక్స్లో ట్వీట్ చేసింది. భారత్ అన్నింటిలోనూ పాకిస్తాన్ కంటే ముందంజలో ఎలా ఉందో తనకు అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశనం కానున్నాయి అంటూ మరోసారి తనలోని ద్వేషాన్ని ఆమె వెల్లగక్కింది. మ్యాచ్ ఫిక్స్ అయిందని భారత ఆటగాళ్లకు ముందే తెలుసు.. కానీ మ్యాచ్లో బాగా ఆడుతున్నట్లు సినిమా వాళ్ల కంటే భారత ఆటగాళ్లే బాగా నటించారు. వాళ్లందరూ కూడా మంచి నటులని ఆమె విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత జట్టు అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭 — Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023 Bohat jald BCCI aur BJP ka sarvanash hoga✌️ — Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023 -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్న్యూస్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరుకుంటుంది. మ్యాచ్కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. -
దిగ్గజాలు కలిసిన వేళ.. సచిన్, విరాట్లతో ముచ్చటించిన డేవిడ్ బెక్హమ్
భారత్, న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెక్హమ్ యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నాడు. షెడ్యూల్లో భాగంగా అతను వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బెక్హమ్.. క్రికెట్ గాడ్, యూనిసెఫ్ ప్రతినిథి అయిన సచిన్ టెండూల్కర్ను కలిసాడు. వీరిద్దరు చాలా సేపు ముచ్చటించారు. సచిన్ ఫుట్బాల్కు వీరాభిమాని కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది. సచిన్, బెక్హమ్లు క్రికెట్, ఫుట్బాల్కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సచిన్ బెక్హమ్ను ముంబై ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిప్పాడు. యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో బెక్హమ్కు ఐసీసీ గౌరవ వందనం తెలుపుతూ మ్యాచ్కు ముందు మైదానంలోకి ఆహ్వానించింది. Fantastic footage 👍 https://t.co/Uh8hM4GFsS — Michael Vaughan (@MichaelVaughan) November 15, 2023 అనంతరం టీమిండియా, కివీస్ క్రికెటర్లంతా బెక్హమ్ను పరిచయం చేసుకున్నారు. బెక్హమ్ కింగ్ విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్మీడియాలో షేర్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, బెక్హమ్ ప్రస్తుతం ఇంటర్ మయామీ అనే ఫుట్బాల్ క్లబ్కు కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. -
హార్ధిక్కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్లు పెడుతున్నారు. హార్ధిక్కు థ్యాంక్స్ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. హార్ధిక్ ఫిట్గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్ తమతమ స్థానాలపై కర్ఛీఫ్లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్ జట్టులో ఉంటే మూడో పేసర్గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ ఉంటే, జట్టు మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్ లేదా బ్యాటర్ వైపే చూస్తుంది. వరల్డ్కప్ ముందు వరకు చాలా మ్యాచ్ల్లో ఇదే జరిగింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్మ్యాన్ టాస్ కాయిన్ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
మా వాళ్లు వీరోచితంగా పోరాడారు.. గర్వంగా ఉంది: కేన్ విలియమ్సన్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ కివీస్పై పైచేయి సాధించి, గత వరల్డ్కప్ సెమీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై, మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ముందుగా టీమిండియాకు అభినందనలు. వారు గొప్ప క్రికెట్ ఆడారు. మా వాళ్లు సైతం అద్భుతంగా పోరాడారు. మా పోరాటం పట్ల గర్వంగా ఉంది. మరోసారి నాకౌట్ కావడం నిరాశపరిచింది. శక్తివంచన లేకుండా ప్రయత్నించాం. టీమిండియా మాకంటే బెటర్ గేమ్ ఆడింది. అదో టాప్ క్లాస్ జట్టు. ప్రపంచ స్థాయి బ్యాటర్లంతా ఆ జట్టులోనే ఉన్నారు. వారందరూ మాపై ప్రతాపం చూపారు. 398 పరుగుల స్కోర్ను ఛేజ్ చేయడం ఆషామాషీ విషయం కాదు. అయినా మేం అద్భుతంగా పోరాడాం. ఛేజింగ్ చాలా కష్టంగా ఉండింది. భారత బౌలర్లకు క్రెడిట్ దక్కుతుంది. వారు మై పైచేయి సాధించారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జట్టుగా మాకు ఆట పట్ల నిజమైన నిబద్ధత ఉంది. గెలుపు కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేశాం. ఈ ఎడిషన్లో రచిన్, మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కాస్త తడబడ్డారు. అంతిమంగా మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ముంబై ప్రేక్షకులు అద్భుతం. వారు మమ్మల్ని సొంత ఆటగాళ్లలా ఆదరించారు. ఇక్కడికి రావడం ప్రత్యేకం. భారతదేశం ఆతిథ్యం అత్యద్భుతం. చదవండి: ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ -
ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్మార్క్ ఇన్నింగ్స్తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం. చదవండి: -
CWC 2023: టీమిండియాను ఫైనల్కు చేర్చిన రాహుల్, జడేజా.. అదేంటీ..!
క్రికెట్లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్లు పట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్లో టీమిండియా కివీస్ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. -
భారత్ గెలుస్తే అంటూ.. 'బోల్డ్ ఆఫర్' ప్రకటించిన తెలుగు హీరోయిన్
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా వరల్డ్ కప్-2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి ప్రపంచ కప్ భారత్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్లో ఉండటమే.. ఇలాంటి సమయంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్ తన సోషల్మీడియా ఖాతా నుంచి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 'ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్లో స్ట్రీకింగ్ చేస్తా' అంటూ పోస్ట్ పెట్టింది. స్ట్రీకింగ్ అంటే ఏంటి..? ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది దుస్తులు తొలగించి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడమే స్ట్రీకింగ్ అంటారు. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అలాంటి పని చేయనుంది. ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ఆమె తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలుస్తే...వైజాక్ బీచ్లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండియా గెలుస్తే... బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. వాటికి రేఖా భోజ్ కూడా ఇలా రిప్లై ఇచ్చింది. లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.' అని రేఖా బోజ్ తెలిపింది. కానీ కొందరు మాత్రం అంతే బోల్డ్గా వైజాగ్ వచ్చేస్తామంటూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. రేఖా భోజ్ ఎవరు..? బోల్డ్ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్పైన కూడా ఆమె గతంలో వైరల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.. విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. India in the World Cup Semi Finals: 2011 - India batted first, won the game. 2015 - India batted second, lost the game. 2019 - India batted second, lost the game. 2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc — Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023 కాగా, వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్కు చేరి ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయింది. ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
శ్రేయస్, రాహుల్ అత్యద్భుతం.. కివీస్ నుంచి గట్టి పోటీ తప్పదు..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) జరిగే సెమీఫైనల్ మ్యాచ్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్పై గంభీర్ విశ్లేషణ చేస్తూ ఇలా అన్నాడు. సెమీఫైనల్లో కచ్చితంగా భారత జట్టే ఫేవరెట్. ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని కంగుతినిపించడమే కాదు... భారత్తో ఢీ అంటేనే కష్టం అనిపించేలా మనోళ్లు జైత్రయాత్ర సాగించారు. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత బౌలింగ్ నన్ను ఆకట్టుకుంది. బౌలర్లు జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. ఈ ప్రపంచకప్ గెలిస్తే మాత్రం దేశంలో బౌలింగ్ విప్లవం ఖాయం. ఇంతవరకు మనలో చాలామంది సచినో, కోహ్లినో కావాలనుకునే క్రికెట్లో అడుగుపెట్టేవారు. కానీ ఈ వరల్డ్కప్ తర్వాత బౌలర్ల లక్ష్యంతో అకాడమీలు కళకళలాడుతాయంటే ఆశ్చర్యం లేదు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కళ్లప్పగించేలా చేసింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్పై బాదిన శతకం (102) అయితే హైలైట్ అని చెప్పొచ్చు. చక్కని ఫుట్వర్క్, పరిణతితో కూడిన ఫ్లిక్ షాట్స్తో ఫోర్లు, సిక్సర్లు అదరగొట్టాడు. మణికట్టు స్ట్రోక్ప్లేతో పరుగులు సాధించిన తీరు అద్భుతం. దీంతో రాహుల్ను ఇప్పుడు 360 డిగ్రీ ప్లేయర్ అనొచ్చు. 160 స్ట్రయిక్రేట్ అతని టాప్గేర్ను సూచిస్తోంది. అలాగని శ్రేయస్ అయ్యర్ ఏం తక్కువ కాదు. డచ్పై అతని ఆయుధం పుల్ షాట్లే. 128 పరుగుల్లో 42 ఆ షాట్లతో వచ్చినవే! అవే అతని సెంచరీని తేలిక చేశాయి. షార్ట్పిచ్ బంతులపై అయ్యర్ కనబరిచిన నైపుణ్యం మురిపించింది. ఏ బంతుల్ని ఎలా ఆడాలో... ఏవి వదిలేయాలో వివేకం చూపించాడు. అయితే కివీస్తో జరిగే సెమీస్లో మాత్రం అతనికి బౌన్స్, స్వింగ్ పరీక్షలు ఎదురవొచ్చు. తప్పకుండా న్యూజిలాండ్ నుంచి భారత్కు సవాల్ ఎదురవుతుంది. ప్రపంచకప్ కోసం బాగా సన్నద్ధమై వచ్చారు. వంద శాతం నిబద్ధతతో మెగా ఈవెంట్ ఆడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లో న్యూజిలాండ్ మోహరింపు కట్టుదిట్టంగా ఉంటోంది. భారత టాప్–3 కోసం ఇదివరకే కసరత్తు చేసే వుంటారు. ఇందులో ఏ సందేహం లేదు. బౌలింగ్ ఫ్రెండ్లీ వాంఖెడే పిచ్పై భారత బ్యాటర్లకు చేజింగ్ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే మనవాళ్లు బాగా ఆడితే ఎవరైనా ఏమీ చేయలేరు. -
CWC 2023 IND VS NZ Semi Final: ఏకైక మొనగాడు విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్కప్లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం. ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్లు (ప్రస్తుత వరల్డ్కప్తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్పై) నెగ్గి ఫైనల్స్కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్గా నిలిచింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారీ అంచనాలు కలిగిన ఈ మ్యాచ్లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందని అంచనాలు ఉండటంతో ఏ జట్టైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని భావిస్తుంది. ఈ పిచ్పై గతంలో పరుగుల వరద పారిన సందర్భాలు కోకొల్లలు. ఇదే టోర్నీలో భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకుని చేయరాని తప్పు చేసింది. అనంతరం ఫలితం (302 పరుగుల భారీ తేడాతో ఓటమి) అనుభవించింది. ఇది దృస్టిలో ఉంచుకుని ఇరు జట్లు టాస్ గెలిస్తే తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లకు దోహదపడగలరు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని పేస్ బౌలర్లు చూసుకుంటారు. ఈ పిచ్ తొలుత బ్యాటింగ్కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్లో పేస్ బౌలింగ్కు అంతగానే సహకరిస్తుంది. ఇది కూడా మనం ఇటీవలే చూశాం. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు తప్పక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటుంది. జట్టు ఏదైనా టాస్ గెలిచిందా.. సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక వాతావరణం విషయానికొస్తే.. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా రిజర్వ్ డే ఉంది. కాబట్టి వంద వాతం పూర్తి మ్యాచ్కు ఢోకా ఉండదు. మరి ఏ జట్టు గెలిచి ఫైనల్కు చేరుతుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో వేచి చూడాలి. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్డాగ్స్గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్తో సెమీస్లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
రోహిత్కు ఆఖరి వరల్డ్కప్.. ఇదే టోర్నీలో విరాట్ 50వ వన్డే సెంచరీ కొడతాడు..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అతని వ్యక్తిగత కోచ్ దినేశ్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ వయసుపై, ప్రస్తుత వరల్డ్కప్లో భారత విజయావకాశాలపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రోహిత్కు ఇదే చివరి వరల్డ్కప్ కావచ్చు. ప్రస్తుతం అతని వయసు 36 సంవత్సరాలు. తదుపరి వరల్డ్కప్ సమయానికి అతనికి 40 ఏళ్లు వస్తాయి. భారత క్రికెటర్లు ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడతారని నేననుకోను. రోహిత్కు కూడా అది తెలుసు. కాబట్టి అతను ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాడు. ఇదే సందర్భంగా దినేశ్ లాడ్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత వరల్డ్కప్లో కోహ్లి ఆడుతున్న తీరు చూస్తుంటే, ఇదే టోర్నీలో అతను తన 50వ వన్డే సెంచరీ చేస్తాడని అనిపిస్తుందని అన్నాడు. కాగా, ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిది వరుస విజయాలతో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ముంబై వేదికగా బుధవారం (నవంబర్ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ టోర్నీలో హిట్మ్యాన్, విరాట్ కోహ్లి సహా భారత బ్యాటింగ్ ఆర్డర్ అంతా భీకర ఫామ్లో ఉంది. టాప్-5లో నలుగురు బ్యాటర్లు ఇప్పటికే సెంచరీలు కూడా చేశారు. #WATCH | Indian Captain Rohit Sharma’s coach Dinesh Lad says "There are chances that this can be the last World Cup for Rohit Sharma. He is 36 years old and in the next 4 years, he will be 40. Usually, Indian cricketers don't play at that age. He wants to win the World Cup for… pic.twitter.com/kjeC3v05me — ANI (@ANI) November 13, 2023 కోహ్లి 2 సెంచరీలు చేయగా.. రోహిత్, శ్రేయస్, రాహుల్ తలో సెంచరీ బాదారు. శుభ్మన్ గిల్ సైతం 3 అర్ధసెంచరీలు చేసి పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుత జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే రాణించాల్సి ఉంది. బౌలింగ్లోనూ మనవాళ్లు చెలరేగిపోతున్నారు. మన పేస్ త్రయం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. బుమ్రా (9 మ్యాచ్ల్లో 17 వికెట్లు), షమీ (5 మ్యాచ్ల్లో 16 వికెట్లు), సిరాజ్ (12 వికెట్లు) కలిపి 45 వికెట్లు నేలకూల్చారు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్లు 30 వికెట్లు పడగొట్టారు. ఫీల్డింగ్లోనూ మనవాళ్లు మెరుపులు మెరిపిస్తున్నారు. కోహ్లి, రోహిత్ సైతం గత మ్యాచ్లో వికెట్లు తీసి పార్ట్టైమ్ బౌలింగ్కు సై అంటున్నారు. ఇన్ని అనుకూలతల నేపథ్యంలో భారత్ ఈసారి ప్రపంచకప్ గెలవడం ఖాయమని అంతా అంటున్నారు. ఈ విషయం తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాల్సిందే. -
CWC 2023: భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలోని మూడు నగరాల్లో పెద్ద స్క్రీన్లను (ఫేన్ పార్క్లను) ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద కాళీ మాత టెంపుల్ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, వైఎస్సార్ కడపలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లలో ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశామని, ఇందులో ప్రవేశం ఉచితం అన్నారు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది. -
CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా..?
వన్డే వరల్డ్కప్ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్కప్లో ఇదివరకే (లీగ్ దశలో) న్యూజిలాండ్ను ఓసారి ఖంగుతినిపించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ సైతం ప్రస్తుత వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్కు స్వర్గధామం.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్పై మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో భారత్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్లో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ అత్యంత కీలకం.. ఈ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటుంది. భారత్దే పైచేయి.. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్పై భారత్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. వరల్డ్కప్లో కివీస్దే ఆధిక్యత.. వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. సెమీస్లో వరుసగా రెండోసారి.. భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్కప్ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్ల బలాలు, బలహీనతలు.. ప్రస్తుత వరల్డ్కప్లో ఫామ్ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్ టచ్లో ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్గా చూస్తే, ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై గెలిచి సెమీస్కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్కు చేరిన కివీస్ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్ రవీంద్ర, అడపాదడపా డారిల్ మిచెల్ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం వరకు న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ కాన్వే వైఫల్యాలు కివీస్ను కలవరపెడుతున్నాయి. -
CWC 2023: బంగ్లాదేశ్కు లక్కీ ఛాన్స్
వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. బుధవారం (నవంబర్ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో (ముంబై) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన 8 జట్లు ఏవంటే..? వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన అనంతరం టాప్-8లో నిలిచే జట్లే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ బెర్త్ ముందుగానే ఖరారైంది. బంగ్లాదేశ్కు లక్కీ ఛాన్స్.. శ్రీలంకకు నిరాశ పాయింట్ల పట్టికలో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు నిరాశ ఎదురు కాగా.. ఈ జట్లతో సమానంగా వరల్డ్కప్లో రెండే మ్యాచ్లు గెలిచిన బంగ్లాదేశ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. 2002 ఎడిషన్ ఛాంపియన్ అయిన శ్రీలంక ప్రస్తుత వరల్డ్కప్లో పేలవ ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోవడంతో పాటు ఐసీసీ బ్యాన్కు కూడా ఎదుర్కొంటుంది. ఆపసోపాలు పడి అర్హత సాధించిన ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రస్తుత వరల్డ్కప్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని తుది దశ లీగ్ మ్యాచ్ల వరకు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండింది. అయితే ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకి ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ను ఖరారు చేసుకుంది. పాపం నెదర్లాండ్స్.. ప్రస్తుత వరల్డ్కప్లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ మిగతా మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్లకు నో ఛాన్స్.. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన ఐసీసీ ఫుల్ టైమ్ సభ్య దేశాలైన వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోయాయి. ఐసీసీ పెట్టిన మెలిక కారణంగా ఈ జట్లకు చుక్కెదురైంది. -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023: సిక్సర్ల టీమిండియా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్లను తలదన్ని..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పలు ప్రపంచకప్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్లో వ్యక్తిగత రికార్డులతో పాటు పలు టీమ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. నిన్నటి మ్యాచ్లో భారత బ్యాటర్లు 16 సిక్సర్లు బాదడంతో తొలిసారి ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ 200కు పైగా సిక్సర్లు నమోదు చేసింది. నెదర్లాండ్స్పై 16 సిక్సర్లు కలుపుకుంటే ఈ ఏడాది వన్డేల్లో భారత్ సిక్సర్ల సంఖ్య 215కు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టూ ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. ఇదే ఎడిషన్లో సౌతాఫ్రికా 200 సిక్సర్ల మార్కును తాకింది. సఫారీలు ఈ ఏడాది వన్డేల్లో 203 సిక్సర్లు బాదారు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో భారత్, సౌతాఫ్రికా మధ్యలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 2019లో 209 సిక్సర్లు బాదింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (2015లో 179 సిక్సర్లు), ఆస్ట్రేలియా (2023లో 165 సిక్సర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: 31 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
వన్డే వరల్డ్కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఆదివారం నెదర్లాండ్స్పై గ్రాండ్ విక్టరీతో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఓ రికార్డును భారత్ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్కప్ రికార్డును సమం చేశాడు. వరల్డ్కప్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు. 1987 వరల్డ్కప్లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. అనంతరం 1992 వరల్డ్కప్లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్తో జరిగిన నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. తాజాగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్కప్ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, విరాట్, రోహిత్, షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు, విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్లకు వికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: కుంబ్లే, యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన జడేజా
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ల పేరిట సంయుక్తంగా ఉండేది. 1996 వరల్డ్కప్లో కుంబ్లే, 2011 వరల్డ్కప్లో యువరాజ్ 15 వికెట్లు పడగొట్టాడు. తాజాగా జడ్డూ వీరిద్దరి రికార్డును అధిగమించి, వరల్డ్కప్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్గా అవతరించాడు. ఈ విభాగంలో కుల్దీప్ (14 వికెట్లు).. జడేజా, కుంబ్లే, యువరాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. కాగా, వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. 2011 ఎడిషన్లో అతను 9 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
CWC 2023 IND VS NED: అజేయ భారత్.. అరుదైన ఘనత
నెదర్లాండ్స్పై విక్టరీతో వన్డే వరల్డ్కప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. 2003 ఎడిషన్లో సాధించిన 8 వరుస విజయాల రికార్డును భారత్ ప్రస్తుత ఎడిషన్లో అధిగమించింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు 2003, 2007 ఎడిషన్లలో వరుసగా 11 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఈ జాబితాలో ఆసీస్, భారత్ల తర్వాత న్యూజిలాండ్ ఉంది. ఈ జట్టు 2015 వరల్డ్కప్లో భారత్ పూర్వపు రికార్డుతో సమానంగా వరుసగా 8 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. నెదర్లాండ్స్పై గెలుపుతో టీమిండియా తొమ్మిది వరుస విజయాల రికార్డుతో పాటు మరో ఘనత కూడా సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో తమ అత్యుత్తమ విజయాల రికార్డును ఈ గెలుపుతో సమం చేసింది. 1998లో 24 వన్డేల్లో విజయాలు సాధించిన భారత్.. ప్రస్తుత ఏడాది ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే ఆ మార్కును అందుకుంది. కాగా, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
CWC 2023: శ్రేయస్-రాహుల్.. జోడీ నంబర్ వన్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విజృంభించి నెదర్లాండ్స్ను 160 పరుగుల భారీ తేడాతో ఓడించారు. భారత గెలుపులో రాహుల్, శ్రేయస్ ప్రధానపాత్ర పోషించారు. ఈ జోడీ నాలుగో వికెట్కు అభేద్యమైన 208 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. ఈ క్రమంలో రాహుల్-శ్రేయస్ జోడీ వరల్డ్కప్ రికార్డు నెలక్పొంది. వరల్డ్కప్లో భారత్ తరఫున నాలుగు అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమంగా నిలిచింది. దీనికి ముందు 2015 వరల్డ్కప్లో ధోని, రైనా జోడీ జింబాబ్వేపై నెలకొల్పిన అజేయ 196 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉండింది. ఇదే వరల్డ్కప్లో ఆసీస్పై విరాట్-రాహుల్ జోడీ నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం ఈ విభాగంలో మూడో అత్యుత్తమంగా ఉంది. ఆతర్వాత 1996 వరల్డ్కప్లో కాంబ్లీ-సిద్దూ నెలకొల్పిన 142 పరుగుల భాగస్వామ్యం.. 1999 వరల్డ్కప్లో అజయ్ జడేజా, రాబిన్ సింగ్ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా నెదర్లాండ్స్పై కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి దోహదపడిన రాహుల్-శ్రేయస్ జోడీ నంబర్ వన్ జోడీ అనిపించుకుంది. -
11 ఏళ్ల తర్వాత వికెట్ తీసిన హిట్మ్యాన్.. ఇదే మ్యాచ్లో కోహ్లి కూడా..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పసికూనను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) రెచ్చిపోగా.. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి గెలిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచకప్లో తొలిసారి తొమ్మిది మంది భారత బౌలర్లు బౌలింగ్కు దిగారు. రెగ్యులర్ బౌలర్లతో పాటు విరాట్, రోహిత్, గిల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఫుల్టైమ్ బ్యాటర్లు బౌలింగ్ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చాలాకాలం తర్వాత బంతిపట్టిన విరాట్, రోహిత్ తలో వికెట్ పడగొట్టి, భారత అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించారు. విరాట్ తొమ్మిదేళ్ల తర్వాత.. రోహిత్ 11 ఏళ్ల తర్వాత వన్డే వికెట్ తీసి ఫ్యాన్స్కు దీపావళి కానుక అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) విరాట్.. స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీయగా, రోహిత్.. నెదర్లాండ్స్ టాప్ స్కోరర్ తేజ నిడమనూరు వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో విరాట్, రోహిత్ వికెట్ తీసిన వైనం రాహుల్, శ్రేయస్ మెరుపు శతకాలను సైతం మరుగున పడేసింది. రోహిత్ చివరిసారిగా 2012 ఫిబ్రవరిలో వన్డే వికెట్ తీశాడు. నాటి మ్యాచ్లో హిట్మ్యాన్ ఆసీస్ ఆటగాడు మాథ్యూ వేడ్ వికెట్ (క్యాచ్ అండ్ బౌల్డ్) దక్కించుకున్నాడు. రోహిత్ తన కెరీర్లో తొమ్మిది వన్డే వికెట్లు, రెండు టెస్ట్ వికెట్లు, ఓ టీ20 వికెట్ పడగొట్టాడు. -
టీమిండియాను ఓడించడం చాలా కష్టం: నెదర్లాండ్స్ కెప్టెన్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో రాణించి పసికూనపై పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో 410 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్లో టీమ్గా రాణించి ప్రత్యర్ధిని 250 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసి, లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది. మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కితాబునిచ్చాడు. ప్రస్తుత టోర్నీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. భారత్ పటిష్టమైన జట్టు అనడానికి, వారు సాధిస్తున్న విజయాలే నిదర్శనమని తెలిపాడు. భారత బ్యాటింగ్ విభాగాన్ని ఆకాశానికెత్తాడు. సొగసైన బ్యాటింగ్ లైనప్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్లో కొన్ని సందర్భాల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్లు ఎదురుదాడికి దిగి, మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసారని అన్నాడు. ఈ టోర్నీ చాలా కఠినంగా ఉండబోతుందని ముందే తెలుసు. శక్తివంచన లేకుండా ఆడాం. రెండు అద్భుత విజయాలు సాధించాం. పలు మ్యాచ్ల్లో గెలిచే అవకాశాలు కల్పించుకున్నాం. మరిన్ని విజయాలు సాధించాల్సి ఉండింది. ఓవరాల్గా మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నారు. ఈ టోర్నీ మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. చాలా నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టుగా ఎదగడానికి ఈ టోర్నీ చాలా సాయపడింది. టీ20 వరల్డ్కప్ 2024లోపు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో నెదర్లాండ్స్.. పటిష్టమైన సౌతాఫ్రికాను, తమకంటే మెరుగైన బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. -
మా విజయ రహస్యం అదే.. నెదర్లాండ్స్పై విజయానంతరం రోహిత్ శర్మ
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించి, లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పసికూన నెదర్లాండ్స్ను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఏకంగా తొమ్మది మంది బౌలర్లను ప్రయోగించిన రోహిత్ శర్మ దాదాపుగా అందరి నుంచి ఫలితం రాబట్టాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్,సూర్యకుమార్ యాదవ్లకు వికెట్ దక్కలేదు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (54) టాప్ స్కోరర్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఒక సమయంలో ఒకే గేమ్ గురించి ఆలోచించి, ఆ మ్యాచ్లో బాగా ఆడాలని అనుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నమెంట్ కాబట్టి చాలా దూరం చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కో మ్యాచ్ లక్ష్యంగా పెట్టుకుని, అందులో బాగా ఆడాలని అనుకున్నాం. అలాగే చేశాం. వివిధ వేదికపై పరిస్థితులకు అనుగుణంగా, అందరం కలిసికట్టుగా ఆడాం. ఫలితం సాధించాం. మా వరుస విజయాల వెనుక ఉన్న రహస్యం ఇదే. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కో సందర్భంలో బాధ్యతలు తీసుకుని సత్తా చాటడం శుభపరిణామం. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండాలంటే ఫలితాలు చాలా ముఖ్యం. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి జట్టు సభ్యులందరం కుటంబంలా మమేకమైపోయాం. ఒకరి కంపెనీని మరొకరం ఆస్వాదించాం. ప్రతి గేమ్నుసరదాగా, ఉత్సాహంగా ఆడాలని ప్లాన్ చేసుకున్నాం. అదే విజయాలకు దోహదపడింది. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఇదే మమ్మల్ని కాపాడింది. మాపై అంచనాలు చాలా ఉన్నాయి. మేము అన్నింటినీ పక్కనపెట్టి, తదుపరి టాస్క్పైనే (సెమీస్) దృష్టి పెట్టాలనుకున్నాం. తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంపై స్పందిస్తూ.. బౌలింగ్లో ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని భావించా. మాకు ప్రస్తుతం ఐదు మంది ఫుల్టైమ్ బౌలర్ల సేవలు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో ప్రయోగం చేస్తే పార్ట్ బౌలర్గా ఎవరు పనికొస్తారో తెలుస్తుందని అలా చేశా. దీనికి తోడు ఈ మ్యాచ్లో మా పేసర్లు అనవసరమైన వైడ్ యార్కర్లు వేశారు. అందుకే పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా నేను, గిల్, స్కై బరిలోకి దిగాం అని అన్నాడు. -
కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం.. వరల్డ్కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం సాధించాడు. ఈ మ్యాచ్లో 62 బంతుల్లోనే శతక్కొట్టిన రాహుల్.. వన్డే వరల్డ్కప్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఇదే వరల్డ్కప్ ఎడిషన్లో హిట్మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. నెదర్లాండ్స్పై సెంచరీతో రాహుల్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (1999లో శ్రీలంకపై 145 పరుగులు) తర్వాత వరల్డ్కప్లో సెంచరీ సాధించిన భారత వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వరల్డ్కప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోర్ చేసిన వికెట్కీపర్గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. వీరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్, విరాట్తో పాటు శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. -
IND VS NED: విరాట్ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు స్కోర్ 38 ఓవర్లు ముగిసిన అనంతరం 173/6గా ఉంది. ఎలా చూసినా ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలిచే అవకాశాలు లేవు. pic.twitter.com/tuz5dcN5Tw — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) November 12, 2023 కాగా, ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సమయంలో టీవీల్లో తారసపడిన పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సూపర్ టచ్లో కనిపించిన విరాట్ కోహ్లి 51 పరుగుల వద్ద వాన్ డర్ మెర్వ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో అతని భార్య అనుష్క శర్మ ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. కోహ్లి 50వ వన్డే సెంచరీ కోసం అతని కంటే అతని భార్య ఎక్కువగా పరితపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే మ్యాచ్లో తారసపడిన మరో సన్నివేశం సైతం నెట్టింట హల్చల్ చేస్తుంది. విరాట్ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన అనంతరం అతనికంటే అతని భార్య అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి విరాట్-అనుష్క వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోలో సైతం వీరిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇదిలా ఉంటే, విరాట్ వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును (49) బద్దలు కొట్టేందుకు కేవలం సెంచరీ దూరంలో ఉన్న విషయం తెలిసిందే. -
తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్.. ఏకంగా కెప్టెన్కే ఝలక్
వన్డేల్లో విరాట్ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్కు బంతినందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని విరాట్.. తన స్పెల్ రెండో ఓవర్లో వికెట్ తీసి అదరగొట్టాడు. విరాట్ పడగొట్టన వికెట్ సాదాసీదా వికెట్ కాదు. అతను ఏకంగా ప్రత్యర్ధి కెప్టెన్ స్టాట్ ఎడ్వర్డ్స్కే (17) ఝలక్ ఇచ్చాడు. వికెట్కీపర్ కేఎల్ రాహుల్ లెగ్సైడ్లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విరాట్కు చాలాకాలం తర్వాత వికెట్ దక్కింది. వికెట్ తీసిన అనంతరం విరాట్ సంబురాలు ఆకాశాన్ని అంటాయి. అతను సెంచరీ చేసినప్పుడు కూడా ఇంతలా సంతోషపడి ఉండడు. విరాట్ సాధించిన ఈ ఘనతను చూసి స్టాండ్స్లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఉబ్బితబ్బి బైపోయింది. ఆమె సంతోషానికి కూడా అవథుల్లేకుండా పోయాయి. వాస్తవానికి విరాట్కు అంతకుముందు ఓవర్లోనే వికెట్ దక్కాల్సి ఉండింది. అయితే స్లిప్లో ఫీల్డర్ను పెట్టకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. మొత్తంగా విరాట్ సాధించిన ఈ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. వన్డేల్లో విరాట్కు ఇది ఐదో వికెట్. అతను తన వన్డే కెరీర్లో అలిస్టర్ కుక్, కీస్వెట్టర్, డికాక్, మెక్కల్లమ్, స్కాట్ ఎడ్వర్డ్స్ల వికెట్లు పడగొట్టాడు. విరాట్ టీ20ల్లో (4), ఐపీఎల్లోనూ (4) వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్లో 411 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ ఓటమి దిశగా సాగుతుంది. ఆ జట్టు 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విరాట్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్ బౌలర్, చెత్త రికార్డు
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు మెరుపు వేగంతో 50 అంటకంటే ఎక్కువ స్కోర్లు చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఒకరికిమించి ఒకరు పేట్రేగిపోవడంతో నెదర్లాండ్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ లొగాన్ వాన్ బీక్ భారత బ్యాటర్ల విధ్వంసం ధాటికి బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన వాన్ బీక్ ఏకంగా 107 పరుగులు సమర్పించుకుని వరల్డ్కప్లో మూడో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్కప్ హిస్టరీలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు కూడా నెదర్లాండ్స్ బౌలర్ పేరిటే ఉండటం విశేషం. ప్రస్తుత వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బాస్ డి లీడ్ ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఆతర్వాత వరల్డ్కప్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. 2019 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ 110 పరుగులు సమర్పించుకున్నాడు. -
టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు వేగంతో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసి క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళి మజాను అందించారు. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) లక్షీ బాంబుల్లా విధ్వంసం సృష్టించగా.. రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చిచ్చుబుడ్లలా మెరుపు హాఫ్ సెంచరీలతో ఎగిసిపడ్డారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. వరల్డ్కప్ చరిత్రలో భారత్ 400 అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం ఇది రెండోసారి. 2007 వరల్డ్కప్లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఆ స్కోర్కు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓవరాల్గా వరల్డ్కప్లో అత్యధిక స్కోర్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. ఇదే ఎడిషన్లో సఫారీలు శ్రీలంకపై 428 పరుగులు చేశారు. వరల్డ్కప్ టాప్-5 అత్యధిక స్కోర్లలో భారత్ రెండు స్థానాల్లో (413, 410) ఉండటం విశేషం. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 48 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి ఇలా..
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని అరుదైన ఘనతను ఇవాల్టి మ్యాచ్లో సాధించింది. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు (రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్ రాహుల్) 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ మ్యాచ్లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు, ఇద్దరు సెంచరీలు చేయడం విశేషం. ఈ మ్యాచ్లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన వారు టాప్-5 బ్యాటర్లు కావడం మరో విశేషం. గతంలో వరల్డ్కప్యేతర మ్యాచ్ల్లో మూడు సార్లు ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. 2008లో (కరాచీ) జింబాబ్వేతో జరిగిన ఓ వన్డేలో ఐదుగురు పాక్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అలాగే 2013, 2020ల్లో జరిగిన మ్యాచ్ల్లో (జైపూర్, సిడ్నీ) భారత్పై ఐదుగురు ఆసీస్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశారు. కాగా, నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
Viral Video: టీమిండియా దీపావళి సంబురాలు అదుర్స్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్తో మ్యాచ్కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన ఈ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా మమేకమై ఎంజాయ్ చేశారు. We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX — BCCI (@BCCI) November 12, 2023 ఈ వేడుకల్లో విరాట్-అనుష్క దంపతులు స్పెషల్ అట్రక్షన్గా నిలిచారు. రోహిత్, కేల్ రాహుల్, జడేజా, శార్దూల్, సూర్యకుమార్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ చిన్న పిల్లాలలా సందడి చేశారు. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
కొనసాగుతున్న గిల్ మేనియా.. నెదర్లాండ్స్పై హాఫ్ సెంచరీతో..!
టీమిండియా యంగ్ గన్ శుభ్మన్ గిల్ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అరాచకమైన ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరల్డ్కప్ 2023లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) నమోదు చేసిన గిల్.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు. ఇందులో గిల్ ఒక్క వన్డేల్లోనే 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగులు (27 ఇన్నింగ్స్) సాధించడం విశేషం. గిల్ తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగలు (అన్ని ఫార్మాట్లు) చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (1712), కుశాల్ మెండిస్ (1690), డారిల్ మిచెల్ (1686), రోహిత్ శర్మ (1677) వరుసగా ఉన్నారు. కాగా, నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన గిల్, రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. గిల్కు ప్రస్తుత వరల్డ్కప్లో ఇది మూడో హాఫ్ సెంచరీ (7 మ్యాచ్ల్లో). నెదర్లాండ్స్తో మ్యాచ్లో రోహిత్ (61), గిల్తో పాటు విరాట్ (51), శ్రేయస్ (62 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 37 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 257/3గా ఉంది. శ్రేయస్కు జతగా కేఎల్ రాహుల్ (22) క్రీజ్లో ఉన్నాడు. -
CWC 2023: నెదర్లాండ్స్పై రోహిత్ హాఫ్ సెంచరీ.. ఒక్క ఫిఫ్టితో ఇన్ని రికార్డులా..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్తో ఇవాళ (నవంబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) నమోదు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న హిట్మ్యాన్ 9 మ్యాచ్ల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 503 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. హాఫ్ సెంచరీ అనంతరం హిట్మ్యాన్ అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నప్పటికీ, ఈ ఫీట్తో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డులు ఏవంటే.. వరుస వరల్డ్కప్లలో (2019, 2023) 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (59) బాదిన ఆటగాడిగా రికార్డు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు (23) బాదిన కెప్టెన్గా రికార్డు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక ఫోర్లు (58) బాదిన కెప్టెన్గా రికార్డు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు (503) చేసిన భారత కెప్టెన్గా రికార్డు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో 500 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు. వన్డేల్లో ఓ వేదికపై (బెంగళూరు) అత్యధిక సిక్సర్లు (31) బాదిన ఆటగాడిగా రికార్డు. సచిన్ (1996, 2003) తర్వాత రెండు వరల్డ్కప్ ఎడిషన్లలో 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు. వన్డే వరల్డ్కప్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (13) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ (21), కోహ్లి (14) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో మ్యాచ్లో రోహిత్ ఔటయ్యాక టీమిండియా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. కోహ్లి (46) హాఫ్ సెంచరీకి చేరువ కాగా.. శ్రేయస్ (23) ఆచితూచి ఆడుతున్నాడు. అంతకుముందు శుభ్మన్ గిల్ (53) మెరుపు హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 184/2. -
CWC 2023: నెదర్లాండ్స్ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం
నెదర్లాండ్స్ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం వన్డే వరల్డ్కప్ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్లో రోహిత్ సేన వరుసగా తొమ్మిదో మ్యాచ్లో విజయం సాధించింది. నెదర్లాండ్స్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్, విరాట్తో పాటు శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఆరో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 172 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ సిరాజ్ సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ (45)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 144 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. బాస్ డి లీడ్ను (12) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత విరాట్కు వికెట్.. వన్డేల్లో విరాట్ తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో అతను స్టాట్ ఎడ్వర్డ్స్ (17) వికెట్ పడగొట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 72 పరుగుల వద్ద నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో మ్యాక్స్ ఓడౌడ్ (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 66 పరుగుల వద్ద నెదర్లాండ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అకెర్మన్ (35) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి బరెస్సీ (4) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 5/1. రాహుల్, శ్రేయస్ మెరుపు శతకాలు.. టీమిండియా భారీ స్కోర్ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శతక్కొట్టిన రాహుల్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. బాస్ డి లీడ్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది రాహుల్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ ఈ మ్యాచ్లో మంచి టచ్లో కనిపిస్తున్న శ్రేయస్ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 346/3గా ఉంది. శ్రేయస్తో పాటు కేఎల్ (70) క్రీజ్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో రాహుల్కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లో ఆసీస్పై తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన రాహుల్ .. ఆతర్వాతి ఇన్నింగ్స్ల్లో మంచి ఆరంభాలే లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. 43 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 312/3గా ఉంది. శ్రేయస్ (86), రాహుల్ (51) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్.. హ్యాట్రిక్ శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో ప్రస్తుత వరల్డ్కప్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్లో శ్రేయస్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా (77), శ్రీలంకతో (82) జరిగిన మ్యాచ్ల్లోనూ శ్రేయస్ హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతకుముందు పాక్పై (53) కూడా ఫిఫ్టి కొట్టాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 244/3. శ్రేయస్ (56), కేఎల్ రాహుల్ (16) క్రీజ్లో ఉన్నారు. కోహ్లి ఔట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విరాట్ కోహ్లి (51) ఔటయ్యాడు. వాన్ డర్ మెర్వ్ బౌలింగ్లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 200/3. శ్రేయస్కు (30) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో తన వన్డే కెరీర్లో 71వ హాఫ్ సెంచరీని, ప్రస్తుత వరల్డ్కప్లో ఐదో ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా (9 మ్యాచ్ల్లో 592 పరుగులు) అవతరించాడు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/2. విరాట్ (50), శ్రేయస్ (30) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హిట్మ్యాన్ ఔట్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. బాస్ డి లీడ్ బౌలింగ్లో బరెస్సీకి క్యాచ్ ఇచ్చి హిట్మ్యాన్ వెనుదిరిగాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/2. కోహ్లి (12)కి జతగా శ్రేయస్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్మ్యాన్ ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో భీకరఫామ్లో ఉన్న రోహిత్ శర్మ మరో హాఫ్ సెంచరీ తన సాధించాడు. మీకెరెన్ బౌలింగ్ ఫోర్ కొట్టి హిట్మ్యాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో రోహిత్ ఈ ఫీట్ను సాధించాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/1గా ఉంది. రోహిత్తో పాటు విరాట్ కోహ్లి (3) క్రీజ్లో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 100 పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 11.5 ఓవర్ల వద్ద ఓపెనర్ శుభ్మన్ గిల్ ఔటయ్యాడు. అప్పటికే హాఫ్ సెంచరీ (51) పూర్తి చేసిన గిల్.. మీకెరెన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు. వన్డే ప్రపంచకప్-2023లో చివరి లీగ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా రెండు మార్పులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. సౌతాఫ్రికా మేనేజ్మెంట్ తబ్రేజ్ షంషి, మార్కో జన్సెన్లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీలను తుది జట్టులోకి తీసుకుంది. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్కీపర్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న రచిన్ బ్యాట్తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్కప్ రచిన్కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది.