Cyber Crime Police
-
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
సాక్షి,అనంతపురం : ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. నిన్న..రాజకీయాలకు స్వస్తి పలికిన నటుడు పోసాని కృష్ణ మురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసుల విచారణ చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు అందించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీసీ నేతలు ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అల్లు అర్జున్ అరెస్ట్: సోషల్ మీడియా పోస్ట్లపై పలు కేసులు
సాక్షి,హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం, పలువురు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై అభ్యంతరకర పోస్ట్లు పెట్టారు. ఆ పోస్ట్లపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.అయితే, దిల్సుఖ్నగర్ శివలింగనగర్కు చెందిన మగుడంపల్లి భాస్కర్ (40) తన భార్య రేవతి (39), కొడుకు శ్రీతేజ్ (9)తో కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్లోని లోయర్ బాల్కనీలో ఉండగా.. 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కిందపడిపోయారు. అప్పటికే రేవతి మరణించగా, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసులో ట్విస్టు
ముంబై: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై Dhruv Rathee మహారాష్ట్ర సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన పేరిట ఉన్న ఆ అకౌంట్ పేరడీదని, దానితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులు గుర్తించారు. దీంతో అకౌంట్ ఎవరది అనేది ధృవీకరణ చేసుకోవాల్సి ఉందని పోలీసులు అంటుఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి.. యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే పాసయ్యినట్లు సంబంధిత ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు సమాచారం పోస్టు చేసినట్లు సైబర్ విభాగం వెల్లడించింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అయితే తొలుత అది ధ్రువ్ రాఠీ ఖాతా అనుకున్నారంతా. అయితే ఆ ‘ఎక్స్’ అకౌంట్ బయోలో మాత్రం ‘‘ఇది ఫ్యాన్, పేరడీ ఖాతా. ధ్రువ్ రాఠీ అసలైన అకౌంట్తో దీనికి ఎటువంటి సంబంధం లేదు’’ అని రాసి ఉంది. దీంతో పోలీసులు ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. మరోవైపు ఆ ఖాతా నుంచి శనివారం మరో ట్వీట్ పోస్ట్ అయ్యింది. ‘‘సైబర్ విభాగం సూచనల మేరకు సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను. వాస్తవాల గురించి తెలియక వేరొకరి ట్వీట్లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు’’ అనే సందేశం ఉంది.As directed by @MahaCyber1, I have deleted all my posts and comments on Anjali Birla, I will like to apologize as I was unaware about the facts and copied someone else' tweets and shared it.🙏🙏 pic.twitter.com/Lbr3c9oGZV— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) July 13, 2024 -
ఫ్యామిలీ స్టార్పై నెగెటివ్ ప్రచారం.. విజయ్ ఫిర్యాదుపై క్లారిటీ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్- విజయ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై నెగెటివీటి కూడా పెద్దఎత్తున వైరలైంది. కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేయడంతో ఏకంగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే స్వయంగా థియేటర్ల వద్దకు వెళ్లి ఆడియన్స్ను కలిసి రివ్యూలు తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై సోషల్ మీడియా ఖాతాలపై విజయ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ సైబర్ క్రైమ్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఓ ఫోటో నెట్టింట వైరలవుతోంది. అయితే దీనిపై విజయ్ను ఆరా తీయగా.. అలాంటిదేం లేదని బదులిచ్చారు. ఆ ఫోటో కొవిడ్ టైంలో ఓ కార్యక్రమంలో తీసిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Checked with @TheDeverakonda. Fake report pic.twitter.com/AFTDe2pylv — Haricharan Pudipeddi (@pudiharicharan) April 10, 2024 -
పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీయల్ రిమాండ్కు తరలించారు. ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. జూదం, విలాసాలకు బానిసై డబ్బు కోసం మ్యాట్రిమోనీ యాప్లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఈక్రమంలో గతేడాది ఏప్రిల్లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ వాట్సాప్లో సంభాషణలు, చాటింగ్లతో ఆమెకు మాయమాటలు చెబుతూ నమ్మించాడు. ఈక్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పూర్తిగా విశ్వసించి.. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామని కోరింది. దీంతో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారని, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. సహాయం చేయాలని కోరడంతో ఆమె గతేడాది ఏప్రిల్ 30న రూ.2 లక్షలు నగదు ఇచి్చంది. దీంతో ఇద్దరూ ప్రకాశ్నగర్లోని ఓ హోటల్లో కలిశారు. ఇక అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సొమ్ముతో జూదం, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ చేసేవాడు. అప్పు చేసి మరీ.. ముత్తూట్ ఫైనాన్స్లో బంగారం రుణం, రూ.52 లక్షలు గృహరుణంతో పాటు మనీవ్యూ, పోస్ట్పే వంటి వ్యక్తిగత రుణ యాప్లలో లోన్లు తీసుకొని మొత్తం రూ.70 లక్షలు రాజేశ్కు ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్ను అరెస్టు చేసి, అతని నుంచి రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. -
హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా రౌడీ హీరోపై ఓ వ్యక్తి.. యూట్యూబ్ ఛానెల్ వేదికగా కొన్ని అసభ్యకర వార్తలు ప్రసారం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) ఇంతకీ ఏం జరిగింది? అనంతపురంకు చెందిన వెంకట కిరణ్.. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్ దేవరకొండని అవమానిస్తూ ఫేక్ వార్తల్ని ప్రసారం చేశాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచేలా, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానించేలా ఈ వీడియోలు ఉన్నాయి. వీటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే అసత్య వార్తల్ని ప్రసారం చేసిన వెంకట్ కిరణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ని డిలీట్ చేయించారు. భవిష్యత్లో ఇలా మరోసారి చేయకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. టార్గెటెడ్గా ఎవరు ఇలాంటి కామెంట్స్ చేసినా, అవమానిస్తున్నట్లు న్యూస్ టెలికాస్ట్ చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. (ఇదీ చదవండి: కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..) -
‘పార్సిల్ స్కాం పసిగట్టండి ఇలా..’
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయని వస్తువుల పేరుతో పార్సిల్ వచ్చిదంటూ అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు గుంజుతున్నారని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించి ఆ వివరాలతో వారికి పార్సిల్ వచ్చిందంటూ మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా అపరిచిత వ్యక్తులు పంపే పార్సిళ్లలో కొన్ని అక్రమ పదార్థాలు, వస్తువులు ఉంటున్నాయని... అడిగినంత డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బ్లాక్మెయిల్ చేస్తూ వీలైనంత డబ్బు గుంజుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్లు, ఫోన్కాల్స్పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలా గుర్తించాలంటే... ♦ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే అనుమానాస్పద వివరాలను, ఆర్డర్ చేయని వస్తువులు పార్సిల్గా వచ్చాయంటూ వచ్చే ఫోన్స్కాల్స్ను నమ్మొద్దు. ♦ మీకు పార్సిల్స్ వచ్చాయంటూ వచ్చే ఈ–మెయిల్స్లో పార్సిల్ పంపిన వారి అడ్రస్, ఫోన్ నంబర్లు పరిశీలించాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి పార్సిళ్లకు సంబంధించిన మెసేజ్లు వస్తే అవి నకిలీవని గుర్తించాలి. మెసేజ్లు, ఈ–మెయిల్స్లో అక్షర దోషాలు, అచ్చు తప్పులను గుర్తించాలి. అలాంటివి నకిలీవని గుర్తుంచుకోవాలి. ♦ మీరు ఆర్డర్ చేయని పార్సిళ్లకు, మీ పేరిట వచ్చిన పార్సిల్లో ఏవైనా అక్రమ వస్తువులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు డిమాండ్ చేసినా డబ్బు పంపొద్దు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చి ఫిర్యాదు చేయాలి. -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్నగర్, ఉత్తమ్నగర్ వెస్ట్, న్యూఅశోక్నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్కనల్, జజ్పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్యాప్ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్కు ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావును టార్గెట్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట డబ్బు కాజేయాలని చూశాను. కానీ, వీహెచ్ తెలివిగా వ్యవహరించి.. కేటుగాళ్లకు టోకరా ఇచ్చారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియన్ నేత వీహెచ్ను మోసగించేందుకు ఓ సైబర్ నేరగాడు యత్నించాడు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట వీహెచ్కు ఫోన్ చేసి.. ఆపదలో ఉన్నానని, గూగుల్పే ద్వారా డబ్బు పంపాలని సదరు వ్యక్తి అభ్యర్థించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి వీహెచ్.. హరిరామ జోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఫేక్ కాల్ అని వీహెచ్ నిర్ధారించుకున్నారు. అనంతరం.. ఫేక్ కాల్పై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాడు ఖమ్మం నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఇలాంటి కాల్స్, మెసేజ్ల ద్వారా సైబర్ కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా.. రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్లు తదితరాలకు సంబంధించిన గ్రూప్లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్తో.. తొలుత భరత్ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్లో ఉండే స్నేహితుడు ప్రశాంత్ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్కు పంపేవా డు. భరత్ తైవాన్లో ఉండే స్వాంగ్ లిన్కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
ఇన్స్టాల్ చేసే యాప్తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్ఫోన్ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్ఫోన్ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్ఫోన్కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
నంబర్ ఇక్కడ..వాట్సాప్ అక్కడ!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో ఉన్న సెల్ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్ను తమ స్మార్ట్ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్’పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సిటీ సైబర్క్రైమ్ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్లు సైబర్ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. ఒకరి పేరుతో ఉన్న సెల్ నంబర్కు సంబంధించిన వాట్సాప్ను వినియోగించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్ ప్రొవైడర్లు ఆ నంబర్ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోకున్నా లేదా బేసిక్ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్ నంబర్ పాత యజమాని వద్దే ఉండిపోతోంది. సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. సైబర్ నేరాల కోసం మరొకరి వాట్సాప్ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్లోని నంబర్లను తమ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకొని వాటిల్లో వాట్సాప్ యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. యాక్టివేట్ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్ చేయడంతోనే అవతలి వారి నంబర్తో వాట్సాప్ వీరి ఫోన్లలో యాక్టివేట్ అవుతోంది. విషయం ఫోన్నంబర్ వాడే వారికి తెలియట్లేదు. కష్టసాధ్యంగా దర్యాప్తు.. ఈ వాట్సాప్లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా వారి సంబందీకుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్ వోచర్లు డిమాండ్ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్కు సంబంధించిన ఫోన్ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది. అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్ యాక్టివేట్ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్లైన్లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది. నేరుగా సంప్రదించడం ఉత్తమం.. వాట్సాప్ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్నంబర్ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ -
ఓటీపీ..డబ్బంతా లూటీ
ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు. సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తతే రక్షా కవచం మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్) సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు : ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్) టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112 జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930 -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
సిటీ కంపెనీలకు ‘హిడెన్బర్గ్ బూచి’
సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
HYD: టోఫెల్లో మాస్ కాపీయింగ్పై దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: టోఫెల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. రూ. 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్ ఇస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టోఫెల్లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్కో విద్యార్థి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుని.. పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తోంది ముఠా. హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విచారణ ముగిసింది. బుధవారం సుమారు మూడు గంటలపాటు ఆయన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వార్ రూం కు నేనే ఇంఛార్జి గా ఉన్నాను. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు అని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూం ఇన్ఛార్జిగా తానే ఉన్నానని, అక్కడ జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ‘‘కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నాం. ఎవరినీ కించపరచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నాం. అలాగే.. సునీల్ కనుగోలుకు, వార్ రూంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మల్లు రవి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్ వార్ రూమ్లో ఏం జరుగుతోంది? -
‘స్మాల్ క్రెడిట్–బడ్డీ క్యాష్’ యాప్ను నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ లోన్యాప్ల దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలామంది యువత, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఈ లోన్యాప్లకు చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండానే ఈ యాప్లకు వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు ఇస్తున్నారు. అప్పు తీర్చిన తర్వాత కూడా ఈ యాప్ నిర్వాహకులు అదనపు డబ్బు కోసం మానసికవ్యథకు గురిచేస్తున్నారు. అయితే, ఇదే తరహాకు చెందిన ఒక యాప్ గురించి తెలంగాణ సైబర్ క్రైం పోలీసు విభాగం హెచ్చరిక జారీ చేసింది. ‘స్మాల్ క్రెడిట్–బడ్డీ క్యాష్’యాప్ మోసపూరితమైందని సైబర్ క్రైం కోఆర్డినేషన్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ను పెట్టింది. ‘ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ వ్యక్తిగత వివరాలు దొంగిలించి, మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేస్తారు’అని ఆ ట్వీట్లో సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. సైబర్ క్రైం ఫిర్యాదులకుగాను 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని వారు సూచించారు. -
నాపై కేసు పెట్టిన విషయం తెలియదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు. 'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు. చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్) -
కాంగ్రెస్ వార్ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్కు వ్యూహాలు మాత్రమే చెప్తాను. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’ :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘వార్ రూమ్’ కేసులో మల్లు రవి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం నమోదు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాయడం, సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజరవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినంటూ ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగా, వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు సోమవారం హాజరయ్యారు. గంట పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సాఫ్ట్వేర్.. హార్డ్వేర్గా మార్చకండి -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
ఇవాళ సునీల్ కనుగోలు టీమ్ సభ్యుల విచారణ
-
కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ను సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (ఎస్కే) కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్టాప్లను సీజ్ చేశారు. తన ఆఫీస్ నుంచి సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్లు పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో సునీల్ కార్యాలయంలోని సిబ్బందితో సెల్ఫోన్లు ఆఫ్ చేయించారు. గత కొంత కాలంగా ఎస్కే టీమ్ తెలంగాణ కాంగ్రెస్కు పని చేస్తోంది. చదవండి: (ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ) -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
నరేష్, పవిత్ర ఫిర్యాదు.. యూట్యూబ్ జర్నలిస్టుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్క్రైం పోలీసులు తెలిపారు. చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
-
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి పవిత్ర
-
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్లను అనేక యాప్లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్లోని అలెన్కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్కు చేరతాయి. అతను వాటిని అలెన్కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్లు హవాలా మార్గంలో దుబాయ్కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
వేలల్లో రుణం.. లక్షల్లో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజమహేంద్రవరానికి చెందిన దుర్గారావు దంపతులు, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన శివ రుణ యాప్ల వేధింపులు తాళలేక ఇటీవల చేసుకోవడం రాష్ట్ర వాప్తంగా కలకలం సృష్టించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది యాప్ల నిర్వాహకులు పంపిన అసభ్యకర మార్ఫింగ్ వీడియోలకు జడిసి అర్ధంతరంగా తనువు చాలించడం చర్చనీయాంశమైంది. కొంత మంది బాధితులు మాత్రమే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోనూ ఒక మహిళ తాను తీసుకున్న రూ.5 వేల రుణానికి రూ.12 వేలకుపైగా చెల్లించినా.. అసభ్య వీడియోలతో బెదిరించడంతో విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీసుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి. రుణయాప్ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మన ఫోన్చ్లోని కాంటాక్ట్ నంబర్లు, గ్యాలరీలోని ఫొటోలకు యాక్సెస్ను తీసుకుంటారు. తద్వారా మన కాంటాక్ట్లోని నంబర్లకు రుణం తీసుకున్న వారి గురించి చెడుగా ప్రచారం చేయడంతో పాటు గ్యాలరీలో నుంచి కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి భయపెడుతున్నారు. చైనా నుంచి ఆపరేట్ అవుతున్న ఈ రుణయాప్ల స్థావరాలు నేపాల్, బంగ్లాదేశ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో, దేశంలో స్థానికంగా ఉండే వివిధ వ్యక్తుల నుంచి కరెంట్, ఫర్మ్ బ్యాంకు అకౌంట్లను కొనుగోలు చేసి.. వీటి ద్వారా మొత్తం ఆర్థిక వ్యవహారాలను సాగిస్తున్నారు. తక్కువ రుణం ఇచ్చి, భారీగా వసూలు చేసి.. అందులో కొంత మొత్తాన్ని ఇక్కడ తమకు ఫర్మ్, కరెంటు అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్ కింద చెల్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని డాలర్లలోకి మార్చుకుని బిట్ కాయిన్స్ రూపంలో చైనాకు తరలిస్తున్నారు. ఈ అకౌంట్లన్నింటినీ ఆన్లైన్లో చైనా నుంచే నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ అకౌంట్ల నిర్వహణకు ఇక్కడి వారి నుంచి ఓటీపీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు హాంకాంగ్కు చెందిన కెవిన్ అనే వ్యక్తి సూత్రధారిగా తేలింది. ఇతనికి బ్యాంకు అకౌంట్లు విక్రయించిన వారు సుమారు 250 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఒక్కొక్కరి అకౌంట్ల ద్వారా రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లోన్ యాప్లు.. విష వలయాలు విశాఖకు చెందిన గిరి ఒక ఆటోడ్రైవర్. తొలుత ఒక రుణయాప్ నుంచి రూ.5 వేలు ఫిబ్రవరిలో రుణం తీసుకున్నాడు. అయితే, ఆయనకు నికరంగా డిపాజిట్ అయ్యింది రూ.3,500 మాత్రమే. అనంతరం వారి రుణాన్ని వారంలోగా చెల్లించేందుకు మరో రుణ యాప్ ద్వారా మరికొంత రుణం తీసుకున్నాడు. అయితే రుణం తీర్చినప్పటికీ మరింత చెల్లించాల్సిందేనంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపిస్తామంటూ బెదిరించసాగారు. దీంతో మొత్తం 13 రుణయాప్ల నుంచి సుమారు లక్ష రూపాయల మేర రుణం తీసుకున్నాడు. వీరికి ఏకంగా రూ.3,65,000 మేర చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఆగస్టులో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఒక రుణయాప్లో తీసుకున్న రుణానికి మించి భారీగా చెల్లించాల్సి రావడంతో మరొక రుణయాప్ను ఆశ్రయించేలా ఓ పథకం ప్రకారం వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. కెవిన్ లాంటి వారు సృష్టించిన విష వలయంలో ఎంత మేర ఇండియా కరెన్సీ బిట్కాయిన్స్ రూపంలో చైనాకు తరలిపోతోందో అంచనాలకు అందడం లేదు. 2 వేల మంది ఉద్యోగులు వాస్తవానికి మొదట్లో చైనా నుంచి ఆపరేట్ చేస్తున్న రుణయాప్ల నిర్వాహకులు శ్రీలంకలో కార్యాలయాలను ప్రారంభించారు. అయితే శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తమ స్థావరాలను నేపాల్, బంగ్లాదేశ్లకు మార్చారు. ఏకంగా 2 వేల మంది ఉద్యోగులతో పనిచేసే కార్యాలయాన్ని నేపాల్లో నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లో కూడా ఇదే తరహాలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక సెంటర్ నుంచి నిరంతరాయంగా రుణం తీసుకున్న వారికి బెదిరింపు కాల్స్ వెళుతుంటాయి. మరో సెంటర్ నుంచి రుణం తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలను పంపుతున్నారు. ఇక్కడ పని చేసే వారిలో అనేక మంది భారత్ నుంచి వెళ్లిన వారే. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ అన్నీ ఇండియా సిమ్కార్డుల నుంచే వస్తుండటం గమనార్హం. ఇండియా సిమ్స్ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ రుణ యాప్లను ఎవరూ ఆశ్రయించకుండా అవగాహన కల్పించడమే ప్రస్తుతం ప్రాధాన్యత అంశమని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. -
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్కు వేధింపులు
-
నైనా జైశ్వాల్కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్లు పంపుతున్న ఆకతాయి
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్ సోషల్ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్కు ఇన్స్ట్రాగామ్లో మెసేజ్లు చేశాడు. ఆ మెసేజ్లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్జైస్వాల్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ సుమారు 30–50 క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్ స్పీకర్గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీలో చేరగా.. ఫస్ట్క్లాస్లో పాసైంది. చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్కు మహేందర్రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
జూనియర్ ఆర్టిస్టుల పేరుతో 95 మంది దుబాయ్కి.. తీరా అక్కడకు వెళ్తే..
బెంగళూరు: విదేశాల్లో అధిక వేతనంతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 7 మందితో కూడిన అక్రమ ముఠాను అరెస్ట్ చేశారు. కొప్పళ కంప్లివాసి బసవరాజశంకరప్ప కళసద్, మైసూరు నజరాబాద్ ఆదర్శ అలియాస్ ఆది, తమిళనాడు సేలం రాజేంద్రనాచి ముత్తు, చెన్నై మారియప్పన్, పాండిచ్చేరి అశోక్, తిరువళ్లువర్ రాజీవ్, జేపీనగర చందు నిందితులని నగర జాయింట్ పోలీస్కమిషనర్ రమణ్గుప్తా తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 95 మంది మహిళలను జూనియర్ ఆర్టిస్టుల పేరుతో పాస్పోర్టులు తయారుచేయించి దుబాయ్కి పంపించారు. అక్కడ యజమానులు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో గాలింపు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 17 పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమించిన అత్త కూతురు కోసం దొంగతనానికి పాల్పడి..) -
‘ట్యాంపరింగ్’ కేసు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ విధివిధానాలు, డేటాబేస్ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని నంబర్ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని శుక్రవారం స్పష్టమైంది. -
నకిలీ డాక్టర్లా.. ‘విదేశీ’ వైద్యులా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డేటాబేస్ ట్యాంపరింగ్ నకిలీ వైద్యుల కోసమా? లేక విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చిన డాక్టర్ల కోసమా? ఇంటి దొంగలు ఎవరు? అనే కోణంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ హన్మంతరావు ఫిర్యాదు మేరకు బుధవారం నమోదైన ఈ కేసును ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కౌన్సిల్కు వెళ్లి సర్వర్ను పరిశీలించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు కచ్చితంగా ఈ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని, ప్రత్యేక నంబర్ తీసుకున్న తర్వాతే ప్రాక్టీసుకు అర్హులు అవుతారు. ఈ వైద్యులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడంతో పాటు తమ విద్యార్హతలు పెంచుకున్నప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఈ డేటాబేస్ను మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంటుంది. కాగా వైద్య విద్య పూర్తి చేసిన సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డి 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా తదనంతర కాలంలో ఈ డేటాబేస్ను ట్యాంపర్ చేసిన ఇంటి దొంగలు కొందరు సుభాష్, రామిరెడ్డి పేర్లను తొలగించి శివానంద్, దిలీప్కుమార్ అనే వారి పేర్లను చేర్చారు. అలాగే నాగమణి విద్యార్హతలు, శ్రీనివాస్ ఫొటో అవే పేర్లు గల కొత్తవారితో మార్చేశారు. ఈ నలుగురినీ 2016లో సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డిలకు కేటాయించిన నంబర్లను వినియోగించి కౌన్సిల్లో చేర్చేశారు. ఇలా వెలుగులోకి..: ఇటీవల ఓ వైద్యుడు తన పీజీని అప్డేట్ చేయించుకో వడానికి, మరో ముగ్గురు ఐదేళ్లు పూర్తి కావడంతో రెన్యువల్ కోసం వచ్చారు. అయితే వీరి దరఖాస్తుల్లోని వివరాలు, ఫొటో.. అప్పటికే డేటాబేస్లో ఉన్న వాటితో సరిపోలకపోవడంతో ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ పట్టాలు పొందిన వైద్యులు నేరుగా రిజిస్ట్రేషన్కు ప్రయత్నిస్తే బండారం బయటపడే ప్రమాదం ఉంటుంది. అలాగే చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన వాళ్లు నేరుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకుని, ప్రాక్టీసు మొదలుపెట్టే అవకాశం లేదు. మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కోవలకు చెందినవారే ఇంటి దొంగల సాయంతో డేటా బేస్ ట్యాంపరింగ్ చేయించి ఉంటారని, ఈ విధంగా మరెన్నో పేర్లు ట్యాంపర్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించాలంటే కౌన్సిల్లోని కంప్యూటర్లు, సర్వర్తో పాటు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 2016 తర్వాతే ఈ వ్యవహారం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు గడిచిన ఆరేళ్ల కాలంలో ఆ పేర్లతో రిజిస్టర్ అయిన, నమోదు చేసుకున్న డాక్టర్ల వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘రొమేనియా ఐపీ’.. బ్యాంకుకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో కీలకాంశాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూరోపియన్ దేశమైన రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్తో జావా స్క్రిప్ట్ ఫైల్(జేఎస్డబ్ల్యూ) పంపడం ద్వారా ఈ పని చేసినట్లు తేల్చారు. బ్యాంక్ డబ్బును ‘పంచుకున్న’గ్యాంగ్స్లో రెండింటిని పట్టుకున్న అధికారులు మరో రెండింటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అడ్మిన్ మెయిల్ను స్ఫూఫ్ చేసి... లక్నోకు చెందిన లక్కీ డార్క్ నెట్లో చేసిన ప్రకటనతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరిలో గతేడాది జూలైలో తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి రూ.1,96,88,136 కాజేసిన నైజీరియన్లు ఉన్నారు. అలా వీరికి హైదరాబాద్లోని కో–ఆపరేటివ్ బ్యాంకులపై అవగాహన ఉండటంతో ప్రాథమిక పరిశీలన చేసి మహేష్ బ్యాంక్ ను ఎంచుకున్నారు. రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్తో అంతర్జాతీయంగా సేవలు అందించే ఎం247 సంస్థ వీపీఎన్ను వాడుకున్నారు. వీటి ద్వారా గతేడాది నవంబర్లో మహేష్ బ్యాంకునకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోని కంప్యూటర్లకూ ఒకేసారి కీ–లాగర్స్ పంపారు. ఆ బ్యాంక్ అడ్మిన్ మెయిల్ ఐడీని స్ఫూఫ్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని నుంచి ఆర్టీజీఎస్ అప్డేట్ పేరుతో జేఎస్డబ్ల్యూ ఫైల్ పంపారు. బ్యాంక్ నెట్వర్క్కు సరైన ఫైర్వాల్స్ లేకపోవడంతో ఈ కీ–లాగర్స్తో కూడిన మెయిల్ కంప్యూటర్ల వరకు చేరింది. అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోవడంతో ప్రొసీడ్ అని కొట్టడంతో కీ–లాగర్స్ వారి కంప్యూటర్లలో ఇన్స్టాల్ అయిపోయాయి. దీని ద్వారానే గత నెల 22, 23 తేదీల్లో బ్యాంక్ చెస్ట్ ఖాతాకు సంబంధించిన రూ.12.93 కోట్లను స్వాహా చేశారు. పరారీలో నగరానికి చెందిన గ్యాంగ్స్... ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణుల సాయంతో ఆ రెండు కంప్యూటర్లనూ స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి హ్యాకర్లకు సంబంధించిన ఆ«ధారాలు సేకరించారు. యూపీ వాసి లక్కీతో పాటు నాగోల్లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కేపీహెచ్బీలోని ఫార్మాహౌస్లకు చెందిన కరెంట్ ఖాతాలను వినియోగించిన రెండు ముఠాలను ఇప్పటికే అరెస్టు చేశారు. మరో రెండు గ్యాంగ్స్ పరారీలో ఉన్నాయి. అంతర్జాతీయ దర్యాప్తు అవసరం అపెక్స్ బ్యాంక్, మహేష్ బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేయడానికి వాడిన ఐపీ అడ్రస్లు, వీపీఎన్ సర్వీస్లు ఒకటే. దాని కోసం అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. తొలుత ఎం247 సంస్థ నుంచి లాగిన్ వివరాలు తెలియాలి. అది కూడా అంతర్జాతీయ సంస్థ అయినందున ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. – నగర పోలీసు ఉన్నతాధికారి -
జారుకుందామని జారిపడ్డాడు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసు దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఒక నైజీరియన్ దాడి చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం అదుపులో ఉన్న మరో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లోని మూడో అంతస్తు బాల్కనీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు. దీంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పోలీసు అధికారులు గత నెల 22, 23 తేదీల్లో చోటు చేసుకున్న మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్పై.. అధికారుల ఫిర్యాదు మేరకు 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేయడం మినహా అరెస్టుల విషయంలో కీలక పురోగతి సాధించలేకపోయారు. నగదు బదిలీ అయిన ఖాతాదారులను, సూత్రధారులకు సహకరించిన వారిని మాత్రమే పట్టుకోగలిగారు. సూత్రధారులను పట్టుకోలేకపోవడం, తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు విభాగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. కీలకపాత్ర పోషించిన నైజీరియన్లు.. ఈ కేసులో ఆద్యంతం నైజీరియన్లు కీలకపాత్ర పోషించారు. సూత్రధారులు–పాత్రధారులు–ఖాతాదారుల మధ్య వీరే మధ్యవర్తిత్వం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెంగళూరులో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్లతో పాటు మణిపూర్కు చెందిన యువతి షిమ్రాంగ్ను పట్టుకున్నారు. ఢిల్లీ, ముంబైల్లోనూ కొందరు నైజీరియన్లను అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం ఢిల్లీలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందం మరికొందరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. వీరిలో కొందరిని ఇప్పటికే నగరానికి పంపగా.. ఓ వ్యక్తిని మాత్రం తాము బస చేసిన తెలంగాణ భవన్లోని రూమ్ నం. 401లో ఉంచింది. కీలకం కావడంతో తప్పించుకోవాలని... ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కిన ఇతడు అత్యంత కీలక నిందితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతడిని శుక్రవారం ఢిల్లీలోని కోర్టులో హాజరుపరచడంతో పాటు అనుచరులను పట్టుకోవాలని ప్రత్యేక బృందం భావించింది. అయితే శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నిందితుడు అక్కడ నుంచి ఎలాగో బాల్కనీలోకి వెళ్లి వాటర్ పైపుల ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే కింద ఉన్న పోలీసులు గుర్తించి అరవడంతో కంగారుపడ్డ నిందితుడు పట్టుతప్పి అక్కడున్న చెట్టు కొమ్మకు తగులుతూ కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని పోలీసులు..పక్కనే ఏపీ భవన్లో అందుబాటులో ఉన్న 108 వాహనం మొరాయించడంతో ఆటోలో రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు వ్యక్తి నైజీరియన్ కాదని, ఢిల్లీ (ఘజియాబాద్)కే చెందినవాడని చెప్తున్న పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. -
డార్క్ నెట్లో దండోరా వేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి సూత్రధారిగా ఉన్న ఉత్తరప్రదేశ్కు చెందిన లక్కీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయాలంటూ ఇతగాడు డార్క్ నెట్ ద్వారా నైజీరియన్లకు ఎర వేశాడని, వాళ్లు మరికొందరికీ విషయం చెప్పి తమతో కలుపుకున్నారని తేలింది. ఈ నేపథ్యంలోనే 128 బ్యాంకు ఖాతాల సమీకరణ జరిగిందని లక్కీ చెప్పాడు. మహేశ్ బ్యాంక్ స్కామ్ మొత్తం తన ద్వారానే జరిగితే ఎక్కువ గిట్టుబాటు అవుతుందని భావించానని, అయితే నైజీరియన్ హ్యాకర్ల ‘దండోరా’ వల్ల వాటాలు పెరిగిపోయాయన్నారు. ఇతడి సమాచారంతో సేవింగ్స్ ఖాతా తెరిచి ఈ నేరానికి సహకరించిన గోల్కొండ వాసి షానాజ్ బేగంను ముంబైలో పట్టుకున్నారు. లోపం గుర్తించాకే ఖాతాలు.. మహేశ్ బ్యాంకు విషయంపై నైజీరియన్లు డార్క్ నెట్ ద్వారానే లక్కీతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేయగలమన్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన మరికొందరు నైజీరియన్లనూ ఎంగేజ్ చేశారు. అంతటితో ఆగకుండా డార్క్ నెట్లోని అనేక క్రిమినల్ గ్రూపుల్లో తాము త్వరలో మహేశ్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేయబోతున్నామని, దాని ఖాతాదారులను తీసుకొచ్చే వాళ్లకు ‘లాభం’ ఉంటుందని ప్రకటించారు. దీంతో చాలామంది డార్క్నెట్ యూజర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగారు. కర్నూలుకు చెందిన వారి ద్వారా కేపీహెచ్బీలో ఫార్మా హౌస్ సంస్థను నిర్వహిస్తున్న సంపత్ కుమార్ను లక్కీ సంప్రదించగా.. మరో గ్యాంగ్ చెన్నైకి చెందిన వారి ద్వారా నాగోల్లోని శాన్విక ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు నవీన్కు టచ్లోకి వచ్చారు. వీరితో ఖాతాలు ఓపెన్ చేయించడంతోపాటు ఎవరికి వారుగా డబ్బు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. ఇలా బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి 4 ఖాతాలకు వచ్చిన డబ్బు 128 ఖాతాలకు బదిలీ అయింది. బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు.. 128 మందిని ఎంపిక చేసుకున్న లక్కీ, ఇతరులు వాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి వారు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రధాన హ్యాకర్లకు సంపత్కుమార్, షానాజ్ బేగం ఖాతాల వివరాలను లక్కీ అందించాడు. చెన్నై గ్యాంగ్ నవీన్ ఖాతా వివరాలిచ్చింది. ఇలానే వినోద్కుమార్ ఖాతా వివరాలను మరో ముఠా ఇచ్చింది. అలా ఏ ముఠాకు ఆ ముఠా చెస్ట్ ఖాతా నుంచి డబ్బును వీటిలో జమ చేయించుకున్నాడు. ఆపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఖాతాల్లోకి బదిలీ చేశారు. లక్కీ సహా ఇతర ముఠా నాయకులందరూ హ్యాకర్లకు చెల్లించాల్సిన వాటాను బిట్ కాయిన్ల రూపంలో పంపేశారు. ముగ్గురు నైజీరియన్లతో ఒప్పందం లక్కీకి అనేక సైబర్ నేరాలతో సంబంధం ఉంది. ఇంటర్నెట్లో ఉన్న డార్క్నెట్ పైనా పట్టుంది. గతంలో అనేకసార్లు వివిధ డేటాలను అందులో కొన్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు, సెప్టెంబర్ల్లో డార్క్నెట్లో ఉండే గ్రూపుల్లో ఓ సవాల్ విసిరాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇలా ఇతడికి ముగ్గురు నైజీరియన్లతో పరిచయమైంది. సర్వర్ను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని, కొట్టేసే మొత్తంలో కమీషన్ ఇస్తే పని చేసి పెడతామని వాళ్లు చెప్పారు. ఆపై ఓ ప్రత్యేక కీలాగర్స్ను రూపొందించి అనేక బ్యాంకులకు ఈ–మెయిల్ రూపంలో పంపారు. మహేశ్ బ్యాంక్ కంప్యూటర్లలోకి అది తేలిగ్గా ప్రవేశించడం, వాటిలో నిక్షిప్తం కావడంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపం నైజీరియన్లకు తెలిసింది. -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్లోని జమ్తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్ను..
సాక్షి, హిమాయత్నగర్: క్రికెట్ టోర్నీల్లో చాన్స్ ఇస్తామంటూ తనని ఓ వ్యక్తి మోసం చేశాడని మహిళా క్రికెటర్ ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన క్రికెటర్ ఓ వ్యక్తి వాట్సప్ కాల్ చేశాడు. మీరు చాలా బాగా క్రికెట్ ఆడతారని, మీ ఆట గురించి కొందరి కోచ్ల నుంచి సమాచారం తెలుసుకుని కాంటాక్టు అయ్యానన్నాడు. స్టేట్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్ లీగ్లో చాన్స్ ఇస్తామని, కొంత ఖర్చు అవుతుందని మాయ మాటలు చెప్పి దఫాలుగా రూ.1లక్షా 25వేలు కాజేశారు. మూడు నెలల్లో ఒక్క మ్యాచ్కు చాన్స్ ఇవ్వకపోగా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. -
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వారిపై ఫిర్యాదు!
బుల్లితెర యాంకర్, బిగ్బాస్-5 కంటెస్టెంట్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ రావడంతో భరించలేక పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగ, బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్బాస్ హౌస్లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. -
పునీత్ మరణంపై అవమానకర పోస్టులు, యువకుడి అరెస్ట్
Bengaluru Man Arrested For Offensive Comments On Puneeth rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 29) పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పుకు నివాళులు అర్పిస్తుంటే.. మరికొందరూ ఆకతాయిలు ఆయన మరణంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! మద్యం సీసాతో పునీత్ మరణాన్ని అపహస్యం చేస్తూ రిత్విక్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ వరుస పోస్టులు పెట్టాడు. అది గమనించిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషన్ కమల్ పంత్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఓ యువకుడిని అరెస్టు చేశాం. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్లో వెల్లడించారు. కాగా శుక్రవారం పునీత్ గుండెపోటుతో మృతి చెందిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన విషయం విధితమే. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక అలాగే నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు మద్యం సీసాను చేతిలో పట్టుకొని ‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.. ’అంటూ అవమానకర రీతిలో పోస్ట్ పెట్టాడు. దీంతో పునీత్ ఫ్యాన్స్ సదరు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The accused has been arrested and further legal action is being taken. https://t.co/uIEHFryfUk — Kamal Pant, IPS (@CPBlr) November 1, 2021 -
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ.. ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఓ ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు, మూడు సెల్ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్ తాను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్నంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. డీఆర్డీవోకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటానని, గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ కొంత కాలంగా పలువురిని మోసం చేస్తూ వస్తున్నాడు. తాజాగా విజయవాడ నగరానికి చెందిన న్యాయవాది కనకదుర్గకు భారీ స్థాయిలో టోకరా వేశాడు. తన ఇద్దరు పిల్లలకు డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో కనకదుర్గ పలు దఫాలుగా రూ.65 లక్షలను ఆన్లైన్ ద్వారా విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాకు పంపింది. నగదు తీసుకున్న తరువాత విద్యాసాగర్ కొన్నాళ్లు పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చిన కనకదుర్గ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు విజయవాడలో తిరుగుతున్న విద్యాసాగర్ను అరెస్టు చేశారు. బతుకంతా మోసాల మయమే.. మాయమాటలతో ప్రజలను మోసం చేయడమే జీవనాధారంగా చేసుకున్న విద్యాసాగర్ గతంలో పలువురిని ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2014లో నకిలీ భూమి దస్తావేజులను సృష్టించి నగరంలోని పలువురిని మోసం చేశాడు. దీనిపై ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదయింది. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసి రూ.17 లక్షలు కాజేశాడు. అదేవిధంగా డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరి నుంచి విద్యాసాగర్ నగదు వసూలు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. రైస్ పుల్లింగ్ యంత్రాలను సైతం కొందరికి విక్రయించి దుర్గాప్రసాద్ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించారు. -
శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సప్ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్గా) ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషాసైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. I would like to thank Commissioner of Police @chennaipolice_ Additional Commissioner of Police-Central Crime Branch and Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗 — Arya (@arya_offl) August 24, 2021 -
గేమింగ్ గోల్మాల్
చిత్తూరు అర్బన్: కరోనా కాలంలో వర్క్ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మి పలువురు మహిళలు మోసపోయారు. ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతూ అందులో పెట్టుబడి పెట్టి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. వీరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారించిన చిత్తూరు పోలీసులు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జి.శివకేశవ్ (33), రాగాల కృష్ణ చైతన్య (35), బచ్చు కిరణ్ (29), పరస శివప్రసాద్ (32)లను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను చిత్తూరు క్రైమ్ సీఐ రమేష్ మీడియాకు గురువారం వివరించారు. మోసాలకు పాల్పడతారు ఇలా... గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిషోర్ అనే యువకుడు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇతను పలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ను (ఏపీకే ఫైల్స్) రూపొందించాడు. ఇంట్లో ఉంటూ వర్క్ఫ్రమ్ చేసుకుంటూ ఆదాయానిచ్చే మార్గాలు చెబుతానంటూ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. వాటిని గమనించిన పలువురు మహిళలు వాట్సాప్ మెసేజ్ ద్వారా నవకిషోర్ను సంప్రదించగా ఓ ఆండ్రాయిడ్ ఫైల్ను పంపి, లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ గేమింగ్లోకి ప్రవేశించేలా చేశాడు. ఇక్కడ తొలుత రూ.10, రూ.50 పెట్టుబడి పెట్టమని చెబుతూ బెట్టింగులు ఆడిస్తూ రూ.700 వరకు లాభం వచ్చేలా..ఈ మొత్తం గేమింగ్ ఆడేవారి బ్యాంకు ఖాతా ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాడు. ఓ దశలో గేమింగ్ ఆడేవారి వద్ద రూ.50 వేలు ఉన్నా..దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఈ మొత్తం విత్డ్రా కావాలంటే బెట్టింగ్ కొద్దిగా పెంచాలని చెబుతూ దశల వారీగా రూ.వేలకు వేలు గేమింగ్లో పెట్టుబడి పెట్టించాడు. అరెస్టైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్ బాధితులు గేమింగ్లో పెట్టిన డబ్బులను కాజేయడానికి ఫిలిప్పీన్స్లో పైలట్ శిక్షణ తీసుకుని ఇటీవల తన సొంతూరుకు వచ్చిన ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన జి.శివకేశవ్ను రంగంలోకి దించాడు. బీటెక్ చదువుకున్న శివకేశవ్ తన స్నేహితులైన కృష్ణచైతన్య, కిరణ్ ద్వారా చీరాలలో షెల్టైల్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి దాదాపు 100 మంది నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా వారిపేరిట సిమ్కార్డులు కూడా తీసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామంటూ ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల యూజర్ ఐడీ, పాస్వర్డ్ను నవకిషోర్కు అందజేశాడు. ఇలా చేసినందుకు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున నవకిషోర్ ద్వారా శివకేశవ్ అతని స్నేహితులకు అందింది. తుదిగా గేమింగ్లో బాధితులు జమచేసిన నగదును ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా నవకిషోర్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ గేమింగ్ ఉచ్చులోకి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన మానస, బంగారుపాళ్యంకు చెందిన టి.హేమలత, చిత్తూరుకు చెందిన హర్షితలు చిక్కుకుని గత నాలుగు నెలల్లో రూ.3.10 లక్షలు మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ విభాగం నిందితులైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్లను చిత్తూరులో అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరైన మానస వెచ్చించిన రూ.61,500ను తిరిగి ఆమె ఖాతాకే పోలీసులు వేయించారు. నకిలీ ఖాతాల్లో ఉన్న రూ.5.13 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నవకిషోర్ను అరెస్టు చేయడానికి లుక్ అవుట్ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో బాధితులు, మోసగాళ్లకు అసలు పరిచయాలు లేకపోవడం, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడుకోకపోవడం కొసమెరుపు. -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
ఇన్సూరెన్స్ ఫ్రాడ్: పాలసీ క్లైమ్లు మార్చుకోండి.. లేదంటే?
సాక్షి, సిటీబ్యరో: ఢిల్లీ కేంద్రంగా నగరానికి చెందిన ఇద్దరిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని ఇన్సూరెన్స్ ఫ్రాడ్లో, మరొకరిని జాబ్ ఫ్రాడ్లో పట్టుకున్నారు. ఇరువురినీ మంగళవారం సిటీకి తరలించిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన భానుప్రతాప్ సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఇలా ఇతడి వద్దకు దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీ హోల్డర్ల వివరాలు వచ్చి చేరేవి. వీటి ఆధారంగా 2019లో నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు. ఈమె 2012లో రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకుని ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చారు. బాధితురాలితో మాట్లాడిన భాను ప్రతాప్ మీ పాలసీలకు సంబంధించిన క్లైమ్లు ఇప్పటికీ కంపెనీల పేరుతో ఉన్నాయని, తప్పనిసరిగా మీ పేరుతో మార్చుకోవాలంటూ చెప్పాడు. దానికోసం ముందుగా కొంత మొత్తం చెల్లించాలంటూ అసలు కథ మొదలెట్టాడు. దఫదఫాలుగా రూ.50 లక్షలు ఆమె నుంచి కాజేశాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం భాను ప్రతాప్ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది. అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేసి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చింది. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్లైన్స్లో ఉద్యోగాలంటూ... ఇండిగో ఎయిర్లైన్స్లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన కేసులో ఢిల్లీకే చెందిన రప్ కిషోర్ను సి టీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు నగరానికి చెందిన ఇద్దరి నుంచి ర.1.39 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా మో సాల కు పాల్పడిన ఇతడిని సైతం ఢిల్లీలో అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం పీటీ వారెంట్పై మంగళవారం సిటీకి తీసుకువచ్చి రి మాండ్కు పంపింది. ఇతడితో పాటు ఇన్సూరెన్స్ ఫ్రాడ్లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకు ని విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. -
తీన్మార్ మల్లన్నకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. ఆ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు. -
ప్రియాంక ఫిర్యాదు.. పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ చానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్ చానల్పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా మల్లన్న ఆదివారం న్యూస్లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీకి ప్రియాంక ఫిర్యాదు.. ఈ నేపథ్యంలోనే మల్లన్న.. ప్రవీణ్తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. సైబర్ క్రైమ్ పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తామని, ఆపై అరెస్టు చేయాలా? నోటీసులు జారీ చేయాలా? అనేది నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు మల్లన్న అభిమానులు క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది. -
తప్పుడు ఆధార్తో ఖాతా తెరిచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్లోని బ్రాంచ్లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్ను ఆన్లైన్లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్కార్డును అడ్రస్ ప్రూఫ్గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు. కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి.. అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్లో తేడాలు కనిపించకుండా హ్యాకర్గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
యూఎస్ కాన్సులేట్ కేసులో క్లారిటీ!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో అమెరికా వీసా కోసం స్లాట్ బుక్ చేస్తున్న కొందరు తమ వెబ్సైట్ను యాక్సస్ చేస్తున్నట్లు అనుమానం ఉందంటూ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని నమోదు చేశారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు అప్పట్లో వేర్వేరుగా కాన్సులేట్లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ఆన్లైన్ దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించిన నేపథ్యంలోనే స్లాట్ దొరికిందంటూ చెప్పారు. దీని నిమిత్తం తాము వారికి రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున చెల్లించామని కాన్సులేట్ అధికారులతో పేర్కొన్నారు. దీంతో తమ అధికారిక వెబ్సైట్ను యాక్సస్ చేస్తున్న కొందరు వీసా స్లాట్స్ బుక్ చేస్తున్నారని, ఆ దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటూ మైఖేల్ పీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజ, కృష్ణ జిల్లావాసి ప్రభాకర్లు ఇలా దరఖాస్తులు నింపినట్లు గుర్తించారు. వీరిద్దరినీ ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక ఎలాంటి నేరం లేదని బయటపడింది. బీటెక్ పూర్తి చేసిన వీళ్లు గూగుల్ క్రోమ్లో అందుబాటులో ఉండే అలెర్ట్ వ్యవస్థను వాడుకున్నారు. వీసా స్లాట్స్ను విడుదల చేసిన యూఎస్ కాన్సులేట్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తుంది. దీన్ని క్రోమ్ ద్వారా గుర్తించే గూగుల్ వీరికి అలెర్ట్ ఇస్తోంది. ఆ సమయంలో తమ వద్ద ఉన్న దరఖాస్తుదారుల వివరాలతో ఆన్లైన్లో అప్లై చేస్తున్న వీరిద్దరూ స్లాట్స్ ఇప్పిస్తున్నారు. దీనికోసం కొంత రుసుము తీసుకుంటున్నారు. ఒక్కోసారి క్రోమ్ అలెర్ట్ కాని సందర్భాల్లో తాము రోజుకు 17 గంటలు కంప్యూటర్ ముందే, కాన్సలేట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని గడుపుతామని వెల్లడించారు. కాన్సులేట్ అధికారులను సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించిన దర్యాప్తు అధికారులు ఈ క్రోమ్ అలెర్ట్ విధానంపై వీరిద్దరితో డెమో ఇప్పించారు. నేరమా? కాదా? ఈ నేపథ్యంలోనే ఇందులో ఎక్కడా తమ వెబ్సైట్ను యాక్సస్ చేయడం లేదని కాన్సులేట్ అధికారులకు స్పష్టమైంది. అయితే స్లాట్స్ ఇప్పించి, దరఖాస్తు పూర్తి చేస్తున్నందుకు రుసుము వసూలు చేయడంపై మాత్రం కాన్సులేట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు తేజ, ప్రభాకర్లకు నోటీసులు ఇచ్చి పంపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి న్యాయ నిపుణుల అభిప్రాయానికి పంపాలని నిర్ణయించారు. వీరి నుంచి వచి్చన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలని..
ఇల్లు కట్టుకునేందుకు ఆ దంపతులు రూ. కోటికి పైగా అప్పులు చేశారు. కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయడంతో చేసేదిలేక ఒక్కో కిడ్నీ అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీ అవసరమైన వాళ్ల నెంబర్కోసం గూగుల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుని రూ. 40 లక్షలు పోగొట్టుకున్నారు. దెబ్బమీద దెబ్బపడటంతో ఆ దంపతులు విలవిల్లాడుతున్నారు. హిమాయత్నగర్: ఎం.ఎస్.మక్తాలో నివసించే మోడీ వెంకటేష్, లావణ్యలకు ఇద్దరు పిల్లలు. బుక్స్టాల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తాము ఉండే ప్రదేశంలో ఓ ఖరీదైన ఇల్లును నిర్మించుకున్నారు. దీనికి రూ.కోటి పైనే అప్పులు చేశారు. గత ఏడాది, ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో బుక్స్టాల్ వ్యాపారం మూతపడింది. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. చేసేది లేక ఆ దంపతులు తమ ఒక్కో కిడ్నీని అమ్మి, కష్టాల నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి... కిడ్నీ అవసరమైన వాళ్లకోసం ఆ దంపతులు గూగుల్లో సెర్చ్ చేయగా ఓ ఫోన్ నంబర్ దొరికింది. అతడికి కాల్ చేయగా.. ఢిల్లీలోని ‘హోప్ కిడ్నీ సెంటర్’లో మీ కిడ్నీ తీసుకునేలా ఏర్పాటు చేస్తాను, ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు వచ్చేలా సహకరిస్తానని నమ్మించాడు. ఇందుకు గాను ప్రాసెసింగ్, వైద్యుల కమీషన్ తదితర వాటికి రూ.4 లక్షలు ఇవ్వమని కోరాడు. దీంతో ఆ దంపతులు ఆ మొత్తం చెల్లించారు. అనంతరం మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బు పంపించడం మానుకున్నారు. అనంతరం మరోసారి గూగుల్లోనే వెతికి ఇంకో నంబర్ను సంప్రదించారు. అతను కూడా వీరిని నమ్మించి రూ.9 లక్షలు కాజేశాడు. ఇలా నాలుగు పర్యాయాలు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో రూ.40 లక్షలు జమచేశారు. చివరకు మోసపోయామని గ్రహించి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డేటింగ్ యాప్లో ఫొటోతో నటికి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కొందరు పోకిరీలు తన ఫొటోను డేటింగ్ యాప్లో పెట్టారంటూ సినీ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. చదవండి: నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2! -
‘సేఫ్’ జోన్లోకి సైబర్ వాంటెడ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడిక్కడ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. ఏ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని స్థితి.. ఏ రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో వాంటెడ్గా ఉన్న ఉత్తరాది నిందితులు తాత్కాలికంగా సేఫ్ జోన్లోకి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టు కోసం బయటి ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సైబర్ క్రైమ్ అధికారులే కాదు.. టాస్్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో మూడు రకాలవే ఎక్కువగా ఉంటాయి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) క్రైమ్స్తో పాటు కాల్ సెంటర్ ఫ్రాడ్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే నిందితులుగా ఉంటున్నారు. కేవలం వ్యక్తిగత కక్షలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలో రిజిస్టరయ్యే అతి తక్కువ కేసుల్లో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటారు. ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్లోని మేవాట్ రీజియన్లో ఉన్న ఆల్వార్, భరత్పూర్... ఓటీపీ ఫ్రాడ్ స్టర్స్కు ఝార్ఖండ్లోని జామ్తార, దేవ్ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్కతా అడ్డాలుగా మారాయి. ఇలాంటి కేసుల్లో సూత్రధారులు చిక్కడం కష్టసాధ్యమైనా కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చేవారిని ఎక్కువగా అరెస్టు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఈశాన్య రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, బెంగళూరు, పశి్చమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మూడు కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్తూనే ఉండేవారు. ప్రతి నెలా కనీసం పది పదిహేను రోజులు ఏదో ఒక బృందం అక్కడ గాలింపులు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేసుకువచ్చేది. ప్రస్తుతం కరోనా కేసుల విజృంభణ, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆంక్షలు, లాక్డౌన్లు అమలులోకి వస్తాయో తెలియని పరిస్థితులతో దర్యాప్తు, అరెస్టుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అత్యవసర, కీలక కేసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి ఇప్పటి వరకు దాదాపు 600 మంది వరకు సెకండ్ వేవ్లో కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు కన్నుమూశారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచి్చన వారిలో వాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల్లో నిందితుల్ని అరెస్టు చేసే విషయంలో టాస్్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. అరెస్టు చేసిన ప్రతి నిందితుడికీ పీపీఈ కిట్ ధరింపజేయడం తప్పనిసరి చేశారు. -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్కతా సమీపంలోని డమ్డమ్లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
రూ.5 కాయిన్కు రూ.5 లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు. నగదు చెల్లించిన తర్వాత అది మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాత కరెన్సీ నాణేలు, నోట్లు ఖరీదు చేస్తామని నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల ఓ బల్క్ సందేశం వచ్చింది. నాణెం వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన రూ.5 నాణేన్ని రూ.5 లక్షలకు, రూ.10 నాణేన్ని రూ.10 లక్షలకు ఖరీదు చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన వద్ద రూ.5 నాణేలు 4 ఉన్నాయంటూ నగరవాసి చెప్పడంతో నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్నులు చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించడంతో జీఎస్టీ సహా వివిధ పేర్లు చెప్పి రూ.39 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో.. నగరానికి చెందిన మరో వ్యక్తి తన వద్ద ఉన్న పట్టు చీరలు విక్రయించేందుకు ఈ– యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో దాని ఫొటోతో ప్రకటన ఇచ్చారు. సదరు చీరను రూ.8300 విక్రయిస్తానంటూ అందులో పేర్కొన్నారు. ఆ చీరను తాను ఖరీదు చేస్తానని సైబర్ నేరగాడు చెప్పాడు. నగదు మొత్తాన్ని గూగుల్ పే రూపంలో పంపిస్తానని నమ్మబలికాడు. ఇలా ఓ క్యూఆర్ కోడ్ను పంపి స్కాన్ చేయాలంటూ చెప్పాడు. నగరవాసి అలాగే చేయడంతో ఇతడి ఖాతాలోకి నగదు రావడానికి బదులు.. ఖాతా నుంచి డబ్బు కట్ అయి సైబర్ నేరగాడికి చేరిపోయింది. ఇలా మొత్తం రూ.84 వేలు కాజేశాడు. బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్కాల్.. -
పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ డైరెక్టర్ వీరస్వామి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ సినిమా యూట్యూబ్లో అప్లోడ్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరస్వామి డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా ఏప్రిల్ 28 ఏం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించారు. సినిమా దర్శకుడు వీర స్వామి చదవండి: ట్రోలింగ్: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్ తీసుకున్నావ్.. 100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’ -
‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు
సాక్షి, హైదరాబాద్: అన్లైన్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్ అధికారులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు. దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్పోర్ట్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్ వీసాకు ఆన్లైన్లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు. -
పుట్టగొడుగుల్లా ‘పాస్పోర్ట్ సైట్స్’
సాక్షి, హైదరాబాద్: పాస్పోర్ట్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని టార్గెట్గా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను పెద్ద సంఖ్యలో రూపొందించారు. ప్రధానంగా పాస్పోర్టులను రెన్యువల్ చేయించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్న నగరవాసులు మోసపోతున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు రోజుకు ఒకటి చొప్పున వస్తున్నాయని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్కు చెందిన వ్యక్తి నకిలీ వెబ్సైట్ వల్లోపడి రూ.2999 నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాస్పోర్టులను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న నగరవాసులు నేరుగా రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే పాస్పోర్ట్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సర్వర్ ఆధారంగా పని చేస్తుండటంతో (www.passportindia.gov.in) అనే అడ్రస్తో పని చేస్తుంటుంది. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు (www.indianpassport.com), (www.indiapassport.ind.in), (passportindianonline.com),(onlinepassportservice.com) పేరుతో నకిలీ వెబ్సైట్స్ రూపొందించారు. పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవే నిజమైనవిగా భావిస్తున్న నగరవాసులు వాటిలోకి ప్రవేశిస్తే... కొన్నిసార్లు ఆయా సైట్లకు వేరే వాటికి డైరెక్ట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ లోకి వెళ్తున్న బాధితులు తన పూర్తి వివరాలు పొందుపరచడంతో పాటు రుసుము చెల్లించేస్తున్నారు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కనిపించడంతో బాధితులు ఆయా సైట్స్ నకిలీవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా 40 మంది మోసపోతే ఒక్కరే ఫిర్యాదు చేస్తుంటారని అధికారులు తెలిపారు. అత్యధికులు నష్టపోయింది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా బాధితులు డబ్బు కోల్పోవడమే కాకుండా విలువైన వ్యక్తిగత డే టాను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ వెబ్సైట్ల మూలాలు కనుక్కోవడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాస్పోర్ట్ కోసం, రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెబ్సైట్లను పూర్తిగా సరిచూసుకున్నానే వివరాలు నింపడం, రుసుము చెల్లించడం చేయాలని సూచిస్తున్నారు. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్లేటర్ ఇంద్రజిత్ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్తో ఈ అనర్థాలు తప్పవు) -
సెల్ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో పెట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. ⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్పూర్లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్ఫోన్లు, సూరత్లోని ఓ మొబైల్ షాప్లో 180 సెల్ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు. ⇔ నంబర్ ప్లేట్ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్ఫోన్ షాప్లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు. ⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముంబై పోలీసుల సహకారంతో... ⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ⇔ షోలాపూర్ టోల్ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. ⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్ఫోన్లను ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. -
డేటింగ్ యాప్: అందమైన అమ్మాయిలతో..!
సాక్షి, గచ్చిబౌలి : డేటింగ్ అంటూ యాప్లో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి చీటింగ్కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీపీ వి.సి.సజ్జనార్ వెల్లడించారు. షాద్నగర్కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ డేటింగ్ యాప్ను ఓపెన్ చేశారు. పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. కొద్ది సేపటికే రీమా అనే యువతి ఫోన్ చేసి విదేశీయులకు సహాయంగా వెళ్లేందుకు మేల్ ఎస్కార్ట్ జాబ్ ఉందని చెప్పింది. మాటల్లో పెట్టి డేటింగ్ కోసం అందమైన అమ్మాయిలను పంపుతామని నమ్మించింది. యువతి మాయమాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి మొదట రూ. 2,500 ఆన్లైన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాయినింగ్ ఫీజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, వీఐపీ మెంబర్షిప్లు, ప్రోడక్ట్ పర్చేజ్ ఫీజ్, లేట్ పీజ్, ఇన్సూ్యరెన్స్, రీఫండ్ అమౌంట్ పేరిట ఏకంగా రూ. 13,83,643 ఆన్లైన్లో చెల్లించారు. చదవండి: ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా.. డేటింగ్ కోసం మీ ప్రాంతంలో అమ్మాయిలు అందుబాటులో లేరని బుకాయిండంతో తన వెనక్కు ఇవ్వాలని అడిగారు. చెల్లిస్తామని చెప్పి ఫోన్ పెట్టేసిన తరువాత ఆ ఫోన్ కలవక పోవడంతో మోసాన్ని బాధితుడు సెప్టెంబర్ 18న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ చెందిన మరో వ్యక్తి ఆ వెబ్సైట్ ఓసెన్ చేసి మొబైల్ నంబర్, పేరు ఎంటర్ చేశారు. త్రిష అనే యువతి మాట్లాడి మొదట ఎస్కార్ట్ జాబ్ ఇస్తామని, తరువాత మాటల్లో పెట్టి అమ్మాయిలను డేటింగ్కు పంపిస్తామని నమ్మబలికింది. రూ. 1,500 ఆన్లైన్లో చెల్లించాడు. మెంబర్ షిప్, జీఎస్టీ అంటూ వివిధ పేర్లు చెప్పి బ్యాంక్ అకౌంట్కు ఆన్లైన్లో రూ. 1,15,700 చెల్లించాడు. మాయ మాటలుగా గుర్తించి అక్టోబర్ ఒకటిన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి అమ్మాయిలతో కాల్సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్ రెండు వారాలపాటు రెక్కీ.. ఐదుగురు అరెస్ట్ పోలీసులు తమ విచారణలో వెస్ట్ బెంగాల్లోని సిలిగురి కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం సిలిగురి వెళ్లి రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించి ఏబీసీ ఫైనాన్స్ బోర్డు పెట్టుకొని కాల్సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పర్యవేక్షకులుగా పని చేస్తున్న సిలిగురికి చెందిన బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్నూర్ అలమ్ అన్సారీ, మేనేజేర్లు దీప హల్దార్(27), షికా హల్దార్(22)లను స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 11న అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, 31 సెల్ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు సంతు దాస్, అమిత్ పాల్, శశాంక్ కుమార్లు పరారీలో ఉన్నారు. రోజుకు రూ. కోటి మేర మోసం డేటింగ్.. చీటింగ్ కేసులో నేపాల్కు చెందిన సంతుదాస్ కింగ్ పిన్గా వ్యవహరిస్తున్నాడు. నేపాల్ నుంచి వచ్చి సిలిగురిలో నివాసం ఉంటున్నాడు. డేటింగ్ పేరిట చీటింగ్కు పాల్పడే 35 కాల్ సెంటర్లు సిలిగురిలో నిర్వహిస్తూ రోజు దాదాపు కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడుతున్నారని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. భవనం అద్దెకు తీసుకొని బిజయ్, బినోద్ పర్యవేక్షణలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఫోన్లో మాట్లాడే యువతులకు రోజు చేసే బిజినెస్లో 10 శాతం ఇస్తారు. బిజయ్ కుమార్ అకౌంట్లోకి డబ్బు వచ్చిన వెంటనే తమకు రావాల్సిన మొత్తం ఉంచుకొని మిగతా డబ్బును వెంటనే సంతుదాస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. కస్టమర్లతో మాట్లాడిన సిమ్లను తీసి పడేస్తారు. పోలీసులు విచారణ చేస్తున్నారని చిన్నపాటి అనుమానం వచ్చినా కాల్ సెంటర్లు మూసివేసి సంతుదాస్ నేపాల్కు వెళ్లి పరిస్థితులు చక్కబడే వరకు తలదాచుకుంటాడు. ప్రధాన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. డేటింగ్ యాప్లను ఓపెన్ చేయొద్దు.. డేటింగ్ యాప్లను ఓపెన్ చేయవద్దని, తెలియని వ్యక్తులకు వ్యక్తి గత సమాచారం ఇవ్వొద్దని, ఆన్లైన్ డబ్బులు చెల్లించవద్దని కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సైబర్ క్రైం బృందాన్ని అభినందించి రివార్డు అందజేశామన్నారు. సమాశంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్ఐ రాజేంద్ర, ఏఎస్ఐ శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అశ్లీల వీడియో లింక్ పంపిన అటెండర్ తొలగింపు
తిరుపతి సెంట్రల్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింక్లను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలక మండలి సదరు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసు బృందం రంగంలోకి దిగింది. శతమానం భవతి వివరాలు కోరగా.. ఎస్వీబీసీ ప్రసారం చేసే శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభ సందర్భాల్లో పురోహితులు ఆశీర్వచనాలు అందిస్తారు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఈ కార్యక్రమం వివరాలు పంపాలని కోరగా ఎస్వీబీసీ కార్యాలయం సిబ్బంది ఒకరు అశ్లీల వీడియో లింక్ పంపినట్లు గుర్తించారు. మెయిల్ తెరిచి చూసి నిర్ఘాంతపోయిన భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ తిరుపతి అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి సుమారు 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించింది. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షుణ్నంగా విచారణ కొనసాగుతోంది. కంప్యూటర్ల సెక్యూరిటీ ఆడిట్.. అశ్లీల వీడియోను మెయిల్ చేసిన అటెండర్ను విధుల నుంచి తొలగించినట్లు ఎస్వీబీసీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో భాగంగా ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నలుగురు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైబర్ సెల్ టీం విచారణలో ప్రాథమికంగా తేలిందని, పూర్తి వివరాలు పరిశీలించాక విధుల నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక టీటీడీ పర్యవేక్షణలో.. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ విభాగాన్ని టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్కు పాస్వర్డ్ ఏర్పాటు చేసి ఎవరు వినియోగిస్తున్నారో నమోదు చేస్తామన్నారు. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తామని చెప్పారు. -
రాజస్తాన్ గ్యాంగ్; హైదరాబాద్ పోలీసుల సాహసం!
సాక్షి, హైదరాబాద్: ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రాజస్తాన్కు వెళ్లారు. స్థానిక భరత్పూర్ జిల్లాలోని కళ్యాణ్పురి, చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రాజస్తాన్కు చెందిన ముఠా ఓఎల్ఎక్స్లో వాహనాల ఫొటోలు పెట్టి, తక్కువ ధరకే అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎంతోమంది బాధితులు మోసానికి బలైపోయారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు, వారిని వెదుక్కుంటూ రాజస్తాన్కు వెళ్లారు. పది మంది సభ్యులు గల ఈ బృందానికి భరత్పూర్ జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేసే వంద మంది స్థానిక పోలీసులు కూడా జతకలిశారు.(చదవండి: ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు) వీరంతా కలిసి, కళ్యాణ్పురి, చౌ వేరా గ్రామాల్లో తలదాచుకున్న నిందితుల ఇళ్లపై రైడ్ చేశారు. విషయం తెలుసుకున్న నేరగాళ్ల ముఠా, వారి కుటుంబ సభ్యులు పోలీసులపై ఎదురుదాడికి దిగి, వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో, అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బృందాలు, వాజిత్ ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్ ఇర్ఫాన్, రాహుల్, అజరుద్దీన్, తారీఫ్ ఖాన్, ఉమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల క్రితం 8 మందిని అరెస్టు చేయగా, నేడు 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
అమ్మాయిలతో కాల్సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలో ఉన్న కాల్ సెంటర్పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 మంది యువతులకు 41 సీఆర్పీ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. ఆనంద్కర్, బుద్దపాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నుంచి 2 ల్యాప్టాప్లు, 24 సెల్ఫోన్లు, 51 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్పూర్ గ్యాంగ్ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ మార్కెటింగ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. (చదవండి: పాదరసం.. అంతా మోసం ) -
లాక్డౌన్లోనూ ‘పవర్’ ఫుల్ గేమ్!
సాక్షి, హైదరాబాద్: ‘కలర్ ప్రిడిక్షన్’ పేరుతో భారీ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడిన బీజింగ్ టీ పవర్ సంస్థ లాక్డౌన్ సమయంలోనూ కాసులవేటను సక్సెస్ ఫుల్గా కొనసాగించింది. గత ఏడాది జరిగిన లావాదేవీల కంటే ఈ ఏడాది తొలి ఏడున్నర నెలల్లో జరిగినవే అత్యధికమని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్ హూతోపాటు ఢిల్లీకి చెందిన అంకిత్, ధీరజ్లను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. బీజింగ్ టీ పవర్ సంస్థ గుర్గావ్ కేంద్రంగా 2019–20ల్లో దాదాపు 40 డమ్మీ కంపెనీలను రిజిస్టర్ చేయించింది. వీటిలో 90 శాతం భారతీయ డైరెక్టర్లు ఉండగా.. 10 శాతం చైనావాళ్ళు ఉన్నారు. ఈ 40 కంపెనీల్లోనూ కామన్గా ఉన్న డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువ. ఈ సంస్థలు గత ఏడాది రూ.500 కోట్ల మేర దందా చేయగా ఈ ఏడాది ఆగస్టు మొదటి వారానికే రూ.1100 కోట్లకు చేరింది. ఈ కంపెనీలు దళారుల సహకారంతో, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అత్యధికంగా యువకులు, గృహిణుల్ని ఆకర్షించి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సొమ్ము బీజింగ్ టీ పవర్ సంస్థతోపాటు బీజింగ్ టుమారో సంస్థకూ వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఎవరు? అనే అంశాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. యాన్ హూ అరెస్టు విషయం తెలిసిన వెంటనే చైనాకు చెందిన డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీలకు పేమెంట్ గేట్ వేలుగా వ్యవహరించిన పేటీఎం, క్యాష్ ఫ్రీ సంస్థల ప్రతినిధులు సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయా సంస్థలు చట్టబద్ధంగా ఈ–కామర్స్ వ్యాపారం అని చెప్పడంతోనే తాము సేవలు అందించామంటూ వీరు సమాధానం ఇచ్చారు. తమ పేమెంట్ గేట్ వేస్ను ఆ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం లేదని వివరించారు. మరోపక్క చంచల్గూడ జైల్లో ఉన్న యాన్ హూ, అంకిత్, ధీరజ్లను నాలుగు రోజుల విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంస్థలకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.50 కోట్లను ఫ్రీజ్ చేశారు. -
కత్తి మహేష్పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్పై సైబర్క్రైమ్ పోలీసులు శుక్రవారం మరోసారి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్ను పిటీ వారెంట్పై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కత్తి మహేష్ చంచల్గూడ జైలులో ఉన్నారు. గతంలో శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్లు పెట్టిన కేసులో కత్తి మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్లు పెట్టిన కత్తి మహేశ్ను ఆగస్టు 15న సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి : శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు) -
ఢిల్లీ టు చైనా.. వయా కెనడా
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్కు పాల్పడిన కలర్ ప్రిడిక్షన్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న యేహూ అనే చైనీయుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. మరో కీలక నిందితుడు హేమంత్ కోసం గాలిస్తున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ ఈ కలర్ ప్రిడిక్షన్ గేమ్ వెనుక ఉంది. దీనికి అనుబంధంగా ఢిల్లీలోని గుర్గావ్లో ఓ కార్యాలయం పని చేస్తోంది. చైనాకు చెందిన యే హూను తమ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్గా బీజింగ్ టీ పవర్ సంస్థ నియమించింది. ఇతడు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ–కామర్స్ సంస్థల పేరుతో అప్పటికే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నమోదై ఉన్న గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రెవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రెవేట్ లిమిటెడ్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్యన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, డాకీపే ప్రెవేట్ లిమిటెడ్, స్పాట్పే ప్రెవేట్ లిమిటెడ్, డైసీలింగ్ ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ల కార్యకలాపాలు ఇతడు పర్యవేక్షిస్తున్నాడు. ఢిల్లీవాసులు హేమంత్, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో..: కలర్ ప్రిడిక్షన్ గేమ్ వలలో చిక్కి నష్టపోయిన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు పేమెంట్ గేట్వేస్పై దృష్టి పెట్టారు. పేటీఎం, గూగుల్ పేల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషించారు. బెట్టింగ్కు సంబంధించిన నగదు తొలుత డాకీ పే సంస్థకు, అక్కడ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బ్యాంక్కు లేఖ రాసిన దర్యాప్తు అధికారులు రూ.30 కోట్ల బ్యాలెన్స్ ఉన్న రెండు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. తమ కార్యకలాపాలపై పోలీసుల కన్ను పడిందని తెలుసుకున్న అతడు తక్షణం తమ దేశానికి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో... కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ నుంచి చైనాకు విమాన సర్వీసులు నడవట్లేదు. దీంతో కెనడాకు టికెట్ బుక్ చేసుకున్న యేహూ అక్కడ నుంచి చైనా వెళ్లాలని పథకం వేశాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీ విమానా శ్రయంలో సిటీ సైబర్ క్రైమ్ బృందానికి చిక్కాడు. మరోపక్క ఈ కలర్ ప్రిడిక్షన్ నిర్వాహక సంస్థ బీజింగ్ టీ పవర్ సంస్థ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి యేహూను తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1,100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించిన నేపథ్యంలో మనీలాండరింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ–కామర్స్ పేరుతో బెట్టింగ్ నిర్వహించిన ఆ ఎనిమిది సంస్థలూ జీఎస్టీ లేదా ఆదాయపుపన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయా విభాగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. -
శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతూ సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్ శ్రీరాముడిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్పై గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలల అశ్లీలతకు సంబంధించిన అంశాలు, చిత్రాలు, వీడియోల కోసం ఇంటర్నెట్లో వెతికారంటే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ (ఎస్సీఆర్బీ)లో ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. గూగుల్లో చైల్డ్పోర్న్కు సంబంధించిన కీ వర్డ్స్ తో సర్చ్ చేసినా, బాలల అశ్లీలతకు సంబంధించిన వెబ్సైట్లలోకి వెళ్లినా వెంటనే ఈ సెల్ సదురు ఐపీ(ఇంటర్నెట్ ప్రొటోకాల్)ని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన ఐపీలను ఆయా రాష్ట్రాల్లోని సీఐడీ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఆయా నగరాలు, పట్టణాలకు ఆయా సమాచారాన్ని పంపించి, నిందితులను పట్టుకుంటున్నారు. ఇలా హైద్రాబాద్లో గురువారం ఇద్దరు యువకులను సిటీ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ మోహన్రావ్ బృందం అరెస్ట్ చేసింది. తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి బాలలకు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేశాడు, వాటిని తన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాడు. అలాగే కాచిగూడకు చెందిన ప్రశాంత్కుమార్ ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి అక్కడ బాలలకు సంబంధించిన అశ్లీల ఫోలోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని ఇతర సైట్లలో అప్లోడ్ చేశాడు. ఆయా ఐపీలను రికార్డ్ చేసిన ఎన్సిఆర్బీ వాటిని రాష్ట్ర సీఐడీకి పంపించింది. ఆ సమాచారం హైద్రాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు అందడంతో ఐపీ చిరునామాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన సైబర్క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మరో 12 మందికి సంబంధించిన ఐపీలపై కూడా సైబర్క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో శోధన చేసే వారికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఎన్సీఆర్బీకి ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి. ఇంటర్నెట్ వాడేవారు ఈ కీవర్డ్స్ పై తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సైబర్క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
అతడు.. ఆమె.. ఓ అన్న!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్స్ట్రాగామ్లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు. ఆపై పెళ్లి ప్రస్తావన.. చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్స్ట్రాగామ్లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్స్ట్రాగామ్లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. మూడో పాత్రలోకి దిగి.. ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
ఫోన్ హ్యాక్.. #*#4636#*#* ఇది డయల్ చేస్తే
కుత్బుల్లాపూర్: కరోనా మహమ్మారితో కలవరపడుతున్న ప్రజలను సైబర్ క్రైమ్స్ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలవడం వంటి పరిమాణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో కొంత మందికి వచ్చే కాల్స్తో వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్ కోడ్స్, ఓటీపీ హ్యాక్.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే 2019 సంవత్సర కాలంలో సైబర్ కేసులు మొత్తం 477 నమోదైతే 2020లో గడిచిన ఐదు నెలలో 485 కేసులు నమోదవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్లో ఎక్కువగా కేసులు పెరిగాయి. 2016 నుంచి ఇప్పటి వరకు నమోదైన 1,636 సైబర్ కేసుల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిలో బాధితులు అసలు మాకు బ్యాంక్ ఓటీపీ రాలేదని, అయినా మా ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్పడం చూస్తుంటే మనం వాడే ఫోన్ని సైతం ఎలా హ్యాక్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము బదిలీ కావాలంటే ముఖ్యమైంది బ్యాంక్ వారు పంపే ‘ఓటీపీ’నే. అయితే ఈ ఓటీపీ మన ఫోన్కు రాకుండానే ఖాతా ఖాళీ అవుతుందంటే మన ఫోన్ హ్యాక్ అయ్యిందా అన్నది ఓ సారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన ఫోన్ హ్యాక్ అయ్యిందా..? అవలేదా..? అయితే ఎలా మళ్లీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి..? వంటి సెక్యూరిటీ అంశాలు మీ కోసం.. ఇలా తెలుసుకోండి.. #*#4636#*#* : ఇది డయల్ చేస్తే మన ఫోన్లోని పూర్తి టెక్నికల్ వివరాలు అంటే సిగ్నల్ స్ట్రెంత్, మొబైల్ సెక్యూరిటీ, కాల్ ఫార్వడింగ్ వివరాలు, బ్యాండ్ విడ్త్, లోకల్ ఏరియా వివరాలు ఇలా మీ ఫోన్లో ఉన్న చిన్నచిన్న వివరాలు అన్ని చూపిస్తుంది. ఈ కోడ్ ద్వారా మన ఫోన్ సిమ్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. నోట్: ఈ కోడ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కో ఫోన్లో ఒక్కో మోడల్ను అనుసరించి ఫ్లాష్ మెసేజ్లు కనిపిస్తాయి. తదనుగుణంగా మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా పైకోడ్స్లో ఏవి డయల్ చేసినా ‘ఎనబల్’ అని కనిపిస్తే ఫార్వర్డింగ్లో ఉన్నట్లు లెక్క.. అయితే కాల్ ఫార్వర్డింగ్ వేన్ నాట్ రీచబల్ అని వస్తే సదరు నెంబరును సరి చూసేకుని అది మీకు సంబంధించినది అయితే అలాగే కంటిన్యూ అవ్వవచ్చు. ఇలా తెలుసుకోండి.. ♦ మన ఫోన్ నుంచి మనకు తెలియకుండా ఎవరికైనా కాల్ ఫార్వర్డ్ అవుతుండటం, ఎస్ఎంఎస్లు వెళ్తుండటం వంటి విషయాలను డయల్ ప్యాడ్ నుంచి కొన్ని కోడ్స్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ♦ #21# ఈ కోడ్ ఎంటర్ చేసి డయల్ చేస్తే మీ ఫోన్ కాల్ ఫార్వర్డ్ అవుతుందా? కాల్ డైవర్షన్ వంటివి జరుగుతున్నాయా లేదో తెలుసుకోవచ్చు. డయల్ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్పై ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్ బాక్స్లో మన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఫార్వడింగ్ అని వస్తే మీ మొబైల్ హ్యాక్ అయిపోయినట్లే. ♦ #62# ఫార్వడింగ్ అని వస్తే ఈ కోడ్ డయల్ చేయాలి. ఈ కోడ్ని రిపిటెడ్గా మూడుసార్లు చేస్తే మీ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఏమైనా ఫార్వడింగ్ ఆగిపోతాయి. ♦ #002# ఈ కోడ్ని డయల్ చేస్తే ఎప్పటికీ మన ఫోన్ నుంచి కాల్స్ ఫార్వర్డ్ అవ్వవు. ముఖ్యంగా సిమ్ అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్లో వేరే ఫోన్ నంబరు వాడే వారికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా కాల్ ఫార్వడింగ్ ఉంటే అన్ని ఎరైస్ అయిపోతాయి. -
కేటీఆర్ ఆదేశం: మీరా ఫిర్యాదుపై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హీరోయిన్ మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తున్న 15 ట్విటర్ హ్యాండిల్స్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అకౌంట్లను ఉపయోగిస్తున్న సభ్యులకు నోటీసులు పంపించారు. అంతేకాకుండా అసభ్యకర ట్వీట్లు చేసిన ఆ 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (ఎన్టీఆర్ ఫ్యాన్స్పై కేసు నమోదు) తాజాగా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు ట్విటర్ వేదికగా ఈ నటి ఫిర్యాదు చేశారు. ‘మీ రాష్ట్రానికి చెందిన కొందరు నాపై సామూహిత అత్యాచారం, యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళలకు రక్షణ కల్పిస్తారని, దీనిపై విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్, కవితలకు మీరా చోప్రా ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ చేసిన ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా జతచేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మేడమ్ మీరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్శాఖను కోరాను’ అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన మీరా చోప్రా మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని మరోసారి విజ్ఞప్తి చేశారు. (మంత్రి కేటీఆర్కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా) ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ మీరా చోప్రాకు అండగా నిలిచారు. (ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న నటుడు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 -
మంత్రి కేటీఆర్కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగైదు రోజులుగా మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై మీరాచోప్రా మరోసారి మంత్రి కేటీఆర్, కవితకు ట్విటర్ ద్వారా ట్వీట్ చేశారు. ' నన్ను గ్యాంగ్ రేప్ చేస్తామని, యాసిడ్ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్కు ఫిర్యాదు చేశాను. మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా' అంటూ తెలిపారు (ఎన్టీఆర్ ఫ్యాన్స్పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 కాగా దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు.' మేడం.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఆదేశించాను.' అంటూ తెలిపారు. కేటీఆర్ ట్వీట్కు మీరాచోప్రా రీట్వీట్ చేస్తూ..'థ్యాంక్యూ కేటీఆర్ సార్.. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై నేరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచకూడదు!' అంటూ పేర్కొన్నారు. మీరా చోప్రా ట్వీట్ల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ట్విటర్లో చేసిన అసభ్యకరమైన ట్వీట్లను పోలీసులు తొలగించారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తించి వారిపై 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపై ట్విటర్లో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలుసులు పేర్కొన్నారు. Thanks sir, it really means a lot. This is very important for women safety. These people should not be left free to do crimes on women! 🙏🙏 https://t.co/HzQcRHPEAd — meera chopra (@MeerraChopra) June 5, 2020 అసలు ఏం జరిగిందంటే.. జూన్ 1న మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్పై కేసు నమోదు
తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్పై చర్యలు తీసుకోవాలంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం నాడు అభిమానులతో చిట్చాట్ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనడంతో ఈ వివాదం రాజుకుంది. తానసలు ఆ హీరో ఫ్యాన్ కాదన్నందుకు ఆమెపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దూషణలకు దిగుతూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె వాటి స్క్రీన్షాట్లను సైబర్ క్రైమ్ పోలీసులకు ట్వీట్ చేసింది. తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ట్వీట్ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు 67 యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద హీరో అభిమానులపై కేసు నమోదు చేశారు. (ఎన్టీఆర్ ఫ్యాన్స్పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) This is my main concern. What is stopping these stars to come out and talk abt cyber bullying, slut shaming done by their fan clubs. Is it that they dont care or they have lost spine?? https://t.co/pDF74hUPo6 — meera chopra (@MeerraChopra) June 3, 2020 అసభ్యంగా కామెంట్లు చేసిన వారి ట్విటర్ అకౌంట్లను గుర్తింంచే పనిలో పడ్డారు. అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు. కాగా ఈ ఘటనపై గాయని చిన్మయితో పాటు, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ సైతం మీరా చోప్రాకు మద్దతు పలికారు. మీరా చోప్రాపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ట్విటర్ అకౌంట్లను తొలగించాల్సిందిగా ట్విటర్ను కోరారు. (హీరోయిన్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) 🙏 https://t.co/NA0aLw45Ol — meera chopra (@MeerraChopra) June 3, 2020 -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్పై ఫిర్యాదు
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను దూషించిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులు కావడం దురదృష్టకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొందరు పచ్చిగా తిడుతూ చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు పంపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరా చోప్రా ఫిర్యాదుతో అసభ్య ట్వీట్లను పోలీసులు తొలగించారు. (హీరోయిన్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు) అంతకుముందు ఎన్టీఆర్కు మీరా ట్వీట్ చేస్తూ దీనిపై స్పందించాలని కోరారు. ‘తారక్... నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్ స్టార్ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని మీరా పేర్కొన్నారు. కాగా, తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో మీరా చోప్రా నటించిన విషయం తెలిసిందే. (65 ఏళ్ల వారికి షూటింగ్కి అనుమతి లేదు!) Ntr fans tweeting about #gangbang!! And some more abusive tweets @NCWIndia @hydcitypolice @CyberCrimeshyd pic.twitter.com/x6VlC2lKYB — meera chopra (@MeerraChopra) June 2, 2020 @tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl — meera chopra (@MeerraChopra) June 2, 2020 -
జూనియర్ NTR ఫ్యాన్స్పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
-
బాలికను వేదిస్తున్న ‘ఈ–పోకిరీ’ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ వేదికగా ఓ మైనర్ను వేధిస్తున్న సైబర్ పోకిరీపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. స్పందించిన అధికారులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన బిలాల్ ఇన్స్ట్రాగామ్లో మారుపేరుతో ఖాతా తెరిచాడు. దీని ఆధారంగా అనేక మంది యువతులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వారితో తొలినాళ్లలో స్నేహపూర్వకంగానే వ్యవహరించే వాడు. ఆ తర్వాత అసభ్యకర, అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇలా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరైనా బిలాల్ను బ్లాక్ చేస్తే.. మరోకొత్త పేరుతో, వేరే ఖాతా తెరిచేవాడు. ఇలా ఇంతకు ముందు తనను బ్లాక్ చేసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. యాక్సెప్ట్ చేస్తే మళ్లీ వేధింపులు మొదలెట్టేవాడు. ఈ రకంగా బిలాల్ ఇప్పటి వరకు 15 ఇన్స్ట్రాగామ్ ఖాతాలు తెరిచినట్లు తేలింది. బిలాల్ వేధింపులు తారాస్థాయికి చేరడంతో ఇతడిని ఫాలో అవుతున్న వారి లిస్ట్ ఆధారంగా ఒకరితో మరొకరు సంప్రదించుకున్నారు. ఫలితంగా ఇతగాడు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో వారంతా కలిసి బిలాల్ను మందలిస్తూ, ఇదే ధోరణి కొనసాగితే తాము పోలీసులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అయినా అతడి వ్యవహారశైలిలో మార్పు రాలేదు. దీంతో ఇటీవల ఓ బాలిక ఆన్లైన్ ద్వారా సిటీ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడు బిలాల్ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై ఐటీ యాక్ట్తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పెళ్లి పేరుతో రూ.12.5 లక్షలు...
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయంలోనూ సైబర్ నేరగాళ్ల జోరు తగ్గట్లేదు. ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఎర వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించిన బాధితులు వివిధ నేరాల్లో అక్షరాలా రూ.25 లక్షలు మోసపోయారు. ఈ మేరకు ఆరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి పేరుతో రూ.12.5 లక్షలు... బోరబండ ప్రాంతానికి చెందిన బ్యూలా అనే యువతి తన ప్రొఫైల్ను భారత్ మాట్రిమోనీ సైట్లో అప్లోడ్ చేయగా సంజయ్ హ్యారీ అనే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. అందుకు ఆమె స్పందించడంతో పాటు ఫోన్ నంబర్లు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. లండన్లో ఇంజినీర్గా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్న అతను తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు భారతీయ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన లండన్ జాతీయుడి ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపి తనవే అంటూ నమ్మించాడు. ఓ రోజు పార్శిల్ ద్వారా కొన్ని ఖరీదైన గిఫ్ట్లు పంపుతున్నానంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఆ తర్వాతి రోజు కొరియర్ సంస్థ పేరుతో యువతికి కాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు లండన్ నుంచి మీ పేరుతో వచ్చిన పార్శిల్లో ఖరీదైన వస్తువులు, బంగారం, నగదు ఉందని, దానిని రిలీజ్ చేయడానికి కొంత ట్యాక్స్ చెల్లించాలని ఎర వేశారు. ఆమె నమ్మడంతో పలు దఫాలుగా రూ.12.5 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కమీషన్ కోసం ఆశపడి రూ.7.5 లక్షలు నగరానికి చెందిన ఓ వ్యాపారి సీజనల్ వ్యాపారాలు చేస్తుంటాడు. ప్రస్తుతం మాస్కులకు డిమాండ్ ఉండటంతో ఆ వ్యాపారం చేయాలని భావించిన అతను ఎన్–95 మాస్కులు హోల్సేల్గా తక్కువ ధరకు సరఫరా చేసే దేశీయ, విదేశీ కంపెనీల కోసం ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి ద్వారా మలేషియాకు చెందిన కంపెనీ ఫోన్న్నంబర్ దొరికింది. వారితో సంప్రదింపులు జరిపిన సదరు వ్యాపారి 2 వేల మాస్కుల్ని రూ.7.5 లక్షలకు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే వాటిని కోయంబత్తూర్లో ఉన్న తన క్లైంట్కు ఇవ్వాలని సూచించాడు. ఇందుకు కంపెనీ అంగీకరించడంతో అడ్వాన్సుగా కొంత మొత్తం చెల్లించాడు. మాస్కులు పార్శిల్ చేశామంటూ ఓ ట్రాకింగ్ ఐడీ ఇచ్చిన నేరగాళ్లు సరుకు కొయంబత్తూరు చేరినట్లు నమ్మించి మిగిలిన మొత్తం తమ ఖాతాల్లో వేయించుకున్నారు. బుధవారం బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. మరో మూడు నేరాల్లో రూ.2లక్షలు... ఇన్స్ట్రాగామ్లో ‘జస్ట్ షేర్ అఫీషియల్’ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసిన సైబర్ నేరగాళ్లు దీని ద్వారా అనేక మందికి టోకరా వేస్తున్నారు. ఈ పేజ్ని నమ్మిన ఓ నగర యువకుడు అత్యాధునిక ఐ–ఫోన్ కోసమని రూ.34 వేలు చెల్లించి మోసపోయాడు. అలాగే ఓ నగరవాసికి బ్యాంకు అధికారి పేరుతో రూ.70 వేలు టోకరా వేశారు. మరో వ్యక్తికి ఇలానే గాలం వేసి రూ.30 వేలు కాజేశారు. ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ వాహనాన్ని ఖరీదు చేయాలని భావించిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు అడ్వాన్స్ పేరుతో రూ.65 వేలు కాజేశారు. బ్యాంకు ఉద్యోగికి రూ.2లక్షలు టోకరా ఓ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే మీ కార్డు బ్లాక్ అవుతుందంటూ లాలాగూడకు చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. క్రెడిట్ కార్డు వివరాలు చెబితే ఇప్పుడే అప్గ్రేడ్ చేస్తామంటూ ఓటీపీలు చెప్పించుకొని రూ.70 వేలు తమ ఖాతాలలోకి బదిలీ చేసుకున్నారు. ఫేస్బుక్ సంస్థకు చెందిన మార్కెట్ ప్లేస్లో బైక్ విక్రయ ప్రకటన చూసిన ఓ వ్యక్తి దానిని కొనేందుకు విక్రేతతో మాట్లాడారు. తాము ఆర్మీ ఉద్యోగులమని నమ్మించి, రూ.65 వేలు డిపాజిట్ చేయించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
యువతుల్ని వేధించిన 'డ్రీమ్ బాయ్'
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
మహిళా కానిస్టేబుల్కు 'గూగుల్ పే'లో మోసం
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ సైబర్ నేరగాళ్ళకు టార్గెట్గా మారారు. ఆమె తన వివాహం కోసం దాచుకున్న డబ్బును కాజేశాడు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బుధవారం నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. యూసుఫ్గూడ ప్రాంతంలో నివసించే ఓ యువతి పోలీసు కానిస్టేబుల్గా పని చేస్తోంది. ఈమెకు ఆంధ్రా బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఖాతాలు ఉన్నాయి. తన గూగుల్ పే ఖాతాను ఆంధ్రా బ్యాంక్లో ఉన్న అకౌంట్తో లింకు చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ను తన గూగుల్ పేలో బెనిఫిషియరీగా జత చేసుకున్నారు. అవసరమైన సందర్భాల్లో తన గూగుల్ పే ద్వారా ఆంధ్రా బ్యాంక్లో ఉన్న నగదును బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి మార్చుకునే వారు. ఇలానే గత నెలలో రూ.10 వేలు, మంగళవారం రెండు దఫాల్లో రూ.80 వేలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేశారు. ఆమె తన వివాహం కోసం పొదుపు చేసుకుంటూ వచ్చారు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి బదిలీ చేసిన రూ.90 వేలు డ్రా చేసుకోవాలని భావించారు. దీంతో బుధవారం ఆ బ్యాంకును సంప్రదించగా అందులో నగదు లేనట్లు తెలిసింది. తన గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ చేసుకున్న ఖాతాకు పంపిన నగదు మాయం కావడంతో ఆమె మోసపోయానని భావించారు. గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు. ఇందులులో భాగంగా సదరు మహిళ కానిస్టేబుల్ గూగుల్ పేలో బెనిఫిషియరీగా యాడ్ అయిన ఖాతా వివరాలు లోతుగా పరిశీలించగా... అది ఎస్బీఐకి చెందినదిగా తేలింది. గుర్తుతెలియని దుండగులు ఆమె పేరుతోనే డిస్ప్లే నేమ్ సృష్టించి, దీన్ని బెనిఫిషియరీగా ఆమె గూగుల్ ఖాతాలో యాడ్ చేశారు. అప్పటికే యాడ్ అయి ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను డిలీట్ చేశారు. డిస్ప్లే నేమ్గా ఆమె పేరే, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు పెట్టుకున్నట్లే కనిపిస్తుండటంతో బాధితురాలికి అనుమానించలేదు. దీంతో రూ.90 వేలు బదిలీ చేసి మోసపోయారు. ప్రాథమికంగా సేకరించిన అనుమానిత ఖాతా స్టేట్మెంట్లో డబ్బు పోయిన ఖాతా డమ్మీ అకౌంట్ అంటూ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్ళ పనా? లేక బాధితురాలికి పరిచయస్తులే చేసిన నేరమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ పేరుతో పాతబస్తీ మహిళకు... నగరంలోని పాతబస్తీ మహిళకు ఫోన్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్ళు లాటరీ తగిలిందంటూ టోకరా వేశారు. రూ.కోటి వచ్చిందంటూ చెప్పి రూ.5 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. రూ.కోటి లాటరీ తగిలిందని చెప్పిన దుండగులు ఆ మొత్తం సొంతం చేసుకోవడానికి కొన్ని ట్యాక్స్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపై వివిధ పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.5 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు చెల్లించాలంటూ వాళ్ళు ఒత్తిడి చేస్తుండటంతో అనుమానించిన బాధితురాలు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
'ఫ్యాన్సీ’ సెల్ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ సెల్ఫోన్ నెంబర్లకు ఉన్న క్రేజ్కు ఓ సైబర్ నేరగాడు తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. వీటి కోసం అనేక మంది సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదిస్తుంటారని తెలుసుకుని దాని ఉద్యోగినే టార్గెట్గా చేశాడు. అతగాడు విసిరిన వల్లోపడి రూ.20 వేలు పోగొట్టుకున్న బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గుజరాత్ నుంచి నగరానికి వచ్చి నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ దుండగుడు ఈ ఫ్రాడ్కు సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు వేర్వేరు వివరాలతో రెండు ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. వీటిలో ఒకటి జియో సంస్థకు చెందిన ఫ్యాన్సీ నెంబర్. దీన్ని ఆధారంగా చేసుకుని వాట్సాప్లో ఫ్యాన్సీ నెంబర్స్ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూప్లో తన రెండో నెంబర్ను వేరే వ్యక్తి పేరుతో సేవ్ చేసి, దాన్నీ యాడ్ చేసుకుని అడ్మిన్ను చేశాడు. ఇలా మోసానికి అవసరమైన సన్నాహాలు పూర్తి చేసుకున్న దుండగుడు ‘క్షేత్రస్థాయి’లోకి దిగాడు. అనేక మంది ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుతూ వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన ఔట్లెట్స్లోని ఉద్యోగుల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఎయిర్టెల్ సంస్థకు చెందిన అలాంటి ఓ ఔట్లెట్లో పని చేసే ఉద్యోగిని సంప్రదించిన ఈ మోసగాడు తనకు ఉన్న జియో ఫ్యాన్సీ నెంబర్ను పోర్ట్ చేయాలని కోరాడు. ఆ పని చేస్తూ సదరు ఉద్యోగి ఈ ఫ్యాన్సీ నెంబర్ ఎలా పొందాలంటూ ప్రశ్నించాడు. వీటికోసం వాట్సాప్లో ఓ ప్రత్యేక గ్రూప్ ఉందని, తాను పంపే లింకు ద్వారా అందులో జాయిన్ అయితే వాటిని ఖరీదు చేసుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో మోసగాడి నుంచి లింకు షేర్ చేయించుకున్న ఉద్యోగి దాని ద్వారా ఆ వాట్సప్ గ్రూప్లో చేరాడు. చివరలో ఐదు తొమ్మిదులు వచ్చే ఫ్యాన్సీ నెంబర్ కావాలంటూ గతంలో ఓ వినియోగదారుడు ఇతడిని అడిగాడు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న ఈ ఉద్యోగి ఆ నెంబర్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్లో సంప్రదించాడు. వెంటనే అడ్మిన్గా ఉన్న నెంబర్ ద్వారా జవాబు ఇవ్వడం ప్రారంభించిన మోసగాడు రూ.20 వేలు చెల్లిస్తే ఆ నెంబర్ కేటాయించేలా చేస్తానంటూ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన ఉద్యోగి గూగుల్ పే ద్వారా ఆ మొత్తం పంపేశాడు. ఆ తర్వాత అడ్మిన్గా ఉన్న నెంబర్తో ఈ ఉద్యోగి నెంబర్ను బ్లాక్ చేసిన మోసగాడు, ఫోన్లకూ స్పందించడం మానేశాడు. దీంతో తనను అడ్మిన్గా ఉన్న వ్యక్తి మోసం చేశాడని భావించిన బాధితుడు తనకు ఆ గ్రూప్లో చేరడానికి లింకు షేర్ చేసిన వ్యక్తిని అతడి నెంబర్లో సంప్రదించి వివరణ కోరాడు. ఏమీ తెలియనట్లు వ్యవహరించిన మోసగాడు ఆ అడ్మిన్తో మాట్లాడతానంటూ మూడు రోజుల వ్యవధి కోరారు. ఆ గడువు పూర్తయిన తర్వాత బాధితుడు మరోసారి ప్రయత్నించగా సదరు మోసకారి అడ్మిన్ తన నెంబర్ కూడా బ్లాక్ చేశాడంటూ చెప్పి.. ఆపై అతగాడూ బాధితుడి నెంబర్ను బ్లాక్ చేసేశాడు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితుడు పరిశీలించగా... పోర్ట్ చేయాలంటూ తనను సంప్రదించి, వాట్సాప్ గ్రూప్ లింకు పంపిన వ్యక్తి సెల్ఫోన్ నెంబర్తోనే ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినటు గుర్తించాడు. మరోపక్క సాంకేతికంగా ఆరా తీయగా... ఆ నెంబర్తో పాటు గ్రూప్ అడ్మిన్ నెంబర్ కూడా ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్లు గ్రహించాడు. దీంతో అతగాడు పథకం ప్రకారం తనను మోసం చేశాడని భావించి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బాధితుడు నివసించే ప్రాంతం రాచకొండ పరిధిలోని బాలాపూర్ పోలీసుస్టేషన్ కిందికి వస్తుందని గుర్తించారు. దీంతో తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే చట్ట పరంగా ఇబ్బందులు వస్తాయని, ఎల్బీనగర్ చౌరస్తాలోని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించి పంపారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ఆయన బాధితుడికి హామీ ఇచ్చారు. ఆ మోసగాడు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మరికొందరూ మోసపోయే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటి పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. -
ఇన్స్ట్రాగామ్ చాటింగ్తో 50 లక్షల మోసం
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ కేంద్రంగా యువతులను పరిచయం చేసుకుని, వారితో చాటింగ్స్ చేస్తూ నమ్మకం సంపాదించుకుని మోసం చేస్తున్న గుర్తుతెలియని ఘరానా మోసగాడిపై సిటీ సైబర్ క్రైమ్ బుధవారం కేసు నమోదు చేశారు. ఇతడి చాటింగ్స్ నమ్మి రూ.8.5 లక్షలు ఇచ్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని లోయర్ ట్యాంక్బండ్కు చెందిన ఓ యువతికి ఇన్స్ట్రాగామ్ ద్వారా హర్షగా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. ఈమెతో కొన్నాళ్ళు స్నేహ పూర్వకంగానే చాటింగ్ చేశాడు. ఆపై తనకు అత్యవసరం అంటూ రూ.10 వేల చొప్పున మూడుసార్లు డిపాజిట్ చేయించుకున్నాడు. నమ్మకం చూరగొనడం కోసం చెప్పిన సమయాలకు ఆ మొత్తాలు తిరిగి ఇచ్చేశాడు. ఆపై అసలు కథ ప్రారంభించిన మోసగాడు తాను ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించానని, దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత తనకు రూ.20 కోట్ల విలువైన ప్రాజెక్టు వచ్చిందని నమ్మించాడు. దాన్ని పూర్తి చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ నగర యువతి నుంచి రెండు సందర్భాల్లో రూ.8.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అక్కడితో ఆగకుండా మరికొంత మొత్తం కావాలని అతడు కోరుతుండటంతో తన వద్ద లేవంటూ ఆమె చెప్పింది. అయితే తన సాఫ్ట్వేర్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే వారు ఎవరైనా ఉంటే పరిచయం చేయాలని, కేవలం కొన్ని రోజుల్లోనే దాన్ని పూర్తి చేసి వారు పెట్టిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆ యువతి నగర శివార్లలో ఉండే తన బంధువులు ఇద్దరిని పరిచయం చేసింది. వారినీ ఇన్స్ట్రాగామ్ చాటింగ్ ద్వారా సంప్రదించిన మోసగాడు వారి నుంచీ దాదాపు రూ.50 లక్షలు మేర స్వాహా చేశాడు. ఇతడి చేతిలో మోసపోయిన నగర యువతి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లి వార్తలపై ఫిర్యాదు
‘హీరోయిన్ లావణ్యా త్రిపాఠిని వివాహం చేసుకుని, ఆపై వదిలేశా’ అంటూ సోషల్ మీడియా ద్వారా శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి ఓ దుమారం రేపారు. సునిశిత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కథానాయిక లావణ్యా త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారామె. లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె తన సహాయకుడి ద్వారా ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్కు అందజేశారు. ఈ విషయంపై ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి లావణ్య ఒక్కరిపైనే కాదు.. చాలా మంది సెలబ్రిటీలపైనా లేనిపోని వ్యాఖ్యలు చేశాడు.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లావణ్యా త్రిపాఠి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాం. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు’’ అన్నారు. -
అరచేతిలో 'షీ సేఫ్'!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీరు గృహ హింసకు గురవుతున్నారా.. ఆన్లైన్ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నారా.. సైబర్ నేరాల బారిన పడ్డారా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..’కారణాలేమైతేనేం మీ మొబైల్లో ‘షీ సేఫ్’యాప్ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్’యాప్ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ఈ యాప్ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శనం చేస్తారు ఈ యాప్ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల విషయాల్లో మార్గదర్శక్ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్లోని ఎస్వోఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మార్గదర్శక్లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. హాక్ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్సీఎస్సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు. ‘సేఫ్ స్టే’చేయవచ్చు.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ముఖ్యంగా ఐటీ కారిడార్లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్ స్టే’ఫీచర్లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఫొటో తీసి అప్లోడ్ చేయండి.. మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి ఈ యాప్లో అప్లోడ్ చేసే ఫీచర్ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్సీఎస్సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్ను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్ ఐ యాప్ కూడా ఈ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్కి కూడా యాక్సెస్ చేశారు. హాక్ ఐ అత్యవసర పరిస్థితుల్లో.. హాక్ ఐ అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి మరియు ఏదైనా సంఘటనలను నివేదించడానికి సంబంధించిన యాప్. అయితే షీ సేఫ్ యాప్ ముఖ్యంగా మహిళలు బాధలో ఉన్నప్పుడు మార్గదర్శక్లను సంప్రదించవచ్చు. తద్వారా సాయం పొందొచ్చు. మహిళలను అప్రమత్తంగా ఉంచటానికి ఇందులో రోజువారీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. నిరంతరం మహిళల భద్రత గురించి వివరాలుంటాయి. ఈ యాప్ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లే స్టోర్కు వెళ్లి ‘షీ సేఫ్’అని టైప్ చేయగానే యాప్ వస్తుంది. దీన్ని స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. -
పేటీఎం కేవైసీ అప్డేట్ పేరుతో..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వృద్ధుడికి కేవైసీ అప్డేట్ పేరుతో ఫోన్ చేసి, ఓ యాప్ను డౌన్లోడ్ చేయించి, రూ.8 లక్షలు కాజేసిన ఇద్దరు ఝార్ఖండ్ వాసుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. వీరి చేతిలో మరికొందరు మోసపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్లోని జామ్తార జిల్లాకు చెందిన రాహుల్ మండల్, కపిల్ మండల్లతో కూడిన ముఠా గత ఏడాది సెప్టెంబర్లో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కాల్ చేసింది. తాము పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న గ్యాంగ్ సభ్యులు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పారు. దానికోసమే అంటూ ఓ లింకును పంపారు. దీన్ని క్లిక్ చేయడంతో ఆయన స్మార్ట్ఫోన్లోని క్విక్ వ్యూవర్ యాప్ డౌన్లోడ్ అయింది. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన దీనికి సంబంధించి ఓ పాస్వర్డ్ చెప్పిన నేరగాళ్లు దాన్ని యాక్టివ్ చేసుకునేలా చేశారు. అలా చేయడంతో బాధితుడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ల్యాప్టాప్లో కనిపించడం మొదలైంది. దీని ఆధారంగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.8 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వినియోగించిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్ళారు. జార్ఖండ్ వెళ్ళిన ప్రత్యేక బృందం రాహుల్, కపిల్లను అరెస్టు చేసి తీసుకువచ్చింది. పది మంది బాధితులు బ్యాంకు ఖాతాలతో పాటు పే టీఎం తరహా యాప్స్కు ఆధార్ లింకేజ్ అని, అప్గ్రేడ్ కోసమని, కేవైసీ అప్డేట్ చేయాలని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి కాల్స్కు స్పందించి వారు పంపిన లింకులు క్లిక్ చేయడం, వారు సూచించినట్లు ప్లే స్టోర్స్ నుంచి ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చేయకూడదు. ఇలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఖాతాల్లోని డబ్బు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఒక్క సోమవారమే ఇలాంటి బాధితులు పది మంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ఫోన్కాల్స్ వల్లో పడి వీటిని ఎవరూ డౌన్లోడ్ చేసుకోవద్దు. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ,హైదరాబాద్ సైబర్ క్రైమ్ -
మహిళనంటూ నమ్మించి.. ఫేస్బుక్లో వల
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్: మహిళనంటూ నమ్మించి.. ఫేస్బుక్ ఖాతా ద్వారా ఒక వ్యక్తి నగ్న ఫొటోలు సంపాదించి రూ.5.7 లక్షల మేర మోసగించిన కేసులో ఇద్దరు వ్యక్తులను తాడేపల్లిగూడెం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన తన్నీడి నాగరాజు, గుత్తుల మురళీకృష్ణబాబు ఫేస్బుక్లో మహిళ పేరిట ఖాతా తెరిచి అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. ఒక మహిళ సాయం తీసుకుని అర్థనగ్నంగా ఉన్న ఫొటోలు ఫేస్బుక్లో పరిచయమైన ఒక వ్యక్తికి పంపారు. అనంతరం ఆ వ్యక్తిని నగ్న ఫొటోలు పంపాలని కోరారు. ఫేస్బుక్ ఖాతా మహిళదేనని నమ్మిన ఆ వ్యక్తి తన ఫొటోలు పంపాడు. ఆ ఫొటోల్ని ఉపయోగించుకుని బాధితుడిని బెదిరించాడు. ఆ ఫొటోల్ని ఫేస్బుక్లో పెడతామని బెదిరించి.. బాధితుడి నుంచి దాదాపు రూ. 5.70 లక్షలు వసూలు చేశారు. మళ్లీ ఇటీవల తాము తాడేపల్లిగూడెంలో ఉన్నామని తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పడంతో ఫొటోలు సోషల్మీడియాలో పెడతామని బెదిరించారు. తన వద్ద రూ.50వేలు ఉన్నాయని చెప్పడంతో.. వాటిని తాడేపల్లిగూడెం వచ్చి ఇవ్వాలని నిందితులు సూచించారు. ఈ సమయంలో బాధితుడు తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించాడు. నాగరాజు, మురళీకృష్ణరాజులు చెప్పిన ప్రదేశానికి బాధితుడు సొమ్ముతో వెళ్లాడు. అప్పటికే సీఐ ఆకుల రఘు సూచనల మేరకు మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్సైలు గుర్రయ్య, రమేష్, ఏఎస్సై వెంకన్నబాబు, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు, సూర్యచంద్రరావు తదితరులు చాకచక్యంగా వ్యవహరించారు. -
ఫేస్బుక్, వాట్సప్ల నుంచి ఫొటోలు, నంబర్లు
ప్రకాశం, కొండపి: మహిళను వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు వివరాల మేరకు.. వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామానికి చెందిన మోదేపల్లి నరేష్ కొంతకాలంగా ఫేస్బుక్ , వాట్సప్ల నుంచి మహిళల ఫొటోలు, ఫోన్ నంబర్లు పొంది తనది గోల్డ్షాప్ అని పరిచయం చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే ఫొటోలు ఫేస్బుక్లో పెడతానని బెదిరించేవాడు. ఇటీవల కొండపి మండలంలోని కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళను మానసిక క్షోభకు గురిచేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐఎంఈఐ నంబర్ల ద్వారా యువకుడిని కలవల్ల గ్రామం బస్ స్టాప్ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ సుబ్బయ్య, కానిస్టేబుళ్లను ఒంగోలు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.10 మినహా.. 48గంటల్లో మొత్తం రిటర్న్
సాక్షి, సిటీబ్యూరో: అతడో మధ్య తరగతి వ్యక్తి..న్యూ నల్లకుంటప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్నిర్వహిస్తున్నారు... తన కుమారుడికి ఫీజు చెల్లించడం కోసం కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలోఉంచుకున్నారు..దీని నుంచిరూ.85 వేలు శనివారం సైబర్నేరగాళ్ల పరమైంది..ఆయన ఆలస్యం చేయకుండా సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం, అధికారులు తక్షణం స్పందించడంతో 48 గంటల్లో పోయిన మొత్తం తిరిగి బాధితుడి ఖాతాలోకి వచ్చేశాయి. మంగళవారం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆయన తన కష్టార్జితాన్ని 48 గంటల్లోనే వెనక్కు రప్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్శిల్ కోసం ప్రయత్నిస్తే.. నగరంలోని న్యూ నల్లకుంట ప్రాంతానికి చెందిన పి.నందకుమార్ స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు గీతం కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నందకుమార్కు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ ద్వారా రెండు బాక్సులు డెలివరీ కావాల్సి ఉంది. వీటి విషయం అగడటానికి ఆయన ఆ సంస్థ నెంబర్ కోసం శనివారం జస్ట్ డయల్కు కాల్ చేశారు. వారు రెండు నెంబర్లు ఇవ్వడంతో వాటిని నందకుమార్ సంప్రదించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఆ రెండు బాక్సులు డెలివరీ కాలేదని, తమకు రూ.10 చెల్లిస్తే పంపిస్తామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. దీంతో నందకుమార్ ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధమని చెప్పడంతో సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి డెబిట్కార్డ్ వివరాలతో పాటు కాస్సేపటికి ఆయన సెల్ఫోన్కు వచ్చిన పిన్ నెంబర్ కూడా తెలుసుకున్నారు. ఈ వివరాలతో నందకుమార్ డెబిట్కార్డును సైబర్ నేరగాళ్లు తమ గూగుల్ పే ఖాతాకు అనుసంధానించుకున్నారు. మొదట కేవలం రూ.10 మాత్రమే తీసుకున్న వాళ్ళు ఆపై మూడు దఫాల్లో రూ.85,588 కాజేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ మూడు లావాదేవీలు జరిగిపోయాయి. అదే రోజు రాత్రి ఫిర్యాదు.. శనివారం సాయంత్రం ఇలా జరగడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చాడు. ఆ సమయంలో ఫిర్యాదు స్వీకరించినా కేసు నమోదు చేసే సిబ్బంది అందుబాటులో ఉండరు. అయితే ఆలస్యమైతే బాధితుడు నష్టపోతాడని భావించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ తక్షణం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆయన తొలుత బాధితుడి నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి ఆయన ఖాతా నుంచి డబ్బు ఫ్లిప్కార్ట్కు వెళ్లినట్లు గుర్తించారు. మూడు వస్తువులు షాపింగ్ చేసిన నిందితులు ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతా నుంచి లింకు చేసిన గూగుల్ పే ద్వారా చెల్లించారని తేల్చారు. దీంతో వెంటనే ఫ్లిప్కార్ట్ నోడల్ అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రశాంత్ ఆ మూడు లావాదేవీలు రద్దు చేయించారు. తర్వాతి రోజు ఆదివారం రావడంతో... సోమవారం ఉదయం నందకుమార్ ఫిర్యాదును కేసుగా నమోదు చేశారు. మధ్యాహ్నానికే మూడు లావాదేవీల్లో రూ.85,588 ఫ్లిప్కార్ట్ నుంచి బాధితుడి ఖాతాలోకి వచ్చి చేరారు. దీంతో నందకుమార్ మంగళవారం మధ్యాహ్నం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల్లోనూ ‘గోల్డెన్ అవర్స్’ సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించడానికి గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. అయితే సైబర్ నేరాల్లోనూ బాధితులుగా మారిన వారి ఫిర్యాదు చేయడానికీ ‘గోల్డెన్ అవర్స్’ ఉంటాయి. నేరం బారినపడిన 24 గంటల్లోపు వచ్చిన తమకు సమాచారం ఇస్తే ఆ మొత్తం తిరిగి రప్పించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ లావాదేవీల్లో డబ్బు మర్చంట్ ఖాతాలుగా పిలిచే ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలకు వెళితేనే ఇది సాధ్యమవుతుంది. సైబర్ నేరగాళ్ళకు చెందిన వ్యక్తిగత వాలెట్స్, ఖాతాల్లోకి వెళితే మాత్రం కష్టసాధ్యమే. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఆ డబ్బుపై ఆశలు వదులుకున్నా శనివారం ఠాణాకు వచ్చేసరికి అధికారులు వెళ్ళిపోతున్నారు. రోడ్డుపైన నన్ను చూసి ఆగిన వాళ్ళు ఏమైందంటూ ప్రశ్నించి వెంటనే స్పందించారు. అయినప్పటికీ సైబర్ నేరాలు, ఆ నేరగాళ్ల విషయం విన్న తర్వాత నా డబ్బుపై ఆశలు వదులుకున్నా. కుమారుడికి ఫీజు చెల్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావించా. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చూపిన చొరవ కారణంగా కేవలం 48 గంటల్లోనే నా డబ్బు తిరిగి వచ్చింది. మొత్తమ్మీద కేవలం రూ.10 మాత్రమే నష్టపోయా.– నందకుమార్, బాధితుడు -
‘శాడిస్ట్ ’ వీడియో కాల్స్ వెనక ఉన్న అసలు స్టోరీ
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్ విచారణలో విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాడు. ‘శాడిస్ట్ అపరిచితుడైన’ ఇతగాడిని గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన ఇతడిని న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అతగాడు శాడిస్ట్లా తయారు కావడానికి ప్రేమవిఫలమే కారణమని వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఉద్యోగం రాకపోవడంతో.. జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ ఎంకాం చదువుతుండగా ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇది విఫలం కావడంతో పాటు ఆమె తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో భాస్కర్పై లింగాలఘణపురం పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. 2007లో నమోదైన ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ సైతం దాఖలు చేయడంతో 2010లో నేరం నిరూపితమైంది. దీంతో న్యాయస్థానం భాస్కర్ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఎంకాం పూర్తి చేసినా ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లపాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా చివరకు స్వస్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. వేధింపుల పర్వానికి శ్రీకారం.. ఈ పరిణామంతో యువతులు, మహిళలపై కక్షకట్టిన భాస్కర్ వారిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను పొందుపరిచే పోర్టల్ ‘తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం’ నుంచి వివరాలు సంగ్రహించి వేధింపులు ప్రారంభించాడు. తన గ్రామానికి చెందిన అనేక మంది ప్రభుత్వ పథకాలు పొందడానికి భాస్కర్ సహకరించాడు. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి అధికారులపై పలుమార్లు కలెక్టర్ సహా అనేక మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇతడి సోదరికి రావాల్సిన కల్యాణలక్ష్మి సొమ్మును అందుకోలేకపోయాడు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం తన తల్లిదండ్రులకు కేవలం ఆరు నెలల వ్యవధిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వీరి వైద్యానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చుపెట్టాడు. ఈ డబ్బు కోసం తనకు ఉన్న ఐదెకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఈ రుణానికి ప్రతి నెలా కట్టాల్సిన వాయిదాలు సైతం చెల్లించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బ్యాంకు వాళ్లు పొలం వేలం వేయడానికి సిద్ధమవుతూ నోటీసులు జారీ చేశారు. ఇంటిలో ఒంటరిగా.. బ్రెయిన్స్ట్రోక్కు గురైన తల్లి తన సోదరి ఇంట్లో ఉంటుండటంతో ప్రస్తుతం భాస్కర్ తన స్వగ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. వండి పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో రోజుకు ఒకపూటే భోజనం చేసేవాడు. ఈ పరిణామాలతో పూర్తిస్థాయి శాడిస్ట్గా మారిపోయిన భాస్కర్ తనకు దొరికిన సిమ్కార్డును రీచార్జి చేసి, ‘అవసరమైనప్పుడు’ తన సెల్ఫోన్లోనే వేసి వినియోగిస్తూ యువతులు, మహిళల్ని టార్గెట్గా చేసుకున్నాడు. ఆ ప్రభుత్వ పోర్టల్ నుంచి సేకరించిన నెంబర్లలో ఏదో ఒకదానికి కాల్ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసే భాస్కర్... వారూ అలా మారాలని బలవంతం పెట్టేవాడు. ఇతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు, ఎస్సై మహిపాల్ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్ నిందితుడిగా గుర్తించి గత మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి భాస్కర్కు 16న పెళ్లి చూపులు జరగాల్సి ఉంది. ఈలోపే అతడు అరెస్టు కావడంతో బ్రేక్ పడింది. -
కత్తి మహేష్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్పై కేసు నమోదు చేశారు. ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. -
మాయమాటలతో బురిడీ కొట్టించి
కడప కోటిరెడ్డి సర్కిల్: తాము ఫలానా విభాగానికి చెందిన అధికారులమంటూ పలువురికి ఫోన్ చేసి మాయమాటలతో బురిడీ కొట్టించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును డ్రా చేసుకునే సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. బుధవారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఇటీవల మైదుకూరు పట్టణానికి చెందిన గిద్దలూరు ఉమాదేవికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఎల్ఐసీ అధికారినని మీకు ఎల్ఐసీ నుంచి బోనస్గా కొంతమేర డబ్బులు వచ్చాయని, వాటిని చెక్ రూపంలో పంపించామని, మీరు ఇంటి వద్ద లేకపోవడంతో తమ ఆఫీసుకు తిరిగి వచ్చిందని చెప్పాడు. మీరు ఒప్పుకుంటే మీ ఖాతాకు డబ్బు పంపుతామని నమ్మబలికాడు. ఈ మేరకు సదరు మహిళకు చెందిన ఏటీఎం నంబరు వివరాలు చెబితే వెంటనే డబ్బులు జమ చేస్తామని అతను చెప్పాడు. దీంతో ఆమె అందుకు అంగీకరించి ఏటీఎం నంబరు చెప్పింది. ఆ వెంటనే ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని కూడా అపరిచిత వ్యక్తికి చెప్పేసింది. దీంతో క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.10వేలు డ్రా చేసినట్లు ఆమె మొబైల్కు మెసేజ్ వచ్చింది. ఆమె వెంటనే వివరాలు అడిగిన వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తప్పని పరిస్థితుల్లో బాధితురాలు గత నెల 31వ తేదీన మైదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు చేసిన ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడు మైదుకూరుకు చెందిన వీరనాగయ్యగా కడప సైబర్ క్రైమ్ స్టేషన్వారు గుర్తించారు. తీగ లాగితే.. వీరనాగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా 2017లో మైదుకూరు పాతపాలెంకు చెందిన శివ అనే వ్యక్తి పరిచయమై ఢిల్లీలో కాల్ సెంటర్ ఉద్యోగం ఇప్పిస్తామని నెలకు రూ.13000 జీతంతోపాటు ఉచిత నివాసం, భోజన సదుపాయం ఉంటుందని చెప్పి వీరనాగయ్యతో పాటు వనిపెంటకు చెందిన మురళి యాదవ్, ఆళ్లగడ్డకు చెందిన రవి, గిద్దలూరుకు చెందిన రమణలను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ధనలక్ష్మీ యంత్రం, కాలేయ సమస్యల నివారణకు ఆయుర్వేద మందులను ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొబైల్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించి ఢిల్లీకి చెందిన సుమిత బన్సాలి, శివరా త్రి కార్తీక్, నరాల కార్తీక్లకు ఇచ్చే వారు. మైదుకూరు కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఢిల్లీకి సమాచారం పంపుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఎల్ఐసీ పాలసీదారులు, రైతులను మోసగిస్తూ సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నలుగురు నిందితులను ముందే అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీకి వెళ్లి సుమిత బన్సాలి, శివరాత్రి కార్తీక్, నరాల కార్తీక్ అనే నేరగాళ్లను అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. నిందితుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, లాప్టాప్లు సీజ్ చేశామని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో మైదుకూరు, కడప సైబర్ స్టేషన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మస్కా కొట్టారు.. మాయ చేశారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బేగంపేట ప్రాంతానికి చెందిన డాక్టర్ కమ్ డిజైనర్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఈయన రూపొందించిన వస్త్ర డిజైన్లు నచ్చాయంటూ సంప్రదించారు. ఖరీదు చేసేందుకు వస్తున్నామంటూ చెప్పి కస్టమ్స్ డ్రామా ఆడారు. మొదట రూ.65 వేలు కాజేసిన నేరగాళ్లు మరో రూ.1.5 లక్షలకు ఎర వేయడంతో డాక్టర్కు అనుమానం వచ్చింది. ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేటకు చెందిన ఓ వైద్యుడు బీబీనగర్లోని ఎయిమ్స్లో పని చేస్తుంటారు. ఈయనకు వస్త్రాల డిజైనింగ్పైనా పట్టుంది. తాను రూపొందించిన డిజైన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉంటారు. వీటిని చూసిన సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ రంగంలోకి దిగారు. సదరు డాక్టర్కు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన పేరు టేలర్ రైట్ అని, తాను లండన్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. సదరు వెబ్సైట్లో ఉన్న వస్త్రాల డిజైన్లు తనను ఆకట్టుకున్నాయంటూ వారం రోజుల పాటు సంప్రదింపులు జరిపాడు. ఆపై వాటిని తాను ఖరీదు చేస్తానని, అందుకోసం ఇండియాకు వస్తున్నానంటూ చెప్పాడు. ఇది జరిగిన మరుసటి రోజు ముంబై కస్టమ్స్ విభాగం పేరుతో వైద్యుడికి ఫోన్ వచ్చింది. మిమ్మల్ని కలవడానికి, మీరు రూపొందించిన డిజైన్లు ఖరీదు చేయడానికి లండన్ నుంచి టేలర్ ౖరైట్ అనే వ్యక్తి వచ్చాడంటూ చెప్పారు. ఆయన తనతో పాటు 75 వేల డాలర్లు తీసుకువచ్చారని, కస్టమ్స్ నిబంధనల ప్రకారం అంత మొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకురావడం నేరం కావడంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తన కోసం వచ్చిన విదేశీయుడు కష్టాల్లో చిక్కుకున్నారని భావించిన డాక్టర్ ఆయన్ను విడిచిపెట్టాలంటే ఏం చేయాలంటూ ఫోన్ చేసిన వారిని కోరాడు. పన్నుగా చెల్లించాల్సిన రూ.65 వేలు పంపాల్సిందిగా ఓ బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చారు. నిజమేనని నమ్మిన వైద్యుడు ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై మరోసారి కాల్ చేసిన నేరగాళ్లు టేలర్ను విడిచిపెట్టామని, ఆ నగదు మాత్రం ఆయనకు ఇవ్వడం కుదరదని చెప్పారు. దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకే పంపిస్తామంటూ ఎర వేశారు. అలా చేయడానికి ప్రాసెసింగ్ చార్జీలుగా రూ.1.5 లక్షలు చెల్లించాలని వారు చెప్పడంతో వైద్యుడికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ నేరం చేసింది నైజీరియన్లుగా అనుమానిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగినితోనే స్కానింగ్ చేయించి.. ‘ఓఎల్ఎక్స్ నేరగాళ్లు’ నగరానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగినినే టార్గెట్గా చేసుకున్నారు. ఆమెతోనే వారు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి, రూ.44 వేలు కాజేశారు. సదరు బ్యాంకు ఉద్యోగిని ఇటీవల తన ఫర్నిచర్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను సంప్రదించి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపారు. తాను ఆర్మీ ఉద్యోగినంటూ పరిచయం చేసుకున్న అతగాడు తమ నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించడం నిషేధమని చెప్పాడు. గూగుల్ పే ద్వారా చెల్లిస్తానంటూ చెప్పడంతో ఆమె అంగీకరించారు. ఆమె గూగుల్ పే ఖాతా ఉన్న ఫోన్నంబర్కు ఓ క్యూఆర్ కోడ్ పంపిన సైబర్ నేరగాళ్లు దాన్ని స్కాన్ చేయాలని సూచించారు. ఆపై అందులో ‘ప్రొసీడ్ టు పే’ అంటూ కనిపించడం, దాని కింద కొంత మొత్తం కనిపిస్తుండటంతో సందేహించిన ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అలా చేస్తేనే డబ్బు మీ ఖాతాలోకి వస్తుందని, కింద కనిపిస్తున్న మొత్తం తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ అని చెప్పాడు. దీంతో ఆమె పే చేయడంతో నగదు ఆమె నుంచి అతడి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ మొత్తం రిఫండ్ ఇస్తామంటూ చెప్పిన అవతలి వ్యక్తి ఇలా మరో రెండుసార్లు చేయించాడు. మొత్తం రూ.44 వేలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగిని బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు ప్రారంభించారు. -
అనసూయపై అనుచిత పోస్టు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదుల కోసం ఎదురు చూడట్లేదు. సైబర్ స్పేస్లోనూ పోలీసింగ్ చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు అందులో ఉన్న అంశాలను బట్టి స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. యాంకర్ అనసూయకు సంబంధించిన అనుచిత పోస్టు విషయంలో ఇది మరోసారి స్పష్టమైంది. ట్విట్టర్లో యాక్ట్రసెస్ మసాలా పేరుతో ఓ గుర్తుతెలియని వ్యక్తి జనవరి 31న ఖాతా తెరిచాడు. ఇందులో యాంకర్ అనసూయతో పాటు సినీనటి అనుష్క తదితరుల ఫొటోలు వినియోగిస్తూ అనుచిత, అశ్లీల వ్యాఖ్యలు జోడించాడు. ఈ విషయాన్ని అనసూయ ఫాలోవర్గా ఉన్న సాయి రాజేష్ అనే వ్యక్తి ఆమెతో పాటు మరికొందరికీ ట్యాగ్ చేశాడు. దీన్ని గమనించిన అనసూయ ట్విట్టర్ వేదికగానే స్పందించారు. ట్విటర్ సపోర్ట్ టీమ్ను ఉద్దేశించి తమ నిబంధనలు మార్చుకోవాలని, ఈ తరహా పోస్టుల్నీ ఉపేక్షించవద్దంటూ సూచించారు. దీనికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్నీ అనసూయ ట్యాగ్ చేశారు. దీన్ని చూసి తక్షణం స్పందించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి ఆ ఖాతాని కేవలం ఇలాంటి వ్యాఖ్యల కోసమే ఓపెన్ చేసినట్లు, ఇప్పటికి మూడు పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. తక్షణం ట్విట్టర్కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఆ పోస్టులు తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ... ‘ట్విట్టర్ ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యం కాదు. అనసూయ నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇటీవల కాలంలో పలువురు నటీమణులు, సెలబ్రెటీలపై ఇలాంటి పోస్టులు వస్తున్నాయి. వీటిని ఉపేక్షించవద్దని కోరుతున్నాం. వారు నేరుగా సైబర్ క్రైమ్ ఠాణాకు రాలేకపోయినా తమ ఫిర్యాదుల్ని ఎవరి ద్వారా అయినా పంపితే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల స్పందనకు అనసూయ ట్విట్టర్ ద్వారానే ధన్యవాదాలు తెలిపారు. Dear @TwitterSupport .. I urge you to reassess "your rules" .. if this is not violating then what else does.. I won't shy away to blame you guys as major influence by not contemplating the cyber abuse.. @cybercrimecyb1 Sir I request you to help tag the right authorities 🙏 pic.twitter.com/G4I3KRwFQ9 — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020 -
‘అశ్లీల వీడియో పంపుతూ వేధిస్తున్నారు’
సాక్షి, హైదారాబాద్ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపుతున్నారని వేధిస్తున్నారంటూ సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. గుర్తుతెలియన వ్యక్తులు కొద్ది రోజులుగా ఈ పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె పోలీసులతో తన బాధను చెప్పుకున్నారు. కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నంబర్ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టారు. -
‘దిశ’పై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : దిశపై జరిగిన దారుణాన్ని ఓ పక్క యావద్భారతం ముక్త కంఠంతో ఖండిస్తుంటే... కొందరు పోకిరీలు మాత్రం విజ్ఞత మరిచి ప్రవర్తిస్తున్నారు. మరణానంతరమూ ఆమెను ఉద్దేశించి ఫేస్బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ తరహాలో శనివారం నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీరామ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిజామాబాద్లోని నవీపేట్ మండల ఫకీరాబాద్కు చెందిన చవన్ శ్రీరామ్ ఐటీఐ పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు ఓ హోటల్లో కార్మికుడిగా పని చేసినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇతడికి ఫేస్బుక్లో స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఖాతా ఉంది. దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్పై శ్రీరామ్ అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. వీటిని వ్యతిరేకిస్తూ పలువురు చేసిన కామెంట్స్తో ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో స్పందించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు నేతృత్వంలోని బృందం ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఆ ఆధారాలను బట్టి శ్రీరామ్ నిందితుడిగా గుర్తించి నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్లో ఉండగా మంగళవారం అరెస్టు చేసింది. ఈ తరహాలోనే మరికొందరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నట్లు గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘జంతారా’ మంతర్.. ఖాతాల్లో నగదు ఖాళీ
సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న సాంకేతికతతో పాటే సైబర్ నేరగాళ్లూ మోసాల్లో ఆరితేరుతున్నారు. మొన్నటి వరకు విషింగ్ కాల్స్ (బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు తెలుసుకుని మోసం చేయడం)తో చెలరేగిపోయిన నేరగాళ్లు ఇప్పుడు ఫిషింగ్ గూగుల్ లింక్స్ (ఆయా బ్యాంకుల ఆన్లైన్ చిరునామాలను పోలి ఉండే లింక్లను పంపి ఎర వేయడాన్ని ‘ఫిషింగ్’గా వ్యవహరిస్తున్నారు)తో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఇలా వివిధ బ్యాంక్ వినియోగదారుల సెల్ఫోన్లకు ఫిషింగ్ లింక్లు పంపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్నేమ్, పాస్వర్డ్ తదితర క్రెడెన్షియల్స్ తస్కరించి, ఆ ఖాతాల్లోని నగదును మొబైల్ వ్యాలెట్లకు బదిలీ చేసి షాపింగ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా వందల మందిని మోసగించిన జార్ఖండ్ రాష్ట్రం జంతారాకు చెందిన ఈ ముఠా గుట్టు సైబరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వైద్యురాలి ఫిర్యాదుతో రట్టయ్యింది. ప్రధాన సూత్రధారి సంజయ్ కుమార్ మండల్ అలియాస్ బబ్లూ తప్పించుకోగా, ముఠాలోని ఐదుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.2,66,000 నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్తో కలిసి సీపీ సజ్జనార్ మీడియాకు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. ఇలా ఎర వేస్తారు ఆయా బ్యాంకుల నుంచి ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తూ వివిధ మెసేజ్లు వస్తుంటాయి. జంతారా ముఠా.. ఈ మెసేజ్లను పోలిన లింకులను తయారుచేసి బల్క్గా బ్యాంక్ ఖాతాదారుల సెల్ఫోన్లకు పంపిస్తోంది. ‘మీ బ్యాంకు లావాదేవీల క్లోజింగ్ స్టేట్మెంట్ పూర్తి కాలేదు. ముంబైలోని ఆర్బీఐకి నో యువర్ కస్టమర్ (కేవైసీ) తనిఖీ వివరాలు రాకపోవడంతో మీ డెబిట్ కార్డు అక్టోబర్ 21న బ్లాక్ అవుతుంది. ఈ కింది లింక్ క్లిక్ చేసి వివరాలు వెంటనే సబ్మిట్ చేయండి’ అంటూ పలువురికి ఫిషింగ్ గూగుల్ లింక్ పంపించింది. దేశవ్యాప్తంగా పలువురు ఇది నిజమేనని నమ్మి తమ బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ క్రెడెన్షియల్ వివరాలను ఆ లింక్ అడ్రస్కు పంపారు. పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు మోసాలు ఇలా.. ఖాతాదారుల నుంచి అందిన వివరాల ఆధారంగా వారి ఖాతాల్లోని డబ్బులను పేటీఎం, ఫోన్పేతో పాటు వివిధ మొబైల్ ఈ–వ్యాలెట్లకు ముఠా బదిలీ చేస్తోంది. ముఠా సూత్రధారి సంజయ్ కుమార్ మండల్.. తన ముఠా సభ్యులతో ఈ–వ్యాలెట్ల ద్వారా తనిష్క్, బిగ్బజార్ స్టోర్స్లో ఆన్లైన్లో గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేయిస్తున్నాడు. ఈ గిఫ్ట్ ఓచర్లతో ముఠా సభ్యులు ఆయా షోరూంలలో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆపై వాటిని బయట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఠాలో ఎవరెవరిది ఏ పాత్ర? సంజయ్ కుమార్ మండల్: ముఠా సూత్రధారి. సైబర్ నేరాల్లో ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ అవుతూ 2016 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. రామ్కుమార్ మండల్:వివిధ బుకింగ్ యాప్ల్లో నమోదయ్యే వారి కార్డు వివరాలు సేకరించి క్లోనింగ్ కార్డులు తయారు చేస్తుంటాడు. జామ్రుద్దీన్ అన్సారీ: ‘ఫిషింగ్ లింక్’ల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును ఈ–వ్యాలెట్లలోకి బదిలీ చేస్తూ.. పంజాబ్లో తనకు తెలిసిన వారి ద్వారా వివిధ సంస్థల గిఫ్ట్ వోచర్స్ను కొనుగోలు చేయించేవాడు. ఇందుకు వారికి కొంత కమీషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. జితేంద్ర మండల్: సోదరుడు రాజేంద్ర మండల్తో కలిసి 2016 నుంచి ఈ–వ్యాలెట్ మోసాలకు పాల్పడుతున్నాడు. బిరేందర్ కుమార్ మండల్: ముంబైలో కారు డ్రైవర్. ఐదు శాతం కమీషన్ తీసుకొని రామ్కుమార్ మండల్ ఈ–వ్యాలెట్లో బదిలీ చేసిన వాటితో దాన్బడ్, బొకారాలోని తనిష్క్ జ్యువెలరీ స్టోర్లో గిఫ్ట్ వోచర్లు (తనిష్క్ దుకాణాల్లో ఎక్కడైనా బంగారం కొనుగోలు చేసే కూపన్లు) కొని అతనికిచ్చేవాడు. రోహిత్ రాజ్: బిహార్ రాష్ట్రం సొహ్సరైలో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్న ఇతను ఐదు శాతం కమీషన్ తీసుకొని గిఫ్ట్ వోచర్లు ఇస్తుంటాడు. వైద్యురాలి ఫిర్యాదుతో గుట్టు రట్టు అక్టోబర్ 21న ఈ ముఠా పంపిన ఫిషింగ్ గూగుల్ లింక్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలికి వచ్చింది. అది నిజమేనని నమ్మి బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఆమె పొందుపరిచారు. దీంతో ఆమె ఖాతాలోని రూ.5,29,000 నగదు వివిధ మొబైల్ ఈ–వ్యాలెట్లకు బదిలీ అయ్యాయి. వెంటనే గుర్తించిన ఆమె అదే నెల 23న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలు సంపాదించిన పోలీసులు జంతారాకు వెళ్లి వారం పాటు మాటు వేశారు. అనంతరం ముఠాలోని రామ్కుమార్ మండల్, జామ్రుద్దీన్ అన్సారీ, జితేంద్ర మండల్, బిరేందర్ కుమార్ మండల్, రోహిత్ రాజ్ను పట్టుకుని ట్రాన్సిట్ వారంట్పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు. -
ఇక్కడ ఇక్రమ్.. అక్కడ ప్రశాంత్
పాకిస్తాన్లో పొరపాటున అడుగుపెట్టి బందీగా మారిన విశాఖ యువకుడు ప్రశాంత్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళ కోసం అక్రమ మార్గంలో పాక్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఏడాదిగా ఖైదీగా ఉన్న ఇక్రమ్ కేసు తెరపైకి వచ్చింది. ఇతను ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉండగా, నాంపల్లి కోర్టులో కేసు విచారణ ముగియగానే పాక్కు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ దుబాయ్లో ప్రేమ.. పెళ్లి పాతబస్తీకి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్తాన్కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ పరిచయమయ్యాడు. తాను భారతీయుడినని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి, ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్ వచ్చేశారు. ఆమెను వెతుక్కుంటూ హైదరాబాద్కు.. 2011లో ఇక్రమ్ సదరు మహిళను వెతుక్కుంటూ, దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చాడు. ఆపై రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి, అట్నుంచి హైదరాబాద్ చేరాడు. ఆరు నెలల తరువాత ఇక్రమ్ అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలిసి ఆమె అతడిని దూరం పెట్టారు. కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వాటిని కొందరికి ఆన్లైన్లో విక్రయించానని బెదిరించాడు. డబ్బివ్వకపోతే ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, అధికారులు గతేడాది జూన్లో ఇక్రమ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలా బయటపడింది.. ఇక్రమ్ అరెస్టయినపుడు.. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్టున్న సర్టిఫికెట్లు, అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్పోర్ట్, ఆధార్, ఇతర గుర్తింపుకార్డులు, పాక్ పాస్పోర్ట్కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతి స్వాధీనమయ్యాయి. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాక్ పాస్పోర్ట్తో దుబాయ్లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్ధారించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రి త్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్ ఎంఈఏకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ ఇచ్చిన జవాబు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. దీంతో ఇక్రమ్పై అభియోగపత్రాలు దాఖలయ్యా యి. ఈ కేసు విచారణ ముగిసి, అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందేనని ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కోర్టులో కేసు పెండింగ్ లేకుండా డిస్పోజైన వెంటనే అతడిని ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగిస్తామని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. -
ఇక మీతోనూ వార్ చేస్తా!
సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసులపై నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను అరెస్టు చేస్తున్నారు కదా..! ఇకపై మీ మీదా వార్ చేస్తా’... సైబర్ క్రైమ్ పోలీసులను ఉద్దేశించి ఈ మాటలు అన్నది ఏ తీవ్రవాదో, ఉగ్రవాదో కాదు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన సీతాఫల్మండి వాసి సూరజ్ కుమార్. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఇతను ఈ పని చేయడం వెనుక కుట్రలు లేవని, కేవలం ఓ చిన్న వివాదంలో తలదూర్చి, పోలీసులను అపార్థం చేసుకుని అనుచిత వ్యాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన సూరజ్కుమార్ ఎంసీఏ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసినా మానేశాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఇతడి ఇంటి సమీపంలో స్థానికులు రోడ్డు పక్కన ఓ ప్రార్థన స్థలం నిర్మించారు. దీంతో సూరజ్ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్మాణం చట్ట విరుద్ధమని, తక్షణం కూల్చేయాలంటూ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అది సున్నితమైన అంశం కావడం, నిర్మాణం అభ్యంతరకంగానూ లేకపోవడంతో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో స్థానిక ఏసీపీ, డీసీపీలతో పాటు పోలీసు కమిషనర్ వరకు వెళ్ళిన సూరజ్ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఓ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం లేఖ రాశాడు. ఇవన్నీ పూర్తి కావడానికి మూడేళ్ళు పట్టింది. ఎవరూ తన విషయాన్ని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో విచక్షణ కోల్పోయిన సూరజ్ కొన్ని రోజుల క్రితం తన ఫేస్బుక్ పేజ్లో డీజీపీతో పాటు మరికొందరు అధికారులు/అధికారిణు లను ఉద్దేశించి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై డీజీపీ కార్యాలయం గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం కొన్ని గంటల్లోనే ఛేదించింది. సీతాఫల్మండీలోని సూరజ్ ఇంటికి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అధికారుల్ని ఉద్దేశించి ‘భద్రతా కారణాల నేపథ్యంలో నేను ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నా. నా వివరాలు, చిరునామా మీకు ఎలా తెలిశాయి?’ అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ‘సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు రావాలంటే ముందు నాకు ఫోన్ ఇవ్వండి. ప్రతిపక్ష నేతలు, మీడియాతో మాట్లాడిన తర్వాతే మీతో వస్తా. లేదంటే నా భద్రతకు గ్యారెంటీ లేదు’ అంటూ హడావుడి చేశాడు. ఇతడిని సైబర్ క్రైమ్ ఠాణాకు తీసుకువచ్చిన అధికారులు వివిధ కోణాల్లో విచారించారు. సూరజ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో అలాంటి పనులు చేయవద్దని హితవు పలికారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతను ‘ఇప్పటి వరకు పోలీసుల పైనే యుద్ధం చేస్తున్నా. ఇకపై మీతోనూ (సైబర్ క్రైమ్ పోలీసులు) వార్ చేస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
మహిళా ఐఏఎస్, ఐపీఎస్లకు మన్మోహన్ వేధింపులు!
సాక్షి, హైదరాబాద్ : ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి అసభ్యంగా పోస్టులు పెడుతూ సీనియర్ పోలీసు అధికారిణిని వేధిస్తున్న వ్యక్తిని నగర సైబర్క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి అధికారిక ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారిణి ఈ నెల 3న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ మోహన్రావు నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటాతో నిందితుడు కృష్ణా జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం నిందితుడు కూనపురెడ్డి మన్మోహన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నిందితుడి స్వస్థలం కృష్ణాజిల్లా పెద ఓగిరాల. నిందితుడు కూనపురెడ్డి మన్మోహన్ సివిల్స్కు ప్రయత్నం చేశాడు. అయితే పరీక్షలో పాస్ అయినా... ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతగాడు సైకోలా మారాడు. మహిళా ఐపీఎస్, ఐఏఎస్ అధికారిణుల పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న సుమారు 54మంది అధికారుణుల పేరుతో ఈ ఖాతాలు తెరిచి...పోస్టులు చేస్తున్నాడు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి తన పేరుతో ఫేస్బుక్లో ఉన్న నకిలీ ఖాతాను గుర్తించారు. దీంతో ఫేస్బుక్ సంస్థ ప్రతినిధుల ద్వారా దాన్ని తొలగించినా... నిందితుడు మళ్లీ ఖాతా సృష్టించి అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఇలా ఏకంగా నాలుగుసార్లు చేయడంతో విసుగెత్తిన ఆ అధికారిణి సైబర్ క్రైమ్ను ఆశ్రయించారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. సివిల్స్లో ర్యాంకు రావడం లేదని.. ఆత్మహత్యాయత్నం సివిల్స్లో ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి మూసీనదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి అంబర్పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సైదా కుమార్తె ఇంద్రజ(27) సివిల్స్కు శిక్షణ పొందుతోంది. పలుమార్లు పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో గత కొంత కాలంగా మానసికంగా బాధపడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కారులో అంబర్పేట నుంచి మూసారాంబాగ్ మూసి బ్రిడ్జి మీదుగా ఇంటికి వెళుతున్న ఆమె కడుపులో తిప్పుతున్నట్లు అవుతుందని, కారు అపాల్సిందిగా డ్రైవర్ను కోరడంతో కారును నిలిపాడు. కారులో దిగిన ఆమె బ్రిడ్జి పైనుంచి ఒక్కసారిగా నదిలోకి దూకింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ నీటిలోకి దూకాడు. నీటి ప్రవాహానికి ఆమె ఒడ్డువైపు రావడంతో డ్రైవర్, వాహనదారులు కలిసి రక్షించారు. పోలీసులు ప్రాథమిక చికిత్స చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. -
దోస్త్ ఫారిన్ పోవొద్దని...
శంషాబాద్: స్నేహితుడు ఇస్తున్న విందులు, లభిస్తున్న విలాసాలు దూరమైపోతాయని అతడి విదేశీ ప్రయాణాన్ని రద్దు చేయడానికి ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకమిది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు పేలుస్తానంటూ బెదిరింపు మెయిల్తో భద్రతాధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన కస్టమర్ సపోర్ట్ మెయిల్కు కాలేరు సాయిరాం అన్న ఐడీతో ఓ సందేశం వచ్చింది. అందులో ‘ఐ వాంట్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ఎయిర్పోర్టు టుమారో’అని ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఐడీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేరు సాయిరాందిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఉప్పల్లోని ఫిర్జాదిగూడలో నివాసముండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కెనడాలో ఉన్నత చదువుల కోసం సాయిరాం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరంగల్కు చెందిన తన స్నేహితుడు శశికాంత్ నగరంలోనే ఎంటెక్ చదువుతూ అమీర్పేట్లో నివాసముంటున్నాడు. సాయిరాం మొదటిసారి వీసా రాకపోవడంతో రెండోసారి ఆగస్టు 5న తన వివరాలన్నింటిని పీడీఎఫ్ ఫైల్గా చేసి శశికాంత్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి కెనడా వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమయంలో శశికాంత్ సాయిరాం వివరాలన్నింటిని తస్కరించాడు. సాయిరాం వెళ్లిన తర్వాత కెనడా ఇమిగ్రేషన్కు అసభ్యకరమైన సందేశాలను సాయిరాం మెయిల్ ఐడీ ద్వారా పంపాడు. ఈ విషయమై సాయిరాంకు అక్కడి నుంచి సమాచారం రావడంతో వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతోంది. మరోసారీ చెడగొట్టాలని.. కెనడాలో ఉన్నత చదువుల కోసం మరోసారి సాయిరాంకు అవకాశం రావడంతో సెప్టెంబర్ 4న కెనడా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈసారి సాయిరాం ప్రయాణాన్ని ఎలాగైనా చెడగొట్టాలని శశికాంత్ నిర్ణయించుకున్నాడు. తాజాగా సెప్టెంబర్ 3న మరోసారి సాయిరాం ఐడీతోనే శంషాబాద్ విమానాశ్రయంలోని కస్టమర్సపోర్ట్ మెయిల్ ఐడీకి ఎయిర్పోర్టులో బాంబు పేలుస్తానంటూ సందేశం పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులను రంగంలోకి దింపారు. కాలేరు సాయిరాం ద్వారా వివరాలను సేకరించడంతో అతడి స్నేహితుడైన శశికాంత్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే తప్పుడు సందేశాలు పంపినట్లు అంగీకరించాడు. అతడి నుంచి ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టు భద్రతకు భగ్నం కలిగించే విధంగా వ్యవహరించినందుకుగాను వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్కుమార్, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు. -
కోల్కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ డేటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. కోల్కతా కేంద్రంగా అరాచకాలు సాగిస్తున్న కేడీలను కటకటాల వెనక్కి పంపారు. కోల్కతాలోని ఆన్లైన్ డేటింగ్ కంపెనీపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ జరిపి అందులో ముగ్గురిని అరెస్టు చేసి కలకత్తా కోర్టులో హాజరు పరిచారు. యువతి, యువకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ఈ ముఠా లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
ట్రూకాలర్ నుంచి ఫొటోలు ఆపై మార్ఫింగ్..!
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యువతుల ఫొటోలు సేకరించి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ ఘరానా మోసగాన్ని సిటీ సైబర్క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దాదాపు 300 మంది యువతుల ఫొటోలను సేకరించిన వైజాగ్కు చెందిన పాడు వినోద్కుమార్ వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నాడు. ఫొటోలు డిలీట్ చేయాలంటే డబ్బు చెల్లించాలంటూ సదరు యువతులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. (చదవండి : మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం) ట్రూకాలర్, ఇన్స్టా నుంచి ఫోటోలు వైజాగ్కు చెందిన పాడు వినోద్ కుమార్ను అరెస్ట్ చేశాం. నిందితుడు ట్రూ కాలర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. యూట్యూబ్లో చూసి మార్పింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని యువతుల ఫోటోలను మార్పింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన యువతుల పోటోలను డేటింగ్ సైట్లు, పోర్న్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అనంతరం బాధిత యువతులకు ఫోన్ చేసి పదివేలు ఇస్తే మార్పింగ్ చేసిన ఫోటోలను డిలీట్ చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఇంటర్ ఫెయిలైన వినోద్ వైజాగ్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి మొబైల్లో 250 నుంచి 300 మంది యువతుల పోటోలు, మార్పింగ్ ఫోటోలు ఉన్నాయి. సోషల్ మీడియాను ప్రజలు జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయరాదు. -సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్ -
శివాజీ పాస్పోర్ట్ సీజ్..
-
శివాజీ పాస్పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. చదవండి: పోలీసుల అదుపులో సినీనటుడు శివాజీ -
సీరియల్స్లో ఛాన్స్ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి అవకాశాల ఇస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరులో నివాసం ఉంటోంది. బుల్లితెర సీరియల్స్ను క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్గా శ్రీదేవి తుమ్మల అని వచ్చింది. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్లు అవాలనుకునేవారితో ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని విలాస జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. అలాగే మణికొండకు చెందిన క్రాంతికుమార్కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి చాట్చేసి సన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న శ్రీలత పలుమార్లు తన బ్యాంక్ ఖాతాల్లో అతడితో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. అయితే ఈ విషయం ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
అరెస్ట్కు రంగం సిద్ధం
-
మూడోరోజు విచారణకు రవిప్రకాశ్
-
మూడోరోజు విచారణకు హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మూడోరోజు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. (రెండోరోజూ అదే తీరు!) ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న రవిప్రకాశ్ విచారణ
-
రవిప్రకాశ్కు పోలీసుల ప్రశ్నల పరంపర
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. (సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్) కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి..? శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ? మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా..! టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..? టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..? యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..? ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకు తిరిగారు...పోలీసులకు ఎప్పుడో లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా.. అని పోలీసులు రవిప్రకాశ్కు పలు ప్రశ్నలు సందించారు. -
రెండోరోజు విచారణకు రవిప్రకాశ్..
-
సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. 27 రోజులుగా పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఎట్టకేలకు మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. (పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్) సైబర్క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మీడియాకు మాఫియాకు తెలుగు నెలమీద యుద్ధం జరుగుతోంది. మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించి, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. నాకు కొంత మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్కు చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా’అని ముగించారు. -
నిర్షా అడవుల్లో ‘ఓటీపీ కేటుగాళ్లు’..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాంకుల్లో పని చేస్తున్న అధికారుల మాదిరిగా ఫోన్లు చేసి వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సైతం సంగ్రహించి అందినకాడికి దోచుకునే ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇవి ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలే కాదు... చివరకు అడవుల్నీ అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నాయి. జార్ఖండ్లోని నిర్షా అడవుల కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. శనివారం వీరికి చిక్కిన ఓ ముఠా సభ్యుడు తాము హైదరాబాద్కు చెందిన వారినీ ముంచినట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయంపై ఇక్కడి పోలీసులను సంప్రదించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. డార్క్ నెట్ నుంచి నెంబర్లు... జార్ఖండ్కు చెందిన ముఖేష్ ప్రసాద్ నేతృత్వంలో అజయ్ శర్మ, మిథున్కుమార్ ఓ ముఠాగా ఏర్ప డ్డారు. బోగస్ చిరునామాలు, ధ్రువీకరణలతో వివిధ సిమ్కార్డులు తీసుకున్నారు. వీటి ఆధారంగా దేశ వ్యాప్తంగా ‘ఓటీపీ క్రైమ్స్’చేయడం మొదలెట్టారు. అయితే జనం మధ్యలో ఉండి ఈ వ్యవహారం నడిపితే బయటకు పొక్కుతుందని భావించారో ఏమో... నిర్షా ప్రాంతంలో ఉన్న చిట్టడవిని తమ అడ్డాగా మార్చు కున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ అందే ఏరియాలో కొందరు టెలీకాలర్స్ను ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అథోజ గత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి ప్రసాద్ వివిధ బ్యాంకులకు చెందిన వినియోగదారుల ఫోన్ నెంబర్లు ఖరీదు చేశాడు. ఆయా ఖాతాదారులకు ఫోన్లు చేసే ఈ కాలర్స్ బ్యాంకు అధికారులు, ఎగ్జిక్యూటివ్స్గా పరిచయం చేసుకుంటారు. ఒక్కొక్కరు డజను ఈ–వాలెట్స్... ఇలా చేయడానికి ముందే ఈ ముగ్గురు సూత్రధా రులు బోగస్ వివరాలతో ఒక్కొక్కరు దాదాపు డజను వరకు ఈ–వాలెట్ అకౌంట్లు తెరిచారు. తమ టెలీకాలర్లు వాడుతున్న ఫోన్ నెంబర్లను ట్రూ కాలర్ యాప్లో ఆయా బ్యాంకులకు చెందిన హెడ్– ఆఫీస్లు అంటూ సేవ్ చేశారు. ఓ బ్యాంకు ఖాతాదా రుడికి ఫోన్ చేయడానికి ఆ బ్యాంకు పేరుతో సేవ్ చేసిన సిమ్కార్డునే వినియోగించేవారు. ఈ ఫోన్లు అందుకున్న వారికి ఆధార్ లింకేజ్ అని, వివరాలు అప్డేట్ అని, సాంకేతిక కారణాలతో ఖాతా ఫ్రీజ్ అవుతోందని చెప్పి భయపెట్టేవాళ్లు. ఇలా తమ దారి కి వచ్చిన ఖాతాదారుడి నుంచి వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని సంగ్రహించేవారు. ఆ వెంటనే ఈ వివరాలు వినియోగించి అతడి ఖాతాలోని డబ్బును తమ ఈ–వాలెట్స్లోకి మళ్లించి కాజేసేవారు. రోజు కో సిమ్కార్డు మార్చేసే వీరిని మళ్లీ సంప్రదించాలని బాధితుడు యత్నించినా ఫలితం ఉండేది కాదు. రెండేళ్లుగా వేటాడిన ఢిల్లీ కాప్స్... ఈ గ్యాంగ్ 2017లో ఢిల్లీకి చెందిన సీబీఎస్ఈ రిటైర్డ్ అధికారి సుభీర్సింగ్ను టార్గెట్ చేసింది. అతడికి ఫోన్ చేయించిన ఈ కేటుగాళ్లు బ్యాంకు ఖాతా క్లోజ్ అయిపోతోంది అంటూ భయపెట్టారు. ఆయన నుంచి ఓటీపీ సహా ఇతర సమాచారం సంగ్రహించి ఆయన ఖాతాలోని రూ.2 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక ఆధారాలను బట్టి ఆ నగదు కొన్ని ఈ–వాలెట్స్లోకి బదిలీ అయినట్లు గుర్తించి ఆరా తీశారు. ఎట్టకేలకు జార్ఖండ్కు చెందిన ప్రసాద్, మిథున్, అజయ్ సూత్రధారులుగా గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని పంపినా వీరు చిక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి కదలికలపై కన్నేసి ఉంచిన ఢిల్లీ పోలీసులు శనివారం మిథున్ అక్కడకు వచ్చిన విషయం తెలుసుకుని పట్టుకున్నారు. విచారణలో హైదరాబాద్ వివరాలు... మిథున్ను విచారించిన పోలీసులు స్కామ్ మొత్తానికి ప్రసాద్ సూత్రధారిగా తేల్చారు. దీంతో అతడితో పాటు అజయ్ కోసమూ గాలిస్తున్నారు. ఈ పంథాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్కు చెందిన వారికీ టోకరా వేశామని మిథున్ బయటపెట్టాడు. అయితే నగరంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఇలా 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు ఏ కమిషనరేట్ పరిధికి చెందిన వారో స్పష్టంగా తెలియట్లేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. దీంతో 3 కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మిథున్ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాతే ఇక్కడి పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. -
విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్వో మూర్తి
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్లు, నాలుగు ల్యాప్టాప్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ ఏబీసీఎల్ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రవిప్రకాశ్, నటుడు శివాజీ, సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తికి నోటీసులు జారీ చేశారు. అయితే రవి ప్రకాశ్, శివాజీ నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానికి ఉత్కంఠ నెలకొంది.మరోవైపు ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐలు ఇవాళ ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిశారు. -
మోసమదే.. పంథానే మారింది!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేందుకు రోజురోజుకూ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్ ప్రతినిధులుగా ఖాతాదారులకు ఫోన్ చేసి డెబిట్కార్డు కాలవ్యవధి ముగిసిందంటూ రెన్యువల్ చేసేందుకు సేకరించేవారు. ఈ రకం మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో రూటు మార్చారు. సరికొత్తగా బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ–కామర్స్ సైట్లు, రెడ్బస్ యాప్ లాంటి బుకింగ్ అప్లికేషన్లలో ఆన్లైన్ సేవలు వినియోగించుకున్న వారి బ్యాంకు కార్డు వివరాలను సేకరించి పిన్ నంబర్ కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా రూఢీ చేసుకుని కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులను డ్రా చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొల్లగొట్టారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు జరిపిన సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు జామ్తార, బర్ధమాన్ ప్రాంతాలకు చెందిన 10 మంది అంత ర్రాష్ట్ర మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్టీఎఫ్ ఏసీపీ శ్యాంబాబులతో కలసి సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. 3 లక్షల కాల్స్ ప్రధానంగా ప్రయాణాలు చేసేందుకు రెడ్బస్ యాప్లో టికెట్ బుక్ చేసుకున్న వారిని టార్గెట్ చేసుకున్నారు. ఆ యాప్లోకి వెళ్లి బ్యాంక్ డెబిట్ కార్డు వివరాల కోసం ప్రయత్నించేవారు. చాలావరకు బ్యాంకు కార్డు నంబర్ల తొలి 6 అంకెలు ఒకేలా ఉండటంతో మిగిలిన 10 నంబర్లను ర్యాండమ్గా టైప్ చేసేవారు. దీంతో కొన్ని కార్డుల వివరాలు సరిపోలడంతో ఆ వెంటనే ఎక్స్పైరీ డేట్, సీవీవీ నంబర్లు వాటంతట అవే వస్తుండేవి. బ్యాంక్ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) కస్టమర్ కేర్ కాల్సెంటర్ 18601207777కు ఫోన్ చేసేవారు. అది కనెక్ట్ కాగానే బ్యాంక్ ఖాతా నంబర్ టైప్ చేసి, ఆ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే పిన్ నంబర్ టైప్ చేయాలని కోరితే.. ర్యాండమ్గా ఫ్యాన్సీ, లక్కీ నంబర్లు టైప్ చేసేవారు. ఇలా మార్చి 13 నుంచి 30 వరకు ఏకంగా 3 లక్షల కాల్స్ చేశారు. వాటిల్లో దాదాపు 3,500 బ్యాంక్ కార్డు నంబర్లతో పిన్లు సరిపోలాయి. దాదాపు 12 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కార్డుల ద్వారా ఒక్కో దాని నుంచి రూ.35 వేల నుంచి లక్షన్నర వరకు డ్రా చేసేవారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తోనే ఫోన్ చేయాలన్న నిబంధన లేకపోవడంతో 900 అన్రిజిçస్ట్టర్డ్ మొబైల్ నంబర్ల నుంచి వీరు కాల్ చేశారు. ఐవీఆర్కు రోజూ 3 వేల వరకు వచ్చే కాల్స్ 30 వేలకు చేరుకున్నాయి. కాగా, తమ బ్యాంక్ ఖాతా నుంచి తమ ప్రమేయం లేకుండానే డబ్బులు డ్రా అవుతున్నాయం టూ ఐసీఐసీఐ బ్యాంక్కు ఫిర్యాదులు పొటెత్తాయి. రెడ్బస్ యాప్ ప్రతినిధులను పిలిపించి వారి అప్లికేషన్లోనూ మార్పులు చేసుకోవాలంటూ సూచిస్తామని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. కేసు విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, ఖాతాదారులకు మోసపోయిన నగదును తిరిగి జమ చేస్తామని తెలిపారు. బ్యాంకులు ఇది చెయ్యాలి.. - బ్యాంక్ ఖా తాతో రిజిస్టరైన మొబైల్ నంబ ర్లతోనే కస్టమర్ కేర్ సర్వీస్ను సంప్రదించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలి. - సైబర్ మోసాలను నియంత్రించేందుకు రిజిస్టర్డ్ మొబైల్ బ్యాంక్ కస్టమర్లు, తరచుగా ఫోన్కాల్ చేసే మోసగాళ్లను గుర్తించేలా సాఫ్ట్వేర్ రూపొందించాలి. అన్రిజిస్టర్డ్ నంబర్ల నుంచి కాల్స్ రాకుండా బ్లాక్ చేయాలి. చదివింది తక్కువే.. జార్ఖండ్లోని జామ్తార జిల్లాకు చెందిన దుర్యోధన్ మండల్, వీరేంద్రకుమార్ మండల్, ధనంజయ్మండల్, నిరంజన్ మండల్, ప్రకాశ్ కుమార్, గణేశ్ కుమార్ మండల్, కమలేశ్ మండల్, రాజేంద్రకుమార్, పింకు కుమార్ మండల్, పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లాకు చెందిన సంజయ్కుమార్లు ఇలాంటి మోసాలకు పాల్పడటంలో నిష్ణాతులు. వారంతా చదివింది మాత్రం ఏడో తరగతి వరకే. బ్యాంకు ఖాతాదారులకు బదులు బ్యాంకు నుంచే వివరాలు సేకరించి డబ్బులు కొల్లగొడుతున్నారు. -
ఐటీగ్రిడ్స్ స్కాం: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉద్యోగులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కుందన్బాగ్లోని హైకోర్టు జడ్జి నివాసం వద్దకు వారిని తీసుకువచ్చారు. వారితో పాటు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరైయారు. ఇదిలావుండగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. టీడీపీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పౌరుల డేటా చోరీ స్కామ్కు పాల్పడినట్టు గుట్టురటైన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వారివద్ద ఉందని తుమ్మల లోకేశ్వర్రెడ్డి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఐటీగ్రిడ్స్పై నగరంలో మరోకేసు నమోదైంది. సేవమిత్ర ఆప్ పేరుతో ప్రభుత్వ లబ్దిదారుల సమాచారాన్ని చోరీ చేశారంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్కు చెందిన రామ్రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరుకు విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. (ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా స్కామ్!) -
డేటా స్కామ్!
-
ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా స్కామ్!
సాక్షి, హైదరాబాద్ / అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదార్లు తొక్కుతోంది. ఇందుకోసం 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతి రేకంగా ఉన్నవారి ఓట్లను తొల గించడానికి, ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేయడానికి కుట్ర పన్నుతోంది. హైదరాబాద్లో బయటపడ్డ డేటా చోరీ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే ఈ డేటా చోరీ స్కామ్కు పాల్పడినట్టు గుట్టురట్టు కావడంతో ‘పచ్చ’నేతల్లో వణుకు మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. ఈ కుంభకోణంపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తుమ్మల లోకేశ్వర్రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఏపీ పోలీసులు ఆదివారం ప్రయత్నించడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారితోపాటు ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. అంటే ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్కు అందజేసిందన్నమాట. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్నకు ప్రజల ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, రాష్ట్రంలో దాదాపు 3.50 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ యాప్లో చేర్చారు. ప్రజల ఆధార్, ఓటర్ ఐడీల వివరాలు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. దీన్ని గుర్తించిన సామాజిక కార్యకర్త, ఇందూ ఫార్టూన్ ఫీల్డ్స్ వాసి తుమ్మల లోకేశ్వర్రెడ్డి కొద్దిరోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ల జాబితాలో లేకపోవడాన్ని లోకేశ్వరరెడ్డి గుర్తించారు. (ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్) లోకేశ్వర్రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు 120(బి), 379, 420, 188 ఐపీసీ, సెక్షన్ 66(బి), 72 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కొండాపూర్, కేపీహెచ్బీ కాలనీల్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. కొన్ని హార్డ్డిస్క్లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్ను సైతం ఆధీనంలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ ఉద్యోగులైన రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్గౌడ్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆదివారం విచారణకు హాజరు కాలేదు. డాకవరం అశోక్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. (చంద్రబాబు, లోకేష్ల కుట్రే) కీలక సమాచారం తొలగింపు! డేటా స్కామ్సై గత నెల ఆఖరి వారంలో సైబరాబాద్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ఫిబ్రవరి 26న మీడియాలో వచ్చింది. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్లో మార్పులు చేర్పులు చేసి, అప్గ్రేడ్ చేసినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన ఫొటో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ వద్ద ఉన్న ప్రజల వ్యక్తిగత, ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేవామిత్ర యాప్ను లోకేశ్వర్రెడ్డి గమనించినప్పుడు అందులో ఓటర్ జాబితా ప్రకారం ప్రజల ఫొటోలు, వివరాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలియడంతో ఐటీ గ్రిడ్స్ సర్వర్ నుంచి కీలక సమాచారాన్ని డిలీట్ చేయడంతోపాటు సర్వర్లను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసుల కొన్ని హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. (ఐటీ గ్రిడ్ డేటా స్కామ్ సూత్రధారి బాబే) లోకేశ్వర్రెడ్డి కిడ్నాప్కు ఏపీ పోలీసుల యత్నం ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఏపీ పోలీసులు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన లోకేశ్వర్రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. గుంటూరుకు చెందిన డీఎస్పీ కులశేఖర్, ఇన్స్పెక్టర్ బాలమురళీ కృష్ణ సహా నలుగురు పోలీసులు లోకేశ్వర్రెడ్డి ఇంటికి వచ్చారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుర్భాషలాడారు. ఫిర్యాదు చేయడానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిదంటూ బెదిరించారు. ఓ దశలో కిడ్నాప్ చేసి తమతోపాటు ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆయన ఫోన్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేపీహెచ్బీ, మియాపూర్ ఇన్స్పెక్టర్లు లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. భాస్కర్ అనే ఉద్యోగి అదృశ్యంపై గుంటూరులోని ఓ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని, దర్యాప్తులో భాగంగా లోకేశ్వర్రెడ్డిని ఏపీకి తరలిస్తున్నామంటూ ఏపీ పోలీసులు వాదించారు. తమ సంస్థ ఉద్యోగిభాస్కర్ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్స్ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పడం గమనార్హం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ పోలీసులు నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం లోకేశ్వర్రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు వెళ్లి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో అధికారులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరిగారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేయడం గమనార్హం. అడ్వొకేట్ జనరల్తో చంద్రబాబు మంత్రాంగం ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాకం బయటపడి, తామే దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై ఆదివారం ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీధర్తో గంటన్నరపాటు చర్చించారు. డేటా స్కామ్పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎదురు కేసు పెట్టాలా? మరేదైనా చేయాలా? అనేదానిపై సమాలోచనలు జరిపారు. డేటా చోరీ కుంభకోణాన్ని తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య వివాదంగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా మీడియాకు లీకులు ఇచ్చి ఇదేదో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగాను, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీలపై నెపాన్ని నెట్టేందుకు పాట్లు పడ్డారు. ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ సీరియస్ క్రైమ్ ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురికావడం సీరియస్ క్రైమ్ అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్నకు ఎలా అనుసంధానిస్తారని సైబర్ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇదే పని యూరప్, అమెరికా దేశాల్లో చేస్తే తక్షణమే జైలులో పెడతారని గుర్తుచేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ నెంబర్(ఆధార్ కార్డు) లాంటి వాటిని చట్ట వ్యతిరేకంగా వాడినా, ప్రైవేట్ వ్యక్తులకి అందచేసినా అది తీవ్రమైన నేరమే. ఇలాంటి నేలరకు కఠిన శిక్షలు అమలు చేయాలని డేటా ప్రైవసీ చట్టాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణ సక్రమంగా జరపాలని, రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడానికి ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దీనిపై చంద్రబాబు, లోకేశ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కుంభకోణంలో అధికారుల పాత్ర! ఆధార్ డేటాబేస్ అనేది పూర్తిగా వ్యక్తిగత వివరాలతో కూడి ఉంటుంది. ఆధార్ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ డేటా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సహా ఎవరి వద్దా ఉండకూడదు. కనీసం నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు, పోలీసులకు కూడా ఈ డేటాబేస్లోకి యాక్సెస్ ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంక్షేమ పథకాలకు సంబం«ధించిన లబ్ధిదారుల జాబితాలను వ్యక్తిగత వివరాలతో సహా ఎవరికీ/ప్రైవేట్ సంస్థలకు అందించకూడదు. తాజాగా బయటపడిన డేటా చోరీ కుంభకోణంలో ప్రభుత్వ అధికారుల పాత్ర (ఐపీసీ 188) కూడా ఉందని అనుమానిస్తున్నారు. చోరీ (ఐపీసీ 370) ద్వారానే డేటా సంగ్రహించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. దీన్ని వినియోగించి సేవామిత్ర సంబంధీకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని (ఐపీసీ 420) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్ కేంద్రంగా జరగడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని 66, 72 సెక్షన్లనూ ఈ కేసులో జోడించారు. సేవామిత్ర యాప్తో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు పకడ్బందీగా స్కెచ్ వేశారు. సేవామిత్ర యాప్ను డౌన్లోడ్ చేసిన ట్యాబ్లను తమ బృందాలకు ఇచ్చి, మైక్రో లెవెల్ సర్వేలు అంటూ గ్రామాల్లో పంపిస్తున్నారు. ఈ యాప్లో ప్రజలందరి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. బృందాలుగా వెళ్లే యువకులు ఓటర్లను స్వయంగా కలుసుకుంటున్నారు. మీరు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని నచ్చజెబుతున్నారు. సదరు ఓటరును టీడీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా? ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్ల్లోనే సమాధానాలు నమోదు చేసి, పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు. సర్కారు పనితీరుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసిన, ప్రతిపక్షానికి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం తమ ఓటును తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఆన్లైన్లో ఫారం–7 సమర్పిస్తున్నారు. యాప్లో ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఓట్లు కొనేయడానికి నేరుగా నగదు జమ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ‘మిస్సింగ్’ డ్రామా తమ ఉద్యోగి కన్పించడం లేదని ఒక సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్పై ఏపీ పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. రాత్రికి రాత్రే కేసు నమోదు చేసారు. అంతేవేగంగా వందలాది మంది పోలీసులు అర్ధరాత్రికే హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయం వద్దకు చేరి కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం గాలించేందుకు వచ్చామన్నారు. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ స్కామ్ గుట్టురట్టు కావడంతో శనివారం రాత్రి జరిగిన ‘మిస్సింగ్ హైడ్రామా’ ఇది. డేటా చోరీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకుడు రేగండ్ల అశోక్ తమ ఉద్యోగి కటకం భాస్కర్ కన్పించడం లేదంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు శనివారం రాత్రి వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత నెల 28న పెదకాకాని ప్రాంతంలోని ఐజేఎం అపార్టుమెంట్కు వచ్చిన భాస్కర్ హైదరాబాద్కు తిరిగిరాలేదంటూ అశోక్ పంపిన వాట్సాప్ మెసేజ్ను ఎస్పీ పెదకాకాని సీఐకి పంపించి కేసు నమోదు చేయించినట్టు సమాచారం. పెదకాకాని పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేయగా, కేవలం గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీస్కు చేరుకున్నారు. భాస్కర్ మిస్సింగ్ కేసు నమోదైనందునా అతని ఆచూకీ కోసం వచ్చినట్టు చెప్పిన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్కు పాల్పడిందని, దానిపై కేసు నమోదు చేసి భాస్కర్తోపాటు మరికొందరు ఉద్యోగులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్టు తేల్చిచెప్పారు. -
ఏపీ పోలీసులు నన్ను వేధిస్తున్నారు: లోకేశ్వరరెడ్డి
-
డేటా లీక్ వెనక ‘బ్లూ ఫ్రాగ్’ హస్తం?
-
‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీక్ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని కూకట్పల్లి చెందిన లోకేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఓటర్ల డేటా ప్రైవేటు సంస్థలు చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తే ఏపీ పోలీసులు తనను వేధిస్తున్నారన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడిన లోకేశ్వర్రెడ్డి.. ‘ఏపీలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అసలు ఏపీ ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది. ఓటర్లను భయభ్రాంతలను గురి చేస్తున్నారు. తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే నాపైనే వేధింపులకు దిగుతున్నారు. దొంగ ఓట్లపై ఒకటిన్నర సంవత్సరంగా పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారు. (ఇక్కడ చదవండి: ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు) ఒక సామాజిక కార్యకర్తగా, టెక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా నేను ఈ కేసు వేశాను. ఏపీలో దొంగ ఓట్లపై ప్రశ్నించా. నేను కేసు నమోదు చేసినప్పటి నుండి నాపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీ పోలీసులు మా ఇంటిపై దాడి చేశారు. అరగంట పాటు మా ఇంట్లో పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు. ఒక ప్రైవేటు సంస్థకి ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయి. ఏపీ ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుంది. విచారణ చేయాల్సిన ఏపీ అధికారులు నన్ను వేధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. లక్షల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుంది. నాకు ప్రాణ హానీ ఉంది. నాకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించా. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేశా’ అని లోకేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. (ఇక్కడ చదవండి: ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు) -
‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’
-
డేటా లీక్ వెనక ‘బ్లూ ఫ్రాగ్’ హస్తం?
సాక్షి, హైదరాబాద్ : అధికారమే పరమావధిగా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు అండ్ కో పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 2016 నుంచే డేటా అక్రమ వినియోగం కోసం ప్రణాళికలు కొన సాగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకునేందుకు టీడీపీ తన అధికారిక యాప్ ‘సేవా మిత్ర’ ఉపయోగించుకుంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జ్ అనలిటికాను తలపిస్తున్న టీడీపీ సేవా మిత్రా యాప్ వ్యవహారం వెనుక ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ మొబైల్ టెక్నాలజీ సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్కు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డేటా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఇచ్చినట్లు సమాచారం. ఈ సంస్థ రైతు సహకార సమితి, ఎన్ఆర్ఈజీఎస్, ఏపీ ఇరిగేషన్కు సంబంధించి సాంకేతిక సహాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డేటా మొత్తం లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా హ్యాకర్స్ చేతికి చిక్కితే... భయంకరమైన పరిణామాలుంటాయని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు డేటాతో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినందున బ్యాంక్ అకౌంట్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి... ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు -
లోకేశ్వర్ రెడ్డి అరెస్ట్కు ఏపీ పోలీసుల యత్నం!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్ గుట్టును బట్టబయలు చేయడంతో ఏపీ సర్కార్ వాస్తవాలు కప్పిపుచ్చేందుకు పోలీసులను ఉపయోగిస్తోంది. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన కూకట్పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని ఆయన నివాసం వద్ద ఏపీ పోలీసులు ఆదివారం భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ...లోకేశ్వర్ రెడ్డిని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. చదవండి...(ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు) మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థలో పని చేస్తున్న తమ నలుగురు సహచరులు కనిపించడం లేదంటూ సహ ఉద్యోగి అశోక్ ...హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్గౌడ్ కనిపించడం లేదంటూ... తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, సైబర్క్రైం వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీకి సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవరకు వెళ్లింది. కాగా ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక డేటాను సేకరించినట్టు తెలుస్తోంది. డేటా చోరీ వెనుక టీడీపీకి చెందిన పలువురి హస్తం ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల దగ్గర అత్యంత భద్రంగా ఉండాల్సిన డేటా... బయటికి ఎలా లీక్ అయ్యిందనే అంశంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్కు ఈ డేటా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే డేటా చోరీ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధార్తో సంబంధం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారానే డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించినట్లు సమాచారం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ద్వారా ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థకు అందజేసినట్లు తెలుస్తోంది. -
ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణంలో మరో మలుపు
-
పరారీలో ఐటీ గ్రిడ్స్ నిర్వాహకుడు ఆశోక్ దాకవరపు
-
టీడీపీ సర్కార్ బాగోతం మరోసారి బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : 2019లో గెలుపే లక్ష్యంగా యధేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ సర్కార్ భాగోతం మరోసారి బట్టబయలు అయింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ పేరుతో చేస్తున్న ‘పచ్చ’ కుట్రలను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు అయింది. ప్రజల వ్యక్తిగత డాటాను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను కొట్టేసిన ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ చెందిన పలువురుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడు అశోక్ దాకవరపు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ... టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్ యధేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎస్సార్ సీపీ నేత లోకేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత మూడు రోజుల నుంచి మాదాపూర్లోని ఆ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఐటీ గ్రిడ్లో పని చేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదంటూ ఆ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భాస్కర్ కోసం ఏపీ పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వచ్చారు. అయితే డాటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు వారికి తెలిపారు. భాస్కర్ను తమకు అప్పజెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరుగుతున్నారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. సేవా మిత్ర యాప్లో... కాగా సేవా మిత్ర యాప్లో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు ఆధార్ వివరాలు, ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి వివరాలతోపాటు కలర్ ఫోటో కూడా ఉంది. ఇది ఎన్నికల సంఘం, ఆధార్ నిబంధనలకు విరుద్ధం. అయితే ఆ కంపెనీకి డాటా ఎలా వచ్చిందనే దానికి ఇప్పటికీ ఆధారాల్లేవు. పైగా ఆ కంపెనీకి ప్రమోటర్స్ టీడీపీకి చాలా దగ్గర వ్యక్తులు కావడంతో గోప్యంగా ఉంచాల్సిన డాటాను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిప్పులు చెరిగిన చంద్రబాబు... మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు. సాక్షాత్తూ ఏపీ ఐటీ మంత్రి లోకేష్... ముఖ్యమంత్రి కూడా తమ కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేస్తోందని గగ్గోలు పెట్టడం చూస్తుంటే.. ఏపీలో ఓటర్ల జాబితా నుండి వైఎస్సార్ సీపీ అభిమానుల పేర్లను తొలగించడంలో ఈ కంపెనీయే కీలక పాత్ర పోషిస్తోందన్న విమర్శలున్నాయి. -
పచ్చ రాకెట్ గుట్టు రట్టు
-
మరో ముగ్గురికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి ఐదుగురికి నోటీసులు పంపిన పోలీసులు.. గురువారం మరో ముగ్గురికి నోటీసులిచ్చారు. ఈ కేసుకు కీలక ప్రాధాన్యమి స్తున్న విచారణ బృందం సాంకేతికంగా బాధ్యుల్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. దాదాపు 60 యూట్యూబ్ లింకులను షర్మిల తన ఫిర్యాదులో పొందుపరిచారు. వీటి ఆధారంగా విచారణ ప్రారంభించిన సైబర్క్రైమ్ పోలీసులు.. ఆయా యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి చెందినవో తెలుసుకుని విచారణకు పిలుస్తున్నారు. గురువారం వరకు మొత్తం 15 మందిని విచారించారు. వీరిలో కొందరు షేర్ చేసిన, పోస్ట్ చేసిన విషయాలు అభ్యంతరకరంగా ఉన్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వీరికి సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. అభియోగపత్రాల దాఖలు అనంతరం వీరు కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్ యాజమాన్యానికి, గూగుల్కు లేఖలు రాశారు. మరోపక్క ఆయా వీడియోలను వీక్షించిన వారు దిగువన చేసిన కామెంట్స్లో కొన్ని ఆక్షేపణీయంగా ఉన్నాయి. వీటినీ సీరియస్గా తీసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు ఆ సబ్స్క్రైబర్స్ను గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం వారి ఐడీలకు సంబంధించిన లాగిన్, ఐపీ వివరాలు సంపాదించే పనిలో ఉన్నారు. -
వైఎస్ షర్మిల ఫిర్యాదుపై సైబర్ క్రైం విచారణ
-
సలహా వల..షేర్లంటూ శఠగోపం
సాక్షి, హైదరాబాద్ : షేర్ మార్కెట్లో నమ్మకమైన సలహాలు..అంటూ వల విసిరి ఆ తర్వాత ప్యాకేజీలుగా టోకున సూచనలు ఇస్తామని బుట్టలో వేసుకొని చివరికి పెట్టుబడిపెట్టండి రూ.లక్షలు పట్టండి అంటూ శఠగోపం పెట్టిన నాలుగు బోగస్ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్లో నిర్వహిస్తున్న 4 సెబీ రిజిష్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు పట్టుకొని ట్రాన్సిట్ వారంట్పై శనివారం నగరానికి తీసుకువచ్చారు. షేర్మార్కెట్లో లాభాలొస్తాయంటూ సలహాల పేరుతో రూ.15 లక్షల 61 వేలు మోసగించారని నలుగురు బాధితులు గతే డాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు. మొదట టెలికాలర్లు.. తర్వాత డైరెక్టర్లు ఎంబీఏ చదివిన స్వప్నిల్ ప్రజాపతి, అఖిలేష్ రఘువంశీ, సంతోష్ సింగ్ పరిహర్, సాగర్ సాహూలు సెబీ విద్యా అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెటీస్ నుంచి పీజీ డిపోమా కోర్సు లు చేసి ఆ తర్వాత సెబీ వద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీలుగా రిజిష్టర్ చేసుకున్నారు. ఈ సమయంలోనే వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ అడ్వై జరీ కంపెనీలో టెలికాలర్లుగా పనిచేసిన వీరు ఆ అనుభవంతో వేర్వేరు సంవత్సరాల్లో కంపెనీలు ఎవరికి వారు ఏర్పాటుచేసుకొని నిర్వహిస్తున్నారు. హైబ్రో మార్కెట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వేటూస్ క్యాపిటల్.కామ్ను స్వప్నిల్ ప్రజాపతి, ద ఇక్వికామ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దఇక్వికామ్.కామ్ పేరుతో అఖిలేష్ రఘువంశీ, ట్రేడ్ బిజ్ రీసెర్చ్ పేరుతో ట్రేడ్బిజ్ఇండియా.కామ్ పేరుతో సంతోష్ సింగ్ పరిహర్, సఫల్ రీసెర్చ్ పేరుతో షఫల్రీసెర్చ్.కామ్ పేరుతోసాగర్ సాహూలు స్టాక్ మార్కెట్లలో అతి తక్కువ కాలంలో లాభాలంటూ డీమ్యాట్ ఖాతాదారులకు వల విసురుతున్నారు. ఇండోర్లోని విజయ్నగర్ కాలనీలో ఐటీ కంపెనీలను తలదన్నేలా సకల సౌకర్యాలతో కార్యాలయాలను నిర్వహిస్తూ 530 మంది టెలికాలర్లను నియమించుకొని రోజుకు వేలాది ఫోన్కాల్స్ చేస్తూ డబ్బును రెట్టింపు చేస్తామంటూ తియ్య టి మాటలతో కట్టిపడేస్తున్నారు. రూ.1.3 లక్షలు పెడితే నెలలో రూ.45 లక్షల లాభమంటూ... స్టాక్ మార్కెట్లో డీ మ్యాట్ ఖాతాదారుల వివరాలు సేకరించిన వీరు టెలికాలర్లు ద్వారా ఫోన్కాల్స్ చేస్తారు. ఫలానా సమయంలో ఫలానా షేర్ ధర పెరుగుతుంది, తగ్గుతుందంటూ వారిని నమ్మిస్తారు. వీరు చెప్పినట్టుగానే షేర్ల ధరలు ఉండటంతో నమ్మిన వేలాది మంది లాభాల కోసం రూ.5,900 ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. అలాగే 45 రోజుల్లో రూ.2,75,00 ల లాభానికి రూ. 22,499, రూ.7,50,000 లాభానికి రూ. 33,999లను ప్రాజెక్టుల రూపంలో చార్జీలు, టెక్నికల్ రిపోర్టుల కోసం ఒక్కోదానికి రూ.3,999 చొప్పున 20 అంటే రూ.79,980 లు వసూలు చేయడంతో పాటు 18 శాతం జీఎస్ టీని కూడా బాధితుల నుంచి తీసుకుంటున్నారు. లాభాల కోసం సలహాలు పక్కనపెడి తే డీ మ్యాట్ ఖాతా ద్వారా రూ.1,30,000లు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రూ.45 లక్షల లాభాలు వచ్చేలా చూస్తామని చెప్పడంతో పాటు చెల్లించే డబ్బులో 18 శాతం జీఎస్టీ, సెక్యూరిటీ డిపాజిట్ కింద 20 శాతం మొత్తం ముందుగానే వసూలు చేశారు. 4 గడుస్తున్నా సొమ్ములు రాకపోవడంతో బాధితులు నష్టాల్లో కూరుకుపోయారు. ఈ కంపెనీలపై సెబీ వద్ద దాదాపు 800 వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ 4 కంపెనీల మోసాలపై సెబీకి లేఖ రాస్తామని, వారికి వచ్చిన ఫిర్యాదుల చిట్టా తీసుకొని తెలంగాణ నుంచి ఎంత మంది బాధితులున్నారా అని తెలుసుకుంటామని సీపీ అన్నారు. అలాగే ఆయా కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3.62కోట్లను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇండోర్ వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, ఎస్ఐ విజయ్ వర్ధన్లను సీపీ సజ్జనార్ ప్రశంసించారు. నమ్మించి మోసగించారు.. నేను స్టాక్ మార్కెట్లో షేర్లు క్రయ విక్రయాలు చేస్తుంటాను. ఒకరోజు దఇక్వికామ్.కామ్ పేరుతో స్టాక్ మార్కెట్ సలహాలు ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. నమ్మలేదు. అయితే ఉదయం 9.30 నుంచి 9.45 గంటల సమయంలో ఫలానా కంపెనీ షేర్ల ధరలు ఇంత వరకు పెరుగుతాయని చెప్పారు. నేను వారం పాటు వారి సలహాలు చూశా. చివరకు నమ్మకం వచ్చాక విడతల వారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేశా. చివరకు ఒకసారి నేరుగా లక్ష రూపాయలు ఇస్తే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి మోసం చేశారు. వారి కంపెనీలో ఒకరు ఒక షేర్లు కొన్నారంటే...మరొకరు ఇంకొక షేర్లు కొన్నారని సమాధానం చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ను సంప్రదించా. – ఆదిత్య, బాధితుడు ఇవీ.. తెలుసుకోండి... నగరంతో పాటు ఏ ఇతర నగరాల్లోనైనా ఉన్న షేర్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీల సలహా తీసుకోవాలనుకుంటే వారి కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్లాలి. అక్కడ అన్నీ తెలుసుకున్నాకే మంచిదని అనుకుంటే ముందుకెళ్లాలి. స్థానిక సెబీ అధికారుల వద్ద కూడా వారి వివరాలు తెలుసుకోవాలి. -
'భరతం' పడతాం!
ఆన్లైన్లో వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా... అయితే, జర జాగ్రత్త! ఘరానా మోసగాళ్ల వలలో చిక్కు కుని జేబులు గుల్ల చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఆన్లైన్లో ఎర వేస్తారు. అందినకాడికి దండు కుంటారు. ఆ తర్వాత వారి పత్తా ఉండదు. వారి ఫోన్లు మూగనోముపడతాయి. వారేమో ముఖం చాటేస్తారు. వారే భరత్పూర్ కేటుగాళ్లు. రాజ స్తాన్లోని భరత్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల యువకులు ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు అధికారుల పేరిట ఫోన్లు చేసి, వినియోగదారుల వ్యక్తిగత సమా చారం, ఓటీపీ సేకరించి ఖాతాలోని సొమ్మును కాజేసే మోసగాళ్లకు జమ్తార అడ్డా అయితే... ఓఎల్ఎక్స్తోపాటు ఇతర ఈ–కామర్స్ సైట్లలో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టింగ్లు పెట్టి, అడ్వాన్స్గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని కాజేస్తున్న కేటుగాళ్లకు భరత్ఫూర్ కేరాఫ్ అడ్రస్. వీరి భరతం పట్టేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ వ్యూహాన్ని రచించారు. – సాక్షి, హైదరాబాద్ ఎర ఎలా? - ఓఎల్ఎక్స్తోపాటు మరికొన్ని వెబ్సైట్లలో ఖాతాలు తెరుస్తారు.. - ఈ ఖాతాలకు ఆర్మీ ఉద్యోగుల పేర్లను వాడుకుంటారు. - వివిధ మార్గాల్లో సేకరించిన ఆర్మీ ఉద్యోగుల ఫొటోలతో పోస్టింగ్లు పెడతారు. - కొన్నిసార్లు ఆర్మీ అధికారుల వేషాలతో పోస్ట్ చేస్తుంటారు. - బుల్లెట్తోపాటు వివిధ రకాల కార్లను వాటిల్లో పొందుపరుస్తారు. - బదిలీ అయిందని, పదవీ విరమణ అయిన నేపథ్యంలో వాహనాలను అమ్మి వెళ్లిపోతున్నామంటూ నమ్మబలుకుతారు. - ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పెడతారు. - ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. - విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉందని నమ్మిస్తారు. - ఎవరైనా ఆసక్తితో వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్గా కొంతమొత్తం చెల్లించాలంటారు. - తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్లలోకి నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు. ఆరు నెలల్లో 500 కేసులు... మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యధికంగా భరత్పూర్కు చెంది నవారి ద్వారానే జరుగుతున్నట్లు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. కనీసం ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఈ కేటుగాళ్లు నేరాలలో పీహెచ్డీ చేసినట్లుగా రాటుదేలారు. వీరి నేరాలకు స్థానికుల మద్దతు కూడా ఉంటోందని భావి స్తున్నారు. ఈ భరత్పూర్ ముఠాలపై ఆరునెలల్లో రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా దక్షిణాదిపైనే కన్నేస్తున్న వీరిపై దేశవ్యాప్తంగా వేల కేసులు ఉంటాయని భావిస్తున్నారు. ఎవరైనా భరత్పూర్ వెళ్లి వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే విచక్షణారహితంగా పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడుతున్నారు. సైబర్ పోలీసుల భారీ వ్యూహం.. భరత్పూర్ మోసగాళ్లను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల పోలీసులతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వరుసదాడులు చేసి, నేరగాళ్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 20 మంది సైబర్, సీసీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికిగాను వీరికి ఆయుధాలు సైతం అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్ల నుంచి తుపాకులు తీసుకువచ్చారు. ఈ బృందం మరో రెండు రోజుల్లో భరత్పూర్కు వెళ్లనుంది. అక్కడి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేసి ఈ ముఠాను పట్టుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ముఠాకు చెందిన కీలక వ్యక్తుల వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ పేరిట మహిళా ఎస్కార్ట్ సేవలు అందిస్తామంటూ వేలాదిమందిని మోసగించిన కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కాల్ సెంటర్ల మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్లను సిలిగురిలో పట్టుకొని ట్రాన్సిట్ వారంట్పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే, ప్రధాన నిందితులు దేబాశిష్ ముఖర్జీ, ఫజుల్హక్ పరారీలో ఉన్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్లతో కలసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు. పెస్టిసైడ్ దుకాణం ముసుగులో కాల్సెంటర్... పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన దేబాశిష్ ముఖర్జీ పెస్టిసైడ్ దుకాణాన్ని నిర్వహించగా ఆశించినస్థాయిలో లాభాలు రాలేదు. దీంతో కోల్కతాకు చెందిన ఫజుల్ హక్తో జతకట్టి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. యువకులకు ‘ఎస్కార్ట్ సర్వీసుల’పై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలనుకుని రెండున్నరేళ్ల క్రితం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వరల్డ్డేటింగ్.కామ్ను ప్రారంభించారు. వీరికి దేబాశిష్ స్నేహితురాలు అనితా డే కూడా సహకరించడంతో సిలిగురి కేంద్రంగా పెస్టిసైడ్ దుకాణం ముసుగులో ఓ కాల్సెంటర్ ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గెట్యువర్ లేడీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మైలవ్ 18.ఇన్ పేరుతో కొత్త వెబ్సైట్లను సృష్టించడమే కాకుండా సిలిగురిలో 12 బ్రాంచ్లు, కోల్కతాలో 8 బ్రాంచ్లు ప్రారంభించారు. 400 మంది ఉద్యోగులతో కాల్స్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఫిమేల్ ఎస్కార్ట్ పేరిట లోకంటో.కామ్లోనూ కాల్సెంటర్ ఫోన్ నంబర్లను పోస్ట్ చేశారు. ఈ నంబర్లలో సంప్రదించినవారితో దశలవారీగా డబ్బులు కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించేవారు. రోజుకు ఒక్కో సెంటర్ నుంచి 200 ఫోన్కాల్స్ చేస్తూ నెలకు ఆరు కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేవిధంగా వృద్ధి సాధించారు. ఎనిమిది దశల్లో లక్షల వసూళ్లు... ఆయా డేటింగ్ వెబ్సైట్లలో యువకులను ఆకర్షించే విధంగా గూగుల్లోనే డౌన్లోడ్ చేసిన అందమైన ఆకర్షించే అమ్మాయిల ఫొటోలను అప్లోడ్ చేశారు. తొలుత మెంబర్షిప్ కోసం 1,080 ఫీజు కట్టమంటారు. తర్వాత క్లబ్లైసెన్స్, రిజిస్ట్రేషన్, సర్వీస్, జీఎస్టీ, అకౌంట్ వెరిఫికేషన్, బ్యాంక్ గ్రౌండ్ వెరిఫికేషన్, ఫైనల్ పేమెంట్ ఫీజుల రూపంలో ఎనిమిది దశల్లో బాధితుల నుంచి డబ్బులు గుంజేవారు. అందమైన అమ్మాయిలను కేటగిరీగా విభజించి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ ఫీజులను వసూలు చేశారు. ఈ విధంగానే సైబరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి వివిధ ఫీజుల రూపంలో రూ.15,19,614 చెల్లించారు. ఇందులో రూ.87,634ల జీఎస్టీ కూడా చెల్లించడం విశేషం. చివరకు ఇతని ఫోన్ నంబర్ నుంచి ఫోన్కాల్స్ చేస్తే స్వీకరించడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ కె.విజయ్ వర్ధన్ నేతృత్వంలోని బృందం సిలిగురిలోని రెండు బ్రాంచ్లపై దాడి చేసి మేనేజర్లు సందీప్ మిత్రా, నీతా శంకర్లను పట్టుకుంది. అయితే, చాలామంది రూ.10 వేలు, రూ.20వేల వరకు కట్టినవారు తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో ముందుకు రాలేదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ డేటింగ్ మోసం అంశం కుటుంబాల్లో చిచ్చుపెట్టే అవకాశం ఉండటంతో ఎక్కువగా పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయితే, ఈ బ్రాంచ్ల్లో పనిచేస్తున్న 35 మందికి నోటీసులు జారీ చేశామని, వారందరూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో త్వరలోనే విచారణకు హజరవుతారని తెలిపారు. -
అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు..
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ రాకెట్ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్ పేరుతో యువతుల్ని జాబ్లో చేర్పించుకుని డేటింగ్ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. భారీ స్థాయిలోకాల్ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్ రాకెట్ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్ ముఖర్జీతో సహా ఫజుల్ హాక్, సందీప్ మిత్ర, యువతులు అనిత డెయ్, నీత శంకర్లను అరెస్టు చేశామని తెలిపారు. గెట్ యువర్ లేడీ, వరల్డ్ డేటింగ్, మై లవ్ పేర్లతో డేటింగ్ సైట్లు క్రియేట్ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. -
ఐటీ పేరుతో లూటీ!
‘‘డియర్ xxxxx, మీరు చెల్లించిన ఆదాయపు పన్నుకు సంబంధించిన రీ ఫండ్ అప్రూవ్ అయింది. త్వరలోనే మీ బ్యాంకు ఖాతాలోకి (xxxxxxxx) జమ అవుతుంది. అంతకుముందుగా దయచేసి మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోండి. మా రికార్డుల్లో ఉన్నది తప్పయితే తక్షణం ఈ లింకును క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయండి (https://bit.ly/2 OwpYK6)'' హైదరాబాద్కు చెందిన అనేక మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొన్ని రోజుల నుంచి వస్తున్న సంక్షిప్త సందేశాలు ఇవి. సాంకేతిక పరిభాషలో ‘ఫిషింగ్’గా పిలిచే వీటిని నమ్మి ముందుకు వెళ్తే నిండా మునుగుతామని, సైబర్ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన ఫిర్యాదులు రానప్పటికీ అధికారులు వీటి మూలాలు ఆరా తీస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత అధికంగా కట్ అయిన పన్ను రీ ఫండ్గా వస్తుంది. దీనికోసం ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన బ్యాంకు ఖాతా వివరాలను రిటర్న్స్తోపాటే ఐటీ విభాగానికి తెలియజేస్తాడు. ఆ మొత్తం రీ ఫండ్ వచ్చే ముందు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఓ సంక్షిప్త సందేశం వస్తుంది. దీన్నే సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ కోసం వినియోగించుకుం టున్నారు. ఉత్తరాదిన తిష్టవేసిన ఈ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు చెందిన డేటా సేకరిస్తున్నారు. దీని ఆధారంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల సెల్ఫోన్ నంబర్లకు ఐటీ విభాగం పంపినట్లు ‘రీ ఫండ్ అప్రూవ్డ్’ అంటూ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఇందులో ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా పొందుపరుస్తున్నారు. దీంతో ఎస్ఎంఎస్ చూసుకున్న వారు అందులో తమ బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉన్నాయని, ఐటీ విభాగం ఇచ్చే రీ ఫండ్ అందులోకే వెళ్లిపోతుందని భావిస్తున్నారు. వెంటనే తమ ఖాతా వివరాలు అప్డేట్ చేయడానికి ఎస్ఎంఎస్లో నేరగాళ్లు ఇచ్చిన లింకును క్లిక్ చేస్తున్నారు. వరుసపెట్టి వివరాలు సేకరణ ఎస్ఎంఎస్లోని లింకును క్లిక్ చేయడంతోనేవినియోగదారుడు ‘ఫిషింగ్’ వెబ్పేజ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ను పోలిందే మరోటి సృష్టించారు. ♦ అసలైన ఇన్కం ట్యాక్స్ విభాగం వెబ్సైట్ అడ్రస్ బార్లో https://www.incometaxindiaefiling.gov.in/home అని ఉంటుంది. బోగస్ వెబ్సైట్ అడ్రస్ బార్ పరిశీలిస్తే http://50.63.185.184/~shndkfnlemdinsl/500599524/hqu.php?RefundStatus=APPROVED&id=YWJjQDEyMy5jb20%3Dగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ♦ దీన్ని గమనించకుండా ఎవరైనా ముందుకెళ్తే బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరచాలంటూ ప్రత్యక్షం అవుతుంది. ♦ ఈ లింకులో బ్యాంకును ఎంపిక చేసుకోండంటూ యాక్సిస్, సిటీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ పేర్లతోపాటు ‘అదర్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. ♦ ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు ఎవరైనా దాని పేరు ఎంచుకుని ‘ప్రొసీడ్’ నొక్కితే ఈ బ్యాంకు వెబ్సైట్ను పోలిందే నకిలీది ఓపెన్ అవుతోంది. ♦ ఉదాహరణకు ఎస్బీఐదే తీసుకుంటే అసలైన ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ అధికారిక సైట్లోకి ఎంటర్ అయితే అడ్రస్ బార్లో https://retail.onlinesbi.com/retail/login.htm అని వస్తుంది. నకిలీ దాంట్లోకి ప్రవేశిస్తే అడ్రస్ బార్లో http://50.63.185.184/~shndkfnlemdinsl /500599524/hqu.php?RefundStatus=A PPROVED&id=YWJjQDEyMy5 jb20%3 అని కనిపిస్తుంటుంది. ♦ దీన్ని కూడా గమనించకుండా వినియోగదారుడు ముందుకు వెళ్తే అసలు కథ ప్రారంభం అవుతుంది. బ్యాంకు అధికారిక సైట్ను పోలి, అందులోని వివరాలతో కూడి ఉండే ఈ సైట్ యూజర్ నేమ్, పాస్వర్డ్తోపాటు అన్ని వివరాలు పొందుపరచమని కోరుతుంది. తర్వాత వన్టైమ్ పాస్వర్డ్స్ అడుగుతుంది. సెల్ఫోన్/మెయిల్ వచ్చిన పాస్వర్డ్స్ను పొందుపరిచిన వెంటనే పూర్తి వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయి. అలా బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తారు. ♦ నకిలీ వెబ్సైట్స్లో ప్రవేశించినప్పుడు హెచ్చరిక కనిపిస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సాధారణంగా అడ్రస్ బార్కు ఎడమ వైపు https:// అనే అక్షరాలు ఉండే పక్కనే ‘సెక్యూర్’ అని కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ వినియోగం సురక్షితం అని దాని అర్థం. ♦ బోగస్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అడ్రస్ బార్ పక్కన (ఎడమ వైపు) ‘నాట్–సెక్యూర్’ అని వస్తుంటుందని, అలా లేకపోయినా అడ్రస్ బార్లో ఉన్న వివరాల ఆధారంగా నకిలీదని గుర్తించాలని సూచిస్తున్నారు. ఇలాంటివి గమనించకుండా ముందుకు వెళితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. -
బెంగళూరులోనే రూ.100 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సూడో డాక్టర్ సంతోష్ కుమార్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు న్నాయి. ఎలాంటి ఎంట్రన్స్లు అవసరం లేకుండా వివిధ రకాలైన కోటాల్లో మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ బల్క్ ఎస్సెమ్మెస్లు పంపి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇతడిని బెంగళూరు అధికారులు ట్రాన్సిట్ వారెంట్పై తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. కేవలం బెంగళూరులోనే ఇతడి స్కామ్ రూ.100 కోట్లు ఉంటుందని వెలు గులోకి వచ్చింది. రూ.30 కోట్లకు సంబంధించి 22 మంది ఫిర్యాదు చేయగా మిగిలినవారు మిన్నకుండిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్కు చెందిన మిగిలిన సభ్యుల్ని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఢిల్లీకి వెళ్లడానికి సన్నా హాలు చేస్తోంది. సంతోష్ దాదాపు పదిహేనేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి ఈ ముఠా కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని సైతం నిర్వహించగా పోలీసులు దీన్ని సీజ్ చేశారు. పటిష్టమైన నెట్వర్క్ ద్వారా... పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడని అధికారులు చెప్తున్నారు. వెబ్సైట్లు హ్యాక్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, స్ఫూఫింగ్కు పాల్పడటం కోసం బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకున్నారు. బాధితుల నుంచి నగదు సేకరిం చే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపేవాడు. బల్క్ ఎస్సెమ్మెస్లు పంపే అనుచరులు వారణాసి కేంద్రంగా పనిచేస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో సేకరించిన నగదునైనా ఈ గ్యాంగ్ ముంబైకే తరలిస్తుంది. అక్కడ నుంచి హవా లా రూపంలో ఇతర చోట్లకు పంపిస్తుంటుంది. బెంగళూరు పోలీసులు బాధితులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరగా వారు అంగీకరించలేదు. తాము రూ.కోటి వరకు నగదు రూపంలో చెల్లించినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త తలనొప్పులు వస్తాయని చెప్పినట్లు తెలిసింది. రిక‘వర్రీ’గా మారిన డబ్బు సంతోష్ అనేకమంది నుంచి కాజేసిన డబ్బు ఏమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతడు ఓ మతపరమైన సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తాను ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చానని, తమకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని పోలీసులకు సంతోష్ చెప్పాడు. ఇందులో నిజానిజాలను సైతం నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినా కనీసం రూ.కోటి కూడా వాటిలో లేదని పోలీసులు చెప్తున్నారు. సంతోష్ ఈ పంథాలో రెచ్చిపోవడానికి ఢిల్లీకి చెందిన కొందరు బడాబాబుల సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేశారు. వీరిలో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలిసింది. -
మళ్లీ ‘ర్యాన్సమ్వేర్’ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: గతేడాది ప్రపంచ దేశాలను వణికించిన ‘ర్యాన్సమ్వేర్’మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ సర్వర్ను టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. డేటాను విడుదల చేయాలంటే బిట్కాయిన్స్ రూపంలో 800 డాలర్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకపోవడంతో కొంత డేటాను క్రాష్ చేశారు. ఈ నెల 9వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ సైబర్ దాడి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ చాంద్పాషా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సిస్టమ్స్తోపాటు సర్వర్ లాక్ హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్కు సంబంధించిన సర్వర్ టెలిఫోన్ భవన్లో ఉంది. ఈ వెబ్ సర్వర్ను అంతర్గత సమాచార మార్పిడి(ఇంట్రానెట్) కోసం వినియోగిస్తుంటారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 12.27 గంటలకు ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ర్యాన్సమ్వేర్ వైరస్లను సైబర్ నేరగాళ్లు ఈ మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయి సిస్టమ్స్తోపాటు సర్వర్ సైతం లాక్ అయింది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ ఇంట్రానెట్లోని డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’ని ట్రాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంట్రానెట్లో ఉన్న ఒక్కో హెచ్టీఎంఎల్ ఫైల్.. ఒక్కో ఫోల్డర్గా మారింది. 800 డాలర్లు చెల్లించాలని డిమాండ్ ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి తమకు 800 అమెరికన్ డాలర్లు బిట్కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తూ పాప్అప్స్ పంపారు. దీనికి నిర్ణీత గడువు సైతం విధించారు. దీనికి బీఎస్ఎన్ఎల్ అంగీకరించకపోవడంతో గంటలోనే కొంత డేటాను క్రాష్ చేశారు. ర్యాన్సమ్వేర్ ప్రభావంతో క్రాష్ అయిన డేటా ప్రస్తుతం రిట్రీవ్ చేసే స్థితిలో లేకుండా పోయింది. దీనిపై బీఎస్ఎన్ఎల్ సబ్–డివిజినల్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లక్ష్మణ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అటాక్ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ముఖ్యం కాకపోయినా.. సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీవో ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ– మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్కు దూరంగా ఉం డటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. అయితే ర్యాన్సమ్వేర్ దాడితో బీఎస్ఎన్ఎల్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వినియోగదారుల డేటా భద్రంగా ఉందని, అది ఇంట్రానెట్ సర్వర్లో ఉండదని చెపుతున్నారు. -
ఇక్రమ్..పాకిస్థానీనా?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్లోకి ప్రవేశించి.. సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో అధికారులు పాక్ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇక్రమ్కు ఆ దేశం జారీ చేసిన పాస్పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గత వారం ఢిల్లీ వెళ్ళిన ప్రత్యేక బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు. దీనికి స్పందించి.. పాకిస్థాన్ ఇచ్చే సమాధానంపైనే కేసుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించారు. భారతీయుడిగా నమ్మించి వివాహం.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ మహిళకు పాకిస్థానీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం హైదరాబాద్కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతగాడు అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్ళి అట్నుంచి హైదరాబాద్ వచ్చాడు. ‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి.. ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెల్లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. నిర్ధారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’.. ఇతగాడి అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్పోర్ట్కు చెందిందిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్స్ ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇవి తప్పని తేలాలంటే ఆ సమయంలో ఇక్రమ్ భారత్తో లేనట్లు నిర్ధారించాల్సి ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాకిస్థాన్ పాస్పోర్ట్తో దుబాయ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని పాక్ «ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం నిర్థారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంఈఏ ద్వారా లేఖ రాశా రు. ఇప్పుడు ఇక్రమ్ తమ పౌరుడు కాదంటూ పాక్ జవాబు ఇస్తే.. అసలు ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమాధానం వచ్చిన తర్వాతే కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయించనున్నారు. -
‘వర్సిటీ’ పేరిట వంచన
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడిసిన్ సీట్లు ఇస్తానంటూ అనేక మంది వైద్యులను నిండా ముంచిన సూడో డాక్టర్ సంతోష్ రాయ్ కేసు దర్యాప్తులో కొత్త విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఇతనితో పాటు సహచరుడైన మనోజ్కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దాదాపు 16 ఏళ్లుగా మోసాలు చేస్తున్న సంతోష్ వ్యవ హారాలకు నాంది ఢిల్లీలోనే పడింది. 2002లో ఎస్ఆర్ఎం వర్సిటీని ఏర్పాటు చేసి పలు కోర్సుల పేర అడ్మిషన్లంటూ మోసాలకు తెరలేపాడు. కొన్ని వైద్య సంబంధ కోర్సుల్నీ ప్రవేశపెట్టాడు. అప్పట్లో 30 మంది నుంచి రూ.9 కోట్ల వరకు వసూలు చేసి జైలుకెళ్లాడు. అయినా మోసాలు కొనసాగిస్తూ ముఠాల ఏర్పాటుతో వ్యవస్థీకృత పంథాలోకి మారాడు. ఇటీవల సంతోష్పై 2 కేసుల్ని సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. నగరానికి చెం దిన డాక్టర్ ఫాతిమా కుమార్తెకు పీజీ మెడిసిన్ సీటు పేరుతో రూ.81 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు సిటీలో ఉండగా, ఢిల్లీలో రాజేంద్రనగర్కు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.68 లక్షలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఇతని అరెస్టుని మీడియా ద్వారా తెలుసుకున్న ఇద్దరు బాధితులు సోమవారం బయటకు వచ్చారు. వైజాగ్ కి చెందిన ఓ డాక్టర్ తన నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపడంతో అక్క డి ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బెంగళూరు నుంచి వచ్చి సిటీలో ఉద్యోగం చేస్తున్న మరో వైద్యుడు సైతం సైబర్ క్రైమ్ ఠాణాను సంప్రదించాడు. సంతోష్ అండ్ గ్యాంగ్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు వాపోయాడు. దీనిపై బెంగళూరులో కేసు నమోదు కానుంది. ఈ రెండు కేసుల్లో అక్కడి పోలీసులు సంతోష్ తదితరుల్ని పీటీ వారంట్పై అక్కడకు తరలించే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీగానే... ఈ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. సాధారణంగా ఇంతటి భారీ మొత్తాలను మోసగాళ్లు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడమో, ట్రాన్స్ఫర్ చేయించడమో చేస్తుంటారు. కానీ వీరు బ్యాంక్ ఖాతాల జోలికిపోలేదు. వాటిని వాడితే పోలీసులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో నగదు మాత్రమే తీసుకునేవారు. ఇతన్ని అరెస్టు చేసిన పోలీసులు 11 బ్యాంకు ఖాతా లను గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటిలో ఒక్క ఖాతాలోనే రూ.3 లక్షలు ఉన్నట్లు తేలింది. బాలీవుడ్ నిర్మాత అయిన సంతోష్ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉం టాడన్న కోణంలోనూ అధికారులు దృష్టి పెట్టారు. ఈ సూడో గ్యాంగ్ కొన్ని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈడీ సహా ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తు న్న ఆర్థిక నేరాల వివరాలు సంతోష్కు తెలిసేవి. అందులోని నిందితులతో సంప్రదింపులు జరిపి ఆయా కేసుల్ని సెటిల్ చేయిస్తానని లేకుంటే త్వరలో కఠిన చర్యలు తప్పవని బెదిరించేవాడు. ఈ కోవకు చెందిన బాధితుల్లో సిటీకి చెందిన వారూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రాధాన్యత, పరిధి దృష్ట్యా లోతుగా విచారించడానికి సంతోష్ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఆర్థిక బాధలతోనే ఈ పనిచేశా
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రలు తయారుచేసిన సంతోష్కుమార్ను శనివారం కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సంతోష్ డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డులు ఫింగర్ ప్రింట్ల కోసమే వాడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇతడికి ఏ తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, డబ్బుకోసం మాత్రమే సంతోష్ ఈ నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. 2013 డిసెంబర్ నుంచి వొడాఫోన్ డీలర్గా పనిచేస్తున్న సంతోష్ ఐదేళ్లపాటు శ్రమిస్తే తనకు ఏడాదికి రూ.20 వేలే ఆదాయం వచ్చిందన్నాడు. జియో సిమ్ రావడంతో వొడాఫోన్ సిమ్ల కొనుగోలు తగ్గిందని పోలీసులకు వెల్లడించాడు. వొడాఫోన్ను మోసం చేయడంలో భాగంగానే నకిలీ సిమ్ కార్డుల యాక్టివేషన్ కోసం ప్లాన్ చేశానని, ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్, ఫింగర్ ప్రింట్ల డౌన్లోడ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన భూ సర్వే నెంబర్లు సేకరించి ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేయాలనుకున్నానన్నారు. యంత్రం, రబ్బర్ స్టాంపులు, పాలిమార్ లిక్విడ్, గేట్వే పేపర్కు రూ.12వేలు మాత్రమే ఖర్చయ్యాయని వెల్లడించాడు. వీటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఈసీ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేయడం మొదలు పెట్టానని, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు చెందిన రైతుల ఆధార్, ఫింగర్ ప్రింట్లను డౌన్లోడ్ చేశానన్నాడు. ఇలా రోజుకు 200 నుంచి 300 డౌన్లోడ్ చేసేవాడినని సంతోష్ అంగీకరించాడు. గత ఎనిమిదేళ్లలో తాను వివిధ వ్యాపారాలు చేసి కోటిన్నర రూపాయలు నష్టపోయానని పోలీసులకు తెలిపాడు. ఆర్థికంగా నిలబడడం కోసం మాత్రమే ఈ పని చేశానని అంగీకరించాడు. సిమ్ కార్డు యాక్టివేషన్ చేసి, తర్వాత ఆ ఆధార్ కార్డును ఫింగర్ ప్రింట్ పేపర్లను కాల్చేసినట్టు చెప్పారు. అయితే సంతోష్ను మరోసారి విచారించేందుకు కస్టడీ కోరామని పోలీసులు వెల్లడించారు. -
100 అడిగి..రూ. లక్ష నొక్కేసింది
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా వాట్సాప్లో ప్రత్యక్షమైంది.. తన పేరు నిధి పాండేగా పరిచయం చేసుకుంది.. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత చీటింగ్కు తెరలేపింది.. తనకు రూ.100 అవసరమంటూ ఆన్లైన్లో బదిలీ చేయించుకుంది.. ఆపై అసలు కథ ప్రారంభించి రూ.1.18 లక్షలు కాజేసింది.. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బాధితుడు అసలు వివరాలు బయటకు చెప్పడం లేదని భావిస్తున్నారు. హిమయత్నగర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల వాట్సాప్లో ఓ సందేశం వచ్చింది. తన పేరు నిధి పాండేగా ఓ యువతి పరిచయం చేసుకుంది. కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తనకు అత్యవసరంగా రూ.100 కావాలని కోరింది. వాటిని బదిలీ చేయమంటూ తన బ్యాంకు ఖాతా వివరాలు అందించింది. దీంతో బాధితులు ఆమొత్తం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆమెకు బదిలీ చేశాడు. ఇది జరిగిన మరుసటి రోజు అర్ధరాత్రి తన నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి వెంకటేష్ అనే వ్యక్తి బెనిఫిషియర్గా యాడ్ అయ్యాడని, ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే తనఖాతాలో ఉండాల్సిన రూ. 1.18 లక్షలు అతడి ఖాతాలోకి బదిలీ అయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పాడు. తన సెల్ఫోన్కు ఎలాంటి వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) రాలేదని, నగదు బదిలీకి సంబంధించిన సందేశం మాత్రం వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం అలా నగదు బదిలీ చేసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. బాధితుడు నిధితో తాను ఉత్తరప్రదేశ్కు చెందిన వాడినని చెప్పడంతో ఇరువురూ స్నేహంగా మారి ఉంటారని, ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లు చాటింగ్ తర్వాత ఇతడు తన నెట్ బ్యాకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తదితరాలు ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. వీటిని వినియోగించుకున్న నిధి బెనిఫిషియర్ను యాడ్ చేయడంతో పాటు సెల్ఫోన్ నెంబర్ కూడా మార్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుడికి రావాల్సిన ఓటీపీ ఆ నెంబర్కు వెళ్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆ నలుగురు.. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి సిటీలో తిష్టవేసిన పాకిస్థానీ మహ్మద్ ఇక్రమ్తో పాటు అతడికి నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించిన కరీంనగర్కు చెందిన లెక్చరర్ మక్సూద్, దళారులు కిర్మాణి, ఖాజాలను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నలుగురినీ గత వారం అరెస్టు చేసిన విషయం విదితమే. తదుపరి విచారణలో భాగంగా మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరించాల్సి ఉండటంతో కోర్టు అనుమతితో వీరిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో భాగంగా మహ్మద్ ఇక్రమ్ నివసించిన చాదర్ఘాట్, మలక్పేట్, గోల్నాక ప్రాంతాలకు అతడికి తీసుకువెళ్లి విచారించారు. నకిలీ సర్టిఫికేట్లతో ఇతడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశాడు? తదితరవివరాలను ఇన్స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీస్తోంది. మరోపక్క కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా విభాగాలూ రంగంలోకి దిగాయి. నేపాల్ మీదుగా అక్రమ మార్గంలో వచ్చిన ఇక్రమ్ వ్యవహారంలో మరో కోణమేదైనా ఉందా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.