Diseases
-
పెద్దలకు ఇద్దాం! ఇమ్యూనిటీకాలు
మామూలుగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకే అని చాలామంది అనుకుంటుంటారు. అవి పెద్దవాళ్లకూ అవసరమవుతాయి. కోవిడ్ టైమ్లో వ్యాక్సిన్కు విశేషప్రాచుర్యం వచ్చింది. పెద్దవాళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ అంటే అది కోవిడ్ కోసమే కాదు... ఇంకా చాలా రకాల వ్యాధులను నివారించగలిగే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన కారణం ఏమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక వ్యవస్థ మునపటి అంత బలంగా ఉండకపోవచ్చు. దాంతో ఇమ్యూనిటీకి బలం పెంచడం కోసం ఇలా తీసుకోవచ్చు. అలాగే చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్లు క్రమంగా ప్రభావం కోల్పోతూ ఉండవచ్చు. అందుకే వాటిని మరింత బలోపేతం చేసేందుకు 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలివి...సాధారణంగా 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, వాళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థ కాస్త బలహీనంగా (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నప్పుడు 65 ఏళ్ల వయసు తర్వాత కొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వడం ద్వారా ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. అందుకే ఈ వ్యాక్సిన్లు.పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లుడిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ తమ చిన్నతనంలో డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారు. కానీ 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి వాళ్లలో ఆ టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. అది బూస్టర్ డోస్లా పనిచేసి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది.హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కాలేయాన్ని ప్రభావితం చేసేదే ఈ హెపటైటిస్–ఏ వైరస్. కలుషితాహారం, కలుషితమైన నీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. దీని నివారణకు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఆర్నెల్లకు మరో విడత కూడా తీసుకోవాలి.హెర్పిస్ జోస్టర్ వ్యాధిహెర్పిస్ జోస్టర్ అనే వైరస్తో మొదట చికెన్పాక్స్ వచ్చి, అటు పిమ్మట అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్ జోస్టర్ వైరస్ సోకిన వాళ్లలో 60 ఏళ్లు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ. జోస్టర్ వ్యాక్సిన్ అన్నది ఈ హెర్పిస్ జోస్టర్ వ్యాధి నుంచి నివారణ ఇస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల 100 శాతం వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు గానీ... వ్యాక్సిన్తో బాధితుల జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు.వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ ‘చికెన్పాక్స్’ను కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అప్పటికే ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకూ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వాళ్లకూ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్లో ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి డాక్టర్లు ఈ వ్యాక్సిన్ను సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని తీసుకున్నవారు కూడా ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదు. గర్భవతులకూ దీన్ని ఇవ్వకూడదు.హెపటైటిస్–బి వ్యాక్సిన్హెపటైటిస్–బి వైరస్ కూడా కాలేయాన్నే ప్రభావితం చేసే మరింత ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాల్లోనే దీని వ్యాప్తీ జరుగుతుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసిప్రాణాంతకంగా మార్చే ముప్పు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన వైరస్కు అదృష్టవశాత్తూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసూ, అలాగే మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులూ దీన్ని తీసుకోవడం మేలు.ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధికి నివారణగా ఇచ్చే వ్యాక్సిన్. జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి తీవ్రంగా బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంది. అందుకే జలుబు వైరస్కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఐదేళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టేటస్లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది.సూచన : గుడ్డుతో అలర్జీ ఉన్నవారు దీని బదులు రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి.టైఫాయిడ్ వ్యాక్సిన్ : అందరూ తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యాక్సిన్ ఇది. మరీ ముఖ్యంగా ఆహార పరిశ్రమలో పనిచేసేవారూ, వంటలు చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఆహార తయారీ రంగంలో ఉండేవారికి టైఫాయిడ్ ఉంటే... ఓ క్యారియర్గా వారు అనేక మందికి ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశం ఉన్నందున వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నది డాక్టర్ల సిఫార్సు.హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ అమ్మాయిలు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోసు ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది.మరికొన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందిగానీ దాన్ని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇస్తారు. ఇవేగాక జపనీస్ ఎన్కెఫలైటిస్, రేబీస్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఎల్లో ఫీవర్ వ్యాధి మన దేశంలో లేదు కాబట్టి అది ఉన్నచోటికి వెళ్లే ప్రయాణికులు అక్కడికి వెళ్లే 15 రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవాళ్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.నిమోకోకల్ వ్యాక్సిన్: వయసు పైబడిన వారిలో స్ట్రె΄్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియాతో నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23): ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్’ తో ప్రయోజనం చేకూరుతుంది. ఇది కేవలం ఒక్క నిమోనియాకు మాత్రమే కాకుండా మెనింజైటిస్, బ్యాక్టీ రిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్) లకు నివారణ ఔషధంగా కూడా పనిచేస్తుంది.అయితే దీనివల్ల నూరు శాతం నివారణ జరగకపోవచ్చు. కాకపోతే చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గి, కాంప్లికేషన్లు కూడా చాలా వరకు నివారితమవుతాయి. అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి. -
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిడ్స్పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
Year Ender 2024: భారత్ను వణికించిన వ్యాధులు
2024వ సంవత్సరంలో చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదిలో దేశంలో కొన్ని నూతన వ్యాధులు అందరినీ వణికించాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్తో పాటు క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేసింది.నిపా వైరస్: దీనిని జూనోటిక్ పారామిక్సోవైరస్ అని అంటారు. ఇది ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి తొలిసారిగా 2018 మేలో కేరళలో కనిపించింది. ఈ వైరస్ గబ్బిలాలు లేదా పందుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలిసారిగా 2021 జూలైలో కేరళలో ఈ వైరస్ కనిపించింది.క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్లలో తొలిసారిగా ఈ వైరస్ కనిపించింది.చండీపురా వైరస్: దోమలు, పేలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలో ఈ వైరస్ కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు కనిపించాయి. డెంగ్యూ: ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో మొదటి ఈ కేసు తొలిసారిగా 1780లో చెన్నైలో కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.జపనీస్ ఎన్సెఫాలిటిస్: భారతదేశంలో ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2024లో తొలిసారిగా కనిపించింది.క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్డీ): భారతదేశంలో విస్తరిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్గా కేఎఫ్డీ మారింది.ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు: హాంటావైరస్, చికున్గున్యా వైరస్, హ్యూమన్ ఎంట్రోవైరస్-71 (ఈవీ-71), ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) కరోనావైరస్. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఉప్పు ఊబిలోకి..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అతి సర్వత్రా వర్జయేత్.. ఏ విషయంలోనూ అతి పనికిరాదు అని చెప్పడానికి ఉద్దేశించిన సూక్తి ఇది. కానీ, ఇప్పుడిది తలకిందులవుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.. అది కూడా ఉప్పు వాడకంలో. దీని వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని.. ఫలితంగా లక్షలాది మంది వినియోగదారులు జీవనశైలి జబ్బులకు గురవుతున్నట్లు న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ (ఎన్సీడీఐఆర్) సంస్థలు గుర్తించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు సగటున ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వాడకూడదని సూచించగా.. ఏపీలో రోజుకు 8.7 గ్రాముల నుంచి 9 గ్రాముల వరకు వాడుతున్నట్లు అవి తేల్చాయి. సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు వాడటంవల్ల జీవితకాల వైకల్యానికి దారితీస్తుందని ఆయా సంస్థలు వెల్లడించాయి.ఊబకాయులకు అధిక ముప్పు..ఆంధ్రప్రదేశ్లో ఉప్పు అధిక వినియోగంవల్ల ఊబకాయుల్లో అధిక ముప్పు పొంచి ఉందని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది అధిక ఉప్పు వినియోగించడంవల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారని, దీని కారణంగా వారు పక్షవాతం బారిన పడుతున్నారని పేర్కొన్నాయి. అలాగే, జనాభాలో ఎక్కువమంది అధిక మోతాదులో తీసుకోవడంవల్లే ఉప్పు ఊబిలో కూరుకుపోయి రకరకాల జబ్బులకు గురవుతున్నట్లు తేల్చారు. అదే అధిక ఆదాయ దేశాల్లో ఉప్పు వినియోగం తక్కువగా ఉందని, దీనివల్ల హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు అక్కడ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ప్యాక్ చేసినవి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని.. ఆకుకూరలు, కూరగాయల్లో సహజ సిద్ధంగానే కొంత ఉప్పు శాతం కలిగి ఉంటాయని, వాటిని అనుసరించి అదనపు ఉప్పును తగ్గించుకోవాలని సర్వే సంస్థలు సూచించాయి. ఇక దేశంలో మధుమేహం, బీపీ, గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఉప్పు, చక్కెర వంటివి వీలైనంత తక్కువగా వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా..ఈ సంస్థలు 18–69 ఏళ్ల వయస్సున్న వారిలో సర్వే నిర్వహించగా.. 70 శాతం మందికి ఉప్పు వినియోగంపై అవగాహన కానీ, దానివల్ల కలిగే ప్రమాదంగానీ తెలీదని తేలింది. సుమారు 3 వేల మందిపై ఈ సర్వే చేయగా.. ఉప్పు వలన కలిగే ప్రతికూలతలపై వారినుంచి సరైన సమాధానాలు రాలేదని, దీన్నిబట్టి వారికి ఉప్పు వినియోగంపై అవగాహనలేదన్న విషయం వెలుగుచూసింది. ఇక పలువురిలో రక్త నమూనాలు, మూత్ర నమూనాలు సేకరించి వారి నుంచి సోషియో డెమోగ్రాఫిక్, బిహేవియర్, మెటబాలిక్ లక్షణాలనూ అంచనా వేశారు. -
కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!
వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.పోషకాహార లోపం... ఓ చిత్రణ‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది. ‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్క్షాప్స్కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్షాప్లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్షాప్లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.ర్యాంప్పై నడకఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.వైద్యులను ప్రోత్సహించడానికి...హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు. -
సూక్ష్మజీవుల దండయాత్ర
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో..వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు. ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదుపులో ఉండని వ్యాధులతో..ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు. ఇన్ఫెక్షన్ల బాధితులే అధికంవరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మందు లవర్స్! లివర్ జాగ్రత్త!
గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్లో మూడు దశలుంటాయి. మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్ఏఎస్హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్లాగా ఏర్పడవచ్చు. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు. ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్ఏఎస్హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి. ఫ్యాటీ లివర్కు చికిత్స : ∙ఆల్కహాల్తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి. లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్ఎఫ్టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. -
ఊరూ.. వాడా.. చెత్తగుట్టలు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా వ్యాధులు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, నగరాల మాదిరిగానే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా గ్రామాల్లో గత మూడేళ్లు కనీసం రెండు రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే క్లాప్ మిత్రలు ప్రతి రోజూ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరించేవారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా గత రెండున్నర నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టే పంచాయతీల సంఖ్య నామమాత్రంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్ ప్రకారం శనివారం (ఆగస్టు 24వ తేదీ) రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.ఐదేళ్ల క్రితం కూడా ఇవే పరిస్థితులు నెలకొనగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2021లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు 14 వేల దాకా మూడు చక్రాల రిక్షాలు, వెయ్యి చెత్త సేకరణ ఆటోలతో పాటు గ్రామాల్లో దోమలు నియంత్రణకు ఫాగింగ్ కోసం 10,628 యంత్రాలు, 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, 6,417 శానిటరీ వేస్ట్ ఇన్సినేటర్స్లను ప్రభుత్వ నిధులతో మంజూరు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు 75 వేల కోట్ల టన్నుల తడి, పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటా సేకరించారు. దీన్ని వర్మీ కంపోస్టుగా మార్చి విక్రయించడం ద్వారా ఆయా గ్రామాలు ప్రాథమిక దశలో రూ.5 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని పొందాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోగాలు ముసురుకుంటున్నాయి.మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీసాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆర్టీపీసీఆర్ కిట్ విశాఖలో తయారైంది. ఏపీ మెడ్టెక్జోన్లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్ను రూపొందించింది. ఈ ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్కు భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణపత్రం అందించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతిని పొందింది. గంటలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఈ కిట్ ద్వారా తేలనుంది. కోవిడ్–19 మాలిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్లలో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరానీ వెల్లడించారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమలో వానలుసాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తేమ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి దిశగా వస్తున్నాయి. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలకు ఆస్కారముంది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 29, 30, 31 తేదీలు, సెప్టెంబర్ మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.మార్చి 31లోపు రిటైరయ్యే వారికి బదిలీ వద్దు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని, వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయాలంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉద్యోగులకు కూడా బదిలీలను వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 శాఖలకు బదిలీలు వర్తింప చేయగా ఇప్పుడు 16వ శాఖగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్కు వర్తింప చేశారు.మలేరియాలో కుప్పం మహిళ గల్లంతు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: మలేరియా రాజధాని కౌలాలంపూర్లో ఫుట్పాత్ కుంగిపోవడంతో కుప్పం అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ మురుగు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణం గాలింపు చర్యలు చేపట్టే విధంగా మలేషియా అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఏపీ ఎన్ఆరీ్టఎస్ను ఆదేశించారు. మహిళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. మలేషియాలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి వరకు గల్లంతైన విజయలక్ష్మి ఆచూకీ తెలియలేదని ఏపీ ఎన్ఆరీ్టఎస్ అధికారులు వెల్లడించారు. -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!
రాజమహేంద్రవరం రూరల్ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.ఆ పేరు ఎలా వచ్చిందంటే..పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశారు. ఏ వ్యాధులు వస్తాయంటే..పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్వార్మ్ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. వైద్యుల సలహాలు తప్పనిసరిజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరిసకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి. –డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం వ్యాధులుసంక్రమించకుండా టీకాలుజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశువుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.–ఎస్.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, కాకినాడశుభ్రత.. భద్రతముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.వ్యాక్సిన్ తప్పనిసరిపెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. -
విజృంభిస్తున్న అంటువ్యాధులు
-
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్వో వన్హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్సీలు, సీహెచ్సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్వో: అన్ని పీహెచ్సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఆహారంలోని ఔషధాన్నే వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది?
ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే. ‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి. ఇంటర్నెట్ నేర్పించింది! ‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను. ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు. ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్పర్ట్లను తీసుకున్నాను. తేనెతోపాటు ఇంకా... ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్ఫ్యూజ్డ్ హనీ తయారు చేశాం. అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను. దుబాయ్లో జరిగే ఎగ్జిబిషన్లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర. ఇష్టంగా పనిచేశాను! నా యూనిట్ని మా అన్నయ్య యూనిట్కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎమ్పీ, ఐఎస్ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే. – ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
వానర రహస్యం రట్టయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం... మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెరి్నంగ్ అల్గారిథమ్ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్జీపీటీ అనుకోవచ్చు. చాట్జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట! -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
డేంజర్ ‘లైఫ్స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్తో ఫ్లూయిడ్ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
పెరుగుతున్న నాన్ కమ్యునికబుల్ జబ్బులు.. 63 శాతం మరణాలకు ఇవే కారణం!
సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది. పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధుల నివారణోపాయాలు ♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ♦ శారీరక శ్రమను పెంచాలి ♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి ♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి ♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి ♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్.. సవాల్గా నిర్వహణ
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు.. ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు.. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. 2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నాయి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
గ్లోబల్ లీడర్లుగా ఎదగండి
నాగపూర్: భారత్ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానం సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లను రీసెర్చ్ ల్యాబ్లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటర్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్స్, క్రిప్టోగ్రఫీ, న్యూ మెటీరియల్స్ దిశగా మన దేశం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ వివరించారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకుంటున్నామని తెలియజేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు. -
పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్..
కంచర్ల యాదగిరిరెడ్డి ముంబై, రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురం, హైదరాబాద్.. ఈ ప్రాంతాలన్నింటా ఇటీవల కొత్తగా కలకలం మొదలైంది. దానికి కారణం తట్టు (మీజిల్స్) వ్యాధి మళ్లీ విజృంభించడమే.. ఈ ఏడాది ఏకంగా 16వేల మంది పిల్లలకు తట్టు వ్యాధి సోకడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. టీకాలు వేసుకోకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నా.. కేవలం ఒక్కసీజన్లో దేశంలో ఇంతమందికి మీజిల్స్ సోకడం అసాధారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్క మన దేశంలోనేకాదు.. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాల్లోనూ కొద్దినెలలుగా వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందులోనూ బాధితులు ఎక్కువగా పిల్లలే. వరుస కోవిడ్ వేవ్ల తర్వాత పరిస్థితి చక్కబడుతున్న సమయంలో (చైనా, మరికొన్ని దేశాలు మినహా) ఇతర వైరల్ వ్యాధుల దాడి పెరగడంపై నిపుణులు అనుమానాస్పదంగానే స్పందిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ముంబైలో మొదలై.. ఈ ఏడాది అక్టోబర్లో ముంబైలో పెద్ద సంఖ్యలో తట్టు కేసులు నమోదయ్యాయి. ఆ నెల 26వ తేదీ నాటికి ఇరవై మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కూడా. తర్వాత రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురంలో..తాజాగా తెలంగాణలోనూ వందల సంఖ్యలో ఈ వ్యాధి కేసులు నమోదవడం గమనార్హం. ముంబైలో మరణించిన పిల్లల్లో ఒక్కరు మాత్రమే తట్టు నిరోధక టీకా వేసుకున్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది. కాకపోతే రెండు డోసులు వేసుకోవాల్సిన టీకా ఒక డోసు మాత్రమే వేసుకున్నట్టు గుర్తించారు. అమెరికాలో పదిరెట్లు ఎక్కువగా.. అమెరికాలో గత మూడు నెలల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదుపు చేయలేనంతగా తీవ్రమయ్యాయి. చాలామంది పిల్లలు రెస్పిరేటరీ సైనిటికల్ వైరస్ బారిన పడుతున్నారు. పెద్దల్లో సాధారణ జలుబు మాదిరి లక్షణాలతో కనిపించే ఈ వ్యాధి.. పిల్లల్లో మాత్రం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో ఈ వ్యాధి కనీసం మూడు సార్లు ప్రభావం చూపిందని న్యూయార్క్లోని మైమోనైడ్స్ పీడియాట్రిక్ సీనియర్ వైద్యులు రబియా ఆఘా తెలిపారు. రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఐసీయూ వార్డు సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధి మామూలుగా తట్టుకోగలిగిన స్థాయిలోనే ఉంటుందని.. ఈసారి మాత్రం లక్షణాలు బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇక గత నెలలో అమెరికాలో ఇన్ఫ్లూయెంజాతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య గత పదేళ్లలోనే అత్యధికమని అక్కడి వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్రిటన్లో బ్యాక్టీరియా దాడి.. బ్రిటన్లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా కారణంగా 16 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్కు ముందు అంటే 2017 –18 సీజన్లో మాత్రమే ఈస్థాయి ఇన్ఫెక్షన్లు, మరణాలు సంభవించాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాతో గొంతునొప్పి, టాన్సిలైటిస్ వంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా మాత్రం మెనింజైటిస్ వంటి ప్రాణాలమీదికి వచ్చే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది మరణాల సంఖ్య మాత్రం అసాధారణంగా పెరిగిందని లండన్లోని పిల్లల వైద్యుడు రోని చుంగ్ అంటున్నారు. కోవిడ్ లాక్డౌన్లు కారణమా? పిల్లల్లో ఈ ఏడాది వైరల్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక కోవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్లు కారణం కావచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్లు విధించాయి. చాలా దేశాల్లో పిల్లలను పాఠశాలలకు, నర్సరీలకు పంపలేదు. వారంతా ఈ ఏడాది మళ్లీ పాఠశాలలకు, నర్సరీలకు వెళుతున్నారు. ఇది ఆర్ఎస్వీ, జలుబు, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సమస్యలు విజృంభించేందుకు కారణమవుతోందని అంచనా. ఇక కోవిడ్ సోకిన పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల కూడా ఈ ఏడాది వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ►కోవిడ్ వచ్చిన తొలి ఏడాది బ్రిటన్తోపాటు అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియాల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోయాయని.. ఈ ఏడాది మళ్లీ అధిక సంఖ్యలో నమోదవడం చూస్తే కోవిడ్ లాక్డౌన్లను అనుమానించాల్సి వస్తోందని క్వీన్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ కానర్ బామ్ఫర్డ్ తెలిపారు. జర్మనీలో 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆర్ఎస్వీ వ్యాధి 2017–2019 మధ్యకాలం కంటే యాభై రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.. న్యూజిలాండ్లో 2021లోనే ఆర్ఎస్వీ కేసులు ఎక్కువైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్తో బలహీనతకు రుజువులు లేవు కోవిడ్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని, తర్వాతి కాలంలో వైరల్ సమస్యలు పెరుగుతాయని చెప్పేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పిల్లల వైద్య నిపుణురాలు రబియా ఆఘా తెలిపారు. ఈ ఏడాది వ్యాధుల బారినపడ్డ పిల్లలు ఎక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాదికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం, మాస్కులు ధరించడం, గాలి, వెలుతురు బాగా ఆడేలా చూడటం అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) మళ్లీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. పొంచి ఉన్న టైఫాయిడ్ ముప్పు భారత్లో సమీప భవిష్యత్తులో టైఫాయిడ్ జ్వరాలు విరుచుకుపడే అవకాశమున్నట్టు ప్రముఖ వైరాలజిస్ట్ గగన్దీప్ కాంగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.28 – 1.61 లక్షల మందిని బలితీసుకుంటుండగా.. ఇందులో 40శాతం మరణాలు భారత్లో సంభవిస్తున్నవే. ఈ వ్యాధి రక్షణకు టీకా ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది తీసుకోవడం లేదని.. ఫలితంగా రానున్న పదేళ్లలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని, వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏకంగా 4.6 కోట్లకు చేరుతుందని ఆమె హెచ్చరించారు. టైఫాయిడ్ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. టీకా కార్యక్రమాన్ని పటిష్టం చేస్తాం దేశవ్యాప్తంగా తట్టు, ఇతర వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇవి సీజనల్ వ్యాధులైనప్పటికీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన ఇటీవల హైదరాబాద్లో చెప్పారు. టీకాలపై అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. -
జబ్బులు బాబోయ్!
సాక్షి, అమరావతి: దేశంలో జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 37 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 75వ జాతీయ నమూనా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అనారోగ్య ప్రాబల్యంపై 75వ జాతీయ నమూనా సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు జీవనశైలి జబ్బులు.. అంటే బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు, నలుగురు గుండె, రక్తనాళాల జబ్బుల బారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కేరళ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ శాతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వారు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. బిహార్, అస్సోం, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారు బిహార్, ఉత్తరాఖండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జీవనశైలి జబ్బులతో పాటు గుండె, రక్తనాళాల జబ్బులు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారు కేరళలో అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ఒత్తిడి సైలెంట్ కిల్లర్.. స్ట్రెస్తో వచ్చే వ్యాధులేంటో తెలుసా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరంగా జీవించగలం... మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఎవరైనా ప్రశాంతంగా జీవించేందుకు వీలుంటుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగుల జీవన విధానంలో యంత్రాల్లా మారిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణ, వ్యాపారం, ఉద్యోగరీత్యా ఇలా రకరకాల ఒత్తిళ్లు సహజంగానే ఉంటున్నాయి. చదవండి: దగ్గును బలవంతంగా ఆపుకోకండి! ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిళ్లు చుట్టుముడుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఆ ఫలితంగా శారీరక సమస్యలు చుట్టు ముడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్వేవ్ సమయంలో భయం, ఆందోళన, ఒత్తిడితోనే ఎక్కువ మంది శ్యాస ఇబ్బందులతో మృతి చెందినట్లు వైద్యులు అంటున్నారు. హార్మోన్స్పై ప్రభావం.. మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మిగతా హార్మోన్స్పై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఆ ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈటింగ్ డిజార్డర్స్తో కొందరు అసలు ఆహారం తీసుకోకపోవడం, మరికొందరు అధిక ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో కొందరు రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటారని, మరికొందరు ఊబకాయలుగా మారుతున్నారు. అంతేకాదు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గుండె లయ తప్పుతుంది.. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో హార్ట్బీట్లో తేడా వస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైన వారిలో ఒక్కోసారి హార్ట్రేట్ పెరిగి సడన్ హార్ట్ ఎటాక్కు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరహా బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. రిలాక్సేషన్ అవసరం.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, దాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఉపయోగకరంగా ఉంటాయి. వాటి ద్వారా మన ఆలోచనలను మళ్లించి మనసు రిలాక్సేషన్ కలిగేలా దోహదపడతాయి. ఏదైనా పనిలో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దానికి ఉపశమనం కలిగే మార్గాన్ని అన్వేషించాలి. మానసిక ప్రశాంతత అవసరం ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిళ్లకు గురైనప్పుడు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. హార్మోన్పై ఎఫెక్ట్ చూపి షుగర్ లెవల్స్ పెరగడం, రక్తపోటు, హార్ట్రేట్లో తేడాలు వంటివి చోటుచేసుకుంటాయి. మానసికంగా పటిష్టంగా ఉన్పప్పుడే శారీరకంగా బలంగా ఉంటారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించగలుగుతారు. – డాక్టర్ వెంకటకృష్ణ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి జీజీహెచ్ ఏకాగ్రత తగ్గుతుంది మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగులైతే పనిమీద, విద్యార్థులైతే చదువుపై దృష్టి పెట్టలేరు. పనిని తర్వాత చేయవచ్చులే అని వాయిదా వేస్తూ ఉండటంతో సోమరితనం పెరిగిపోతుంది. ఇలాంటి వారు ఈటింగ్ డిజార్డర్కు గురవుతారు. అసలు ఆహారం తీసుకోకపోవడం, లేకుండా ఎక్కువ ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. – డాక్టర్ గర్రే శంకర్రావు, మానసిక నిపుణులు, విజయవాడ -
కోవిడ్ ఇక అంటువ్యాధి స్థాయిలోనే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా? జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా. కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము? ►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్ను పరిశీలించడం కోవిడ్తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది. భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి? ►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది. సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్ఐఆర్కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా? ►సీఎస్ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్ఐఆర్లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం. దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది. -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
ఉప్పు ముప్పు.. నిమిషానికి ముగ్గురు మృతి, షాకింగ్ నిజాలు బయటకొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: ఉప్పు వాడకం మితిమీరుతోంది. ఉప్పు దుష్ఫలితాల కారణంగా ప్రపంచంలో ప్రతీ నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అంటే ఏడాదికి 19 లక్షల మంది బలవుతున్నారు. ‘ఉప్పు వాడకం– దుష్పరిణామాలు–నియంత్రణ చర్యల’పై తాజా నివేదికలో ఈమేరకు వెల్లడించింది. ఒక మనిషి రోజుకు సగటున వివిధ రూపాల్లో 5 గ్రాములకంటే తక్కువ పరిమాణంలో ఉప్పు వాడాలి. అయితే ప్రపంచంలో పది గ్రాములు వాడుతుండగా, భారత్లో 11 గ్రాములు వాడుతున్నారు. 5 గ్రాముల్లోనే అయోడైజ్డ్ ఉప్పు కూడా ఉండాలి. ప్రపంచంలో 188 కోట్ల మంది అయోడిన్ లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, గొంతు దగ్గర వాపు ఉంటాయి. గర్భిణీకి అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. ఉప్పు అధికంగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి. ఇతరత్రా జీవనశైలి వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. ఉప్పు నియంత్రణలో ప్రాథమిక దశలోనే.. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలంటే నాలుగు దశల కార్యక్రమం అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొదటి దశ విధాన నిర్ణయం, రెండోది స్వచ్ఛందంగా ముందుకు రావడం, మూడోది తప్పనిసరిగా అమలు చేయడం, నాలుగోది ప్రతీ ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందో తెలియజెప్పేలా ఆదేశాలు జారీ చేయడం. ఇందులో భారత్ కేవలం మొదటి దశకే పరిమితంకాగా, ప్రపంచంలో 41 దేశాల్లో పై నాలుగు దశల కార్యక్రమం అమలవుతోంది. చికెన్, సూప్స్, స్నాక్స్, బ్రెడ్, నిల్వ ఉంచిన చికెన్లో ఉప్పుకు పరిమితి పెట్టిన దేశాలు అర్జెంటీనా, బల్గేరియా, ఇరాన్, జోర్డాన్, ఇరాక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, స్పెయిన్, పాలస్తీనా వంటి 41 దేశాలున్నాయి. వంద గ్రాముల ఆహారపదార్థాలకు ఎంత ఉప్పు వాడాలో ఒక ప్రామాణికాన్ని అమలు చేస్తున్నాయి. ఆదర్శమైన దేశాలు... కొన్ని దేశాలు ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించాలన్న చట్టాన్ని తేవడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గాయి. దక్షిణ కొరియాలో 2010–14 మధ్యలో ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును తగ్గించే చర్యలు చేపట్టగా.. ఆ ఐదేళ్లలోనే ఉప్పు వినియోగాన్ని 24 శాతం తగ్గించారు. దీంతో బీపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థాయ్లాండ్లో ప్రపంచ సగటు కంటే ఎక్కువ వినియోగం ఉంది. దీంతో 25 శాతం మంది ప్రజలు బీపీ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 30 శాతం ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన పద్ధతి తెచ్చింది. ప్రతీ పెద్ద వయస్సు వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నాడు? పరిమాణం ఎంత ఉంటుందన్న పరీక్షలు చేశారు. అలా బీపీని నియంత్రిస్తున్నారు. హైదరాబాద్లో 40 శాతం మందికి బీపీ... కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం హైదరాబాద్లో 40 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మహిళల్లో 26 శాతం, పురుషుల్లో 32 శాతం బీపీతో బాధపడుతున్నారు. పట్టణాల్లోనే బీపీ ఎక్కువగా ఉంది. లాన్సెట్ సర్వే ప్రకారం.. భారత్లో మరణాలకు ఐదు ప్రధాన కారణాల్లో బీపీ ఒకటని తేలింది. మిగిలినవి మధుమేహం, కాలుష్యం, పొగాకు వాడకం, పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఉప్పు నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ చేసిన సిఫార్సులివీ... –దేశంలో సగటున ఎంత ఉప్పు వాడుతున్నారో పర్యవేక్షించాలి. –ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు ఎంతుందో లేబుల్ మీద రాయాలి. –ప్రధానంగా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అలా ప్రజల్లో ఉప్పు తగ్గించేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. –సాధారణంగా బ్రెడ్డు, ప్రాసెస్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ మీట్, డెయిరీ పదార్థాల్లో నిల్వ కోసం ఉప్పు వాడతారు. దీన్ని తగ్గించాలి. 87 శాతం ఆహారంలో వేసుకోవడం వల్లే... అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు ఎక్కువగా వస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి జబ్బులను తగ్గించడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గం. దక్షిణ భారతదేశంలో ప్రాసెస్డ్ చికెన్, పౌల్ట్రీల ద్వారా ఏడు శాతం ఉప్పు, పాల పదార్థాల ద్వారా 3 శాతం, ఆహార పదార్థాల్లో, పెరుగు వంటి వాటిల్లో వేసుకోవడం వల్ల 87 శాతం ఉప్పు వాడకం జరుగుతోంది. ఉప్పును అదనంగా వేసుకోవడంలో మహిళలు ముందున్నారు. బాగా చదువుకున్న వారే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. సగానికిపైగా స్క్రీనింగ్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్ చేశారు. బీపీలో కోనసీమ టాప్ ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్టెన్షన్ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్తో బాధపడుతున్నారు. స్క్రీనింగ్ వివరాలతో ఐడీలు ఎన్సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్సీల్లో ఎన్సీడీ క్లినిక్లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్సీడీ స్క్రీనింగ్తో పాటు ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లు ఏడాదికి 98 రోజులపాటు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరితిత్తులకు పొగబెట్టే సూక్ష్మ ధూళికణాల మోతాదు 2020 కంటే.. 2021 చివరి నాటికి గణనీయంగా పెరిగినట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు (పీఎం– 2.5) సరాసరిన 41 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు లెక్కతేల్చింది. కాలుష్యం కారణంగా నగరవాసులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. 2020లో కాలుష్య మోతాదు లాక్డౌన్ కారణంగా తగ్గుముఖం పట్టినట్లు అంచనా వేయడం విశేషం. దక్షిణాదిలో ఇక్కడే అత్యధికం.. ► దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడోస్థానంలో నిలిచినట్లు ఈ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. రెండోస్థానంలో పొరుగునే ఉన్న ఏపీలోని విశాఖపట్టణం నిలవడం గమనార్హం. 2020లో నగరంలో 60 రోజులు మాత్రమే కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయగా.. 2021 సంవత్సరంలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యంతో సతమతమైందని ఈ నివేదిక తెలిపింది. విశాఖపట్టణం 86 రోజులపాటు కాలుష్యంతో అవస్థలు పడుతోందని నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాదిలో డిసెంబరు– మార్చి మధ్యకాలంలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది. చదవండి: ముచ్చింతల్లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన ► శీతాకాలంలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంటున్న కారణంగా సిటీజన్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. ఏడాదిలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యం.. మరో 96 రోజులపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోపలే వాయు కాలుష్యం నమోదవుతుండడంతో వాయు నాణ్యత సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించింది. శీతాకాలంలో సూక్ష్మ ధూళికణాల మోతాదు డిసెంబరు 26, జనవరి 3, 2021 తేదీల్లో అత్యధికంగా నమోదైందని తెలిపింది. ► ఈ రెండు తేదీల్లో ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 81 మైక్రోగ్రాములుగా నమోదవడం గమనార్హం. పారిశ్రామిక అడ్డాగా ఉన్న సనత్నగర్ ప్రాంతంలో సరాసరిన 83 మైక్రోగ్రాముల మేర సూక్ష్మ ధూళికణాలు నమోదయినట్లు సీఎస్ఈ నివేదిక వెల్లడించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ వద్ద కూడా సరాసరిన ఘనపు మీటరు గాలిలో 57 మైక్రోగ్రాములుగా ధూళి కాలుష్యం నమోదవడం గమనార్హం. చదవండి: భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా -
‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలాంటి సినిమాలు చూసి, లేదా కథలు చదివి మనం వినోదం పొందుతాం. ఇలా రుధిరాన్ని ఆస్వాదించే కారెక్టర్స్ను వాంపైర్స్ అని పిలవడం కూడా మనకు తెలుసు. కానీ వాంపైరిజమ్ అనే కండిషన్ ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతోకొంత రుచి చూస్తాడు. చటుక్కున వేలు తెగినప్పుడు చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకే ఇలా చేస్తారు. అయినప్పటికీ ఇలా తన రక్తాన్ని రుచిచూసే ఆ ప్రక్రియకు ‘‘ఆటో వాంపైరిజమ్’’ అంటారు. ఇది సాధారణం. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఇంకా అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇలా రక్తం తాగాలనే కోరిక పుట్టడాన్ని ‘‘క్లినికల్ వాంపైరిజమ్’’ అంటారు. ఇక మరికొందరిలో ఇది ఓ రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన (బిహేవియరల్) రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ చికిత్స అందిస్తారు. చదవండి: ‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు! -
మందులోడా... ఓరి మాయలోడా!
మనుషుల అవసరాలే వ్యాపారులకు లాభాలు తెచ్చే గనులు. మనుషులకు ఏం కావాలో ఓ కంట కనిపెట్టి వ్యాపారులు వాటిని తయారు చేసే పనిలో పడతారు. యుగాల తరబడి జరుగుతున్నది ఇదే. అసలైన వ్యాపారి ఎడారిలో ఇసుకను ఒంటెలకు అమ్మి బతికేయగలడు. తన దగ్గర ఉన్నదాన్నే ప్రజలకు అవసరం అయ్యేలా చేసే వ్యాపారులు మాయలోళ్లే! డబ్బు అవసరం ఉన్నవారికి వడ్డీకి అప్పులు ఇవ్వడం కొందరి వ్యాపారం. డబ్బుకు ఎంతగా కటకటలాడుతున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా వడ్డీ రేటు పెంచేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద దేశాలు కూడా అదే చేస్తాయి. చిన్న దేశాల అవసరాలను ఆసరా చేసుకొని, ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వాటికి ఆర్థిక సాయం ముసుగులో అప్పుల ఊబిలోకి దింపేస్తాయి.ఒకప్పటి పెద్దన్న అమెరికాను కూడా భయపెడుతున్న చైనావాడు చేస్తున్నది అదే! ఎవరికన్నా ఏ రోగమో వస్తే దాన్ని నయం చేసే మందు తయారు చేయడం లాభసాటి వ్యాపారం. మరి మనుషులకు రోగాలే రాకపోతే ఆ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అందుకోసం ఆ వ్యాపారులు ఏం చేస్తారు? అందరికీ తరచుగా రోగాలు వస్తూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఔషధ వ్యాపారమే! ఫార్మా కంపెనీలు మూడు మాత్రలు... ఆరు గోలీలన్నట్లు దూసుకుపోతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వర్షాకాలం ఆరంభంలో జ్వరం రావడమే పెద్ద రోగం. దానికి మిరియాల కషాయంతోనో, శొంఠి కషాయంతోనో వంటింటి వైద్యం చేసేసుకునేవారు. రెండేళ్ళుగా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఈ రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల మేరకు ఔషధ వ్యాపారం, ఆసుపత్రుల వ్యాపారం జరిగాయి. ఎప్పుడూ వినని, ఎన్నడూ కనని కరోనా రోగం ఓ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ వైరస్ దానంతట అదిగా పుట్టిందా, లేక మనుషులే తయారు చేశారా అన్న చర్చ ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. కారణం – ఈ వైరస్ను చైనాలోని వూహాన్ ల్యాబ్ నుండి ప్రపంచంపైకి వదిలిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, దీనికి కారణం చైనా కాదు... చైనాలోని అమెరికాకు చెందిన మాంసం ఎగుమతి కర్మాగారాలేనని మరో వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలలో ఎవరు చెప్పింది నిజమైనా... ఈ రోగాన్ని ప్రపంచానికి అంటించింది మాత్రం మనుషులేనన్నది అర్థమవుతోంది. అది నిజంగానే నిజం అయితే... అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. ఒకప్పుడు కలరా వణికించింది. మలేరియా భయపెట్టింది. వాటికి వ్యాక్సిన్లు తయారుచేశారు. అటువంటి ఓ కొత్త వ్యాపారం కోసమే కరోనాను కనిపెట్టారా? అది నిజం కాదని అంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదే నిజం అయితే మాత్రం చాలా చాలా భయంగానూ ఉంటుంది. భయం... ఇక్కడ రోగం వల్ల కాదు... దాన్ని మనపైకి వదిలిన దుర్మార్గుల వల్ల! కొన్నేళ్లుగా చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అసలీ రెండు జ్వరాల ఊసే లేదు. అప్పుడు లేని జ్వరాలు ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి అని కొందరి ప్రశ్న. కొంపదీసి ఈ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలను కూడా ఎవరో ఉత్పత్తి చేసి మానవాళిపైకి వదిలారా? జ్వరాలతో జనం వణుకుతూ ఉంటే... వాటికి మందులు అమ్మి, లాభాలు గడిస్తున్నారా? అని మరికొందరికి మాచెడ్డ అనుమానం. నిజానిజాల సంగతి తరువాత కానీ... ముందుగా అసలీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయని అడిగామనుకోండి... ఔషధ వ్యాపారులతో పాటు బడా ఆసుపత్రుల భారీ ధనాశ చూస్తోంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమేనని అనిపించడం లేదా అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతగా పెరగని కాలంలో... గర్భవతులకు నూటికి నూరు శాతం సాధారణ డెలివరీలే అని ఆ తరం పెద్దవాళ్ళు చెబుతుంటారు. వైద్యవిద్య అంటే ఏమిటో కూడా తెలియని మంత్రసానులు పురుళ్లు పోసి, పండంటి బిడ్డలను కానుకగా ఇచ్చేవారు. తేడా ఎక్కడ ఉందో తెలీదు కానీ... ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతూ వచ్చాయి. ఏడు నెలల గర్భవతి కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వస్తే చాలు... సిజేరియన్ చేయకపోతే తల్లికీ బిడ్డకీ ప్రమాదమేనని చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నారు అని కొందరి తీవ్ర ఆరోపణ. నిజానికి, అటు రోగాల్లోనూ, మందుల్లోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవి అన్నీ కచ్చితంగా చెడ్డవి కావు. అలా గంపగుత్తగా ఓ ముద్ర వేసేయడం సరైనది కాదు. నయం కాని రోగాలకు కొత్త మందులు ఆవిష్కరించడం శాస్త్రీయ పరిశోధనలో కచ్చితంగా పెద్ద ముందడుగే. కాకపోతే ఆ మందుల అవసరం లేని వాళ్లతో కూడా వాటిని కొనిపించడానికి ప్రయత్నిస్తేనే... తప్పు. అలా చేసే వారే అసలు విలన్లు. ఏ వ్యాపారాన్నైనా క్షమించవచ్చు కానీ... విద్య, వైద్యం లాంటి విషయాల్లో మాత్రం కాదు. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కనిపెట్టి, కళ్ళెం వేయాల్సింది పాలకులే. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న నానుడి పుట్టిన దేశం మనది. ఇక్కడే వైద్యం అంటే... డబ్బు కోసం జరిగే వ్యాపారం అనిపిస్తే మాత్రం మంచిది కాదు. అందుకే, ఈ రోగాన్ని నయం చేయడమెలాగో అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదో ఒక మందు కనిపెట్టాలి! -
ఎండు తెగులుతో దెబ్బతిన్న మామిడి తోటను ప్రకృతి సేద్యంతో రక్షించాడిలా..!
ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం. నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు. చదవండి: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి. పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం. ప్రతి ఏటా కాపు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా. ఎండు తెగులు మటుమాయం ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. – మూల్పూరి నాగవల్లేశ్వరరావు (నాని– 94916 99369), మామిడి రైతు, కొర్లగుంట, ముసునూరు మం., కృష్ణా జిల్లా. ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. – చొప్పర శ్రీనివాసులు (79950 86773), ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు. సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్లోని ఐఐఎఫ్ఎస్ఆర్, ఘజియాబాద్లోని ఎన్సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మట్లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in ఇతర వివరాలకు.. కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020. అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు ‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709. 15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి: లక్షణాలు ఇవే, జాగ్రత్తలు అవసరం!
సాక్షి,అనంతపురం: కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పశుసంవర్ధక శాఖ ఇన్చార్జ్ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం, రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్రం ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్ సూచించారు. ప్రముఖ జీవ శాస్త్రవేత్త, రేబీస్ టీకా సృష్టికర్త సర్ లూయిస్ పాశ్చర్ వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28ని ప్రపంచ రేబీస్ నియంత్రణ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రేబీస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశు వైద్యశాలల్లో మంగళవారం కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం 2,600 డోసులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రేబీస్ వ్యాప్తి ఇలా.. ‘రాబ్డో’ కుటుంబానికి చెందిన ‘లిస్సా’ వైరస్ కారణంగా రేబీస్ వ్యాధి వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఆవులు, గొర్రెలు, పందులు, గుర్రాల్లో ఈ వైరస్ కనిపిస్తుంది. వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కనో, ఇతర జంతువునో, మనిషినో కరచినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. 90 శాతం కుక్కల వల్లనే మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కుక్క కాటు వేయగానే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది న్యూరో మస్కులర్ స్టిండిల్ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది. అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. శ్వాస దిగ్బంధనం వల్ల రేబీస్ వ్యాధి సోకిన కుక్క చనిపోతుంది. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన లక్షణాలు (ఫ్యూరియస్ ఫారం), మరొకటి తీవ్రత తక్కువ గల లక్షణాలు (డంబ్ ఫారం). తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే వ్యాధికి గురైన కుక్కలు శబ్ధాలకు అతిగా స్పందిస్తాయి. ఇతర జంతువులు, మనుషులు, చలనం లేని వస్తువులపై దాడి చేస్తుంటాయి. నడకలో కాళ్ల సమన్వయం లేకుండా పోవడం, పిచ్చిగా విపరీతంగా అరవడం చేస్తుంటాయి. చివరగా 24 నుంచి 48 గంటలల్లోపు వ్యాధి తారాస్థాయికి చేరుకుని పక్షవాతానికి గురై మరణిస్తుంది. ఇక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వాటిలో వెనుక కాళ్లు మడత పడుతుంటాయి. తరచుగా తోక ఒకవైపు ఒరిగి ఉంటుంది. శబ్ధాలకు స్పందించే గుణం తక్కువగా ఉండి, నోటి నుంచి చొంగ కారుతూ, ఆవలిస్తున్నట్లుగా అరవడం చేస్తుంటాయి. ఇలాంటి లక్షణాలున్న కుక్కలు వారం నుంచి పది రోజుల్లో మరణిస్తాయి. ముందస్తు జాగ్రత్తలతోనే నివారణ ప్రాణాంతక రేబీస్ వ్యాధి సోకకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయ మార్గం. కుక్క కాటుకు గురైన వారు నీటి కొళాయి కింద కార్బలిక్ సబ్బు లేదా డెట్టాల్ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలి. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వల్ల వైరస్ కదలికలను కొంత వరకు తగ్గించవచ్చు. కుక్క కరచిన మొదటి రోజు నుంచి 3, 7, 14, 28, 90వ రోజుల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, పశుసంవర్ధకశాఖ సహకారంతో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు టీకాలు వేయిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్స్క్రీన్పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలె క్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వారి్మంగ్పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్వర్క్, హోమ్వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. రోజుకు సగటున 20–30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 10–24 సంవత్సరాల మధ్య వయసున్నవాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. 2008 నుంచి గూగుల్లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. – డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచి్చంది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కలి్పంచడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
వీఐటీఏపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు!
అమరావతి: వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చవల్ విధానంలో ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ‘‘వ్యాక్సిన్ గాడ్ మదర్ ఆఫ్ ఇండియా’’ డైరెక్టర్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్, ప్రొఫెసర్ మరియు లాబరేటరీ డైరెక్టర్, వెల్కమ్ ట్రస్ట్ రీసెర్చ్ లాబరేటరీ, సి.ఎం.సి. వెల్లూరు గౌరవ అతిధిగా, (వీఐఈసీఈ 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థిని) సీనియర్ డైరెక్టర్, ఒరాకిల్ కార్పొరేషన్, యు.ఎస్.ఏ.. శైలజ మలిరెడ్డి హజరయ్యారు. కాగా, ముఖ్యఅతిథిగా హజరైన గగన్ దీప్ కాంగ్మామాట్లాడుతూ.. అంటూ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల గురించి వివరించారు. ప్రస్తుతం మరియు భవిష్యత్ లలో వ్యాధుల వ్యాప్తిలో జరిగే మార్పులు గురించి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాధులు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని దీనికి జనాభా పెరుగుదల ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయని అన్నారు. ఎయిడ్స్, జిక, ఎబోలా, సార్స్, కోవిడ్ వంటి మహామ్మారులు ఎలా వ్యాప్తి చెందుతాయో, వ్యాధినిరోధక టీకాలతో వీటిని కట్టడిచేసి మరణాల రేటుని ఎలా తగ్గించావచ్చో, వివిధ వ్యాధి నిరోదోక టీకాల పనితీరు, అభివృద్ధి, భవిష్యత్ తరాలకు అవి ఉపయోగపడే విధానాల గురించి వివరించారు. గౌరవఅతిధి శ్రీమతి. శైలజ మలిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో వి.ఐ.టి.లో గడిపిన క్షణాలను గుర్తు చేస్తుకున్నారు. విద్యతోనే మహిళా అభివృద్ధి సాధ్యమని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ప్రతి మహిళా కృషి చేయాలనీ తెలియచేస్తూ, సామజిక సేవా రంగంలో తను చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా వివరించారు.వి.ఐ.టి.ఏ.పి విశ్వవిద్యాలయ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్య పెంటారెడ్డి మాట్లాడుతూ మహిళల సమన హక్కులు , వరకట్న నిషేధం, లింగ మరియు ఆర్థిక అసమానతలు, మహిళల్లో బహుళ సామర్థ్యం గురించి చక్కటి ప్రజెంటేషన ద్వారా వివరించారు. వి.ఐ.టి. ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ... అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి, గౌరవ అతిధులను కొనియాడారు. ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని, ప్రపంచ జనాభాలో 49.9 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, అదే భారత దేశంలో కేవలం 48.4 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలియచేసారు. మహిళా సాధికారికత, రాజకీయాలలో మహిళల పాత్ర గురించి వివరించారు.మహిళలు ఉన్నత విద్యలో రాణించేందుకు యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (University Higher Education Trust) ద్వార సహాయం అందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక పోటీలలో విజేతలుగా నిలచిన విద్యార్థులకు, సిబ్బంది మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి.ఐ.టి.ఏ.పివిశ్వవిద్యాలయవైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ ఎస్.వి. కోటా రెడ్డి , రిజిస్ట్రార్ సి.యల్.వి. శివకుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో 30 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండడం విశేషం. -
అడవిలో అన్నలకు అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాక్డౌన్ను ఆసరాగా చేసుకుని తిరిగి నెట్వర్క్ ను విస్తరిద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నక్సల్స్కు పోలీసుల ప్రతి వ్యూహంతో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్ర అడవుల్లో పోలీసులు నిరంతరం కూంబింగ్ చేపడుతూ మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్ వైపు తరుముతున్నారు. దీంతో అన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా కొంతకాలంగా మావోయిస్టుల్లో చాలామంది అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది. లాక్డౌన్ కాలంలో చందాల వసూళ్లు, రిక్రూట్మెంట్, మందులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. కానీ, పోలీసులు రాష్ట్రంలోకి వచ్చిన మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్కు తరిమికొట్టే ఆపరేషన్ ప్రారంభించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు, నిరంతర కూంబింగ్, నదీపరీవాహక ప్రాంతాలపై నిఘా చర్యలతో మావోయిస్టు కొరియర్ వ్యవస్థ స్తంభించింది. లాక్డౌన్ అనంతరం జరిగిన 11 ఎన్కౌంటర్లలో, 11 మంది మరణించారు. 135 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర సెక్రటరీలు, నలుగురు జిల్లా కమిటీ, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాలకు వచ్చి మందులు, నిత్యావసరాలను అడవుల్లోకి తీసుకెళ్లే కొరియర్ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఫలితంగా సకాలంలో మందులు అందక, చిన్న జ్వరాలు, రోగాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగినా.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, బడే చొక్కారావు అలియాస్ భాస్కర్, అగ్రనేత హరిభూషణ్ సెంట్రల్ కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పలు ప్రాంతా ల్లో సంచరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కోసం తీవ్రంగా శ్రమించినా అనుకున్న మేరకు సఫలీకృతం కాలేకపోయారు. వీరిలో హరిభూషణ్ సంచారంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అడెల్లు భాస్కర్ రెండు సార్లు, ద్వితీయ శ్రేణి నాయకుడు కంకణాల రాజిరెడ్డి ఒకసారి పోలీసులకు తారసపడ్డారు. వీరిద్దరూ పోలీసుల కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. ఎలా తెలిసిందంటే... మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెల్లడైంది. ‘భిక్షపతి అలియాస్ విజేందర్ 2018లో దళంలో చేరాడు. ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. పోలీసుల అష్టదిగ్బంధనం కారణంగా చికిత్స అందకపోవడంతో ఈనెల 18వ తేదీన మరణించాడు’ అని గురువారం విడుదల చేసిన లేఖలో జగన్ ఆరోపించారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్లు కొనుగోలు చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టులు అప్పుడు కొనుగోలు చేసిన మందులు జనవరి నాటికి దాదాపుగా అయిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఫలితంగా టాబ్లెట్లు దొరక్క.. బయటకు వచ్చే అవకాశం లేక మావోయిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. భిక్షపతి ఇంటి వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు,(ఇన్సెట్) భిక్షపతి (ఫైల్) మా కొడుకు తిరిగొస్తాడనుకున్నాం చిట్యాల: అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుమారుడు భిక్షపతి తిరిగి వస్తాడనుకుంటే కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు సమ్మక్క–ముత్తయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి సమ్మక్క–ముత్తయ్య దంపతులకు నలుగురు సంతానం. పెద్దకుమారుడు భిక్షపతి డిగ్రీ చదివాడు. 2018లో ఉద్యమంలో చేరాడు. చదవండి: సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి -
ఈ నాలుగు.. ప్రమాదకరం
‘జీవనశైలి’ జబ్బులు ప్రాణాంతకమవుతున్నాయి. బిజీ జీవితంలో వ్యాయామంపై శ్రద్ధ చూపకపోవడం అనేకమందికి ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు–అంటువ్యాధులు కానివి)తోనే మృతి చెందుతున్నట్టు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని హెచ్చరించింది. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్స్ (పక్షవాతం–హైపర్టెన్షన్ కారణంగా వచ్చే) వంటి జీవనశైలి జబ్బులతో ఏటికేటికీ మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. దీన్ని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. కోవిడ్ సోకిన వారిలోనూ ఎక్కువ మంది ఈ అసాంక్రమిక వ్యాధి బాధితులే మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పొగ తాగడం, మద్యం, హానికర తిండి తినడం, శారీరక శ్రమ లేకపోవడం జీవనశైలి జబ్బులకు ప్రధాన కారణాలు. ఎక్కువమందికి వ్యాయామంపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు కారణమవుతోంది. స్థూలకాయం కారణంగా చాలామంది రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. – సాక్షి, అమరావతి ప్రత్యేక సాఫ్ట్వేర్తో రాష్ట్రంలో ఇంటింటి సర్వే జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మన రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఓడీకే (ఓపెన్ డేటా కిట్) పేరుతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటికే 72 శాతానికిపైగా పూర్తయింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా సుమారు 19 వేలమంది ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మధుమేహం, బీపీ, క్యాన్సర్, లెప్రసీ వంటి జబ్బులపై ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తూ ఈ సర్వే సాగుతోంది. వ్యక్తి ఎత్తు, బరువు, బీపీ, బయోకెమికల్ ఎస్టిమేషన్స్, ఫాస్టింగ్ బ్లడ్ సుగర్, యూరినరీ సోడియం పరిమాణం వంటివి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు దాటిన వారిలో 14.2 శాతంమంది పొగ తాగుతున్నారు. 21.4 శాతం మంది పొగలేని పొగాకును వాడుతున్నారు. 18 శాతం మంది హైపర్ టెన్షన్ (బీపీ)తో, 13 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చూస్తున్నారు. -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతను పాటించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్లోని తన ఇంటి పరిసరాలను మహమూద్ అలీ శుభ్రంచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న క్రమంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా మాస్కు, శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. -
క్యాన్సర్పై యుద్ధం!
ఆకివీడు: రాష్ట్రంలో క్యాన్సర్ను అదుపు చే సేందుకు ప్రభుత్వం గట్టి చర్యలకు పూనుకుంది. వ్యాధి ముదరకముందే గుర్తించి నివారించే ప్రణాళికలు చేపట్టింది. ప్రాథమిక దశలో గుర్తించని కారణంగా.. క్యాన్సర్ వ్యాధి ముదిరి వేలమంది మృత్యువాత పడుతున్నారు. ముందు గుర్తించగలిగితే కొన్ని ప్రాణాలనైనా కాపాడగలమనే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాన్సర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్ రోగులకు విస్తృత సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో 131 రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్స అందిస్తుండగా మరో 44 రకాల జబ్బులను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. విస్తరిస్తున్న వ్యాధి.. జిల్లాలో చాప కింద నీరులా క్యాన్సర్ విస్తరిస్తోంది. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభమమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అనారోగ్యంగా పెరిగి కణుతులుగా మారతాయి. శరీరంలో ఇష్టారాజ్యంగా కణుతులు పెరగడమే క్యాన్సర్గా చెప్పవచ్చు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా క్యాన్సర్ విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో క్యాన్సర్కు పూర్తి వైద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాలో 40 వేల మందికి పైగా రోగులు.. జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కలుషిత వాతావరణం, ఆహారం, నీటి కాలుష్యం, కల్తీ నూనెలు తదితరాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో మూడు, నాలుగు స్టేజ్లలో ఉన్న క్యాన్సర్ రోగుల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా. 1, 2 స్టేజ్లలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు రోగం బయటపడే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ప్రతిఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బును గుర్తించి, తగిన మందులు వాడటంతో నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతినెలా పరీక్షా శిబిరం : కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా నెలకో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించవచ్చని ప్రభుత్వం నిర్ధారించింది. పలు రకాల క్యాన్సర్ రోగాల్ని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా తగిన మందులు వాడటంతో నివారించవచ్చని వైద్యులు పేర్కొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోదావరి వాసులే అధికం.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని క్యాన్సర్ ఆసుపత్రుల వద్ద గోదావరి జిల్లాలకు చెందిన క్యాన్సర్ రోగులే అధిక శాతం ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆకివీడులో ఇటీ వల క్యాన్సర్ వ్యాధితో ముగ్గురు వైద్యులు అకాల మృతి చెందడం వ్యాధి విస్తరణకు అద్దం పడుతోంది. మలం, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం ద్వా రా వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రధానంగా గొంతు, రక్త, మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బాధితులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిలో 20 నుంచి 30 శాతం క్యాన్సర్తో బాధపడుతున్నారని ఎన్ ఐపీ సంస్థ గతంలో వెల్లడించింది. నాణ్యమైన గింజతోనే ఆరోగ్యం నాణ్యమైన, సేంద్రియ, ఆరో గ్యకరమైన ఆహారాన్ని పండించేలా చర్యలు చేపడితే రోగాలు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా పారద్రోలవచ్చు. కలుషిత ఆహారం వల్లే క్యాన్సర్ విస్తరి స్తోంది. మనిషిలోని కణాలు రోజురోజుకూ మందగించడం వల్లే కణం అదుపు తప్పి క్యాన్సర్గా మారుతోంది. – డాక్టర్ పీబీ ప్రతాప్కుమార్, సీనియర్ వైద్యులు, ఆకివీడు ఆరోగ్యశ్రీ వరం ఆరోగ్యశ్రీ పథకం క్యాన్సర్ రోగులకు వరం. ఈ పథకంలో కొత్తగా 44 రకాల క్యాన్సర్ చికిత్సలను చేర్చడంతో మొత్తం 175 క్యాన్సర్ జబ్బులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనుంది. క్యాన్సర్ రోగులను ప్రాథమిక దశలో గుర్తించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయం. – కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్, వైఎస్సార్సీపీ, ఆకివీడు ప్రాథమికస్థాయిలో కొన్ని గుర్తిస్తున్నాం ప్రాథమిక స్థాయిలో కొన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించి, ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నాం. అన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించలేం. స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే గుర్తించాలి. ప్రతి నెల ఆరుగురు, ఏడుగురు రోగులను ఉన్నత వైద్యానికి రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ భీమవరపు బిలాల్, సీహెచ్సీ వైద్యులు, ఆకివీడు -
జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది జూన్ వరకు నిర్వహించిన సర్వే వివరాలను ఎన్ఎస్వో అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని తేలింది. ఇన్పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్ సంబంధిత రోగాలతోనే వస్తున్నారని వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల తర్వాత ఎక్కువ మంది గాయాలతో వస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో పేగు, గుండె సంబంధిత రోగులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న వారిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువని సర్వే తేల్చింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 31.4 మంది మగవారు, 31.8 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 31.3 శాతం మంది పురుషులు, 31.4 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ జబ్బులకు గురువుతున్నారని వెల్లడైంది. కేన్సర్కే అత్యధిక ఖర్చు... ఖర్చుల విషయానికి వస్తే అన్నింటికన్నా కేన్సర్ చికిత్స కోసం ఎక్కువ ఖర్చవుతోందని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం సగటున ప్రతి కేన్సర్ రోగికి కనీసం రూ. 61,216 ఖర్చవుతోందని సర్వే తేల్చింది. ఆ తర్వాత గుండె జబ్బులకు ఎక్కువ ఖర్చవుతుండగా రోగాల సంఖ్యలో ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు అతితక్కువ ఖర్చుతో వైద్యం అందుతోందని వెల్లడించింది. -
వ్యాధులకు లోగిళ్లు
సాక్షి, హైదరాబాద్: గృహమే స్వర్గసీమ. అయితే నాసిరకపు ఇళ్లు వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇల్లు–ఆరోగ్యం’పేరుతో తాజాగా డబ్ల్యూహెచ్వో ఓ నివేదిక విడుదల చేసింది. ఇరుకైన గదులు, గాలి, వెలుతురు లేకుండా ఎక్కువ మంది నివసించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని హెచ్చరించింది. అంటువ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, బీపీ వంటివి చుట్టుముడుతున్నాయని తేల్చింది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యకరమైన ఇంటి నిర్మా ణం ఎంతో కీలకమైందని పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన జనాభా కూడా 2050 నాటికి రెట్టింపు అవుతుందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా.. ప్రపంచవ్యాప్తంగా మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో దాదాపు 10 కోట్ల మంది వరకు భారతదేశంలోనే ఉన్నారని అంచనా. మురికివాడల్లోని చిన్నపాటి గదులుండే ఆవాసాల్లో సక్రమమైన తాగునీరు ఉండే పరిస్థితి లేదు. పారిశుధ్యం మచ్చుకైనా ఉండదు. కలుషితమైన నీరు వారిని వెంటాడుతుంది. డయేరియా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 2016లో 8.29 లక్షల మంది చనిపోయారని నివేదిక తెలిపింది. ఒకే గదిలో నలుగురు నివసిస్తే అంటు వ్యాధులు ప్రబలుతాయని పేర్కొంది. వంట కోసం కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం వల్ల కాలుష్యం పెరుగుతుంది. దీంతో ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. 70 శాతం ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. కొన్ని దేశాల్లో నిరుద్యోగులు గృహాధారిత పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, వైకల్యం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కూడా ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది. అలాంటి చోట్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. సబ్సిడీతో నిర్మించాలి.. మంచి గాలి వెలుతురు, ఆరోగ్యకరంగా ఉండే ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. వాస్తు శిల్పులు, బిల్డర్లు, హౌసింగ్ ప్రొవైడర్లు, డెవలపర్లు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించింది. అలాగే సామాజిక సేవలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజారోగ్య నిపుణులు దృష్టి సారించాలి. మంచి గృహ నిర్మాణాల కోసం ప్రజలకు సబ్సిడీ ఇవ్వడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. సమస్యలొస్తాయి.. అపరిశుభ్రత వల్ల వచ్చే సమస్యలు – అపరిశుభ్రమైన ఇళ్లల్లో టీబీ వంటి వ్యాధులు సోకే ప్రమాదముంది. – టైఫాయిడ్, డెంగీ జ్వరాలు, గుండె జబ్బులు, ఇతర అంటు వ్యాధులు. – గొంతు, కంటి, చర్మ వ్యాధులు, నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. – మానసిక ఆరోగ్య సమస్యలు, మద్యం వినియోగం పెరగడం, నిరాశకు గురికావడం జరుగుతుంది. – ఆస్బెస్టాస్ టైల్స్, రేకుల వాడకం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. -
శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మేని పరిశుభ్రత చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. నిజానికి ఆహారం కంటే ముందుగా దానికే ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా... సూక్ష్మజీవులకూ, రోగకారక క్రిములకూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతిని, రోగాలను ఆహ్వానించినట్లవుతుంది. అందుకే వ్యక్తిగత శుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం చాలా ముఖ్యం. చాలామంది పొద్దున్నే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం మాత్రమే వ్యక్తిగత శుభ్రత అనుకుంటారు. కానీ పర్సనల్ హైజీన్ పరిధి అంతకంటే కూడా ఎక్కువే. జుట్టు చివరి నుంచి పాదం చివరి గోరువరకూ ప్రతి అవయవాన్నీ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం. నోటి సంరక్షణ ఇలా ప్రతిరోజూ పొద్దున్నే మనం పళ్లను బ్రష్ చేసుకుంటాం. వాస్తవానికి ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ చేసుకోవాల్సిందే. అయితే రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండే మనందరికీ అది అంతగా కుదిరే పని కాకపోవచ్చు. అందుకే తిన్న తర్వాత ప్రతిసారీ బ్రష్ చేసుకోలేకపోయినా... నోట్లోకి నీళ్లు తీసుకుని కనీసం రెండుమూడు సార్లు పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన నోటిలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ప్రతిరోజూ ఎలాగూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. బ్రషింగ్ తర్వాత మన చిగుర్లపైన వేలిచివరి భాగాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్లుగానూ, మసాజ్ చేసుకుంటున్నట్లుగానూ రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. మార్కెట్లో దొరికే మౌత్వాష్లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. నోటి దుర్వాసన ఉంటే... కొందరిలో ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ వారు నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటివారు తరచూ మౌత్వాష్తో శుభ్రం చేసుకోవడం మంచిది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నేరుగా నోటి దుర్వాసనకు కారణం కావడంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ, శరీర ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. దుర్వాసనకు కారణమవుతాయి. అందుకే అలాంటి దురలవాట్లు మానేయాలి. ఇక ఉల్లి, వెల్లుల్లి తినగానే అందులోని సల్ఫర్ కారణంగా నోటి నుంచి కాసేపు దుర్వాసన వస్తుంటుంది కాబట్టి పగటి వేళల్లో ముఖ్యం పనిచేసే చోట్ల అవి ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మేలు. ఇక నోటి పూర్తి సంరక్షణ కోసం కనీసం ప్రతి ఆర్నెల్లకోసారి డెంటిస్ట్ను కలిసి స్కేలింగ్ చేయించుకోవాలి. చెవుల సంరక్షణ చాలా మంది చెవుల శుభ్రతను పట్టించుకోరు. స్నానం సమయంలోనూ, ముఖం కడుక్కునే సమయంలోనూ చెవుల మీద సబ్బు రాసుకొని శుభ్రపరచుకోరు. మనం ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా అని పిలుచుకునే బాహ్య చెవిని కూడా స్నానం సమయంలో శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే కాసిని నీళ్లతో చెవిలో కాస్తంత లోపలి వరకూ శుభ్రం చేసుకోవాలి. అయితే చెవుల్లోకి మరింత లోతువరకు నీళ్లు పోకుండా చూసుకోవాలి. చాలామంది ఏమీ తోచనప్పుడల్లా చెవుల్లోకి పిన్నీసులూ, అగ్గిపుల్లలూ... కాస్తంత పట్ణణవాసులైతే ఇయర్బడ్స్ వంటి వాటితో చెవిలోపల కెలుకుతూ గువిలి తీస్తుంటారు. మన చెవుల్లోని గులివి చెవికి రక్షణ కల్పించడం కోసమే నిత్యం స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి ఇయర్బడ్స్ లాంటివి వాడకూడదు. ఇక చెవిలోని గువిలిని శుభ్రం చేయడం కోసం పదునైన పిన్నులు, అగ్గిపుల్లల వంటివి వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడవచ్చు లేదా గువిలి మరింత లోపలికి చేరవచ్చు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకుని, ఈఎన్టీ డాక్టర్ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రపరుస్తారు. స్నానం చేయడం ఇలా... ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా అన్నది చూసుకోరు. ముఖ్యంగా పిల్లలు. ఉదాహరణకు పిల్లలే కాదు... చాలా మంది పెద్దలు కూడా తమ చెవుల వెనక భాగాలనూ, మెడ వెనకా, శరీరంలో చర్మం మడతపడే చోట్లనూ శుభ్రం చేసుకోరు. తలస్నానం చేయడమిలా: తలస్నానం అన్నది క్రమం తప్పని ఇంటర్వెల్స్లో చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుంటారు. కానీ అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మర్దన (మసాజ్) చేసుకోవాలి. (జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయకపోయినా పర్వాలేదు). ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. చలికాలం లాంటి రోజుల్లో కూడా ప్రతిరోజూ స్నానం చేయండి. వేసవిలో అయితే కనీసం ఉదయం, సాయంత్రం రెండుపూటలా స్నానం చేయడం మంచిది. రోజూ ముఖం కడుక్కోండి మన దేహంలో బట్టలు తొడగని భాగాలు... అంటే చేతులు, ముఖం వంటి ఆచ్ఛాదన ఉండని భాగాలు తక్షణం కాలుష్యానికి గురవుతాయి. ఆ భాగాల్లో వెంటనే చేరుతుంటుంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. కాబట్టి వీలైనప్పుడల్లా ముఖంతో పాటు బట్టల కవర్ చేయని చేతులు, అరికాళ్లు కడుక్కుంటూ ఉండటం మంచిది. దీనివల్ల ముఖంపైన బ్యాక్టీరియా చేరడం వల్ల వచ్చే మొటిమల వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ముఖం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మేనిని ఇలా శుభ్రం చేసుకోండి మన శరీరంపై చాలాచోట్ల చర్మం ముడుతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వద్ద చర్మం ముడుతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్తో తుడుచుకోవాలి. ఇక బాహుమూలాల కింద కొందరు డియోడరెంట్స్, యాంటీ పెర్స్పిరెంట్స్ వంటి స్ప్రేలు వాడుతుంటారు. అవి వాడటం కొంతవరకు పరవాలేదు కానీ ఎక్కువగా వాడటం సరికాదు. ఇలాంటివి సరిపడనివారు వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. చాలామందిలో పొడి చర్మం ఒక సమస్యగా పరిణమిస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో వారి సమస్య రెట్టింపవుతుంది. ఇలాంటివారు మాయిష్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి.ఇక చలికాలంలోనైతే ఇది తప్పనిసరి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి చర్మంపై గీరుకుపోయినా, కాస్తంత ఒరుసుకుపోయినా వారి పైచర్మం దోక్కుపోయి కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్కు గురికావచ్చు. నఖారవిందాల కోసం గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, మకొద్దిపాటి గోరంచు ఉండేలా కట్ చేసుకోవాలి. గోరు మరీ ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలా కత్తిరించుకుంటూనే ఉండాలి. మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా నీళ్లవిరేచనాలు, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఎన్నోరకాల వ్యాధులను నివారించుకున్నట్లూ అవుతుంది. ఇదే సూచన పాదాల గోళ్లకు కూడా వర్తిస్తుంది. కొందరు గోళ్లను చిగుర్లలోపలికి కట్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో గోటి చివర ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ తర్వాత గోరు లోపలికి పెరుగుతూ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే కాలిగోర్లు కట్ చేసుకునే సమయంలో మరీ అంచుల చిగుర్లలోకి కట్ చేసుకోకూడదు. చేతులు శుభ్రం చేసుకోవడం ఇలా... మనం ఆహారం తీసుకునే ముందర క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మూత్ర, మల విసర్జన తర్వాత వీలైతే సబ్బుతోనో, హ్యాండ్వాష్తోనో తప్పక శుభ్రం చేసుకోవాలి. దీనికి కారణం ఉంది. వాష్రూమ్ తలుపు తెరవడం కోసం ప్రతివారూ తప్పనిసరిగా ‘నాబ్’ను ముట్టుకుంటారు. వారి చేతులకు ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు అంటుకొని ఉంటే... వారు ముట్టుకున్న ప్రదేశాన్నే మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు అంటుకు పోయి వ్యాధులు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే వాష్రూమ్కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక హాస్పిటల్లో పనిచేసేవారు సైతం తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం అవసరం. వీలైతే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్వాష్లు వాడటం కూడా చాలవరకు మంచిదే. పాదాల శుభ్రత... మన కాళ్లనూ, మోకాళ్లనూ, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోండి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిఅయ్యేంతవరకూ తుడుచుకోండి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా మన కాలి బొటనవేలి (పెద్దనేలు) గోరును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మన పాదరక్షలు ధరించినప్పుడు అవి కాలికి సౌకర్యంగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవారు పరిశుభ్రమైన సాక్స్ను మాత్రమే తొడుక్కోవాలి. మామూలు వారిలోకంటే పాద సంరక్షణ డయాబెటిస్ రోగుల్లో మరింత ఎక్కువ అవసరం. హైహీల్స్ కాకుండా తక్కువ హీల్ ఉన్న పాదరక్షణలే వేసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న విధంగా రోజూ దేహ పరిశుభ్రత పాటిస్తే మేనూ, మనసూ ఈ రెండూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా హాయిగానూ ఉంటామని గుర్తుంచుకోవాలి. డాక్టర్ శ్యామల అయ్యంగార్, సీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ అండ్ డయాబెటాలసిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ, హైదరాబాద్ -
టీకాలతో పాడి పశువుల ఆరోగ్య రక్షణ
పాడి పశువులను రైతు ప్రతి రోజూ గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనపడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. పాడిపశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకక ముందే నివారణ చర్యగా వ్యాధినివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులు అంతః, బాహ్య పరాన్న జీవులకు లోనయినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు: ► సూక్ష్మజీవుల (బాక్టీరియా) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసిస్. ► సూక్ష్మాతి సూక్ష్మ జీవులు (వైరస్) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గాలికుంటు, శ్వాసకోశవ్యాధి, మశూచి వ్యాధి. ► అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు– ఉదా.. కుందేటి వెర్రి (సర్రా), థైలేరియాసిస్, బెబీసియోసిస్, కార్జపు జలగవ్యాధి, మూగబంతి. ► ఇతర వ్యాధులు– ఉదా.. పాల జ్వరం, పొదుగు వాపు, చర్మవ్యాధులు, దూడల మరణాలు. ► రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి, సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు. పశువులలో సామాన్యంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు – చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. -
మంచి పరుపూ తలగడతో హాయైన నిద్ర
మన జీవితంలో దాదాపు మూడోవంతు నిద్రలోనే గడుపుతాం. హాయిగా నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు. మంచి నిద్ర వల్లనే వ్యాధి నిరోధక శక్తి పెరిగి దేహానికి అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. హాయిగా నిద్రపోవడం కోసం ఎలాంటి పరుపు, ఎలాంటి తలగడ వాడాలో తెలుసుకుందాం. మంచి పడక ఎలా ఉండాలంటే... చాలా మంది నిద్ర కోసం పరుపు వాడటం మంచిది కాదని అంటుంటారు. వీపునొప్పితో బాధపడే చాలా మంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చెబుతూ బెంచీ వంటి వాటిపైనా లేదా గచ్చు మీద పడుకుంటుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే ఆరోగ్యానికి మేలు. అయితే అది శరీరానికి ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగానూ ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు. నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చాలా మంది అపోహ పడుతుంటారు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంటిలో చాలా భాగాలు ఆ గట్టి ఉపరితలంతో నొక్కుకుపోయి ఒక్కోసారి నొప్పి వస్తుంటుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపునే ఎంచుకోవాలి. పరుపును రెండు నుంచి మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన స్థితిస్థాపకతను కోల్పోయి, గుంటలా పడిపోతుంటుంది. మనం పడుకున్నప్పుడు ఏదో గుంతలో పడుకున్న ఫీలింగ్ రాగానే పరుపు తిరగేయాలి. తలగడ వాడితేనే మంచిది... చాలామంది నిద్రపోయేటప్పుడు తలగడ వాడకపోవడమే మంచిదని అంటారు. కానీ నిజానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. మన తలకూ, భుజాలకూ మధ్య కాస్తంత ఒంపు ఉంటుంది. ఆ ఒంపు కారణంగానే పడుకునే సమయంలో తలకూ వీపుకూ సమన్వయం కుదరక ఇబ్బంది పడటం మనందరికీ అనుభవమే. ఆ ఒంపు (గ్యాప్ను) భర్తీ చేయడం కోసమే చాలామంది ఒక పక్కకు ఒరిగి భుజం మీద పడుకుంటుంటారు. ఒక రాత్రి నిద్రలో కనీసం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య గ్యాప్ అలా ఉండనే ఉంటుంది. ఆ గ్యాప్ను అలాగే ఉంచి రాత్రంతా నిద్రపోవడం ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మంచి తలగడను ఉపయోగించి ఆ గ్యాప్ను భర్తీ చేయడం అవసరం. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెస్సబిలిటీ కోల్పోతుంది. ఇలా ఎలస్టిసిటీ తగ్గిన తలగడను వాడకపోవడమే అన్నివిధాలా మంచిది. మెడ ఇరుకుపడితే... నిద్రలో తల ఇరుకుపడితే అది మళ్లీ నిద్రలోనే సరవుతుందని చాలామంది అంటుంటారు. మెడ పట్టేయడాన్ని సరిచేసేందుకు మొదటి మందూ, మంచి మందూ మంచి తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. మెడపట్టేయడంతో బాధపడే రోగులపై వారొక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా వారి పరిస్థితిని చక్కదిద్దడానికి అనేక ప్రక్రియలను అనుసరించి చూశారు. అందులో కొందరికి మసాజ్ చేశారు. మరికొందరికి చిట్కా వైద్యాలు ప్రయోగించి చూశారు. అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం వల్లనే మంచి ప్రయోజనం చేకూరిందని గ్రహించారు. అయితే తలగడనెప్పుడూ కేవలం తలకు మాత్రమే పరిమితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ దాన్ని జరిపితే ఫలితం మరీ బాగుందని ఈ అధ్యయనంతో పాటు చాలా అధ్యయనాల్లో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్ వ్యాయామాలని ఇదే ఈ అధ్యయనంలో తేలింది. మంచి తలగడ ఎలా ఉండాలంటే... ►తలగడ మృదువుగా ఉండలా. ►మన భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి. ►కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే వేరుగా ఉండేలా చూడాలి. ►స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి. -
టమాటాతో ఊజీ రోగాలు
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు టమాటాపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఊజి రోగాలు విజృంభిస్తున్నాయి. పడమటి మండలాల్లో సాగుచేసిన టమాటా పంటలు దెబ్బతింటున్నాయి. ఊజి ఈగల దెబ్బతో కాయలపై రంధ్రాలు పడుతుండడంతో ఇప్పటికే 35 శాతం పంటను రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న కాయల్ని పొలాల వద్ద పారబోస్తున్నారు. కొందరు రైతులు ఆశతో మార్కెట్కు తీసుకొస్తున్నా అక్కడ కొనేవారు లేక రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. గిట్టుబాటు ధరలున్నా ప్రస్తుతం పండించిన పంట పశుగ్రాసంగా మారుతోంది. దీంతో జిల్లాలో వారం రోజుల్లో రూ.12కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లింది. సాక్షి, గుర్రంకొండ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమాటా పంటను ఎక్కువగా ఊజి ఈగ నష్ట పరుస్తోంది. ఇప్పటికే మంచి అదనుమీదున్న పంట ఒక్కసారిగా దెబ్బతింది. ముఖ్యంగా టమాటాలపై ఈ ఈగ ఎక్కువగా కనిపిస్తోంది. కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజి ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారుతోంది. కాయల్ని తోటల్లో నుంచి కోసినా మార్కెట్కు తరలించలేకపోతున్నారు. 35 శాతం పంట నష్టం ఊజి ఈగతో ప్రస్తుతం 35 శాతం మేరకు పంటను రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు ప్రస్తుతం 100 నుంచి 120 క్రేట్లు (25కేజీలు) దిగుబడి వస్తోంది. ఊజి ప్రభావంతో దెబ్బతిన్న టమాటాలు 35 నుంచి 40 క్రేట్లు ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 45వేల క్వింటాళ్ల స్టాకు వస్తోంది. ఊజి ఈగతో 15 వేల క్వింటాళ్ల టమాటాలు దెబ్బతిన్నాయి. పలువురు రైతులు ఈ రకం టమాటాలను తోట ల వద్దనే కోత సమయాల్లో కోసి పారబోస్తున్నారు. పలువురు రైతులు మార్కెట్లకు వాటిని తీసుకొస్తున్నా వ్యాపారులు కొనుగోలు చేయ డం లేదు. దీంతో దెబ్బతిన్న టమాటాలను రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఆ టమాటాలు పశుగ్రాసంగా మారుతున్నాయి. ధరలున్నా నష్టపోతున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక క్రేట్ (25కేజీల) ధర రూ.700 నుంచి రూ.850 వరకు పలుకుతోంది. అయితే ఊజి ఈగ ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చాలా రోజుల తరువాత మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే టమాటా రైతులను దురదృష్టం ఊజి ఈగ రూపంలో మరోసారి వెంటాడింది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. -
ఆ తొమ్మిది మంది ఎక్కడ?
యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు. అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి, కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
మూగ జీవాలపై వైరల్ పంజా
సాక్షి, పాలకొండ: జిల్లాలోని పశువులు వ్యాధులతో నీరసించిపోతున్నాయి. మొదట్లో చిన్న కురుపు వస్తుంది. రెండు రోజుల్లో అది పుండుగా మారి గాయం ఏర్పడుతుంది. ఇలా శరీరమంతా పుళ్లు మాదిరిగా ఏర్పడతాయి. ఈ గాయాలపై చీము పట్టి పురుగులు చేరుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పక్కన ఉన్న పశువులకు వ్యాపిస్తోంది. దీంతో అవి ఆహారం తీసుకోవడంలేదు. కాళ్ల కింద పుళ్లు కావడంతో నడవలేక పోతున్నాయి. వారం రోజుల్లో పశువులు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. ఆవులు, ఎద్దులకు మాత్రమే ఈ వైరల్ వ్యాధి సోకుతోంది. దున్నలు, గేదెలలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. జిల్లాలో పసువుల సంఖ్య 2.23 లక్షలు కాగా ఇంతవరకూ 42 వేల ఆవులు, ఎద్దులు అనారోగ్యం పాలయ్యాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో వైరల్ వ్యాధుల ప్రభావం కనిపిస్తోంది. పాలకొండ మండలంలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, కొండాపురం, ఎన్కే రాజపురం తదితర గ్రామాల్లో 90 శాతం పశువులు ఈ వ్యాధితో బాధపడుతున్నాయి. ఈ వ్యాధికి ఏ మందులు వినియోగించాలో తెలియక రైతులు వేప ఆకులు, పసుపు కొమ్ములు ముద్ద చేసి రాస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల రక్త నమూనాలను పశు వైద్యులు సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుం టున్నారు. వ్యాధి సోకిన పశువులకు సమీపంలో ఇతర పశువులు ఉంచకుండా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. శరీరమంతా వ్యాపిస్తుంది.. ముందు శరీరంపై తామర వచ్చినట్లు కనిపిస్తుంది. రెండు రోజుల్లో గాయాలు కనబడుతున్నాయి. ఒక్కరోజులో శరీరం మొత్తం వ్యాపిస్తుంది. వాపులు ఏర్పడి పశువులు ఆహారం తీసుకోవడంలేదు. –మునికోటి రవి, రైతు, పరశురాంపురం జిల్లా అంతటా వ్యాధి లక్షణాలు.. జిల్లా అంతటా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వ్యాధిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో ఎక్కవగా పశువులు ఈ వ్యాధికి గురయ్యాయి. వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. –కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ పశువులు నడవలేక పోతున్నాయి.. వారం రోజులుగా రెండు ఎద్దులకు, ఆవుకు ఈ వ్యాధి సోకింది. కాళ్ల కింద పుళ్లు ఏర్పడి నడవలేక పోతున్నాయి. గాయాలు పెద్దవి గా ఉంటున్నాయి. ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా ఫలితం మాత్రం కలగలేదు. రూ.60 వేలు విలువ చేసే రెండు ఎద్దులు పూర్తిగా నీరసించిపోయాయి. –కాయల సత్యనారాయణ, సింగన్నవలస, రైతు వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకున్నాం వ్యాధి సోకిన పశువుల నుంచి రక్త నమూనాల సేకరించి ల్యాబ్ పంపించాం. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొండ ప్రాంతం సమీపంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి కారణమైన వైరస్ను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం వ్యాధి సోకిన పశువులకు యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు వేస్తున్నాం. –ప్రదీప్ సాహు, మండల పశువైద్యాధికారి -
స్వచ్ఛాగ్రహం
చుట్టూ ఉన్న వాళ్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంది. మూడు రోజులు బడి మానుకుంది. ఆత్మగౌరవం, ఆరోగ్యమే ముఖ్యమని వాదించింది. పట్టుబట్టి మరుగుదొడ్డి కట్టించింది. బహిర్గత బహిర్భూమి వల్ల రోగాల బారిన పడతామని, మహిళలకు ఆత్మగౌరవం ముఖ్యమని మరుగుదొడ్డి నిర్మిస్తేనే బడికి వెళ్తానని పట్టుబట్టింది. చివరకు ఆ తల్లితండ్రులు తలొగ్గి మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న భవాని బహిర్గత మలమూత్ర విసర్జన వలన జరిగే నష్టాల గురించి పాఠశాలలో ఉపాధ్యాయులు వివరించడంతో నిర్ఘాంతపోయింది. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్కుమార్ కిశోర బాలికలకు ఈ విషయమై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పుట్టినప్పటినుండి తాను, తన తల్లితండ్రులు ఆరుబయటికే ఒంటికి, రెంటికి పోతున్నామని, దీనివల్ల తమతోపాటు తమ చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో నష్టపోతున్నారని ఆందోళన చెందింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన భవాని మరుగుదొడ్ల నిర్మాణం కోసం తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకుంది. తల్లి పార్వతమ్మ, తండ్రి కృష్ణయ్యలను మరుగుదొడ్డి నిర్మించాలని కోరింది. దీనికి వారు ఆర్థికస్థితిగతులు, తమ పరిస్థితులను చెప్పి తమవల్లకాదని తేల్చి చెప్పారు. ఎలాగైనా ఒప్పించాలనే పంతంతో మూడురోజుల పాటు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. బడికి వెళ్లాలంటూ తల్లితండ్రులు ఒత్తిడి చేయడంతో తాను బడిమానుకుంటున్నానని. తనకు మరుగుదొడ్డి నిర్మిస్తేనే చదువుకుంటానని పట్టుబట్టింది.. ‘‘మరుగుదొడ్డి కట్టేందుకు పైసలు లేవమ్మా! పంట చేతికి వచ్చిన తరువాత కట్టుకుందాం లేమ్మా’’ అని తల్లితండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వమే పైసలు ఇస్తుందని, ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని భవాని వివరించింది. ఇక తప్పేటట్టు లేదని తల్లితండ్రులు నిశ్చయించుకుని మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. వారంరోజుల్లో నిర్మాణం పూర్తి కానుంది. దీంతో తన సమస్య పరిష్కారం అయిందని అంతటితో విషయాన్ని వదిలేయకుండా బహిరంగ మలమూత్ర విసర్జనలకు వెళుతున్న మహిళలకు ఇలా బయటికి వెళ్లడం తప్పని చెప్పింది. అందరితోనూ. చివాట్లు తింది. అయినా రోజు ఉదయం అదేపనిగా చెబుతోంది. పాఠశాలలో సైతం తోటివిద్యార్థులకు మరుగుదొడ్ల ప్రాముఖ్యత, ఆత్మగౌరవం, లాభనష్టాల గురించి వివరిస్తోంతది. కలెక్టర్ అభినందనలు... విద్యార్థిని భవాని పట్టుబట్టి మరుగుదొడ్డిని నిర్మించుకుంటున్న విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితం కావడంతో విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించి ఒక సైకిల్, కొత్తబట్టలు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, ఇతర వస్తువులను భవానికి బహూకరించారు. చదువుకుంటున్న విద్యార్థులు భవానిని ఆదర్శంగా తీసుకుని మరుగుదొడ్లు లేని కుటుంబాల వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాధికారి సుచీందర్రావు, డీఆర్డీఓ.గణేష్, ఎంపీడీఓ.శ్రీపాద్, ఏపీఓ.సుకన్యలు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. – మహ్మద్ రఫి, సాక్షి, ఆత్మకూర్ (వనపర్తిజిల్లా) ఆత్మగౌరవమే ముఖ్యం బహిర్గత మలమూత్రవిసర్జనల వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. దీనికితోడు మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మా ఇంటినుండే ఆత్మగౌరవమే ముఖ్యమనే విషయాన్ని చాటిచెప్పాలనుకున్నాను. బడిమానేసి మరుగుదొడ్డి నిర్మించే విధంగా అమ్మానాన్న లను ఒప్పించాను. ఊర్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నాను. జిల్లా కలెక్టర్ నాకు అభినందించి బహుమతులను అందచేయడంతో నాకు భాద్యత మరింత పెరిగింది. – భవాని, విద్యార్థిని, ఆరేపల్లి గ్రామం, ఆత్మకూర్ మండలం -
పొగాకు...ఆరోగ్యాన్ని పొడిచే టొబాకు
భూతాల గురించి కథల్లో చదువుతుంటాం. హారర్ సినిమాల్లో చూస్తుంటాం. వాటిలో భూతాలూ, దెయ్యాలూ పొగ రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఆ దెయ్యాలూ, భూతాలన్నీ కల్పితం. కానీ ఈ లోకంలో నిజంగానే పొగరూపంలో ఉండే భూతప్రేతపిశాచాలున్నాయి. అవే... సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కాలు. మరికొన్ని ఆరోగ్యాన్ని పీల్చిపిప్పిచేసే పిశాచాలు మనం తినేందుకు వీలుగా పాన్మసాలా డబ్బాల్లో దాగుంటాయి. ఇంకొన్ని పీల్చే నశ్యం డబ్బాల్లో ఉంటాయి.ఈ ఉత్పాదనలన్నింట్లోనూ వాడే ఆకే ‘పొగాకు’. ఆ కల్పిత భూతాలున్నాయో లేదో, అవి హాని చేస్తాయో లేదో తెలియదు. కానీ... ఈ పొగభూతాలు మాత్రం నిజంగానే ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆర్థికంగానూ నష్టం చేస్తాయి. నేడు (ఈ నెల 31న) ‘వరల్డ్ నో టొబాకో డే’. ఈ సందర్భంగా పొగాకు గురించీ, అది చేసే హాని గురించీ తెలుసుకుందాం. ఆ అవగాహనతో ఎన్నో రకాల ప్రమాదకరమైన జబ్బులతోపాటు అనేక రకాల క్యాన్సర్ల నుంచి విముక్తమయ్యేందుకు గాను... బోలెడన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తెస్తున్నాం.చాలా ఆకులు చాలా మేళ్లు చేస్తాయి. మామిడాకులు మంగళప్రదం. శుభకార్యాలకు తోరణాలుగా కడతాం. తాటాకులూ, కొబ్బరాకులూ అంతే. పెళ్లిళ్లకు పందిళ్లుగా వేస్తాం. అరిటాకులను వేడుకలకూ, వేదికలకూ ప్రవేశమార్గాల ఆర్చీలకు ఇరువైపులా కడతాం. అరిటాకుల్లో భోజనాలు ఆరగిస్తాం. బాదం ఆకుల్లో చిరుతిండ్లూ పెట్టుకుని తింటాం. తామరాకుల్లో ఫలహారాలు పెట్టుకుని భోంచేస్తాం. ఇక విస్తరాకులు సరేసరి.ఇంతా చేసి పొగాకు ఏమాత్రం ఆకర్షకరంగా ఉండదు. దాని వాసన వెగటు. పైగా విపరీతమైన ఘాటు. పైన కనువిందు చేసే ఎన్నో ఆకుల గురించి చెప్పుకున్నాం కదా. పైగా అన్నీ ఆరోగ్యకరమే. అయినా దేన్నీ మన ఒంట్లోకి ఆహ్వానించం. కానీ... అదేమిటో... అల్లంతదూరం నుంచి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే ఆ పొగాకును మాత్రం మనిషి కోరి కోరి ఆహ్వానిస్తాడు. నోట్లోకి తీసుకుంటాడు. ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటాడు. పేరుకు పొగాకు... కానీ ఆరోగ్యానికి ‘పగాకు’ అది. టొబాకో కాదది... మీ హెల్త్లోకి కసుక్కున దిగే... టొ‘బాకు’! ఇదీ పొగాకు విస్తృతి! మీకు తెలుసా...? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తంలో 1.1 బిలియన్ల మంది (110 కోట్ల మంది) సిగరెట్లు తాగేవాళ్లున్నారు. వీళ్లు ప్రతిరోజూ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం కోటి సిగరెట్లు అమ్ముడవుతుంటాయి. పొగరాయుళ్లు ప్రతిరోజూ 15 బిలియన్లు (1500 కోట్ల) సిగరెట్లను తగలేస్తూ, ఈ పొగధారావ్రతాన్ని అలా కొనసాగి...స్తూ ఉంటున్నారు. ఇదే ధోరణి గనక కొనసాగితే... డబ్ల్యూహెచ్ఓ లెక్కల అంచనాల ప్రకారం 2025 నాటికి ఈ పొగరాయుళ్ల సంఖ్య 1.6 బిలియన్లు (160 కోట్లకు) పెరుగుతుంది. ఇది కేవలం ఒక్క పొగతాగేవారి సంఖ్య మాత్రమే. దీనికి తోడు గుట్కా, ఖైనీ వంటి పొగాకు నమిలే అలవాట్లు ఉన్నవారూ, పొగాకుని నశ్యంలా పీల్చేవారి సంఖ్యనూ దీనికి కలుపుకుంటే... పొగాకు వినియోగించే వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువ.అందుకే ఇంతటి విస్తృతమైన పొగాకు వినియోగంతో... కేవలం ఈ దురలవాటు కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు... ప్రపంచంలో చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం స్మోకింగ్ తాలుకు దుష్ప్రభావాల వల్లనే మరణిస్తున్నారన్నది నమ్మలేని పచ్చి వాస్తవం. స్వయంకృత అపరాధంగా వాళ్లు ఎలాగూ చచ్చిపోతున్నారు సరే... పక్కవాళ్లు తాగకపోయినా, ఈ పొగరాయుళ్ల కారణంగా ఒక అంచనా ప్రకారం ఏడాదికి దాదాపు 8.9 లక్షల మంది ఎలాంటి అలవాటు లేకపోయినా మరణిస్తున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది కుటుంబసభ్యులైన మహిళలూ, చిన్నారులే. అంటే ఇదే మరోరకంగా చెప్పాలంటే... స్మోకర్లు సిగరెట్ అనే ఆయుధంతో ఏటా దాదాపు 9 లక్షల మంది అమాయకులను హత్య చేస్తున్నారు. తమ పాపమేమీ లేకపోయినా వీళ్లు అమాయకంగా మొహమాటానికి స్మోకర్లకు బలవుతున్నారు. ఇలా పొగకమ్మేసినట్టే ఈ దురలవాటూ లోకాన్ని కమ్మేసింది. పొగాకు నిండా విషాలే! సిగరెట్ పొడవు దాదాపు నాలుగు అంగుళాలు మాత్రమే కదా. కానీ దాన్లో ఉండే హానికరమైన రసాయనాల సంఖ్య మాత్రం 4,800. మళ్లీ అందులోని 50 నుంచి 69 రసాయనాలు క్యాన్సర్ను తప్పకుండా కలగజేసేవే! వీటినే నిపుణులు గ్రూప్–1 కార్సినోజెన్స్ అని వర్గీకరించారు.మనం ఒక్క కాలకూట విషం గురించి భయం భయంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ పొగాకులో ఎన్ని రకాల కాలకూట విషాలున్నాయో తెలుసా? ఆర్సినిక్, బెంజీన్, కార్బన్మోనాక్సైడ్, హైడ్రోజన్ సయనైడ్, పొలోనియమ్ 210... ఇలాంటి ఎన్నో ఎన్నో విషాలు సిగరెట్లో ఉంటాయి. నికోటిన్ అనే పదార్థమూ ఉంటుంది. ఆర్సినిక్ అనేది ప్రపంచంలోనే చాలా వేగంగా పనిచేసే శక్తిమంతమైన విషం. పైగా పైన పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా కాస్తంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనిషి తక్షణం చనిపోతాడు. ఒక అధ్యయనం ప్రకారం ఐదు సిగరెట్లలోని నికోటిన్ చాలు మనిషిని చంపేయడానికి! ఈ అధ్యయన వివరాలు ‘ఆర్కైవ్స్ ఆఫ్ టాక్సికాలజీ’లో నమోదై ఉన్నాయి కూడా.ఒకేసారి పెద్దసంఖ్యలో టోకున మనుషులను చంపేయడానికి రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ హైడ్రోజన్ సయనైడ్ను (జెనోసైడల్ ఏజెంట్గా) ఉపయోగించాడట. దాన్ని మనం స్వచ్ఛందంగా రోజూ సిగరెట్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అలాంటి విషాలను మనం రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటామని గుర్తుంచుకుంటే సిగరెట్ మానడం చాలా తేలిక. సిగరెట్లు ఎంత ప్రమాదకరమైనవో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఈ విషయమై మనం ఇంకాస్త తమాషా ఉదాహరణ చెప్పుకుందాం. ఆపిల్ కంప్యూటర్ల దగ్గర సిగరెట్లు తాగితే... ఆ సిస్టమ్లకు గ్యారంటీ ఉండదంటూ ఆ కంపెనీ వారంటీ నిబంధనల్లో పొందుపరచారు. అదీ సిగరెట్లకు ఉన్న అపకీర్తి! అలవాటయ్యేలా చేసే నికోటిన్! పొగాకులోని నికోటిన్ అనే పదార్థం ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. ఫ్రెంచ్ జాతీయుడైన జీన్ నికోట్ అనే వ్యక్తి పేరుమీద నికోటిన్ అనే మాట ఆవిర్భవించింది. ఇతడు 1560లో మొదటిసారి ఫ్రాన్స్కు పొగాకును పరిచయం చేశాడు. అతడి పేరిటే పొగాకులోని హుషారునిస్తుందని పేరున్న ఆ విష పదార్థానికి నికోటిన్ అని పేరుపెట్టారు. నిజానికి మనం సిగరెట్లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. మెదడులో కొన్ని రిసెప్టర్లు ఉంటాయి. నిజానికి మనమేమైనా సంతోషం కలిగే పనిచేసినప్పుడు అవి స్పందించి డోపమైన్ అనే రసాయనాన్ని వెలువడేలా చేస్తాయి. నికోటిన్ మన మెదడును చేరగానే ఈ రిసెప్టార్లు డోపమైన్ ద్వారా మనకు హాయిగా, రిలాక్స్డ్గా, సంతోషంగా ఉన్న భావనను కలగజేస్తాయి. దాంతో ఈ ఆనందాన్ని తరచూ పొందేందుకు ఆ పొగాకుకు అలవాటైపోతాం. మాటిమాటికీ డోపమైన్ను స్రవింపజేసేందుకు పొగాకును ఆశ్రయిస్తాం. అలా పొగాకు అలవాటైపోతుంది. ఈ నికోటిన్ వ్యసనం ఎంతో బలమైనది. నికోటిన్ బానిసత్వం...ఎంతో బలీయం నికోటిన్ మనిషిని ఎంతగా బానిసను చేసుకుంటుందో తెలుసుకునేందుకు రెండు ఉదాహరణలు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్కు క్యాన్సర్ సోకింది. ఆ క్యాన్సర్ వల్ల అతడికి దాదాపు 30కి పైగా సర్జరీలు అయ్యాయి. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు.ఇంకా చెప్పుకోవాలంటే... హిండెన్ బర్గ్ అనేది ఒక జర్మన్ పాసెంజర్ ఎయిర్షిప్. మనందరికీ టైటానిక్ షిప్కు జరిగిన ప్రమాదం గురించే తెలుసు. కానీ ఇది ఆ స్థాయికి తగ్గని దుర్ఘటన. కాకపోతే అంతమంది చనిపోలేదంతే. హిండెన్బర్గ్ అనే ఈ పాసెంజర్ ఎయిర్షిప్ చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఈ లాంగెస్ట్ క్లాస్ ఫ్లయింగ్ మెషిన్ వాడుక తర్వాత్తర్వాత అమిత ధనవంతుల ప్రయాణాలన్నీ ఇలాంటి ఎయిర్షిప్స్లోనే జరుగుతాయనేది ఆ రోజుల్లో ఒక ఊహ. అయితే 1937 మే 3న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన అది మే 6న యూఎస్ న్యూజెర్సీలోని మాంఛెస్టర్ టౌన్షిప్ దగ్గర దగ్ధమైపోయింది. చిన్న స్పార్క్ కారణంగా మొత్తం ఇంధనం అంటుకొని ప్రమాదం జరిగింది. దాంతో ఆ ఎయిర్షిప్లోని 97 మంది ప్రయాణికుల్లో 35 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని టైటానిక్ ఆఫ్ స్కైస్ అంటారు. ఆ ఎయిర్షిప్లో 70 లక్షల క్యూబిక్ అడుగుల హైడ్రోజన్ ఇంధనం ఉంది. చిన్నపాటి నిప్పు స్పార్క్ చాలు... అదంతా అంటుకుని తగలబడిపోవాడానికి. అంతటి ప్రమాదం ఉందని తెలిశాక కూడా... అంతమంది ప్రయాణం చేసే ఆ మెగాఎయిర్షిప్లోనూ ఒక స్మోకింగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు పొగతాగడాన్ని అమితంగా ఇష్టపడే ఆనాటి ప్రయాణికులు. ఆ ప్రమాదానికి ఎలక్ట్రిక్ స్పార్క్ వల్ల ఇంధనం మండిపోవడం కారణం కావచ్చని ఊహిస్తున్నా... పొగతాగే సమయంలోని నిప్పురవ్వ వల్లే జరిగిందని నిర్ధారణగా చెప్పలేకపోయినా... నిప్పు కణిక వల్ల తామంతా భస్మమైపోయేంతటి ప్రమాదం పొంచిఉన్నా కూడా ప్రయాణికులు స్మోకింగ్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారంటే... పొగతాగే అలవాటు ఎంతటి పెద్ద వ్యసనమో మనకు అర్థమవుతుంది. ఒకటా రెండా... ఎన్నెన్నో జబ్బులు దాదాపు 25% నుంచి 30% క్యాన్సర్లు కేవలం పొగాకు వల్లనే కలుగుతున్నాయి. వీటిల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువ. ఆ తర్వాత పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్లూ ఎక్కువగానే వస్తాయి. ఇక పొగాకు వినియోగం వల్ల స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్లు, మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇక ప్రోస్టేట్(పౌరుషగ్రంథి) క్యాన్సర్కూ, పొగతాగడానికీ సంబంధాలు చాలా చాలా ఎక్కువ. బెంజీన్ అనే రసాయనం అక్యూట్ మైలాయిడ్ లుకేమియా (ఒకరకం బ్లడ్క్యాన్సర్)ను కలగజేస్తుంది. వీటితో పాటు గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా ఒకటేమిటి... శరీరంలోని ప్రతి అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుందన్నది అతిశయోక్తి కాని వాస్తవం. ఇక మీకు తెలియని విషయం ఏమిటంటే... ప్రతి సిగరెట్లోనూ 20 శాతం చక్కెర ఉంటుంది. అందువల్ల సిగరెట్ తాగగానే ఒంట్లో చక్కెరపాళ్లు పెరుగుతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఇక డయాబెటిస్ ఒంట్లోని రోగనిరోధకతను దెబ్బతీస్తుందన్నది తెలిసిందే. దాంతో వరసగా క్యాన్సర మొదలు ఎన్నో వ్యాధులు, వాటివల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. పొగమానేస్తే ఎన్నో ప్రయోజనాలు... పొగతాగడం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెంటనే సమకూరడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు చివరి సిగరెట్ తాగిన 20 నిమిషాల్లో మీ గుండె వేగం తగ్గి, మళ్లీ దాని నార్మల్ వేగంతో కొట్టుకోవడం మొదలవుతుంది. 12 గంటల తర్వాత మీ కార్బన్మోనాక్సైడ్ మోతాదులు తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గడం మొదలవుతుంది. మూడు నెలల్లో మీ ఊపిరితిత్తులు నార్మల్కు రావడానికి ఉద్యుక్తమవుతాయి. ఆ తర్వాత వాటి పనితీరు క్రమంగా నార్మల్కు వస్తుంటుంది. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. 15 ఏళ్లలో మీరంతా నార్మల్ అయిపోయి నాన్స్మోకర్లో ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో అలాంటి ప్రయోజనాలూ ఒకప్పటి మాజీస్మోకర్స్కూ కలుగుతాయి. చాలామంది పొగ మానేయడానికి ఇష్టపడేవాళ్లే! వాస్తవానికి పొగతాగేవాళ్లలో 69 శాతం మంది ఇష్టం లేకుండానే పొగతాగుతుంటారట. ఎందుకంటే... వాళ్లెప్పటికప్పుడు తమ దురలవాటు సిగరెట్ మానాలని అనుకుంటూనే, తమకం ఆపుకోలేక మళ్లీ మళ్లీ సిగరెట్ ముట్టిస్తూ ఉంటారు. వీళ్లలో చాలామంది సోమవారం రోజున తమ సిగరెట్ అలవాటుకు స్వస్తిచెప్పాలనుకుంటారు. ఆదివారం సెలవు రోజున తమ మనసుతీరా సిగరెట్ తాగేసి, సోమవారం నుంచి ఆ అలవాటుకు గుడ్–బై చెప్పాలనుకుంటార్ట. కానీ వీళ్లలో చాలామంది మళ్లీ పొగభూతానికి లొంగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగతాగడం మానేశారనుకుందాం. ఇప్పుడున్న క్యాన్సర్ రోగుల సంఖ్యలో తక్షణం 30% కేసులు తగ్గుతాయి. క్రమంగా 50 శాతానికి పైగా క్యాన్సర్తో సంభవించే మరణాలూ తగ్గుతాయని ఒక అంచనా. పొగాకుఉత్పాదనల కోసం అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ఒక రంగు. ఇది ఒకరకమైన గోధుమరంగు వంటిది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు (ద అగ్లియెస్ట్ కలర్) అని అంటారు. ఈ రంగును చావును సూచించే రంగుగా చెబుతారు. జీఎఫ్కే అనే పరిశోధన సంస్థ ఈ రంగుమీద అనేకరకాల పరిశోధనలు చేశాక... ఈ అసహ్యకరమైన రంగును ‘పొగాకు ఉత్పదనలకు’ వాడితే బాగుంటుందని సూచించింది. అయితే ఇదేరంగును మరింత ఆకర్షణీయంగా చేసి సిగరెట్ పెట్టెలకు వాడుతుంటారు. యూరప్ తొలి స్మోకర్కు ఏడేళ్ల జైలు! యూరప్కు పొగాకును పరిచయం చేసిన మరొక వ్యక్తి రోడ్రిగో డి జెరెజ్. ఇతడు అమెరికాను కొనుగొన్న కొలంబస్ నావికుల బృందంలోని సభ్యుడు. శాంటామారియా నౌక మీద ప్రయాణం చేస్తూ 1492లో వీళ్లు బహమాస్లోని శాన్సాల్వడార్ ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడి గౌనహని అనే తెగకు సంబంధించిన వారు పొగతాగడాన్ని చూశాడు రోడ్రిగో డి జెరేజ్. వారి నుంచి పొగతాగడం నేర్చుకున్నాడు. యూరప్లోని స్వదేశానికి తిరిగి వచ్చాక మరికొంతమందికి కూడా అతడు స్మోకింగ్ అలవాటు చేశాడు. అప్పట్లో నోటినుంచి అలా పొగను వెలువరించడం అనేది ‘దెయ్యపు చర్య’ అనీ, దెయ్యాలు చేసే ఆ పని చేసినందుకు ‘స్పానిష్ ఇంక్విజిషన్’కు చెందిన అక్కడి మతపెద్దలు అతడికి ఏడేళ్లు కారాగార శిక్ష విధించారు. కానీ... ఏడేళ్ల తర్వాత అతడు విడుదలయ్యేనాటికి పొగతాగే అలవాటు యూరప్ అంతటా విస్తరించింది. అది అపోహ మాత్రమే... చాలామంది పొగతాగేవాళ్లు భోజనం చేశాక ఒక దమ్ము లాగితే... తిన్నది వేగంగా జీర్ణమవుతుందని అనుకుంటారు. తమ అనుభవం వల్ల ఆ అపోహనే వాస్తవంగా భ్రమిస్తుంటారు. కానీ నిజానికి సిగరెట్ జీర్ణప్రక్రియను చాలా ఆలస్యం చేస్తుంది. అరిగే ప్రక్రియ అతి నెమ్మదిగా కొనసాగేలా చూస్తుంది. ఎందుకంటే... సిగరెట్ తాగగానే తమ ఒంట్లోకి ప్రవేశించే విషాలను బయటకు తరమడానికి శరీర వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విషాలు మెదడును చేరితే అది చాలా ప్రమాదకరం కాబట్టి మన శారీరక జీవక్రియల వ్యవస్థ అంతా తమ దృష్టిని విషాలను నిర్వీర్యం చేసే పనిమీద కేంద్రీకరిస్తుంది. దాంతో ఈ ప్రాధాన్యక్రమం వల్ల జీర్ణప్రక్రియ ఆలస్యమవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు మొదలుకొని మళ్లీ ఎన్నో అనర్థాలు. అందుకే ఈసోఫేజియల్ క్యాన్సర్లు మొదలుకొని, పెద్దపేగు (కొలోన్) క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల క్యాన్సర్లకు పొగతాగే అలవాటే ఒక ప్రధాన కారణం. Dr. Ch.Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
‘చిటుక’లో ముంచుకొచ్చే ముప్పు!
గొర్రెల్లో సీజను వారీగా, వయస్సు వారీగా కొన్ని వ్యాధులు బయల్పడుతుంటాయి. వాటికి సరిపడా యాజమాన్యముగానీ, చికిత్స గానీ, టీకా గానీ ఇవ్వకపోతే జీవాలు మృత్యువాత పడుతుంటాయి. తొలకరి వర్షాల్లో గొర్రెలకు సోకే ముఖ్యమైన వ్యాధి చిటుక రోగం. సాధారణంగా చాలా వ్యాధులకు టీకా వేయించినట్లయితే, అవి సోకకుండా ఉండే అవకాశముంది. కానీ, టీకా వేయించకుండా, వ్యాధి సోకిన తర్వాత, ఏ లక్షణాలు చూపుకుండా, వైద్యానికి సమయం ఇవ్వకుండా గొర్రెలు మృతి చెందేది ఒక చిటుక వ్యాధితో మాత్రమే. మంచి ఆరోగ్యంగా ఉండే జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రిడియమ్ పెర్ఫ్రిజన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వలన సోకుతుంది. ఎక్కువగా స్టార్చ్ సంబంధిత మేతను తింటే ఈ వ్యాధి సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలిచిన లేత గడ్డిని మేసినప్పుడు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన తర్వాత ఏ లక్షణాలు చూపకుండా, చిటిక వేసే లోపే చనిపోతాయి. కాబట్టి చిటుక వ్యాధి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నెత్తిపిడుగు వ్యాధి అని కూడా అంటారు. కొన్నిచోట్ల గడ్డి రోగం అని అంటారు. జీవాలు నీరసంగా ఉండటం, చనిపోయే ముందు గాలిలోకి ఎగిరి గిలగిలా కొట్టుకుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని కారక సూక్ష్మజీవి ‘ఎప్పిలాన్’ అనే విష పదార్థాన్ని జీవం శరీరంలోకి విడుదల చేస్తుంది. దీనివలన జీవాలు చనిపోతాయి. చిటుక వ్యాధి నివారణ ఇలా.. ► ఈ నెలలో అన్ని జీవాలకు టీకా వేయించాలి. ► తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన తేగ గడ్డిని గొర్రెలు మేసినట్లయితే ఈ వాధి సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలుతుంది. అందుచేత వాడిపోయి మళ్లీ మొలచిన గడ్డిని గొర్రెలు మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మందలో ఒకటి, రెండు జీవాలకు వ్యాధి కనిపించినట్లయితే, మిగిలిన వాటికి టీకా వేయించాలి. వలస వెళ్లే జీవాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనపడుతుంది. – డా. ఎం. వి. ఎ. ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
స్వైన్ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వైన్ఫ్లూపై ఆందోళన తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది. -
మొండి రోగాల ముప్పు!
వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి. కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్బగ్’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్బగ్’ పుట్టుకొచ్చిందని నిర్ధారించారు. ఇన్ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది. మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు. మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం. -
పెద్దలకూ వ్యాక్సిన్లు
వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ధరతో అంటే చాలా చవకగా, దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. ప్రస్తుతం ఈ నెల చివరి తేదీ వరకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనే వారోత్సవాలు నిర్వహితమవుతున్నాయి. ప్రతీ ఏడాదీ ఏప్రిల్ చివరి వారం... అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఇలా జరుపుతారు. అనేక వ్యాధులను నివారించడం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలను (వీక్ను) రూపొందించారు. సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వ్యాక్సిన్ల వివరాలు, ప్రయోజనాల గురించి అవగాహన కోసం వాటి గురించి సంక్షిప్తంగా. పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్–బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి ఒకింత ఎక్కువే కాబట్టి... దీన్ని నివారించడానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని, ఆర్నెల్ల తర్వాత మరో విడత కూడా తీసుకోవాలి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ : హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇది కూడా వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది. వారిసెల్లా వ్యాక్సిన్ : వ్యారిసెల్లా జోస్టర్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణంగా ‘చికెన్పాక్స్’ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు. హెర్పిస్ జోస్టర్ వ్యాధి : హెర్పిస్ జోస్టర్ అనే వైరస్తో మొదట చికెన్పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జోస్టర్ హెర్పిస్ వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ.హెర్పిస్ జోస్టర్ వ్యాధికి మంచి నివారణ జోస్టర్ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా (అంటే 100 శాతం) వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ అయితే లేదుగానీ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు. ‘ద షింగిల్స్ ప్రివెన్షన్ స్టడీ’ అనే అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. అలాగే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా 67శాతం తగ్గుతుంది. అందుకే 50 ఏళ్లు దాటాక జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునేవారు ఇది తీసుకునే ముందర 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు వాటిని వాడకపోవడం మంచిది. నిమోకోకల్ వ్యాక్సిన్ : వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) : ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసకరైడ్ వ్యాక్సిన్’తో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఒక నిమోనియాకే నివారణగా అనుకోవడం కంటే... మెనింజైటిస్, బ్యాక్టిరిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్)లకు నివారణ ఔషధంగా పరిగణించవచ్చు. అయితే దీని వల్ల కూడా నూరు శాతం నివారితమవుతుందన్న గ్యారంటీ ఉండదు. అయితే దీనివల్ల చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గుతాయి. కాంప్లికేషన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇది మాటిమాటికీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరోసారి తీసుకోవాలి ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ : ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే తర్వాతి దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే జలుబు వైరస్కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవైౖయెదేళ్లు ఏళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టాటస్లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది. ఒక సూచన : గుడ్డు వల్ల అలర్జీ ఉన్నవారు రీకాంబినెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలి.డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. దాంతో అది బూస్టర్ డోస్లా పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది. మరికొన్ని వ్యాక్సిన్లు : ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అయితే దాన్ని కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేగాక జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు అక్కడికి వెళ్లే 15రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వయసులో వ్యాక్సిన్లు ఎందుకు? ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. కొన్ని ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లే చోట్ల కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు అక్కడ వ్యాప్తిలో ఉండే వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే లైఫ్స్టైల్ ఆధారంగా కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరం. దాదాపు 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు... ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి ఒకసారి వ్యాధి బారిన పడితే హాస్పిటల్లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తే... వ్యాక్సిన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇంటిని పోషించే యజమాని జబ్బు పడితే ఆ ప్రభావం ఇంటి మొత్తం మీద ఉంటుంది. పైగా ఉత్పాదకత కోసం వెచ్చించాల్సిన ఎన్నో విలువైన పనిదినాలను కూడా రక్షించుకొని, వాటిని సమర్థంగా పనులకోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందించడం కోసం ఉపయోగించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ యువతులు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ఫెక్షియస్డిసీజెస్,స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా?
మా ఫ్రెండ్వాళ్ల అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఈమధ్య అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా? కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ వ్యాధులు కేవలం పెద్దవారికే పరిమితం కావు. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే రకం. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. నెలలు, సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా కొనసాగుతాయి. పిల్లలకు కీళ్లవాతం ఎందుకొస్తుంది? : ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే అంశంపై నిర్దిష్టంగా ఇంకా కారణాలు పెద్దగా తెలియదు. అయితే రకరకాల పరిశోధనల తర్వాత వీటిని జన్యులోపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ స్వీయదాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు. జాగ్రత్తలు : ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి వారు మందులు సూచిస్తారు. ►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి. ►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు. ►ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు ఎప్పటికీ నార్మల్ జీవితాన్నే గడపవచ్చు. చికిత్సా విధానాలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్ని నొప్పినివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. -
కనిపించని శత్రువు!
రాజేశం అనే ఓ వ్యక్తి బయటకు చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ చాలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అతన్ని చూస్తే అరుదైన వ్యాధికి గురైనారని ఎవరూ నమ్మరు. చెప్పినా పట్టించుకోరు. డాక్టర్ల వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి. వెంకటలక్ష్మి అనే యువతి ఒకరోజు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మరుసటిరోజు అనారోగ్యానికి గురవుతారు. మళ్లీ రెండు రోజులకు సాధారణస్థితిలోకి వస్తారు. ఇదీ అరుదైనవ్యాధికి గురైన మహిళ పరిస్థితి. – సాక్షి, హైదరాబాద్ వీరిలాగే దేశంలో దాదాపు 10 కోట్ల మంది అరుదైన వ్యాధులకు గురవుతున్నారు. ప్రపంచంలోని అరుదైన వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని తేలింది. హైదరాబాద్ జనాభాలో దాదాపు ఆరున్నర లక్షలమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వ్యాధులను గుర్తించడం అత్యంత ఖరీదైన వ్యవహారం కావడంతో ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్(ఐవోఆర్డీ) అనే సంస్థ అరుదైన వ్యాధులపై సర్వే చేస్తుంది. అరుదైన రోగాలతో బాధపడుతున్న రోగులను గుర్తించడం, వారికి అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. అరుదైన వ్యాధుల్లో 70 శాతం పిల్లలకు సంబంధించినవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. 12 శాతం పెద్దలకు సంబంధించినవి ఉంటు న్నాయి. 18 శాతం పెద్దలకు, పిల్లలకు సంబంధించినవి ఉంటున్నాయి. అరుదైన వ్యాధుల్లో 72 శాతం జన్యుపరమైనవే. 28 శాతం వ్యాధులు జీవితంలో ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఎర్ర రక్తకణాల్లో డిజార్డర్ అరుదైన వ్యాధులేంటనే విషయాలను గమనిస్తే ఆందోళన కలగకమానదు. అరుదైన వ్యాధుల్లో ఒకటైన అక్వైర్డ్ అప్లాస్టిక్ ఎనీమియా. అంటే బోన్మ్యారో ఫెయిల్యూర్ అయి రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10 లక్షల్లో ఇద్దరికి వస్తుంది. ఇక సికిల్ సెల్ డిసీజ్. ఎర్రరక్త కణాల్లో డిజార్డర్ అన్నమాట. ఇది ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది. ఈ రెండూ కూడా రక్తంలో వివిధ రకాలుగా మార్పులు తీసుకొస్తాయి. నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధి ఒకటి ఉంది. ఎలాంటి నొప్పీ ఉండదు. చెమట పట్టదు. గాయాలైతే ఆలస్యంగా తగ్గుతాయి. దీన్ని కాంగీన్షియల్ ఇన్సెన్సివిటీ టూ పెయిన్ విత్ యాన్హైడ్రోసిస్ వ్యాధి అంటారు. ఇది రెండు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. లైసోసోమాల్ స్టోరేజీ డిజార్డర్ అనే వ్యాధి మెటబాలిజం డిజార్డర్కు సంబంధించింది. ఎంజైమ్ కొరత వల్ల ఇది వస్తుంది. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రతి 7,700 మందిలో ఒకరికి వస్తుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధి కంటికి సంబంధించింది. ఇది పెద్దల్లో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పీడియాట్రిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి గుండెకు సంబంధించింది. పిల్లల గుండెల్లోని మజిల్లో డిజార్డర్ వస్తుంది. ఇది లక్షలో ఒకరికి వస్తుంది. ఇక మజిల్ డైస్ట్రోపి అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. బాలురల్లో ఇది కనిపిస్తుంది. ప్రతీ 3,500 మందిలో ఒకరికి వస్తుంది. కొన్ని అరుదైన వ్యాధుల లక్షణాలను గుర్తించడం నాలుగైదు ఏళ్లు పడుతుంది. గరిష్టంగా 20 ఏళ్లు కూడా తీసుకుంటుంది. అరుదైన వ్యాధులను గుర్తించేలా చాలా డయాగ్నస్టిక్ సెంటర్లు అభివృద్ధి కాలేదు. అరుదైన వ్యాధులపై చాలామంది వైద్యులకు శిక్షణే లేకపోవడం గమనార్హం. అరుదైన వ్యాధులకు చికిత్స చేసే ప్రత్యేక మౌలిక సదుపాయాలు, పరికరాలు అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో లేవు. విచిత్రమేంటంటే దేశంలో అరుదైన వ్యాధులకు సంబంధించిన స్పష్టమైన విధానమే కేంద్రం తయారు చేయలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
సత్య ధర్మ పరిరక్షణే ధ్యేయం...
‘‘మీ ఇళ్లల్లో మీరే హోమాలు చేయండి. శక్తిమంతులుకండి. తద్వారా సమాజానికి సేవచేయండి. మంత్రదీక్ష తీసుకుని సమస్యలు పరిష్కరించుకోండి... వ్యాధులు నయం చేసుకోండి... ధర్మాన్ని కాపాడండి...’’ అంటున్నారు కుర్తాళం పీఠాధిపతి.. పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి. 83 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వామీజీ నిరాడంబరతకు మారుపేరు. ఆయన జీవితంలో వెయ్యి పున్నములను చూసిన సందర్భంగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సహస్రచంద్ర దర్శనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో.. శ్రీనాథ పీఠం ఆధ్వర్యాన గుంటూరులో ఈ ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామీజీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. కుర్తాళం పీఠం కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతోపాటు ధర్మపరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. ఇంకా సాక్షి అడిగిన పలు సందేహాలకు సవివరమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు స్వామీజీ మాటల్లోనే.... నా గురించి... పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రధాన అధ్యాపకుడిగా పనిచేశాను. వెంకట లక్ష్మీ వరప్రసాదరావు అనే నేను ప్రసాదరాయ కులపతిగా అందరికీ సుపరిచితుడిని. పరమ గురువు త్రివిక్రమ రామానంద భారతీస్వామి ప్రేరణతో అరవైఏళ్ల క్రితమే సన్యాసాన్ని స్వీకరించాలని భావించి నా తల్లిదండ్రులైన పోతరాజు పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మిలకు మనసులోని మాట చెప్పాను. వారు అంగీకరించలేదు. 2002లో భార్యాపిల్లల సమ్మతితో నా కోరిక నెరవేరింది. హిమాలయాలు, బృందావనం, కాశీ, కామాఖ్య, కుర్తాళం తదితర ప్రదేశాల్లో తపస్సు చేశాను. రాధాదేవి, కాలభైరవుడు, కాళీమాత వంటి దేవతల దర్శనభాగ్యం కలిగి అనుగ్రహం పొందాను. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాను. పీఠం కార్యకలాపాలు భారతదేశంలోని పీఠాల్లో శంకర పీఠాలకు సంబంధించింది మా పీఠం. కుర్తాళంతోపాటు తిరుమల, గుంటూరుల్లోనూ పీఠాలున్నాయి. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలలో ఉప శాఖలున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, వారి మనశ్శక్తి పెరిగేందుకు ప్రయోజన హోమాలు చేయిస్తున్నాం. కుర్తాళం పీఠానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు తమిళనాడు, అమెరికా, శ్రీలంకల్లో ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్లో 32 ఆలయాలు, తెలంగాణలో 8 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రస్టుబోర్డుల అధీనంలోనివే.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాల్లో పర్యటించి సప్తాహాలు నిర్వహించాం. హిందూ ధర్మ రక్షణ, మంత్రశాస్త్రం, పురాణాలు, వేదాంత సంబంధ విషయాలపై వేలాది ఉపన్యాసాలు ఇచ్చాను. సామూహిక యజ్ఞాలు నిర్వహించాం. 20 మంది శిష్యులకు సన్యాసదీక్ష ఇప్పించాం. విశ్వవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు కుర్తాళం పీఠాలకు వస్తుంటారు. వారందరికీ మార్గనిర్దేశం చేస్తూ రుషులు బోధించిన మార్గాల్లో నడిపిస్తున్నాం. సామాజిక సేవల విషయానికొస్తే.. నిరంతర అన్నదానం, ఉచిత ధ్యాన శిబిరాల ఏర్పాటు ప్రధానమైనవి. కవితా గోష్ఠులను ఏర్పాటుచేసి కవులను భారీగా సన్మానిస్తుంటాం. భవిష్యత్ ప్రణాళిక అమెరికాలోని అట్లాంటాలో 500 ఎకరాల స్థలం పీఠానికి ఉంది. ఇక్కడ 108 కుండాలు ఏర్పాటుచేసి యజ్ఞాలు నిర్వహించాం.. 108 మంది సువాసినీలకు పూజలు జరిపించాం. ఈ ప్రాంతంలో ఒక నది, ఆరు సరస్సులు కూడా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులవారి 108 అడుగుల లోహపువిగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఏడాదిలోగా ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తాం. నమ్మకమే గెలుపు మనం ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందనే విశ్వాసం తొలుత కలగాలి. అప్పుడే ముందడుగు వేయగలుగుతాం. పీఠానికొచ్చిన నాస్తికులు ఆస్తికులుగా మారిన సందర్భాలు అనేకం. నమ్మి వచ్చినవారికి భక్తి మరింత పెరిగి ఆధ్యాత్మికానందంలో మునిగి తేలిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. యోగులు–సూక్ష్మ శరీరులు ధ్యాన సమయంలో కొందరు సూక్ష్మ శరీరంతో వచ్చి సందేశమిచ్చేవారు. కొందరు స్నేహపూర్వకంగా పలకరించి వెళ్లేవారు. మరికొందరు మహనీయులు ఆశీర్వదించి కర్తవ్య ఉపదేశం చేసేవారు. ఇంకొందరు తమ సాధనలో ముందుకెళ్లడానికి దారి చూపాలని కోరేవారు. ఇలా అశరీరులతో సంభాషించవలసి వచ్చేది. అలా నేను గుంటూరులోని ఇంట్లో ఆత్మావాహన విద్య ద్వారా అప్పటికే దేహం వదిలిన జిల్లెళ్లమూడి అమ్మతో మాట్లాడుతుంటాను. ఆమె అనేక సిద్ధసంబంధ విషయాలను చెప్పి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. ఆ అమ్మ ఆశీస్సులు ఇప్పటికీ నాకు అడుగడుగునా అందుతూ ఉంటాయి. కోరికలను జయించడమెలా? మనిషన్న తర్వాత కోరికలుంటాయి. వాటిని హద్దుల్లో ఉంచుకోవాలి. ఆదిశంకరాచార్యులవారి వేదాంతగ్రంథాలను చదవడం ద్వారా, ధ్యానం.. తపస్సు చేయడం ద్వారా కోరికలను అదుపులో ఉంచొచ్చు.ఇటీవలి కాలంలో యువతలోనూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. ఆలయాలకు వెళ్తున్నారు. టీవీలో భక్తి కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు. ఇది శుభ పరిణామం. స్వయంసిద్ధ కాళీ పీఠం గుంటూరు రవీంద్రనగర్ కొత్త పట్టాభిపురంలో ఉంది. ఆలయంలో అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని నిర్మించి నిత్యం హోమాలు చేయిస్తున్నాను. ఇది నిత్యాగ్నికుండం. ఇక్కడ ఎవరు హోమం చేసినా వారి సంకల్పం సిద్ధిస్తుంది. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహిస్తుంటాం’అంటూ సంభాషణను ముగించిన స్వామీజీ కాళికా మాతకు హారతివ్వడానికి ఉపక్రమించారు. కుర్తాళం పీఠం విశేషాలు శ్రీ శివచిదానంద సరస్వతీస్వామి (మౌనస్వామి) 1916లో హిమాలయాలకు వెళ్లి సన్యసించారు. అనంతరం తమిళనాడు రాష్ట్రం.. తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళంలో దత్తాత్రేయ మఠాన్ని నిర్మించారు. కొంతకాలం తర్వాత శ్రీ సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించి అద్భుతమైన సిద్ధశక్తులను సాధించారు. ఆయన తదనంతర పీఠాధిపతులుగా శ్రీ విమలానంద భారతీస్వామి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వామి, శ్రీ శివచిదానంద భారతీస్వామి వ్యవహరించారు. ఐదో పీఠాధిపతిగా శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి 2002లో బాధ్యతలు స్వీకరించారు. అపురూపం ముత్యాల గురించి అందరికీ తెలుసు. నవరత్నాలలో ముత్యాలను చంద్ర గ్రహ దోష పరిహారం కోసం ఉపయోగిస్తారు. ముత్యాలను ఉంగరాల్లో ధరిస్తారు. ముత్యాల హారాలను ధరిస్తారు. జాతకచక్రంలో చంద్రుని కారణంగా ఏర్పడిన దోషాలకు పరిహారంగా ముత్యాలు ఎలా ఉపయోగపడతాయో, ముత్యపు చిప్పలు కూడా దాదాపు అలాగే ఉపయోగపడతాయి. ముత్యపు చిప్పలతో తయారు చేయించిన లాకెట్లు, బ్రాస్లెట్లు వంటి ఆభరణాలు చంద్రదోషాలను పరిహరిస్తాయి. ఏదైనా సోమవారం లేదా అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దీపావళి వంటి పర్వదినాల్లో లక్ష్మీపూజ చేసేటప్పుడు ముత్యపుచిప్పలను కూడా పూజలో ఉంచి, వాటికి ధూపదీపాలను సమర్పించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు తొలగిపోతాయి. కుటుంబంలోని కలతలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. గోమతి చక్రాల మాదిరిగానే, ముత్యపు చిప్పలను కూడా ఇళ్లలోను, వ్యాపార కేంద్రాల్లోను డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు – సంభాషణ: చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ సాక్షి, విజయవాడ -
మిత్రుడి పుట్టినరోజు
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, మిత్రుడు, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం. సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు. ఆరోగ్య ప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. మహాశక్తిమంతుడు. సకల శాస్త్రపారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహ పురాణం చెబుతోంది. నేత్ర వ్యాధులు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్య శ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధనెంతటి శ్రేష్ఠమో తెలుస్తోంది. రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది. రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ. 12, మంగళవారం రథసప్తమి – కృష్ణకార్తీక -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్డయాక్సైడ్ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
మృగరాజుకు ఎంత కష్టం!
తమ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగుతున్న అంతర్గత పోరులోనే గుజరాత్ గిర్ మృగరాజులు ఒకదాని వెనక ఒకటి మృత్యువాత పడుతున్నాయా? అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్ కారణంగానే దాదాపు 15 రోజుల సమయంలోనే 23 సింహాలు మరణించాయా? ఆధిపత్య పోరు వల్లే మరణిస్తున్నాయన్న వాదన ప్రస్తుత పరిణామాలు మాత్రం దాన్ని బలపరచట్లేదు. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా గిర్ ప్రాంతంలోని ఇతర సింహాలను అక్కడకు 100 కిలోమీటర్ల దూరంలోని పోర్బందర్ సమీపాన ఉన్న బర్ద దుంగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. బర్దాతో పాటు మధ్యప్రదేశ్లోని పాల్పుర్–కునో, మరో రెండు సంరక్షణ కేంద్రాలకు కూడా వీటిని తరలించాలని గతంలోనే కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. అడవి రాజుకు కష్టమొచ్చింది..! సింహాన్ని అడవికి రాజుగా గొప్పగా చిత్రీకరించిన తీరును మనం చిన్నపుడు కథల పుస్తకాల్లో చదువుకున్నాం. తామున్న ప్రాంతంపై పట్టు, ప్రతిష్ట కోసం సింహాల మధ్య తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. రాజ్యం (భూభాగం)పై ఆధిçపత్యం కోసం పురుష సింహాలు ఒకదాన్ని మరొకటి చంపుకుంటాయని గతంలోనే వెల్లడైంది. ఈ పోరులో భాగంగా ఆడ సింహాలు అరుదుగా గాయపడతాయి. అయితే తాజాగా గుజరాత్లో మూడు ఆడసింహాలు కూడా మరణించడంతో గతంలోని సూత్రీకరణల్లో వాస్తవమెంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటువ్యాధుల జాడలు.. గిర్ ప్రాంతంలో గతంలో అంటువ్యాధులు ప్రబలిన దాఖలాలున్నాయి. గతంలో మరణించిన ఓ సింహం నుంచి భద్రపరిచిన కణజాలాన్ని 2012లో ఐవీఆర్ఐ జరిపిన పరిశోధనలో పెస్ట్ డెస్ పిటిట్స్ వైరస్ (పీపీఆర్వీ) ఉన్నట్టు వెల్లడైంది. ఈ వైరస్ వల్ల వచ్చే జబ్బులు అంటువ్యాధిగా మారితే గిర్ సింహాల జనాభాలో 40 శాతం మేర కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ బ్రిటన్ రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన రిచర్డ్ కాక్ హెచ్చరించారు.2013లో గుజరాత్ బయో–టెక్నాలజీ మిషన్ గిర్ ప్రాంతంలోని 10 శాతం సింహాలపై నిర్వహించిన అధ్యయనంలో సీడీవీ, పీపీఆర్వీ వైరస్ రకాల దాఖలాల్లేవని స్పష్టమైంది. 1990ల మధ్యలో సీడీవీ వైరస్తో ప్రబలిన అంటువ్యాధుల వల్ల ఆఫ్రికాలోని మూడోవంతు సింహాలు తుడిచిపెట్టుకుపోయాయి. అంతుపట్టని రోగాలే కారణం.. అంతుపట్టని రోగాల కారణంగానే ఇవి మరణిస్తున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో కొన్ని సింహాల రక్తం, కణజాల నమూనాల్లో ‘వైరల్ ఇన్ఫెక్షన్’ ఆధారాలు లభించినట్లు తెలిసింది. నాలుగు శాంపిళ్లలో కెనైన్ డిస్టెంపర్ వైరస్ (సీడీవీ) ఉన్నట్లు తేలింది. జునాగఢ్లోని ఫోరెన్సిక్ సైన్స్ల్యాబ్ పరీక్షల్లోని ఆరు శాంపిళ్లలో ప్రోటోజువా ఇన్ఫెక్షన్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఈ రెండు పరిశోధనశాలలు నిమగ్నమయ్యాయి. వీటికి తోడు బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం గుజరాత్ వెళ్లి నమూనాలు పరిశీలించింది. ఎక్కువగా సింహాలు మరణించిన చోటుకు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి 31 సింహాలను గిర్ అధికారులు మరో చోటికి తరలించారు. ఆ తర్వాత అవి అరోగ్యంగానే ఉంటున్నాయి. -
ఏకాకి జీవితంతో వ్యాధుల చికాకు..
లండన్ : ఆధునిక జీవితంలో మనిషిని చిన్నాభిన్నం చేస్తున్న ఒంటరితనం మానవాళిని మింగేసే ఉపద్రవమని వైద్యులు సైతం తేల్చిచెబుతున్నారు. ఒంటరితనం ఫలితంగా శరీరం వ్యాధుల మయంగా మారుతుందనేందుకు ఇప్పటికే పలు అథ్యయనాలు ఆధారాలు గుర్తించగా ఏకాకి జీవితంతో మనిషి శరీరంలో ఏం జరుగుతుందనేది తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒంటరితనంతో బాధపడేవారికి అసలైన మందు చుట్టూ ఉన్న వారితో మమేకం కావడమేనని హార్వర్డ్ యూనివర్సిటీ సైకియాట్రిస్ట్ డాక్టర్ చార్లెస్ బుల్లక్ తేల్చిచెప్పారు. ప్రపంచ నాగరిక చరిత్రలోనే ఎన్నడూలేనంతగా సాంకేతికతను ప్రస్తుత తరం ఉపయోగిస్తున్నా ఒంటరితనం మాత్రం 1980లతో పోలిస్తే రెండింతలైందని మాజీ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో పేర్కొన్నారు. ఒంటరితనం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఒంటరితనంతో బాధపడే వారిలో ఎదుటి వ్యక్తుల ముఖంలో భావాలను చదవగలిగేందుకు వీలు కల్పించే మెదడులోని కీలక గ్రే మ్యాటర్ తగ్గుముఖం పడుతుందని డాక్టర్ బుల్లక్ తన బ్లాగ్లో పొందుపరిచారు. ఒంటరితనంతో మనిషి శరీరంలో హార్మోన్లు విశృంఖలంగా ఉరకలెత్తుతాయని గుర్తించారు. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్ధాయిని మించి విడుదలైతే శరీరం నియంత్రించుకోలేదని ఇది శరీర జీవక్రియలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు. వీలైనంత సమయం స్నేహితులతో గడపడం ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుందని డాక్టర్ బుల్లక్ చెప్పుకొచ్చారు. సమూహంలో మెలగడం ద్వారా ఉద్వేగాలను తగ్గించుకోవచ్చని, కుంగుబాటు నుంచి ఉపశమనం కలుగుతుందని, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని సూచించారు. లైబ్రరీ, పార్కు, జనావాసాల్లోకి తొంగిచూడటం వంటి వాటితో మెదడులో ఆక్సిటోసిన్ విడుదలవడం ద్వారా ఒత్తిడి హార్మోన్ స్ధాయిలను తగ్గిస్తుందన్నారు. -
జీవగడియారం గుట్టు తెలిపే రక్తపరీక్ష
లండన్ : మనం ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను ఎప్పటికప్పుడు నిర్ధేశించే జీవగడియారం ఆనుపానులు తెలిసే ఆవిష్కరణకు బీజం పడింది. శరీరం లోపలి గడియారాన్ని 90 నిమిషాల్లో కొలిచే సులువైన రక్తపరీక్షను రూపొందించామని నార్త్వెస్ర్టన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో వ్యక్తుల వారీగా వైద్య చికిత్సలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని సమస్త కణాలను నిర్ధేశించే సర్కాడియన్ రిథం ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలకు కేంద్రంగా మారింది. మనం నిద్రించే సమయంలో, ఆకలి వేసే సమయంలో, వ్యాది నిరోధక వ్యవస్ధ చురుకుగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు..ఇలా మన శరీరంలో అన్ని జీవ ప్రక్రియల్లోనూ జీవగడియారం శరీర విధులను నియంత్రిస్తుందని నార్త్వెస్ర్టన్ యూనివర్సిటీ బయోస్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్మేరీ బ్రాన్ పేర్కొన్నారు. జీవగడియారం శరీర విధులను సరిగ్గా నియంత్రించలేని సమయంలో అల్జీమర్స్, గుండెసమస్యలు, మధుమేహం వంటి వ్యాధులకు దీనితో నేరుగా సంబంధం ఉందని గుర్తించామన్నారు. ఈ అథ్యయనం కోసం తాము 73 మంది నుంచి 1100 రక్తనమూనాలను సేకరించామని, ప్రతి రెండు గంటలకు శాంపిల్స్ తీసుకుని రోజు మొత్తంలో జన్యువుల కదలికల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది పరిశీలించామని పరిశోధకులు తెలిపారు. ఈ రక్తపరీక్షలో వ్యక్తి శరీర గడియారం రోజులో సమయాన్ని కచ్చితంగా నిర్ధారించగలిగామని వెల్లడించారు. -
కేరళను కుదిపేస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. -
ప్రాణవాయువుతోనే వ్యాధులకు చికిత్స!!
బతికేందుకు మనం పీల్చుకునే ఆక్సిజన్తోనే వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు చికిత్స కల్పిస్తే ఎలా ఉంటుంది? యాంటీబయాటిక్ మందులను పూర్తిగా మాన్పించే లక్ష్యంతో సిన్సినాటీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. కాంతి ద్వారా ఉత్తేజితం చేస్తే.. ఆక్సిజన్ కాస్తా శక్తిమంతమైన ఆయుధంగా మారుతుందని, మందులకు లొంగని బ్యాక్టీరియాతోపాటు అనేక ఇతర సూక్ష్మజీవి సంబంధిత ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు పనికొస్తుందని వీరు అంటున్నారు. ఈ కొత్త ఆయుధంతో భవిష్యత్తులో కేన్సర్ కణాలకూ చెక్ పెట్టవచ్చునన్నది వీరి అంచనా. ఫొటో సెన్సిటైజర్లను వాడినప్పుడు సాధారణ ఆక్సిజన్ కాస్తా రియాక్టివ్ ఆక్సిజన్గా మారుతుందని, బ్యాక్టీరియాపై దాడి చేస్తుందని, ప్రస్తుతం ఈ పద్ధతిని తాము ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పెంగ్ ఝాంగ్ తెలిపారు. ద్రవపదార్థాల్లో ఉండే బ్యాక్టీరియానూ చంపేసేందుకు తాము కొన్ని లోహాల నానో కణాలను ఉపయోగించామని, ఇది పలు రకాల బ్యాక్టీరియాను నాశనం చేయడంలో విజయం సాధించిందని వివరించారు. ఈ ఫొటో సెన్సిటైర్లను స్ప్రే లేదా జెల్ రూపంలోకి మార్చేందుకు తాము పేటెంట్ కూడా సంపాదించామని, దీన్ని నేరుగా గాయాలపై వేసేందుకు అవకాశముందని, మానవ చర్మంపై జరిపిన పరిశోధనల్లో ఈ స్ప్రే చర్మకణాలను కాకుండా బ్యాక్టీరియాను మాత్రమే చంపేసిందని వివరించారు. భవిష్యత్తులో చర్మ కేన్సర్కూ దీన్ని వాడవచ్చునని సూచించారు. -
తొలకరి జల్లులు.. వ్యాధులు మొదలు
వానకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అయితే వానలు పూర్తిస్థాయిలో కురవడం ప్రారంభమయితే మురుగు కాలువలు పొంగిపొర్లుతాయి. చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి నీటి వనరులు కలుషితమవుతాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు అంతుచూస్తాయి. నెల్లూరు(బారకాసు): వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరితో మొదలయ్యే వ్యాధులు ఓ పట్టాన అంతు చిక్కవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో వీటిని కట్టడి చేయడం సామాన్య విషయం కాదు. వర్షాలు పూర్గిగా పడక ముందే డయేరియా బాధితులు ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దరికి చేరవని వైద్య నిపుణుల పేర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ వల్లే వ్యాధులు నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. మంచినీటి పైపులైన్లలో లీకులు ఏర్పడి తాగునీరు కలుషితవుతోంది. అనంతరం ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించి జిల్లా వైద్యారోగ్య, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 12 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులకు కారణాలివే ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియా నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా వ్యాధులు సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరోచనాలతో పాటు, రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవడం వల్ల జలుబుతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతిసార వ్యాధికి కారణాలు కలుషిత నీరు, ఆహారం.లక్షణాలురోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి రోగి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్కు గురై షాక్లోకి వెళ్లిపోతారు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకు పోవడం, నీరసించిపోవడం, చురుకుదనం తగ్గి, మాట్లాడలేక పోవడం, చివరికి మూత్రం కూడా తగ్గి ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అతిసారకు గురైన వారిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి డయేరియా వ్యాధికి కారణాలు కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరోచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స ఎక్కువ సార్లు విరేచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి షాక్లోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది. రక్త విరేచనాలు కలుషిత ఆహారం వల్ల వస్తాయి. తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం అవడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరి మలాన్ని పరీక్ష చేసి వ్యాధి కారకాన్ని గుర్తించాలి. జాగ్రత్తలు డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది. రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు, అన్నం, పప్పు తీసుకోవచ్చు. విరేచనం తర్వాత తప్పనిసరిగా సుబ్బుతో చేతులు కడుక్కోవాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. -
ప్లాస్టిక్ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త
న్యూయార్క్ : ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికే కాదు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పేనట. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల జీర్ణకోశ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన ‘టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటీ’ వారు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఇంఫ్లమేటరి బోవెల్ డిసీస్(ఐబీడీ) అనే జీర్ణకోశ సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఎక్కువని తేలింది. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం కారణంగా మనిషి జీవితకాలం తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలలోని పోషక విలువలను శరీరం గ్రహించటం కష్టంగా మారుతుందని తేల్చారు. అంతేకాకుండా మనం ఉపయోగించే ఫేస్ వాష్లలో కూడా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని నిర్థారించారు. బీపీఏ తినే ఆహార పదార్థాలలో చేరటం ద్వారా మానవ ప్రవర్తనలో మార్పులు తేవటమే కాక చిన్నపిల్లల మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. -
'జూ’పై రోగాల దాడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల మృత్యువాత సీరియల్గా సాగుతోంది. తాజాగా మరో జంతువు చనిపోయింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక దీప అనే ఆడ చిరుతపులి చనిపోయింది. దీని వయస్సు 22 ఏళ్లు. గత కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న చిరుతకు సరైన వైద్యం అందక చనిపోయింది. గడిచిన ఏడాది కాలంలో ఇక్కడి జూలో ఏనుగు, అడవిదున్న, నీటిగుర్రం, నీటి కుక్క, హైనా, సారస్ క్రేన్ పక్షి, చింపాంజి, ఎలుగు బంటి, నామాల కోతులతో సహా 70కి పైగా జంతు వులు చనిపోయాయి. వృద్ధాప్యంతోనే జంతువులు చనిపోతున్నాయని జూ అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు చుట్టుముట్టడంతోనే జంతువులు మరణిస్తున్నాయని రిటైర్డ్ ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. అన్ని జంతువులకూ ఒకటే వ్యాధి చనిపోతున్న జంతువులన్నీ, శ్వాస, జీర్ణ సంబంధ వ్యాధులతోనే చనిపోతున్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నెలల తరబడి ఎన్క్లోజర్లను శుభ్రం చేయకపోవటం, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్లే జంతువులు మరణిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
సిగిరేట్ తాగితే పళ్లు రాలిపోతాయ్..
బర్మింగ్హామ్ : సరదా సరదా సిగరెట్టు.. దొరల్ తాగు బలె సిగరెట్టు... పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి అది తొలిమెట్టు. ఇది ఓ సినిమాలో పాట.. పొగరాయుళ్లు తమకు అన్వయించుకునే మాట. ఓ పూట తిండి లేకపోయినా ఉంటారేమో గానీ పొగతాగంది ఉండలేరు. నష్టం తప్పదు నాయనా అని ఎంత నచ్చజెప్పినా నచ్చిందే చేస్తామంటారు. కొత్త సిగిరేట్లు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో అలానే రోగాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిగిరేట్ తాగటం వల్ల పళ్లు త్వరగా రాలిపోతాయని పరిశోధనల్లో తేలింది. ఇంగ్లాండుకు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్హామ్’’ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొగ తాగని వారికంటే తాగే వారిలో రెండు రెట్లు ఎక్కువగా పళ్లు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పొగతాగే వారికి ఎక్కువగా చిగుళ్ల సమస్యలు వస్తాయని, వీరిలో ఎక్కువమంది చిగుళ్ల సమస్యలతో బాధ పుడతున్నారని తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లైనా ‘రూట్ కెనాల్ ట్రీట్మెంట్’ చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికి నోటి నొప్పి, చిగుళ్ల, పంటి సమస్యలు ఎక్కువంటున్నారు. ఆల్కాహాల్, సిగిరేట్ ఈ రెండిటిని ఎక్కువగా తీసుకోవటం కారణంగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. సిగరేట్ తాగటం వల్ల నోటిలోని వ్యాధి నిరోధక వ్యవస్ధ దెబ్బ తింటుందని తెలిపారు. నోటికి సంబంధించిన అన్ని రోగాలకు పొగాకే కారణమని తేల్చి చెప్పేస్తున్నారు. చైన్ స్మోకర్లలాగా దమ్ము మీద దమ్ము కొడుతూ పోతే నోటితో పట్టుకోవడానికి చివరకు పళ్లే లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. -
అదేపనిగా టీవీ చూస్తే..
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు. జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు. -
అన్ని వ్యాధులకూ చెక్ పెట్టే టైమొచ్చిందా?
భూమ్మీద వ్యాధులన్నవి లేకుండా పోతే ఎంత బాగుంటుందో అని మనలో చాలామందికి అనిపిస్తూంటుంది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఇలాంటి అద్భుతం సాధ్యం కానుంది. అనేకరకాల వైరస్లను మట్టుబెట్టగల సామర్థ్యమున్న ప్రొటీన్లను తయారు చేసేందుకు వీరో వినూత్న పద్ధతిని ఆవిష్కరించడం దీనికి కారణం. ఇప్పటివరకూ మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్న ప్రొటీన్లనే కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి మందులుగా వాడుతూండగా.. వీరు ఒక అడుగు ముందుకేసి అమినోయాసిడ్ల నుంచి ఎక్కడా లేని లక్షల రకాల ప్రొటీన్లను తయారు చేయవచ్చునని నిరూపించారు. పైగా వీటిని రిఫ్రిజిరేటర్లలో చల్లగా ఉంచాల్సిన అవసరం కూడా లేదని.. రోగ నిరోధక వ్యవస్థ స్పందించే అవకాశాలూ తక్కువేనని అంటున్నారు. అమెరికా రక్షణ సంస్థ డార్పా కోసం నాలుగేళ్ల క్రితం తాము ఈ ప్రాజెక్టును మొదలుపెట్టామని... గతంలో తాము ప్రొటీన్ శృంఖలాలను కృత్రిమంగా తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని దీంట్లో వాడామని పెంటల్యూట్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఈ కొత్త రకం ప్రొటీన్లను ఎబోలా, నీపా వైరస్ వంటి అనూహ్యమైన వైరస్ ఇన్ఫెక్షన్లకు సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా. -
ఈ ఐదూ పాటిస్తే మరో 14 ఏళ్లు..
న్యూయార్క్ : వృద్ధాప్యంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారింది. అయితే అయిదు జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని మహిళలు 14 ఏళ్ల పాటు, పురుషులు 12 సంవత్సరాలు పొడిగించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. పొగతాగడానికి దూరంగా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన శరీర బరువు, అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం వంటి ఐదు సూచనలూ పాటిస్తే పదేళ్ల పాటు మన జీవనకాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. అమెరికా జాతీయ సర్వేల్లో 34 ఏళ్ల పాటు మహిళల గణాంకాలు, 27 ఏళ్ల పాటు పురుషుల డేటాను పరిశోధకులు విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. నిపుణులు సూచించిన ఐదు అంశాలను సరిగ్గా పాటించిన వారు ఇతరులతో పోలిస్తే ఈ వ్యవధిలో 74 శాతం మంది అకాల మృత్యువాతన పడలేదు. గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ కారణంగా మరణాల రేటు వీరిలో అతి తక్కువగా నమోదైంది. వ్యాధికి చికిత్స కంటే నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ అథ్యయనంలో కీలకంగా వెల్లడైందని అథ్యయన రచయిత, హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన ఫ్రాంక్ హు అన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని, ఆరోగ్యంపై వెచ్చించే ఖర్చులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. తమ అథ్యయనం ప్రకారం తాము సూచించిన ఐదు సూత్రాలను పాటించిన వారిలో గుండెజబ్బుల ద్వారా మరణించడం 82 శాతం మేర తగ్గిందని, క్యాన్సర్ కారణంగా మరణాలు కూడా మూడింట రెండు వంతులకు పడిపోయిందని చెప్పారు. ఆరోగ్యంగా జీవించడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అథ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. -
నెలసరి సమస్యలకు మండూకాసనం
మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి. ఉపయోగాలు: గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. -
పరి పరిశోధన
తిండి తగ్గిస్తే వయసుతోపాటు వచ్చే వ్యాధులు తగ్గుతాయి! లంఖణం పరమౌషధం అని పెద్దలు ఊరకే అనలేదు. అప్పట్లో అందరూ ఈ విషయాన్ని కొట్టిపారేసినా.. తాజా పరిశోధనలు ఇంకోసారి ఉపవాసం లేదా తక్కువ ఆహారం తీసుకోవడంతో వచ్చే ప్రయోజనాలను రూఢి చేస్తున్నాయి. విషయం ఏమింటే.. అమెరికాలోని పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేలరీలు తగ్గిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది! దాదాపు రెండేళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో ఊబకాయులు కాని వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వీరిలో కొందరికి ఆహారం ద్వారా అందే కేలరీలను 15 శాతం తక్కువ చేశారు. రెండేళ్ల తరువాత పరిశీలిస్తే.. వీరందరి బరువు సగటున తొమ్మిది కిలోల వరకూ తగ్గింది. తిండి తగ్గినా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. బదులుగా వీరందరూ ఉల్లాసంగా ఉన్నారు. కేలరీలు తగ్గినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గించడంతోపాటు జీవక్రియల వేగం కూడా మందగించినట్లు తెలిసింది. జీవక్రియల వేగం తగ్గడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. శరీరం అందుబాటులో ఉన్న శక్తిని అత్యంత సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వయసు తొందరగా మీదపడదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రైడ్మన్ తెలిపారు. కేలరీలు పెరిగినప్పుడు ... కొవ్వులు, ప్రొటీన్లు, డీఎన్ఏలకు ఆక్సిజన్ చేరడం ద్వారా ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి ఎక్కువవుతుందని, వీటివల్ల కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు, కీళ్లవాతం వంటివి వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పశువ్యర్థాలతో కాగితం.. కాగితం తయారీ కోసం చెట్లు నరికేస్తున్నారంటే అందరూ అయ్యో అనుకుంటారు. మరో గత్యంతరం లేదు కాబట్టి సరిపుచ్చుకుంటాం కూడా. వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సాకూ లేకుండా పోతోంది. ఎందుకంటే.. వీరు పశువ్యర్థాల నుంచే తెల్లటి కాగితాన్ని తయారు చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ‘‘పశువులు సెల్యులోజ్తో కూడిన గడ్డిగాదం తింటూ ఉంటాయి. ఈ ఆహారం వాటి కడుపుల్లో ఎంజైమ్లు, ఆమ్లాలతో చేరి.. వ్యర్థాలుగా విసర్జితమవుతూంటాయి. ఈ వ్యర్థాల్లో కాగితం తయారీకి ఉపయోగపడే సెల్యులోజ్ దాదాపు 40 శాతం వరకూ ఉంటుంది. దీన్ని తేలికగా వేరు చేయవచ్చు కూడా’’ అని వివరించారు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆలెగ్జాండర్ బిస్మార్క్. ఆవు పేడతోపాటు ఏనుగులు, గుర్రాల వ్యర్థాలతోనూ తాము ప్రయోగాలు చేసి.. కాగితం తయారీకి చౌకైన పద్ధతిని అభివృద్ధి చేశామని వివరించారు. సోడియం హైడ్రాక్సైడ్తో కలిపినప్పుడు వ్యర్థాల్లోంచి అవసరం లేని వాటిని తీసేయవచ్చునని మిగిలిన పదార్థాన్ని సోడియం హైపోక్లోరైట్తో బ్లీచ్ చేస్తే తెల్లదనం వస్తుందని.. దాన్ని కాగితం తయారీకి వాడుకోవచ్చునని అంటున్నారు ఈయన. ఈ పద్ధతిలో మిగిలినపోయిన పదార్థాన్ని ఎరువు, ఇంధనంగా వాడుకునే అవకాశమూ ఉందని.. అంతేకాకుండా.. బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకున్న తరువాతే కాగితం తయారీ చేపట్టేందుకూ వీలుందని వివరించారు. -
మాంసం కొంటున్నారా?
పశ్చిమగోదావరి, నిడదవోలు: మాంసం వినియోగం ఇటీవలకాలంలో బాగా పెరుగుతోంది. ఇందులో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు లభిస్తాయి. దీంతో దాదాపుగా ప్రతి ఇంట్లో మాంసం తప్పనిసరిగా వాడుతున్నారు. ఇక ఆదివారాలైతే సరేసరి. ముక్కలేనిదే ముద్ద దిగని వారు చాలామందే ఉంటారు. అయితే మాంసం ప్రియులు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ మాంసం తింటే వ్యాధుల బారినపడే అవకాశం ఉందని నిడదవోలు పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రంగు, రుచి, మెత్తదనం, వాసన, నీటిని పీల్చే గుణాన్ని బట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చును. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. గొర్రె, మేక మాంసం మధ్యస్థ ఎరుపులోను, పంది మాంసం తెలుపు రంగులో ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశుపు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పసుపు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తక్కువ. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలం వల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానిని బట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ ఉంటే కలిగే మార్పులు ♦ మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. ♦ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్య వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్ ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వల్ల మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ♦ పూడోమోనాస్, స్టెఫ్టోకోకస్, లాక్టో బాసిల్లస్ వంటి బ్యాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. ♦ మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలపు, ఆకుపచ్చని రంగుమచ్చలు ఏర్పడతాయి. ♦ మాంసంలో సల్ఫర్ పదార్థాలు ♦ విచ్ఛినమవడం వల్ల హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ♦ మాంసం పాడైనప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వల్ల పుల్లగా తయారవుతుంది. ♦ నిల్వ మాంసంలో కొవ్వు పదార్థాలు విచ్ఛినం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనిలే రేన్సీడ్ వాసన అంటారు. ♦ ప్రొటీన్లు విచ్ఛినం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతుంది. ♦ నిల్వ మాంసం ఉపరితలంపై మెరుపు కనిపిస్తుంది. దీనినే ఫాస్ఫోరిసాన్నే అంటారు. ♦ కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
నాకు తరచూ గుండెదడ... ప్రమాదమా?
కార్డియో కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి. – రఘురామయ్య, కర్నూలు సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించేలా గుండె స్పందిస్తూ ఉంటే దాన్ని గుండె దడ అని చెప్పవచ్చు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇది తాత్కాలికంగా కనిపించినా... తర్వాత దానంతట అదే సద్దుమణుగుతుంది. అయితే ఒకవేళ ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. టెస్ట్లలోని ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. గుండెదడ తగ్గించుకోడానికి సూచనలు : గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం లేదా తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. ∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. ∙కాఫీ, టీ, కూల్డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీతో గుండెదడ పెరిగే అవకాశాలు ఎక్కువ. ∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి. ∙మానసికంగా స్థిరంగా ఉండండి. ∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. ∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. మరీ గుండెదడ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధమచికిత్సగా ఐస్ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ కొంతవరకు తగ్గుతుంది. గుండెజబ్బుల నివారణకు సూచనలేమిటి? నా వయసు 35 ఏళ్లు. చాలా కొద్ది వ్యవధిలోనే మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు సన్నిహితులు గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. సత్యనారాయణ, వైజాగ్ గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించుకుంటూ ఉండాలి. గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే? నా వయసు 58 ఏళ్లు. ఇంట్లో నేనొక్కడినే ఉంటాను. ఈమధ్య ఛాతీలో ఎడమవైపు కాస్త అసౌకర్యంగా అనిపించింది. అప్పుడేమీ అనిపించలేదుగానీ... తలచుకుంటే ఇప్పుడు ఆందోళనగా ఉంది. ఒకవేళ అది నిజంగానే గుండెపోటు అయితే నాలాంటివారి పరిస్థితి ఏమిటి? నాలాంటి ఒంటరి వాళ్లు అలాంటి సమయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. – నందగోపాల్, విజయవాడ గుండెపోటు లక్షణాలైన ఎడమవైపున భుజం నొప్పిగా ఉండటం, ఎడమవైపు ఛాతీలో అసౌకర్యం, ఎడమ దవడ నొప్పిగా అనిపించడం, ఛాతీలో నొప్పి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండటం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సమయాల్లో చాలా బలంగా దగ్గాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా దగ్గుతూనే ఉండండి. ఎంత బలంగా దగ్గాలంటే ‘వయొలెంట్ కాఫ్’ అని పిలిచేంత తీవ్రంగా ఆ దగ్గు ఉండాలి. ఇలా బలంగా దగ్గడం వల్ల గుండెకు రక్త సరఫరా ఎక్కువ అవుతుంది. దాంతో గుండెకు అసలే రక్తసరఫరా నిలిచిపోయే పరిస్థితి నివారితమవుతుంది. ఇలా మీరు దాదాపు 5 నిమిషాల సమయం పాటు మీ సమస్యను వాయిదా వేయగలిగినా చాలు... అవి ప్రాణాన్ని రక్షించే బంగారు క్షణాలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేయడానికైనా... లేదా మీ మందుల డబ్బా వరకు చేరేంత వరకైనా తగినంత సమయం మీకు దొరుకుతుంది. మీలాంటి వారు మీ మందుల డబ్బాలో యాస్పిరిన్ ఉంచుకోవాలి. మీరిలా దగ్గుతూ మందుల డబ్బాను చేరి యాస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే... మీరు ఆసుపత్రికి చేరే టైమ్ దొరికే అవకాశం ఉంటుంది. అది మీ ప్రాణాలను రక్షిస్తుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
‘ఎక్సో’లెంట్ వైద్యం!
మన శరీరంలో కోట్ల సంఖ్యలో ఉండే కణాల్లో డీఎన్ఏ, జన్యువులు ఉంటాయని తెలిసిందే. మరి ఎక్సోసోమ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్కొక్కరిలో కనీసం వెయ్యి లక్షల కోట్ల వరకు ఉండే అతిసూక్ష్మమైన కొవ్వు తిత్తులివి. వీటివల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే! ఈ విషయాన్ని ఛేదిస్తే కేన్సర్ సహా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుంది. ఇదే లక్ష్యంగా ఎక్సోసోమ్లపై ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్త రఘు కల్లూరి. హైదరాబాద్లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ’కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పరిశోధనల వివరాలను పంచుకున్నారు. ప్రశ్న: ఎక్సోసోమ్ల గురించి వివరిస్తారా? రఘు: కణాలన్నీ విడుదల చేసే అతిసూక్ష్మమైన తిత్తుల్లాంటి నిర్మాణాలు ఇవి. సుమారు 30 ఏళ్ల కిందే వీటిని గుర్తించారు. తొలుత ఇవి కణవ్యర్థాలే అని భావించేవారు. గత పదేళ్లలో ఎక్సోసోమ్లకు సంబంధించి వివరాలు అర్థమవుతున్న కొద్దీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఇవి కొన్నిసార్లు ఇతర కణాల్లోకి చొచ్చుకుపోగలవని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వీటి ఆధారంగా ఎక్సోసోమ్లు వేర్వేరు కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడతాయని అంచనా. వీటిని నియంత్రించగలిగితే వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్ర: వ్యాధులకు, వీటికి సంబంధం ఏంటి? రఘు:అన్ని ఎక్సోసోమ్లు ఒకేలా ఉండవు. కణాల స్థితికి అనుగుణంగా డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు మారిపోతుంటాయి. కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి రక్తాన్ని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అందుకే ఇవి భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకు సాధనంగా వాడుకోవచ్చని భావిస్తున్నాం. ఇతర కణాల్లోకి సులువుగా చొచ్చుకుపోగలవు కాబట్టి శరీరంలోని వివిధ భాగాలకు మందులు నేరుగా చేరవేయొచ్చు. నేను పనిచేస్తున్న ఎండీ యాండర్సన్ కేన్సర్ సెంటర్ ఎక్సోసోమ్లలోకి మందులు చేర్చడంలో ఇప్పటికే విజయం సాధించింది. ప్ర: ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రఘు:రక్తం నుంచి ఎక్సోసోమ్లను వేరు చేసి.. వ్యక్తుల తాలూకూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు. డీఎన్ఏ మార్పులు, ప్రొటీన్లను విశ్లేషించే అవకాశం ఉంటుంది. దీంతో కచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది. జన్యుమార్పులన్నింటినీ గుర్తించి కేన్సర్ చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయొచ్చు. మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులను కూడా గుర్తించే అవకాశముంది. ప్ర: మీరు కోడియాక్ అనే సంస్థను స్థాపించారు. అందులో ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి? రఘు:కేన్సర్ తీరుతెన్నులు, అవయవాలకు విస్తరించే తీరు తదితరాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఎక్సోసోమ్లను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేందుకు తద్వారా సరికొత్త చికిత్స విధానాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్ర: కడుపు, పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా ఎక్సోసోమ్లను విడుదల చేస్తూంటాయా? రఘు:విడుదల చేసే అవకాశం ఉంది. మన కణాలు విడుదల చేసేవి బ్యాక్టీరియాలోకి.. అలాగే బ్యాక్టీరియా ఎక్సోసోమ్లు మన కణాల్లోకి ప్రవేశిస్తుండవచ్చు. జీవశాస్త్రంలో ఎక్సోసోమ్లు తాజా సంచలనం. ప్రస్తుత పరిశోధనలను, ఎప్పటికప్పుడు మెరుగవుతున్న టెక్నాలజీలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఐదేళ్లలో ఎక్సోసోమ్ల ద్వారా వ్యాధుల నిర్ధారణ గానీ.. చికిత్స గానీ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది. ప్ర: ఇవి సాధారణ రసాయనాలకు స్పందిస్తాయా? హోమియో వంటి వైద్యవిధానాలు సూక్ష్మస్థాయి రసాయనాలపైనే ఆధారపడి ఉంటాయి కదా? వాటి ప్రభావం ఏంటి? రఘు: హోమియో మందులు ఎక్సోపోమ్లపై ప్రభావం చూపుతాయని భావిస్తు న్నాను. ఆయుర్వేద మందులు మొక్కల నుంచి తయారవుతాయి కాబట్టి మొక్క ల ఎక్సోసోమ్లు కచ్చితంగా మన ఎక్సోసోమ్లపై ప్రభావం చూపుతాయి. – సాక్షి హైదరాబాద్ -
చలికాలం.. వ్యాధుల గాలం
రాయవరం (మండపేట): కోళ్లకు చలికాలంలో ఎక్కువగా వ్యాధులు సోకుతాయి. జిల్లాలో సుమారుగా రూ.కోటికి పైగా లేయర్ కోళ్లు ఉన్నాయి. కోళ్లకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు సంభవిస్తాయని రాయవరం ఏరియా పశువైద్యశాల ఏడీ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు అంటున్నారు. కొక్కెర తెగులు (రానికెట్ రోగం).. ఈ వ్యాధి వల్ల కోళ్లు చనిపోతాయి. ఏ వయసు కోళ్లకైనా ఈ వ్యాధి రావచ్చు. రోగానికి గురైన కోళ్లు ముడుచుకుని ఉండి రెక్కలు వేలాడదీసుకుంటాయి. పక్షవాతపు లక్షణాలు కన్పిస్తాయి. మెడ వెనక్కి వాలుతుంది. విరేచనాలు తెలుపు, ఆకుపచ్చ రంగులో అవుతుంటాయి. శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. నివారణకు మొదటి, నాలుగో వారం, ఆ తర్వాత 6–8 వారాల మధ్య మరొకసారి, చివరగా 20వ వారం టీకాలు వేయాలి. మశూచి ఈ వ్యాధి వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గి కోళ్లు చనిపోతాయి. జుట్టు మీద, తమ్మెలకు కనురెప్పల చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. అప్పుడప్పుడూ కళ్లలో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్లు కనబడవు. నివారణకు ఇవి 6–7 వారాల వయసులోను, మళ్లీ 16–17 వారాల మధ్య టీకాలు వేయాలి. కొరైజా... కోడిపిల్లలు సరిగా నీటిని తాగక, మేతను తినక బరువును కోల్పోతాయి. ఫారం కోళ్ల షెడ్డులోకి ఈ వ్యాధి వచ్చినప్పుడు కొద్దిరోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లోలాంప్తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్, పినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కలిపి గోడలకు పూయాలి. హూస్టసైక్లిన్ లేదా ఇతర యాంటి బయాటిక్ మందులు విటమిన్తో కలిపి వారం రోజులు వాడాలి. పుల్లోరం.. ఈ వ్యాధి తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడడం, భారంగా శ్వాస తీసుకోవడం, మెడ వాల్చడం గమనించవచ్చు. తెల్లని పెంట మలద్వారం వద్ద అంటుకుని ఉంటుంది. యాంటి బయాటిక్ మందులు వాడాలి. ఎస్సరీషియా కొలై.. ఈ వ్యాధి బ్రాయిలర్ కోళ్లలో వస్తుంది. యాంటి బయాటిక్స్ మందులు మేతలో, నీటితో పాటు సేనిటైజర్ మందును కోళ్లకు ఇవ్వడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. కాక్సీడియోసిస్ ప్రోటోజోవా వల్ల సోకే ఈ వ్యాధితో తరచు కోళ్ల పరిశ్రమ నష్టానికి గురవుతుంది. బ్రాయిలర్ కోళ్లు అధిక సంఖ్యలో మరణిస్తాయి. మేతలో, నీటిలో కాక్సిడియోస్టాట్ మందులు వాడితే రోగాన్ని నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కోళ్లకు వేసే టీకా మందులు ఐస్ లేదా ఫ్రిజ్లో ఉంచాలి. ఇతర రోగాలున్నప్పుడు టీకాలు వేయరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే టీకాలు వేయాలి. టీకా మందు సీసా నుంచి తీసి కలిపిన తర్వాత రెండు గంటల లోపే వాడాలి. -
కేన్సర్ కణాలను చంపేసే స్విచ్!
కేన్సర్పై పోరులో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు. కేన్సర్ కణాలు తమంతట తామే చనిపోయేలా చేయగల జన్యుస్థాయి వ్యవస్థను శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ లాంటి వ్యాధులు వస్తే మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుందని మనకు తెలుసు. అయితే కేన్సర్ కణాలను గుర్తించడం ఆలస్యమైతే.. లేదా ఈ కణాలు రోగ నిరోధక వ్యవస్థ దృష్టిని తప్పించుకునేలా రూపాంతరం చెందితే సమస్య జటిలమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ లేనప్పుడు జీవజాతులు కేన్సర్ను ఎలా ఎదుర్కొనేవి అన్న ఆసక్తికరమైన ప్రశ్నతో నార్త్వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. జీవజాతులు ఇప్పటివరకూ మనగలిగాయంటే వీటిల్లో ఏదో ఒక వ్యవస్థ కేన్సర్ను దూరంగా పెట్టిందని.. పరిణామ క్రమంలో ఇది పనిచేయకుండా పోయి ఉంటుందన్న వీరి అంచనా నిజమని తెలిసింది. మానవ జన్యుక్రమంలో అక్కడక్కడా ఉండే కొన్ని చిన్న భాగాలను కణాల్లోకి జొప్పిస్తే అవి ఆయా జన్యువుల పనితీరును ప్రభావితం చేస్తాయని గుర్తించినట్లు తెలిపారు. కేన్సర్ కణాలు మనగలిగేందుకు కీలకమైన మూడు జన్యువులు లక్ష్యంగా డీఎన్ఏ భాగంతో ప్రయోగాలు చేశామని మార్కస్ పీటర్ తెలిపారు. సుమారు 50 కోట్ల ఏళ్ల కింద ఇలాంటి వ్యవస్థ ఒకటి పనిచేయడం వల్ల కేన్సర్ నుంచి జీవులు తప్పించుకున్నట్లు అంచనా వేశారు. గర్భాశయ కేన్సర్ కలిగిన ఎలుకలపై తాము ఈ వ్యవస్థను ఉపయోగించి చూశామని, దుష్ప్రభావాలు అనేవి లేకుండా కణితి పెరుగుదల గణనీయంగా తగ్గిందని వివరించారు. దాదాపు అన్ని రకాల కేన్సర్లకు మెరుగైన చికిత్స కల్పించగల ఈ సరికొత్త వ్యవస్థను మరింత సమర్థంగా మార్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జన్యువులను ఆన్.. ఆఫ్ చేయొచ్చు!
-
జన్యువులను ఆన్.. ఆఫ్ చేయొచ్చు!
జన్యులోపాలతో కొన్ని వ్యాధులొస్తాయి.. కొన్ని జన్యువులు సరిగా పనిచేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు! ఇవి మనకు తెలిసిన విషయాలే గానీ.. జన్యువులను కచ్చితంగా మనకు కావాల్సినట్లు ఆన్.. ఆఫ్ చేయగల పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఇప్పటికీ వ్యాధులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పరిస్థితి మారనుంది అంటున్నారు నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జూలియస్ లక్స్. తన బృందంతో కలసి ఇటీవలే జన్యువులను ప్రకృతి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కచ్చితంగా ఆన్.. ఆఫ్ చేయగల ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం పేరు స్మాల్ ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేటింగ్ ఆర్ఎన్ఏ (స్టార్). మన కణాల్లోని డీఎన్ఏ మాదిరిగా ప్రతి కణంలోనూ రైబోన్యూక్లియిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) ఉంటుంది. దాదాపు 60 రకాల ఆర్ఎన్ఏలు వేర్వేరు పనులు చేస్తుంటాయని అంచనా. మెసెంజర్ ఆర్ఎన్ఏ డీఎన్ఏలోని సమాచారాన్ని మోసుకెళ్తే.. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏకు మరో ప్రత్యేకమైన పని ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ పోగుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి జన్యువులను ఆన్.. ఆఫ్ చేసేలా చేయగలిగారు. జన్యువుల పనితీరులో సహజ సిద్ధంగా మార్పులు వచ్చేందుకు అవకాశమున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. జూలియస్ అభివృద్ధి చేసిన ఆర్ఎన్ఏ మాత్రం అలా కాదు. సహజసిద్ధ మార్పుల కంటే దాదాపు 8000 రెట్లు ఎక్కువ సమర్థమైంది. వ్యాధుల గురించి తెలుసుకునేందుకు, మెరుగైన చికిత్సలు అందించేందుకు ఈ స్టార్ ఆర్ఎన్ఏ ఎంతో ఉపయోగపడుతుందని జూలియస్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఏజెన్సీ విద్యార్థులపై రోగాల పంజా...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఏజెన్సీలో ఏ రోగమొచ్చినా రక్తహీనతే కారణమంటున్నారు. పౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం, రక్షిత మంచినీరు తాగకపోవడంతో ఈ సమస్య వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న గిరిజనులకు సక్రమంగా ఆహారం, నీరు అందలేదంటే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ వసతి గృహాల్లో సహితం పౌష్టికాహార సమస్య వస్తోందంటే ఇది ఎవరి వైఫల్యమో అధికారులు, పాలకులే చెప్పాలి. లోపమెక్కడో, వైఫల్యమెవరిదో ఆత్మ పరిశీలన చేసుకోవల్సిన అవసరం అధికారులపై... పాలకులపై ఉంది. విద్యార్థులకు సోకుతున్న కాళ్లవాపులు ఇటీవల చింతూరు గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కాళ్లవాపు వ్యాధి సోకింది. వీరికి చేసిన రక్త పరీక్షల ఫలితాల్లో విటమిన్ బి1 లోపం ఉన్నట్టుగా తేలింది. ఈ లోపం కారణంగానే కాళ్లవాపు వ్యాధి వచ్చిందని రంగరాయ వైద్య కళాశాల వైద్య బృందం నిర్ధారణకొచ్చింది. అన్నం వార్చకుండా తినడంతోపాటు ముడి బియ్యం తినడం వల్ల విటమిన్ బి లోపం వస్తుందని చెప్పారు. అలా చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు కూడా తాగునీటిలో అధిక ఐరన్ శాతం ఉండటమే కాళ్ల వాపు వ్యాధికి కారణమై ఉండొచ్చని అంచనా వేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణమని చెబుతుండడంతో బాధితుల్లో అయోమయం నెలకుంది. విద్యార్థులకేదీ పౌష్టికాహారం... గిరిజన గ్రామాల్లో ఉంటున్న వారికి ఈ సమస్యలు వచ్చాయంటే పౌష్టికాహారం లోపం అనుకోవచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణలో పౌష్టికాహార సరఫరాతో నడిచే ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ రకమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయంటే సంబంధితాధికారుల వద్ద సమాధానం లేదు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కాళ్లవాపు వచ్చిందంటే సరైన పౌష్టికాహారం అందడం లేదన్నది సుస్పష్టం. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలు, పరీక్షలు కూడా అంతంతమాత్రమేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. వసతి గృహాల్లో జరుగుతున్నదేంటి? మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రతి విద్యార్థికి నెలకు రూ.750, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.850 బడ్జెట్ కేటాయిస్తున్నారు. సుమారు ఏటా రూ.6 కోట్ల 82 లక్షల వరకు డైట్ కోసమే ఖర్చుపెడుతున్నా పౌష్టికాహారం ఎటుపోతోందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం టిఫిన్– కిచిడీ, ఉప్మా, పులిహోర (రోజుకు ఒక రకం), రాగిమాల్ట్ పెట్టాలి. మధ్యాహ్నం భోజనం పప్పుతో ఆకుకూర, కోడిగుడ్డు, అరటిపండు, సాంబారు ఇవ్వాలి. సాయంత్రం స్నాక్స్, అలసందలు, శనగలు, వేరుశెనగ అచ్చులు, పాలు, బెల్లం అందజేయాలి. సాయంత్రం అన్నంతో కూరగాయల కూర, రసం పెట్టాలి. ఇలా పద్ధతి ప్రకారం మెనూ అమలైతే రక్త హీనత ఎందుకు బయటపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తాగునీటికి అదే పరిస్థితి... ఏజెన్సీలోని రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం అప్పర్పార్టు, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, వీఆర్ పురం, కూనవరం తదితర మండల్లాలోని చాలా గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 300 గ్రామాలకు రక్షిత మంచినీరు అందడం లేదు. ఈ గ్రామాలకు వేసిన బోర్లు పనిచేయకపోవడం, మంచినీటి పథకాలు లేకపోవడంతో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామాల్లోనే ఉంటున్న ఆశ్రమ పాఠశాలలకు అదే దుస్థితి ఎదురవుతోంది. -
సమస్యల నిలయంగా పాడేరు ఆస్పత్రి
-
ఆ హామీ ... ఆచరణలో లేదేమీ...?
- ‘తూర్పు’ ఏజెన్సీలో వరుస మరణాలు - ప్రతి ఏడాది పునరావృతమవుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం - ప్రతిపాదనలు దాటని సీఎం చంద్రబాబు హామీలు - విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణం - ప్రసవం కోసం తెలంగాణ వెళ్లాల్సిందే సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఏటా మలేరియా, టైఫాయిడ్, అంతుచిక్కని వ్యాధులతో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఇక్కడ కరువయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడంలేదు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీన సీఎం చంద్రబాబు విలీన మండలాల పర్యటనకు వచ్చారు. చింతూరులో నిర్వహించిన బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. అయితే ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా పనులు గడప దాటనివిధంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనమైన వీఆర్ పురం, ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పత్రిగా మారుస్తామని, స్పెషలిస్ట్ వైద్యులను నియమించి పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందిస్తామని ప్రజల సాక్షిగా అప్పట్లో సీఎం ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఆ హామీలేవీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఏరియా ఆస్పత్రి కోసం ప్రకటించినా, ఆ భవనం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్ను పక్కనే ఉన్న స్కూలు భవనంలో ఏర్పాటు చేశారు. కానీ అది బోర్డులకే పరిమితమైంది. అక్కడ ఎలాంటి పరికాలు, సౌకర్యాలు లేవు. సీఎం హామీ ఇచ్చి 14 నెలలవుతున్నా భవనం పూర్తి కాలేదు. ఇక వైద్య పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేయాల్సిన ఉత్తర్వులను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. మరణాలకు అడ్డుకట్ట ఎప్పుడు? గత ఏడాది విలీన మండలాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది మరణించారు. మాతాశిశు మరణాలతోపాటు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలతో తరచూ చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఏటా వర్షాకాలంలో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. గత ఏడాది జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుంది. ఫలితంగానే వై.రామవరం మండలం చాపరాయిలో 16 మంది మలేరియాతో మరణించారు. తాజాగా చింతూరులో మడివి దేవుడమ్మ (3) అనే గర్భిణి, వీఆర్ పురం మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారి జశ్వంత్ మలేరియాతో సోమవారం మరణించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి వైద్యులు ఆసక్తి చూపడంలేదంటూ ప్రభుత్వం సాకులు చెపుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో రూ.1.30 లక్షలు ఇస్తామన్నా ఎవ్వరూ రావడం లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తే ఎందుకు రారన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. ముందుగా గుర్తిస్తేనే సమస్యలకు పరిష్కారం... బాహ్య ప్రపంచానికి దూరంగా ఎలాంటి రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలినప్పుడు వైద్యాధికారులు తక్షణమే గుర్తించి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కుతాయి. గర్భిణులకు ప్రారంభం నుంచి మంచి పౌష్టికాహారం అందిస్తూ తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మాతాశిశు మరణాలను అరికట్టవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో అవేమీ జరగడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్సెంటర్ల పరిధిలో 486 పోస్టులున్నాయి. వీటిలో 139 పోస్టులను భర్తీ చేయలేదు. ఇక విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చింతూరు పీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా వైద్య పోస్టులను భర్తీ చేయలేదు. ఏరియా ఆస్పత్రిలో నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్నర్సులను నియమించలేదు. వరరామచంద్రపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూనవరం సీహెచ్సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా గిరిజనులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. దీంతో రంపచోడవరం పరిసర ప్రాంతాల గిరిజనులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి, విలీన మండలాల గిరిజనులు భద్రాచలం ఆస్పత్రికి వెళుతున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చింతూరులో ఏరియా ఆస్పత్రి నిర్మాణం పూర్తయి, వైద్యాధికారులను నియమించి ఉంటే భద్రాచలం ఆస్పత్రిలో నిండు గర్భిణి మడివి దేవుడమ్మ మలేరియా వల్ల సోమవారం మరణించి ఉండేది కాదు. సిజేరియన్ చేయాలని వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే ప్రారంభంలోనే గుర్తించి ఉంటే వైద్యం అందించి ఉంటే దేవుడమ్మతోపాటు, నెలలు నిండిన గర్భస్థ శిశువు కూడా ప్రాణాలతో ఉండేవారు. సీఎం హామీల మేరకు ప్రతిపాదనలు పంపాం... ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చింతూరులో రెగ్యులర్ పోస్టు ఒక్కటే ఉంది. ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య పోస్టులు, సిబ్బంది, యంత్రాల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి జీఓ రావాల్సి ఉంది. - డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ అధికారి -
ముప్పు ముంచుకొస్తున్నా.. మొద్దు నిద్రే!
కలెక్టర్లతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమైనా అప్రమత్తం కాని వైద్యాధికారులు రాష్ట్రంలో వ్యాధుల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. దోమల స్వైరవిహారానికి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా వర్షకాలంలో మురుగు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు అలసత్వం మాత్రం వీడడంలేదు. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అమాత్యుడు ఆదేశించినా.. పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు సైతం వెక్కిరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ డెంగీ హైరిస్క్ జిల్లాలు పాత ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి,నిజామాబాద్, మహబూబ్నగర్ డెంగీ హైరిస్క్లో ఉండే ప్రజలు 54,23,000 మలేరియా హైరిస్క్ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ మలేరియా హైరిస్క్ గ్రామాలు 2,067 మలేరియా హైరిస్క్లో ఉండే ప్రజలు 9,57,000 ఈ సీజన్లో వచ్చే ముఖ్య వ్యాధులు... తాగునీటి కాలుష్యంతో.. డయేరియా, టైఫాయిడ్ దోమల కారణంగా.. మలేరియా, డెంగీ, చికున్గున్యా చిన్నారులకు.. న్యూమోనియా ఏజెన్సీ ప్రాంతాల్లో.. విషజ్వరాలు ఏంచేయాలి.. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు జిల్లాకో రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయాలి. ఒకేచోట పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సంభవిస్తే జిల్లా టీంలు రంగంలోకి దిగుతాయి. అవసరమైతే రాష్ట్రస్థాయి టీం కూడా రంగంలోకి దిగాలి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 61 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. ఏం చేస్తున్నారు... మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించినా.. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. రెస్పాన్స్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 61 రకాల మందులకుగాను కొన్నింటినే అందుబాటులో ఉంచారు. -
ఆయన రోగాలు నాకు వస్తే?
సందేహం నాకు ఈమధ్యే పెళ్లయింది. పెద్దలు చూసిన సంబంధం. అయితే నాకు కొత్తగా ఒక విషయం తెలిసింది. పెళ్లి కాకముందు నా భర్త చెడు తిరుగుళ్లు తిరిగేవాడట. ఈ విషయాన్ని ఒకరిద్దరు కాదు... చాలామంది చెప్పారు. ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఆయన ద్వారా నాకు ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆయన ద్వారా ఏదైనా సోకింది లేనిది నిర్ధారణ చేసుకోవడం ఎలా? – కె.వి, ఖమ్మం గిట్టనివాళ్లు ఎన్నో కల్పించి చెపుతూ ఉంటారు. వాటిని నమ్మి భయపడే కంటే నిర్ధారణ చేసుకోవటం మంచిది. చెడు తిరుగుళ్ల వల్ల, లైంగిక జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాని, గ్యారంటీగా రావాలని లేదు. కొన్ని వచ్చినా, చికిత్సతో తర్వాత తగ్గిపోతాయి. జీవితాంతం ఆ జబ్బులు శరీరంలోనే ఉండిపోయి, భార్యకు సంక్రమించాలని ఏమీ లేదు. హెచ్ఐవీ, హెపటైటిస్, సిఫిలిస్ వంటి కొన్ని లైంగికంగా సంక్రమించిన వ్యాధులు మాత్రమే ఎక్కువ కాలం శరీరంలో ఉండి, భార్యకు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. నీకు అంతగా సందేహంగా ఉంటే, నువ్వు ఒకసారి డాక్టర్ని సంప్రదించి, సీబీపీ, హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ, వీడీఆర్ఎల్ వంటి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. మనసులో సందేహం ఉంటే, రోజూ నరకంలా అనిపిస్తుంది. దానివల్ల జీవితంలో ప్రశాంతతను కోల్పోవలసి ఉంటుంది. లేకపోతే ఒకసారి మీ వారితో, మామూలుగా ఇద్దరి ఆరోగ్యం ఎలా ఉందో రక్త పరీక్షలు (జనరల్ చెకప్) చేసుకుందాం అని అనుమానం రాకుండా చెప్పి పరీక్షలు చెయ్యించుకుని నీ అనుమానం తీర్చుకోవచ్చు. నాకు ఈమధ్య విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా తరచుగా మూత్రం వస్తుంది. కొన్నిసార్లయితే ఆపుకోలేకపోతున్నాను. ఫంక్షన్స్కు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. – సి.జి, కర్నూల్ మీరు మీ వయస్సు రాయలేదు. వివాహం అయ్యిందా? పిల్లలు ఉన్నారా? సాధారణ కాన్పులా, ఆపరేషన్ ద్వారానా... అని అనేక విషయాల మీద, మీ సమస్యకు గల కారణం, చికిత్స ఆధారపడి ఉంటుంది. ఈ సమస్య ఎప్పటినుంచి ఉంది. రోజులా, నెలలా అనేది కూడా తెలియడం ముఖ్యం. మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అవసరమైతే యూరిన్ కల్చర్ చెయ్యించుకుని, దానికి తగ్గ యాంటీ బయాటిక్స్ వారం నుంచి పది రోజుల కోర్సు వాడి చూడవచ్చు. మందులతో పాటు రోజూ మంచినీరు మూడు నుంచి నాలుగు లీటర్లు తాగవలసి ఉంటుంది. కొంతమందిలో యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్, వాపు కంతులు, దాని నరాలు, కండరాలు బలహీనపడి, పటుత్వం తగ్గడం వంటి కారణాల వల్ల, యూరినరీ బ్లాడర్తో కొద్దిగా మూత్రం నిండగానే, బ్లాడర్ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోలేకపోవటం, ఎక్కువ సార్లు వెళ్లాలనిపించడం జరుగుతుంది. కొంతమంది ఆడవారిలో సాధారణ కాన్పుల వల్ల కొన్నిసార్లు కండరాలు బలహీనపడి సమస్య రావచ్చు. కొందరిలో మెనోపాజ్ దగ్గరకు వచ్చేకొద్దీ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల బ్లాడర్ కండరాలు బలహీనపడి సమస్య రావచ్చు. నేను అప్పుడప్పుడూ బ్యూటీ పార్లర్కు వెళుతుంటాను. మొన్న ఒకసారి వెళ్లినప్పుడు... అవాంఛిత రోమాల గురించి లేజర్ చికిత్స చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో లేజర్ చికిత్స చేయించుకోవడం మంచిది కాదని ఒకరిద్దరు చెప్పారు. ఇది నిజమేనా? అలాగే నేను రకరకాల క్రీమ్లు వాడుతుంటాను. ఈ సమయంలో క్రీమ్లను వాడకూడదు అని కూడా అంటున్నారు. ఈ విషయంలో మీ సలహా కోరుతున్నాను. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్లు సౌందర్య సాధనాలు వాడే విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అనేది చెప్పగలరు. – రుక్మిణి, విజయవాడ లేజర్ అనేది కాంతి కిరణాల ద్వారా పనిచేస్తుంది. అవాంఛిత రోమాల కోసం, ప్రెగ్నెన్సీ సమయంలో లేజర్ చికిత్స తీసుకోకపోవడమే మంచిది. దీనివల్ల గర్భంలో పిండానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. రిస్క్ తీసుకుని లేజర్ చికిత్స తీసుకునే అంత ఎమర్జెన్సీ ఏమీ లేదు. కాబట్టి, ఈ చికిత్స డెలివరీ తర్వాతకి వాయిదా వెయ్యటం మంచిది. అందులోనూ ఇది ఒక సిట్టింగ్లో అయ్యేది కాదు కాబట్టి ప్రెగ్నెన్సీలో తీసుకోకపోవటమే మంచిది. ప్రెగ్నెన్సీలో హార్మోన్ల ప్రభావం వల్ల కొద్దిగా అవాంఛిత రోమాలు కొందరిలో పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ఇబ్బందిగా ఉంటే, ఎప్పుడైనా ఒక్కటి రెండుసార్లు వ్యాక్సింగ్, హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ (ఎక్కువ సేపు పెట్టకుండా) వాడుకోవచ్చు. ఇక కాస్మొటిక్ క్రీమ్స్ విషయానికి వస్తే, అన్నీ క్రీమ్స్ వల్ల సమస్య రావాలని ఏమీ లేదు. వీలైనంత వరకు, తక్కువ రసాయనాలు, తక్కువ సాంద్రత, శక్తి ఉన్నవాటిని వాడటం మంచిది. వాటి మీద ఎఫ్డీఏ కేటగిరీ చూసి వాడటం మంచిది. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
విద్యార్థులకు జరగని ‘వైద్యపరీక్షలు’
► విద్యాసంవత్సరం ప్రారంభమై 4నెలలు అయినా ప్రారంభంకాని ఆర్బీఎస్కే ► వ్యాధుల బారిన పడుతున్న విద్యార్థులు విజయనగరంఫోర్ట్: విద్యార్థుల ఆరోగ్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతునన్న ప్రభుత్వం ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడం లేదు. రాష్ట్రీయ బాల ఆరోగ్యకార్యక్రమమే ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. వ్యాధుల బారిన పడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటినప్పటికీ ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయయాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం 2011లో జవహర్ బాల ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు దాన్ని రాష్ట్రీయ బాల ఆరోగ్య ఆరోగ్యకార్యక్రమంగా పేరు మార్చారు. 2,58,506 మంది విద్యార్థులకు జరగని పరీక్షలు జిల్లాలో2935 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. వాటిలో 2,58,506 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వైద్య పరిక్షలు చేయాల్సి ఉంది. మధ్యలోనే ఆగిపోరుున మొబైల్ టీమ్ల పక్రియ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు మొబైల్ మెడికల్ టీమ్ల ఏర్పాటుకు 5 నెలల క్రితం నోటీఫికేషన్ ఇచ్చారు. వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించి సిబ్బందిని కూడ ఎంపిక చేశారు. అరుుతే వారికి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వలేదు.జిల్లాలో 22 టీమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ప్రతి టీమ్లోను ఒక వైద్యాధికారి, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్టెక్నిషయన్, ఒక స్టాఫ్ నర్సు ఉంటారు. విజృంభిస్తున్న వ్యాధులు జిల్లాలో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు ఎక్కువగా వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, మలేరియా , డెంగీ , హ్రస్వదృస్టి, దంత సమస్యలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. -
చాలా పవర్ఫుల్.. చేసే పని చాలా సింపుల్!
స్వచ్ఛంగా... స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంటే.. ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇలాంటి మంచి నీరు ఎలా లభ్యమవుతుందన్నదే ప్రశ్న. అనేకమంది ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరుతోంది ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రం. చూసేందుకు చిన్నగా కనిపిస్తుంది కానీ... ఇది చాలా పవర్ఫుల్. చేసే పని చాలా సింపుల్! ఉప్పు, నీళ్లు కలిపి, బాగా కలియదిప్పి కొంచెం కరెంట్ ప్రసరింప చేస్తే చాలు. ఆ నీరు కాస్తా క్లోరిన్గా మారిపోతుంది. తాగునీటిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లను చంపేస్తుంది. అమెరికాకు చెందిన మౌంటెయిన్ సేఫ్టీ రీసెర్చ్ (ఎంఎస్ఆర్) అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యంత్రం ఒకసారికి దాదాపు రెండు వందల మందికి సరిపడా మంచినీటిని శుద్ధి చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి దాదాపు 2,500 ఏర్పాటు చేయాలని ఎంఎస్ఆర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తాగునీటి శుద్ధి కోసం అమెరికన్ సంస్థ కనిపెట్టిన యంత్రం -
అనేక జబ్బులకు కారణం కాలుష్యమే
► సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త అనుమిత రాయ్ చౌదరి ► దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంపై వర్క్షాప్ సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలు మాత్రమే వస్తాయనుకుంటే అది పొరబాటేనని... మధుమేహం మొదలుకొని గుండెజబ్బులకు కూడా ఇది కారణమవుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) శాస్త్రవేత్త అనుమిత రాయ్ చౌదరి స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యం సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ... పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను అన్నికోణాల నుంచి అర్థం చేసుకోవడంతోపాటు పరిష్కార మార్గాలను కూడా సమగ్ర దృష్టితో చూడాల్సి ఉందని ఆమె హైదరాబాద్లో బుధవారం ‘అర్బన్ ఎయిర్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చాలెంజెస్ ఇన్ సదరన్ రీజియన్’ పేరుతో జరిగిన ఒక వర్క్షాప్లో తెలిపారు. దేశంలో దాదాపు పాతిక శాతం జనాభా నివసించే మహానగరాల్లోని వాయు కాలుష్యంపై సీఎస్ఈ మదింపు జరిపిందని, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన కాలుష్యం కొంచెం తక్కువగా ఉందని వివరించారు. మహానగరాల్లో వాయుకాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పూర్తిస్థాయి వ్యవస్థలు లేకపోగా... వాతావరణంలో పరిమితికి మించి కాలుష్యం ఉంటే తక్షణం ఏం చేయాలన్న విషయంపై కూడా ఎలాంటి ప్రణాళిక లేదని తెలిపారు. చైనా రాజధాని బీజింగ్ విషయాన్ని తీసుకుంటే... వాయుకాలుష్యం ఒక పరిమితికి మించి ఉన్నట్లు తేలితే... అధికారులు వెంటనే పరిసరాల్లోని ఫ్యాక్టరీలను తాత్కాలికంగా నిలిపివేయడం, రోడ్లపైకి వచ్చే వాహనాలను నియంత్రించడం, బాణసంచా కాల్చడంపై పరిమితులు, నిషేధం విధించడం వంటి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యం.. నగరాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, అనేక ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అనుమిత సూచించారు. పాదచారులు, సైకిల్ ద్వారా ప్రయాణించే వారిని ప్రోత్సహించేలా రహదారి డిజైన్లను మార్చాల్సి ఉంటుందని, రోడ్ క్రాసింగ్కు తగిన ఏర్పాట్లు లేకుంటే సమస్య మరింత జటిలమవుతుందేగానీ, పరిష్కారం మాత్రం కాదని స్పష్టం చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లై ఓవర్ల ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావని, కొన్ని సందర్బాల్లో మరింత పెరుగుతాయని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి, బేసి ప్రయోగం సాధించిన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను భారీ స్థాయిలో తగులబెట్టడం కూడా ఢిల్లీ వాతావరణంపై ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్య సమస్య పరిష్కారానికి ప్రాంతీయ స్థాయిలో మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్.రవీందర్, ఎం.శివారెడ్డిలతోపాటు కర్ణాటక, తమిళనాడు అధికారులు బి.ఎం.ప్రకాశ్, పి.ఎస్.లివింగ్స్టోన్ తదితరులు పాల్గొన్నారు. -
తెగుళ్లపై అప్రమత్తం
టమోటా, మిరపలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : కూరగాయల పంటల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమోటా, మిరపలో ఆశించే పురుగులు, తెగుళ్లపై అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడులు పెడుతూ చాలా మంది రైతులు నష్టపోతున్న నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటించాలన్నారు. ఇపుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరప, టమోటాలో వివిధ రకాల తెగుళ్లు ఆశించడం, మరికొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉందన్నారు. టమోటా : టమోటాలో ఎక్కువగా కాయమచ్చ తెగులు, ఫ్యుజేరియం ఎండు తెగులు కనిపిస్తోంది. బ్యాక్టీరియా ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఉధతి అధికంగా ఉంటుంది. మచ్చ వచ్చిన కాయలు తొలగించాలి. 30 గ్రాములు బ్లైటాక్ + 2 గ్రాములు స్ట్రెప్టోసైక్లీన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఫ్యుజేరియం తెగులును గుర్తించడానికి మొక్కలు పీకి కాండం చీల్చి చూస్తే మధ్యలో గోధుమ రంగులో చారలు, నల్లటి రంగులో కణజాలం కనిపిస్తుంది. 3 గ్రాములు బ్లైటాక్స్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో నాటే మందు వేర్లను ముంచాలి. పైరు నాటిన తర్వాత వ్యాపిస్తే ఎకరాకు ఒక కిలో బ్లైటాక్స్ను డ్రిప్ ద్వారా వదలాలి. అలాగే 1 గ్రాము సాఫ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పచ్చపురుగు ఉన్నట్లు గమనిస్తే 1 మి.లీ ఇండాక్సికార్బ్ లేదా 1.5 మి.లీ థయోడికార్బ్ లేదా 1.5 మి.లీ నొవాల్యురాన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరప : మిరపలో ప్రస్తుతం తామర పురుగులు, నల్లి ఆశించాయి. తామర పురుగులో తొలిదశలో ఆశిస్తే మొక్కలు గిడసబారి పూత సరిగా రాక దిగుబడులు తగ్గిపోతాయి. 3 మి.లీ ఫొసలోన్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నల్లి ఆశించిన మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఆకుల పెరుగుదల తగ్గి, పూత ఆగిపోయి, దిగుబడి బాగా తగ్గిపోతుంది. 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ డైకోఫాల్ లేదా 3 మి.లీ ఫొసలోన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
అరచేతుల్లోనే ఆయురారోగ్యాలు
అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అరచేతుల్లో అదృష్టరేఖలు ఉంటాయో లేదో గాని, ఆయురారోగ్యాలు మాత్రం చాలావరకు మన అరచేతుల్లోనే ఉంటాయి. అరచేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకున్నంత వరకు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగుంటే, ఆయుర్దాయానికీ ఢోకా ఉండనట్లే కదా! ఆయురారోగ్యాలు బాగుండాలంటే, అరచేతులపై దృష్టి సారించాలి. వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. తినడానికి ముందు, బాత్రూమ్కు వెళ్లిన తర్వాత అరచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కునేలా ఇంట్లోని చిన్నారులకు కూడా అలవాటు చేయాలి. అరచేతుల శుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని వారికి తెలియజేయాలి. వ్యాధులను కడిగేద్దాం చేతులను కడుక్కోవడమంటే వ్యాధులను కడిగేసుకున్నట్లే! అరచేతులను శుభ్రంగా కడుక్కోకపోతే జలుబు మొదలుకొని బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే రకరకాల వ్యాధులు శరీరంపై దాడి చేసే ముప్పు ఉంటుంది. ఇలాంటి వ్యాధులు సోకిన వారు శుభ్రతలేని చేతులతో ఇతరులకు కరచాలనం చేసినా, అందరూ ఉపయోగించే వస్తువులను తాకినా ఆ వ్యాధులు ఇతరులకూ వ్యాపిస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తతో, కాస్తంత అప్రమత్తతతో చాలా వ్యాధులను తేలికగా నివారించవచ్చు. పరిసరాలతో పాటు మన చేతులనూ నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు. చాలావరకు వ్యాధులు మన దరికి చేరవు. చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఇన్ఫ్లుయెంజా, లారింజైటిస్, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, హెపటైటిస్, బోటులిజం, అమీబియాసిస్ వంటి జీర్ణకోశ వ్యాధులు సోకుతాయి. ఇన్ఫ్లుయెంజాలో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి కొన్ని మొండిరకాలు, హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రాణాల మీదకు తెస్తాయి కూడా. ఇలాంటి వ్యాధులు సోకిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీసే కంటే, అవి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మేలైన పని. అకాల మరణాలను అరికడదాం ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను అరికట్టడం దుస్సాధ్యం. అయితే, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అనే తేలికపాటి చర్య ద్వారా చాలావరకు అకాల మరణాలను నివారించవచ్చు. పరిశుభ్రతా లోపం వల్ల తలెత్తే వ్యాధుల వల్ల ఎక్కువగా ఐదేళ్ల వయసు లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. శుభ్రతా లోపం వల్ల తలెత్తే న్యుమోనియా, డయేరియా వ్యాధుల కారణంగా ఏటా 35 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వల్ల మరో 18 లక్షల మంది చిన్నారులు బలైపోతున్నారు. తినే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేసుకుంటే, ఇలాంటి మరణాలను దాదాపు 30 శాతం వరకు అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. శుభ్రతా లోపం... ప్రపంచంపై భారం పరిశుభ్రతా లోపం వల్ల తలెత్తే వ్యాధుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోంది. విలువైన మానవ వనరుల ఉత్పాదకతకు కూడా విఘాతం కలుగుతోంది. కేవలం ఇన్ఫ్లుయెంజా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా దాదాపు 167 బిలియన్ డాలర్ల (రూ. 11.10 లక్షల కోట్లు) ఆర్థికభారం పడుతోంది. భారత్ సంగతి చూసుకుంటే, శుభ్రతా లోపం వల్ల తలెత్తే వ్యాధుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.1.75 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది. జనాభా అంతా చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు చాలావరకు దూరం కావడం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా బలం పుంజుకుంటుంది. ఇదీ చరిత్ర చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలావరకు వ్యాధులను అరికట్టవచ్చని హంగేరియన్ వైద్యుడు ఇగ్నాజ్ సెమెల్వీస్ 1846లోనే గుర్తించారు. ఆ కాలంలో ఆయనతో పాటు ఆధునిక నర్సింగ్కు ఆద్యురాలైన ఫ్లారెన్స్ నైటింగేల్ కూడా చేతుల శుభ్రత ద్వారా వ్యాధులను అరికట్టవచ్చనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. దాదాపు శతాబ్దం తర్వాత గాని వైద్యరంగం మేలుకోలేదు. అమెరికాలో ఇరవయ్యో శతాబ్దిలో ఆహార కాలుష్యం వల్ల వ్యాధులు ప్రబలడంతో ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది చేతులు శుభ్రం చేసుకోవాలనే నిబంధన తప్పనిసరిగా మారింది. సబ్బు లేదా యాంటీ సెప్టిక్ లోషన్తో కనీసం 15 సెకన్ల పాటు చేతులను క్షుణ్ణంగా, శుభ్రంగా కడుక్కుంటే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చని ఆధునిక వైద్యరంగం గుర్తించింది. ఆస్పత్రుల్లో వైద్యులు ఏయే సందర్భాల్లో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను కూడా రూపొందించింది. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్ఓ కె.భానుప్రసాద్నాయక్ అన్నారు. భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయ భవనం ఏర్పాటు కోసం మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లేరియా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డెంగీ లక్షణాలు గుర్చి గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని, మనుషులు నల్లగా మారడం, తరుచు జ్వరాలు రావడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా డీఎంహెచ్ఓ–1, ఏడీఎంహెచ్ఓ–1, డీఐఓ–1. డీటీసీఓ–1, డీఎల్ఓ–1, మల్లేరియా డీఎంఓ–2, ఎస్ఓ–1, ఐడీఎస్పీ మేడికల్ అధికారి–1, సూపరింటెండెంట్–1, సీనియర్ అసిస్టెంటు–3, జూనియర్–5, డ్రైవర్లు–5, అంటెండర్లు–5 పోస్టులలో అధికారులు, సిబ్బంది రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎండీ.అన్వర్హుస్సేన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీకాంత్ ఉన్నారు. -
వానల్లో ఆరోగ్యం కోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ వానాకాలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అంతా తేమ, జలమయం. సూర్యకాంతి కనబడటం లేదు. ఇలాంటప్పుడు పెద్దలుగానీ, పిల్లలుగానీ రోగాల బారిన పడకుండా ఉండటంతో తీసుకోవాల్సిన నివారణలతో పాటు... అవి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స సూచించప్రార్థన. - అయలసోమయాజుల మీనాక్షి, బీహెచ్ఈఎల్, హైదరాబాద్ శ్రావణ భాద్రపద మాసాలు వర్షరుతువులోకి వస్తాయి. దీన్నే మనం వానాకాలం అంటాం. వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువవుతంది. ఇంటాబయటా తడితడిగా ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో కూడిన వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటికి కారణం అసాత్మ్యత (అలర్జీ), సూక్ష్మజీవులు (ఇన్ఫెక్షన్లు). వీటి నివారణ, చికిత్స కోసం ఈ కింది జాగ్రత్తలు పాటించండి. శుచి, శుద్ధి : ఇంటిలోపల, ఇంటిముందు రోజుకు రెండుసార్లు గుగ్గిలం ధూపం వేయండి. బయట అమ్మే ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాలు తినవద్దు. ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారపదార్థాలను వేడివేడిగా తినండి. నూనె వంటకాలు, కారం ఎక్కువగా ఉండే టిఫిన్లు తినవద్దు. మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. అల్లం, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ, శొంఠితో తయారు చేసిన ‘టీ’ తాగండి. బాగా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. అంతటా పరిశుభ్రత ముఖ్యం. బయట వర్షంతో తడిసిన బట్టల్ని వేరే పెట్టి, ఇంటికి రాగానే వేడినీటితో స్నానం చేయడం అవసరం. అల్లం, వెల్లుల్లి ఐదేసి గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం ఒక చెంచా (5 గ్రాములు), పసుపు ఐదు చిటికెలు వేసి పావు లీటరు నీళ్లు కలిపి ‘కషాయం’ కాచుకోండి. మూడువంతులు ఇగరగొట్టి, ఒక వంతు మిగలాలి. రెండుపూటలా ఈ కషాయం... గోరువెచ్చగా తాగండి. మోతాదు : పెద్దలకు 5 చెంచాలు; పిల్లలకు రెండు చెంచాలు (అవసరమైతే తేనె కలుపుకోవచ్చు). ఇది ప్రతిరోజూ రెండు వారాలపాటు సేవించినా పరవాలేదు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసాల నివారణకూ పనికి వస్తుంది. చికిత్సగానూ పని చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. రోగనిరోధకశక్తిని ఉత్తేజపరుస్తుంది. వామును నూనె లేకుండా పొడిగా కొద్దిగా వేయించి, నీళ్లు పోసి మరిగిస్తే దాన్ని ‘వాము’ కషాయం అంటారు. మోతాదు : 5 చెంచాలు... రెండుపూటలా సేవిస్తే అజీర్ణం దూరమవుతుంది. నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి. శొంఠి చూర్ణం రెండు గ్రాములు, మిరియాల చూర్ణం ఒక గ్రాము కలిపి తేనెతో రెండుపూటలా సేవిస్తే కఫంతో కూడిన దగ్గు, ఆయాసం తగ్గుతాయి. పేలాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఐదేసి చెంచాల చొప్పున మూడుపూటలా తాగితే వాంతి, వికారం తగ్గుతాయి. ఏలకుల పొడి (మూడు చిటికెలు) ప్లస్ జీలకర్రపొడి (ఒకగ్రాము) కలిపి తేనెతో రెండు పూటలా సేవిస్తే వాంతులు తగ్గుతాయి. శొంఠి, ఇంగువ, జీలకర్ర వేసిన పలుచని మజ్జిగను రెండుపూటలా సేవిస్తే కడుపునొప్పి దూరమవుతుంది. అజీర్ణం ఉండదు. పొట్టలో వాయువు తగ్గి, రోజూ అయ్యే విరేచనం సాఫీగా అవుతుంది. వ్యాయామం : ఇంటిపట్టున ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారూ ఇంట్లోనే ఒక అరగంట తేలికపాటి వ్యాయామం విధిగా చేస్తే, శరీరం తేలిక పడి, కీళ్లు-కండరాల నొప్పులు దరిచేరవు. బజారులో లభించే ఔషధం : అరవిందాసవతోపాటు పిప్పల్యాసవ ద్రావకాలను, వానాకాలంలో ఇంట్లో ఉంచుకోవాలి. ఒక్కొక్కటి రెండేసి చెంచాలు, కొద్దిగా నీళ్లలో కలుపుకొని రెండుపూటలా వానాకాలమంతా సేవిస్తే చాలా వ్యాధులు దరిచేరవు. వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే వానల వల్ల వచ్చే ఆరోగ్య సంబంధిత అనర్థాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు,సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ -
వ్యాధుల ముప్పు పొంచి ఉంది
వైద్య ఆరోగ్యశాఖలో సెలవులు రద్దు సమీక్షలో కలెక్టర్ యోగితారాణా నిజామాబాద్అర్బన్ : కురుస్తున్న భారీ వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. శుక్రవారం ఆమె తన తన చాంబర్లో అత్యవసర వైద్య సేవలపై సమీక్షించారు. వర్షం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్యులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేసిందని తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 24 గంటల వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఆరోగ్య కేంద్రాల వైద్యులను అప్రమత్తం చేసి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలు.... జిల్లాలో వరద ప్రభావం ఉన్న జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, పిట్లం, ఆర్మూర్, సిరికొండ, ధర్పల్లి ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 14 మంది వైద్యులను ఇప్పటికే పిట్లం, బిచ్కుంద ప్రాంతాలకు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. వైద్యులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అనుకోకుండా ఏదైనా ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కొనేదుకు మరో 4 బృందాలను అందుబాటులో ఉంచారు. వ్యాధుల ముప్పు వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచింది. దీంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ ఏడాది జిల్లాలో 96 డెంగీ, 130 మలేరియా, 210 అతిసార కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవించాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాల వల్ల అతిసార ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. నీటి నిల్వ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమల ప్రభావం పెరిగి మలేరియా, డెంగీ ప్రబలే ప్రమాదముంది. దీంతో వ్యాధుల నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. సిద్ధంగా ఉన్నాం – వెంకట్, డీఎంహెచ్వో వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. దీనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. వైద్యులు, వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేశాం. -
దోమల స్వైర విహారం
పట్టపగలే విజృంభణ పారిశుద్ధ్య లోపం, మురుగు నీరే కారణం నివారణ చర్యలు శూన్యం రోగాల బారిన పడుతున్న ప్రజలు సదాశివపేట: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టపగలే దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అవి జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో పలు కాలనీల్లో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పట్టణంలోని సిద్దాపూర్ కాలనీ, శంభులింగేశ్వరకాలనీ, నాగేశ్వర్నగర్, ఫయాజ్నగర్, గురునగర్, రవీంద్రనగర్, దత్తాత్రేయనగర్, శ్రీరాంనగర్, ప్రియదర్శిని కాలనీ, రాఘవేంద్రనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలవ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారినపడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అయా కాలనీలపై కన్నెత్తి చూడడం లేదు. దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్, లిక్వీడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నేలకు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 10 వేల వరకు గృహాలు ఉండగా రికార్డుల్లో నమోదుకానీ గృహాలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచన. పత్తాలేని ఫాగింగ్ పట్టణంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు కాలనీల్లో పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారినందువల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడతున్నారు. శానిటేషన్ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పలు కాలనీల్లో పిల్లలు,వృద్ధులు, యువత అనే తెడాలేకుండా విషజ్వారాల బారినపడుతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం పట్టణ పరిధిలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. సిబ్బందిని అప్రమత్తంగ ఉంచుతూ అందుబాటులో ఉంచాం. కాలనీలో నీరు నీలువ ఉండకుండ ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పనులు చేపడుతున్నాం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - ఇస్వాక్ ఆబ్ఖాన్, మున్సిపల్ కమిషనర్ -
దోమలకాలం.. నివారణే మార్గం
– ప్రజలు భాగస్వాములు కావాలి – డీఎంహెచ్వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో పలు ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి...దోమలు వృద్ధి చెందడంతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దోమకాటు బారినపడకుండా ఎవరికి వారు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మలేరియా విభాగం దోమల నివారణకు చర్యలు చేపడుతోందని, దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. ఇళ్లు, పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపడితే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి ఆమె వివరించారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు మలేరియా : ఆడ అనఫిలిస్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు: వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం, తలనొప్పి, జ్వరం రోజు విడిచి రోజు రావడం, వాంతులు అవడం. మెదడువాపు వ్యాధి ః జపనీస్ ఎన్సెఫలిటిస్ దోమకాటు వల్ల వస్తుంది. పందులు, పశువులను కుట్టిన దోమలు మనుషులకు కుట్టిన వెంటనే రక్తం ద్వారా వ్యాధి కారక క్రిములు మెదడుకు చేరి మెదడువాపు వ్యాధి వస్తుంది. లక్షణాలు : ఈ వ్యాధి ముఖ్యంగా 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, స్పహతప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగీ : ఏడిస్ ఈజిపై ్ట అనే దోమ ద్వారా డెంగీ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం జరగవచ్చు. దీంతో ఒక్కసారి ఒంట్లో రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు రావచ్చు. పైలేరియా(బోదకాలు): క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం రావడం, వృషణాల్లో వాపు, కాళ్లలో నీరసం, కాళ్లవాపు, ప్రత్యేకించి కళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాలు పాడవడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు. చికున్ గున్యా : చికున్ గున్యా జ్వరం వైరస్ సోకడం వల్ల వస్తుంది. ఈ వైరస్ పగటి పూట పులిదోమ కాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం, భరించలేనంతగా కళ్లు, కండరాల నొప్పులు, వాంతి అవుతున్నట్లుగా, దాహం అధికంగా ఉండటం, తీవ్రమైన ఒళ్లునొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. నివారణ చర్యలు – ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగేందుకు అనువుగా ఉండే నీటి నిల్వలను నిర్మూలించాలి. –తాగి పారేసిన కొబ్బరిబోండాలను ముక్కలుగా చేసి చెత్తకుండీలో వేయాలి. –ఓవర్హెడ్ ట్యాంకులు, నీటినిల్వ పాత్రలను, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు లాంటి వాటిని పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. – కాల్వలో వ్యర్థాలు, చెత్త, చెట్లకొమ్మలు వేయరాదు. – వారానికి ఒకసారి పూలతొట్టెలలో, పూల కుండీలలో నీరు మార్చాలి.నీరు నిల్వ ఉండకుండా చూడాలి. – దోమలు లోపలికి రాకుండా కిటికీలకు సన్న జాలిని కట్టాలి. దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. – ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. –టైర్లు, రోడ్డుపై గుంతలో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. –జ్వరం వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ భీమారం (కేతేపల్లి) : వర్షాకాలంలో మూగజీవులకు వచ్చే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ సూచించారు. మండలంలోని బీమారం గ్రామంలో ఆదివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపించేందుకు నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూగజీవుల్లో రోగ లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్య సిబ్బందిని స్రందించించి చికిత్స చేయించాలన్నారు. ఈ సందర్భంగా 300 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోట ముత్తయ్య, స్థానిక సర్పంచ్ బడుగుల కవితనరేందర్, ఉపసర్పంచి నాగరాజు, నకిరేకల్ పశువైద్యాధికారి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు రైతు బతుకు చేదు
రోగాలతో నిలువునా ఎండిపోతున్న చెరుకు పంట లబోదిబోమంటున్న అన్నదాతలు పెద్దేముల్: రెండు నెలల దాటితే పంటలు చేతికి వచ్చే సమయంలో చెరుకు పంటకు రోగాలు వచ్చి నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లో రైతులు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా చెరుకు పంటను సాగుచేశారు. డిసెంబర్, జనవరి మాసంలో రైతులు చెరుకు పంటను సాగు చేయగా, రెండు నెలలు దాటితే పంటలు చేతికి వస్తాయి. ఇదే సమయంలో చెరుకు వేర్లకు లద్దె పురుగు సోకి పంటను నిలువునా తినేయడంతో చెరుకు పంట పాడవుతోది. దీంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎకరా పొలంలో సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టి.. చెరుకు పంటలు సాగు చేస్తే పంటలు చేతికొచ్చే సమయంలో నిలువునా ఎండిపొవడంతో రైతులు అప్పుల ఊడిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి ఈ వ్యాధులు సోకి రైతులు అప్పుల పాలవుతున్నా ఏ అధికారీ తమను పట్టించుకోవడం లేదని, కనీసం సూచనలు ఇచ్చే వారు కూడా కరువయ్యారని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు రాతలు మాత్రం ఎవరూ మార్చలేదని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెరుకు పంటలకు ఎందుకు రోగాలు వస్తున్నాయి.. దాని నివారణకు ఏఏ మందులు వాడాలనే విషయాలను రైతులకు అందజేయాలని కోరుతున్నారు. -
వ్యాధులతో జాగ్రత్త: ఐటీడీఏ పీఓ
సీతంపేట: వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు అన్నారు. స్థానిక పీఎంఆర్సీలో శుక్రవారం సబ్ప్లాన్ మండలాలకు చెందిన వైద్యులు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. యాంటీలార్వా ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు వ్యాపిస్తే వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. సింథటిక్ ఫైరాత్రిన్ మందును ఇళ్లల్లో స్ప్రే చేయించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మలేరియా తగ్గుముఖం పట్టిందన్నారు. అయితే తనకు పంపిస్తున్న నివేదికలు కొన్ని సక్రమంగా లేవన్నారు. అన్నవరం, ఎం.సింగుపురం, బిటివాడ, దోనుబాయి, సీతంపేటల్లో ఒక్కో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తామని తెలిపారు. డిప్యుటేషన్ల రద్దుకు చర్యలు... డిప్యుటేషన్ల రద్దు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ తిరుపతిరావు తెలిపారు. పలు చోట్ల 300 మంది డిప్యుటేషన్పై పని చేస్తున్నారని, వారి డిప్యుటేషన్లను రద్దు చేయాలని కమిషనర్ ఆదేశించారని చెప్పారు. త్వరలో వీటిని రద్దు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ బి.సూర్యారావు, జిల్లా క్షయనివారణాధికారి రత్నకుమారి, అడిషనల్ డీఎంహెచ్ఓ మెండప్రవీణ్, డీపీఓ కోటేశ్వరరావు, డిప్యూటీడీఎంహెచ్వో ఎంపీవీ నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న వ్యాధులు
♦ ఫీవర్ ఆస్పత్రిలో రోగులు బారులు తీరుతున్నారు. ♦ చలిజ్వరాల బాధితులతో బుధవారం ఆస్పత్రి కిక్కిరిసింది. ♦ చాలీచాలని వసతులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లకుంట: సీజనల్ వ్యాధుల కారణంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరడంతో ఓపీ విభాగాన్ని బుధవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పొడిగించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఓపీ నిర్వహిస్తారు. అయితే గత కొద్ది రోజులుగా రోగుల సంఖ్య పెరగడంతో ఓపీ సమయాన్ని పొడిగించినట్లు ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ శ్రీకాంత్ భట్ తెలిపారు. రోగులకు సేవలందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఇద్దరు సీనియర్ వైద్యులు , గాంధీ నుంచి ముగ్గురు పీజీలు డిప్యూటేషన్పై నియమించినట్లు తెలిపారు. ఫార్మసీలో సాయంత్రం 4 గంటల వరకు మందులు అందజేస్తారన్నారు. కానరాని ఉస్మానియా వైద్యులు ఫీవర్లో ఓపీ సమయాన్ని పొడిగించినప్పటికీ ఉస్మానియా నుంచి డిప్యుటేషన్పై నియమితులైన ఇద్దరు వైద్యులు మొదటి రోజే విధులకు డుమ్మాకొట్టారు. గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన ఇద్దరు పీజీలు విధులు నిర్వహించారు. వైద్యులు, ఫార్మసీ సిబ్బందిపై అదనపు పనిభారం పడటంతో వారు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఓపీ సమయం పొడిగింపుపై ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆస్పత్రి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ పనివేళలు పొడిగించినప్పటికీ రోగుల రద్ధీ కనుగుణంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నగరాన్ని వణికిస్తున్న ఫీవర్!
నల్లకుంట: వ్యాధులు ప్రబలుతుండడంతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి ఓపీ విభాగం ఉదయం 12 గంటలకే మూసి వేస్తుండడంతో చికిత్సల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. పైగా వందల సంఖ్యలో వస్తున్న రోగులు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉంటుండడంతో తొక్కిసలాట జరుగుతోంది. సోమవారం తొక్కిసలాటలో కొందరు రోగులు సొమ్మసిల్లి పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ శంకర్ మంగళవారం ఉదయం ఓపీ క్యూలైన్ పరిశీలించారు. రద్దీని బట్టి ఓపీ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగిస్తామని రోగులతో చెప్పారు. కొందరు వైద్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఓపీ సమయాన్ని పొడిగించకుండా మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూలైన్లో వేచి ఉన్న రోగులందరినీ పరీక్షిస్తామని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో సూపరెంటెండెంట్ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని తెలిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సమయాన్ని పొడిగిస్తే వైద్యులకు డబుల్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఫార్మసీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. అలాంటప్పుడు సమయాన్ని పొడిగించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ‘ఫార్మసీ క్యూలో రోగులకు తప్పని ఇక్కట్లు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు రోగులకు మందులు ఇచ్చేందుకు మరో ఉద్యోగిని తీసుకున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో వైద్యం కోసం బారులు తీరిన ప్రజలు -
సిటీకి ఫీవర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డెంగీ, మలేరియా, కలరా, స్వైన్ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు మురుగు కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు వ్యాపించి బస్తీ వాసుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులతో పాటు బస్తీల్లోని క్లినిక్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 98 డెంగీ, 80 పైగా మలేరియా, 40 కలరా, నాలుగు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే రెండో వారం నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో మూసీ పరీవాహక ప్రదేశాలే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బేగంపేట్ వంటి ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే రోగులను కూడా మలేరియా, డెంగీ జ్వరాలను బూచిగా చూపుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోయాయని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేస్తుండటం విశేషం. రికార్డులకెక్కని కార్పొరేట్ వైద్యం ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైనవి తప్పితే కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోని డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎన్ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్ధారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నిర్ధారణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్ను పంపడం లేదు. సీజన ల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఎపిడమిక్ సెల్కు తెలియజేయాలి. కానీ ఏ ఒక్కరూ ఇవ్వడం లేదు. ఇదే అంశంపై ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినా, వైద్యాధికారులు తనిఖీలు చేసినా వెంటనే ప్రభుత్వంలోని పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో నమోదైన సీజనల్ వ్యాధులు ఇలా.. వ్యాధి 2011 2012 2013 2014 2015 2016 మలేరియా 352 528 189 125 84 80 డెంగీ 177 452 52 19 140 98 స్వైన్ఫ్లూ 11 320 67 31 1082 4 -
వ్యాధుల ముసురు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంతోసహా జిల్లా అంతా మంచం పట్టింది. వర్షాలు కురుస్తుండటం, ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం, పారిశుధ్యలోపం, దోమల వ్యాప్తి కారణంగా వైరల్(విష) జ్వరాలు, ఇతర వ్యాధులు ఉధతమవుతున్నాయి. రోజురోజుకూ జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య అధికమవుతోంది. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరం స్వైర విహారం చేస్తోంది. ఆస్పత్రులకు వివిధ జబ్బులు, వ్యాధులతో వచ్చే వారిలో 30 శాతం రోగులు జ్వరపీడితులే ఉంటున్నారు. వీటిలో వైరల్ జ్వరాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఫీవర్ సోకిన వ్యక్తులు బాగా నీరసపడిపోయి, నిస్సత్తువకు లోనవుతున్నారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. ఆస్పత్రులకు వెళ్లినా కనీసం మూడు రోజుల వరకూ ఉపశమనం లభించడం లేదు. వైరల్ ఫీవర్లతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలూ జనాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే మన్యంలో మలేరియా, మైదానంలో డెంగ్యూ జ్వరాలతో పలువురు మత్యువాత పడుతున్నారు. నగరంలోనూ, పట్టణాల్లోనూ ఉంటున్న జ్వరపీడితులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఏజెన్సీ, జిల్లాలోని మారుమూల పల్లెల్లోనూ జ్వరాల బారిన పడ్డ వారు మాత్రం తగిన వైద్యం అందుకోలేకపోతున్నారు. కొంతమంది సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి వంటి పట్టణాల్లోని పేదలు అందుబాటులో ఉన్న ఏరియా ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆరు నెలల్లో 4 లక్షల రోగులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం 3,90,791 మంది జ్వరాల బారినపడ్డారు. అలాగే 3,770 మందికి మలేరియా, 150 మందికి డెంగ్యూ, 47 మందికి చికున్ గున్యా సోకినట్టు లెక్కకట్టారు. ఏజెన్సీ ఏరియాలో 2,687 మందికి, విశాఖ అర్బన్లో 744 మందికి, రూరల్లో 396 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారించారు. ఈ అధికారిక లెక్కలకంటే రెట్టింపు జ్వర బాధితులుంటారు. ఇప్పటికీ మన్యంలో ప్రస్తుతం ఇంటికొకరు చొప్పున వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్న వారున్నారు. వీరిలో అత్యధికులు మలేరియా జ్వరాల వారే కనిపిస్తున్నారు. అయితే గత ఏడాదికంటే మలేరియా జ్వరాల తీవ్రత తగ్గిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం శ్రద్ధ తగ్గించే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ, డయేరియాలతో అటు ఏజెన్సీలోనూ, ఇటు మైదానంలోనూ మరణాలు సంభవిస్తున్నా.. ఒక్కరూ మరణించినట్టు తమ రికార్డుల్లో నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. సరికొత్తగా చికెన్పాక్స్ ఒకపక్క విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగూ జ్వరాలు జనాన్ని వణికిస్తుంటే.. అవి చాలవన్నట్టు సరికొత్తగా చికెన్పాక్స్ కూడా విజంభిస్తోంది. కాలం కాని కాలంలో చికెన్పాక్స్ కేసులు నమోదు కావడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చికెన్పాక్స్ ప్రభావం చూపుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు జూలైలో కనిపించడం అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ జ్వరాల ఉధతి ఉన్నందున వైరస్ ద్వారా వ్యాప్తి చెందే చికెన్పాక్స్ కూడా ఇప్పుడు సోకడానికి కారణం కావచ్చని కేజీహెచ్ ఫిజీషియన్ డాక్టర్ పీఎస్ఎస్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ముందస్తు వర్షాల వల్లే.. ఈ ఏడాది ముందస్తుగా కురుస్తున్న వర్షాలే వైరల్ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం జ్వరాల ప్రభావం ఉండడం వాస్తవమే. జ్వరాల తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీల్లో మందులు. వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం. – జి.సరోజిని, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుజూర్నగర్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్రావు మాట్లాడుతూ వార్డు పరిస్థితులను ‘సాక్షి’ దినపత్రిక ఇటీవల నిర్వహించిన ఫోన్ ఇన్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భానుప్రసాద్నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది వార్డును సందర్శించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ జాన్పాషా,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, ఆశా కార్యకర్తలు మాధవి, మంగమ్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
వానల్లో వ్యాధుల నివారణకు...
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఇప్పుడు ఉన్న ముసురు వాతావరణంలో క్రిమికీటకాలు పెరిగి ఎన్నో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా నీళ్ల విరేచనాలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయుర్వేద విధానంలో వీటికి నివారణ, చికిత్స సూచించండి. - వి. శ్రీనివాసశర్మ, విశాఖపట్నం ఇది ఆషాఢమాసం. వర్షరుతువు. ఈగలు ఎక్కువగా ముసిరే కాలం. జల కాలుష్యానికి పెట్టింది పేరు. కాబట్టి మనం తినే ఆహారపదార్థాలు, తాగే పానీయాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వాటి ద్వారానే కడుపులోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఈ రుతువులో మన ‘జఠరాగ్ని’ సామ్యావస్థలో ఉండదు. కనుక అజీర్ణం సంభవించడానికి అవకాశాలు ఎక్కువ. దీనికితోడు తినుబండారాల్లో వాడే వివిధ రకాల రంగులు, నిల్వ ఉంచడానికి వాడే రసాయనాల్లో కల్తీలు ఎక్కువ. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకునే వంటకాలు, పానీయాలే తీసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బయట లభించే పదార్థాల జోలికి పోవద్దు. మానవుని జీర్ణకోశ వ్యవస్థని ‘మహాకోష్ఠం’ అంటారు. మన ఆరోగ్యమంతా దీని క్రియా విశేషంపైనే ఆధారపడి ఉంటుంది. దీంట్లో అత్యంత ప్రధానమైనది ‘జఠరాగ్ని’. సక్రమరీతిలో ఆకలివేయడం, తిన్నది జీర్ణమవడం జరిగితే దానిని ‘సమాగ్ని’ అంటారు. దీని శక్తి తగ్గితే ‘మందాగ్ని’ అంటారు. అప్పుడు కలిగే వ్యాధిని ‘అగ్నిమాంద్యం’ అంటారు. మితిమీరిన శక్తి ఉన్నప్పుడు ‘తీక్షా ్ణగ్ని’ అంటారు. ఒకసారి అతిగానూ, వెంటనే మందంగానూ తేడాలు సంభవిస్తే ‘విషమాగ్ని’ అంటారు. సమాగ్ని ఉన్నప్పుడు మన రోగనిరోధకశక్తి బాగుంటుంది. సూక్ష్మక్రిముల వల్ల వచ్చే రోగాల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ రుతువులో చాలా మంది ఆహార, విహార నియమాలను పాటించకపోవడం వల్ల అజీర్ణం, విరేచనాలు, వాంతులు మొదలైన సమస్యలకు గురవుతారు. కొంతమందిలో వీటితో పాటు జ్వరం, కడుపునొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ‘విసూచికా’ అనే వ్యాధికి దారి తీసుస్తుంది. ఇందులో కనిపించే లక్షణాలు కలరా వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి. విసూచికా వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, దప్పిక, ఆవులింతలు, కళ్లు తిరగడం, తలనొప్పి, కడుపులోనొప్పి, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లుగా బాధ, ఛాతీలో బిగబట్టినట్లుగా ఉండటం, శరీరం రంగుమారడం, వణుకు, మూర్ఛ. సుశ్రుత సంహితాః శ్లోకం మూర్ఛా అతిసోరో వమథుః పిపాసా శూలో భ్రమ ఉద్వేష్ఠన జృంభదాహాః వైవర్ణ్య కంపౌ హృదయేరుజశ్చ తస్యాం శిరసశ్చ భేదః ...... విసూతీతి నిగద్యతే నివారణ: ప్రతిరోజూ తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన, పరిశుభ్రమైన ఆహార ద్రవ్యాల్ని, పానియాలను మితంగా తీసుకోవాలి. మరిగించిన నీరు తాగితే మంచిది. అన్నీ ఇంట్లోనే తయారుచేసుకోవాలి. మనకెల్లప్పుడు ‘సమాగ్ని’ ఉండేట్టు జాగ్రత్తపడాలి. కషాయం: అల్లం, వెల్లుల్లి కషాయం, 30 మిల్లీలీటర్లు (ఆరు చెంచాలు) ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. చికిత్స: అజీర్ణపు విరేచనాలకు: వాము కషాయం - 30 మిల్లీలీటర్లు - రెండుపూటలా ఇదే బజారులో ‘అజామోదార్క’ అనే ద్రవంగా లభిస్తుంది దాడిమాష్టకచూర్ణం: ఒక చెంచా రెండుపూటలా విసూచికా వ్యాధికి : కర్పూరరస మాత్రలు ఉదయం 2, రాత్రికి 2 లశూనాదివటి (మాత్రలు) లేదా కుటజఘనవటి ఉదయం 1, రాత్రికి 1 ఆనందభైరవీరస (మాత్రలు) ఉదయం 1, రాత్రికి 1 ద్రవాహారం: కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు, గోధుమజావ, ఉప్పు, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ; ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా చక్కెర, మూడు చిటికెల ఉప్పు, కొంచెం నిమ్మరసం సలిపి, కొంచెం కొంచెం పదేపదే తాగుతుండాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ గుండె సమస్యల నివారణకు... నాకు 35 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. - సురేశ్కుమార్, నిడదవోలు గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహానికి దూరంగా ఉంటూ, డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించుకుంటూ ఉండాలి గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
వ్యాధుల వర్షం
వర్షం సంతోషాన్ని తెస్తుంది. జాగ్రత్తపడకపోతే కుండెడు వ్యాధులనూ తెస్తుంది. ప్రత్యేకంగా పిల్లలకు, వృద్ధులకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అలాగే ఆఫీసులకు వెళ్లి వస్తూ వానలో తడిసే వాళ్లకు కూడా జాగ్రత్తలు అవసరం. మంచి అవగాహన, కొద్దిపాటి జాగ్రత్తలతో మీ ఫ్యామిలీ బాగుండాలని... మన ఫ్యామిలీ చెబుతోంది. ఈగలతో వచ్చే వ్యాధులు ఈ సీజన్లో వర్షాలు మొదలుకాగానే ఈగలు తప్పక కనిపిస్తుంటాయి. ముసురు పట్టగానే మరీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఈగలతో దాదాపు నూరు రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలరు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. . ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... అమీబియాసిస్ : ఇవి ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) వంటివి కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది. నీరు కలుషితం కావడం వల్ల ఈ సీజన్లో నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు... టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోవడం వంటి పరిణామాలు సంభవించి, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగులో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ర్పభావాలూ కనిపించవచ్చు. ఈ-కొలై : నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్కు ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దోమలతో వచ్చే వ్యాధులు మలేరియా : ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందే వ్యాధి. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్షజీవి వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు. చికన్ గున్యా : ఇది ఎడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏడిస్ ఈజిప్టై దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి. డెంగ్యూ : ఈ వ్యాధికి సైతం ఏడిస్ ఈజిప్టై దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు. ఎలుకల వల్ల వర్షాలకు ఎలుకలు బయట నుంచి ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది. వర్షాకాలపు వ్యాధుల నివారణ ఈ సీజన్లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం.కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి.వాటర్ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది.బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్లో వద్దు.తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినవద్దు.వూంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. కానీ ఈగల వంటివి ముసరడానికి శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్ల అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మాంసాహారంతో వచ్చే ముప్పును తప్పించుకోవచ్చు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తారుు. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పెపైచ్చులు ఊడిపోయిన సన్షేడ్కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివరించండి. దోమ తెరలు వాడటం మేలు. ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.ఇంటి కిటికీలకు మెష్లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే మెల్క్రో వంటి ప్లాస్టిక్ మెష్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి.వానలో అతిగా తడసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. -
వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట: వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్ఓ డాక్టర్ రామయ్య, ప్రధానోపాధ్యాయులు కే.రవిందర్నాయక్లు అన్నారు. బుధవారం మండలంలోని బొందుగుల గ్రామంలో రాష్ట్రీయ బాలస్వస్త్(ఆర్బీఎస్కే) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 164 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేవారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఐరన్ లోపంతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అశ్వినీ కుమార్, శ్రియ, కార్తికేయ, జయంతి, హెచ్ఈఓ కృష్ణమూర్తి, సూపర్వైజర్లు వనతాదేవి, అనసూర్య, ఏఎన్ఎంలు వనిత తదితరులు పాల్గొన్నారు. -
మంచం పట్టిన మన్యం
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్సీలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపించడం, దోమతెరలు పంపిణీ కాకపోవడం వంటి సమస్యలతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులంతా పీహెచ్సీలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, మందులు అరకొరగా ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. * ఏజెన్సీని చుట్టుముడుతున్న రోగాలు * రోగులతో నిండిన పీహెచ్సీలు * కలుషిత నీటితో తప్పని అవస్థలు సీతంపేట: ఏజెన్సీలో రోగాలు ముసురుకుంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గెడ్డల్లో కొత్తనీరు చేరి కలుషితమవుతుంది. కొన్ని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గెడ్డనీటిపైనే ఆధారపడటంతో గిరిజనులు టైఫాయిడ్ వంటి విషజ్వరాల వ్యాధుల బారిన డుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైరవిహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీంతో ఏజెన్సీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 250కిపైగా మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతుండగా వాటి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికార అంచనా. టైఫాయిడ్, డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అరకొరగా వైద్య సిబ్బంది.. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మరో 151 ఉప ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆస్పత్రులు, 10 సీహెచ్సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ నమోదవుతోంది. వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కానరావడం లేదు. సీతంపేటలో ఇద్దరు వైద్యాధికారులు మాత్రమే ఉన్నారు. గతంలో నలుగురు వైద్యులు ఉండేవారు. దోనుబాయి, కుశిమి పీహెచ్సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మందులు బయటకొనాల్సిందే.. పీహెచ్సీల్లో అరకొరగానే మందులు ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. సెలైన్ బాటిళ్లు, ఇతర యాంటీబయాటిక్ మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. మలేరియా నిర్మూలనకు ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్వో ఎంపీవీ నాయిక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గిరిజనులకు సక్రమంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఎటువంటి కొరత లేదని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలి. గ్రామా ల్లో ఇప్పుడు వైరల్, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఏ గ్రామం లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించాలి. - ఎస్.లక్ష్మి, ఎంపీపీ, సీతంపేట వైద్యులను నియమించాలి అన్ని పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి వైద్యసేవలు అందించాలి. మందులన్నీ అందుబాటులో ఉంచే లా చర్యలు తీసుకోవా లి. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. - ఎ.భాస్కరరావు, గిరిజన సంఘ నాయకుడు అదుపులోకి రాని డయేరియా వాబ(సారవకోట): మండలంలోని అన్నుపురం పంచాయతీ వాబ గ్రామంలో విజృంభించిన డయేరియా(అతిసార) శుక్రవారం నాటికీ అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పీహెచ్సీ డయేరియా రోగులతో నిండిపోయివడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలందించారు. గ్రామంలో సుమారు 40 మంది వ్యాధి బారిన పడటంతో అక్కడ కూడా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన దినేష్, మధుల పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. చోడసముద్రం, పురుషోత్తుకర్ర, చిన్నకిట్టాలపాడు, గొర్రిబంద గ్రామాల్లోనూ అతిసార వ్యాపించినట్లు సమాచారం. సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా కంటిజెంట్ వర్కర్ రోగులకు సెలైన్లు ఇస్తుండటం గమనార్హం. -
ఆ చెట్లను తొలగించండి
-
తస్మాత్ జాగ్రత్త..!
♦ ఏజెన్సీలో అధ్వాన్నంగా పారిశుద్ధ్యం ♦ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ♦డయేరియాతో వృద్ధురాలు మృతి ఒకవైపు వర్షాలు, వరదలు. మరోవైపు చెత్తకుప్పలు, మురుగు నీరు. కనిపించని పారిశుద్ధ్య చర్యలు. పరిస్థితి ఇలా ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక మండలాల ప్రజలకు కంటిపై కునుకు కరువైంది. ఈ వర్షాలతో వ్యాధులు ప్రబలుతాయేమోనని వారు భయపడుతున్నారు. వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో డయేరియాతో ఓ వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది. భద్రాచలం : ప్రస్తుత తరుణంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పంచాయతీ పాలకులు, అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించడంలో, తాగునీటి పథకాల్లో క్లోరినేషన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి వరదలతో కరకట్ట స్లూయిస్ల లీకేజీ కారణంగా భద్రాచలం పట్టణంలోని అశోక్నగర్ కొత్త కాలనీలోని ఇళ్లు రెండు రోజుల నుంచి నీట మునిగే ఉన్నాయి. పట్టణంలోని మురుగు నీరంతా కూడా ఇక్కడికే వస్తోంది. దీంతో కొత్త కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వర్షాలతో అవి తడిచి దుర్గంధం వస్తోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొత్త కాలనీకి వెళ్లే దారి చెత్త డంపింగ్ యార్డులా మారింది. వరద ముంపుతో బాధితుల పునరావాస శిబిరమైన సమీపంలోని పాఠశాల వద్ద కూడా పారిశుద్ధ్యం లోపించింది. భద్రాచలంలోని పంచాయతీ అధికారులు ప్రధాన రోడ్లపై తప్ప కాలనీలను పట్టించుకోవడం లేదని,పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ఆయా కాలనీ వాసులు మండిపడుతున్నారు. కలుషిత నీటితో అంటు వ్యాధులు వాగులు పొంగి ప్రవహిస్తుండటం, ఓవర్ హెడ్ ట్యాంకులకు వెళ్లే పైపుల లీకేజీల కారణంగా తాగు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. ఏజెన్సీలోని అటవీ ప్రాంత గ్రామాల్లోని గిరిజనులు ఇప్పటికీ వాగుల నీటినే తాగుతున్నారు. ఈ నీరు ప్రస్తుతం కలుషితమైనందున డయేరియా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల ఇదే విషయం చెప్పారు. ‘‘చెత్తకుప్పలను తొలగించకపోతే దోమలు పెరిగి, మలేరియా జ్వరాలు వస్తాయి. మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాలకన్నా కూడా మలేరియా, చికున్గున్యా, డెంగీ తదితర వ్యాధులు భద్రాచలం పట్టణంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే ఇక్కడి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతనైనా పారిశుద్ధ్య నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..! సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ కోరారు. ఆయన మంగళవారం తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులైన మలేరియా, డయేరియా, డెంగీ వంటివి ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీహెచ్ఓలు క్లస్టర్ పరిధిలో, వైద్యాధికారులు మండల పరిధిలో రోజూ తరచుగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ఐకేపీ, పంచాయతీ రాజ్, మంచినీటి సరఫరా విభాగాల సిబ్బందితో ప్రతి 15 రోజులకోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్ల విధులను హెచ్ఈఓలు, సీహెచ్ఓలు, హెల్త్ సూపర్వైజర్లు పరిశీలించాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు రెండు రోజులకోసారి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులతో ఎవరైనా మృతిచెందితే సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంఓ డాక్టర్ రాంబాబు, ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల, ఏఎమ్ఓలు బన్సీలాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
బాల్యంపై భారం
బంగారు భవితపై ఎన్నో ఆశలతో పాఠశాలకు వెళుతున్న చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు తిలోదకాలిచ్చి నాలుగు నుంచి ఆరు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండటమే దీనికి కారణం. అసలే వయసుకు మించిన పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న చిన్నారులు అంత బరువుతో అన్ని అంతస్తులు ఎక్కలేక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దీర్ఘకాల రోగాలకు గురవుతున్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
వైద్య, ఆరోగ్య శాఖకు అంచనాల కమిటీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను శాసనసభ అంచనాల కమిటీ ఆదేశించింది. ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణాల్లోని మురికివాడల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖపై సమావేశం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ శాఖకు బడ్జెట్లో నిధులు పెంచామని, వాటిని సద్వినియోగం చేయాలని అధికారులకు సోలిపేట సూచించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.2,472 కోట్లు, ఈ ఏడాది రూ.3,504 కోట్లు కేటాయించామన్నారు. నిధుల సక్రమ వినియోగ కోసమే కమిటీ పనిచేస్తోందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ, నిధుల ఖర్చుకు సబంధించి పూర్తి వివరాలతో కార్యాచరణ ప్రణాళికను వారంలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ఆసుపత్రుల పనితీరునూ కమిటీ చైర్మన్ సమీక్షించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు పేదలకు భారంగా మారాయని, ఒక్కో ప్రసవానికి కనీసం రూ.50 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, మందుల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు అందించే ఆహారం కల్తీ కాకుండా చూడాన్నారు. నిధులు సక్రమంగా వాడకపోతే అధికారులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. మరో వారంలో సమావేశం కావాలని, ఈసారి నేరుగా ఆస్పత్రులను సందర్శించాలని కమిటీ నిర్ణయిం చింది. సమావేశంలో ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
వ్యాధుల కాలం వచ్చేసింది ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు పట్టించుకోని అధికారులు వర్ధన్నపేట : ఎండలతో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన ప్రజలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడినప్పటికీ వ్యాధులు మాత్రం పొంచి ఉన్నాయి. వర్షపు నీరు నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోకి వచ్చి చేరుతుండడంతో దోమలు, ఈగల ఉధృతి ఎక్కువై సీజనల్ వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రామాల్లో నెలకొన్న పారి శుద్ధ్యంతో సీజనల్ వ్యాధులపై ఆందోళన పెరుగుతోంది. లోపిస్తున్న పారిశుద్ధ్యం వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. మండలంలోని కొత్తపెల్లి, కట్య్రాల, ల్యాబర్తి, నందనం, బండౌతపురం, రాంధాన్తండా, డీసీతండాల్లో బురదనీరు రోడ్లపై చేరుతోం ది. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిం చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం.. డ్రైయినేజీలు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా వర్షపు నీటితో చెత్తాచెదారం చేరుకుని వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షపు నీరు చెరువులు, కుంటలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి. వర్ధన్నపేట, ల్యాబర్తి, కట్య్రాల గ్రామాల్లో పైప్లై న్ల లీకేజీతో వర్షపు నీరు తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. వాటర్ట్యాంకుల క్లోరినేషన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత మండలంలోని 24 గ్రామాల పర్యవేక్షణకు 13 మంది కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. ఒక్కో కార్యదర్శికి రెండు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కార్యదర్శుల పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్ష ణ కరువైంది. గ్రామాల్లో పరిస్థితి సాధారణంగా ఉండగా, శివారు తండా ల్లో పారిశుధ్యం క్షీణించింది. పాటించాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో కలుషిత నీటిని తాగకుండా ఉండాలి.వేడిచేసి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.రాత్రి వేళల్లో దోమల బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడంతో జ్వరం సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లను నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 2 వరకు అన్ని గ్రామాల్లో పర్యటి ంచి పారి శుద్ధ్య పనులను పూర్తిచేస్తాం. డ్రైనేజీ కాలువలు, నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ చేస్తాం. - శంకర్, ఈవోపీఆర్డీ -
గిరిజనం విలవిల
మన్యాన్ని వణికిస్తున్న జ్వరాలు పెరిగిన మలేరియా,టైఫాయిడ్ కేసులు సెరిబ్రల్ మలేరియాతో హుకుంపేట మండలంలో ఇద్దరి మృతి ఏజె న్సీలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మలేరియా, టైఫాయిడ్ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. పీహెచ్సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హుకుంపేట మండలంలో సెరిబ్రల్ మలేరియా లక్షణాలతో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆవేదన వ్యక్యంచేస్తున్నారు. పాడేరు: మన్యంలో మలేరియా మహమ్మారి విజృంభిస్తోంది. గ్రామాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నారు. మన్యంలోని ఆస్పత్రుల్లో జ్వరబాధితుల తాకిడి పెరుగుతోంది. ఈనెల ఆరంభం నుంచి మన్యంలో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో జ్వరాల తీవ్రత అధికమవుతోంది. ప్రస్తుతం మన్యమంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాగునీటి కాలుష్యం వల్ల, దోమల విజృంభణ వల్ల గ్రామాల్లో గిరిజనులను టైఫాయిడ్, మలేరియా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పాడేరు ఏరియా ఆస్పత్రిలో జూన్ 1 నుంచి మొదలుకొని ఈ 15 రోజుల వ్యవధిలో సుమారు 2 వేల మంది జ్వరబాధితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 31 మలేరియా పాజిటివ్ కేసులు, 35 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో 49 మలేరియా పాజిటివ్ కేసులు, జీకేవీధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జూన్ నెల 12 వరకు ఏజెన్సీ 36 పీహెచ్సీల్లోనూ ప్లాస్మోడియం వైవేక్స్ కేసులు 14, పాల్సీఫాం మలేరియా కేసులు 217 నమోదయ్యాయి. సెరిబ్రల్ మలేరియా కేసులు కూడా కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. ఎక్కువగా మారుమూల ప్రాంతాల నుంచే జ్వరబాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. పాడేరు మండలంలోని ఈదులపాలెం, మినుములూరు పీహెచ్సీలు పరిధిలోని గ్రామాల నుంచి, చింతపల్లి మండలంలోని మొండిగెడ్డ, కొమ్మంగి, దామనపల్లి, రింతాడ ప్రాం తాల నుంచి, జీకేవీధి మండలంలో శివా రు గ్రామాల నుంచి వస్తున్న గిరిజనుల్లో వచ్చిన జ్వరబాధితులకు మలేరియా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. నివారణ చర్యలు అంతంత మాత్రమే మన్యంలో ఏటా మలేరియా జ్వరాలు తిరగబెడుతున్నాయి. నివారణ చర్యలు పటిష్టంగా అమలు జరగడం లేదు. మలేరియాతోపాటు ఏజెన్సీలో టైఫాయిడ్ జ్వరాలు కూడా అధికమవుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాలు మెరుగుపడకపోవడంతోపాటు వైద్య ఆరోగ్య సేవల కల్పనలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల తరచూ గిరిజనులు జ్వరాల బారిన పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. తాగునీటి కొరత, పోషకాహార లోపం వల్ల జ్వరాల బారిన పడుతున్న గిరిజనులు త్వరగా కోలుకోలేకపోతున్నారు. సకాలంలో వైద్యసేవలు కూడా పొందలేని పరిస్థితి కొనసాగుతోంది. జ్వరాలు ప్రబలిన తర్వాత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. మన్యంలో ఏటా ప్రబ లుతున్న మలేరియా నియంత్రణపై మా త్రం ప్రభుత్వం విఫలమవుతోంది. రెండేళ్లుగా దోమతెరల పంపిణీ ప్రతిపాదనలకే పరిమితమైంది. స్ప్రేయింగ్ పనుల్లోనూ అలసత్వం వల్ల మలేరియా నియంత్రణపై ముందస్తు చర్యలు ఎక్కడికక్కడ మలేరియా జ్వరాల తవ్రత అథికమవుతోంది. పాడేరులో డీఎంఓ ఆఫీసు నామమాత్రం పాడేరులో జిల్లా మలేరియా అధికారి కార్యాలయం నామమాత్రంగానే ఉంది. మన్యంలో ప్రాణాంతకమైన ఫాల్సీఫాం మలేరియా కేసులు నమోదవుతుండటం, గిరిజనుల మరణాలు సంభవిస్తుండటంతో దశాబ్దకాలం క్రిందట జిల్లా మలేరియా అధికారి కార్యాలయాన్ని పాడేరులోనే ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ఈ శాఖ సేవలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ కొరవడింది. -
వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్ రూరల్ : రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంఅండ్హెచ్వో ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా క్లస్టర్ పరిధిలోని వైద్యాధికారులు, మెడికల్ సిబ్బందితో ఎస్పీహెచ్వో కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జైనూర్, ఆసిఫాబాద్, పంగిడి, జామ్ని ప్రాంతాల్లో గతంలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని ఇలాంటి సమస్యాత్మక గ్రామాల్లో దోమల నివారణకై దోమల మందులు, ఎప్పటికప్పుడు వాట్సప్లో వివరాలు తెలపాలని సూచించారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జైనూర్ ఎస్పీహెచ్వో వాణి, హస్నాపూర్ వైద్యాధికారి రవి, ఏఎంవో వెంకటేశ్వర్, పాల్గొన్నారు. -
నిన్నొదల మానవాళీ
తింటే తంటా రోగాలు మందులు మింగుతున్నాయి. మింగే ముద్ద బుస కొడుతోంది. పాత జబ్బుల రోత పెరిగింది. కొత్త జబ్బుల మోత మొదలైంది. ‘అన్నం మందు కావాలి... మందు అన్నం కాకూడదు’ అన్న నానుడికి తింటే తంటా అన్న చీడ పట్టింది. మాంసం ఫ్రై చేసి... మసాలా కొట్టి... తందూరు పెట్టి తిందామంటే క్యాన్సర్ కొరుకుతానంటోంది. ప్రసాదం దగ్గర్నుంచి చాక్లెట్ దాకా ఏ పండగా చేసుకోనివ్వని చక్కెర... పానకంలో పుడక అయ్యింది. చిత్రవిచిత్రమైన వ్యాధులు కుల మత వర్ణ వర్గాల అంతరాలు లేకుండా ‘వదల మానవాళీ’ అని ఊళ వేస్తున్నాయి. అన్నీ బ్రేకింగ్ న్యూస్లే! మానవాళికి ‘బ్రెత్ టేకింగ్’ ఫ్యాక్టులే!! డిప్రెషన్ ఎగరగొట్టడానికి కన్ఫ్యూజన్ పారదోలడానికి ఈ కథనాలు! నిజానికి ఏ ఆహారమైనా ఎలర్జీ కలిగించవచ్చు. ఎక్కువగా పిల్లల్లోనే ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిలో ప్రధానంగా ఎనిమిది రకాల ఆహార పదార్థాలు ఎలర్జీలు కలిగిస్తాయి. అవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్లచేపలు. ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కొందరిలో తక్కువగా ఉంటే, ఇంకొందరిలో ప్రాణాంతకమైన స్థాయిలో ఉంటాయి. సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ ఎలర్జీలో జరిగే ప్రక్రియ ఏమిటి? ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక ప్రక్రియ చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. అందువల్లనే సరిపడని ఆహార పానీయాలు తీసుకున్న వెంటనే అది తీవ్రంగా ప్రతిఘటించడం మొదలుపెడుతుంది. మనకు సరిపడని ఆహారం లేదా వస్తువును ఎలర్జెన్స్ అంటారు. ఎలర్జెన్స్ లోపలికి ప్రవేశించగానే వాటితో పోరాడేందుకు వ్యాధినిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ను వెలువరిస్తుంది. ఈ పోరాటక్రమంలో యాంటీబాడీస్ వెలువరించే రసాయనాల వల్ల మన శరీరంలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫుడ్ ఎలర్జీలు... ఎవరెవరిలో ఎంతెంత? చిన్నారులందరిలోనూ 3 నుంచి 8 శాతం మందిలో ఏదో ఒక రకం ఆహారం కారణంగా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ ఎలర్జీలు కాలక్రమంలో తగ్గిపోవచ్చు కూడా. ఇక పెద్దల విషయానికి వస్తే 1 నుంచి 2 శాతం మందిలో ఏదో ఒక ఆహారం పట్ల ఎలర్జీ రావడం చాలా సాధారణం. అయితే గతంలో మనకు బాగా సరిపడే ఆహారాలే... ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా సరిపడకపోవడం కూడా జరుగుతుండవచ్చు. ఇలా ఏ సమయంలోనైనా, ఏ ఆహారం పట్లనైనా ఎలర్జీ కలగవచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయి? * ఎలర్జీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. తీవ్రత సైతం ఒకేలా ఉండదు. వాటి లక్షణాల ప్రభావం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు శారీరక వ్యవస్థలపై ఉండవచ్చు. * ఆహారం మొదట వెళ్లేది జీర్ణవ్యవస్థలోకి కాబట్టి కొందరిలో అది లోపలికి ప్రవేశించగానే నోటిలోని లోపలి మ్యూకస్ పొరల వాపు, పెదవులపై దురదలు, గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. * ఇంకొందరిలో ఆహారం కడుపులోకి ప్రవేశించగానే వికారం, కడుపు పట్టేసినట్లుగా బిగుతుగా కావడం, మలబద్ధకం, కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాల లాంటివి ఎదురుకావచ్చు. * చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాల వంటివి ఎలర్జీకి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కొందరిలో చర్మంపైనా, ఊపిరితిత్తులపైనా కనిపించే చాలా తీవ్రమైన రియాక్షన్ను ‘అనాఫిలాక్సిస్’ అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఫుడ్ ఎలర్జీ నుంచి నివారణ ఎలా...? దూరంగా ఉండండి: మీకు సరిపడని ఆహారం నుంచి దూరంగా ఉండండి. లేబుల్ చదవండి: మీరు ఏదైనా వంటకం లేదా ప్రిపరేషన్ను తీసుకోదలచినప్పుడు దానిలో ఉండే పదార్థాల జాబితాను చదవండి. మీరే వండుకోండి: మీకు ఫుడ్ ఎలర్జీలు ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే, స్వయంగా వంట చేసుకునే అవకాశం ఉన్నచోట వసతి పొందండి. హోటళ్ళలో తినాల్సి వస్తే, అలవాటైన ఆహారాన్నే ఆర్డర్ చేయండి. నూనెలతో జాగ్రత్త: కొన్ని రకాల నూనెలు ఎలర్జీ కలిగించే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు వేరుశనగ నూనెకు ఈ గుణం ఎక్కువ. పిల్లల విషయంలో: బయట దొరికే కృత్రిమ ఫార్ములాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలిమెంటల్ ఫార్ములాలు లేదా అల్టర్డ్ ప్రోటీన్లు ఫుడ్ ఎలర్జీలను తక్కువగా కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను పాటించండి. అలాగే పిల్లల ఆహారంపై ‘హైపో ఎలర్జెనిక్’ అని రాసి ఉందంటే అది చాలా వరకు సురక్షితం. అయితే, అరుదుగా ఇవి కూడా ఎలర్జీ కలిగించే అవకాశాలు లేకపోలేదు. అందుకే కొద్ది మోతాదుల్లో పరీక్షించాకే వాటిని నమ్మకంగా వాడండి. చికిత్స: ఏదైనా ఆహారం వల్ల ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్ను సంప్రతించాలి. ఎలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్లు ఎపినెఫ్రిన్ మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ హిస్టమైన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి రావచ్చు. ఎక్కువ మందిలో ప్రధానంగా అలర్జీ కలిగించేవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్ల చేపలు. అలర్జీ లక్షణాలు వేరువేరుగానే ఉన్నా చాలా మందిలో దురదలు, గొంతు బొంగురుగా మారడం కనిపించవచ్చు గ్లూటెన్ అంటే...? పిండి... దానితో చేసే ముద్ద గురించి తెలుసుకునే ముందుగా మనం ‘గ్లూటెన్’ గురించి తెలుసుకుందాం. మనం పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోస్తాం. కాసేపటి తర్వాత పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే పదార్థం తోడ్పడుతుంది. నిజానికి గ్లూటెన్ అన్నది ఒక రకం ప్రోటీన్. అయితే, కొందరికి మాత్రం ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ సరిపడదు. దాంతో వాళ్లకు పిండితో చేసిన ఏదైనా వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాల లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆ యా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. డిప్రెషన్ కన్ఫ్యూజన్ ఇన్ని వ్యాధులు మన చుట్టూ భ్రమిస్తూ ఉంటే మానసికంగా కూడా కుంగిపోయేవారు ఎంతోమంది! కొందరు వ్యక్తులు తమకు ఏదో సమస్య ఉన్నట్లుగా భావిస్తుంటారు. ఫ్యామిలీ ఫిజీషియన్ను ఒకటికి పదిసార్లు కలుస్తారు. వారు చెప్పింది నమ్మరు. తమకు ఏదో వ్యాధి ఉందంటూ ఈఎన్టీ, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్, గ్యాస్ట్రో-ఎంటరాలజిస్ట్... ఇలా అన్నిరకాల స్పెషలిస్టులను సంప్రతిస్తుంటారు. కలిసినప్పుడల్లా సదరు డాక్టర్లకు కొన్ని కొత్త సమస్యలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన లక్షణాలను బట్టి ఆయా డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. అయినా ఏమీ తేలదు. అలాంటి వారిని ఇక చివరగా మానసిక వైద్యుల వద్దకు పంపిస్తారు. ఇలాంటి చాలామందిలో తమకు ఏదో జబ్బు ఉందని అనుమానించే వారిలో ‘హైపో-కాండ్రియాసిస్’ అనే రుగ్మత ఉండవచ్చు. ఇక కొందరికి తీవ్రమైన డిప్రెషన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద మానసిక రుగ్మత. కానీ డిప్రెషన్ రోగులు దాన్ని మానసిక రుగ్మతగా అనుమానించడానికి ముందు అనేక శారీరకమైన లక్షణాలను వ్యక్తపరుస్తుంటారు. ఆ శారీరక లక్షణాలకే చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీవ్రమైన నీరసం, నిస్సత్తువతో కొందరు బాధపడుతుంటారు. అది శారీరకంగా వచ్చిన బలహీనత వల్ల అని అనుకుంటుంటారు. ఆకలి లేకపోవడం కూడా డిప్రెషన్ వల్ల కనిపిస్తుంది. ఇక కొందరిలో తలనొప్పి ఉంటుంది. నిజానికి డిప్రెషన్ వల్ల కలిగే ఈ తలనొప్పిని నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణంగా వస్తున్న తలనొప్పిగా రోగులు పొరపడుతుంటారు. ఇక, కండరాలు పట్టేయడం డిప్రెషన్లో కనిపించే మరో లక్షణం. కానీ ఒంట్లో నీళ్లు, లవణాలు తగ్గడం వల్ల ఇలా కండరాలు పట్టేస్తున్నాయని అపోహపడే అవకాశం ఉంది. ఇక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మలబద్ధకం కానీ, నీళ్ల విరేచనాల వంటివి కానీ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని డాక్టర్లు ముందుగా గ్యాస్ట్రో- ఇంటెస్టినల్ సమస్యగా పరిగణించవచ్చు. కానీ నిజానికి ఇవన్నీ డిప్రెషన్ వల్ల కలగవచ్చు. పైన పేర్కొన్న అనేక సందర్భాల్లో కొన్ని రకాల మానసిక రుగ్మతలు శారీరక లక్షణాలతో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ చికిత్స కోసం డాక్టర్లు కొంత వ్యవధి తీసుకొని అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే జాగ్రత్తపడాలి. మానసిక వ్యాధుల్ని అనుమానించాలి. అరుదైన వ్యాధులు ప్రొగేరియా వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. జనాభాలో 0.1 శాతం కంటే తక్కువ మందిలో కనిపించే వ్యాధులను అరుదైన వ్యాధులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. దాదాపు ఏడువేల వ్యాధులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అరుదైన వ్యాధులుగా గుర్తించింది. ఇవి సర్వసాధారణమైన వ్యాధులు కావు గనుక వీటిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వైద్యుల సంఖ్య కూడా తక్కువే. అందువల్ల కొన్ని అత్యంత అరుదైన వ్యాధులను వైద్యపరీక్షల ద్వారా గుర్తించడానికే ఒక్కోసారి చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఈలోగా అలాంటి వ్యాధులతో బాధపడే రోగులకు జరగాల్సిన అనర్థం కాస్తా జరిగిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాధులకు గురైన వారిలో మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటోందని ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్డీఐ) వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ విజయ్ చంద్రు చెబుతున్నారు. మన దేశంలో సుమారు ఏడు కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు అత్యంత అరుదైన వ్యాధుల గురించి... ప్రొగేరియా జన్యులోపం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. దాదాపు 80 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. ముసలితనం వల్ల వచ్చే అన్ని సమస్యలూ వీరిని చిన్న వయసులోనే చుట్టుముడతాయి. ఫలితంగా వారు త్వరగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సా పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులో లేవు. వాటర్ ఎలర్జీ హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా వాటర్ ఎలర్జీతో బాధపడే రోగులను ఇప్పటి వరకు 31 మందిని మాత్రమే గుర్తించారు. నీరు ప్రాణాధారం. అలాంటి నీరే కొందరికి సరిపడదు. స్నానం చేయడానికి ఒంటి మీద నీళ్లు పోసుకుంటే చాలు ఎలర్జీ మొదలవుతుంది. ఒంటి మీద నీళ్లు పడిన నిమిషాల వ్యవధిలోనే ఒంటిపై దద్దుర్లు వచ్చేస్తాయి. డిస్టిల్ చేయని నీటిలోని అయాన్లు కొందరిలో ఎలర్జీ కలిగిస్తాయి. ఆల్స్ట్రామ్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలలో ఈ వ్యాధితో బాధపడే 502 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. జన్యువుల్లో తలెత్తే అసహజమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది సోకిన వారు బాల్యంలోనే స్థూలకాయులవుతారు. అంతేకాక రెటీనా దెబ్బతిని క్రమంగా అంధులవుతారు. చిన్న వయసులోనే టైప్2 డయాబెటిస్ సోకడంతో పాటు లివర్, కిడ్నీ లాంటి అవయవాలు విఫలమై మరణానికి చేరువవుతారు. మైక్రోసెఫాలీ ఇది అత్యంత అరుదైన నాడీసంబంధ వ్యాధి. ఈ వ్యాధిలో గర్భస్థ స్థితిలో ఉండగానే శిశువు మెదడు అసాధారణంగా ఎదుగుతుంది. పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి సోకిన వారి తల చాలా చిన్నగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని నయం చేసే చికిత్స ఏదీ ఇప్పటికీ అందుబాటులో లేదు. అపెండిక్స్ కేన్సర్ పేగుల చివరుండే వృథా భాగం అపెండిక్స్. అరుదుగా దీనికి కేన్సర్ సోకుతుంది. వైద్యపరిభాషలో దీనిని ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అపెండిక్స్లో మొదలైన కేన్సర్ క్రమంగా కడుపులోని ఇతర భాగాలకీ విస్తరిస్తుంది. దీన్ని సీటీ స్కానింగ్తో గుర్తించవచ్చు. అయితే, దీని లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణలో జాప్యం వల్ల అపెండిక్స్ కేన్సర్ రోగుల్లో చాలామంది మృత్యువాత పడుతుంటారు. ‘పా’ అనే హిందీ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రొగేరియా వ్యాధిగ్రస్తుడుగా నటించారు పానకంలో పుడక చక్కెర రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘వేడి వేడి అన్నంలోకి ఇంత ముద్దపప్పు... ఆవకాయ, చారెడు నెయ్యి పోసుకుని’’ తింటే ఉంటుందీ... ‘ఆహా ఏమి రుచి’ అంటూ మైమరచిపోవాల్సిందే! కానీ ఈ కాలంలో చాలామంది ‘మొదటి రెండింటికీ ఓకే గానీ... మరీ చారెడు నెయ్యి..? కొలెస్ట్రాల్ పెరిగిపోదూ..’ అంటూ తల విదిలించేస్తారు! ఒక్క నెయ్యి అనేమిటి? కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, గుండెజబ్బులకు కారణమవుతుందని మనం చాలా రుచులను పోగొట్టుకున్నాం. పాలు మొదలుకొని అన్ని రకాల పదార్థాల్లో కొవ్వులు తక్కువగా ఉండేలా చేసుకుంటున్నాం. ఆరోగ్యం కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం తప్పు కాదు. మరి... గుండెజబ్బులు తగ్గాయా? ఊహూ... చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించిన వారిని, మంచాన పడ్డవారిని మనం చూస్తూనే ఉన్నాం! మరి... సమస్య ఎక్కడుంది? కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... చిక్కంతా చక్కెరలోనే ఉంది! అది 1972. అప్పట్లో బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్ జాన్ యడ్కిన్స్ తన పరిశోధనల ఆధారంగా ‘ప్యూర్... డెడ్లీ అండ్ వైట్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ‘చక్కెర (ఫ్రక్టోస్) శరీరంపై చూపే ప్రభావం గురించి ఏ కొంచెం ప్రపంచానికి చెప్పినా... వెంటనే దానిపై నిషేధం ఖాయం’ అని అంటారు యడ్కిన్. అయితే యడ్కిన్ అనుకున్నట్లు ఫ్రక్టోస్ను నిషేధించకపోగా యడ్కిన్స్పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆహార పరిశ్రమ వర్గాలు ఈయన పరిశోధనలన్నీ బోగస్ అని విమర్శించాయి. ఈ అవమానాల మధ్య చివరకు యడ్కిన్ ఓ అనామకుడిలా 1995లో మరణించారు. ఈ మధ్యలో అమెరికా, బ్రిటన్లు ఆహారంలో కొవ్వును తగ్గించుకోవాలనీ, గుండెజబ్బులకు, మధుమేహానికి దూరంగా ఉండేందుకు అదే మేలైన మార్గమనీ ప్రచారం చేశాయి. ఇంకేముంది అందరూ కొవ్వు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్ డైట్’ వ్యాపార వ్యూహానికి బోల్తా పడిపోయారు. చక్కెర చేదే! అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ లస్టిగ్ అని ఓ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఎండోక్రైనాలజిస్ట్. పిల్లల్లో ఊబకాయం నివారణపై పరిశోధనలు చేస్తూంటారు. ఏడేళ్ల క్రితం ఆయన ‘చక్కెర... ఓ చేదు నిజం’ పేరుతో ఓ ఉపన్యాసమిచ్చారు. యూ-ట్యూబ్లో దీన్ని ఇప్పటివరకూ దాదాపు 60 లక్షల మంది చూశారు. యడ్కిన్స్ చెప్పిన విషయాలనే ఈయనా తన ఉపన్యాసంలో చెప్పినప్పటికీ లస్టిగ్ తన వాదనలన్నింటికీ శాస్త్ర, పరిశోధన ఫలితాలను ఆధారంగా చూపారు. ఆహారం నుంచి కొవ్వు తీసేస్తే దాని రుచి మొత్తం పోతుంది కాబట్టి... దాని స్థానంలో చక్కెర మోతాదును ఎక్కువ చేయడం వల్లనే ప్రస్తుతం అమెరికాతోపాటు చాలా దేశాల్లో ఊబకాయం సమస్య పెరిగిపోతోందని, ఇది గుండెజబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తోందని ఆయన సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇంతకీ చక్కెర ఏం చేస్తుంది? జంక్ఫుడ్ కేటగిరీలోకి వచ్చే చాలావరకూ ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో సుక్రోజ్, హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్లు అధిక మోతాదుల్లో ఉంటాయి. ఈ రెండు తీపి పదార్థాల్లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అనే రెండు రకాల చక్కెరలుంటాయి. బంగాళ దుంపలతోపాటు అనేక రకాల కాయగూరలు, పండ్ల ద్వారా గ్లూకోజ్ లభిస్తుంది. జీవక్రియలకు అవసరమైన శక్తిని కణాలు గ్లూకోజ్ రూపంలోనే తయారు చేసుకుంటాయి. శరీరంలో లివర్ ఒక్కటే అధిక మోతాదులో ఫ్రక్టోస్ను జీర్ణం చేయగలదు. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు లివర్ దాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఈ కొవ్వు వెరీ లో-డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్గా శరీరంలోకి చేరుతుంది. ఫలితంగా రక్తంలోని కొలెస్ట్రాళ్ల సమతౌల్యం దెబ్బతింటుంది. అంతేకాదు... యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ఫ్రక్టోస్ ప్రేరేపించి రక్తపోటు అధికమయ్యేలా చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతూ ఊబకాయం, మధుమేహ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది. కొవ్వులు తింటే లావెక్కుతారా? ఆహారం ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్కూ, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మోతాదుకూ ఏ మాత్రం సంబంధం లేదని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. రోజుకు ఒకటి నుంచి పాతిక వరకూ కోడిగుడ్లు తినేవాళ్ల బ్లడ్ కొలెస్ట్రాల్ మోతాదుల్లో పెద్దగా మార్పుల్లేనట్లు గుర్తించారు. అదే సమయంలో చక్కెర దుష్ర్పభావాలపై గత దశాబ్ద కాలంలో ఎన్నెన్నో అధ్యయనాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ విభాగం 2008లో అన్ని రకాల లో-ఫ్యాట్ డైట్లపై విశ్లేషణ జరిపింది. ఆహారం ద్వారా తీసుకునే కొవ్వుల ద్వారా గుండెజబ్బులు, కేన్సర్ వస్తాయనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొవ్వులు తింటే లావెక్కుతారనే వాదనలో పసలేదని పలు తాజా అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. వెన్న, నెయ్యి, గుడ్లు లాంటివి తినడం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఈ అధ్యయనాలు నిగ్గు తేల్చాయి. నిజానికి రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. విషయం ఏంటంటే మితంగా తింటే ఏ గొడవా ఉండదు. - డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి వైస్ ఛైర్మన్ అండ్ సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్కు వచ్చిన వాళ్లకు కొద్దిగా ఫ్యాట్, అప్పుడప్పుడూ కొద్దిగా ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు అని చెబితే... అన్నీ గుర్తుంచుకుంటారు కానీ... ఆ ‘కొద్దిగా’ అన్నమాట మరచిపోతుంటారు. ఆరోగ్యానికి జీవనశైలిలో బాలెన్స్ ముఖ్యమైనది. ఆ సమతౌల్యతను ‘మితం’ తోనే సాధించగలరు. రోజూ రీసెర్చ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఆ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా, విచక్షణతో వాడుకుంటేనే ఆరోగ్యం మహా భాగ్యంగా ఉంటుంది. కొత్త మోత పాత రోత ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న 40 కొత్త వ్యాధులు ఆస్పత్రుల్లో ఉండే అనేక రకాల రోగకారక క్రిముల వల్ల వచ్చే వ్యాధులైన ‘నోటోకోమియల్ ఇన్ఫెక్షన్స్’ పెచ్చుమీరుతున్నాయి. అంటే జబ్బు తగ్గడానికి హాస్పిటల్కు వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే, ఆ ప్రాంతమే మళ్లీ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందన్నమాట! ఐదేళ్లలో పపంచంలో 1100 చోట్ల ఉత్పాత స్థాయిలో (ఎపిడమిక్స్ రూపంలో) వ్యాధుల విజృంభణ కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరగని ‘జికా’ వంటివి వస్తున్నాయి. మరో కొత్త వ్యాధి ‘ఎబోలా’ ప్రపంచాన్ని గడగడ వణికించేసింది. గతంలోనూ అంతే... ఆంథ్రాక్స్ అనీ, సార్స్ అనీ, మ్యాడ్ కౌ అనీ, చికన్గున్యా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ అనీ... ఒక్కో సీజన్కు ఒక్కో వ్యాధి విజృంభించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్ల్లుగా... ఈ కొత్త వ్యాధులకు మరికొన్ని పాత వ్యాధులే కొత్త రూపాలను ధరించి వచ్చేశాయి. ఉదాహరణకు రెసిస్టెంట్ వెరైటీ టీబీ, బర్డ్ ఫ్లూ, స్వైన్ఫ్లూ వంటివి తమ జన్యు స్వరూపాలూ మార్చుకొని విరుచుకుపడుతున్నాయి. సప్తసముద్రాలు దాటేస్తున్నాయి! గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ వ్యాధి అయినా, ప్రపంచంలో ఎక్కడ మొదలైనా అది ఒక మహమ్మారిలా వ్యాపించి, ఉత్పాతం సృష్టిస్తోంది. జికా వైరస్కి సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. అది మహమ్మారిలా విస్తరిస్తుండడంతో ప్రపంచదేశాలు ఉలిక్కి పడ్డాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచంలోని ఏదో ఒక చోట వ్యాపించే ఒక కొత్త వ్యాధి మిగతా ప్రాంతాల నుంచి ‘కొన్ని గంటల దూరంలోనే’ ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ డెరైక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమె పేర్కొన్నదాని ప్రకారం ఒక తరం కిందటి వారు ఏ మాత్రం ఎరగని 40 రకాల కొత్త జబ్బులను ఆ తర్వాతి తరం వారు చవిచూశారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచం 1100 చోట్ల జబ్బుల వ్యాప్తి ఉత్పాతాలను (ఎపిడమిక్స్... అంటే జబ్బు మనుషులను తుడిచిపెట్టినట్లుగా ఒక ప్రదేశంలో వ్యాపించడాన్ని) చవి చూసింది. ఇప్పుడు బ్యాక్టీరియా జీవులు మరింత బలం పుంజుకోవడం వల్ల ఒక రకం నిమోనియాను కలిగించే క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ అనే ప్రజాతి (జీనస్)కి చెందిన సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వాలూ జాగ్రత్తలు తీసుకోవాలి! విస్తరించే వ్యాధులు సాధారణంగా వాటంతట అవే కొంత సమయం తర్వాత కట్టుబడుతుంటాయి. అయితే ఇలా అవి స్వాభావికంగా కట్టుబడకుండా ఉండడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు సురక్షితమైన మంచి నీరు లేకపోవడం, రోజురోజుకూ పెరిగే కాలుష్యాల వల్ల పరిసరాలు అనారోగ్యకరంగా మారుతుండడం, సంపద అందరికీ అందకపోవడం వల్ల పేదలలో జీవన ప్రమాణాలు దిగజారుతుండడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. దీనికి తోడు మారిపోతున్న వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారాలు, పాశ్చాత్య జీవనశైలి వంటివి ఈ వ్యాధులకు ఊతమిస్తున్నాయి. పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న మురుగునీటి పెరుగుదల, నీళ్లు కలుషితం కావడం వంటివి కొత్త వ్యాధులు మరింత వేగంగా విస్తరించేలా చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ అంశాలను పర్యవేక్షించడానికీ, కొత్త వ్యాధుల విస్తరణలపై నిఘా పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఎపిడమిక్ అండ్ ప్యాండమిక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు అప్పగించింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అంశాలను తెలుసుకోడానికి ఒక ఉదాహరణ. ప్రపంచంలోని 25 శాతం జనాభా ఫ్లూ వ్యాధికి గురవుతోంది. ఫ్లూను కలిగించే వైరస్లలో కలిగే ఉత్పరివర్తనాల వల్ల మందులకు లొంగని మ్యూటెంట్ వెరైటీ ఇన్ఫ్లుయెంజాలు ఏర్పడితే అది ముప్పుగా పరిణమించవచ్చు. ఇదే జరిగితే ఆ దేశం కునారిల్లే లోపే ఆ పెనుముప్పు ఎపిడమిక్ రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలనూ చుట్టుముడుతుంది. అది సమస్త మానవాళినీ తుడిచిపెట్టే అవకాశమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. డబ్ల్యూహెచ్ఓ వార్షిక నివేదిక చెబుతున్నదిదే... * 20వ శతాబ్దంలోనే కనిపించకుండా పోయాయనుకున్న కలరా, ఎల్లో ఫీవర్, ఎపిడమిక్ మెనింగోకోకల్ వ్యాధులు (బ్రెయిన్ ఫీవర్ / మెదడువాపు) మళ్లీ వెలుగు చూస్తున్నాయి. * వైరస్ ద్వారా సంక్రమించే ఎబోలా, మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్, నిఫా వైరస్ లాంటివి ఇప్పుడు మానవాళి అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి. - డాక్టర్ మార్గరెట్ చాన్ డబ్ల్యూ.హెచ్.ఓ డైరెక్టర్ జనరల్ -
చేతులు శుభ్రంగా ఉంటే 80 శాతం రోగాలు రావు!
తిక్క లెక్క కొందరిలో ఆత్మారాముడు చాలా చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి కడుపులో పడేస్తూ ఉంటే కానీ, స్థిమితంగా ఉండలేరు వారు. అయితే ఆకలి వేస్తోంది కదా అని, చేతులు కూడా కడుక్కోకుండా ఆవురావురుమని తినేస్తే మాత్రం చేజేతులా ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకున్నట్లేనంటున్నారు పరిశోధకులు. అసలు జలుబు సహా పలు ప్రమాదకరమైన వ్యాధులు చేతులు శుభ్రం చేసుకోకుండా తినడం వల్లే వస్తాయట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండడంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఇమిడి ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడం వల్ల అనేకరకాలైన రోగాలను చేతులారా ఆహ్వానించినట్టే. కాబట్టి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నా.. తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిదని, అలా చేయడం వల్ల దాదాపు 80 శాతం రోగాలు రాకుండా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంటోంది. -
పుడమి తల్లి చల్లగా!
-
స్వైన్ఫ్లూ స్వైరవిహారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్ఫ్లూ వ్యాధి పంజా విసురుతోంది. రోజురోజుకూ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ ఏడాది కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,590 మందికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించగా, 556 మందికి స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయింది. అందులో 17 మంది చనిపోయారు. శీతాకాలంలో పగలూరాత్రిళ్లు చలి మరింత పెరుగుతుందని వాతావ రణ శాఖ ప్రకటిస్తున్న నేపథ్యంలో స్వైన్ఫ్లూ మరింత ప్రబలే ప్రమాదముందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది స్వైన్ఫ్లూపై విస్త్రృత ప్రచారం జరిపిన ప్రభుత్వ యంత్రాంగం ఈసారి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. గతంలో ముఖ్యమంత్రి ఏకంగా ప్రత్యేక మంత్రిమండలి సమావేశం నిర్వహించి స్వైన్ఫ్లూ నియంత్రణపై యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కానీ ఈసారి స్వైన్ఫ్లూ నియంత్రణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికీ కార్యక్రమాల రూపకల్పన చేయనేలేదు. హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, సినిమాహాళ్లు ఇలా అనేక రద్దీ ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు కరపత్రాలు, వాల్పోస్టర్లు, సినిమా థియేటర్లల్లో స్లైడ్ల ద్వారా ప్రచారం చేయాలి. కానీ ఇటువంటి చర్యలేవీ లేవు. సర్కారు ఆదేశాలు బేఖాతర్..! ‘ఎవరైనా స్వైన్ఫ్లూ అనుమానంతో కార్పొరేట్ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే వారికి చికిత్స ప్రారంభించాలి. స్వైన్ఫ్లూ ఉందో లేదో నిర్దారించే పరీక్షలను తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మం దులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వారికి ఉచితంగా ఇవ్వాలి.’అని వైద్య, ఆరోగ్యశాఖ గతంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ ఆసుపత్రులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ నిర్దారణ పరీక్ష చేయాలంటే రూ.3,500 ఖర్చు అవుతుంది. రెండేళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ల పైబడి వయస్సున్న వారికి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అటువంటివారు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ, లివర్, షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎక్కువ నీరు తాగాలి. శీతాకాలంలో ఫ్లూ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే ఆసుపత్రిల్లో పరీక్షలు చేయించుకోవాలి. స్వైన్ఫ్లూ ఉన్నవారు మాస్కులు ధరించాలి. -
విశాఖకు సుస్తీ..!
డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలు అర్బన్లో పెరిగిన వ్యాధులు విశాఖకు సుస్తీ చేసింది. రకరకాల జ్వరాలు, జబ్బులతో సతమతమవుతోంది. కాలంతో నిమిత్తం లేకుండా పలు వ్యాధులతో జనం అవస్థలు పడుతున్నారు. రోజూ వేలాది మంది రోగాలతో ఆస్పత్రుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. మౌలిక వసతులు అంతగా ఉండని గ్రామీణ ప్రాంతాలకంటే సకల సదుపాయాలూ ఉన్న అర్బన్ పరిధిలోనే డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తుండడం విశేషం. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ దాడి చేస్తున్న జ్వరాల తీరుతెన్నులపై ఈ కథనం..! - సాక్షి, విశాఖపట్నం కొన్నాళ్లుగా విశాఖను విషజ్వరాలు, చికున్గున్యా జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. జిల్లాలో పల్లెల్లోనూ, నగరంలోని వార్డుల్లోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత ఏడాదికంటే ఈ సంవత్సరం వీటి తీవ్రత మరింత అధికమవుతోంది. ఇంకా వర్షాలు పూర్తిస్థాయిలో ఊపందుకోకముందే జ్వరాలు, రోగాల తీవ్రత ఇలా ఉంటే వానాకాలం మొదలైతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది మొత్తమ్మీద 381 డెంగ్యూ కేసులు, 87 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు డెంగ్యూ కేసులు 173, చికున్ గున్యా జ్వరాలు 45 కేసులు రికార్డయ్యాయి. అలాగే గత సంవత్సరం 8410 మంది మలేరియాతో బాధపడగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 9119 మంది బారినపడ్డారు. అయితే అనధికారిక రోగ పీడితుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇక ప్రాణాంతక డెంగ్యూ జ్వరాలు నగరంలో కొద్ది రోజుల నుంచి తిష్టవేసి కూర్చున్నాయి. ముఖ్యంగా గాజువాకలోని అఫీషియల్ కాలనీ, కుంచుమాంబ కాలనీ, అజీమాబాద్, డ్రైవర్స్ కాలనీ, టీడీపీ కాలనీ, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాలు, పెదగంట్యాడ మండలంలో పలు గ్రామాల్లోను, మధురవాడలోని మారికవలస, రాజీవ్ గృహకల్ప, కొమ్మాది, పీఎంపాలెం, పెందుర్తి మండలం కోట్నివానిపాలెం, బంధంవాని పాలెం, సబ్బవరం మండలం మొగలిపురం, గోపాలపట్నం ఇందిరానగర్, లక్ష్మీనగర్, ప్రహ్లాదపురం, అడవివరం తదితర ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు బాధిస్తున్నాయి. కొన్ని చోట్ల అదుపులోకి వచ్చినా కొత్తగా మరికొందరికి డెంగ్యూ సోకుతోంది. డెంగ్యూతో జిల్లాలోనూ, నగరంలోనూ ఇప్పటిదాకా పదిమందికి పైగానే మృత్యువాతపడ్డారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కరే మరణించినట్టు తేల్చారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా నమోదయిన 173 డెంగ్యూ కేసుల్లో 125 కేసులు (ఆగస్టులో 41, సెప్టెంబర్లో 47, అక్టోబర్లో 37) కావడం విశేషం. ఇక ఎపిడమిక్ సీజనుగా భావించే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 7787 మందికి సోకగా, సీజను ముగిసిన ఈ రెండు నెలల్లో ఇప్పటివరకు 1332 కేసులు నమోదయ్యాయి. మలేరియా జ్వర లక్షణాలతో ఒక్క మన్యంలోనే 25 మర ణాలు సంభవించినా అధికారికంగా ఒక్క మరణాన్ని కూడా చూపడం లేదు. ప్రస్తుతం మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. మన్యం లో మలేరియా అదుపులోకి వచ్చిందనుకుంటున్న తరుణంలో తాజాగా సోమవారం అనంతగిరి మండలం కాశీపట్నంలో చేపల దారప్ప మలేరియా లక్షణాలతో మరణించడం మళ్లీ కలకలం రేపుతోంది. చోడవరం, బుచ్చియ్యపేట, రావికమతం, మాడుగుల, నర్సీపట్నం, మాకవరపాలెం తదితర మండలాల్లో విష జ్వరాలు జోరుగా ఉన్నాయి. జ్వర బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నివారణ చర్యలు జిల్లా కంటే అర్బన్ లోనే డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. దోమకాటుతో వచ్చే డెంగ్యూ వల్ల ఇళ్లలోనూ, బయట నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. ఇందుకోసం ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటించాలని కోరుతున్నాం. ప్రజల్లో అవగాహనకు, గ్రామా ల్లో పారిశుద్ధ్యం, కాలువల్లో పూడికతీత తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, నగర, పురపాలక సంఘా ల్లో మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చాం. అవసరమైతే యాంటీ లార్వల్ ఆపరేషన్ చేపడ్తాం. -సరోజిని, డీఎంహెచ్ఓ -
మీకు పుణ్యం ఉంటుంది!
అనారోగ్యంతో మృతి చెందిన భర్త క్యాన్సర్ వ్యాధితో భార్య మంచంపట్టి ఉన్న పెద్దకుమార్తె మగ దిక్కులేని కుటుంబం తల్లడిల్లుతున్న పిల్లలు మరో జన్మ లేకపోవడమే మోక్షం.అలాంటి మోక్షం కోసం మనిషి తపిస్తాడు. ఏదీ... మనలాగా కొద్దోగొప్పో మంచి జీవితం ఉన్నవాళ్లే తపిస్తారు. ఓ రకంగా మనం మోక్షం కోరుకోవడం అత్యాశేనేమో! కానీ... చిట్టెమ్మలాంటి వాళ్లు మళ్లీ మనిషి పుట్టుక వద్దు అని కోరుకోవడం ఆశ కాదు... అవసరం అనిపిస్తుంది. మూట కట్టుకున్న పుణ్యం వల్ల మోక్షం కలుగుతుందో లేదో తెలియదు కానీ... చిట్టెమ్మకు ఇవాళ్టి కష్టాల నుండి మోక్షం కలిగించగలిగితే మనం తప్పకుండా పుణ్యం మూటకట్టుకుంటాం. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి వ్యాధులు ఆవేదనను మిగిల్చాయి. పెద్ద కుమార్తె మతిస్థిమితం లేకుండా, అవయవాలు పనిచేయకుండా మంచానికే పరిమితమైంది. అంతుచిక్కని వ్యాధితో నాలుగేళ్ళ క్రితం భర్త మరణించాడు. గర్భసంచి క్యాన్సర్ సోకి ఆమె తల్లడిల్లుతోంది. వైద్యం చేయించుకునేందుకు చేతులో చిల్లిగవ్వ లేక సమాజం వైపు నీరింకిన కళ్ళతో చూస్తోంది. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టలేని దీనస్థితిలో ఆ తల్లి కుమిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి గాథ ఇది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముర్తిపేట సత్తిబాబు, చిట్టెమ్మలు పొట్టకూటి కోసం పాతికేళ్ళ క్రితం వేలేరుపాడులో ఓ రైస్మిల్లులో పనిచేయడానికి వచ్చారు. అప్పటి నుండి ఇక్కడే స్థిరపడిపోయారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. అంతుచిక్కని రోగాలు... పెద్ద కుమార్తె దుర్గ. ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. మతిస్థిమితం లేదు. నడుము, కాళ్లు పనిచేయవు. దీంతో లేవలేని స్థితిలో ఉన్న ఆమెకు తల్లి వెంటే ఉండే సపర్యలు చేయాలి. అయినా భర్త ఉన్నన్నాళ్లూ పిల్లల పోషణ చిట్టెమ్మకు భారం కాలేదు. కానీ, నాలుగేళ్ళ క్రితం అంతుచిక్కని వ్యాధితో భర్త సత్తిబాబు మృతి చెందాడు. పుట్టెడు శోకంతో బతుకుబండి లాగుతున్న చిట్టెమ్మకు ఆ తర్వాతి ఏడాదే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని తెల్సింది. ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించాలో, తనకు వైద్యం ఎలా చేయించుకోవాలో... దిక్కుతోచలేదు చిట్టెమ్మకు. అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి మూడునెలలకోసారి వెళ్లి, వైద్యం చేయించుకునేది. చార్జీలకు డబ్బుల్లేక... ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం ఉచితమే అయినా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ ఆసుపత్రికి వెళ్లాలంటే ఆమెకు పోను పోను భారంగా మారింది. మూడునెలలకొకసారి కోబాల్ట్ కీమోథెరపీ చేయించుకోవాలి. బస్సుచార్జీలకు కూడా డబ్బుల్లేక వైద్యం మానుకొని ఇంటి వద్దనే ఉంటోంది. సరైన వైద్యం అందక ఆరునెలల నుంచి ఒంటి నిండా కురుపులు వచ్చాయి. నీరసించి నడవలేకపోతోంది. గతంలో కుటుంబ పోషణ కోసం కూలి పనికె ళ్లేది. ఇప్పుడు కూలిపనులకు వెళ్లలేని పరిస్థితిలో పెద్దకూతురు దుర్గకు కాపలాగా ఉంటోంది. వారంలో నాలుగు రోజులు పస్తులే... ఈ కుటుంబానికి తెల్లరేషన్ కార్డు ఉండటంతో నెలకు 20 కేజీల బియ్యం వస్తున్నాయి. పెద్ద కుమార్తె దుర్గకు వికలాంగుల పెన్షన్ కింద నెలకు 15 వందల రూపాయలు వస్తాయి. వేలేరేపాడు మండలం ఆంధ్రప్రదేశ్లో విలీనమైనప్పటి నుంచి ఇక్కడ వితంతు పెన్షన్లు అందడం లేదు. ఆ విధంగా చిట్టెమ్మకు ఆ ఆసరా కూడా లేకపోయింది. కేవలం 1500 రూపాయలతోనే ఇల్లు గడవాలి. ఉన్న కాసిన్ని డబ్బులు దేనికీ సరిపోవడం లేదని మందులూ కొనడంలేదు. ఇవే నెలంతటికీ సరిపోక వారంలో నాలుగురోజులు పస్తులుంటున్నారు. మధ్యాహ్న భోజనానికే పాఠశాలకు... చిట్టెమ్మ రెండవ కుమార్తె పరిమళ. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 6వ తరగతి, చిన్నకూతురు మరియమ్మ నాలుగవ తరగతి చదువుతూ తల్లికి అండగా ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో పరిమళ, దుర్గ పాఠశాలకు వెళ్తున్నారు. వారిద్దరికీ ఒక పూట భోజనం అక్కడే గడిచిపోతోంది. కానీ, రాత్రులు పస్తులు ఉన్న రోజులు ఎన్నో. అక్క దుర్గకు కూడా భోజనం పాఠశాల నుంచే తీసుకెళ్తారు. సంతలో కుళ్లిన కూరగాయలు... ప్రతీ శుక్రవారం వీరి ఇంటికి దగ్గరలో వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతలో కూరగాయలు అమ్మే వ్యాపారులు సంతలో అమ్మగా, అందులో కుళ్ళిన కూరగాయలను అక్కడే పడేస్తారు. వీటిని పరిమళ, మరియమ్మలు సేకరించుకొని ఇంటికి తీసుకెళ్తారు. వాటినే వండుకొని తింటున్నారు. - ఎం.ఏ.సమీర్, సాక్షి, వేలేరుపాడు ఎవరూ లేరు... నాకు అయినవారు ఎవరూ లేరయ్యా! నా భర్త బతికి ఉన్నంతకాలం బాగానే గడిచింది. అంతుచిక్కని జబ్బుతో మంచం పట్టాడు. ఆయన్ను బతికించుకోవడం కోసం కూలి పనులు చేసి, ఎంతో కష్టించా. అయినా బతికించుకోలేకపోయాను. ఆయన చనిపోయాక, నాకు క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడు పోతానో తెలియదు. నా పిల్లల కడుపుకింత తిండిపెట్టలేక నరకయాతన పడుతున్నా. నా బాధను ఆ దేవుడే తీర్చాలి...!! (కన్నీళ్లతో చెప్పింది చిట్టెమ్మ) - చిట్టెమ్మ చేయూతనందించాలనుకునే వారికోసం... చిట్టెమ్మ ముత్తుపేట - A.C.No.: 73054816819 IFSC Code: SBIN0RRAPGB ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్బ్యాంక్ (NGB), వేలేరుపాడు బ్రాంచ్. ఫోన్ నెం: 9666368979 చూసి చలించా... ఈ కుటుంబానికి వచ్చిన కష్టం పగవారికి కూడా రావద్దని మొక్కనివారు లేరు ఇక్కడ. మూడేళ్ళుగా ఈ కుటుంబం పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తున్నా. పస్తులున్న రోజున బియ్యం, కూరగాయలు ఇస్తూ వచ్చాను. చిట్టెమ్మకు వైద్యం అందేలా, ఆ పిల్లలకు ఇంత అండ దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - కొండేపూడి విజయ్కుమార్, వేలేరుపాడు వాస్తవ్యుడు -
మానసిక ఒత్తిడితో గుండెజబ్బులు వస్తాయా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్ డెంగీ జ్వరానికి, స్తైన్ఫ్లూకి నివారణ, చికిత్స ఆయుర్వేదంలో ఉన్నాయా? తెలుపగలరు. - ఎ.పార్వతీశం, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్ కొన్ని జ్వరాలను సాంక్రమిక వ్యాధులుగా వర్ణించి, జనపదోధ్వంసానికి దారితీస్తాయని వక్కాణించింది ఆయుర్వేదం. సాధారణంగా త్రిదోషాల కలయికతో వచ్చే రోగాలలో చికిత్స కష్టతరమవుతుంది. డెంగీ, స్తైన్ఫ్లూలు ఈ కోవ కు చెందినవే. డెంగీ: ఈ జ్వరంలో ఉన్న లక్షణాలను పరిశీలిస్తే, ఆయుర్వేద సూత్రాల రీత్యా వాత శ్లేష్మాలు అధికంగా ఉంటూ, పిత్తానుబంధంగా ఉండే సన్నిపాత జ్వరాన్ని పోలి ఉంటుంది. ఈ వ్యాధిలో, రక్తంలో ప్లేట్లెట్లు బాగా తగ్గిపోవడం ఒక అంశం. దీనివల్ల రక్తస్రావం బహిర్గతమై, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. నివారణ: దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలి. వేపాకులు, ఆవాలు, ఇంగువ కలిపి పొగబెడితే (ధూపనకర్మ), క్రిమిహరంగానూ, దోమల నాశనానికీ ఉపకరిస్తుంది. చికిత్స: ప్రత్యేకించి డెంగీ వ్యాధి మీద ఆయుర్వేద ఔషధాలను పరిశోధన జరిపి, కచ్చితంగా ఫలానా ఫలితాలు వచ్చాయని నిరూపణ జరిగిన దాఖలాలేమీ లేవు. అలాంటి ప్రకటనలు చేసే కువైద్యులు, సాధువులు, బాబాల చిట్కాలకు మోసపోకూడదు. జ్వరహర మూలికలు, కషాయాలు, ఇతర మందులను ఆయుర్వేద శాస్త్రంలో కూలంకషంగా వర్ణించారు. దోషప్రాబల్యాన్ని బట్టి ఈ ఔషధులు మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన మందుల ప్రస్తావన మాత్రమే ఉంది. అవి... 1. తిప్పతీగ (గుడూచి), పిప్పలీమూలం, శుంఠి కషాయం 30 మి.లీ. రెండుపూటలా తాగాలి. 2. తిప్పతేగ, కరక్కాయ కషాయం. మందుల షాపుల్లో లభించేవి: మృత్యుంజయ రస మాత్రలు ఉదయం 1, రాత్రి 1 (5రోజులు) అమృతారిష్ట ద్రావకాన్ని నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి. చంద్రకళారస మాత్రలు ఉదయం 1, రాత్రికి 1 మోతాదులో 5 రోజులు వాడితే ప్లేట్లెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పైన చెప్పిన కషాయాలు, నివారణార్థం వాడినా తప్పులేదు. స్తైన్ఫ్లూ: ఈ లక్షణాలు, ఆయుర్వేద సూచనల రీత్యా, శ్లేష్మ వాత ప్రధానంగా, పిత్తానుబంధంగా ఉన్న సన్నిపాతజ జ్వరాన్ని పోలి ఉంటుంది. చికిత్స: అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్కల కషాయాన్ని 30 మి.లీ. రోజూ మూడుసార్లు తాగాలి. త్రిభువన కీర్తరస మాత్రలు ఉదయం 1, రాత్రి 1. ఐదు రోజులు. వ్యోషాది వటి మాత్రలు పూటకి రెండు, 3 పూటలా. నివారణ: పైన చెప్పిన కషాయం, వ్యోషాదివటి మాత్రలు వాడుకుంటే ప్రయోజనకరం. నష్టం లేదు. (కాకపోతే ఈ వ్యాధిపై ప్రత్యేకంగా పరిశోధన జరిపి తెల్పిన ఫలితం కాదు). గమనిక: చిన్న పిల్లలకు పెద్దవారికిచ్చే మోతాదులో సగం ఇస్తే చాలు. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 32. గత ఐదేళ్లుగా మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నాను. మా టార్గెట్ పూర్తి కాకపోతే తీవ్ర ఒత్తిడికి గురువుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటోంది. గుండెదడతో పాటు కళ్లు తిరిగినట్లు అనిపిస్తోంది. నాకు గుండెజబ్బు ఉందా అని అనుమానం కలుగుతోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి. - మదన్రెడ్డి, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు చాలా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉండటం వల్ల గుండె స్పందన తీరులో మార్పులు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఎక్కువగా మీ లక్ష్యాల గురించి ఆలోచించడం వల్ల, అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలా తీవ్రంగా ఒత్తిడికి గురికావడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగానీ ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే మరింత త్వరగా మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి. వారు సూచించిన వైద్యపరీక్షలు చేయించుకొని, ఏదైనా వ్యాధి ఉంటే దాన్ని త్వరగా నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే గుండె రక్తనాళాలు పూడుకుపోతే నడుస్తున్నప్పుడు ఆయాసం, ఛాతీలో నొప్పి, కళ్లుతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిసేపు విరామం తీసుకుంటే మళ్లీ సాధారణంగా మారతారు. అయితే రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోతే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జబ్బును మొదటి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స తీసుకుని, ఆరోగ్యంగా జీవించవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు ప్రశాతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిళ్లకు లోనుకావద్దు. రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం, వాకింగ్ చేయడం గుండెకు చాలా మంచిది. యోగా, ధ్యానం వంటి మానసిక ప్రశాంతత చేకూర్చే ప్రక్రియలను అవలంబించండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46. చాలా ఏళ్లుగా ఎసిడిటీతో బాధపడుతున్నాను. 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలూ ఉన్నాయి. తగిన పరిష్కారం చెప్పండి. - నితీశ్, విజయవాడ మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. నా వయసు 28. నాకు కడుపులో నొప్పి వచ్చి, నా బరువు తగ్గింది. డాక్టర్ను కలిస్తే చిన్న పేగుల్లో టీబీ వచ్చిందని చెప్పారు. ఆర్నెల్లు మందులు వాడాను. అయితే టీబీ పూర్తిగా తగ్గిందా లేదా అనే సందేహం ఉంది. చిన్నపేగులకు టీబీ వస్తే మందులతో తగ్గుతుందా? - రవికుమార్, నిడదవోలు మందులు తీసుకోవడం వల్ల టీబీ పూర్తిగా నయమవుతుంది. ఒక్కోసారి టీబీ అదుపులోకి వచ్చినా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన వద్దు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న పేగుల టీబీ వల్ల పేగుల్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించి, తగిన సూచనలు తీసుకోండి. మా బాబు వయసు పదేళ్లు. ఎనిమిదేళ్ల వయసులో పచ్చకామెర్లు వచ్చాయి. నెల రోజుల్లో వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం మళ్లీ కళ్లు రెండు పచ్చగా కనిపిస్తున్నాయి. తగిన సలహా ఇవ్వండి. - సంతోష్రెడ్డి, కర్నూలు ఈ వయసులో పచ్చకామెర్లు రావడానికి ముఖ్యంగా హెపటైటిస్ ఎ, ఈ అనే వైరస్లు కారణం కావచ్చు. ఇంతకుముందు ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు కాబట్టి అదే వైరస్ మళ్లీ సోకే అవకాశం చాలా అరుదు. కారణం... ఒకసారి ఏదైనా వైరస్ సోకినప్పుడు మన శరీరంలో దాని పట్ల రోగనిరోధక శక్తి వృద్ధిచెందుతుంది. కాబట్టి మీ బాబుకు కామెర్లు వచ్చాయంటే దానికి ఇతర కారణాలు (అంటే విల్సన్స్ డిసీజ్ లాంటివి) ఏవైనా ఉన్నాయా అని చూడాలి. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నాయా అన్న వివరాలు రాయలేదు. మీరు నిపుణులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కు చూపించి, తగిన పరీక్షలు చేయించుకుంటే బాబు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. -
కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు
-
కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు
స్టాక్హోమ్: దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా, ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం, మలేరియా జబ్బులను నయంచేసే ఔషధాలను ఆవిష్కరించి వైద్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన ఐర్లాండ్కు చెందిన విలియం కాంబెల్, జపాన్కు చెందిన సతోషి ఒమురా, చైనాకు చెందిన య్యూయు తులకు నోబెల్ అవార్డు వరించడం ఎంతైనా ముదావహం. వాస్తవానికి వారికి ఎప్పుడో నోబెల్ అవార్డును ఇవ్వాల్సింది. ఏలికపాము (రౌండ్వామ్ పారసైట్స్) పరాన్న జీవుల కారణంగా అంధత్వం, బోదకాలు లాంటి జబ్బులు వస్తాయి. పరాన్న జీవుల జీవనక్రమాన్ని దెబ్బతీసి వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే 'అవర్మెక్టిన్' అనే డ్రగ్ను కనుగొన్నందుకుగాను విలియం కాంబెల్, సతోషి ఒమురాలకు సంయుక్తంగా సగం నోబెల్ ప్రైజ్ లభించింది. మలేరియాను అరికట్టే మెడిసిన్ 'ఆర్టేమిసినిన్'ను కనుగొన్న చైనాకు చెందిన మహిశా శాస్త్రవేత్త య్యూయు తునకు మిగతా సగం నోబెల్ ప్రైజ్ మనీ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది. వైద్యరంగ చరిత్రలోనే ఈ రెండు ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బోదకాలు, మలేరియా కారణంగా కోట్లాది మంది ప్రజలు మృత్యువాత పడేవారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్న డ్రగ్స్ ఈ వ్యాధులను అరికట్టడంలో విశేష పాత్ర వహించాయి. చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్’ విభాగంలో పనిచేస్తూ చైనా సంప్రదాయ ఔషధ మొక్కల నుంచి ‘ఆర్టెమెసినిన్’ అనే డ్రగ్ను 84 ఏళ్ల య్యూయు తు కనుగొన్నారు. 1930లో జన్మించిన ఆమె 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో చేరారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును 523 అని పిలిచేవారు. రహస్యంగా జరిగిన ఈ పరిశోధనల్లో ఆమె స్వయంగా శరీరంలోకి మలేరియా పరాన్న జీవిని ఎక్కించుకున్నారు. తన ఏకైక కూతురును నర్సరీ హోంలో వదిలేసి ప్రాజెక్టులో పాల్గొన్నారు. ఓ దశలో మలేరియా కారణంగా చిక్కి శల్యమైన తనను చూసి తన కూతురు కూడా తనను గుర్తుపట్టలేక పోయిందని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. 'మానవాళి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలది. ఆ విషయంలో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నన్ను చదివించిన నా దేశానికి ఈ రీతిగా రుణం తీర్చుకున్నాను' అని ఆమె మలేరియా డ్రగ్ను కనుగొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను వైద్యరంగ నిపుణులు ఇప్పటికీ గుర్తు చేస్తారు. -
ఇటు స్వైన్ఫ్లూ.. అటు డెంగీ
మళ్లీ విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు తాజాగా ఐదు స్వైన్ పాజిటివ్ కేసులు నమోదు చికిత్సల పేరుతో రోగుల నిలువు దోపిడీ ఆందోళనలో గ్రేటర్ వాసులు సిటీబ్యూరో: గ్రేటర్పై మళ్లీ వ్యాధులు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ... డెంగీ విజృంభిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ వైరస్ స్వైర విహారం చేస్తోంది. గ్రేటర్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1082 స్వైన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముషీరాబాద్కు చెందిన అక్తర్బేగం(52) ఇటీవల మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గురువారం మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ కేర్లో మహిళ(62), ఆర్కేపురంలోని సుప్రజ ఆస్పత్రిలో పురుషుడు(31), ముషీరాబాద్ కేర్లో పురుషుడు(36), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు (22,28) గాంధీలో చికిత్స పొందుతున్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపగా... స్వైన్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో రోగుల నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. మృతి చెందిన 3 రోజుల తర్వాత ... స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడం లేదు. గాంధీలో రోగులను చేర్పించుకొని... అనుమానిత కేసుగా భావించి చికిత్స చేస్తున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి... ఐపీఎంకు పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అటు నుంచి రిపోర్టు వచ్చే సమయానికే రోగులు మృత్యువాత పడుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గాంధీలో చేరిన అక్తర్బేగం నుంచి సకాలంలోనే న మూనాలు సేకరించి పరీక్ష కోసం ఐపీఎంకు పంపినట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితురాలు చనిపోయిన మూడు రోజుల తర్వాత ఐపీఎంకు నమూనాలు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డెంగీ పేరుతో నిలువు దోపిడీ స్వైన్ ఫ్లూతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 111 డెంగీ కేసులు నమోద య్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు స్వయంగా జిల్లా వైద్యాధికారులే అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం ‘ఐజీఎం ఎలిసా’ టెస్టును డెంగీ నిర్ధారణకు ప్రామాణికంగా ప్రకటించింది. కానీ నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ‘ఎన్ఎస్ 1’ టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను సైతం డెంగీ జ్వరాలుగా చూపుతున్నారు. శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిందనే పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. సాధారణ జ్వరాలను సైతం డెంగీగా చూపిస్తూ రోగులను మోసగిస్తున్న ఆస్పత్రులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒకచోట కూర్చొని పని చేయడం... మహిళల్లో మరీ ప్రమాదకరం!
కొత్త పరిశోధన ఒకచోట కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల జీవనశైలికి సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తాయని ఇప్పటికీ నిరూపితమైంది. ఇది పురుషుల కంటే మహిళల్లో మరీ ప్రమాదమని పరిశోధనలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. అదేపనిగా ఆరు గంటల పాటు కూర్చొని పనిచేసే మహిళల్లో మిగతా మహిళలతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం 10 శాతం ఎక్కువ. (అది ఏ రకమైన క్యాన్సర్ అయినా కావచ్చు). ఇక ఇలా కదలకుండా కూర్చొని ఉండే మహిళల్లో మల్టిపుల్ మైలోమా వచ్చే అవకాశాలు 65 శాతం ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. నడుస్తూ ఉండేవారు, చురుగ్గా ఉండే మిగతా మహిళలతో పోలిస్తే ఇలా ఆరుగంటల పాటు కూర్చొని ఉండే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు 10 శాతం ఎక్కువ. ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 43 శాతం అధికం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ వివరాలన్నింటినీ ఇటీవలే ‘క్యాన్సర్ ఎపిడిమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ అనే మెడికల్ జర్నల్లో పొందుపరిచారు. -
రోగాల పంజా!
సంతకవిటి మండలంపై రోగాలు దాడి చేశాయి. కృష్ణంవలసలో విషజ్వరాలు ప్రబలగా, పోతు రాజుపేటలో డయేరియా విజృంభించింది. దీంతో పలువురు మంచం పట్టారు. సంతకవిటి : కృష్ణంవలస గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. జ్వరాలు విజృంభించి వారం కావస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడం, వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వంజరాపు సుహాసిని, చిన్నప్పమ్మ, ఎస్.దుర్గమ్మ, రామకృష్ణ, వంకల దాలమ్మ, పాలిన వెంకమ్మ, పాపారావు, వంకల పాపమ్మ, వంకల సాయి, పిన్నింటి సూరమ్మ, లక్ష్మి, రాము, అంజలి, అసిరమ్మ తదితరులు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. వీరిలో కొంతమంది రాజాం, శ్రీకాకుళం వెళ్లి చికిత్స పొందుతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, కాళ్లు.. చేతులు పీకడంతో పాటు తలనొప్పి అధికంగా ఉంటుందని జ్వరపీడితులు చెబుతున్నారు. రోజురోజుకూ జ్వర పీడితులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచం పడుతున్నారు. స్థానికంగా వైద్యం అందకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా, ఆర్థికంగా ఉన్నవారు రాజాం, శ్రీకాకుళం ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామ రహదారి పూర్తగా పాడవ్వడంతో 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతురాజుపేటలో డయేరియా పోతురాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. టంకాల మహేశ్వరరావు, పోతురాజు యోగీశ్వరరావు, వేణునాయుడు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడు, డి.ల క్ష్మిలతో పాటు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో పోతురాజు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడుల పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం కుటుంబీకులు వీరిని ప్రైవేట్ వాహనంలో శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కృష్ణంవలస, పోతురాజుపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆరోగ్యానికి పారాహుషార్!
మనం కాస్త పరాకును వదిలి అప్రమత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన ఉదాసీనతను వీడి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులు దేశాన్ని చుట్టుముట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రజలకు తెలియజెప్పే సంకల్పాన్ని తీసుకుంది ‘సాక్షి’. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్ ‘సాక్షి వెల్నెస్ ఎక్స్పో’ పేరిట భారీ ప్రదర్శనను, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా సాక్షి మీ ముందుకు తెస్తున్న మరణమృందంగ ఘంటికా రావాల శబ్దాలివి. ఇవి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం మాత్రమే. అవగాహన పెంచుకొని రాబోయే ముప్పును మనమంతా ఎదుర్కోవడం కోసమే. ఆనాడది అంతు చిక్కని కాలం! ఒకప్పుడు అది అంటురోగాల కాలం! యాంటీబయాటిక్స్ కనిపెట్టని కాలంలో అంటువ్యాధులంటే అంతుచిక్కని వ్యాధులే!! మశూచీ, ప్లేగు, కలరా లాంటి వ్యాధులు అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేవి. ఇలా ముట్టుకున్న వెంటనే అంటుకునే సాంక్రమిక వ్యాధులు యాంటీబయాటిక్స్ కనిపెట్టాక అదుపులోకి వచ్చాయి. అంటే మనం పురోగమించాం. అన్ని రకాలుగా! ఎన్నో చిరుతిండ్లు... కానీ పోషకాల్లేవు. ఎన్నో సుఖాలు... కానీ శారీరక శ్రమ లేదు. ఎన్నో వినోదాలు... కంటి నిండా నిద్ర లేదు. ప్రస్తుతం జీవనశైలి వ్యాధుల తీవ్రదశ కొనసాగుతోంది. అందుకే వీటి గురించి అవగాహన పొంది, నివారణ కోసం ఉద్దేశించిన కథనమిది... ఆధునిక జీవనశైలి... అనారోగ్య కారణం ఆధునిక జీవనశైలితో వచ్చిన మార్పులు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న మాట ఇది. ఈ అనారోగ్యాలు ప్రమాదకరమైన వేగంతో విస్తరిస్తూ పోతున్నాయి. ప్రస్తరిస్తూ పెరుగుతున్నాయి. పెచ్చరిల్లుతున్నాయి. కునారిల్లజేస్తున్నాయి. కూలిపోయేలా, జీవితాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులివే... డయాబెటిస్ (మధుమేహం) హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) స్థూలకాయం థైరాయిడ్ సమస్యలు ఎముకలు పెళుసుబారి పుట్టుక్కున విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ పెద్దపేగు, ఊపిరితిత్తులు... మొదలైన అన్ని రకాల క్యాన్సర్లు సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు సంతానలేమి విటమిన్ డి లోపాలు, దాని వల్ల వ్యాధినిరోధకశక్తి లోపించి వచ్చే అనేక రకాల వ్యాధులు విటమిన్ బి12 లోపాలు గుండెజబ్బులు. ఎందుకిలా జీవనశైలి వ్యాధులు తీవ్రతరమవుతున్నాయి? డెబ్బయిల తర్వాత మన జీవనశైలిలో వచ్చిన వేగవంతమైన మార్పులతో ఈ వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతోంది. వ్యాధుల తీవ్రత పెరగడానికి దోహదపడుతున్న ఆధునిక మార్పులివే... నగరీకరణ : మంచి చదువులు, మంచి ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పల్లెలు వదిలి నగరాలకు రావడం పెరిగింది. అంతేకాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ నగరీకరణ పోకడలు పెరిగాయి. దాంతో పట్టణల్లోనే కాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ కాలుష్యం పెరగడం, ఆకుపచ్చదనం తగ్గడం, ఆటలాడటానికి అనువైన స్థలాల లేమి వంటివి పెరిగాయి. ఇవన్నీ అనారోగ్యానికి దోహదం చేసే అంశాలే. ఆహారపు అలవాట్లు : మనం తినే ఆహారంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోయాయి. ఇందులో పోషకాల కంటే రుచి కోసం కొవ్వు, క్యాలరీలే ఎక్కువ. ఇక ఈ నవీనకాలంలోని వ్యయసామర్థ్యాలను పెంచుకోవడం కోసం భర్తా, భార్య... ఇద్దరూ సంపాదిస్తున్నారు. దాంతో మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేసుకునే సమయం లేక ఏదో సమయానికి ఎంతో కొంత కడుపులో పడేలా చూసుకుంటున్నారు. అంతే తప్ప... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. శారీరక శ్రమ లేకుండా ఎప్పుడూ కూర్చొని ఉండే జీవనశైలి : ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాలా రకాల ఉపాధి అవకాశాలు దాదాపుగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఐటీ ఉద్యోగాల వంటి వాటిల్లో 10 - 12 గంటలు కూర్చొనే ఉండాల్సినవే. రైతులు, పొలాల్లో పనిచేసే వారు మినహా మిగతావారంతా దాదాపుగా ఎక్కువసేపు కూర్చొనే పనిచేస్తుంటారు. వాహన సౌకర్యాలు : గతంలో మన తండ్రులు, తాతలు నడుస్తూనో లేదా సైకిల్ మీదో కార్యాలయాలకు వెళ్లేవారు. కానీ ఇటీవల శరీర శ్రమకు ఏమాత్రం ఆస్కారం లేని వాహన సౌకర్యాలే ఎక్కువ. నడవడానికి అవకాశం దాదాపు లేదు. ఇక ఇంట్లో ఉన్నా సరే... గతంలో ఉన్న కార్యకలాపాలు కాస్త ఒంటికి పనిచెప్పేవిగా ఉండేవి. కానీ ఇటీవల ఇంట్లో మనం వ్యవహరించే తీరుతెన్నుల్లోనూ మార్పు వచ్చింది. పని పేరిట ల్యాప్టాప్ మీద, వినోదం పేరిట టీవీ స్క్రీన్ మీద నిలిపి, శరీరాన్ని ఏ సోఫా మీద వదిలేస్తున్నాం. పైగా ఇదే సమయంలో ఏదో నములుతూ ఉండిపోతున్నాం.ఈ ఆధునిక అవలక్షణాలన్నింటితోనూ వ్యాధులకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం... ఆ అనువైన ఆవాసమే - మన శరీరం! ఒత్తిడితో చిత్తుచిత్తుగా ఓటమి : ఇటీవల దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంది ‘ఒత్తిడి’. అది పని ఒత్తిడి కావచ్చు. ఇంట్లోని ‘డొమెస్టిక్ ఒత్తిడి’ కావచ్చు. వీధిలో ‘సామాజిక ఒత్తిడి’ కావచ్చు. ఇలా ఒత్తిడి బారిన పడని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. పైగా పనిగంటలూ మారిపోయాయి. దాంతో అనాదిగా మనిషి విశ్రాంతి కోసం ప్రకృతి నిర్దేశించిన సమయం సైతం ఒత్తిడిని కలిగించి అనేక శారీరక, మానసిక రుగ్మతలకు తావిస్తోంది.వేళకు తినకపోవడం, ఏది పడితే అది తినడం, వేళలు తప్పి పనిచేయడం, వేళలు తప్పి నిద్రపోవడం లాంటి అన్ని అంశాలూ కలగలసిపోయి, కలగాపులగమై మనిషిని వ్యాధులకు గురిచేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులతో జీవితంపై ఎంత భారం...? ఎంత బరువు? ఊబకాయంతో బతుకు బరువు! ఆధునిక జీవనశైలి వల్ల మన జీవితం అన్ని విధాలా ఎంత భారమవుతోందో గ్రహించడానికి ఒక్క స్థూలకాయ సమస్యే చాలు. ఒక్క ఒళ్లు బరువైపోతే జీవితంలోని ఎన్నో అంశాలు బరువైపోయినట్లే! ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య 1980 నుంచి 2014 నాటికి రెట్టింపు అయ్యింది. పద్ధెనిమిదేళ్లు దాటిన వారిలో ప్రస్తుతం 11 శాతం మంది పురుషులుంటే మహిళల్లో 18 శాతం మంది ఊబకాయులే.2013 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షలమంది పసిపిల్లలంతా ఊబకాయులే. ఇలా పిల్లల్లో ఊబకాయం సమస్య ఇంతగా పెచ్చరిల్లుతుంటే తొలిలెక్కల్లో 34 ఏళ్ల వ్యవధిలోనే స్థూలకాయుల సంఖ్య రెట్టింపైనప్పుడు 2013 నాటి లెక్కల ప్రకారం వీళ్లంతా తమ ఒంటినే పెద్దబరువుగా పరిగణిస్తూ బతుకును ఈడుస్తూ ఉంటారు. ఇప్పుడు కాస్త మంచి ఆహారం అందుబాటులో ఉన్న దేశాలలో, ధనిక దేశాలతో పాటు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం మూడో వంతు మంది చిన్నారులు చాలా భారంగా తమ బతుకులను ఈడుస్తూ జీవించబోతున్నారు. చేదుగా అనిపించినా ఇది భవిష్యత్తు నిజం. గడగడలాడించే డయాబెటిస్ గణాంకాలు : డయాబెటిస్ ప్రపంచాన్ని ఎంతగా గడగడలాడిస్తుందో చెప్పడానికి మాటలక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒకరో, ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉండనే ఉంటారు. డయాబెటిస్ సభ్యులు లేని కుటుంబమే భారత్లో లేదంటే అది అతిశయోక్తేమీ కాదు. గణాంకాల్లో చెప్పాలంటే... 2000 నాటికి మన దేశంలో 62 లక్షల మంది డయాబెటిస్ రోగులు ఉండేవారని అంచనా. ఇవాళ్టికి ఆ సంఖ్య 3.17 కోట్లకు చేరి, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. (2.08 కోట్లతో రెండో స్థానంలో చైనా, 1.77 కోట్ల మందితో యూఎస్ మూడోస్థానంలో ఉన్నాయి). అయితే కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే పాశ్చాత్యదేశాలను అధిగమించేలా మన దగ్గరి రోగుల సంఖ్య ఇంత తీవ్రంగా పెరిగిందంటే మనం ఏ మేరకు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఆ సంఖ్య 36.6 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఇప్పుడున్న జనాభాలో మూడో వంతు డయాబెటిస్ రోగులు ఉంటారంటే వణుకు పుట్టడం లేదూ! పైన పేర్కొన్న అనారోగ్య పరిస్థితులన్నీ భారత్లో ఈ వ్యాధి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడానికి దోహదం చేస్తోంది. కేవలం గతంలో పెద్దల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి, ఇప్పుడు టైప్-1 రూపంలో పిల్లల్లోనూ కనిపిస్తోంది.ఇక డయాబెటిస్కు దగ్గర్లో (బార్డర్లైన్లో) ఉన్న రోగుల సంఖ్యకు లెక్కేలేదు. ఒక నిర్దిష్టమైన అంచనా కూడా లేదు. అయితే ఇంతగా వణికించే పరిస్థితులున్నా ఈ బార్డర్లైన్ రోగులకు ఇంకా ఆరోగ్యస్పృహ లేక, ఆహార నియమాలు, లేక వాకింగ్ వంటి పరిమిత వ్యాయామాలపై దృష్టి లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కేవలం నడక, వేళకు సరైన భోజన నియమాలు అనే చిన్న జాగ్రత్తతో ఇందులో ఎంతోమంది తమ డయాబెటిస్ను చాలావరకు నివారించుకోవచ్చు. లేదా వీలైనంత ఆలస్యం చేయవచ్చు. పోటెత్తుతున్న రక్తపోటు రోగుల సంఖ్య రక్తపోటు వ్యాధికి సెలైంట్కిల్లర్ అని పేరు. చాపకింద నీరులా వచ్చే ఈ వ్యాధి కొందరిలో మూత్రపిండాలూ, కాలేయం, చివరికి మెదడు దెబ్బతిని పక్షవాతం అనే రోగాలను తెచ్చిపెట్టేంత వరకూ దీని ఉనికే తెలియదు. ఆరోగ్యస్పృహ లేకపోవడం, ఆరోగ్యవిషయాలపై అవగాహన లేకపోవడంతో మన దేశంలోని చాలామందిలో దీని ఉనికి తెలిసేనాటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. కొందరు గుండెపోటుతోనో, మరికొందరు మతిమరపుతోనో, ఇంకొందరు మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతిని డయాలసిస్ చేయిస్తూనో లేక అంధత్వంతోనో బతుకీడుస్తుంటారు. లేదా కొందరు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా రక్తపోటు పెరుగుతోంది. పద్దెనిమిదేళ్లు దాటిన చాలామందిలో ఇది మామూలుగా ఉండాల్సిన 120/80 చోట 140/90 ఉంటోంది. 2014 నాటికి మన దేశంలో 22 శాతం మందిలో రక్తపోటు పెరిగిపోయి బాధపడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో, అది చేయబోయే నష్టం ఏ మేరకు ఉండబోతుందో ఊహించుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలతోనే దీన్ని చాలావరకు అరికట్టవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, తాజాపండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం ఉంటే తగ్గించుకోవడం, పొగతాగే అలవాటు, మద్యం మానేయడం చేస్తే చాలు, రక్తపోటుతో వచ్చే అనర్థాలు చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యంగా బతకవచ్చు. కానీ అనివార్యంగా పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీని పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. క్యాన్సర్లు : ఎవరైతే పొగాకు వినియోగాన్ని తొందరగా మానుతున్నారో, వారికి పొగాకు కారణంగా వచ్చే క్యాన్సర్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. బ్యాలెన్స్డ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటెజీ... యువతరం మాత్రమే కాక పెద్దవారు సైతం పొగతాగడం మానేయడంవల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతున్నారని తెలిపింది. అదేవిధంగా కిడ్నీ, మూత్రాశయ, ఓరల్ కావిటీ, ఇసోఫేగస్, ఉదరం, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను కూడా నివారించవచ్చునని తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారు 50 సంవత్సరాల వయసు లోపే ఆ వ్యసనాన్ని విడిచిపెడితే వారి జీవితకాలం కొద్దిగా పెరుగుతుంది. అలాగే 30 సంవత్సరాల లోపు విడిచిపెడితే వారి జీవితకాలం మరికాస్త పెరుగుతుంది. అసలు ఆ అలవాటే లేనివారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. అత్యధికంగా ధూమపానం చేసేవారిలో, స్త్రీపురుష భేదం లేకుండా 75 సంవత్సరాల వయసున్న వారు 16 శాతం మంది, 50 లోపు వారు 6 శాతం, 30 లోపు వారు 2 శాతం మందికి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. అలవాటును ఎంత త్వరగా మానితే అంత ఎక్కువకాలం జీవించడానికి అవకాశం ఉంది. నివారించలేని జన్యుపరమైన క్యాన్సర్ల వంటివి కేవలం 10 నుంచి 15 శాతం వరకు ఉండగా 80 నుంచి 85 శాతం వరకు క్యాన్సర్లను మన జీవన శైలిని సక్రమంగా మార్చుకుంటే అవి మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడవచ్చు. జీవనశైలి వ్యాధులతో చిన్నవయసులోనే మృతులు 2012లో దాదాపు 5.60 కోట్ల మృతులు అకాలంగా యువతలో సంభవించినవే. ఇందులో 3.8 కోట్లు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సాంక్రమిక వ్యాధులు కాని, జీవనశైలి వ్యాధులు)తో చనిపోయారు. అందులో గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు వంటివాటితో చనిపోయినవారు ఎక్కువ. ఇక వీరిలో 2.8 కోట్లు మనలాంటి మధ్యతరహా ఆదాయవర్గాలకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలవారు లేదా అల్పాదాయ దేశాలకు చెందినవారు. మిగతా కోటి మంది అన్ని అభివృద్ధి చెందిన దేశాలూ కలుపుకొని మృతిచెందినవారు. అంటే మృత్యువు ఇక్కడ ఎంత విచ్చలవిడిగా నాట్యమాడుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇవే గణాంకాలను ప్రాతిపదికగా ఇలా జీవనశైలిలో మృతిచెందేవారిలో గుండెపోటుతో చనిపోయే వారు 46.2 శాతం, క్యాన్సర్లతో చనిపోయేవారు 21.7 శాతం, శ్వాసకోశవ్యాధుల (ఆస్తమా, సీఓపీడీ)తో మృతిచెందే వారు 10.7 శాతం, డయాబెటిస్తో చనిపోయే వారు 1.5 శాతం. గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు, డయాబెటిస్... ఈ నాలుగింటి వాటాయే... మొత్తం జీవనశైలితో చనిపోయే వారిలో 80.1 శాతాన్ని ఆక్రమిస్తోంది.పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యం చాలాకాలం బాగుంటుందనడంలో సందేహం లేదు. హెచ్చరిక... డెబ్బయిలలో వచ్చిన మార్పులు ఎనభైలలో మరింత వేగవంతమయ్యాయి. అంతే తొంభైలు, 2000 నాటికి వీటి వల్ల వచ్చే విపత్కర ఫలితాలు మొదలయ్యాయి. రోగభారంతో పాటు ఇవి ఆర్ధికభారాన్నీ మోపబోతున్నాయి. - 2030 నాటికి జీవనశైలిలో వచ్చే వ్యాధుల కారణంగా ప్రజలు పెట్టే ఖర్చు అక్షరాలా రూ. 222 లక్షల కోట్లు పైమాటే. ఒకనాడు 60, 70 ఏళ్లకు కనిపించే చక్కెర వ్యాధి... ఇప్పుడు పాతిక, ముప్పయ్యేళ్లకే కనిపిస్తోంది. ఇక 2030 నాటికి భారత్లో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య 15 కోట్లకు చేరనుందని అంచనా. 2010 నాటి లెక్కలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య రెండున్నర రెట్లు! ఒకనాడు 50, 60 ల తర్వాత మొదలయ్యే రక్తపోటు... ఇప్పుడు పైలాపచ్చీస్ వయసులోని ఉడుకురక్తానికి చేటు తెచ్చిపెడుతోంది. 2030 నాటికి దేశంలో హైబీపీతో బాధపడేవారి సంఖ్య 23 కోట్లకు పైమాటే.ఆధునిక భారతం రోగగ్రస్తం కాబోతున్న తరుణంలో రాబోయే తరాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సంకల్పాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. జీవనశైలి వ్యాధులతో పోరాటమెలా... గతంలో రాజ్యమేలిన సాంక్రమిక వ్యాధుల తర్వాత ఇప్పుడు వాటి స్థానాన్ని ఆక్రమించిన నాన్కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ)లు... అంటే జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులతో పోరాటం చాలా సులభం.వ్యాధి వచ్చాక క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలోఅప్లో ఉంటూ, వారు చెప్పిన సూచనలు పాటిస్తూ, చికిత్స తీసుకుంటూ ఉండటం. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఇది తప్పనిసరి.వీటిలో చాలావరకు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరమున్నవి. కాబట్టి వీటిభారం సామాన్యులపై చాలా ఎక్కువ. కేవలం ఆర్థికభారం మాత్రమే కాదు... పనిగంటలు వృథా కావడం, చాలా విలువైన మానవవనరులు నష్టం కావడం లాంటి చాలా అనర్థాలు వీటితో వస్తున్నాయి. కాబట్టి అందుకే వ్యాధి రాకముందే నివారించుకోవడం చాలా అవసరం. అందులో భాగంగా... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. మన ఆరోగ్యానికి అదెంతో మేలు. అవేమిటంటే... వేళకు తప్పకుండా భోజనం చేయడం.భోజనంలో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవడం.భోజనంలో కొవ్వులు, నూనెలు, ఉప్పు చాలా పరిమితంగా తీసుకోవడం. సూక్ష్మపోషకాలు అవసరానికి తగినంతగా ఉండేలా చూసుకోవడం. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తింటుండటం, వారంలో కనీసం మూడు నాలుగు రోజులు ఆరోగ్యకమైన ప్రోటీన్ ఉండే చేపలు తీసుకుంటూ ఉండటం. బరువును అదుపులో పెట్టుకోవడం. ఎత్తుకు తగినంత బరువే ఉండేలా జాగ్రత్త పడటం.{Mమం తప్పకుండా వారంలో కనీసం 150 గంటల పాటు తేలికపాటి వ్యాయామాలు అంటే నడక, స్లో జాగింగ్ వంటివి చేస్తూ శరీరానికి తగినంత, ఆరోగ్యకరమైన శ్రమ కలిగించడం. పొగతాగడం, మద్యం తాగడాన్ని పూర్తిగా మానేయడం. ఇలాంటి చర్యలతోనే మున్ముందు రాబోతున్న ముప్పును నివారించగలం. -
వ్యర్థ వేదన
కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె చెత్త కుప్పలుగా పట్టణాలు తుతూమంత్రంగా {పత్యామ్నాయ చర్యలు రంజాన్ దృష్ట్యా కొన్ని చోట్ల పట్టు సడలించిన కార్మికులు జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధులు తిరుపతి నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో రోడ్లపైనే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారాయి. దీనికితోడు జిల్లాలో వర్షం కురుస్తుండడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్ధ్యంపై పెను ప్రభావం చూపుతోంది. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్మికులు మదనపల్లెలో రెండు రోజులపాటు సమ్మె సడలించారు. చిత్తూరు కార్పొరేషన్లో మేయర్ కఠారి అనురాధ జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. శ్రీకాళహస్తిలో బుధవారం సాయంత్రమే సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరారు. పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు వంట వార్పు చేసి ఆందోళన చేపట్టారు. తిరుపతి నగరంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలో యాత్రికులను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. పుంగనూరు కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రెండురోజుల్లో సమస్యను పరిష్కరించపోతే పార్టీ తరపున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుత్తూరు, నగరిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగించారు. పొంచిఉన్న వ్యాధులు పేరుకుపోయిన చెత్తకు, వర్షం తోడవడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో అతిసార, టైఫాయిడ్, విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటువ్యాధులు, జ్వరాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. -
రోగాల పుట్ట
జిల్లాలో విజృంభిస్తున్న వ్యాధులు గతేడాదితో పోలిస్తే ప్రమాదకరంగా పెరుగుదల దోమల నివారణ చర్యలు నామమాత్రం విశాఖపట్నం: జిల్లా వాసులను రోగాలు పట్టిపీడుస్తున్నాయి. మైదానం, ఏజెన్సీ అనే తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 5వేల మంది మలేరియా బారిన పడ్డారు. 36 డెంగ్యూ, 11 చికెన్గున్యా కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ ఉనికిని చాటుకుంటోంది. దాదాపు 4వేల మంది దీనికి గురయ్యారు. ఫైలేరియా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతున్నప్పటికీ ప్రభుత్వం, వైద్యఆరోగ్య శాఖ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. మలేరియా కారక దోమల నివారణ మందు ఈ ఏడాది 2505 గ్రామాల్లో పిచికారీ చేయాలని ఆశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం 299 గ్రామాల్లోనే పిచికారీ పూర్తి చేశారు. అధికారుల పోకడకు ఇది అద్దం పడుతోంది. జిల్లాలో వ్యాపిస్తున్న వ్యాధుల్లో మొదటి స్థానం మలేరియాదే. 2013లో జిల్లాలో ఈ కేసులు 5950 నమోదయ్యాయి. 2014కి ఆ సంఖ్య 8410కి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ (జూన్ నెలాఖరు నాటికి)4901 మంది మలేరియా బారిన పడ్డారు. వీటిలో ఏజెన్సీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అక్కడ 2013లో 2414 మందికి, 2014లో 5250 మందికి, ఈ ఏడాది 3948 మందికి మలేరియా సోకింది. రూరల్ ఏరియాలో 366, అర్బన్ ఏరియాలో 587 మలేరియా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. తర్వాత స్థానంలో టైఫాయిడ్ ఉంది. ఈ ఏడాది దాదాపు 4వేల మందికి ఈ వ్యాధి సోకింది. ఇప్పటివరకూ జిల్లాలో 256 మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా వారిలో 36 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది. 147 రక్త నమూనాల పరీక్షల్లో 11 మందికి చికెన్గున్యా కనిపించిం ది. ఫైలేరియా ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ గతేడాది 7 కేసులు, ఈ ఏడాది 2 కేసులు వెలుగుచూశాయి. రోగాలు ఇంత దారుణంగా వ్యాపిస్తున్నటికీ వైద్య, ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని హ్యూమన్రైట్స్ ఫోరం పరిశోధనలో వెలుగుచూసింది. ఇటీవల ఫోరం సభ్యులు ఏజెన్సీలోని 9 మండలాల్లో పర్యటించినప్పుడు దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ఉత్తరాంధ్రలో 1999లో 4500 మంది గిరిజనులు మలేరియాతో చనిపోయారు. 2005, 2010 మధ్య వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలుషిత తాగునీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, దోమల నుంచి రక్షణ లేకపోవడం, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారని పలు అధ్యయనాలు నిరూపించాయి. ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా అధికారులు, పాలకులు కళ్లు తెరవడం లేదు. -
రోగాల ముసురు
- మన్యంలో విజృంభిస్తున్న టైఫాయిడ్, మలే రియా - గతేడాది కన్నా ఈ ఏడాది పెరుగుతున్న కేసులు - ఏరియా ఆస్పత్రికి జ్వరపీడితుల తాకిడి పాడేరు/పాడేరు రూరల్ : ఆదివాసీల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పాలకుల్లో చిత్తశుద్ధిలోపంతో ఆరోగ్య పథకాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఎపిడమిక్తో మన్యాన్ని వ్యాధులు చుట్టేస్తున్నాయి. డయేరియా, మలేరియా, విషజ్వరాలు జడలు విరబోసుకుంటున్నాయి. వాతవరణంలో మార్పులు, గూడేల్లో కొరవడిన పారిశుధ్యం, కలుషిత తాగునీటి కారణంగా వందలాది మంది మంచాన పడి అల్లాడిపోతున్నా రు. ఏజెన్సీ 11 మండలాల్లో 3574 గ్రామాలున్నాయి. ఏటా ఎపిడమిక్లో ఇక్కడ పరిస్థితి అదుపుతప్పడం, మరణాలు చోటుచేసుకోవడం పరిపాటి. వివిధ సర్వేలు దీనిని నిర్థారిస్తున్నాయి. జీకేవీథి మండలం దారకొండ పంచాయతీ చాకిరేవుగెడ్డలో బి.దిలీప్కుమార్(18), పెద్ద గంగారంలో లక్ష్మి అనే ఆరేళ్ల బాలిక మలేరియా లక్షణాలతో బాధపడుతూ గురువారం చనిపోయారు. ఆరోగ్యశాఖ ఇంతవరకు వీటిని అధికారికంగా గుర్తించ లేదు. రాయిగెడ్డ ఆశ్రమపాఠశాలకు చెందిన 12మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా పరీక్షల్లో ముగ్గురికి మలేరియాగా తేలింది. ఏజెన్సీలోని 36 పీహెచ్సీల పరిధిలో జూన్నెలాఖరుకు 4191 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది ప్రబలుతున్న వ్యాధులకు అద్దం పడుతోంది. మలేరియా జ్వరాలు వెలుగులోకి వచ్చాకే ఆయా గ్రామాలు, పాఠశాలల్లో వెద్యసేవలు కల్పిస్తున్నారు. అపరిశుభ్రత కారణంగా మన్యంలో దోమల బెడద ఎక్కువ. మూడేళ్ల క్రితం ఐటీడీఏ పంపిణీ చేసిన దోమతెరలు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ దోమల నివారణ మందు మలాథియాన్ పూర్తిస్థాయిలో పిచికారీ చేపట్టలేదు. రెండో విడత స్ప్రేయింగ్ కేవలం 429 గ్రామాల్లో పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని 2,505 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. ఈ కారణాలతో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆశ్రమాలు, హాస్టళ్ల విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే సుమారు 350 మంది ఓపీకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏరియా ఆస్పత్రిలో 2487 మంది జ్వరపీడితుల నుంచి రక్త పూతలు సేకరించగా 150మందికి టైఫాయిడ్, 46 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారణ అయింది. ఎపిడమిక్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గిరిజన సంఘం ఇటీవల గ్రామాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇదే వ్యక్తమైంది. గతేడాది కన్నా ఈ ఏడాది జ్వరాల తీవ్రత అధికమని నిర్ధారించారు. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ఆరోగ్య అభివృద్ధి వేదిక రాష్ట్ర సలహాదారుడు ఎం. గేయానంద్ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పీహెచ్సీల్లో మందుల కొరత పలు పీహెచ్సీల్లో మందుల కొరత ఉంది. మినుములూరు పీహెచ్సీ ఇందుకు తార్కాణం. ఈ పీహెచ్సీకి నిత్యం రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. డైక్లోఫిన్, ఐవీ, సిలైన్ బాటిళ్లు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎస్.రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ, ఎంఎం శ్రీను ఈ పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న మందుల వివరాలను సేకరించారు. రోగులతో రద్దీగా ఉండే ఈ పీహెచ్సీలో పిల్లలకు అవసరమైన సిరప్లు, యాంటీ బయాటిక్ మాత్రలు, పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేవని గుర్తించారు. -
పొగచూరకు... మసిబారకు!!
సిగరెట్ల వల్ల నష్టాలు ఎన్ని రెట్లు అన్నది చెప్పడానికి ఎన్ని సెట్ల ఇంటర్నెట్లు అయినా సరిపోవు.పొగచెట్ల వల్ల ఎన్ని వ్యాధులు కట్లు విప్పుకుంటాయో నమోదు చేయడానికి కంప్యూటర్ బైట్లూ చాలవు.వ్యసనం వదిలిపోకుండా ఉండటానికి పొగాకులోని నికోటిన్ మెదడుపై చేసే మాయలను రాయడానికి ఎన్ని పెన్నులైనా సరిపోవు.అయినా... ఓసారి పొగాకు ఆరోగ్యానికి పెట్టే చికాకును చూస్తే ఎవరైనా దాన్ని వదిలేయాల్సిందే.మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా పొగాకు హెల్త్కు కల్పించే చిరాకును తెలుసుకొని, దాన్ని వదిలించుకుంటారనే ఆశతో, ఆశయంతో ఈ కథనం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది చేటు. సిగరెట్టు ఆరోగ్యంపై వేటు. చుట్ట చుట్టలు చుట్టుకొని ఉన్న విషం నిండిన పాముల చుట్ట. రోగాల పుట్ట. గుట్కాతో ప్రాణాలు గుటుక్కు. నశ్యం వదిలేయడం అవశ్యం. పొగాకు చేసే చెరుపు గురించి, ఆ వ్యాధులు పుట్టించే వెరపు గురించి అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలివి. ఈ సందర్భంగా పొగాకు హెల్త్ను దగా చేసే ఆకు ఎలాగైందో చూద్దాం. ఊపిరితిత్తులకు : పొగ పీల్చగానే నేరుగా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ముక్కు మొదటి అంతస్తు అనుకుంటే గాలిమార్పిడి జరిగే ‘ఆల్వియోలై’ అనే గాలి గది 28వ అంతస్తు. అక్కడ గాలి మార్పిడి... అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అంది, మలినమైన కార్బన్డై ఆక్సైడ్ మార్పిడి ‘ఆల్వియోలై’ అనే గాలిగదిలో జరుగుతుంది. కానీ పొగలో ఉండే కార్బన్మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాల వల్ల ఆ గాలిగది స్వరూపమే మారిపోతుంది. వాస్తవానికి అక్కడ హిమోగ్లోబిన్ అనే వాహకం మీద ఆక్సిజన్ చేరి శరీరంలోని అన్ని కణాలకూ అందాలి. కానీ పొగాకులోని విషపదార్థాల్లో ఉండే కార్బన్మోనాక్సైడ్... హీమోగ్లోబిన్తో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో రక్తంలోని హీమోగ్లోబిన్కు ఆక్సిజన్ను మోసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఎలాంటి బంధమంటే చెడు స్నేహాల వల్ల మంచి స్నేహితుడు దూరమయ్యే పరిస్థితి లాంటిది. దీంతో శరీరంలోని అన్ని కణాలూ కార్బన్మోనాక్సైడ్తో విషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసిమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ వస్తాయి. ఫలితంగా కొద్దిదూరం కూడా నడవలేని పరిస్థితి. కదిల్తే నీరసం, నడిస్తే ఆయాసం. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గు. పొగాకులో ఉండే ‘ఆక్రోలిన్’ అనే అత్యంత విషపదార్థం సీఓపీడీని కలిగించడమే కాదు... క్యాన్సర్కూ కారణమవుతుంది. అంతేకాదు... సిగరెట్ పొగలో ఉండే పాలీసైక్లిక్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజోపైరీన్, నైట్రోజమైన్ ఇవన్నీ క్యాన్సర్ను కలిగించేవే. ఇక క్యాన్సర్ కారక గుణాలతో పాటూ రేడియో యాక్టివ్ గుణాలున్న సీసం (లెడ్-210), పొలోనియం లాంటివీ పొగలో ఉండి జీవితాన్ని పొగచూరిపోయేలా చేస్తాయి. తల నుంచి కాలిగోటి వరకు పొగాకు వల్ల జరిగే నష్టాలను స్పర్శిస్తూ పోదాం... తల : సిగరెట్ను నోట్లో పెట్టుకుని కాల్చే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందొక్కటే. సిగరెట్ మండే చివరను అగ్నిపర్వతపు మండే భాగం (బర్నింగ్ ఎండ్), దాని చివరన వెలువడే నుసి అగ్నిపర్వతపు బూడిద అనుకుంటే... ఆ సిగరెట్ వెలువరించే ‘లావా’... బయటివైపునకు కాకుండా శరీరం లోపలి వైపునకు ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. అలా సిగరెట్ వల్ల నోట్లోకి వచ్చే లావా రాళ్లనూ కరిగించుకున్నట్లుగా మన చెంపల లోపలి పొరను దెబ్బతీస్తుంది. మెత్తనైన చిగుర్లను కరిగించివేస్తుంది. అందుకే చిగుర్లు కరిగిపోతాయి కాబట్టి పళ్లు ఎక్కువగా బయటపడతాయి. ఇలా చిగుర్లు కరగడాన్ని ‘జింజివల్ రిసెషన్’అంటారు. పళ్లరంగు మారిపోతుంది. నోటిలోపలి మృదువైన పొరలు దెబ్బతిని పుండ్లలా (మ్యూకోజల్ లీజన్స్) మారడమే కాదు, ఆ ప్రాంతంలో క్యాన్సర్లూ వస్తాయి. ఇలా వచ్చేముందర సిగరెట్ పొగ తాలూకు ప్రభావంతో నోటిలోపల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వాటినే ‘ల్యూకోప్లేకియా’ అంటారు. ఈ ల్యూకోప్లేకియా మచ్చలు క్యాన్సర్ ఆవిర్భావానికి తొలి రూపాలు. చిగుర్లపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం జరుగుతుంది. నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్కు దారితీయవచ్చు. వేడిలావాలా విషాలు నోట్లోకి ప్రవహించడం వల్ల నోట్లోని లాలాజలం ఆవిరైపోతుంది. అది తగ్గడంతో నోట్లో విషక్రిములూ, దుర్వాసనా... ఒకటేమిటి అన్నీ అనర్థాలే. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫేగస్... ఇలా నోటి పొరుగున ఉన్న ప్రతి భాగమూ క్యాన్సర్కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతు : నోటి తర్వాత గొంతు భాగానికి వస్తే... గొంతులో ఉండే ప్రతి అవయవమూ మళ్లీ పొగ బారిన పడి క్యాన్సర్కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతునుంచి ఊపిరితిత్తులోకి వెళ్లే బ్రాంకియా... ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని పై అవయవాలన్నింటికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె : సిగరెట్ పొగ మన గుండెకు చేసే చెరుపూ అంతా ఇంతా కాదు. సిగరెట్ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపు తప్పి పెరిగిపోతుంది. పదినిమిషాల పాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ సిగరెట్ వల్ల కలుగుతాయి. గుండె, రక్తప్రవాహవ్యవస్థ (హార్ట్ అండ్ కార్డియోవ్యాస్క్యులార్ సిస్టమ్)కు జరిగే నష్టాలను చూస్తే... సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది (విస్కాసిటీ పెరుగుతుంది). దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్యన రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా... ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. ఇదే పరిణామం గుండెకు రక్తసరఫరా చేసే కరొనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. ఇక ఇదే రకమైన ప్రమాదం మెదడుకూ ఉంది. మన శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందజేసే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, లేదా ఇతర రక్తనాళాల్లోగాని రక్తం చిక్కబడి అక్కడ అది చిక్కుబడితే... మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే ఇక ఆ రోగి జీవితాంతం ఎవరిపైనైనా ఆధారపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అలాంటి దుస్థితి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు... సిగరెట్ పొగ వల్ల మెదడుకు అందే రక్తం తగ్గడం వల్ల ఏదైనా విషయాలను అవగాహన చేసుకునే (కాగ్నిటివ్) శక్తిసామర్థ్యాలు 50 శాతానికి పైగా తగ్గుతాయి. దీర్ఘకాలంలో అవి ప్రపంచంలోని అన్ని విషయాలనూ మరచిపోయేలా చేసే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటికి దారితీస్తాయి. పురుషులకు ప్రమాదాలివే : సిగరెట్ను స్టైల్గా ముట్టించి పొగ వదలడాన్ని పురుషత్వానికి చిహ్నంగా కొన్ని ప్రకటనలలో చూపిస్తారు. కానీ సిగరెట్ పురుషత్వాన్ని కబళిస్తుంది. సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. ఇదే పరిణామం పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో (ఆర్టరీలలో) జరగడం వల్ల అంగస్తంభన సమస్యలు (ఎరక్టైల్ డిస్ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... వీళ్లలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్కౌంట్) గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా తాము గర్వపడే విషయంలోనే గర్బభంగం జరిగే పరిస్థితి సిగరెట్ తెచ్చిపెడుతుంది. బ్లాడర్క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్... ఈ తరహా క్యాన్సర్లన్నింటికీ పొగతాగడం ఒక ప్రధాన కారణం. కాళ్లు : తల నుంచి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇప్పుడు కాళ్ల చివరకు చేర్చుదాం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్’ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బర్జర్స్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల పాదాల చివరకు రక్తం అందకపోవడం అనే పరిణామం ఏర్పడితే పాదం కుళ్లిపోయి, పాదాలతో పాటు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి తెచ్చే దుర్మార్గమైన అలవాటు ఈ పొగతాగడం. ఇలా పొగతాగడం అన్న అలవాటు తల మొదలుకొని కాళ్ల చివరల వరకూ ఉండే ప్రతి అవయవాన్నీ... లోపల ఉండే అన్ని అవయవాలను అంటే... కాలేయం, ప్యాంక్రియాస్, చిన్నపేగులు, పెద్దపేగులు, కోలోరెక్టల్... ఇలా నోటి నుంచి మొదలుకొని జీర్ణవ్యవస్థలోని చివరి భాగం వరకూ ఏ అవయవానికైనా క్యాన్సర్ కలిగించే గుణం పొగాకుకు ఉంది. మహిళలకూ ఎంతో కీడు : ఇక మహిళల విషయంలోనూ సిగరెట్ పొగ అంతే కీడు చేస్తుంది. ఒక కుటుంబంలో పురుషులు తాగే సిగరెట్ పొగ కేవలం వారిని మాత్రమే కాదు... వారి జీవిత భాగస్వామినీ అంతే తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు తాగే సిగరెట్ తాలూకు కాలేచివరి నుంచి వచ్చే పొగ, పీల్చాక ఊపిరితిత్తుల్లోంచి వచ్చే పొగ... ఈ రెండూ కలిసి రెట్టింపు నష్టాలను కుటుంబ సభ్యులకూ కలగజేస్తాయి. సిగరెట్ పొగ వల్ల మహిళల్లో ఓవరీస్ దెబ్బతింటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పాదనపై సిగరెట్ పొగ దుష్ర్పభావం చూపడం వల్ల అండం ఉత్పాదన తగ్గిపోతోంది. ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ కూడా దెబ్బతింటుంది. మహిలల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు. ఒకవేళ కృత్రిమంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేద్దామనుకున్నా దానికి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. పైగా అబార్షన్లు పెరగడం, ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతశిశువులు జన్మించడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. డాక్టర్ సిహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ -
నాదమే నాడులకు దివ్యౌషధం..
రాగాలతో రోగాలు నయమవుతాయని మనవాళ్లు చాలాకాలంగానే చెబుతూ వస్తున్నారు. తాజాగా, నాదమే నాడులకు దివ్యౌషధమని పరిశోధకులు కూడా సెలవిస్తున్నారు. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ కోసం చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడమే సరైన మార్గమని వారు చెబుతున్నారు. ఆహ్లాదభరితమైన శాస్త్రీయ సంగీతాన్ని వినడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే నాడీ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు వస్తాయని అంటున్నారు. సంగీతాన్ని వినడం వల్ల మానసిక స్థితి నిలకడగా మారుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, చక్కని సంగీతం నాడీ వ్యవస్థ క్షీణతను అరికడుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని రోట్మన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఇర్మా జార్వెలా వెల్లడించారు. -
ఆ ‘ఐదు’ వ్యాధులిక దూరం.
- రేపు పెంటావలెంట్ టీకా ప్రారంభం - ప్రాణాంతక వ్యాధుల నుంచి సంరక్షణ - తిరుపతిలో సీఎంచే పిల్లలకు టీకాలు చిత్తూరు (అర్బన్): హిమోఫిలస్ ఇన్ప్లూయెంజా టైప్ బీ (హిబ్) .. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులను బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి. దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 3.7లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. మృతుల్లో సుమారు 20 శాతం మంది మనదేశానికి చెందిన వారే. మరికొంతమంది పిల్లలు శాశ్వత పక్షవాతం, చెవుడు, మెదడు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెంటావలెంట్ను ప్రవేశపెట్టింది. ప్రాణాంతకమైన ఐదు వ్యాధులను నియంత్రించే శక్తి ఇందులో ఉంది. మన జిల్లాలోనూ పిల్లలకు ఈ టీకా వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 7న సీఎం చేతులమీదుగా పెంటావలెంట్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలో ప్రారంభిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పెంటావలెంట్ టీకాను చిన్నారులకు వేయనున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తిలో భాగంగా ప్రస్తుతం వైద్యశాఖాధికారులు అందిస్తున్న టీకాలు ఏదో ఒక వ్యాధిని నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏ వ్యాధికి అనుగుణంగా ఆ టీకా వేస్తున్నారు. ఆరునెలల శిశువుకే ఆరు నుంచి ఏడు టీకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఫలితంగా శిశువు శరీరం ఇబ్బందులకు గురవడంతో పాటు టీకాలు వేసే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రాణాంతర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేలా ఒకే ఒక పెంటావలెంట్ను అందుబాటులోకి తెచ్చింది. పెంటా అంటే ఐదు. వలెంట్ అంటే టీకా అని అర్థం. కంఠసర్పి (డిఫ్తీరియా), కోరింత దగ్గు, ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్ -బి,హిమోఫిలస్ ఇన్ఫ్లూయెంజా టైప్ బీ (హిబ్) అనే ఐదు రకాల ప్రాణాంతక వ్యాధులను పెంటావలెంట్ నియంత్రిస్తుంది. శిశువు పుట్టిన ఆరు వారాలకు ఈ పెంటావలెంట్ టీకా వేస్తారు. 10, 14వ వారాల్లోగా సైతం ఈ టీకా వేస్తారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన చర్యలపై డీఎంహెచ్వో కోటీశ్వరి జిల్లాలోని వైద్యాధికారులకు, సిబ్బందికి దాదాపు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. -
గిట్లుంటే రోగాలు రావా?
- ఆర్టీసీ అధికారుల తీరుపై డీప్యూటీ స్పీకర్ ఆగ్రహం - మూడ్రోజులో క్లిన్ చేయాలని ఆదేశం - లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక - రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలి మెదక్ టౌన్: బస్టాండ్లా.. చెత్త కుప్పలా..గిట్లుంటే ప్రయాణికులు ఎవరైనా వస్తారా?..వారికి రోగాలు రావా? ఏం చేస్తున్నారు?..అంటూ ఆర్టీసీ అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆమె పాత, కొత్త బస్టాండ్లను పరిశీలించారు. అక్కడున్న పారిశుద్ధ్య నిర్వహణను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్లలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా వుందని, అధికారులు తమ ఇళ్ల ను గిట్లనే ఉంచుకుంటారా? మండిపడ్డారు. కంపు కొడుతుంటే బస్టాండ్లోకి ప్రయాణీకులెలా వస్తారని అని ప్రశ్నించారు. ఆర్టీసీ లాభాల బాటలో నడిస్తేనే కార్మికుల కుటుంబాలు బాగుంటాయన్నారు. బస్టాండ్లను ఇలా ఉంచితే బస్సులో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ పట్టణం జిల్లా కేంద్రం కాబోతున్నందున బస్టాండ్లతోపాటు పట్టణాన్ని సుందరనందనవనంగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని, మూడ్రోజుల్లో శుభ్రం చేయించాలని ఆదేశించారు. లేకుంటే ఇక్కడే ఉండి సిబ్బం దితో పని చేయిస్తానని పేర్కొన్నారు. ఆమెవెంట ఆర్డీఓ మెంచు నగేష్, డీఎస్పీ రాజారత్నం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, టీఎం యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మహిళా, మైనార్టీ శాఖల అధ్యక్షులు గాయత్రి, ఫజిల్తోపాటు టీఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మెదక్ను సుందరంగా తీర్చిదిద్దుదాం మెదక్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారి వెడల్పు చేసేందుకు రూ. 16కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మెదక్ పట్ట ణం జిల్లా కేంద్ర ఏర్పాటులో భాగంగా పట్టణంలోని ప్రధాన రోడ్లను వెడల్పు చేసేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని చెప్పారు. రోడ్ల వెడల్పునకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజల ఆకాంక్షకనుగుణంగా రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుందని, దీనికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 24న హైదరాబాద్లో జరుగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో 40వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పదిలక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అంతకు ఫతేనగర్ వీధిలో జరుగుతున్న శ్రీ బాలాజీ మఠం పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మెదడు హంగూ... మేని రంగు!
అకస్మాత్తుగా ఓ అమ్మాయికి సిగ్గు ముంచుకొస్తుంది. వెంటనే ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలవుతాయి. అనుకోకుండా ఒక పెద్దాయనకు కోపం వచ్చేస్తుంది. దాంతో ఆయన ముఖమంతా ఎర్రబారిపోతుంది. సిగ్గు లేదా కోపం అనేవి మనసుకు సంబంధించిన భావోద్వేగాలు. ఇలా మెదడులో జరిగే మానసిక ప్రక్రియలైన భావోద్వేగాలకూ, చర్మం రంగులు మారడానికీ సంబంధం ఏమిటి? మెదడూ... మేనుల మధ్య ఈ బంధం ఏమిటి? మేని రంగు, మేనిపై వ్యక్తమయ్యే కొన్ని రకాల లక్షణాలతో తెలిసిపోయే సమస్యలూ, వ్యాధులు ఉంటాయా అన్న అనేక విషయాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. సిగ్గు ముంచుకొచ్చినప్పుడు చెంపలు కెంపులవుతాయెందుకు? చిన్నారి అయినా, యుక్తవయసులోని అమ్మాయి అయినా... ఒకరు సిగ్గుల మొలక అయినప్పుడు బుగ్గలు గులాబిరంగులోకి మారడానికి కారణం ఉంది. మన శరీరమంతా రక్తనాళాల చివరలైన రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) వ్యాపించి ఉంటాయన్న విషయం తెలిసిందే. సిగ్గు అనే భావోద్వేగం కలగగానే ఈ రక్తనాళాల చివరల ఉన్న అతి సన్నటి క్యాపిల్లరీస్ మరింత వెడల్పు అవుతాయి. దాంట్లోంచి మరింత రక్తం జివ్వుమంటూ ఒక్కసారిగా ప్రవహిస్తుంది. దాంతో చర్మంలోంచి ఆ రక్తపు రంగు గులాబీ వర్ణంలో అందంగా కనిపిస్తుంది. ఈ క్యాపిల్లరీస్ అనేవి బుగ్గల్లో మాత్రమే కాదు... కొందరిలో చెవులు, మెడ, ఛాతీపై భాగంలోనూ ఉంటాయి. మెదడులోంచి సిగ్గు అనే భావోద్వేగానికి సంబంధించిన సమాచారం అందగానే రక్తం ఒక్కసారిగా పాకుతుంది. ఇలా రక్తం పాకడం అనేది కేవలం సిగ్గు అనే భావోద్వేగం వల్లనే కాకుండా తీవ్రమైన కోపోద్రేకాలకు గురైన సమయంలోనూ, తీవ్రమైన అవమానభారం పొందినప్పుడూ జరుగుతుంటుంది. ఇలా బుగ్గల రంగుమారడాన్ని ‘బ్లషింగ్’ అంటారు. ఇది సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనే ‘అనియంత్రిత వ్యసవ్థ’ ద్వారా జరుగుతుంది. అవమానం జరిగినప్పుడు ముఖమెందుకు జేవురిస్తుంది? తీవ్రమైన అవమానం జరిగినప్పుడు కొందరి ముఖం జేవురించడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వాస్తవంగా మానసిక ఉద్వేగాలలోనూ భౌతికమైన కొన్ని చర్యలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు ఇలా తీవ్ర అవమానం జరిగిన సమయంలో ముఖంపైని చర్మం జేవురించడానికి కారణం ఉంది. ఆ సమయంలో మనలో అడ్రినాలిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది శ్వాసప్రక్రియ, గుండె కొట్టుకునే వేగాలను పెంచుతుంది. మన కనుపాపలు విశాలం అవుతాయి. రక్తం మరింతగా ప్రవహించేందుకు వీలుగా రక్తనాళాలూ మరింత వెడల్పు అవుతాయి. వీటన్నింటి సంయుక్త ప్రభావం వల్ల తీవ్ర అవమానం (ఎంబారాస్మెంట్) సమయంలో ముఖం జేవురిస్తుంది. బుగ్గలు ఎర్రబారేలా చేసే జీవరసాయనాలివే... ఓ చిన్నారిని అందరూ ఒక్కసారిగా చూస్తుంటే ఆ అమ్మాయి సిగ్గుల మొలకైనప్పుడు బుగ్గలు మాత్రమే ఎర్రబారడం చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇలా జరగడానికీ కొన్ని రకాల జీవరసాయనాలూ కారణమే. ఉదాహరణకు ‘ఎడినల్ సైక్లేజ్’ అనే ఒక జీవరసాయనం వెలువడుతుంది. అది సిరల్లోకి మరో జీవరసాయనమైన ‘ఎడ్రినాలిన్’ను ఎక్కువ మోతాదులో పాకేలా చేస్తుంది. దాంతో ఒక్కసారిగా అధిక మోతాదులో రక్తం ముఖంలోకి ప్రవహిస్తుంది. ఇలా ఈ జీవరసాయనాలన్నీ బుగ్గల్ని ఎర్రబారుస్తాయన్నమాట. బుగ్గలను ఎర్రబార్చే పరిస్థితులివే... కేవలం సిగ్గు వల్ల మాత్రమేగాక మరికొన్ని పరిస్థితులు కూడా మేని చర్మాన్ని ఎర్రబారుస్తాయి. అవి... కోపోద్రిక్తతలు, తీవ్రమైన అవమానం, తీవ్రమైన అసహనం (ఇరిటేషన్), తీవ్రమైన విచారం, ఉద్విగ్నతకు లోనుకావడం (యాంగ్జైటీ), తనను తాను ఉత్సాహపరచుకోవడం లోపించడం(డీ-మోటివేషన్), ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యేంత ఉద్రేకం (అగ్రెసివ్నెస్), తీవ్రమైన ఒత్తిడి (టెన్షన్), తీవ్రమైన అలసట (ఫెటీగ్)... ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు చర్మం (ముఖ్యంగా ముఖంపైని) రంగును మారుస్తాయి. ఫ్లషింగ్ అంటే ఏమిటి? ఫ్లషింగ్ అంటే కూడా రక్తం వేగంగా ప్రవహించడం వల్ల మేని రంగు ఎర్రగా మారడం. కాకపోతే బుగ్గలూ, ముఖం వరకే ఎర్రబారితే దాన్ని ‘బ్లషింగ్’ అని వ్యవహరిస్తారు. ఒక్కోసారి ముఖం మినహా... మిగతా మేనంతా ఎర్రబారితే దాన్ని ‘ఫ్లషింగ్’ అని అంటారు. ఇలా ఫ్లషింగ్ అనేది మానసిక భావోద్వేగాలతో కంటే శారీరక కారణాలతోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. బ్లషింగ్కు చికిత్స ఇలా... అది స్వాభావికం, సిగ్గు లాంటి తాత్కాలిక భావోద్వేగం వల్ల కాకపోతే ముందుగా ముఖం ఇలా ఎర్రబారడానికి కారణాలను తెలుసుకుని వాటిని దూరం చేసుకోవాలి. ఇంట్లోనే ఈ తరహా చికిత్సలు చేసుకోవచ్చు. ఉదాహరణకు... బ్లషింగ్కు కారణమయ్యే ఆహారం, దినుసులు, మసాలాలు వంటి వాటికి దూరంగా ఉండటం అకస్మాత్తుగా పరిసరాల వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగకుండా చూసుకోవడం మద్యం వంటివి ముఖాన్ని ఎర్రబార్చేలా చేస్తున్నప్పుడు ఆ దురలవాటును మానేయడం తీవ్రమైన ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం రిలాక్సేషన్ టెక్నిక్స్ను అంటే శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సెజైస్), ధ్యానం, యోగా వంటివి ఆచరించడం. మేని నుంచి మెదడుకు... చర్మం మీద రంగు మారడం వంటి దుష్ర్పభావాలు పడడంతో చాలామంది మానసికంగా కుంగిపోతారు. దాంతో అది మానసిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ విధంగా మెదడు సమస్యలు చర్మంపై... చర్మం సమస్యలు మెదడుపై పరస్పరం ప్రభావం చూపుకుంటాయి. మెదడు నుంచి మేనికి... కొన్నిసార్లు మెదడులోని కొన్ని రసాయనాలు సమతుల్యం కోల్పోవడం, అవి అడ్రినల్ వంటి మరికొన్ని రసాయనాలు వెలువడేలా చేయడంతో ఆ ప్రభావం చర్మం మీద పడుతుంది. చర్మంపై ప్రభావంచూపించే మానసిక సమస్యల్లో కొన్ని... కొన్ని మానసిక సమస్యలు కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కావు. మేనిపైనా ప్రభావం చూపిస్తాయి. ఆ రోగులు కాస్త వింతగానూ, విచిత్రంగానూ ప్రవర్తిస్తుంటారు. వాటిలో కొన్ని వ్యాధులివి... బ్రోమ్హైడ్రోఫోబియా : తన చర్మం నుంచి దుర్వాసన వస్తుందేమో అన్న అనుమానం కొందరిని వేధిస్తూ ఉంటుంది. వీరు మాటిమాటికీ తమ చర్మం వాసన చూసుకుంటూ, తమను తాము పరీక్షించుకుంటూ ఉంటుంటారు. ఈ మానసికవ్యాధిలో రోగి తన చర్మాన్ని, దాని నుంచి దుర్వాసన వస్తున్న పరిస్థితులను నిత్యం అనుమానిస్తూ, అదే ఆందోళనలో తలమునకలై ఉంటాడు. డెల్యూషన్ ఆఫ్ పారాసైటోసిస్: కొంతమంది రోగులకు తమ చర్మం మీద ఏవో పరాన్నజీవులు పాకుతున్నట్లుగానూ, అవి తమ చర్మానికి హాని చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ భ్రాంతితో వారు తమ చర్మంపై పురుగులు పాకుతున్నట్లుగా భ్రమించి, అక్కడ లేని కీటకాలను ఏరుతూ ఉంటారు. తమకు దగ్గర్లో కనిపించిన ఏదైనా చిన్న కీటకాన్ని తమ చర్మంపై నుంచే వచ్చినట్లుగా భావించి, దాన్ని అగ్గిపెట్టెలో దాచి ఉంచి, డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చి, దాన్ని సాక్ష్యంగా చూపి, తమ ఒంటిపైన ఇలాంటి ఎన్నో కీటకాలు ఉన్నాయని అంటుంటారు. దాన్ని ‘మ్యాచ్బాక్స్’ సైన్ అని పేర్కొంటారు. పైన పేర్కొన్న ఈ జబ్బులకు సైకియాట్రిక్ కౌన్సెలింగ్తో పాటు కొన్ని మానసిక చికిత్సకు సంబంధించిన మందులు అవసరమవుతాయి. ‘పైమోజైడ్’ అనే మందు ఈ తరహా జబ్బులకు బాగా పనిచేస్తుంది. కానీ దీన్ని కేవలం డాక్టర్ల సలహా మేరకే వారు సూచించిన మోతాదుల్లోనే వాడాలి. శరీరపు రంగున ప్రభావితం చేసే వ్యాధులివే... భావోద్వేగాలకు మేని రంగు మారండం (బ్లషింగ్), కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు లేకపోయినా శరీరం రంగు మారిపోవడం (రోజేసీయా) వంటివే గాక కొన్ని వ్యాధులు సైతం మేని రంగును మారుస్తాయి. ఇలా మేని రంగును మార్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. అవి ఇవే... కార్సినాయిడ్ సిండ్రోమ్: ఇది చాలా అరుదైన వ్యాధి. ఈ కార్సినాయిడ్ సిండ్రోమ్లో ఒక గడ్డ కొన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వాటి కారణంగా శరీరంలోని రక్తనాళాలు విశాలమైపోతాయి. దాంతో శరీరమంతా రక్తం పాకి మేను ఎర్రబారుతుంది. ఇడియోపథిక్ క్రేనియోఫేషియల్ ఎరిథ్మా: ఇది ముఖంలోకి జివ్వున రక్తం ఎగజిమ్మించేలా చేసి, ముఖం ఎర్రబారేలా చేసే మరో రకం కండిషన్. ఇందులో ‘బ్లషింగ్’ ప్రక్రియ ఏ కారణం వల్ల జరుగుతుందో కూడా తెలియదు. స్నేహితులతో మాట్లాడుతుండగానో, కళ్లతో కళ్లు కలపడం వల్లనో, చివరకు అపరిచితుడిని అడ్రస్ అడగడం వల్ల కూడా ఇలా ముఖంలోకి రక్తం చిమ్మి, బుగ్గలు ఎర్రబారవచ్చు. తీవ్రమైన జ్వరం: కొన్ని సార్లు జ్వరం చాలా తీవ్రమైనప్పుడు అది ముఖంలోనూ కనిపిస్తుంది. తీవ్రంగా జ్వరపడ్డ వారి ముఖం ఎర్రగా అవుతుంది. రుతుస్రావం ఆగిపోవడం: రుతుస్రావం ఆగిపోయే కండిషన్ను మెనోపాజ్ అంటారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగే హార్మోన్లలోని మార్పుల వల్ల కూడా ‘బ్లషింగ్’ చోటుచేసుకోవచ్చు. ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు : కొందరు అకస్మాత్తుగా తీవ్రమైన చలి వాతావరణం నుంచి తీవ్రమైన వేడి ప్రదేశంలోకి వచ్చినా లేదా సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరిగినా ముఖం ఎర్రబారవచ్చు. నియాసిన్ మోతాదు మించడం : బీకాంప్లెక్స్లో ఉండే ఒక విటమినే ‘విటమిన్ బి3’. దీన్ని వైద్యపరిభాషలో నియాసిన్ అంటారు. శరీరంలో దీని మోతాదు పెరిగినా ‘బ్లషింగ్’ చోటు చేసుకుంటుంది. ప్యానిక్ డిజార్డర్ : ఒక్కసారిగా ఏంచేయాలో తెలియనంత ఆందోళనకు గురై అచేతనమై, అవాక్కయ్యే పరిస్థితిని ప్యానిక్ కావడం అంటారు. కొందరు ఇలాంటి పరిస్థితికి గురయ్యే వ్యాధిని ‘ప్యానిక్ డిజార్డర్’ అంటారు. ఇలాంటప్పుడూ మేని రంగు మారి ముఖం ఎర్రబారుతుంది. హైపర్ థైరాయిడిజమ్: మన మెడ భాగంలో ఉండి, అనేక జీవక్రియలు సజావుగా జరిగేలా చూసే గ్రంథి థైరాయిడ్. ఇది అతిగా పనిచేయడాన్ని ‘హైపర్ థైరాయిడిజమ్’ అంటారు. ఇలాంటి హైపర్థైరాయిడిజమ్ కండిషన్లోనూ మేని రంగు మారుతుంది. ఫిఫ్త్ డిసీజ్ : ఇది ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ను ‘పార్వో వైరస్’ అంటారు. ఇలాంటి పార్వో డిసీజ్ వచ్చినప్పుడు బుగ్గల రంగు ఎంతగా మారుతుందంటే... చెంపలపై ఎవరైనా సాచి కొట్టారేమో అనిపించేంత ఎర్రబడతాయవి. అందుకే దీన్ని ‘స్లాప్డ్ చీక్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. స్కార్లెట్ ఫీవర్ : బ్యాక్టీరియాలలో ఒక రకానికి చెందిన ‘స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియమ్’ కలగజేసే ఇన్ఫెక్షన్ వల్ల చెంపల రంగు ఎర్రబారుతుంది. దీన్నే ‘స్కార్లెట్ ఫీవర్’ అంటారు. చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్: కొందరికి చైనీస్ ఫుడ్ అంతగా సరిపడదు. చైనీస్ ఫుడ్లో... వారు మాత్రమే వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల (ఉదాహరణకు అజినమోటో వంటివి) వాటిని తినగానే బుగ్గలు ఎర్రబారతాయి. దీన్ని ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ అంటారు. క్లస్టర్ హెడేక్: అనేక రకాల తలనొప్పుల్లో ఇదొకటి. ఇందులో ముఖం ప్రాంతంలో ఉన్న రక్తనాళాలలో అకస్మాత్తుగా రక్తం ప్రవహిస్తుంది. దాంతో అక్కడ రక్తం ఒత్తిడి పెరిగి పక్కనుండే నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడి తలనొప్పికి దారితీస్తుంది. ఇలా వచ్చే ఈ నొప్పి చాలా తీవ్రమైన తలనొప్పి. ఇది దఫ దఫాలుగా వస్తుంటుంది. అందుకే దీన్ని క్లస్టర్స్గా పేర్కొంటారు. కొందరిలో ఈ తరహా తలనొప్పి నెలలో 10-15 సార్లు వస్తే మరికొందరిలో ఇది ఏడాదిలో 20-25 సార్లు రావచ్చు. ఈ తరహా క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు కూడా ముఖం ఎర్రబారుతుంది. అగోరఫోబియా : ఎక్కువ సంఖ్యలో ఒక చోట పోగైన జనాల గుంపులను (క్రౌడ్) చూసి భయాందోళనలకు గురికావడాన్ని అగోరఫోబియా అంటారు. ఇలాంటప్పుడు కూడా చెంపలు ఎర్రబారతాయి. రోజేసియూ కండిషన్ అంటే... కొందరిలో పైన పేర్కొన్న ఎలాంటి భావోద్వేగాలు లేకపోయినప్పటికీ బుగ్గలు ఎర్రబారడం జరుగుతుంది. భావోద్వేగాలతో బుగ్గలు ఎర్రబారడాన్ని ‘బ్లషింగ్’ అంటారు. కానీ... ఎలాంటి భావోద్వేగాలు లేకపోయినా బుగ్గలు లేదా చర్మం ఎర్రబారడాన్ని ‘రోజేసియా’ కండిషన్గా పేర్కొంటారు. రోజేసియాకి దోహదం చేసే మరికొన్ని పరిస్థితులు... కొందరిలో చాలా ఎక్కువ మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడం, చాలా ఎక్కువగా కారం తినడం జరిగినప్పుడు వారి ముఖం తీవ్రంగా ఎర్రబారడం గమనిస్తుంటాం. అంటే రోజేసియా కండిషన్ వస్తుందన్నమాట. ఇక కొందరిలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా రోజేసీయా కండిషన్ రావడం చాలా సాధారణం. డాక్టర్ను కలవాల్సిందెప్పుడు? మామూలుగా సిగ్గు పడ్డప్పుడో, బాగా కోపం వచ్చినప్పుడో బుగ్గలు, చెంపలు ఎర్రబారడం జబ్బేమీ కాదు. అది సహజమైన సహజాతం (ఇన్స్టింక్ట్) కూడా. కానీ అలా బుగ్గలపై ఏర్పడ్డ ఎరుపురంగు అస్తమానం కొనసాగుతూ ఉన్నా, లేదా బుగ్గల మీద ఎరుపుతో పాటు శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు వినిపించడం, ఒళ్లంతా దద్దుర్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ఆయాసం వంటివి ఉంటే... శారీరకమైన ఈ ఎరుపు లక్షణంతో పాటు... సామాజికపరమైన, మానసికమైన ఇతర లక్షణాలను కలగలపుకొని చూసుకొని డాక్టర్ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అసలు కారణాన్ని వెదికి దానికి సరైన చికిత్స అందిస్తారు. న్యూరోటిక్ ఎక్స్కోరియేషన్స్ / ఫ్యాక్టీషియల్ డర్మటైటిస్ పైన పేర్కొన్న మానసిక వ్యాధులతో రోగి తన సొంత చర్మాన్ని తానే ధ్వంసం చేసుకుంటుంటాడు. తన గోళ్లతో తన చర్మాన్ని తీవ్రంగా దెబ్బతినేలా గీరుకుంటుంటాడు. కొన్నిసార్లు ఇలా తన చర్మానికి హాని చేసుకునే ఈ తీవ్రత ఎంతగా ఉంటుందంటే... సిగరెట్లతో తన సొంత చర్మాన్ని కాల్చుకుంటూ ఉంటాడు లేదా రసాయనాలతో నాశనం చేసుకుంటాడు లేదా పదునైన వస్తువులతో కోసుకుంటుంటాడు. ఇలాంటి వారికి తప్పనిసరిగా మానసిక చికిత్స అవసరం. వీళ్లకు యాంటీడిప్రెసెంట్ మందులతో తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్ని ఉదాహరణలూ, ఇన్ని దృష్టాంతాలు, తర్వాత తేలే విషయం ఏమిటంటే... మీ మెదడు గురించి మీ మేనే మరింత స్పష్టంగా మాట్లాడుతుంది. మెదడు మాట్లాడే మేని భాష వినండి. తగిన జాగ్రత్తలు లేదా చికిత్సలు తీసుకోండి. మేనిపై (శరీరంపై) మార్పులతో వ్యక్తమయ్యే ఇతర వ్యాధులు కొన్ని రకాల మానసిక వ్యాధులలో - మానసిక లక్షణాలతో పాటు శారీరకంగా అంటే చర్మంపైన కూడా మార్పులతో కూడా అవి వ్యక్తమవుతాయి. అందుకు ఉదాహరణే ఈ కింది జబ్బులు... డిప్రెషన్ : తీవ్రమైన డిప్రెషన్తో బాధపడేవారి చర్మంపై మొటిమలు విపరీతంగా వస్తాయి. వీటి వల్ల అసలే డిప్రెషన్తో బాధపడే కౌమార బాలబాలికలు మరింతగా న్యూనతకు గురవుతారు. దాంతో ఇతరులతో కలవలేక మరింత డిప్రెషన్కు లోనవుతారు. డిప్రెషన్ వ్యాధి మొటిమలను (ఆక్నే) ప్రేరేపించే అంశంగా (ట్రిగరింగ్ ఏజెంట్గా) మారుతుంది. డిప్రెషన్ వల్ల మొటిమలు రావడం... వాటిని చూసుకుని మరింతగా డిప్రెషన్లోకి కూరుకుపోవడం... మళ్లీ వాటి వల్ల మొటిమలు పెరగడం... ఇదో విషవలయంగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో డిప్రెషన్కు చికిత్స తీసుకుంటేనే మొటిమలు తగ్గుతాయి తప్ప... కేవలం మొటిమలు తగ్గడానికి పైపూత మందులు వాడినంత మాత్రాన తగిన ప్రయోజనం ఉండదు. అంటే ఇలాంటి సందర్భాల్లో అటు మానసిక చికిత్సతో పాటు... ఇటు చర్మవ్యాధి చికిత్స ఏకకాలంలో జరగాలన్నమాట. ఎగ్జిమా : చాలామందిలో కాళ్ల పగుళ్లు... అవి లోపల ఎరుపుగా కనిపించేంతగా పగిలిపోయి ఉండటాన్ని చూస్తుంటాం. ఇలాంటివి చికిత్సకు చాలా అరుదుగా లొంగుతాయి. ఇలా కాళ్లలో లోతైన పగుళ్లు ఉండటం కూడా అంతర్గతంగా డిప్రెషన్కు ఒక సూచనగానే తీసుకోవాలి. కాళ్లపగుళ్లు (ఎగ్జిమా)కు ఎంతగా మందులు వాడినా అవి తగ్గనప్పుడు... చర్మానికి వాడే మందులతో పాటు మనసుకూ చికిత్స తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ తరహా ఎగ్జిమా (కాళ్ల పగుళ్లు, ఒంటి పగుళ్లు, ఒళ్లంతా పొడిబారడం, దురద) తగ్గుతాయి. హైవ్స్ లేదా అర్టికేరియా : కొందరిలో డిప్రెషన్ ఉన్నప్పుడు ఒంటిపై దద్దుర్లలా రాష్ వస్తుంది. ఇలా వచ్చే రాష్ను అర్టికేరియా అంటారు. శరీరంపై ఇలా వచ్చే ర్యాష్ కేవలం పూతమందులు, శారీరకమైన మందులతో తగ్గనప్పుడు డిప్రెషన్ కూడా ఉందని భావించి మానసిక చికిత్స కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజేసియా : ప్రాథమిక డిప్రెషన్ లేదా మరింత పెరిగిన సెకండరీ స్థాయి డిప్రెషన్తో పాటు బుగ్గలపై ఎరుపు (రోజేసీయా) ఉన్నప్పుడు... ఆ సూచనను వ్యాధి మరింత తీవ్రస్థాయిలో (ముదిరి) ఉందన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో రోజేసియాతో పాటు డిప్రెషన్కూ మందులు వాడాలి. సోరియాసిస్ : దీర్ఘకాలిక సోరియాసిస్ వ్యాధికి ఇచ్చే మందులతో పాటు యాంటీడిప్రెసెంట్స్ కూడా వాడినప్పుడు సోరియాసిస్ వేగంగా తగ్గడాన్ని డాక్టర్లు గమనించారు. అలొపేషియా : తలపై జుట్టు రాలిపోవడాన్ని అలొపేషియాగా వ్యవహరిస్తారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ‘అలొపేషియా ఏరేటా’ అంటే పేనుకొరుకుడు. దీంట్లో కేవలం తలలో గానీ, మీసంలోగానీ, గడ్డంలోగాని కొంత భాగంలోనే వెంట్రుకలు మొలవకుండా పోతాయి. ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటే బట్టతల. ఇందులో పురుషుల్లో తలపై జుట్టు రాలిపోతుంది. పైన పేర్కొన్న వెంట్రుకలు రాలడం అన్న అంశం కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డిప్రెషన్ లేదా ఉద్విగ్నత వల్ల కావచ్చు. అందుకే నేరుగా వెంట్రుకలు రాలడానికి ఇచ్చే చికిత్సతోనే ప్రయోజనం ఉండదు. మానసిక చికిత్స కూడా అవసరం. విటిలిగో: ఇందులో చర్మం తన స్వాభావిక రంగును పూర్తిగా కోల్పోయి తెల్లగా మారుతుంది. బొల్లి అని వాడుకభాషలో పిలిచే ఈ వ్యాధికి గురైన వారు ఎంతో న్యూనతకు గురువుతుంటారు. ఇలా చర్మం తెల్లగా మారడానికి కూడా డిప్రెషన్ ఒక కారణం కావచ్చు. ఒక్కోసారి విటిలిగో వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఇది మళ్లీ ఈ రెండు వ్యాధుల మధ్య ఒక విషవలయంలా మారుతుంది. విటిలిగో చికిత్స చేసే సమయంలో డిప్రెషన్కూ వైద్యం అందించడం వల్ల ఈ రెండు వ్యాధులూ త్వరగా తగ్గుతాయి. ఏటోపిక్ డర్మటైటిస్ : మడమలు పగిలినట్లుగా ఒళ్లంతా పగలడం, ఎర్రబారడం, దద్దుర్ల వంటివి వ్యాపించడం ఇవన్నీ ఏటోపిక్ డర్మటైటిస్ లక్షణాలు. డిప్రెషన్తో బాధపడుతున్నవారికి సైతం ఏటోపిక్ డర్మటైటిస్ అనే చర్మవ్యాధి వస్తుంది. కాబట్టి వ్యాధి నిర్ధారణ సమయంలోనే చాకచక్యంగా వ్యవహరించి, చర్మవ్యాధితో పాటు మానసిక చికిత్స కూడా అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేయాలి. డాక్టర్ స్మిత ఆళ్ళగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్. -
అడకత్తెరలో ఆయుర్వేదం
డా. వీఎల్ఎన్ శాస్త్రి అనేకమైన మొండిరోగాల ఆటకట్టించాలం టే ఆయుర్వేదం అవసరం. ఏ వ్యాధినీ దరికి రానీయకుండా వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకొంటూ, ఓజస్సును సంతరిం చుకుంటూ, అఖండమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వే దం తప్ప వేరే మార్గం లేదంటే అతిశయోక్తి కానేకాదు. ‘వాతావరణ (పంచమహాభూతాల) కాలుష్యం, తిండిపదార్థాల కల్తీ, మానసిక ప్రశాంతతను మట్టుపెడు తున్న ఒత్తిడి, గతి తప్పిన జీవనశైలి నేటి ప్రధాన సామాజిక సమస్యలు. ఇవన్నీ మానవుని ‘ప్రజ్ఞాపరాధం’ ఫలి తమేనని చెబుతూ వాటికి సరైన సమాధానాల్ని పొందుపరిచింది ఆయుర్వేదం. ఇంతటి మహత్తర సనా తన శాస్త్రాన్ని సమగ్రంగా అధ్య యనం చెయ్యాలంటే, 5 1/2 సంవత్సరాల బీఏఎంఎస్ కోర్సు, 3 ఏళ్ల ఎండీ కోర్సు అవసరమని నిర్ణయించింది. ‘భారతీయ వైద్య కేంద్ర మండలి (సీసీఐఎం). ఈ కోర్సులను నడిపే కళాశాల, ఆసుపత్రి ఒకదానికొకటి దగ్గరగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటేనే, సరైన ప్రమాణాలతో కూడిన ఆయుర్వేద వైద్యులు ఉత్పన్నమవుతారు. అట్టి ఆసుపత్రులు లేని కళాశాలలు ‘వేద పాఠశాలల’తో సమానమవు తాయే తప్ప ప్రజాసేవకు పనికొచ్చే ‘ఆయుర్వేద కళాశాలలు’ కానేరవు. గత పదిహేనేళ్లుగా ‘రాష్ట్ర ప్రభుత్వపు ఆయుష్’ విభాగం ఎంతో సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘దినదినగండం దీర్ఘాయుష్షు’గా కాలం గడుపుతోంది. ఇంకా వెనుకకు వెళితే హైదరాబాద్లో గల డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు, బోధనా ఆసుపత్రికి సొంత భవనాలు లేక, స్వయం ప్రతిపత్తిలేక, విల విలలాడిన విషాదగాథలున్నాయి. ఈ కళాశాల ఇంతవరకు కనీసం 30-40 అద్దె భవనాలు మార్చిందన్నది నగ్న సత్యం. ఎట్టకేలకు దివం గత సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి హయాంలో కొంత ఉపశమనం లభించింది. ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు పది ఎకరాల స్థలం ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రి నిర్మా ణానికి కేటాయించారు. మాకు జాగా దక్కింది కాని కట్టడాలకు నిధుల కొరత అలానే ఉంది. అప్పుడు కేంద్ర సహాయాన్ని కోరుతూ కాళ్లరిగేలా తిరిగాం. అరకొరగా ఉన్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర నిధులను కలుపుకుంటూ ఇప్పుడు కన్పిస్తున్న భవనాలను నిర్మించుకున్నాం. అదీ ఒక్కసారి గాదు దఫదఫాల్లో. అయినప్పటికీ కావాల్సిన సంఖ్యలో వైద్యులు, అధ్యా పకులు లేరంటూ, అడ్మిషన్లకు అనుమతి నిరాకరిస్తూ, ప్రతి సంవత్సరం తాఖీదులు జారీ చేస్తూనే ఉంది కేంద్ర మండలి. నేటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల 20 సంవత్సరాల్లో ఆయుర్వేద కాలేజీకి, ఆస్పత్రికి ఒక సొంత భవనం, అదీ ఒకే ప్రాంగణంలో ఉండబట్టి, కొంత వరకు ప్రజా దరణకు నోచుకుంటోంది. ప్రభుత్వం దృష్టిలో ఆలోచిస్తే, ‘ఏముంది? ఇక్కడి నుంచి, ఇంకోచోటుకి మారుస్తున్నాం. వేరే భవంతులిస్తాం, మీకా హక్కుంది కదా’ అంటారు. వాదనకు ఇది బాగున్నా, క్రియాశీల కంగా ఆయుర్వేదం దెబ్బతింటుంది. కళాశాలని నడపటం కష్టమవు తుంది. అలవాటుపడ్డ ఆసుపత్రి సేవల్ని ప్రజలకందిస్తూ గాడిలో పడ టం ఇబ్బందవుతుంది. కారణం ఇది వృత్తి విద్యాకళాశాల, అందులోనూ ఆస్పత్రితో సంబంధం ఉన్న విద్య. గత 50 ఏళ్లలో ఎంతో మంది ఆయుర్వేద ప్రభుత్వ వైద్యాధికారు లు, ఆయుర్వేద అభిమానులు, ప్రజాప్రతినిధులు, ఆయుర్వేద సేవా సంఘాలు సమష్టిగా చేసిన పెద్ద కృషికి దక్కిన చిన్న ఫలితమే ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల. వికసించే పథంలో ఉన్న మొగ్గల్ని కత్తిరిం చవద్దు. ఆయుర్వేద కుసుమాలను వికసింపనీయండి. అలాగే పక్కనే ఉన్న యునానీ సౌధాన్ని కూడా పరిరక్షించండి. దానిమీదకు కూడా దృష్టి పోనీయకండి. ఎర్రగడ్డలో గల నాటితరం ముఖ్యమంత్రి పేరు మీద వర్థిల్లుతున్న డా॥బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను, దానికి అనుసంధానమైన బోధనా ఆస్పత్రిని అక్కడే ఉంచాలి. మరిన్ని నిధులు మంజూరు చేసి వాటిని మరింత అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాం. కేంద్రమండలి నిర్దేశించిన ప్రమాణాలను సమకూరుస్తూ, ప్రతి సంవత్సరం అడ్మిషన్ల సమయంలో ఆవహిస్తున్న భీతిని శాశ్వతంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. వ్యాసకర్త విశ్రాంత అదనపు సంచాలకులు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ (ఆయుర్వేద), డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మొబైల్ : 9963634484 -
వ్యాధులపై పోరు
ప్రాణాంతక వ్యాధులపై జరిగే సమరంలో నిమగ్నమై ఉన్నవారికి ఈ మధ్య చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇందులో ఒకటి మంచి కబురైతే...రెండోది ప్రమాద ఘంటిక మోగించేది. వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు నిరుపయోగమవుతూ మానవాళి నిస్సహాయతకు చేరువవుతున్న సమయంలో ఒక శక్తిమంతమైన కొత్త యాంటీబయాటిక్ రూపకల్పనకు మార్గం సుగమమైందన్న వార్త సాంత్వన చేకూరుస్తుంది. అదే సమయంలో క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తున్న రెండో దశ ఔషధాలు కూడా నిరుపయోగమవుతున్న వైనం కనబడుతున్నదని వైద్య నిపుణులు చెబుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. తరతరాలుగా మానవజాతిని పట్టి పీడిస్తున్న... ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై పోరాడటానికి 1928లో తొలిసారి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తొలి యాంటీబయాటిక్ పెన్సిలిన్ను ఆవిష్కరించారు. అటు తర్వాత ఇలాంటి యాంటీ బయాటిక్స్ దాదాపు వంద వరకూ అందుబాటులోకొచ్చాయి. మనిషి ఆయుః ప్రమాణాన్ని పెంచడంలో వాటి పాత్ర అసామాన్యం. ఏ రోగికి ఏ మోతాదులో ఔషధం ఇవ్వాలన్న విషయంలో విచక్షణ, హేతుబద్ధత కొరవడటంతో రోగకారక క్రిములు బలం పుంజుకోవడం, వాటి నియంత్రణకు రంగంలోకి కొత్త యాంటీ బయాటిక్స్ రావడం చరిత్ర. అయితే ఇదంతా మూడు దశాబ్దాలక్రితం మాట. ఆ తర్వాత శాస్త్రవేత్తలు నిస్సహాయులయ్యారు. కొత్త రకం వ్యాధులకు కొత్త యాంటీ బయాటిక్స్ కనుగొనడం దాదాపు నిలిచిపోయింది. ప్రాణాంతక వ్యాధులకూ, వాటి నియంత్రణకు ఉపయోగిస్తున్న ఔషధాలకూ మధ్య పోరాటం సాగుతుండగా... అందులో క్రమేపీ ఔషధాలు ఓడిపోతున్న ధోరణి కొంతకాలంగా పెరుగుతున్నది. వైద్య నిపుణులకూ, శాస్త్రవేత్తలకూ ఇది ఆందోళన కలిగిస్తోంది. ఇందువల్ల క్షయవ్యాధి వంటి ప్రమాదకర వ్యాధులను లొంగదీయడం అసాధ్యమవుతోంది. ఇప్పటివరకూ ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్ రోగకారక సూక్ష్మజీవుల ప్రొటీన్లపై దాడిచేసి వాటిని హతమారుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సూక్ష్మజీవులు కొత్త తరహా ప్రొటీన్లను సంతరించుకుని ఆ ఔషధాలను నిరుపయోగం చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త యాంటీబయాటిక్ సూక్ష్మజీవిలోని కణజాలంపై నేరుగా దాడిచేస్తుంది. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవి కోలుకోవడానికి, శక్తి సంతరించుకోవడానికి వ్యవధి ఉండదు. అయితే ఈ కొత్త యాంటీబయాటిక్పై మరిన్ని పరిశోధనలు జరిగి ఔషధ రూపంలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా నాలుగైదేళ్లు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. మరోపక్క క్షయ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి కారక క్రిమి ఔషధ నిరోధకత(డ్రగ్ రెసిస్టెన్స్)ను సంతరించుకోవడం గమనించి... అలాంటి సందర్భాల్లో రోగులకు ‘మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ (ఎండీఆర్) థెరపీ’ని అందిస్తున్నారు. ఈ థెరపీలో వాడే ఔషధాలు వ్యాధి నివారణకు తోడ్పడని పక్షంలో రోగిపై రెండో దశ ఎండీఆర్ థెరపీ ఉపయోగిస్తారు. అయితే, అది ఇంతకాలమూ అరుదైన సందర్భాల్లో మాత్రమే అవసరమయ్యేది. కానీ, ఇటీవలికాలంలో రెండో దశ ఎండీఆర్ థెరపీ సైతం నిరుపయోగం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 97 లక్షలమంది క్షయబారిన పడుతుండగా మన దేశంలో అలాంటివారి సంఖ్య ఏడాదికి దాదాపు 20 లక్షలుంటున్నది. ఒక క్షయ రోగిని సకాలంలో గుర్తించి చికిత్స అందించి వ్యాధిని నయం చేయకపోతే ఏడాదికి దాదాపు 15మంది కొత్తగా ఆ వ్యాధి బారిన పడతారని ఒక అంచనా. క్షయ వ్యాధివల్ల దేశంలో ఏటా 5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో 33 శాతంమందికిపైగా జనంలో క్షయ వ్యాధికారక క్రిములుంటున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వీరిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు వ్యాధికారక బాక్టీరియా విజృంభించి వివిధ భాగాలకు సోకుతుంది. పోలియో వ్యాధి విషయంలో దేశం విజయం సాధించింది. ఇది ఒక వ్యాక్సిన్తో లొంగివస్తుంది. కానీ, క్షయ వ్యాధి నివారణకిచ్చే బీసీజీ వ్యాక్సిన్ ప్రయోజనం కేవలం ప్రాథమిక దశలో మాత్రమే ఉంటుంది. వ్యాధి పెరిగితే దాని తీవ్రతనుబట్టి ఔషధాల వాడకం ఉంటుంది. ఇలాంటి ఔషధాలను రోగి పరిస్థితినిబట్టి ఆర్నెల్లనుంచి రెండేళ్లపాటు క్రమం తప్పకుండా ఉపయోగించాలి. అయితే, సకాలంలో మందుల లభ్యత లేకపోవడంవల్ల కావొచ్చు, నిర్లక్ష్యంవల్ల కావొచ్చు... రోగులు సరిగా వాడకపోతే, అవసరమైన మోతాదు పడకపోతే క్షయ కారక బాక్టీరియా శక్తి పుంజుకుంటుంది. వ్యాపార ప్రయోజనాల కోసం కావొచ్చు, సరైన అవగాహన కొరవడి కావొచ్చు... వైద్యులు అవసరానికి మించి రోగులతో యాంటీబయాటిక్స్ను వాడించడంవల్ల కూడా క్షయ కారక బాక్టీరియా మొండి ఘటంలా తయారవుతున్నదన్నది నిజం. రెండో దశ ఎండీఆర్ థెరపీ కూడా నిరుపయోగం అవుతున్న ఛాయలు కనిపిస్తున్నందున వ్యాధి నివారణకు ఇప్పుడు ఉపయోగించే ప్రామాణిక విధానం కాక విడిగా రోగి స్థితిని అంచనావేసి అవసరమైన మోతాదులో ఔషధాలను వాడించే పద్ధతిని ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు వ్యాపార ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా, అనవసరంగా ఔషధాలను రుద్దే తీరుపై కూడా పోరాడవలసి ఉంటుంది. ఈ విషయంలో అటు వైద్యులనూ, ఇటు రోగులనూ చైతన్యపరచాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పదిహేనేళ్లక్రితమే ఈ విషయంలో విలువైన సూచనలు చేసింది. వాటిని అనుసరించడంవల్ల పాశ్చాత్య దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం గణనీయంగా తగ్గింది. మన పాలకులు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. లేనట్టయితే ప్రాణాంతక వ్యాధుల ముందు నిస్సహాయంగా తలవంచే స్థితి ఏర్పడుతుంది. -
వ్యాధులు బాబోయ్!
స్వైన్ఫ్లూతో ఒకరు, అతిసారతో మరొకరి మృతి ఓ వైపు చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్ఫ్లూ ఒకరిని కబళించేసింది.. అస్వస్థతకు గురైన ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మృత్యువాతపడ్డాడు. మరోవైపు అతిసార భూతం పంజా విసిరింది.. గద్వాలలో కలుషితనీరు తాగి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో 11మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ రెండు సంఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి. చనాగర్కర్నూల్ రూరల్: నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన ఎన్నం రాకేష్(33) కొంతకాలంగా ఆత్మకూర్లోని వికాస్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వనపర్తిలోని కేడీఆర్ నగర్లోని ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరుకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదిలాఉండగా, వారం రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వనపర్తిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మెరుగైన వైద్యచికిత్సల కోసం సమీప బంధువు రాకేష్ను ఆదివారం హైదరాబాద్కు తీసుకెళ్లాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించగా స్వైన్ఫ్లూగా నిర్ధారణ అయింది. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. మృతుడికి తండ్రి కృష్ణయ్య, తల్లి జయమ్మ ఉన్నారు. వ్యవసాయం చేస్తూ తమ ఇద్దరి కొడుకులను చదివించారు. ఎమ్మెస్సీ వరకు చదివిన రాకేష్ ఏడాదిన్నర క్రితమే వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వనపర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. రాకేష్ మృతితో శ్రీరంగాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పంజావిసిరిన అతిసార గద్వాలటౌన్: పట్టణంలోని ఒంటెలపేట కాలనీకి చెందిన చాంద్పాష(55) రెండురోజులుగా వాంతులు, విరేచనాలకు గురయ్యాడు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అదే కాలనీలో నివాసముంటున్న షరీఫ్, గౌస్మైనుద్దీన్, అన్వర్, సలాంమియా, రిహాన్, షరీఫ్, మెహ్రాజ్బేగం, గంజిపేటకు చెందిన గిరి, జమ్మిచేడు గ్రామానికి చెందిన నాగరాజు అతిసార బారినపడ్డారు. ప్రస్తుతం వీరు గద్వాల ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో సలాంమియా, రిహాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఒంటెలపేట కాలనీలో తాగునీరు కలుషితం కావడం వల్లే స్థానికులు అతిసార బారినపడ్డారని, పైప్లైన్లు లీకేజీ కావడంతోనే నీరు కలుషితమైందని మునిసిపల్ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే పరామర్శ.. స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ అతిసారబారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. మృతుడు చాంద్పాష కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు. -
చిన్నారుల cry క్రైసిస్లు
వాళ్ల సమస్య ఏదైనా దాన్ని వ్యక్తం చేయడంకోసం ఆరునొక్కరాగాన్నే ఆశ్రయిస్తుంటారు పిల్లలు. తమ నోటి ద్వారా తమ సమస్యను తెలపలేనంత చిన్న పిల్లలకూ సమస్యలుంటాయి. నొప్పులుంటాయి. బాధలుంటాయి. వ్యాధులుంటాయి. మరి వాటిని తెలుసుకునేదెలా? సాధారణంగా ఆ వయసు పిల్లలకు వచ్చే రకరకాల సమస్య లేమిటి అన్న అంశంపై అవగాహన పెంచుకుంటే ‘ఏడ్వకు ఏడ్వకు చిన్నారి కన్నా’ అంటూ వాళ్ల బాధను దూరం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ వయసు పిల్లలున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడటం కోసమే ఈ ప్రత్యేక కథనం. కొత్తగా తల్లిదండ్రులైన వారు మొదలుకొని తల్లిదండ్రులు కాబోయే వారితో పాటు ప్రతి ఒక్కరూ ఏడ్చే పిల్లల బాధలను అర్థం చేసుకునేందుకు భద్రపరచుకోవాల్సిన కథనమిది. ఎప్పుడెప్పుడు ఏడుస్తుంటారు? చిన్నారులు ఏడుస్తున్నారంటే... ఒక వరస క్రమంగా ఈ బాధలు కారణం కావచ్చు. వాళ్లకు ఆకలిగా ఉండవచ్చు. తమ పక్కబట్టలను తడిపి ఉండటమో లేదా మలవిసర్జన చేసి ఉండటమో జరగవచ్చు. అలాంటప్పుడు డయపర్ / పక్కబట్ట మార్చడం జరిగితే ఏడుపు ఆగిపోతుంది. ఒకవేళ ఈ రెండు సమస్యలూ లేక... అప్పుడే పాలు తాగి ఉంటే... ఒక తేన్పు వచ్చేలా వాళ్లను కాసేపు భుజం మీదే ఉంచాలి. వాళ్లు తృప్తిగా తేన్చాక హాయిగా ఫీలవుతారు. ఇక తల్లిదండ్రులో పెద్దలో తమను ఎత్తుకొని ఉండాలంటూ పిల్లలు ఒక్కోసారి కోరుకుంటారు. అది జరగనప్పుడూ ఏడుస్తారు. ఇక కడుపునొప్పి వచ్చినప్పుడూ, చెవి నొప్పి వచ్చినప్పుడూ ఏడుస్తారు. కొత్తగా తల్లి హోదా పొందిన అమ్మలకు క్రమంగా తమ అనుభవంతో పిల్లల ఏడుపులోని తేడాలు తెలిసిపోతుంటాయి. ఇక మాట్లాడలేని వయసులో పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలేమిటో తెలుసుకుందాం. శ్వాసకోశ సమస్యలు చాలా సాధారణంగా తల్లులు తమ బిడ్డ గురించి చేసే ఫిర్యాదు ఏమిటంటే... శ్వాస తీసుకునేటప్పుడు గురగురమంటూ శబ్దం వస్తుంటుందని. సాధారణంగా కొందరి ముక్కురంధ్రాల్లో కొన్ని స్రావాలు వెలువడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ శబ్దం వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ చిన్నారుల ముక్కు రంధ్రాల్లో సెలైన్ నేసల్ డ్రాప్స్ (ముక్కులో వేయాల్సిన చుక్కల మందు) వాడాలి. ఆ తర్వాత ముక్కులో ఉండే జిగురు పదార్థం (మ్యూకస్)ను లాగివేసే ‘నేసల్ ఆస్పిరేటర్’ అనే యంత్రం తొలగిస్తుంది. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. దీన్ని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్లుగా గుర్తించేందుకు ఉపయోగపడే లక్షణాలూ, హెచ్చరికలు (వార్మింగ్ సిగ్నల్స్) ఇవే... ఆయాసపడుతున్నట్లుగా చాలా వేగంగా శ్వాసిస్తుండటం అంటే నిమిషంలో ఆరుసార్లకు పైగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతుండటం. (వాస్తవానికి పెద్దలతో పోలిస్తే పిల్లల్లో శ్వాస వేగం ఎక్కువే ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో అది మరీ పెరుగుతుంది) రిట్రాక్షన్స్ (ఎదుర్రొమ్ము ఎగిరెగిరి పడుతున్నట్లుగా అనిపిస్తుంటం) ముక్కు నుంచి శ్వాస శబ్దం ఎక్కువగా వినిపిస్తుండటం శ్వాసించే సమయంలో మూల్గుతుండటం పిల్లలు ఒక్కోసారి నీలిరంగులోకి మారిపోవడం. బ్లూ బేబీస్: కొందరు పిల్లల్లో అరచేతులు, అరికాళ్లు చల్లగా మారి, నీలంగా మారిపోతుంటుంది. వాటిని రుద్ది కాస్త వెచ్చబరచగానే వెంటనే గులాబి (పింక్) రంగులోకి మారిపోతాయి. కొందరిలో కాస్త అరుదుగా ముఖం, నాలుక, పెదవులు నీలంగా మారిపోతాయి. అప్పుడు చిన్నారులు చాలా గట్టిగా ఏడుస్తుంటారు. వాళ్లు ఏడుపు ఆపివేయగానే మళ్లీ వాళ్ల ఒంటిరంగు మామూలుగా అయిపోతుంది. అయితే చిన్నారుల్లో ఇలా నీలం రంగు దీర్ఘకాలం ఉండిపోయి, శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండి, పాలుతాగడం కష్టమవుతోందంటే వాళ్ల ఊపిరితిత్తులు/గుండెలో ఏదో లోపం ఉందనీ, అందుకే రక్తానికి తగినంత ఆక్సిజన్ అందక వాళ్లు ఇలా నీలంగా మారిపోతున్నారని అర్థం. అప్పుడు వీలైనంత త్వరగా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. బద్దకంగా ఉండటం లేదా ఎప్పుడూ నిద్రపోతూ ఉండటం చిన్నపిల్లలు రోజులో చాలా సేపు నిద్రపోతూనే ఉంటారు. ఒకటి రెండు గంటలు మాత్రమే మెలకువతో ఉంటారు. ఇలాంటప్పుడు పాలు బాగా తాగుతూ, మూత్రవిసర్జన బాగానే చేస్తూ ఉంటే రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నా అది సాధారణమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే ఆకలి వేసినప్పుడు తనంతట తానే నిద్రలేవకుండా ఉండటం, ఆహారం తీసుకోడానికి ఆనాసక్తి ప్రదర్శిస్తూ ఉండటం, మెలకువగా ఉన్న సమయంలో చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక పిల్లల డాక్టర్కు చూపించాలి. ఎందుకంటే అది బిడ్డలో ఏదైనా లోపానికి సూచన కావచ్చు. పొట్టలో ఇబ్బంది (అబ్డామినల్ డిస్టెన్షన్) చాలా మంది పిల్లల పొట్ట ముందుకు వచ్చి ఉంటుంది. మరీముఖ్యంగా చాలాసేపు పాలు తాగాక పొట్ట పెరుగుతుంది. ఇక పాలు తాగడానికీ, పాలు తాగడానికీ మధ్య మళ్లీ కాసేపు మెత్తగా ఫ్లాట్గా అయిపోతుంది. కానీ దీనికి బదులు పొట్ట ఎప్పుడూ ఉబ్బుగా ఉండి, అది గట్టిగా మారి, విరేచనం సరిగా కాకుండా ఉండటంతో పాటు, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా పిల్లల డాక్టర్కు చూపించాలి. దీనికి కారణం మలబద్ధకం కావచ్చు. లేదా ఒక్కోసారి అది పేగులకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకూ సూచన కావచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి నెలబాలురు, నెలల పిల్లల విసర్జన అలవాట్లు క్రమబద్ధంగా ఉండవు. కానీ తగినంత పాలు తాగుతూ... ఏ వేళకైనా విసర్జన చేస్తూ ఉండటం సాగుతూ ఉంటే దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పసిపిల్లల్లో పొట్టనొప్పి (ఇన్ఫ్యాంటైల్ కోలిక్) పుట్టిన మూడు వారాల పిల్లల్లో చాలామంది ఒక దశలో సాయంత్రాల వేళగానీ లేదా రాత్రివేళల్లోగానీ చాలా గట్టిగా ఏడుస్తుండటం పరిపాటి. వారు ఏడ్చే సమయాల్లో పాలు తాగరు. కొద్దిమంది పిల్లలు ప్రతిరోజూ నిర్దిష్టంగా ఒక సమయంలోనే ఏడుస్తుంటారు. ఇలా ఏడ్వటం అన్నది కొద్ది నిమిషాలు మొదలుకొని కొంతమంది పిల్లల్లో గంటలకొద్దీ కొనసాగుతుంటుంది. ఒక్కోసారి మూడుగంటల పాటు అదేపనిగా ఏడుస్తుంటారు. కొంతమంది పిల్లల్లో ఇది కొద్దిరోజుల్లోనే సర్దుకున్నా మరికొందరిలో మాత్రం మూడు నెలల పాటూ ఇదే కొనసాగుతుండవచ్చు. దీనికి కారణం పసిపిల్లల్లోని పొట్టనొప్పి (కోలిక్) కావచ్చు. ఈ పొట్టనొప్పి వచ్చే ముందర మలద్వారం నుంచి కొద్దిగా గ్యాస్ వెలువడటం వంటివి జరగవచ్చు. కొన్నిసార్లు పెద్ద శబ్దాలతోనూ గ్యాస్ వెలువడవచ్చు. ఇలా పొట్ట నొప్పితో ఏడుస్తున్న సమయాల్లో పసిపిల్లల ముఖంలో వాళ్లు అనుభవిస్తున్న అసౌకర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. పసిపిల్లల పొట్టనొప్పి (కోలిక్)కి కారణాలు పసిపిల్లల్లో ఇలా పొట్టనొప్పి రావడానికి గల కారణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టంగా దీనికి ఫలానా కారణం అంటూ ఇంకా తెలియదు. పరిశోధకులు దీనికి అనేక సంభావ్య కారణాలను పేర్కొంటున్నారు. పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవడం (ల్యాక్టోజ్ ఇన్టాలరెన్స్), పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణవ్యవస్థ చక్కగా ఎదగకపోవడం, తల్లిదండ్రుల్లో అవగాహనలేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆతృతతో పాలు పట్టించడానికి ప్రయత్నించడం, దానితో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడటం వంటి ఎన్నో అంశాలు పసిపిల్లల పొట్టనొప్పికి కారణాలవుతాయి. పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్తో చికిత్స చేస్తే వాళ్లకు ఉపశమనం ఉంటుంది. పిల్లలు ఆకలిగా ఉన్నట్లు గ్రహించి, చిన్నారికి పాలు పట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ చిట్కాలు పొట్టనొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అవి... పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా, వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. రోజులో కొద్ది కొద్ది మోతాదుల్లో అనేకసార్లు పాలు పట్టించడం మేలు. పిల్లలకు చనుబాలు పట్టిస్తున్నప్పుడు ఒక రొమ్ములోని పాలు పూర్తయ్యాయని అనిపించాకే మరో పక్కకు మార్చాలి. ఎందుకంటే రొమ్ములో మొదట ఊరే పాలు కాస్త పలుచగా ఉండి పోషకాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ అనంతరం ఊరే పాలు (హైండ్మిల్క్) చాలా చిక్కగా ఉండి, పోషకాల పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే రొమ్ములోని పాలు పూర్తయ్యేవరకూ తాగిస్తే... హైండ్మిల్క్లో ఉండే చిక్కగా ఉండి, కొవ్వులతో కూడిన, పోషకాలతో నిండిన పాలు వస్తాయి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ చనుబాలు పట్టించే అమ్మ ఈ అభిప్రాయంతో తన బిడ్డకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనమేదీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజగుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆ విషయాన్ని పిల్లల డాక్టర్కు చెబితే... వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు ఊహించి కనుగొని, పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. సాధారణంగా కొన్ని రకాల పాల ఉత్పాదనలు, వేరుశెనగలు (పల్లీలు), కొన్ని రకాల నట్స్, కొందరిలో గోధుమలతో చేసిన ఆహారపదార్థాలు, సోయా ఉత్పాదనలు, చేపల వంటివి తల్లులకు సరిపడక... అవి పాలతో పాటు పిల్లల పొట్టల్లోకి చేరి వారిలో కడుపునొప్పిని కలిగించవచ్చు. అయితే తల్లి వాటిని మానేయగానే పిల్లలకూ సౌఖ్యం చేకూరవచ్చు. తల్లి తీసుకునే ఆహారాన్ని డాక్టర్లు చాలా నిశితంగా (మెటిక్యులస్గా), పరిశీలనగా చూస్తూ రకరకాల ఆహారాలను మార్చి ఇస్తూ... ఏ ఆహారాన్ని ఇచ్చినప్పుడు పిల్లల్లో కడుపునొప్పి వస్తుందో గ్రహించి దాన్ని మాన్పిస్తారు. అందుకే తాము ఏ ఆహారాన్ని మార్చాలని తల్లిదండ్రులు భావించినా, మొదట తమ డాక్టర్తో సంప్రదించాకే ఆ పని చేయాలి. దగ్గు పిల్లల్లో దగ్గు దీర్ఘకాలం పాటు వస్తున్నా లేదా పాలిస్తున్నప్పుడు మధ్యమధ్య ఎక్కిళ్లు వస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ లక్షణాలు చిన్నారిలో అంతర్గతంగా దాగి ఉన్న లంగ్స్ లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన లోపాలకు సూచన కావచ్చు. వాంతులు పిల్లలకు పాలు పట్టించగానే కాసేపు చిన్నారిని భుజంపై వేసుకుని నిలువుగా ఉండేలా చూడాలి. ఇలాంటి సమయాల్లో ఎప్పుడైనా వాంతులైనా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కింది సూచనలు కనిపిస్తుంటే మాత్రం తప్పక డాక్టర్ను సంప్రదించాలి. అవి... పాలు తాగుతున్నా బిడ్డ సరిగా బరువు పెరగనప్పుడు కడుపులో ఉన్నదంతా ఒక్కసారిగా బలంగా కక్కేస్తున్నప్పుడు వాంతి చేసుకున్నప్పుడు ఆ ద్రవం ఆకుపచ్చరంగులో/పసుపు రంగులో/రక్తవర్ణంలో/కాఫీ రంగులో ఉన్నప్పుడు విరేచనాల్లో రక్తం పడుతున్నప్పుడు పై లక్షణాలతో పాటు జ్వరం, నీళ్లవిరేచనాలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలూ కనిపిస్తుంటే తప్పక పిల్లల డాక్టర్ను సంప్రదించాలి. పుట్టుకామెర్లు బిడ్డ పుట్టిన ఒకటి రెండు రోజులకే కామెర్ల సమస్య వారిని వేధిస్తుంది. నిజానికి పుట్టగానే పిల్లల కాలేయం ఇంకా తన కార్యకలాపాలకు సిద్ధమై ఉండదు. ఈ అస్తవ్యస్తత వల్ల బిలురుబిన్ అనే జీవరసాయనం పిల్లల రక్తంలో కలిసి, కామెర్లకు దారితీస్తుంది. పుట్టగానే కనిపించే కామెర్లు కాబట్టి వీటిని పుట్టుకామెర్లు అని వ్యవహరిస్తుంటారు. చాలామంది పిల్లలకు ఇది ప్రమాదకరం కానేకాదు. పైగా కొద్దిమేరకు లాభదాయకం కూడా. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లల్లో ఈ కామెర్లు చాలా తీవ్రంగా ఉండి చిన్నారి మెదడుకు సమస్యాత్మకం అవుతాయి. అయితే ఈ సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించి, చిన్నారి మెదడుకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తల్లిపాలు సరిగా పట్టని సందర్భాల్లో ఈ కామెర్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఇలా కామెర్లు కనిపించిన చిన్నారులకు తల్లులు రోజుకు కనీసం 8 నుంచి 12సార్లు తల్లిపాలు పట్టాలి. దీనివల్ల కామెర్లు అదుపులో ఉంటాయి. కామెర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? పిల్లల్లో కామెర్లు తొలుత ముఖం మీద, ఆ తర్వాత ఛాతీ భాగంలో, చివరన కాళ్లూ చేతుల్లో కనిపిస్తాయి. కళ్లలోని తెల్లగుడ్డు పచ్చగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించగానే చిన్నారిని చిన్నపిల్లల డాక్టర్కు చూపించాలి. ఆయన బిడ్డను పరీక్షించి చర్మపురంగు, పసుపుపచ్చరంగులోని తీవ్రత, బిడ్డ వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కామెర్ల తీవ్రతను అంచనా వేస్తారు. ఒకవేళ చిన్నారి పుట్టిన 24 గంటల లోపే కామెర్లు వచ్చినట్లయితే బిలురుబిన్ పరీక్ష చేసి కామెర్లా కాదా అన్న అంశాన్ని నిర్ధారణగా తెలుసుకోవాలి. ఒకవేళ బిడ్డ పుట్టి 3 - 5 రోజులు గడిచిపోయాక కూడా కామెర్ల లక్షణాలు కనిపిస్తూ ఉంటే... అవి తగ్గేవరకూ ఆ బిడ్డను డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచాలి. ఒకవేళ బిడ్డ పుట్టాక 72 గంటల్లో తల్లీబిడ్డల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తుంటే అప్పుడు కూడా బిడ్డలో ఏమైనా కామెర్ల లక్షణాలు కనిపిస్తున్నాయా అని చూశాకే పంపాలి. కొంతమంది పిల్లలను వెంటనే డిశ్చార్జి చేయకుండా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. ఇది ఎవరికి అవసరం అంటే... డిశ్చార్జి చేద్దామనే సమయానికి బిలురుబిన్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్న చిన్నారులకు పుట్టాల్సిన సమయం కంటే రెండు వారాలు ముందుగానే పుట్టిన బిడ్డలకు పుట్టిన 24 గంటల లోపు కామెర్లు వచ్చిన బిడ్డలకు తగినంతగా తల్లిపాలు పట్టలేని బిడ్డలకు ప్రసవ సమయంలో మాడుకు గాయం అయిన బిడ్డలకు ప్రతి ప్రసవంలోనూ తీవ్రంగా కామెర్లు వచ్చిన మెడికల్ చరిత్ర ఉన్న వారికి పుట్టిన పిల్లలకు అతి తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు తల్లి బ్లడ్ గ్రూప్ నెగెటివ్ అయినప్పుడు... ఈ సందర్భాల్లో బిడ్డకు కామెర్లు తీవ్రంగా ఉన్నాయనీ, బిడ్డకు చికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయిస్తే అప్పుడు చిన్నారిని ఆసుపత్రిలోనే ఉంచి ప్రత్యేకమైన కాంతికిరణాలను బిడ్డపై ప్రసరింపజేస్తూ (ఫొటోథెరపీ) చికిత్స అందించాలి. ఇలా ఫొటోథెరపీ ఇచ్చే సమయంలో బిడ్డ కళ్లపై అవి ప్రసరించకుండా చిన్నారి కళ్లను మూసివేసి ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి. తల్లిపాలపై ఉన్న చిన్నారుల్లో ఈ తరహా పుట్టుకామెర్లు రెండుమూడు రోజుల్లో తగ్గుతాయి. అదే ఫార్ములా పాలపై ఉన్నవారికి కామెర్లు తగ్గడానికి రెండు వారాలు పట్టవచ్చు. -
వామ్మో.. చలి
= వణుకుతున్న జనం = చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి = ప్రబలుతున్న వ్యాధులు = కిటకిటలాడుతున్న ఆస్పత్రులు = అంతంతమాత్రంగా వైద్యసేవలు = ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వాతావరణంలో భారీ మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. చలితో వణికిపోతున్నారు. ఫలితంగా వేలాదిమంది రోగాలబారిన పడి ఆస్పత్రుల బాటపట్టారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావటంతో చలితీవ్రత పెరిగింది. సాధారణంగా 32 డిగ్రీల నుంచి 28 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 24 నుంచి 22 డిగ్రీలు నమోదవుతోంది. దీంతో జిల్లా అంతటా ముసురేసుకున్నట్లు ఉదయం నుంచి చీకటి అలముకుంది. సన్నని తుంపర్లు, ఈదరుగాలులు వీయటం ప్రారంభించింది. ఫలితంగా జనం చలితీవ్రతకు అల్లాడిపోతున్నారు. పెరిగిన రోగులు ఒక్కసారిగా వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 74 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులతో పాటు నెల్లూరులో పెద్దాసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రుల్లో సాధారణ రోజుల్లో కంటే గత మూడు రోజులుగా రోగాల బారినపడిన వారు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 3 వేలమంది వివిధ రోగాలతో వస్తుండగా.. మూడురోజులుగా రోజుకు 5 వేల నుంచి 6 వేలకుపైనే వస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులతో కలుపుకుంటే 9వేల వరకు ఉంటుందని అంచనా. గూడూరులోని ఎగువవీరారెడ్డిపల్లికి చెందిన పుండ్ల తిరుపతమ్మ(75) చలిగాలులకు తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. విజృంభించిన వ్యాధులు చలితీవ్రతకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువమంది ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో దోమలు అధికమయ్యాయి. దోమకాటుతో మలేరియా జ్వరాలు కూడా విజృంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు వైద్యులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎన్నడూ లేనివిధంగా.. తడ : గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఓ వైపు పొగమంచు కొండ ప్రాం తాలను తలపిస్తుంటే, ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. చలికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. రహదారిపై వాహనాలు నడిపై డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం ఉటీ, కొడె కెనాల్, మంచుతో కూడిన కొండ ప్రాంతాలను తలపిస్తున్నాయి. మంచు కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులే కాకుండా ఆరోగ్య వంతులు కూడా అనార్యోగం పాలవుతున్నారు. వృద్ధు లు, ఆస్త్మా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో అవసరమైన పనులు ఉంటే తప్ప వీరు వీరితో పాటు చిన్న పిల్లలు సరైన రక్షణ పద్ధతులు పాటించకుండా బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడని మంచు కావలి: ఆకాశం మేఘావృతం కావడంతో పాటు మధ్యాహ్నం 11 గంటల వరకు పట్టణంలో కురుస్తున్న మంచు సోమవారం వీడలేదు. దీంతో మధ్యాహ్నం వరకు జనసంచారం తక్కువగా కనిపించింది. 10 గంటల వరకు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టణంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షసూచన ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా మంచు కురుస్తూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికమైన చలి తీవ్రత అల్లూరు : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సోమవారం వేకువ నుంచి మండలంలో చిరుజల్లులు మొదలయ్యాయి. చలిగాలులు అధికంగా వీస్తుండటంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ముఖాలకు ధరించి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలిగాలులు అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో వర్షాలు నెల్లూరు (రెవెన్యూ): బంగళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోవు 24 గంటల్లో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లల్లో నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 1.5 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సూళ్లూరుపేట లో 7.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరులో 4.2, విడవలూరు 3, కొడవలూరు 1.8, పొదలకూరు 1.2, నెల్లూరు 1.2, కోవూరు 3, ఇందుకూరుపేట 2, టీపీగూడూరు 4.4, మనుబోలు 1.8, గూడూరు 2.6, సైదాపురం 1.8, వెంకటగిరి 1.4, బాలాయపల్లి 1.2, ఓజిలి 1.6, చిల్లకూరు 2.6, కోట 3.2, వాకాడు 4.2, చిట్టమూరు 4.8, నాయుడుపేట 2.2, పెళ్లకూరు 2.4, డీవిసత్రం 6.2, తడ మండలంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జాగ్రత్తలు తీసుకోవాలి కాలుష్యంతో పర్యావరణం దెబ్బతిని రుతువులు మారిపోయాయి. మంచు కాలంలో విపరీతంగా మంచుకురువటం.. వానాకాలంలో అధికవర్షాలు పడటం.. ఎండాకాలంలో ఎక్కువ ఎండ లు కాయటం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎక్కువ మంచు. ఇది చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. = వాకింగ్ చేసేవారు ఉదయం 7 గంటల పైన చేయాలి. = స్వెట్టర్లు, శాలువాలు, మంకీక్యాప్, చేతిక గ్లౌజులు వాడాలి. = కోల్డ్ క్రీమ్లు, గ్లిజరిన్ సోపులు వాడాలి. = నీటిని వేడిచేసుకుని తాగాలి. చల్లని ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిదికాదు. = రాత్రిపూట నివాసాల్లో హీటర్లు పెటుటకోవాలి. - ఈదూరు సుధాకర్, సీనియర్ పబ్లిక్హెల్త్ అధికారి. -
చలితో జాగ్రత్త!
పెరుగుతున్న రోగులు చలికాలం ప్రారంభం నుంచి చర్మసంబంధిత, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు పెరిగాయి. ఈ కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో 30 నుంచి 40 మధ్యలో రోగులు ఉండగా, ఇప్పుడు 40 నుంచి 80 వరకు వస్తున్నారు. రక్షణ చర్యలు ఇవే రోజూ సబ్బుతో కాకుండా సున్నిపిండితో స్నానం చేయాలి. అనంతరం పెట్రోలియం జెల్లీ, ఆలీవ్ ఆయిల్ను కాళ్లు, చేతులు, ముఖానికి రాసుకోవాలి. పెదాల రక్షణకు వెన్న, లిప్కేర్ తదితర క్రీములు ఉదయం, సాయంత్రం వాడాలి. రాత్రుళ్లు వాహనాల్లో ప్రయాణం చేసేవారు స్వెట్టరు, మంకీ క్యాప్, చేతులకు బ్లౌజులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పేష్వాష్తో రోజూ ముఖం కడుక్కోవాలి. చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేరు. వారి శరీరమంత కప్పేలా దుస్తులు వేయాలి. ఉదయం 8 గంటల వరకు, సాయత్రం 7 గంటల తరువాత బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు కలిగి ఉండే పానీయాలు, ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఆస్తమా ఎలా వస్తుంది ? ఊపిరి అందకపోవడం, ఆయాసం రావడం, వాతావరణ కాలుష్యం, పడని పదార్థాలు తినడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు ఆస్తమా రావడానికి కారకాలు. జాగ్రత్తలు ఇలా.. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్, ఎలర్జీకారకాలకు దూరంగా ఉండాలి. పొగ తాగవద్దు,పొగతో నిండిఉన్న గదుల్లో ఉండవద్దు. అనవసర శారీరక శ్రమ చెయ్యకూడదు. కూల్డ్రింకులు, ఐస్క్రీములకు దూరంగా ఉండాలి. చలి, తేమను తప్పించుకుని వీలయినంత వరకు పరిశుభ్రమైన వాతవరణంలో ఉండాలి. ఆస్తమా మందులు, ఇన్హేలర్లను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. రాత్రిళ్లు నిద్రిస్తున్న సమయంలో తలవైపు దిండ్లు ఎత్తుగా అమర్చి వాటిని ఆనుకుని నిద్రపోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి వాతావరణాన్ని బట్టి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు డాక్టర్ సూచించిన సిరప్ తీసుకోవాలి. గట్టిగా శ్వాస పీల్చడం, వదలడం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు రెండు మూడు నిమిషాల పాటు చేయాలి. కాసేపాగి మళ్లీ మొదలు పెట్టాలి. మెడిటేషన్, యోగా చేస్తే చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. వాక్సిన్ వాడడంపై వ్యాధిని నివారించవచ్చు. డాక్టర్ను సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోవాలి. దగ్గు నివారణకు... పొడి దగ్లు, శ్లేష్మంతో కూడిన దగ్గు అని రెండు రకాలున్నాయి. వీటికి బాగా ద్రవాలు(తాగునీరు, టీ, సూపులు)తాగాలి. వేడి నీటి ఆవిరి పట్టాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించాలి. అందుబాటులో మందులు తుమ్ములు, దగ్గు కోసం క్లోరోసిమిరామైన్, సిట్రోజిన్, సిరఫ్, ఆస్తమా, దమ్ము కోసం డెరిఫిలిన్, టాల్బుటమాన్, సిరఫ్, యాంటీబయాటిక్ మాత్రలు ఆక్సిమాలిన్, సిఫ్రోప్లాక్సిన్, సెఫిక్సిన్, చర్మ సంబంధిత వ్యాధులకు సిట్రోజిన్, బెటామిటర్టోన్ క్రీమ్ అందుబాటులో ఉన్నాయి.