Diseases
-
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిడ్స్పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
Year Ender 2024: భారత్ను వణికించిన వ్యాధులు
2024వ సంవత్సరంలో చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదిలో దేశంలో కొన్ని నూతన వ్యాధులు అందరినీ వణికించాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్తో పాటు క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేసింది.నిపా వైరస్: దీనిని జూనోటిక్ పారామిక్సోవైరస్ అని అంటారు. ఇది ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి తొలిసారిగా 2018 మేలో కేరళలో కనిపించింది. ఈ వైరస్ గబ్బిలాలు లేదా పందుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలిసారిగా 2021 జూలైలో కేరళలో ఈ వైరస్ కనిపించింది.క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్లలో తొలిసారిగా ఈ వైరస్ కనిపించింది.చండీపురా వైరస్: దోమలు, పేలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలో ఈ వైరస్ కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు కనిపించాయి. డెంగ్యూ: ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో మొదటి ఈ కేసు తొలిసారిగా 1780లో చెన్నైలో కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.జపనీస్ ఎన్సెఫాలిటిస్: భారతదేశంలో ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2024లో తొలిసారిగా కనిపించింది.క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్డీ): భారతదేశంలో విస్తరిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్గా కేఎఫ్డీ మారింది.ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు: హాంటావైరస్, చికున్గున్యా వైరస్, హ్యూమన్ ఎంట్రోవైరస్-71 (ఈవీ-71), ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) కరోనావైరస్. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
ఉప్పు ఊబిలోకి..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అతి సర్వత్రా వర్జయేత్.. ఏ విషయంలోనూ అతి పనికిరాదు అని చెప్పడానికి ఉద్దేశించిన సూక్తి ఇది. కానీ, ఇప్పుడిది తలకిందులవుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.. అది కూడా ఉప్పు వాడకంలో. దీని వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని.. ఫలితంగా లక్షలాది మంది వినియోగదారులు జీవనశైలి జబ్బులకు గురవుతున్నట్లు న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ (ఎన్సీడీఐఆర్) సంస్థలు గుర్తించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు సగటున ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వాడకూడదని సూచించగా.. ఏపీలో రోజుకు 8.7 గ్రాముల నుంచి 9 గ్రాముల వరకు వాడుతున్నట్లు అవి తేల్చాయి. సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు వాడటంవల్ల జీవితకాల వైకల్యానికి దారితీస్తుందని ఆయా సంస్థలు వెల్లడించాయి.ఊబకాయులకు అధిక ముప్పు..ఆంధ్రప్రదేశ్లో ఉప్పు అధిక వినియోగంవల్ల ఊబకాయుల్లో అధిక ముప్పు పొంచి ఉందని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది అధిక ఉప్పు వినియోగించడంవల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారని, దీని కారణంగా వారు పక్షవాతం బారిన పడుతున్నారని పేర్కొన్నాయి. అలాగే, జనాభాలో ఎక్కువమంది అధిక మోతాదులో తీసుకోవడంవల్లే ఉప్పు ఊబిలో కూరుకుపోయి రకరకాల జబ్బులకు గురవుతున్నట్లు తేల్చారు. అదే అధిక ఆదాయ దేశాల్లో ఉప్పు వినియోగం తక్కువగా ఉందని, దీనివల్ల హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు అక్కడ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ప్యాక్ చేసినవి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని.. ఆకుకూరలు, కూరగాయల్లో సహజ సిద్ధంగానే కొంత ఉప్పు శాతం కలిగి ఉంటాయని, వాటిని అనుసరించి అదనపు ఉప్పును తగ్గించుకోవాలని సర్వే సంస్థలు సూచించాయి. ఇక దేశంలో మధుమేహం, బీపీ, గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఉప్పు, చక్కెర వంటివి వీలైనంత తక్కువగా వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా..ఈ సంస్థలు 18–69 ఏళ్ల వయస్సున్న వారిలో సర్వే నిర్వహించగా.. 70 శాతం మందికి ఉప్పు వినియోగంపై అవగాహన కానీ, దానివల్ల కలిగే ప్రమాదంగానీ తెలీదని తేలింది. సుమారు 3 వేల మందిపై ఈ సర్వే చేయగా.. ఉప్పు వలన కలిగే ప్రతికూలతలపై వారినుంచి సరైన సమాధానాలు రాలేదని, దీన్నిబట్టి వారికి ఉప్పు వినియోగంపై అవగాహనలేదన్న విషయం వెలుగుచూసింది. ఇక పలువురిలో రక్త నమూనాలు, మూత్ర నమూనాలు సేకరించి వారి నుంచి సోషియో డెమోగ్రాఫిక్, బిహేవియర్, మెటబాలిక్ లక్షణాలనూ అంచనా వేశారు. -
కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!
వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.పోషకాహార లోపం... ఓ చిత్రణ‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది. ‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్క్షాప్స్కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్షాప్లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్షాప్లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.ర్యాంప్పై నడకఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.వైద్యులను ప్రోత్సహించడానికి...హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు. -
సూక్ష్మజీవుల దండయాత్ర
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో..వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు. ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదుపులో ఉండని వ్యాధులతో..ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు. ఇన్ఫెక్షన్ల బాధితులే అధికంవరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మందు లవర్స్! లివర్ జాగ్రత్త!
గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్లో మూడు దశలుంటాయి. మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్ఏఎస్హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్లాగా ఏర్పడవచ్చు. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు. ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్ఏఎస్హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి. ఫ్యాటీ లివర్కు చికిత్స : ∙ఆల్కహాల్తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి. లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్ఎఫ్టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. -
ఊరూ.. వాడా.. చెత్తగుట్టలు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా వ్యాధులు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, నగరాల మాదిరిగానే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా గ్రామాల్లో గత మూడేళ్లు కనీసం రెండు రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే క్లాప్ మిత్రలు ప్రతి రోజూ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరించేవారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా గత రెండున్నర నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టే పంచాయతీల సంఖ్య నామమాత్రంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్ ప్రకారం శనివారం (ఆగస్టు 24వ తేదీ) రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.ఐదేళ్ల క్రితం కూడా ఇవే పరిస్థితులు నెలకొనగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2021లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు 14 వేల దాకా మూడు చక్రాల రిక్షాలు, వెయ్యి చెత్త సేకరణ ఆటోలతో పాటు గ్రామాల్లో దోమలు నియంత్రణకు ఫాగింగ్ కోసం 10,628 యంత్రాలు, 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, 6,417 శానిటరీ వేస్ట్ ఇన్సినేటర్స్లను ప్రభుత్వ నిధులతో మంజూరు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు 75 వేల కోట్ల టన్నుల తడి, పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటా సేకరించారు. దీన్ని వర్మీ కంపోస్టుగా మార్చి విక్రయించడం ద్వారా ఆయా గ్రామాలు ప్రాథమిక దశలో రూ.5 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని పొందాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోగాలు ముసురుకుంటున్నాయి.మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీసాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆర్టీపీసీఆర్ కిట్ విశాఖలో తయారైంది. ఏపీ మెడ్టెక్జోన్లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్ను రూపొందించింది. ఈ ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్కు భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణపత్రం అందించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతిని పొందింది. గంటలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఈ కిట్ ద్వారా తేలనుంది. కోవిడ్–19 మాలిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్లలో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరానీ వెల్లడించారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమలో వానలుసాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తేమ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి దిశగా వస్తున్నాయి. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలకు ఆస్కారముంది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 29, 30, 31 తేదీలు, సెప్టెంబర్ మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.మార్చి 31లోపు రిటైరయ్యే వారికి బదిలీ వద్దు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని, వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయాలంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉద్యోగులకు కూడా బదిలీలను వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 శాఖలకు బదిలీలు వర్తింప చేయగా ఇప్పుడు 16వ శాఖగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్కు వర్తింప చేశారు.మలేరియాలో కుప్పం మహిళ గల్లంతు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: మలేరియా రాజధాని కౌలాలంపూర్లో ఫుట్పాత్ కుంగిపోవడంతో కుప్పం అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ మురుగు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణం గాలింపు చర్యలు చేపట్టే విధంగా మలేషియా అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఏపీ ఎన్ఆరీ్టఎస్ను ఆదేశించారు. మహిళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. మలేషియాలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి వరకు గల్లంతైన విజయలక్ష్మి ఆచూకీ తెలియలేదని ఏపీ ఎన్ఆరీ్టఎస్ అధికారులు వెల్లడించారు. -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!
రాజమహేంద్రవరం రూరల్ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.ఆ పేరు ఎలా వచ్చిందంటే..పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశారు. ఏ వ్యాధులు వస్తాయంటే..పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్వార్మ్ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. వైద్యుల సలహాలు తప్పనిసరిజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరిసకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి. –డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం వ్యాధులుసంక్రమించకుండా టీకాలుజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశువుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.–ఎస్.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, కాకినాడశుభ్రత.. భద్రతముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.వ్యాక్సిన్ తప్పనిసరిపెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. -
విజృంభిస్తున్న అంటువ్యాధులు
-
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్వో వన్హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్సీలు, సీహెచ్సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్వో: అన్ని పీహెచ్సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఆహారంలోని ఔషధాన్నే వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది?
ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే. ‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి. ఇంటర్నెట్ నేర్పించింది! ‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను. ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు. ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్పర్ట్లను తీసుకున్నాను. తేనెతోపాటు ఇంకా... ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్ఫ్యూజ్డ్ హనీ తయారు చేశాం. అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను. దుబాయ్లో జరిగే ఎగ్జిబిషన్లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర. ఇష్టంగా పనిచేశాను! నా యూనిట్ని మా అన్నయ్య యూనిట్కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎమ్పీ, ఐఎస్ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే. – ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
వానర రహస్యం రట్టయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం... మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెరి్నంగ్ అల్గారిథమ్ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్జీపీటీ అనుకోవచ్చు. చాట్జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట! -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
డేంజర్ ‘లైఫ్స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్తో ఫ్లూయిడ్ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
పెరుగుతున్న నాన్ కమ్యునికబుల్ జబ్బులు.. 63 శాతం మరణాలకు ఇవే కారణం!
సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది. పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధుల నివారణోపాయాలు ♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ♦ శారీరక శ్రమను పెంచాలి ♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి ♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి ♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి ♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్.. సవాల్గా నిర్వహణ
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు.. ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు.. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. 2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నాయి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
గ్లోబల్ లీడర్లుగా ఎదగండి
నాగపూర్: భారత్ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానం సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లను రీసెర్చ్ ల్యాబ్లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటర్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్స్, క్రిప్టోగ్రఫీ, న్యూ మెటీరియల్స్ దిశగా మన దేశం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ వివరించారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకుంటున్నామని తెలియజేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు. -
పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్..
కంచర్ల యాదగిరిరెడ్డి ముంబై, రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురం, హైదరాబాద్.. ఈ ప్రాంతాలన్నింటా ఇటీవల కొత్తగా కలకలం మొదలైంది. దానికి కారణం తట్టు (మీజిల్స్) వ్యాధి మళ్లీ విజృంభించడమే.. ఈ ఏడాది ఏకంగా 16వేల మంది పిల్లలకు తట్టు వ్యాధి సోకడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. టీకాలు వేసుకోకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నా.. కేవలం ఒక్కసీజన్లో దేశంలో ఇంతమందికి మీజిల్స్ సోకడం అసాధారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్క మన దేశంలోనేకాదు.. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాల్లోనూ కొద్దినెలలుగా వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందులోనూ బాధితులు ఎక్కువగా పిల్లలే. వరుస కోవిడ్ వేవ్ల తర్వాత పరిస్థితి చక్కబడుతున్న సమయంలో (చైనా, మరికొన్ని దేశాలు మినహా) ఇతర వైరల్ వ్యాధుల దాడి పెరగడంపై నిపుణులు అనుమానాస్పదంగానే స్పందిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ముంబైలో మొదలై.. ఈ ఏడాది అక్టోబర్లో ముంబైలో పెద్ద సంఖ్యలో తట్టు కేసులు నమోదయ్యాయి. ఆ నెల 26వ తేదీ నాటికి ఇరవై మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కూడా. తర్వాత రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురంలో..తాజాగా తెలంగాణలోనూ వందల సంఖ్యలో ఈ వ్యాధి కేసులు నమోదవడం గమనార్హం. ముంబైలో మరణించిన పిల్లల్లో ఒక్కరు మాత్రమే తట్టు నిరోధక టీకా వేసుకున్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది. కాకపోతే రెండు డోసులు వేసుకోవాల్సిన టీకా ఒక డోసు మాత్రమే వేసుకున్నట్టు గుర్తించారు. అమెరికాలో పదిరెట్లు ఎక్కువగా.. అమెరికాలో గత మూడు నెలల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదుపు చేయలేనంతగా తీవ్రమయ్యాయి. చాలామంది పిల్లలు రెస్పిరేటరీ సైనిటికల్ వైరస్ బారిన పడుతున్నారు. పెద్దల్లో సాధారణ జలుబు మాదిరి లక్షణాలతో కనిపించే ఈ వ్యాధి.. పిల్లల్లో మాత్రం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో ఈ వ్యాధి కనీసం మూడు సార్లు ప్రభావం చూపిందని న్యూయార్క్లోని మైమోనైడ్స్ పీడియాట్రిక్ సీనియర్ వైద్యులు రబియా ఆఘా తెలిపారు. రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఐసీయూ వార్డు సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధి మామూలుగా తట్టుకోగలిగిన స్థాయిలోనే ఉంటుందని.. ఈసారి మాత్రం లక్షణాలు బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇక గత నెలలో అమెరికాలో ఇన్ఫ్లూయెంజాతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య గత పదేళ్లలోనే అత్యధికమని అక్కడి వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్రిటన్లో బ్యాక్టీరియా దాడి.. బ్రిటన్లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా కారణంగా 16 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్కు ముందు అంటే 2017 –18 సీజన్లో మాత్రమే ఈస్థాయి ఇన్ఫెక్షన్లు, మరణాలు సంభవించాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాతో గొంతునొప్పి, టాన్సిలైటిస్ వంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా మాత్రం మెనింజైటిస్ వంటి ప్రాణాలమీదికి వచ్చే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది మరణాల సంఖ్య మాత్రం అసాధారణంగా పెరిగిందని లండన్లోని పిల్లల వైద్యుడు రోని చుంగ్ అంటున్నారు. కోవిడ్ లాక్డౌన్లు కారణమా? పిల్లల్లో ఈ ఏడాది వైరల్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక కోవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్లు కారణం కావచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్లు విధించాయి. చాలా దేశాల్లో పిల్లలను పాఠశాలలకు, నర్సరీలకు పంపలేదు. వారంతా ఈ ఏడాది మళ్లీ పాఠశాలలకు, నర్సరీలకు వెళుతున్నారు. ఇది ఆర్ఎస్వీ, జలుబు, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సమస్యలు విజృంభించేందుకు కారణమవుతోందని అంచనా. ఇక కోవిడ్ సోకిన పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల కూడా ఈ ఏడాది వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ►కోవిడ్ వచ్చిన తొలి ఏడాది బ్రిటన్తోపాటు అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియాల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోయాయని.. ఈ ఏడాది మళ్లీ అధిక సంఖ్యలో నమోదవడం చూస్తే కోవిడ్ లాక్డౌన్లను అనుమానించాల్సి వస్తోందని క్వీన్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ కానర్ బామ్ఫర్డ్ తెలిపారు. జర్మనీలో 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆర్ఎస్వీ వ్యాధి 2017–2019 మధ్యకాలం కంటే యాభై రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.. న్యూజిలాండ్లో 2021లోనే ఆర్ఎస్వీ కేసులు ఎక్కువైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్తో బలహీనతకు రుజువులు లేవు కోవిడ్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని, తర్వాతి కాలంలో వైరల్ సమస్యలు పెరుగుతాయని చెప్పేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పిల్లల వైద్య నిపుణురాలు రబియా ఆఘా తెలిపారు. ఈ ఏడాది వ్యాధుల బారినపడ్డ పిల్లలు ఎక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాదికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం, మాస్కులు ధరించడం, గాలి, వెలుతురు బాగా ఆడేలా చూడటం అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) మళ్లీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. పొంచి ఉన్న టైఫాయిడ్ ముప్పు భారత్లో సమీప భవిష్యత్తులో టైఫాయిడ్ జ్వరాలు విరుచుకుపడే అవకాశమున్నట్టు ప్రముఖ వైరాలజిస్ట్ గగన్దీప్ కాంగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.28 – 1.61 లక్షల మందిని బలితీసుకుంటుండగా.. ఇందులో 40శాతం మరణాలు భారత్లో సంభవిస్తున్నవే. ఈ వ్యాధి రక్షణకు టీకా ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది తీసుకోవడం లేదని.. ఫలితంగా రానున్న పదేళ్లలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని, వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏకంగా 4.6 కోట్లకు చేరుతుందని ఆమె హెచ్చరించారు. టైఫాయిడ్ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. టీకా కార్యక్రమాన్ని పటిష్టం చేస్తాం దేశవ్యాప్తంగా తట్టు, ఇతర వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇవి సీజనల్ వ్యాధులైనప్పటికీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన ఇటీవల హైదరాబాద్లో చెప్పారు. టీకాలపై అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. -
జబ్బులు బాబోయ్!
సాక్షి, అమరావతి: దేశంలో జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 37 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 75వ జాతీయ నమూనా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అనారోగ్య ప్రాబల్యంపై 75వ జాతీయ నమూనా సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు జీవనశైలి జబ్బులు.. అంటే బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు, నలుగురు గుండె, రక్తనాళాల జబ్బుల బారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కేరళ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ శాతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వారు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. బిహార్, అస్సోం, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారు బిహార్, ఉత్తరాఖండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జీవనశైలి జబ్బులతో పాటు గుండె, రక్తనాళాల జబ్బులు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారు కేరళలో అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ఒత్తిడి సైలెంట్ కిల్లర్.. స్ట్రెస్తో వచ్చే వ్యాధులేంటో తెలుసా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరంగా జీవించగలం... మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఎవరైనా ప్రశాంతంగా జీవించేందుకు వీలుంటుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగుల జీవన విధానంలో యంత్రాల్లా మారిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణ, వ్యాపారం, ఉద్యోగరీత్యా ఇలా రకరకాల ఒత్తిళ్లు సహజంగానే ఉంటున్నాయి. చదవండి: దగ్గును బలవంతంగా ఆపుకోకండి! ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిళ్లు చుట్టుముడుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఆ ఫలితంగా శారీరక సమస్యలు చుట్టు ముడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్వేవ్ సమయంలో భయం, ఆందోళన, ఒత్తిడితోనే ఎక్కువ మంది శ్యాస ఇబ్బందులతో మృతి చెందినట్లు వైద్యులు అంటున్నారు. హార్మోన్స్పై ప్రభావం.. మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మిగతా హార్మోన్స్పై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఆ ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈటింగ్ డిజార్డర్స్తో కొందరు అసలు ఆహారం తీసుకోకపోవడం, మరికొందరు అధిక ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో కొందరు రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటారని, మరికొందరు ఊబకాయలుగా మారుతున్నారు. అంతేకాదు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గుండె లయ తప్పుతుంది.. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో హార్ట్బీట్లో తేడా వస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైన వారిలో ఒక్కోసారి హార్ట్రేట్ పెరిగి సడన్ హార్ట్ ఎటాక్కు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరహా బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. రిలాక్సేషన్ అవసరం.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, దాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఉపయోగకరంగా ఉంటాయి. వాటి ద్వారా మన ఆలోచనలను మళ్లించి మనసు రిలాక్సేషన్ కలిగేలా దోహదపడతాయి. ఏదైనా పనిలో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దానికి ఉపశమనం కలిగే మార్గాన్ని అన్వేషించాలి. మానసిక ప్రశాంతత అవసరం ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిళ్లకు గురైనప్పుడు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. హార్మోన్పై ఎఫెక్ట్ చూపి షుగర్ లెవల్స్ పెరగడం, రక్తపోటు, హార్ట్రేట్లో తేడాలు వంటివి చోటుచేసుకుంటాయి. మానసికంగా పటిష్టంగా ఉన్పప్పుడే శారీరకంగా బలంగా ఉంటారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించగలుగుతారు. – డాక్టర్ వెంకటకృష్ణ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి జీజీహెచ్ ఏకాగ్రత తగ్గుతుంది మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగులైతే పనిమీద, విద్యార్థులైతే చదువుపై దృష్టి పెట్టలేరు. పనిని తర్వాత చేయవచ్చులే అని వాయిదా వేస్తూ ఉండటంతో సోమరితనం పెరిగిపోతుంది. ఇలాంటి వారు ఈటింగ్ డిజార్డర్కు గురవుతారు. అసలు ఆహారం తీసుకోకపోవడం, లేకుండా ఎక్కువ ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. – డాక్టర్ గర్రే శంకర్రావు, మానసిక నిపుణులు, విజయవాడ -
కోవిడ్ ఇక అంటువ్యాధి స్థాయిలోనే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా? జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా. కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము? ►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్ను పరిశీలించడం కోవిడ్తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది. భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి? ►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది. సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్ఐఆర్కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా? ►సీఎస్ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్ఐఆర్లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం. దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది. -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
ఉప్పు ముప్పు.. నిమిషానికి ముగ్గురు మృతి, షాకింగ్ నిజాలు బయటకొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: ఉప్పు వాడకం మితిమీరుతోంది. ఉప్పు దుష్ఫలితాల కారణంగా ప్రపంచంలో ప్రతీ నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అంటే ఏడాదికి 19 లక్షల మంది బలవుతున్నారు. ‘ఉప్పు వాడకం– దుష్పరిణామాలు–నియంత్రణ చర్యల’పై తాజా నివేదికలో ఈమేరకు వెల్లడించింది. ఒక మనిషి రోజుకు సగటున వివిధ రూపాల్లో 5 గ్రాములకంటే తక్కువ పరిమాణంలో ఉప్పు వాడాలి. అయితే ప్రపంచంలో పది గ్రాములు వాడుతుండగా, భారత్లో 11 గ్రాములు వాడుతున్నారు. 5 గ్రాముల్లోనే అయోడైజ్డ్ ఉప్పు కూడా ఉండాలి. ప్రపంచంలో 188 కోట్ల మంది అయోడిన్ లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, గొంతు దగ్గర వాపు ఉంటాయి. గర్భిణీకి అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. ఉప్పు అధికంగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి. ఇతరత్రా జీవనశైలి వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. ఉప్పు నియంత్రణలో ప్రాథమిక దశలోనే.. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలంటే నాలుగు దశల కార్యక్రమం అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొదటి దశ విధాన నిర్ణయం, రెండోది స్వచ్ఛందంగా ముందుకు రావడం, మూడోది తప్పనిసరిగా అమలు చేయడం, నాలుగోది ప్రతీ ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందో తెలియజెప్పేలా ఆదేశాలు జారీ చేయడం. ఇందులో భారత్ కేవలం మొదటి దశకే పరిమితంకాగా, ప్రపంచంలో 41 దేశాల్లో పై నాలుగు దశల కార్యక్రమం అమలవుతోంది. చికెన్, సూప్స్, స్నాక్స్, బ్రెడ్, నిల్వ ఉంచిన చికెన్లో ఉప్పుకు పరిమితి పెట్టిన దేశాలు అర్జెంటీనా, బల్గేరియా, ఇరాన్, జోర్డాన్, ఇరాక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, స్పెయిన్, పాలస్తీనా వంటి 41 దేశాలున్నాయి. వంద గ్రాముల ఆహారపదార్థాలకు ఎంత ఉప్పు వాడాలో ఒక ప్రామాణికాన్ని అమలు చేస్తున్నాయి. ఆదర్శమైన దేశాలు... కొన్ని దేశాలు ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించాలన్న చట్టాన్ని తేవడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గాయి. దక్షిణ కొరియాలో 2010–14 మధ్యలో ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును తగ్గించే చర్యలు చేపట్టగా.. ఆ ఐదేళ్లలోనే ఉప్పు వినియోగాన్ని 24 శాతం తగ్గించారు. దీంతో బీపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థాయ్లాండ్లో ప్రపంచ సగటు కంటే ఎక్కువ వినియోగం ఉంది. దీంతో 25 శాతం మంది ప్రజలు బీపీ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 30 శాతం ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన పద్ధతి తెచ్చింది. ప్రతీ పెద్ద వయస్సు వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నాడు? పరిమాణం ఎంత ఉంటుందన్న పరీక్షలు చేశారు. అలా బీపీని నియంత్రిస్తున్నారు. హైదరాబాద్లో 40 శాతం మందికి బీపీ... కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం హైదరాబాద్లో 40 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మహిళల్లో 26 శాతం, పురుషుల్లో 32 శాతం బీపీతో బాధపడుతున్నారు. పట్టణాల్లోనే బీపీ ఎక్కువగా ఉంది. లాన్సెట్ సర్వే ప్రకారం.. భారత్లో మరణాలకు ఐదు ప్రధాన కారణాల్లో బీపీ ఒకటని తేలింది. మిగిలినవి మధుమేహం, కాలుష్యం, పొగాకు వాడకం, పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఉప్పు నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ చేసిన సిఫార్సులివీ... –దేశంలో సగటున ఎంత ఉప్పు వాడుతున్నారో పర్యవేక్షించాలి. –ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు ఎంతుందో లేబుల్ మీద రాయాలి. –ప్రధానంగా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అలా ప్రజల్లో ఉప్పు తగ్గించేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. –సాధారణంగా బ్రెడ్డు, ప్రాసెస్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ మీట్, డెయిరీ పదార్థాల్లో నిల్వ కోసం ఉప్పు వాడతారు. దీన్ని తగ్గించాలి. 87 శాతం ఆహారంలో వేసుకోవడం వల్లే... అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు ఎక్కువగా వస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి జబ్బులను తగ్గించడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గం. దక్షిణ భారతదేశంలో ప్రాసెస్డ్ చికెన్, పౌల్ట్రీల ద్వారా ఏడు శాతం ఉప్పు, పాల పదార్థాల ద్వారా 3 శాతం, ఆహార పదార్థాల్లో, పెరుగు వంటి వాటిల్లో వేసుకోవడం వల్ల 87 శాతం ఉప్పు వాడకం జరుగుతోంది. ఉప్పును అదనంగా వేసుకోవడంలో మహిళలు ముందున్నారు. బాగా చదువుకున్న వారే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. సగానికిపైగా స్క్రీనింగ్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్ చేశారు. బీపీలో కోనసీమ టాప్ ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్టెన్షన్ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్తో బాధపడుతున్నారు. స్క్రీనింగ్ వివరాలతో ఐడీలు ఎన్సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్సీల్లో ఎన్సీడీ క్లినిక్లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్సీడీ స్క్రీనింగ్తో పాటు ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లు ఏడాదికి 98 రోజులపాటు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరితిత్తులకు పొగబెట్టే సూక్ష్మ ధూళికణాల మోతాదు 2020 కంటే.. 2021 చివరి నాటికి గణనీయంగా పెరిగినట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు (పీఎం– 2.5) సరాసరిన 41 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు లెక్కతేల్చింది. కాలుష్యం కారణంగా నగరవాసులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. 2020లో కాలుష్య మోతాదు లాక్డౌన్ కారణంగా తగ్గుముఖం పట్టినట్లు అంచనా వేయడం విశేషం. దక్షిణాదిలో ఇక్కడే అత్యధికం.. ► దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడోస్థానంలో నిలిచినట్లు ఈ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. రెండోస్థానంలో పొరుగునే ఉన్న ఏపీలోని విశాఖపట్టణం నిలవడం గమనార్హం. 2020లో నగరంలో 60 రోజులు మాత్రమే కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయగా.. 2021 సంవత్సరంలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యంతో సతమతమైందని ఈ నివేదిక తెలిపింది. విశాఖపట్టణం 86 రోజులపాటు కాలుష్యంతో అవస్థలు పడుతోందని నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాదిలో డిసెంబరు– మార్చి మధ్యకాలంలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది. చదవండి: ముచ్చింతల్లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన ► శీతాకాలంలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంటున్న కారణంగా సిటీజన్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. ఏడాదిలో గ్రేటర్ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యం.. మరో 96 రోజులపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోపలే వాయు కాలుష్యం నమోదవుతుండడంతో వాయు నాణ్యత సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించింది. శీతాకాలంలో సూక్ష్మ ధూళికణాల మోతాదు డిసెంబరు 26, జనవరి 3, 2021 తేదీల్లో అత్యధికంగా నమోదైందని తెలిపింది. ► ఈ రెండు తేదీల్లో ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 81 మైక్రోగ్రాములుగా నమోదవడం గమనార్హం. పారిశ్రామిక అడ్డాగా ఉన్న సనత్నగర్ ప్రాంతంలో సరాసరిన 83 మైక్రోగ్రాముల మేర సూక్ష్మ ధూళికణాలు నమోదయినట్లు సీఎస్ఈ నివేదిక వెల్లడించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ వద్ద కూడా సరాసరిన ఘనపు మీటరు గాలిలో 57 మైక్రోగ్రాములుగా ధూళి కాలుష్యం నమోదవడం గమనార్హం. చదవండి: భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా -
‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలాంటి సినిమాలు చూసి, లేదా కథలు చదివి మనం వినోదం పొందుతాం. ఇలా రుధిరాన్ని ఆస్వాదించే కారెక్టర్స్ను వాంపైర్స్ అని పిలవడం కూడా మనకు తెలుసు. కానీ వాంపైరిజమ్ అనే కండిషన్ ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతోకొంత రుచి చూస్తాడు. చటుక్కున వేలు తెగినప్పుడు చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకే ఇలా చేస్తారు. అయినప్పటికీ ఇలా తన రక్తాన్ని రుచిచూసే ఆ ప్రక్రియకు ‘‘ఆటో వాంపైరిజమ్’’ అంటారు. ఇది సాధారణం. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఇంకా అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇలా రక్తం తాగాలనే కోరిక పుట్టడాన్ని ‘‘క్లినికల్ వాంపైరిజమ్’’ అంటారు. ఇక మరికొందరిలో ఇది ఓ రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన (బిహేవియరల్) రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ చికిత్స అందిస్తారు. చదవండి: ‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు! -
మందులోడా... ఓరి మాయలోడా!
మనుషుల అవసరాలే వ్యాపారులకు లాభాలు తెచ్చే గనులు. మనుషులకు ఏం కావాలో ఓ కంట కనిపెట్టి వ్యాపారులు వాటిని తయారు చేసే పనిలో పడతారు. యుగాల తరబడి జరుగుతున్నది ఇదే. అసలైన వ్యాపారి ఎడారిలో ఇసుకను ఒంటెలకు అమ్మి బతికేయగలడు. తన దగ్గర ఉన్నదాన్నే ప్రజలకు అవసరం అయ్యేలా చేసే వ్యాపారులు మాయలోళ్లే! డబ్బు అవసరం ఉన్నవారికి వడ్డీకి అప్పులు ఇవ్వడం కొందరి వ్యాపారం. డబ్బుకు ఎంతగా కటకటలాడుతున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా వడ్డీ రేటు పెంచేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద దేశాలు కూడా అదే చేస్తాయి. చిన్న దేశాల అవసరాలను ఆసరా చేసుకొని, ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి వాటికి ఆర్థిక సాయం ముసుగులో అప్పుల ఊబిలోకి దింపేస్తాయి.ఒకప్పటి పెద్దన్న అమెరికాను కూడా భయపెడుతున్న చైనావాడు చేస్తున్నది అదే! ఎవరికన్నా ఏ రోగమో వస్తే దాన్ని నయం చేసే మందు తయారు చేయడం లాభసాటి వ్యాపారం. మరి మనుషులకు రోగాలే రాకపోతే ఆ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అందుకోసం ఆ వ్యాపారులు ఏం చేస్తారు? అందరికీ తరచుగా రోగాలు వస్తూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఔషధ వ్యాపారమే! ఫార్మా కంపెనీలు మూడు మాత్రలు... ఆరు గోలీలన్నట్లు దూసుకుపోతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వర్షాకాలం ఆరంభంలో జ్వరం రావడమే పెద్ద రోగం. దానికి మిరియాల కషాయంతోనో, శొంఠి కషాయంతోనో వంటింటి వైద్యం చేసేసుకునేవారు. రెండేళ్ళుగా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఈ రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల మేరకు ఔషధ వ్యాపారం, ఆసుపత్రుల వ్యాపారం జరిగాయి. ఎప్పుడూ వినని, ఎన్నడూ కనని కరోనా రోగం ఓ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ వైరస్ దానంతట అదిగా పుట్టిందా, లేక మనుషులే తయారు చేశారా అన్న చర్చ ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. కారణం – ఈ వైరస్ను చైనాలోని వూహాన్ ల్యాబ్ నుండి ప్రపంచంపైకి వదిలిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, దీనికి కారణం చైనా కాదు... చైనాలోని అమెరికాకు చెందిన మాంసం ఎగుమతి కర్మాగారాలేనని మరో వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలలో ఎవరు చెప్పింది నిజమైనా... ఈ రోగాన్ని ప్రపంచానికి అంటించింది మాత్రం మనుషులేనన్నది అర్థమవుతోంది. అది నిజంగానే నిజం అయితే... అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. ఒకప్పుడు కలరా వణికించింది. మలేరియా భయపెట్టింది. వాటికి వ్యాక్సిన్లు తయారుచేశారు. అటువంటి ఓ కొత్త వ్యాపారం కోసమే కరోనాను కనిపెట్టారా? అది నిజం కాదని అంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదే నిజం అయితే మాత్రం చాలా చాలా భయంగానూ ఉంటుంది. భయం... ఇక్కడ రోగం వల్ల కాదు... దాన్ని మనపైకి వదిలిన దుర్మార్గుల వల్ల! కొన్నేళ్లుగా చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అసలీ రెండు జ్వరాల ఊసే లేదు. అప్పుడు లేని జ్వరాలు ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి అని కొందరి ప్రశ్న. కొంపదీసి ఈ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలను కూడా ఎవరో ఉత్పత్తి చేసి మానవాళిపైకి వదిలారా? జ్వరాలతో జనం వణుకుతూ ఉంటే... వాటికి మందులు అమ్మి, లాభాలు గడిస్తున్నారా? అని మరికొందరికి మాచెడ్డ అనుమానం. నిజానిజాల సంగతి తరువాత కానీ... ముందుగా అసలీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయని అడిగామనుకోండి... ఔషధ వ్యాపారులతో పాటు బడా ఆసుపత్రుల భారీ ధనాశ చూస్తోంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమేనని అనిపించడం లేదా అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతగా పెరగని కాలంలో... గర్భవతులకు నూటికి నూరు శాతం సాధారణ డెలివరీలే అని ఆ తరం పెద్దవాళ్ళు చెబుతుంటారు. వైద్యవిద్య అంటే ఏమిటో కూడా తెలియని మంత్రసానులు పురుళ్లు పోసి, పండంటి బిడ్డలను కానుకగా ఇచ్చేవారు. తేడా ఎక్కడ ఉందో తెలీదు కానీ... ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతూ వచ్చాయి. ఏడు నెలల గర్భవతి కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వస్తే చాలు... సిజేరియన్ చేయకపోతే తల్లికీ బిడ్డకీ ప్రమాదమేనని చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నారు అని కొందరి తీవ్ర ఆరోపణ. నిజానికి, అటు రోగాల్లోనూ, మందుల్లోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవి అన్నీ కచ్చితంగా చెడ్డవి కావు. అలా గంపగుత్తగా ఓ ముద్ర వేసేయడం సరైనది కాదు. నయం కాని రోగాలకు కొత్త మందులు ఆవిష్కరించడం శాస్త్రీయ పరిశోధనలో కచ్చితంగా పెద్ద ముందడుగే. కాకపోతే ఆ మందుల అవసరం లేని వాళ్లతో కూడా వాటిని కొనిపించడానికి ప్రయత్నిస్తేనే... తప్పు. అలా చేసే వారే అసలు విలన్లు. ఏ వ్యాపారాన్నైనా క్షమించవచ్చు కానీ... విద్య, వైద్యం లాంటి విషయాల్లో మాత్రం కాదు. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కనిపెట్టి, కళ్ళెం వేయాల్సింది పాలకులే. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న నానుడి పుట్టిన దేశం మనది. ఇక్కడే వైద్యం అంటే... డబ్బు కోసం జరిగే వ్యాపారం అనిపిస్తే మాత్రం మంచిది కాదు. అందుకే, ఈ రోగాన్ని నయం చేయడమెలాగో అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదో ఒక మందు కనిపెట్టాలి! -
ఎండు తెగులుతో దెబ్బతిన్న మామిడి తోటను ప్రకృతి సేద్యంతో రక్షించాడిలా..!
ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం. నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు. చదవండి: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి. పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం. ప్రతి ఏటా కాపు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా. ఎండు తెగులు మటుమాయం ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. – మూల్పూరి నాగవల్లేశ్వరరావు (నాని– 94916 99369), మామిడి రైతు, కొర్లగుంట, ముసునూరు మం., కృష్ణా జిల్లా. ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. – చొప్పర శ్రీనివాసులు (79950 86773), ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు. సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్లోని ఐఐఎఫ్ఎస్ఆర్, ఘజియాబాద్లోని ఎన్సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మట్లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in ఇతర వివరాలకు.. కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020. అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు ‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709. 15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి: లక్షణాలు ఇవే, జాగ్రత్తలు అవసరం!
సాక్షి,అనంతపురం: కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పశుసంవర్ధక శాఖ ఇన్చార్జ్ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం, రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్రం ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్ సూచించారు. ప్రముఖ జీవ శాస్త్రవేత్త, రేబీస్ టీకా సృష్టికర్త సర్ లూయిస్ పాశ్చర్ వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28ని ప్రపంచ రేబీస్ నియంత్రణ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రేబీస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశు వైద్యశాలల్లో మంగళవారం కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం 2,600 డోసులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రేబీస్ వ్యాప్తి ఇలా.. ‘రాబ్డో’ కుటుంబానికి చెందిన ‘లిస్సా’ వైరస్ కారణంగా రేబీస్ వ్యాధి వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఆవులు, గొర్రెలు, పందులు, గుర్రాల్లో ఈ వైరస్ కనిపిస్తుంది. వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కనో, ఇతర జంతువునో, మనిషినో కరచినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. 90 శాతం కుక్కల వల్లనే మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కుక్క కాటు వేయగానే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది న్యూరో మస్కులర్ స్టిండిల్ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది. అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. శ్వాస దిగ్బంధనం వల్ల రేబీస్ వ్యాధి సోకిన కుక్క చనిపోతుంది. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన లక్షణాలు (ఫ్యూరియస్ ఫారం), మరొకటి తీవ్రత తక్కువ గల లక్షణాలు (డంబ్ ఫారం). తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే వ్యాధికి గురైన కుక్కలు శబ్ధాలకు అతిగా స్పందిస్తాయి. ఇతర జంతువులు, మనుషులు, చలనం లేని వస్తువులపై దాడి చేస్తుంటాయి. నడకలో కాళ్ల సమన్వయం లేకుండా పోవడం, పిచ్చిగా విపరీతంగా అరవడం చేస్తుంటాయి. చివరగా 24 నుంచి 48 గంటలల్లోపు వ్యాధి తారాస్థాయికి చేరుకుని పక్షవాతానికి గురై మరణిస్తుంది. ఇక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వాటిలో వెనుక కాళ్లు మడత పడుతుంటాయి. తరచుగా తోక ఒకవైపు ఒరిగి ఉంటుంది. శబ్ధాలకు స్పందించే గుణం తక్కువగా ఉండి, నోటి నుంచి చొంగ కారుతూ, ఆవలిస్తున్నట్లుగా అరవడం చేస్తుంటాయి. ఇలాంటి లక్షణాలున్న కుక్కలు వారం నుంచి పది రోజుల్లో మరణిస్తాయి. ముందస్తు జాగ్రత్తలతోనే నివారణ ప్రాణాంతక రేబీస్ వ్యాధి సోకకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయ మార్గం. కుక్క కాటుకు గురైన వారు నీటి కొళాయి కింద కార్బలిక్ సబ్బు లేదా డెట్టాల్ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలి. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వల్ల వైరస్ కదలికలను కొంత వరకు తగ్గించవచ్చు. కుక్క కరచిన మొదటి రోజు నుంచి 3, 7, 14, 28, 90వ రోజుల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, పశుసంవర్ధకశాఖ సహకారంతో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు టీకాలు వేయిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్స్క్రీన్పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలె క్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వారి్మంగ్పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్వర్క్, హోమ్వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. రోజుకు సగటున 20–30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 10–24 సంవత్సరాల మధ్య వయసున్నవాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. 2008 నుంచి గూగుల్లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. – డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచి్చంది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కలి్పంచడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !) -
వీఐటీఏపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు!
అమరావతి: వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చవల్ విధానంలో ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ‘‘వ్యాక్సిన్ గాడ్ మదర్ ఆఫ్ ఇండియా’’ డైరెక్టర్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్, ప్రొఫెసర్ మరియు లాబరేటరీ డైరెక్టర్, వెల్కమ్ ట్రస్ట్ రీసెర్చ్ లాబరేటరీ, సి.ఎం.సి. వెల్లూరు గౌరవ అతిధిగా, (వీఐఈసీఈ 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థిని) సీనియర్ డైరెక్టర్, ఒరాకిల్ కార్పొరేషన్, యు.ఎస్.ఏ.. శైలజ మలిరెడ్డి హజరయ్యారు. కాగా, ముఖ్యఅతిథిగా హజరైన గగన్ దీప్ కాంగ్మామాట్లాడుతూ.. అంటూ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల గురించి వివరించారు. ప్రస్తుతం మరియు భవిష్యత్ లలో వ్యాధుల వ్యాప్తిలో జరిగే మార్పులు గురించి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాధులు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని దీనికి జనాభా పెరుగుదల ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయని అన్నారు. ఎయిడ్స్, జిక, ఎబోలా, సార్స్, కోవిడ్ వంటి మహామ్మారులు ఎలా వ్యాప్తి చెందుతాయో, వ్యాధినిరోధక టీకాలతో వీటిని కట్టడిచేసి మరణాల రేటుని ఎలా తగ్గించావచ్చో, వివిధ వ్యాధి నిరోదోక టీకాల పనితీరు, అభివృద్ధి, భవిష్యత్ తరాలకు అవి ఉపయోగపడే విధానాల గురించి వివరించారు. గౌరవఅతిధి శ్రీమతి. శైలజ మలిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో వి.ఐ.టి.లో గడిపిన క్షణాలను గుర్తు చేస్తుకున్నారు. విద్యతోనే మహిళా అభివృద్ధి సాధ్యమని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ప్రతి మహిళా కృషి చేయాలనీ తెలియచేస్తూ, సామజిక సేవా రంగంలో తను చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా వివరించారు.వి.ఐ.టి.ఏ.పి విశ్వవిద్యాలయ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్య పెంటారెడ్డి మాట్లాడుతూ మహిళల సమన హక్కులు , వరకట్న నిషేధం, లింగ మరియు ఆర్థిక అసమానతలు, మహిళల్లో బహుళ సామర్థ్యం గురించి చక్కటి ప్రజెంటేషన ద్వారా వివరించారు. వి.ఐ.టి. ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ... అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి, గౌరవ అతిధులను కొనియాడారు. ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని, ప్రపంచ జనాభాలో 49.9 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, అదే భారత దేశంలో కేవలం 48.4 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలియచేసారు. మహిళా సాధికారికత, రాజకీయాలలో మహిళల పాత్ర గురించి వివరించారు.మహిళలు ఉన్నత విద్యలో రాణించేందుకు యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (University Higher Education Trust) ద్వార సహాయం అందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక పోటీలలో విజేతలుగా నిలచిన విద్యార్థులకు, సిబ్బంది మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి.ఐ.టి.ఏ.పివిశ్వవిద్యాలయవైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ ఎస్.వి. కోటా రెడ్డి , రిజిస్ట్రార్ సి.యల్.వి. శివకుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో 30 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండడం విశేషం. -
అడవిలో అన్నలకు అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాక్డౌన్ను ఆసరాగా చేసుకుని తిరిగి నెట్వర్క్ ను విస్తరిద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నక్సల్స్కు పోలీసుల ప్రతి వ్యూహంతో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్ర అడవుల్లో పోలీసులు నిరంతరం కూంబింగ్ చేపడుతూ మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్ వైపు తరుముతున్నారు. దీంతో అన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా కొంతకాలంగా మావోయిస్టుల్లో చాలామంది అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది. లాక్డౌన్ కాలంలో చందాల వసూళ్లు, రిక్రూట్మెంట్, మందులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. కానీ, పోలీసులు రాష్ట్రంలోకి వచ్చిన మావోయిస్టులను తిరిగి ఛత్తీస్గఢ్కు తరిమికొట్టే ఆపరేషన్ ప్రారంభించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు, నిరంతర కూంబింగ్, నదీపరీవాహక ప్రాంతాలపై నిఘా చర్యలతో మావోయిస్టు కొరియర్ వ్యవస్థ స్తంభించింది. లాక్డౌన్ అనంతరం జరిగిన 11 ఎన్కౌంటర్లలో, 11 మంది మరణించారు. 135 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర సెక్రటరీలు, నలుగురు జిల్లా కమిటీ, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాలకు వచ్చి మందులు, నిత్యావసరాలను అడవుల్లోకి తీసుకెళ్లే కొరియర్ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఫలితంగా సకాలంలో మందులు అందక, చిన్న జ్వరాలు, రోగాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగినా.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, బడే చొక్కారావు అలియాస్ భాస్కర్, అగ్రనేత హరిభూషణ్ సెంట్రల్ కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పలు ప్రాంతా ల్లో సంచరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కోసం తీవ్రంగా శ్రమించినా అనుకున్న మేరకు సఫలీకృతం కాలేకపోయారు. వీరిలో హరిభూషణ్ సంచారంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అడెల్లు భాస్కర్ రెండు సార్లు, ద్వితీయ శ్రేణి నాయకుడు కంకణాల రాజిరెడ్డి ఒకసారి పోలీసులకు తారసపడ్డారు. వీరిద్దరూ పోలీసుల కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు. ఎలా తెలిసిందంటే... మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెల్లడైంది. ‘భిక్షపతి అలియాస్ విజేందర్ 2018లో దళంలో చేరాడు. ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. పోలీసుల అష్టదిగ్బంధనం కారణంగా చికిత్స అందకపోవడంతో ఈనెల 18వ తేదీన మరణించాడు’ అని గురువారం విడుదల చేసిన లేఖలో జగన్ ఆరోపించారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్లు కొనుగోలు చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టులు అప్పుడు కొనుగోలు చేసిన మందులు జనవరి నాటికి దాదాపుగా అయిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఫలితంగా టాబ్లెట్లు దొరక్క.. బయటకు వచ్చే అవకాశం లేక మావోయిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. భిక్షపతి ఇంటి వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు,(ఇన్సెట్) భిక్షపతి (ఫైల్) మా కొడుకు తిరిగొస్తాడనుకున్నాం చిట్యాల: అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుమారుడు భిక్షపతి తిరిగి వస్తాడనుకుంటే కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు సమ్మక్క–ముత్తయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి సమ్మక్క–ముత్తయ్య దంపతులకు నలుగురు సంతానం. పెద్దకుమారుడు భిక్షపతి డిగ్రీ చదివాడు. 2018లో ఉద్యమంలో చేరాడు. చదవండి: సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి -
ఈ నాలుగు.. ప్రమాదకరం
‘జీవనశైలి’ జబ్బులు ప్రాణాంతకమవుతున్నాయి. బిజీ జీవితంలో వ్యాయామంపై శ్రద్ధ చూపకపోవడం అనేకమందికి ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు–అంటువ్యాధులు కానివి)తోనే మృతి చెందుతున్నట్టు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని హెచ్చరించింది. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్స్ (పక్షవాతం–హైపర్టెన్షన్ కారణంగా వచ్చే) వంటి జీవనశైలి జబ్బులతో ఏటికేటికీ మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. దీన్ని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. కోవిడ్ సోకిన వారిలోనూ ఎక్కువ మంది ఈ అసాంక్రమిక వ్యాధి బాధితులే మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పొగ తాగడం, మద్యం, హానికర తిండి తినడం, శారీరక శ్రమ లేకపోవడం జీవనశైలి జబ్బులకు ప్రధాన కారణాలు. ఎక్కువమందికి వ్యాయామంపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు కారణమవుతోంది. స్థూలకాయం కారణంగా చాలామంది రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. – సాక్షి, అమరావతి ప్రత్యేక సాఫ్ట్వేర్తో రాష్ట్రంలో ఇంటింటి సర్వే జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మన రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఓడీకే (ఓపెన్ డేటా కిట్) పేరుతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటికే 72 శాతానికిపైగా పూర్తయింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా సుమారు 19 వేలమంది ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మధుమేహం, బీపీ, క్యాన్సర్, లెప్రసీ వంటి జబ్బులపై ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తూ ఈ సర్వే సాగుతోంది. వ్యక్తి ఎత్తు, బరువు, బీపీ, బయోకెమికల్ ఎస్టిమేషన్స్, ఫాస్టింగ్ బ్లడ్ సుగర్, యూరినరీ సోడియం పరిమాణం వంటివి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు దాటిన వారిలో 14.2 శాతంమంది పొగ తాగుతున్నారు. 21.4 శాతం మంది పొగలేని పొగాకును వాడుతున్నారు. 18 శాతం మంది హైపర్ టెన్షన్ (బీపీ)తో, 13 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చూస్తున్నారు. -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతను పాటించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్లోని తన ఇంటి పరిసరాలను మహమూద్ అలీ శుభ్రంచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న క్రమంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా మాస్కు, శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. -
క్యాన్సర్పై యుద్ధం!
ఆకివీడు: రాష్ట్రంలో క్యాన్సర్ను అదుపు చే సేందుకు ప్రభుత్వం గట్టి చర్యలకు పూనుకుంది. వ్యాధి ముదరకముందే గుర్తించి నివారించే ప్రణాళికలు చేపట్టింది. ప్రాథమిక దశలో గుర్తించని కారణంగా.. క్యాన్సర్ వ్యాధి ముదిరి వేలమంది మృత్యువాత పడుతున్నారు. ముందు గుర్తించగలిగితే కొన్ని ప్రాణాలనైనా కాపాడగలమనే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాన్సర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్ రోగులకు విస్తృత సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో 131 రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్స అందిస్తుండగా మరో 44 రకాల జబ్బులను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. విస్తరిస్తున్న వ్యాధి.. జిల్లాలో చాప కింద నీరులా క్యాన్సర్ విస్తరిస్తోంది. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభమమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అనారోగ్యంగా పెరిగి కణుతులుగా మారతాయి. శరీరంలో ఇష్టారాజ్యంగా కణుతులు పెరగడమే క్యాన్సర్గా చెప్పవచ్చు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా క్యాన్సర్ విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో క్యాన్సర్కు పూర్తి వైద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాలో 40 వేల మందికి పైగా రోగులు.. జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కలుషిత వాతావరణం, ఆహారం, నీటి కాలుష్యం, కల్తీ నూనెలు తదితరాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో మూడు, నాలుగు స్టేజ్లలో ఉన్న క్యాన్సర్ రోగుల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా. 1, 2 స్టేజ్లలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు రోగం బయటపడే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ప్రతిఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బును గుర్తించి, తగిన మందులు వాడటంతో నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతినెలా పరీక్షా శిబిరం : కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా నెలకో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించవచ్చని ప్రభుత్వం నిర్ధారించింది. పలు రకాల క్యాన్సర్ రోగాల్ని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా తగిన మందులు వాడటంతో నివారించవచ్చని వైద్యులు పేర్కొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోదావరి వాసులే అధికం.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని క్యాన్సర్ ఆసుపత్రుల వద్ద గోదావరి జిల్లాలకు చెందిన క్యాన్సర్ రోగులే అధిక శాతం ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆకివీడులో ఇటీ వల క్యాన్సర్ వ్యాధితో ముగ్గురు వైద్యులు అకాల మృతి చెందడం వ్యాధి విస్తరణకు అద్దం పడుతోంది. మలం, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం ద్వా రా వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రధానంగా గొంతు, రక్త, మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బాధితులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిలో 20 నుంచి 30 శాతం క్యాన్సర్తో బాధపడుతున్నారని ఎన్ ఐపీ సంస్థ గతంలో వెల్లడించింది. నాణ్యమైన గింజతోనే ఆరోగ్యం నాణ్యమైన, సేంద్రియ, ఆరో గ్యకరమైన ఆహారాన్ని పండించేలా చర్యలు చేపడితే రోగాలు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా పారద్రోలవచ్చు. కలుషిత ఆహారం వల్లే క్యాన్సర్ విస్తరి స్తోంది. మనిషిలోని కణాలు రోజురోజుకూ మందగించడం వల్లే కణం అదుపు తప్పి క్యాన్సర్గా మారుతోంది. – డాక్టర్ పీబీ ప్రతాప్కుమార్, సీనియర్ వైద్యులు, ఆకివీడు ఆరోగ్యశ్రీ వరం ఆరోగ్యశ్రీ పథకం క్యాన్సర్ రోగులకు వరం. ఈ పథకంలో కొత్తగా 44 రకాల క్యాన్సర్ చికిత్సలను చేర్చడంతో మొత్తం 175 క్యాన్సర్ జబ్బులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనుంది. క్యాన్సర్ రోగులను ప్రాథమిక దశలో గుర్తించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయం. – కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్, వైఎస్సార్సీపీ, ఆకివీడు ప్రాథమికస్థాయిలో కొన్ని గుర్తిస్తున్నాం ప్రాథమిక స్థాయిలో కొన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించి, ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నాం. అన్ని క్యాన్సర్ వ్యాధుల్ని గుర్తించలేం. స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే గుర్తించాలి. ప్రతి నెల ఆరుగురు, ఏడుగురు రోగులను ఉన్నత వైద్యానికి రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ భీమవరపు బిలాల్, సీహెచ్సీ వైద్యులు, ఆకివీడు -
జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది జూన్ వరకు నిర్వహించిన సర్వే వివరాలను ఎన్ఎస్వో అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని తేలింది. ఇన్పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్ సంబంధిత రోగాలతోనే వస్తున్నారని వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల తర్వాత ఎక్కువ మంది గాయాలతో వస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో పేగు, గుండె సంబంధిత రోగులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న వారిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువని సర్వే తేల్చింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 31.4 మంది మగవారు, 31.8 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 31.3 శాతం మంది పురుషులు, 31.4 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ జబ్బులకు గురువుతున్నారని వెల్లడైంది. కేన్సర్కే అత్యధిక ఖర్చు... ఖర్చుల విషయానికి వస్తే అన్నింటికన్నా కేన్సర్ చికిత్స కోసం ఎక్కువ ఖర్చవుతోందని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం సగటున ప్రతి కేన్సర్ రోగికి కనీసం రూ. 61,216 ఖర్చవుతోందని సర్వే తేల్చింది. ఆ తర్వాత గుండె జబ్బులకు ఎక్కువ ఖర్చవుతుండగా రోగాల సంఖ్యలో ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు అతితక్కువ ఖర్చుతో వైద్యం అందుతోందని వెల్లడించింది. -
వ్యాధులకు లోగిళ్లు
సాక్షి, హైదరాబాద్: గృహమే స్వర్గసీమ. అయితే నాసిరకపు ఇళ్లు వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇల్లు–ఆరోగ్యం’పేరుతో తాజాగా డబ్ల్యూహెచ్వో ఓ నివేదిక విడుదల చేసింది. ఇరుకైన గదులు, గాలి, వెలుతురు లేకుండా ఎక్కువ మంది నివసించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని హెచ్చరించింది. అంటువ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, బీపీ వంటివి చుట్టుముడుతున్నాయని తేల్చింది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యకరమైన ఇంటి నిర్మా ణం ఎంతో కీలకమైందని పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన జనాభా కూడా 2050 నాటికి రెట్టింపు అవుతుందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా.. ప్రపంచవ్యాప్తంగా మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో దాదాపు 10 కోట్ల మంది వరకు భారతదేశంలోనే ఉన్నారని అంచనా. మురికివాడల్లోని చిన్నపాటి గదులుండే ఆవాసాల్లో సక్రమమైన తాగునీరు ఉండే పరిస్థితి లేదు. పారిశుధ్యం మచ్చుకైనా ఉండదు. కలుషితమైన నీరు వారిని వెంటాడుతుంది. డయేరియా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 2016లో 8.29 లక్షల మంది చనిపోయారని నివేదిక తెలిపింది. ఒకే గదిలో నలుగురు నివసిస్తే అంటు వ్యాధులు ప్రబలుతాయని పేర్కొంది. వంట కోసం కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం వల్ల కాలుష్యం పెరుగుతుంది. దీంతో ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. 70 శాతం ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. కొన్ని దేశాల్లో నిరుద్యోగులు గృహాధారిత పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, వైకల్యం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కూడా ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది. అలాంటి చోట్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. సబ్సిడీతో నిర్మించాలి.. మంచి గాలి వెలుతురు, ఆరోగ్యకరంగా ఉండే ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. వాస్తు శిల్పులు, బిల్డర్లు, హౌసింగ్ ప్రొవైడర్లు, డెవలపర్లు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించింది. అలాగే సామాజిక సేవలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజారోగ్య నిపుణులు దృష్టి సారించాలి. మంచి గృహ నిర్మాణాల కోసం ప్రజలకు సబ్సిడీ ఇవ్వడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. సమస్యలొస్తాయి.. అపరిశుభ్రత వల్ల వచ్చే సమస్యలు – అపరిశుభ్రమైన ఇళ్లల్లో టీబీ వంటి వ్యాధులు సోకే ప్రమాదముంది. – టైఫాయిడ్, డెంగీ జ్వరాలు, గుండె జబ్బులు, ఇతర అంటు వ్యాధులు. – గొంతు, కంటి, చర్మ వ్యాధులు, నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. – మానసిక ఆరోగ్య సమస్యలు, మద్యం వినియోగం పెరగడం, నిరాశకు గురికావడం జరుగుతుంది. – ఆస్బెస్టాస్ టైల్స్, రేకుల వాడకం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. -
శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మేని పరిశుభ్రత చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. నిజానికి ఆహారం కంటే ముందుగా దానికే ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా... సూక్ష్మజీవులకూ, రోగకారక క్రిములకూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతిని, రోగాలను ఆహ్వానించినట్లవుతుంది. అందుకే వ్యక్తిగత శుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం చాలా ముఖ్యం. చాలామంది పొద్దున్నే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం మాత్రమే వ్యక్తిగత శుభ్రత అనుకుంటారు. కానీ పర్సనల్ హైజీన్ పరిధి అంతకంటే కూడా ఎక్కువే. జుట్టు చివరి నుంచి పాదం చివరి గోరువరకూ ప్రతి అవయవాన్నీ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం. నోటి సంరక్షణ ఇలా ప్రతిరోజూ పొద్దున్నే మనం పళ్లను బ్రష్ చేసుకుంటాం. వాస్తవానికి ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ చేసుకోవాల్సిందే. అయితే రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండే మనందరికీ అది అంతగా కుదిరే పని కాకపోవచ్చు. అందుకే తిన్న తర్వాత ప్రతిసారీ బ్రష్ చేసుకోలేకపోయినా... నోట్లోకి నీళ్లు తీసుకుని కనీసం రెండుమూడు సార్లు పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన నోటిలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ప్రతిరోజూ ఎలాగూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. బ్రషింగ్ తర్వాత మన చిగుర్లపైన వేలిచివరి భాగాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్లుగానూ, మసాజ్ చేసుకుంటున్నట్లుగానూ రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. మార్కెట్లో దొరికే మౌత్వాష్లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. నోటి దుర్వాసన ఉంటే... కొందరిలో ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ వారు నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటివారు తరచూ మౌత్వాష్తో శుభ్రం చేసుకోవడం మంచిది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నేరుగా నోటి దుర్వాసనకు కారణం కావడంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ, శరీర ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. దుర్వాసనకు కారణమవుతాయి. అందుకే అలాంటి దురలవాట్లు మానేయాలి. ఇక ఉల్లి, వెల్లుల్లి తినగానే అందులోని సల్ఫర్ కారణంగా నోటి నుంచి కాసేపు దుర్వాసన వస్తుంటుంది కాబట్టి పగటి వేళల్లో ముఖ్యం పనిచేసే చోట్ల అవి ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మేలు. ఇక నోటి పూర్తి సంరక్షణ కోసం కనీసం ప్రతి ఆర్నెల్లకోసారి డెంటిస్ట్ను కలిసి స్కేలింగ్ చేయించుకోవాలి. చెవుల సంరక్షణ చాలా మంది చెవుల శుభ్రతను పట్టించుకోరు. స్నానం సమయంలోనూ, ముఖం కడుక్కునే సమయంలోనూ చెవుల మీద సబ్బు రాసుకొని శుభ్రపరచుకోరు. మనం ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా అని పిలుచుకునే బాహ్య చెవిని కూడా స్నానం సమయంలో శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే కాసిని నీళ్లతో చెవిలో కాస్తంత లోపలి వరకూ శుభ్రం చేసుకోవాలి. అయితే చెవుల్లోకి మరింత లోతువరకు నీళ్లు పోకుండా చూసుకోవాలి. చాలామంది ఏమీ తోచనప్పుడల్లా చెవుల్లోకి పిన్నీసులూ, అగ్గిపుల్లలూ... కాస్తంత పట్ణణవాసులైతే ఇయర్బడ్స్ వంటి వాటితో చెవిలోపల కెలుకుతూ గువిలి తీస్తుంటారు. మన చెవుల్లోని గులివి చెవికి రక్షణ కల్పించడం కోసమే నిత్యం స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి ఇయర్బడ్స్ లాంటివి వాడకూడదు. ఇక చెవిలోని గువిలిని శుభ్రం చేయడం కోసం పదునైన పిన్నులు, అగ్గిపుల్లల వంటివి వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడవచ్చు లేదా గువిలి మరింత లోపలికి చేరవచ్చు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకుని, ఈఎన్టీ డాక్టర్ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రపరుస్తారు. స్నానం చేయడం ఇలా... ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా అన్నది చూసుకోరు. ముఖ్యంగా పిల్లలు. ఉదాహరణకు పిల్లలే కాదు... చాలా మంది పెద్దలు కూడా తమ చెవుల వెనక భాగాలనూ, మెడ వెనకా, శరీరంలో చర్మం మడతపడే చోట్లనూ శుభ్రం చేసుకోరు. తలస్నానం చేయడమిలా: తలస్నానం అన్నది క్రమం తప్పని ఇంటర్వెల్స్లో చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుంటారు. కానీ అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మర్దన (మసాజ్) చేసుకోవాలి. (జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయకపోయినా పర్వాలేదు). ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. చలికాలం లాంటి రోజుల్లో కూడా ప్రతిరోజూ స్నానం చేయండి. వేసవిలో అయితే కనీసం ఉదయం, సాయంత్రం రెండుపూటలా స్నానం చేయడం మంచిది. రోజూ ముఖం కడుక్కోండి మన దేహంలో బట్టలు తొడగని భాగాలు... అంటే చేతులు, ముఖం వంటి ఆచ్ఛాదన ఉండని భాగాలు తక్షణం కాలుష్యానికి గురవుతాయి. ఆ భాగాల్లో వెంటనే చేరుతుంటుంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. కాబట్టి వీలైనప్పుడల్లా ముఖంతో పాటు బట్టల కవర్ చేయని చేతులు, అరికాళ్లు కడుక్కుంటూ ఉండటం మంచిది. దీనివల్ల ముఖంపైన బ్యాక్టీరియా చేరడం వల్ల వచ్చే మొటిమల వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ముఖం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మేనిని ఇలా శుభ్రం చేసుకోండి మన శరీరంపై చాలాచోట్ల చర్మం ముడుతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వద్ద చర్మం ముడుతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్తో తుడుచుకోవాలి. ఇక బాహుమూలాల కింద కొందరు డియోడరెంట్స్, యాంటీ పెర్స్పిరెంట్స్ వంటి స్ప్రేలు వాడుతుంటారు. అవి వాడటం కొంతవరకు పరవాలేదు కానీ ఎక్కువగా వాడటం సరికాదు. ఇలాంటివి సరిపడనివారు వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. చాలామందిలో పొడి చర్మం ఒక సమస్యగా పరిణమిస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో వారి సమస్య రెట్టింపవుతుంది. ఇలాంటివారు మాయిష్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి.ఇక చలికాలంలోనైతే ఇది తప్పనిసరి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి చర్మంపై గీరుకుపోయినా, కాస్తంత ఒరుసుకుపోయినా వారి పైచర్మం దోక్కుపోయి కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్కు గురికావచ్చు. నఖారవిందాల కోసం గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, మకొద్దిపాటి గోరంచు ఉండేలా కట్ చేసుకోవాలి. గోరు మరీ ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలా కత్తిరించుకుంటూనే ఉండాలి. మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా నీళ్లవిరేచనాలు, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఎన్నోరకాల వ్యాధులను నివారించుకున్నట్లూ అవుతుంది. ఇదే సూచన పాదాల గోళ్లకు కూడా వర్తిస్తుంది. కొందరు గోళ్లను చిగుర్లలోపలికి కట్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో గోటి చివర ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ తర్వాత గోరు లోపలికి పెరుగుతూ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే కాలిగోర్లు కట్ చేసుకునే సమయంలో మరీ అంచుల చిగుర్లలోకి కట్ చేసుకోకూడదు. చేతులు శుభ్రం చేసుకోవడం ఇలా... మనం ఆహారం తీసుకునే ముందర క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మూత్ర, మల విసర్జన తర్వాత వీలైతే సబ్బుతోనో, హ్యాండ్వాష్తోనో తప్పక శుభ్రం చేసుకోవాలి. దీనికి కారణం ఉంది. వాష్రూమ్ తలుపు తెరవడం కోసం ప్రతివారూ తప్పనిసరిగా ‘నాబ్’ను ముట్టుకుంటారు. వారి చేతులకు ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు అంటుకొని ఉంటే... వారు ముట్టుకున్న ప్రదేశాన్నే మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు అంటుకు పోయి వ్యాధులు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే వాష్రూమ్కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక హాస్పిటల్లో పనిచేసేవారు సైతం తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం అవసరం. వీలైతే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్వాష్లు వాడటం కూడా చాలవరకు మంచిదే. పాదాల శుభ్రత... మన కాళ్లనూ, మోకాళ్లనూ, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోండి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిఅయ్యేంతవరకూ తుడుచుకోండి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా మన కాలి బొటనవేలి (పెద్దనేలు) గోరును జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మన పాదరక్షలు ధరించినప్పుడు అవి కాలికి సౌకర్యంగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవారు పరిశుభ్రమైన సాక్స్ను మాత్రమే తొడుక్కోవాలి. మామూలు వారిలోకంటే పాద సంరక్షణ డయాబెటిస్ రోగుల్లో మరింత ఎక్కువ అవసరం. హైహీల్స్ కాకుండా తక్కువ హీల్ ఉన్న పాదరక్షణలే వేసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న విధంగా రోజూ దేహ పరిశుభ్రత పాటిస్తే మేనూ, మనసూ ఈ రెండూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా హాయిగానూ ఉంటామని గుర్తుంచుకోవాలి. డాక్టర్ శ్యామల అయ్యంగార్, సీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ అండ్ డయాబెటాలసిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ, హైదరాబాద్ -
టీకాలతో పాడి పశువుల ఆరోగ్య రక్షణ
పాడి పశువులను రైతు ప్రతి రోజూ గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనపడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. పాడిపశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకక ముందే నివారణ చర్యగా వ్యాధినివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులు అంతః, బాహ్య పరాన్న జీవులకు లోనయినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు: ► సూక్ష్మజీవుల (బాక్టీరియా) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసిస్. ► సూక్ష్మాతి సూక్ష్మ జీవులు (వైరస్) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గాలికుంటు, శ్వాసకోశవ్యాధి, మశూచి వ్యాధి. ► అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు– ఉదా.. కుందేటి వెర్రి (సర్రా), థైలేరియాసిస్, బెబీసియోసిస్, కార్జపు జలగవ్యాధి, మూగబంతి. ► ఇతర వ్యాధులు– ఉదా.. పాల జ్వరం, పొదుగు వాపు, చర్మవ్యాధులు, దూడల మరణాలు. ► రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి, సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు. పశువులలో సామాన్యంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు – చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. -
మంచి పరుపూ తలగడతో హాయైన నిద్ర
మన జీవితంలో దాదాపు మూడోవంతు నిద్రలోనే గడుపుతాం. హాయిగా నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు. మంచి నిద్ర వల్లనే వ్యాధి నిరోధక శక్తి పెరిగి దేహానికి అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. హాయిగా నిద్రపోవడం కోసం ఎలాంటి పరుపు, ఎలాంటి తలగడ వాడాలో తెలుసుకుందాం. మంచి పడక ఎలా ఉండాలంటే... చాలా మంది నిద్ర కోసం పరుపు వాడటం మంచిది కాదని అంటుంటారు. వీపునొప్పితో బాధపడే చాలా మంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చెబుతూ బెంచీ వంటి వాటిపైనా లేదా గచ్చు మీద పడుకుంటుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే ఆరోగ్యానికి మేలు. అయితే అది శరీరానికి ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగానూ ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేంత మెత్తగానూ ఉండకూడదు. నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని చాలా మంది అపోహ పడుతుంటారు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంటిలో చాలా భాగాలు ఆ గట్టి ఉపరితలంతో నొక్కుకుపోయి ఒక్కోసారి నొప్పి వస్తుంటుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపునే ఎంచుకోవాలి. పరుపును రెండు నుంచి మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన స్థితిస్థాపకతను కోల్పోయి, గుంటలా పడిపోతుంటుంది. మనం పడుకున్నప్పుడు ఏదో గుంతలో పడుకున్న ఫీలింగ్ రాగానే పరుపు తిరగేయాలి. తలగడ వాడితేనే మంచిది... చాలామంది నిద్రపోయేటప్పుడు తలగడ వాడకపోవడమే మంచిదని అంటారు. కానీ నిజానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. మన తలకూ, భుజాలకూ మధ్య కాస్తంత ఒంపు ఉంటుంది. ఆ ఒంపు కారణంగానే పడుకునే సమయంలో తలకూ వీపుకూ సమన్వయం కుదరక ఇబ్బంది పడటం మనందరికీ అనుభవమే. ఆ ఒంపు (గ్యాప్ను) భర్తీ చేయడం కోసమే చాలామంది ఒక పక్కకు ఒరిగి భుజం మీద పడుకుంటుంటారు. ఒక రాత్రి నిద్రలో కనీసం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య గ్యాప్ అలా ఉండనే ఉంటుంది. ఆ గ్యాప్ను అలాగే ఉంచి రాత్రంతా నిద్రపోవడం ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మంచి తలగడను ఉపయోగించి ఆ గ్యాప్ను భర్తీ చేయడం అవసరం. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెస్సబిలిటీ కోల్పోతుంది. ఇలా ఎలస్టిసిటీ తగ్గిన తలగడను వాడకపోవడమే అన్నివిధాలా మంచిది. మెడ ఇరుకుపడితే... నిద్రలో తల ఇరుకుపడితే అది మళ్లీ నిద్రలోనే సరవుతుందని చాలామంది అంటుంటారు. మెడ పట్టేయడాన్ని సరిచేసేందుకు మొదటి మందూ, మంచి మందూ మంచి తలగడే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. మెడపట్టేయడంతో బాధపడే రోగులపై వారొక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా వారి పరిస్థితిని చక్కదిద్దడానికి అనేక ప్రక్రియలను అనుసరించి చూశారు. అందులో కొందరికి మసాజ్ చేశారు. మరికొందరికి చిట్కా వైద్యాలు ప్రయోగించి చూశారు. అయితే మరీ ఎక్కువ లావు, మరీ ఎక్కువ సన్నమూ కాని మంచి తలగడను ఉపయోగించడం వల్లనే మంచి ప్రయోజనం చేకూరిందని గ్రహించారు. అయితే తలగడనెప్పుడూ కేవలం తలకు మాత్రమే పరిమితం చేయకుండా, కాస్తంత భుజాల కింది వరకూ దాన్ని జరిపితే ఫలితం మరీ బాగుందని ఈ అధ్యయనంతో పాటు చాలా అధ్యయనాల్లో తేలింది. తలగడ తర్వాత మంచి మార్గం స్ట్రెచ్చింగ్ వ్యాయామాలని ఇదే ఈ అధ్యయనంలో తేలింది. మంచి తలగడ ఎలా ఉండాలంటే... ►తలగడ మృదువుగా ఉండలా. ►మన భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి. ►కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే వేరుగా ఉండేలా చూడాలి. ►స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి. -
టమాటాతో ఊజీ రోగాలు
జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు టమాటాపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఊజి రోగాలు విజృంభిస్తున్నాయి. పడమటి మండలాల్లో సాగుచేసిన టమాటా పంటలు దెబ్బతింటున్నాయి. ఊజి ఈగల దెబ్బతో కాయలపై రంధ్రాలు పడుతుండడంతో ఇప్పటికే 35 శాతం పంటను రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న కాయల్ని పొలాల వద్ద పారబోస్తున్నారు. కొందరు రైతులు ఆశతో మార్కెట్కు తీసుకొస్తున్నా అక్కడ కొనేవారు లేక రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. గిట్టుబాటు ధరలున్నా ప్రస్తుతం పండించిన పంట పశుగ్రాసంగా మారుతోంది. దీంతో జిల్లాలో వారం రోజుల్లో రూ.12కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లింది. సాక్షి, గుర్రంకొండ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమాటా పంటను ఎక్కువగా ఊజి ఈగ నష్ట పరుస్తోంది. ఇప్పటికే మంచి అదనుమీదున్న పంట ఒక్కసారిగా దెబ్బతింది. ముఖ్యంగా టమాటాలపై ఈ ఈగ ఎక్కువగా కనిపిస్తోంది. కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజి ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారుతోంది. కాయల్ని తోటల్లో నుంచి కోసినా మార్కెట్కు తరలించలేకపోతున్నారు. 35 శాతం పంట నష్టం ఊజి ఈగతో ప్రస్తుతం 35 శాతం మేరకు పంటను రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు ప్రస్తుతం 100 నుంచి 120 క్రేట్లు (25కేజీలు) దిగుబడి వస్తోంది. ఊజి ప్రభావంతో దెబ్బతిన్న టమాటాలు 35 నుంచి 40 క్రేట్లు ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 45వేల క్వింటాళ్ల స్టాకు వస్తోంది. ఊజి ఈగతో 15 వేల క్వింటాళ్ల టమాటాలు దెబ్బతిన్నాయి. పలువురు రైతులు ఈ రకం టమాటాలను తోట ల వద్దనే కోత సమయాల్లో కోసి పారబోస్తున్నారు. పలువురు రైతులు మార్కెట్లకు వాటిని తీసుకొస్తున్నా వ్యాపారులు కొనుగోలు చేయ డం లేదు. దీంతో దెబ్బతిన్న టమాటాలను రోడ్ల పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఆ టమాటాలు పశుగ్రాసంగా మారుతున్నాయి. ధరలున్నా నష్టపోతున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక క్రేట్ (25కేజీల) ధర రూ.700 నుంచి రూ.850 వరకు పలుకుతోంది. అయితే ఊజి ఈగ ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చాలా రోజుల తరువాత మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే టమాటా రైతులను దురదృష్టం ఊజి ఈగ రూపంలో మరోసారి వెంటాడింది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. -
ఆ తొమ్మిది మంది ఎక్కడ?
యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు. అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి, కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
మూగ జీవాలపై వైరల్ పంజా
సాక్షి, పాలకొండ: జిల్లాలోని పశువులు వ్యాధులతో నీరసించిపోతున్నాయి. మొదట్లో చిన్న కురుపు వస్తుంది. రెండు రోజుల్లో అది పుండుగా మారి గాయం ఏర్పడుతుంది. ఇలా శరీరమంతా పుళ్లు మాదిరిగా ఏర్పడతాయి. ఈ గాయాలపై చీము పట్టి పురుగులు చేరుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పక్కన ఉన్న పశువులకు వ్యాపిస్తోంది. దీంతో అవి ఆహారం తీసుకోవడంలేదు. కాళ్ల కింద పుళ్లు కావడంతో నడవలేక పోతున్నాయి. వారం రోజుల్లో పశువులు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. ఆవులు, ఎద్దులకు మాత్రమే ఈ వైరల్ వ్యాధి సోకుతోంది. దున్నలు, గేదెలలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. జిల్లాలో పసువుల సంఖ్య 2.23 లక్షలు కాగా ఇంతవరకూ 42 వేల ఆవులు, ఎద్దులు అనారోగ్యం పాలయ్యాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో వైరల్ వ్యాధుల ప్రభావం కనిపిస్తోంది. పాలకొండ మండలంలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, కొండాపురం, ఎన్కే రాజపురం తదితర గ్రామాల్లో 90 శాతం పశువులు ఈ వ్యాధితో బాధపడుతున్నాయి. ఈ వ్యాధికి ఏ మందులు వినియోగించాలో తెలియక రైతులు వేప ఆకులు, పసుపు కొమ్ములు ముద్ద చేసి రాస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల రక్త నమూనాలను పశు వైద్యులు సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుం టున్నారు. వ్యాధి సోకిన పశువులకు సమీపంలో ఇతర పశువులు ఉంచకుండా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. శరీరమంతా వ్యాపిస్తుంది.. ముందు శరీరంపై తామర వచ్చినట్లు కనిపిస్తుంది. రెండు రోజుల్లో గాయాలు కనబడుతున్నాయి. ఒక్కరోజులో శరీరం మొత్తం వ్యాపిస్తుంది. వాపులు ఏర్పడి పశువులు ఆహారం తీసుకోవడంలేదు. –మునికోటి రవి, రైతు, పరశురాంపురం జిల్లా అంతటా వ్యాధి లక్షణాలు.. జిల్లా అంతటా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వ్యాధిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో ఎక్కవగా పశువులు ఈ వ్యాధికి గురయ్యాయి. వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. –కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ పశువులు నడవలేక పోతున్నాయి.. వారం రోజులుగా రెండు ఎద్దులకు, ఆవుకు ఈ వ్యాధి సోకింది. కాళ్ల కింద పుళ్లు ఏర్పడి నడవలేక పోతున్నాయి. గాయాలు పెద్దవి గా ఉంటున్నాయి. ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా ఫలితం మాత్రం కలగలేదు. రూ.60 వేలు విలువ చేసే రెండు ఎద్దులు పూర్తిగా నీరసించిపోయాయి. –కాయల సత్యనారాయణ, సింగన్నవలస, రైతు వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకున్నాం వ్యాధి సోకిన పశువుల నుంచి రక్త నమూనాల సేకరించి ల్యాబ్ పంపించాం. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొండ ప్రాంతం సమీపంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి కారణమైన వైరస్ను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం వ్యాధి సోకిన పశువులకు యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు వేస్తున్నాం. –ప్రదీప్ సాహు, మండల పశువైద్యాధికారి -
స్వచ్ఛాగ్రహం
చుట్టూ ఉన్న వాళ్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంది. మూడు రోజులు బడి మానుకుంది. ఆత్మగౌరవం, ఆరోగ్యమే ముఖ్యమని వాదించింది. పట్టుబట్టి మరుగుదొడ్డి కట్టించింది. బహిర్గత బహిర్భూమి వల్ల రోగాల బారిన పడతామని, మహిళలకు ఆత్మగౌరవం ముఖ్యమని మరుగుదొడ్డి నిర్మిస్తేనే బడికి వెళ్తానని పట్టుబట్టింది. చివరకు ఆ తల్లితండ్రులు తలొగ్గి మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న భవాని బహిర్గత మలమూత్ర విసర్జన వలన జరిగే నష్టాల గురించి పాఠశాలలో ఉపాధ్యాయులు వివరించడంతో నిర్ఘాంతపోయింది. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్కుమార్ కిశోర బాలికలకు ఈ విషయమై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పుట్టినప్పటినుండి తాను, తన తల్లితండ్రులు ఆరుబయటికే ఒంటికి, రెంటికి పోతున్నామని, దీనివల్ల తమతోపాటు తమ చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో నష్టపోతున్నారని ఆందోళన చెందింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన భవాని మరుగుదొడ్ల నిర్మాణం కోసం తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకుంది. తల్లి పార్వతమ్మ, తండ్రి కృష్ణయ్యలను మరుగుదొడ్డి నిర్మించాలని కోరింది. దీనికి వారు ఆర్థికస్థితిగతులు, తమ పరిస్థితులను చెప్పి తమవల్లకాదని తేల్చి చెప్పారు. ఎలాగైనా ఒప్పించాలనే పంతంతో మూడురోజుల పాటు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. బడికి వెళ్లాలంటూ తల్లితండ్రులు ఒత్తిడి చేయడంతో తాను బడిమానుకుంటున్నానని. తనకు మరుగుదొడ్డి నిర్మిస్తేనే చదువుకుంటానని పట్టుబట్టింది.. ‘‘మరుగుదొడ్డి కట్టేందుకు పైసలు లేవమ్మా! పంట చేతికి వచ్చిన తరువాత కట్టుకుందాం లేమ్మా’’ అని తల్లితండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వమే పైసలు ఇస్తుందని, ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని భవాని వివరించింది. ఇక తప్పేటట్టు లేదని తల్లితండ్రులు నిశ్చయించుకుని మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. వారంరోజుల్లో నిర్మాణం పూర్తి కానుంది. దీంతో తన సమస్య పరిష్కారం అయిందని అంతటితో విషయాన్ని వదిలేయకుండా బహిరంగ మలమూత్ర విసర్జనలకు వెళుతున్న మహిళలకు ఇలా బయటికి వెళ్లడం తప్పని చెప్పింది. అందరితోనూ. చివాట్లు తింది. అయినా రోజు ఉదయం అదేపనిగా చెబుతోంది. పాఠశాలలో సైతం తోటివిద్యార్థులకు మరుగుదొడ్ల ప్రాముఖ్యత, ఆత్మగౌరవం, లాభనష్టాల గురించి వివరిస్తోంతది. కలెక్టర్ అభినందనలు... విద్యార్థిని భవాని పట్టుబట్టి మరుగుదొడ్డిని నిర్మించుకుంటున్న విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితం కావడంతో విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించి ఒక సైకిల్, కొత్తబట్టలు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, ఇతర వస్తువులను భవానికి బహూకరించారు. చదువుకుంటున్న విద్యార్థులు భవానిని ఆదర్శంగా తీసుకుని మరుగుదొడ్లు లేని కుటుంబాల వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాధికారి సుచీందర్రావు, డీఆర్డీఓ.గణేష్, ఎంపీడీఓ.శ్రీపాద్, ఏపీఓ.సుకన్యలు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. – మహ్మద్ రఫి, సాక్షి, ఆత్మకూర్ (వనపర్తిజిల్లా) ఆత్మగౌరవమే ముఖ్యం బహిర్గత మలమూత్రవిసర్జనల వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. దీనికితోడు మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మా ఇంటినుండే ఆత్మగౌరవమే ముఖ్యమనే విషయాన్ని చాటిచెప్పాలనుకున్నాను. బడిమానేసి మరుగుదొడ్డి నిర్మించే విధంగా అమ్మానాన్న లను ఒప్పించాను. ఊర్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నాను. జిల్లా కలెక్టర్ నాకు అభినందించి బహుమతులను అందచేయడంతో నాకు భాద్యత మరింత పెరిగింది. – భవాని, విద్యార్థిని, ఆరేపల్లి గ్రామం, ఆత్మకూర్ మండలం -
పొగాకు...ఆరోగ్యాన్ని పొడిచే టొబాకు
భూతాల గురించి కథల్లో చదువుతుంటాం. హారర్ సినిమాల్లో చూస్తుంటాం. వాటిలో భూతాలూ, దెయ్యాలూ పొగ రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఆ దెయ్యాలూ, భూతాలన్నీ కల్పితం. కానీ ఈ లోకంలో నిజంగానే పొగరూపంలో ఉండే భూతప్రేతపిశాచాలున్నాయి. అవే... సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కాలు. మరికొన్ని ఆరోగ్యాన్ని పీల్చిపిప్పిచేసే పిశాచాలు మనం తినేందుకు వీలుగా పాన్మసాలా డబ్బాల్లో దాగుంటాయి. ఇంకొన్ని పీల్చే నశ్యం డబ్బాల్లో ఉంటాయి.ఈ ఉత్పాదనలన్నింట్లోనూ వాడే ఆకే ‘పొగాకు’. ఆ కల్పిత భూతాలున్నాయో లేదో, అవి హాని చేస్తాయో లేదో తెలియదు. కానీ... ఈ పొగభూతాలు మాత్రం నిజంగానే ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆర్థికంగానూ నష్టం చేస్తాయి. నేడు (ఈ నెల 31న) ‘వరల్డ్ నో టొబాకో డే’. ఈ సందర్భంగా పొగాకు గురించీ, అది చేసే హాని గురించీ తెలుసుకుందాం. ఆ అవగాహనతో ఎన్నో రకాల ప్రమాదకరమైన జబ్బులతోపాటు అనేక రకాల క్యాన్సర్ల నుంచి విముక్తమయ్యేందుకు గాను... బోలెడన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తెస్తున్నాం.చాలా ఆకులు చాలా మేళ్లు చేస్తాయి. మామిడాకులు మంగళప్రదం. శుభకార్యాలకు తోరణాలుగా కడతాం. తాటాకులూ, కొబ్బరాకులూ అంతే. పెళ్లిళ్లకు పందిళ్లుగా వేస్తాం. అరిటాకులను వేడుకలకూ, వేదికలకూ ప్రవేశమార్గాల ఆర్చీలకు ఇరువైపులా కడతాం. అరిటాకుల్లో భోజనాలు ఆరగిస్తాం. బాదం ఆకుల్లో చిరుతిండ్లూ పెట్టుకుని తింటాం. తామరాకుల్లో ఫలహారాలు పెట్టుకుని భోంచేస్తాం. ఇక విస్తరాకులు సరేసరి.ఇంతా చేసి పొగాకు ఏమాత్రం ఆకర్షకరంగా ఉండదు. దాని వాసన వెగటు. పైగా విపరీతమైన ఘాటు. పైన కనువిందు చేసే ఎన్నో ఆకుల గురించి చెప్పుకున్నాం కదా. పైగా అన్నీ ఆరోగ్యకరమే. అయినా దేన్నీ మన ఒంట్లోకి ఆహ్వానించం. కానీ... అదేమిటో... అల్లంతదూరం నుంచి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే ఆ పొగాకును మాత్రం మనిషి కోరి కోరి ఆహ్వానిస్తాడు. నోట్లోకి తీసుకుంటాడు. ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటాడు. పేరుకు పొగాకు... కానీ ఆరోగ్యానికి ‘పగాకు’ అది. టొబాకో కాదది... మీ హెల్త్లోకి కసుక్కున దిగే... టొ‘బాకు’! ఇదీ పొగాకు విస్తృతి! మీకు తెలుసా...? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తంలో 1.1 బిలియన్ల మంది (110 కోట్ల మంది) సిగరెట్లు తాగేవాళ్లున్నారు. వీళ్లు ప్రతిరోజూ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం కోటి సిగరెట్లు అమ్ముడవుతుంటాయి. పొగరాయుళ్లు ప్రతిరోజూ 15 బిలియన్లు (1500 కోట్ల) సిగరెట్లను తగలేస్తూ, ఈ పొగధారావ్రతాన్ని అలా కొనసాగి...స్తూ ఉంటున్నారు. ఇదే ధోరణి గనక కొనసాగితే... డబ్ల్యూహెచ్ఓ లెక్కల అంచనాల ప్రకారం 2025 నాటికి ఈ పొగరాయుళ్ల సంఖ్య 1.6 బిలియన్లు (160 కోట్లకు) పెరుగుతుంది. ఇది కేవలం ఒక్క పొగతాగేవారి సంఖ్య మాత్రమే. దీనికి తోడు గుట్కా, ఖైనీ వంటి పొగాకు నమిలే అలవాట్లు ఉన్నవారూ, పొగాకుని నశ్యంలా పీల్చేవారి సంఖ్యనూ దీనికి కలుపుకుంటే... పొగాకు వినియోగించే వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువ.అందుకే ఇంతటి విస్తృతమైన పొగాకు వినియోగంతో... కేవలం ఈ దురలవాటు కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు... ప్రపంచంలో చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం స్మోకింగ్ తాలుకు దుష్ప్రభావాల వల్లనే మరణిస్తున్నారన్నది నమ్మలేని పచ్చి వాస్తవం. స్వయంకృత అపరాధంగా వాళ్లు ఎలాగూ చచ్చిపోతున్నారు సరే... పక్కవాళ్లు తాగకపోయినా, ఈ పొగరాయుళ్ల కారణంగా ఒక అంచనా ప్రకారం ఏడాదికి దాదాపు 8.9 లక్షల మంది ఎలాంటి అలవాటు లేకపోయినా మరణిస్తున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది కుటుంబసభ్యులైన మహిళలూ, చిన్నారులే. అంటే ఇదే మరోరకంగా చెప్పాలంటే... స్మోకర్లు సిగరెట్ అనే ఆయుధంతో ఏటా దాదాపు 9 లక్షల మంది అమాయకులను హత్య చేస్తున్నారు. తమ పాపమేమీ లేకపోయినా వీళ్లు అమాయకంగా మొహమాటానికి స్మోకర్లకు బలవుతున్నారు. ఇలా పొగకమ్మేసినట్టే ఈ దురలవాటూ లోకాన్ని కమ్మేసింది. పొగాకు నిండా విషాలే! సిగరెట్ పొడవు దాదాపు నాలుగు అంగుళాలు మాత్రమే కదా. కానీ దాన్లో ఉండే హానికరమైన రసాయనాల సంఖ్య మాత్రం 4,800. మళ్లీ అందులోని 50 నుంచి 69 రసాయనాలు క్యాన్సర్ను తప్పకుండా కలగజేసేవే! వీటినే నిపుణులు గ్రూప్–1 కార్సినోజెన్స్ అని వర్గీకరించారు.మనం ఒక్క కాలకూట విషం గురించి భయం భయంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ పొగాకులో ఎన్ని రకాల కాలకూట విషాలున్నాయో తెలుసా? ఆర్సినిక్, బెంజీన్, కార్బన్మోనాక్సైడ్, హైడ్రోజన్ సయనైడ్, పొలోనియమ్ 210... ఇలాంటి ఎన్నో ఎన్నో విషాలు సిగరెట్లో ఉంటాయి. నికోటిన్ అనే పదార్థమూ ఉంటుంది. ఆర్సినిక్ అనేది ప్రపంచంలోనే చాలా వేగంగా పనిచేసే శక్తిమంతమైన విషం. పైగా పైన పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా కాస్తంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనిషి తక్షణం చనిపోతాడు. ఒక అధ్యయనం ప్రకారం ఐదు సిగరెట్లలోని నికోటిన్ చాలు మనిషిని చంపేయడానికి! ఈ అధ్యయన వివరాలు ‘ఆర్కైవ్స్ ఆఫ్ టాక్సికాలజీ’లో నమోదై ఉన్నాయి కూడా.ఒకేసారి పెద్దసంఖ్యలో టోకున మనుషులను చంపేయడానికి రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ హైడ్రోజన్ సయనైడ్ను (జెనోసైడల్ ఏజెంట్గా) ఉపయోగించాడట. దాన్ని మనం స్వచ్ఛందంగా రోజూ సిగరెట్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అలాంటి విషాలను మనం రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటామని గుర్తుంచుకుంటే సిగరెట్ మానడం చాలా తేలిక. సిగరెట్లు ఎంత ప్రమాదకరమైనవో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఈ విషయమై మనం ఇంకాస్త తమాషా ఉదాహరణ చెప్పుకుందాం. ఆపిల్ కంప్యూటర్ల దగ్గర సిగరెట్లు తాగితే... ఆ సిస్టమ్లకు గ్యారంటీ ఉండదంటూ ఆ కంపెనీ వారంటీ నిబంధనల్లో పొందుపరచారు. అదీ సిగరెట్లకు ఉన్న అపకీర్తి! అలవాటయ్యేలా చేసే నికోటిన్! పొగాకులోని నికోటిన్ అనే పదార్థం ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. ఫ్రెంచ్ జాతీయుడైన జీన్ నికోట్ అనే వ్యక్తి పేరుమీద నికోటిన్ అనే మాట ఆవిర్భవించింది. ఇతడు 1560లో మొదటిసారి ఫ్రాన్స్కు పొగాకును పరిచయం చేశాడు. అతడి పేరిటే పొగాకులోని హుషారునిస్తుందని పేరున్న ఆ విష పదార్థానికి నికోటిన్ అని పేరుపెట్టారు. నిజానికి మనం సిగరెట్లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. మెదడులో కొన్ని రిసెప్టర్లు ఉంటాయి. నిజానికి మనమేమైనా సంతోషం కలిగే పనిచేసినప్పుడు అవి స్పందించి డోపమైన్ అనే రసాయనాన్ని వెలువడేలా చేస్తాయి. నికోటిన్ మన మెదడును చేరగానే ఈ రిసెప్టార్లు డోపమైన్ ద్వారా మనకు హాయిగా, రిలాక్స్డ్గా, సంతోషంగా ఉన్న భావనను కలగజేస్తాయి. దాంతో ఈ ఆనందాన్ని తరచూ పొందేందుకు ఆ పొగాకుకు అలవాటైపోతాం. మాటిమాటికీ డోపమైన్ను స్రవింపజేసేందుకు పొగాకును ఆశ్రయిస్తాం. అలా పొగాకు అలవాటైపోతుంది. ఈ నికోటిన్ వ్యసనం ఎంతో బలమైనది. నికోటిన్ బానిసత్వం...ఎంతో బలీయం నికోటిన్ మనిషిని ఎంతగా బానిసను చేసుకుంటుందో తెలుసుకునేందుకు రెండు ఉదాహరణలు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్కు క్యాన్సర్ సోకింది. ఆ క్యాన్సర్ వల్ల అతడికి దాదాపు 30కి పైగా సర్జరీలు అయ్యాయి. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు.ఇంకా చెప్పుకోవాలంటే... హిండెన్ బర్గ్ అనేది ఒక జర్మన్ పాసెంజర్ ఎయిర్షిప్. మనందరికీ టైటానిక్ షిప్కు జరిగిన ప్రమాదం గురించే తెలుసు. కానీ ఇది ఆ స్థాయికి తగ్గని దుర్ఘటన. కాకపోతే అంతమంది చనిపోలేదంతే. హిండెన్బర్గ్ అనే ఈ పాసెంజర్ ఎయిర్షిప్ చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఈ లాంగెస్ట్ క్లాస్ ఫ్లయింగ్ మెషిన్ వాడుక తర్వాత్తర్వాత అమిత ధనవంతుల ప్రయాణాలన్నీ ఇలాంటి ఎయిర్షిప్స్లోనే జరుగుతాయనేది ఆ రోజుల్లో ఒక ఊహ. అయితే 1937 మే 3న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన అది మే 6న యూఎస్ న్యూజెర్సీలోని మాంఛెస్టర్ టౌన్షిప్ దగ్గర దగ్ధమైపోయింది. చిన్న స్పార్క్ కారణంగా మొత్తం ఇంధనం అంటుకొని ప్రమాదం జరిగింది. దాంతో ఆ ఎయిర్షిప్లోని 97 మంది ప్రయాణికుల్లో 35 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని టైటానిక్ ఆఫ్ స్కైస్ అంటారు. ఆ ఎయిర్షిప్లో 70 లక్షల క్యూబిక్ అడుగుల హైడ్రోజన్ ఇంధనం ఉంది. చిన్నపాటి నిప్పు స్పార్క్ చాలు... అదంతా అంటుకుని తగలబడిపోవాడానికి. అంతటి ప్రమాదం ఉందని తెలిశాక కూడా... అంతమంది ప్రయాణం చేసే ఆ మెగాఎయిర్షిప్లోనూ ఒక స్మోకింగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు పొగతాగడాన్ని అమితంగా ఇష్టపడే ఆనాటి ప్రయాణికులు. ఆ ప్రమాదానికి ఎలక్ట్రిక్ స్పార్క్ వల్ల ఇంధనం మండిపోవడం కారణం కావచ్చని ఊహిస్తున్నా... పొగతాగే సమయంలోని నిప్పురవ్వ వల్లే జరిగిందని నిర్ధారణగా చెప్పలేకపోయినా... నిప్పు కణిక వల్ల తామంతా భస్మమైపోయేంతటి ప్రమాదం పొంచిఉన్నా కూడా ప్రయాణికులు స్మోకింగ్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారంటే... పొగతాగే అలవాటు ఎంతటి పెద్ద వ్యసనమో మనకు అర్థమవుతుంది. ఒకటా రెండా... ఎన్నెన్నో జబ్బులు దాదాపు 25% నుంచి 30% క్యాన్సర్లు కేవలం పొగాకు వల్లనే కలుగుతున్నాయి. వీటిల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువ. ఆ తర్వాత పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్లూ ఎక్కువగానే వస్తాయి. ఇక పొగాకు వినియోగం వల్ల స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్లు, మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇక ప్రోస్టేట్(పౌరుషగ్రంథి) క్యాన్సర్కూ, పొగతాగడానికీ సంబంధాలు చాలా చాలా ఎక్కువ. బెంజీన్ అనే రసాయనం అక్యూట్ మైలాయిడ్ లుకేమియా (ఒకరకం బ్లడ్క్యాన్సర్)ను కలగజేస్తుంది. వీటితో పాటు గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా ఒకటేమిటి... శరీరంలోని ప్రతి అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుందన్నది అతిశయోక్తి కాని వాస్తవం. ఇక మీకు తెలియని విషయం ఏమిటంటే... ప్రతి సిగరెట్లోనూ 20 శాతం చక్కెర ఉంటుంది. అందువల్ల సిగరెట్ తాగగానే ఒంట్లో చక్కెరపాళ్లు పెరుగుతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఇక డయాబెటిస్ ఒంట్లోని రోగనిరోధకతను దెబ్బతీస్తుందన్నది తెలిసిందే. దాంతో వరసగా క్యాన్సర మొదలు ఎన్నో వ్యాధులు, వాటివల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. పొగమానేస్తే ఎన్నో ప్రయోజనాలు... పొగతాగడం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెంటనే సమకూరడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు చివరి సిగరెట్ తాగిన 20 నిమిషాల్లో మీ గుండె వేగం తగ్గి, మళ్లీ దాని నార్మల్ వేగంతో కొట్టుకోవడం మొదలవుతుంది. 12 గంటల తర్వాత మీ కార్బన్మోనాక్సైడ్ మోతాదులు తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గడం మొదలవుతుంది. మూడు నెలల్లో మీ ఊపిరితిత్తులు నార్మల్కు రావడానికి ఉద్యుక్తమవుతాయి. ఆ తర్వాత వాటి పనితీరు క్రమంగా నార్మల్కు వస్తుంటుంది. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. 15 ఏళ్లలో మీరంతా నార్మల్ అయిపోయి నాన్స్మోకర్లో ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో అలాంటి ప్రయోజనాలూ ఒకప్పటి మాజీస్మోకర్స్కూ కలుగుతాయి. చాలామంది పొగ మానేయడానికి ఇష్టపడేవాళ్లే! వాస్తవానికి పొగతాగేవాళ్లలో 69 శాతం మంది ఇష్టం లేకుండానే పొగతాగుతుంటారట. ఎందుకంటే... వాళ్లెప్పటికప్పుడు తమ దురలవాటు సిగరెట్ మానాలని అనుకుంటూనే, తమకం ఆపుకోలేక మళ్లీ మళ్లీ సిగరెట్ ముట్టిస్తూ ఉంటారు. వీళ్లలో చాలామంది సోమవారం రోజున తమ సిగరెట్ అలవాటుకు స్వస్తిచెప్పాలనుకుంటారు. ఆదివారం సెలవు రోజున తమ మనసుతీరా సిగరెట్ తాగేసి, సోమవారం నుంచి ఆ అలవాటుకు గుడ్–బై చెప్పాలనుకుంటార్ట. కానీ వీళ్లలో చాలామంది మళ్లీ పొగభూతానికి లొంగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగతాగడం మానేశారనుకుందాం. ఇప్పుడున్న క్యాన్సర్ రోగుల సంఖ్యలో తక్షణం 30% కేసులు తగ్గుతాయి. క్రమంగా 50 శాతానికి పైగా క్యాన్సర్తో సంభవించే మరణాలూ తగ్గుతాయని ఒక అంచనా. పొగాకుఉత్పాదనల కోసం అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ఒక రంగు. ఇది ఒకరకమైన గోధుమరంగు వంటిది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు (ద అగ్లియెస్ట్ కలర్) అని అంటారు. ఈ రంగును చావును సూచించే రంగుగా చెబుతారు. జీఎఫ్కే అనే పరిశోధన సంస్థ ఈ రంగుమీద అనేకరకాల పరిశోధనలు చేశాక... ఈ అసహ్యకరమైన రంగును ‘పొగాకు ఉత్పదనలకు’ వాడితే బాగుంటుందని సూచించింది. అయితే ఇదేరంగును మరింత ఆకర్షణీయంగా చేసి సిగరెట్ పెట్టెలకు వాడుతుంటారు. యూరప్ తొలి స్మోకర్కు ఏడేళ్ల జైలు! యూరప్కు పొగాకును పరిచయం చేసిన మరొక వ్యక్తి రోడ్రిగో డి జెరెజ్. ఇతడు అమెరికాను కొనుగొన్న కొలంబస్ నావికుల బృందంలోని సభ్యుడు. శాంటామారియా నౌక మీద ప్రయాణం చేస్తూ 1492లో వీళ్లు బహమాస్లోని శాన్సాల్వడార్ ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడి గౌనహని అనే తెగకు సంబంధించిన వారు పొగతాగడాన్ని చూశాడు రోడ్రిగో డి జెరేజ్. వారి నుంచి పొగతాగడం నేర్చుకున్నాడు. యూరప్లోని స్వదేశానికి తిరిగి వచ్చాక మరికొంతమందికి కూడా అతడు స్మోకింగ్ అలవాటు చేశాడు. అప్పట్లో నోటినుంచి అలా పొగను వెలువరించడం అనేది ‘దెయ్యపు చర్య’ అనీ, దెయ్యాలు చేసే ఆ పని చేసినందుకు ‘స్పానిష్ ఇంక్విజిషన్’కు చెందిన అక్కడి మతపెద్దలు అతడికి ఏడేళ్లు కారాగార శిక్ష విధించారు. కానీ... ఏడేళ్ల తర్వాత అతడు విడుదలయ్యేనాటికి పొగతాగే అలవాటు యూరప్ అంతటా విస్తరించింది. అది అపోహ మాత్రమే... చాలామంది పొగతాగేవాళ్లు భోజనం చేశాక ఒక దమ్ము లాగితే... తిన్నది వేగంగా జీర్ణమవుతుందని అనుకుంటారు. తమ అనుభవం వల్ల ఆ అపోహనే వాస్తవంగా భ్రమిస్తుంటారు. కానీ నిజానికి సిగరెట్ జీర్ణప్రక్రియను చాలా ఆలస్యం చేస్తుంది. అరిగే ప్రక్రియ అతి నెమ్మదిగా కొనసాగేలా చూస్తుంది. ఎందుకంటే... సిగరెట్ తాగగానే తమ ఒంట్లోకి ప్రవేశించే విషాలను బయటకు తరమడానికి శరీర వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విషాలు మెదడును చేరితే అది చాలా ప్రమాదకరం కాబట్టి మన శారీరక జీవక్రియల వ్యవస్థ అంతా తమ దృష్టిని విషాలను నిర్వీర్యం చేసే పనిమీద కేంద్రీకరిస్తుంది. దాంతో ఈ ప్రాధాన్యక్రమం వల్ల జీర్ణప్రక్రియ ఆలస్యమవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు మొదలుకొని మళ్లీ ఎన్నో అనర్థాలు. అందుకే ఈసోఫేజియల్ క్యాన్సర్లు మొదలుకొని, పెద్దపేగు (కొలోన్) క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల క్యాన్సర్లకు పొగతాగే అలవాటే ఒక ప్రధాన కారణం. Dr. Ch.Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
‘చిటుక’లో ముంచుకొచ్చే ముప్పు!
గొర్రెల్లో సీజను వారీగా, వయస్సు వారీగా కొన్ని వ్యాధులు బయల్పడుతుంటాయి. వాటికి సరిపడా యాజమాన్యముగానీ, చికిత్స గానీ, టీకా గానీ ఇవ్వకపోతే జీవాలు మృత్యువాత పడుతుంటాయి. తొలకరి వర్షాల్లో గొర్రెలకు సోకే ముఖ్యమైన వ్యాధి చిటుక రోగం. సాధారణంగా చాలా వ్యాధులకు టీకా వేయించినట్లయితే, అవి సోకకుండా ఉండే అవకాశముంది. కానీ, టీకా వేయించకుండా, వ్యాధి సోకిన తర్వాత, ఏ లక్షణాలు చూపుకుండా, వైద్యానికి సమయం ఇవ్వకుండా గొర్రెలు మృతి చెందేది ఒక చిటుక వ్యాధితో మాత్రమే. మంచి ఆరోగ్యంగా ఉండే జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రిడియమ్ పెర్ఫ్రిజన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వలన సోకుతుంది. ఎక్కువగా స్టార్చ్ సంబంధిత మేతను తింటే ఈ వ్యాధి సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలిచిన లేత గడ్డిని మేసినప్పుడు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన తర్వాత ఏ లక్షణాలు చూపకుండా, చిటిక వేసే లోపే చనిపోతాయి. కాబట్టి చిటుక వ్యాధి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నెత్తిపిడుగు వ్యాధి అని కూడా అంటారు. కొన్నిచోట్ల గడ్డి రోగం అని అంటారు. జీవాలు నీరసంగా ఉండటం, చనిపోయే ముందు గాలిలోకి ఎగిరి గిలగిలా కొట్టుకుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని కారక సూక్ష్మజీవి ‘ఎప్పిలాన్’ అనే విష పదార్థాన్ని జీవం శరీరంలోకి విడుదల చేస్తుంది. దీనివలన జీవాలు చనిపోతాయి. చిటుక వ్యాధి నివారణ ఇలా.. ► ఈ నెలలో అన్ని జీవాలకు టీకా వేయించాలి. ► తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన తేగ గడ్డిని గొర్రెలు మేసినట్లయితే ఈ వాధి సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలుతుంది. అందుచేత వాడిపోయి మళ్లీ మొలచిన గడ్డిని గొర్రెలు మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మందలో ఒకటి, రెండు జీవాలకు వ్యాధి కనిపించినట్లయితే, మిగిలిన వాటికి టీకా వేయించాలి. వలస వెళ్లే జీవాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనపడుతుంది. – డా. ఎం. వి. ఎ. ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
స్వైన్ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వైన్ఫ్లూపై ఆందోళన తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది. -
మొండి రోగాల ముప్పు!
వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి. కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్బగ్’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్బగ్’ పుట్టుకొచ్చిందని నిర్ధారించారు. ఇన్ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది. మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు. మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం. -
పెద్దలకూ వ్యాక్సిన్లు
వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ధరతో అంటే చాలా చవకగా, దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. ప్రస్తుతం ఈ నెల చివరి తేదీ వరకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనే వారోత్సవాలు నిర్వహితమవుతున్నాయి. ప్రతీ ఏడాదీ ఏప్రిల్ చివరి వారం... అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఇలా జరుపుతారు. అనేక వ్యాధులను నివారించడం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలను (వీక్ను) రూపొందించారు. సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వ్యాక్సిన్ల వివరాలు, ప్రయోజనాల గురించి అవగాహన కోసం వాటి గురించి సంక్షిప్తంగా. పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్–బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి ఒకింత ఎక్కువే కాబట్టి... దీన్ని నివారించడానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని, ఆర్నెల్ల తర్వాత మరో విడత కూడా తీసుకోవాలి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ : హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇది కూడా వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది. వారిసెల్లా వ్యాక్సిన్ : వ్యారిసెల్లా జోస్టర్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణంగా ‘చికెన్పాక్స్’ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు. హెర్పిస్ జోస్టర్ వ్యాధి : హెర్పిస్ జోస్టర్ అనే వైరస్తో మొదట చికెన్పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జోస్టర్ హెర్పిస్ వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ.హెర్పిస్ జోస్టర్ వ్యాధికి మంచి నివారణ జోస్టర్ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా (అంటే 100 శాతం) వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ అయితే లేదుగానీ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు. ‘ద షింగిల్స్ ప్రివెన్షన్ స్టడీ’ అనే అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. అలాగే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా 67శాతం తగ్గుతుంది. అందుకే 50 ఏళ్లు దాటాక జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునేవారు ఇది తీసుకునే ముందర 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు వాటిని వాడకపోవడం మంచిది. నిమోకోకల్ వ్యాక్సిన్ : వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) : ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసకరైడ్ వ్యాక్సిన్’తో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఒక నిమోనియాకే నివారణగా అనుకోవడం కంటే... మెనింజైటిస్, బ్యాక్టిరిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్)లకు నివారణ ఔషధంగా పరిగణించవచ్చు. అయితే దీని వల్ల కూడా నూరు శాతం నివారితమవుతుందన్న గ్యారంటీ ఉండదు. అయితే దీనివల్ల చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గుతాయి. కాంప్లికేషన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇది మాటిమాటికీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరోసారి తీసుకోవాలి ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ : ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే తర్వాతి దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే జలుబు వైరస్కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవైౖయెదేళ్లు ఏళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టాటస్లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది. ఒక సూచన : గుడ్డు వల్ల అలర్జీ ఉన్నవారు రీకాంబినెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలి.డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. దాంతో అది బూస్టర్ డోస్లా పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది. మరికొన్ని వ్యాక్సిన్లు : ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అయితే దాన్ని కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేగాక జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు అక్కడికి వెళ్లే 15రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వయసులో వ్యాక్సిన్లు ఎందుకు? ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. కొన్ని ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లే చోట్ల కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు అక్కడ వ్యాప్తిలో ఉండే వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే లైఫ్స్టైల్ ఆధారంగా కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరం. దాదాపు 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు... ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి ఒకసారి వ్యాధి బారిన పడితే హాస్పిటల్లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తే... వ్యాక్సిన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇంటిని పోషించే యజమాని జబ్బు పడితే ఆ ప్రభావం ఇంటి మొత్తం మీద ఉంటుంది. పైగా ఉత్పాదకత కోసం వెచ్చించాల్సిన ఎన్నో విలువైన పనిదినాలను కూడా రక్షించుకొని, వాటిని సమర్థంగా పనులకోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందించడం కోసం ఉపయోగించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ యువతులు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ఫెక్షియస్డిసీజెస్,స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా?
మా ఫ్రెండ్వాళ్ల అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఈమధ్య అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా? కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ వ్యాధులు కేవలం పెద్దవారికే పరిమితం కావు. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే రకం. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. నెలలు, సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా కొనసాగుతాయి. పిల్లలకు కీళ్లవాతం ఎందుకొస్తుంది? : ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే అంశంపై నిర్దిష్టంగా ఇంకా కారణాలు పెద్దగా తెలియదు. అయితే రకరకాల పరిశోధనల తర్వాత వీటిని జన్యులోపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ స్వీయదాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు. జాగ్రత్తలు : ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి వారు మందులు సూచిస్తారు. ►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి. ►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు. ►ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు ఎప్పటికీ నార్మల్ జీవితాన్నే గడపవచ్చు. చికిత్సా విధానాలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్ని నొప్పినివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. -
కనిపించని శత్రువు!
రాజేశం అనే ఓ వ్యక్తి బయటకు చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ చాలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అతన్ని చూస్తే అరుదైన వ్యాధికి గురైనారని ఎవరూ నమ్మరు. చెప్పినా పట్టించుకోరు. డాక్టర్ల వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి. వెంకటలక్ష్మి అనే యువతి ఒకరోజు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మరుసటిరోజు అనారోగ్యానికి గురవుతారు. మళ్లీ రెండు రోజులకు సాధారణస్థితిలోకి వస్తారు. ఇదీ అరుదైనవ్యాధికి గురైన మహిళ పరిస్థితి. – సాక్షి, హైదరాబాద్ వీరిలాగే దేశంలో దాదాపు 10 కోట్ల మంది అరుదైన వ్యాధులకు గురవుతున్నారు. ప్రపంచంలోని అరుదైన వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని తేలింది. హైదరాబాద్ జనాభాలో దాదాపు ఆరున్నర లక్షలమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వ్యాధులను గుర్తించడం అత్యంత ఖరీదైన వ్యవహారం కావడంతో ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్(ఐవోఆర్డీ) అనే సంస్థ అరుదైన వ్యాధులపై సర్వే చేస్తుంది. అరుదైన రోగాలతో బాధపడుతున్న రోగులను గుర్తించడం, వారికి అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. అరుదైన వ్యాధుల్లో 70 శాతం పిల్లలకు సంబంధించినవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. 12 శాతం పెద్దలకు సంబంధించినవి ఉంటు న్నాయి. 18 శాతం పెద్దలకు, పిల్లలకు సంబంధించినవి ఉంటున్నాయి. అరుదైన వ్యాధుల్లో 72 శాతం జన్యుపరమైనవే. 28 శాతం వ్యాధులు జీవితంలో ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఎర్ర రక్తకణాల్లో డిజార్డర్ అరుదైన వ్యాధులేంటనే విషయాలను గమనిస్తే ఆందోళన కలగకమానదు. అరుదైన వ్యాధుల్లో ఒకటైన అక్వైర్డ్ అప్లాస్టిక్ ఎనీమియా. అంటే బోన్మ్యారో ఫెయిల్యూర్ అయి రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10 లక్షల్లో ఇద్దరికి వస్తుంది. ఇక సికిల్ సెల్ డిసీజ్. ఎర్రరక్త కణాల్లో డిజార్డర్ అన్నమాట. ఇది ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది. ఈ రెండూ కూడా రక్తంలో వివిధ రకాలుగా మార్పులు తీసుకొస్తాయి. నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధి ఒకటి ఉంది. ఎలాంటి నొప్పీ ఉండదు. చెమట పట్టదు. గాయాలైతే ఆలస్యంగా తగ్గుతాయి. దీన్ని కాంగీన్షియల్ ఇన్సెన్సివిటీ టూ పెయిన్ విత్ యాన్హైడ్రోసిస్ వ్యాధి అంటారు. ఇది రెండు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. లైసోసోమాల్ స్టోరేజీ డిజార్డర్ అనే వ్యాధి మెటబాలిజం డిజార్డర్కు సంబంధించింది. ఎంజైమ్ కొరత వల్ల ఇది వస్తుంది. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రతి 7,700 మందిలో ఒకరికి వస్తుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ అనే వ్యాధి కంటికి సంబంధించింది. ఇది పెద్దల్లో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పీడియాట్రిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి గుండెకు సంబంధించింది. పిల్లల గుండెల్లోని మజిల్లో డిజార్డర్ వస్తుంది. ఇది లక్షలో ఒకరికి వస్తుంది. ఇక మజిల్ డైస్ట్రోపి అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. బాలురల్లో ఇది కనిపిస్తుంది. ప్రతీ 3,500 మందిలో ఒకరికి వస్తుంది. కొన్ని అరుదైన వ్యాధుల లక్షణాలను గుర్తించడం నాలుగైదు ఏళ్లు పడుతుంది. గరిష్టంగా 20 ఏళ్లు కూడా తీసుకుంటుంది. అరుదైన వ్యాధులను గుర్తించేలా చాలా డయాగ్నస్టిక్ సెంటర్లు అభివృద్ధి కాలేదు. అరుదైన వ్యాధులపై చాలామంది వైద్యులకు శిక్షణే లేకపోవడం గమనార్హం. అరుదైన వ్యాధులకు చికిత్స చేసే ప్రత్యేక మౌలిక సదుపాయాలు, పరికరాలు అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో లేవు. విచిత్రమేంటంటే దేశంలో అరుదైన వ్యాధులకు సంబంధించిన స్పష్టమైన విధానమే కేంద్రం తయారు చేయలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
సత్య ధర్మ పరిరక్షణే ధ్యేయం...
‘‘మీ ఇళ్లల్లో మీరే హోమాలు చేయండి. శక్తిమంతులుకండి. తద్వారా సమాజానికి సేవచేయండి. మంత్రదీక్ష తీసుకుని సమస్యలు పరిష్కరించుకోండి... వ్యాధులు నయం చేసుకోండి... ధర్మాన్ని కాపాడండి...’’ అంటున్నారు కుర్తాళం పీఠాధిపతి.. పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి. 83 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వామీజీ నిరాడంబరతకు మారుపేరు. ఆయన జీవితంలో వెయ్యి పున్నములను చూసిన సందర్భంగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సహస్రచంద్ర దర్శనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో.. శ్రీనాథ పీఠం ఆధ్వర్యాన గుంటూరులో ఈ ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామీజీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. కుర్తాళం పీఠం కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతోపాటు ధర్మపరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. ఇంకా సాక్షి అడిగిన పలు సందేహాలకు సవివరమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలు స్వామీజీ మాటల్లోనే.... నా గురించి... పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాలలో ప్రధాన అధ్యాపకుడిగా పనిచేశాను. వెంకట లక్ష్మీ వరప్రసాదరావు అనే నేను ప్రసాదరాయ కులపతిగా అందరికీ సుపరిచితుడిని. పరమ గురువు త్రివిక్రమ రామానంద భారతీస్వామి ప్రేరణతో అరవైఏళ్ల క్రితమే సన్యాసాన్ని స్వీకరించాలని భావించి నా తల్లిదండ్రులైన పోతరాజు పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మిలకు మనసులోని మాట చెప్పాను. వారు అంగీకరించలేదు. 2002లో భార్యాపిల్లల సమ్మతితో నా కోరిక నెరవేరింది. హిమాలయాలు, బృందావనం, కాశీ, కామాఖ్య, కుర్తాళం తదితర ప్రదేశాల్లో తపస్సు చేశాను. రాధాదేవి, కాలభైరవుడు, కాళీమాత వంటి దేవతల దర్శనభాగ్యం కలిగి అనుగ్రహం పొందాను. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాను. పీఠం కార్యకలాపాలు భారతదేశంలోని పీఠాల్లో శంకర పీఠాలకు సంబంధించింది మా పీఠం. కుర్తాళంతోపాటు తిరుమల, గుంటూరుల్లోనూ పీఠాలున్నాయి. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలలో ఉప శాఖలున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, వారి మనశ్శక్తి పెరిగేందుకు ప్రయోజన హోమాలు చేయిస్తున్నాం. కుర్తాళం పీఠానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు తమిళనాడు, అమెరికా, శ్రీలంకల్లో ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్లో 32 ఆలయాలు, తెలంగాణలో 8 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రస్టుబోర్డుల అధీనంలోనివే.భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాల్లో పర్యటించి సప్తాహాలు నిర్వహించాం. హిందూ ధర్మ రక్షణ, మంత్రశాస్త్రం, పురాణాలు, వేదాంత సంబంధ విషయాలపై వేలాది ఉపన్యాసాలు ఇచ్చాను. సామూహిక యజ్ఞాలు నిర్వహించాం. 20 మంది శిష్యులకు సన్యాసదీక్ష ఇప్పించాం. విశ్వవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు కుర్తాళం పీఠాలకు వస్తుంటారు. వారందరికీ మార్గనిర్దేశం చేస్తూ రుషులు బోధించిన మార్గాల్లో నడిపిస్తున్నాం. సామాజిక సేవల విషయానికొస్తే.. నిరంతర అన్నదానం, ఉచిత ధ్యాన శిబిరాల ఏర్పాటు ప్రధానమైనవి. కవితా గోష్ఠులను ఏర్పాటుచేసి కవులను భారీగా సన్మానిస్తుంటాం. భవిష్యత్ ప్రణాళిక అమెరికాలోని అట్లాంటాలో 500 ఎకరాల స్థలం పీఠానికి ఉంది. ఇక్కడ 108 కుండాలు ఏర్పాటుచేసి యజ్ఞాలు నిర్వహించాం.. 108 మంది సువాసినీలకు పూజలు జరిపించాం. ఈ ప్రాంతంలో ఒక నది, ఆరు సరస్సులు కూడా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులవారి 108 అడుగుల లోహపువిగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఏడాదిలోగా ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తాం. నమ్మకమే గెలుపు మనం ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందనే విశ్వాసం తొలుత కలగాలి. అప్పుడే ముందడుగు వేయగలుగుతాం. పీఠానికొచ్చిన నాస్తికులు ఆస్తికులుగా మారిన సందర్భాలు అనేకం. నమ్మి వచ్చినవారికి భక్తి మరింత పెరిగి ఆధ్యాత్మికానందంలో మునిగి తేలిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. యోగులు–సూక్ష్మ శరీరులు ధ్యాన సమయంలో కొందరు సూక్ష్మ శరీరంతో వచ్చి సందేశమిచ్చేవారు. కొందరు స్నేహపూర్వకంగా పలకరించి వెళ్లేవారు. మరికొందరు మహనీయులు ఆశీర్వదించి కర్తవ్య ఉపదేశం చేసేవారు. ఇంకొందరు తమ సాధనలో ముందుకెళ్లడానికి దారి చూపాలని కోరేవారు. ఇలా అశరీరులతో సంభాషించవలసి వచ్చేది. అలా నేను గుంటూరులోని ఇంట్లో ఆత్మావాహన విద్య ద్వారా అప్పటికే దేహం వదిలిన జిల్లెళ్లమూడి అమ్మతో మాట్లాడుతుంటాను. ఆమె అనేక సిద్ధసంబంధ విషయాలను చెప్పి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. ఆ అమ్మ ఆశీస్సులు ఇప్పటికీ నాకు అడుగడుగునా అందుతూ ఉంటాయి. కోరికలను జయించడమెలా? మనిషన్న తర్వాత కోరికలుంటాయి. వాటిని హద్దుల్లో ఉంచుకోవాలి. ఆదిశంకరాచార్యులవారి వేదాంతగ్రంథాలను చదవడం ద్వారా, ధ్యానం.. తపస్సు చేయడం ద్వారా కోరికలను అదుపులో ఉంచొచ్చు.ఇటీవలి కాలంలో యువతలోనూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. ఆలయాలకు వెళ్తున్నారు. టీవీలో భక్తి కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు. ఇది శుభ పరిణామం. స్వయంసిద్ధ కాళీ పీఠం గుంటూరు రవీంద్రనగర్ కొత్త పట్టాభిపురంలో ఉంది. ఆలయంలో అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని నిర్మించి నిత్యం హోమాలు చేయిస్తున్నాను. ఇది నిత్యాగ్నికుండం. ఇక్కడ ఎవరు హోమం చేసినా వారి సంకల్పం సిద్ధిస్తుంది. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహిస్తుంటాం’అంటూ సంభాషణను ముగించిన స్వామీజీ కాళికా మాతకు హారతివ్వడానికి ఉపక్రమించారు. కుర్తాళం పీఠం విశేషాలు శ్రీ శివచిదానంద సరస్వతీస్వామి (మౌనస్వామి) 1916లో హిమాలయాలకు వెళ్లి సన్యసించారు. అనంతరం తమిళనాడు రాష్ట్రం.. తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళంలో దత్తాత్రేయ మఠాన్ని నిర్మించారు. కొంతకాలం తర్వాత శ్రీ సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించి అద్భుతమైన సిద్ధశక్తులను సాధించారు. ఆయన తదనంతర పీఠాధిపతులుగా శ్రీ విమలానంద భారతీస్వామి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వామి, శ్రీ శివచిదానంద భారతీస్వామి వ్యవహరించారు. ఐదో పీఠాధిపతిగా శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి 2002లో బాధ్యతలు స్వీకరించారు. అపురూపం ముత్యాల గురించి అందరికీ తెలుసు. నవరత్నాలలో ముత్యాలను చంద్ర గ్రహ దోష పరిహారం కోసం ఉపయోగిస్తారు. ముత్యాలను ఉంగరాల్లో ధరిస్తారు. ముత్యాల హారాలను ధరిస్తారు. జాతకచక్రంలో చంద్రుని కారణంగా ఏర్పడిన దోషాలకు పరిహారంగా ముత్యాలు ఎలా ఉపయోగపడతాయో, ముత్యపు చిప్పలు కూడా దాదాపు అలాగే ఉపయోగపడతాయి. ముత్యపు చిప్పలతో తయారు చేయించిన లాకెట్లు, బ్రాస్లెట్లు వంటి ఆభరణాలు చంద్రదోషాలను పరిహరిస్తాయి. ఏదైనా సోమవారం లేదా అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దీపావళి వంటి పర్వదినాల్లో లక్ష్మీపూజ చేసేటప్పుడు ముత్యపుచిప్పలను కూడా పూజలో ఉంచి, వాటికి ధూపదీపాలను సమర్పించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు తొలగిపోతాయి. కుటుంబంలోని కలతలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. గోమతి చక్రాల మాదిరిగానే, ముత్యపు చిప్పలను కూడా ఇళ్లలోను, వ్యాపార కేంద్రాల్లోను డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు – సంభాషణ: చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ సాక్షి, విజయవాడ -
మిత్రుడి పుట్టినరోజు
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, మిత్రుడు, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం. సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు. ఆరోగ్య ప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. మహాశక్తిమంతుడు. సకల శాస్త్రపారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహ పురాణం చెబుతోంది. నేత్ర వ్యాధులు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్య శ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధనెంతటి శ్రేష్ఠమో తెలుస్తోంది. రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది. రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ. 12, మంగళవారం రథసప్తమి – కృష్ణకార్తీక -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్డయాక్సైడ్ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
మృగరాజుకు ఎంత కష్టం!
తమ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగుతున్న అంతర్గత పోరులోనే గుజరాత్ గిర్ మృగరాజులు ఒకదాని వెనక ఒకటి మృత్యువాత పడుతున్నాయా? అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్ కారణంగానే దాదాపు 15 రోజుల సమయంలోనే 23 సింహాలు మరణించాయా? ఆధిపత్య పోరు వల్లే మరణిస్తున్నాయన్న వాదన ప్రస్తుత పరిణామాలు మాత్రం దాన్ని బలపరచట్లేదు. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా గిర్ ప్రాంతంలోని ఇతర సింహాలను అక్కడకు 100 కిలోమీటర్ల దూరంలోని పోర్బందర్ సమీపాన ఉన్న బర్ద దుంగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. బర్దాతో పాటు మధ్యప్రదేశ్లోని పాల్పుర్–కునో, మరో రెండు సంరక్షణ కేంద్రాలకు కూడా వీటిని తరలించాలని గతంలోనే కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. అడవి రాజుకు కష్టమొచ్చింది..! సింహాన్ని అడవికి రాజుగా గొప్పగా చిత్రీకరించిన తీరును మనం చిన్నపుడు కథల పుస్తకాల్లో చదువుకున్నాం. తామున్న ప్రాంతంపై పట్టు, ప్రతిష్ట కోసం సింహాల మధ్య తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. రాజ్యం (భూభాగం)పై ఆధిçపత్యం కోసం పురుష సింహాలు ఒకదాన్ని మరొకటి చంపుకుంటాయని గతంలోనే వెల్లడైంది. ఈ పోరులో భాగంగా ఆడ సింహాలు అరుదుగా గాయపడతాయి. అయితే తాజాగా గుజరాత్లో మూడు ఆడసింహాలు కూడా మరణించడంతో గతంలోని సూత్రీకరణల్లో వాస్తవమెంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటువ్యాధుల జాడలు.. గిర్ ప్రాంతంలో గతంలో అంటువ్యాధులు ప్రబలిన దాఖలాలున్నాయి. గతంలో మరణించిన ఓ సింహం నుంచి భద్రపరిచిన కణజాలాన్ని 2012లో ఐవీఆర్ఐ జరిపిన పరిశోధనలో పెస్ట్ డెస్ పిటిట్స్ వైరస్ (పీపీఆర్వీ) ఉన్నట్టు వెల్లడైంది. ఈ వైరస్ వల్ల వచ్చే జబ్బులు అంటువ్యాధిగా మారితే గిర్ సింహాల జనాభాలో 40 శాతం మేర కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ బ్రిటన్ రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన రిచర్డ్ కాక్ హెచ్చరించారు.2013లో గుజరాత్ బయో–టెక్నాలజీ మిషన్ గిర్ ప్రాంతంలోని 10 శాతం సింహాలపై నిర్వహించిన అధ్యయనంలో సీడీవీ, పీపీఆర్వీ వైరస్ రకాల దాఖలాల్లేవని స్పష్టమైంది. 1990ల మధ్యలో సీడీవీ వైరస్తో ప్రబలిన అంటువ్యాధుల వల్ల ఆఫ్రికాలోని మూడోవంతు సింహాలు తుడిచిపెట్టుకుపోయాయి. అంతుపట్టని రోగాలే కారణం.. అంతుపట్టని రోగాల కారణంగానే ఇవి మరణిస్తున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో కొన్ని సింహాల రక్తం, కణజాల నమూనాల్లో ‘వైరల్ ఇన్ఫెక్షన్’ ఆధారాలు లభించినట్లు తెలిసింది. నాలుగు శాంపిళ్లలో కెనైన్ డిస్టెంపర్ వైరస్ (సీడీవీ) ఉన్నట్లు తేలింది. జునాగఢ్లోని ఫోరెన్సిక్ సైన్స్ల్యాబ్ పరీక్షల్లోని ఆరు శాంపిళ్లలో ప్రోటోజువా ఇన్ఫెక్షన్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఈ రెండు పరిశోధనశాలలు నిమగ్నమయ్యాయి. వీటికి తోడు బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం గుజరాత్ వెళ్లి నమూనాలు పరిశీలించింది. ఎక్కువగా సింహాలు మరణించిన చోటుకు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి 31 సింహాలను గిర్ అధికారులు మరో చోటికి తరలించారు. ఆ తర్వాత అవి అరోగ్యంగానే ఉంటున్నాయి. -
ఏకాకి జీవితంతో వ్యాధుల చికాకు..
లండన్ : ఆధునిక జీవితంలో మనిషిని చిన్నాభిన్నం చేస్తున్న ఒంటరితనం మానవాళిని మింగేసే ఉపద్రవమని వైద్యులు సైతం తేల్చిచెబుతున్నారు. ఒంటరితనం ఫలితంగా శరీరం వ్యాధుల మయంగా మారుతుందనేందుకు ఇప్పటికే పలు అథ్యయనాలు ఆధారాలు గుర్తించగా ఏకాకి జీవితంతో మనిషి శరీరంలో ఏం జరుగుతుందనేది తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒంటరితనంతో బాధపడేవారికి అసలైన మందు చుట్టూ ఉన్న వారితో మమేకం కావడమేనని హార్వర్డ్ యూనివర్సిటీ సైకియాట్రిస్ట్ డాక్టర్ చార్లెస్ బుల్లక్ తేల్చిచెప్పారు. ప్రపంచ నాగరిక చరిత్రలోనే ఎన్నడూలేనంతగా సాంకేతికతను ప్రస్తుత తరం ఉపయోగిస్తున్నా ఒంటరితనం మాత్రం 1980లతో పోలిస్తే రెండింతలైందని మాజీ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో పేర్కొన్నారు. ఒంటరితనం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఒంటరితనంతో బాధపడే వారిలో ఎదుటి వ్యక్తుల ముఖంలో భావాలను చదవగలిగేందుకు వీలు కల్పించే మెదడులోని కీలక గ్రే మ్యాటర్ తగ్గుముఖం పడుతుందని డాక్టర్ బుల్లక్ తన బ్లాగ్లో పొందుపరిచారు. ఒంటరితనంతో మనిషి శరీరంలో హార్మోన్లు విశృంఖలంగా ఉరకలెత్తుతాయని గుర్తించారు. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్ధాయిని మించి విడుదలైతే శరీరం నియంత్రించుకోలేదని ఇది శరీర జీవక్రియలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు. వీలైనంత సమయం స్నేహితులతో గడపడం ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుందని డాక్టర్ బుల్లక్ చెప్పుకొచ్చారు. సమూహంలో మెలగడం ద్వారా ఉద్వేగాలను తగ్గించుకోవచ్చని, కుంగుబాటు నుంచి ఉపశమనం కలుగుతుందని, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని సూచించారు. లైబ్రరీ, పార్కు, జనావాసాల్లోకి తొంగిచూడటం వంటి వాటితో మెదడులో ఆక్సిటోసిన్ విడుదలవడం ద్వారా ఒత్తిడి హార్మోన్ స్ధాయిలను తగ్గిస్తుందన్నారు. -
జీవగడియారం గుట్టు తెలిపే రక్తపరీక్ష
లండన్ : మనం ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను ఎప్పటికప్పుడు నిర్ధేశించే జీవగడియారం ఆనుపానులు తెలిసే ఆవిష్కరణకు బీజం పడింది. శరీరం లోపలి గడియారాన్ని 90 నిమిషాల్లో కొలిచే సులువైన రక్తపరీక్షను రూపొందించామని నార్త్వెస్ర్టన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో వ్యక్తుల వారీగా వైద్య చికిత్సలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని సమస్త కణాలను నిర్ధేశించే సర్కాడియన్ రిథం ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలకు కేంద్రంగా మారింది. మనం నిద్రించే సమయంలో, ఆకలి వేసే సమయంలో, వ్యాది నిరోధక వ్యవస్ధ చురుకుగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు..ఇలా మన శరీరంలో అన్ని జీవ ప్రక్రియల్లోనూ జీవగడియారం శరీర విధులను నియంత్రిస్తుందని నార్త్వెస్ర్టన్ యూనివర్సిటీ బయోస్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్మేరీ బ్రాన్ పేర్కొన్నారు. జీవగడియారం శరీర విధులను సరిగ్గా నియంత్రించలేని సమయంలో అల్జీమర్స్, గుండెసమస్యలు, మధుమేహం వంటి వ్యాధులకు దీనితో నేరుగా సంబంధం ఉందని గుర్తించామన్నారు. ఈ అథ్యయనం కోసం తాము 73 మంది నుంచి 1100 రక్తనమూనాలను సేకరించామని, ప్రతి రెండు గంటలకు శాంపిల్స్ తీసుకుని రోజు మొత్తంలో జన్యువుల కదలికల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది పరిశీలించామని పరిశోధకులు తెలిపారు. ఈ రక్తపరీక్షలో వ్యక్తి శరీర గడియారం రోజులో సమయాన్ని కచ్చితంగా నిర్ధారించగలిగామని వెల్లడించారు. -
కేరళను కుదిపేస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. -
ప్రాణవాయువుతోనే వ్యాధులకు చికిత్స!!
బతికేందుకు మనం పీల్చుకునే ఆక్సిజన్తోనే వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు చికిత్స కల్పిస్తే ఎలా ఉంటుంది? యాంటీబయాటిక్ మందులను పూర్తిగా మాన్పించే లక్ష్యంతో సిన్సినాటీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. కాంతి ద్వారా ఉత్తేజితం చేస్తే.. ఆక్సిజన్ కాస్తా శక్తిమంతమైన ఆయుధంగా మారుతుందని, మందులకు లొంగని బ్యాక్టీరియాతోపాటు అనేక ఇతర సూక్ష్మజీవి సంబంధిత ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు పనికొస్తుందని వీరు అంటున్నారు. ఈ కొత్త ఆయుధంతో భవిష్యత్తులో కేన్సర్ కణాలకూ చెక్ పెట్టవచ్చునన్నది వీరి అంచనా. ఫొటో సెన్సిటైజర్లను వాడినప్పుడు సాధారణ ఆక్సిజన్ కాస్తా రియాక్టివ్ ఆక్సిజన్గా మారుతుందని, బ్యాక్టీరియాపై దాడి చేస్తుందని, ప్రస్తుతం ఈ పద్ధతిని తాము ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పెంగ్ ఝాంగ్ తెలిపారు. ద్రవపదార్థాల్లో ఉండే బ్యాక్టీరియానూ చంపేసేందుకు తాము కొన్ని లోహాల నానో కణాలను ఉపయోగించామని, ఇది పలు రకాల బ్యాక్టీరియాను నాశనం చేయడంలో విజయం సాధించిందని వివరించారు. ఈ ఫొటో సెన్సిటైర్లను స్ప్రే లేదా జెల్ రూపంలోకి మార్చేందుకు తాము పేటెంట్ కూడా సంపాదించామని, దీన్ని నేరుగా గాయాలపై వేసేందుకు అవకాశముందని, మానవ చర్మంపై జరిపిన పరిశోధనల్లో ఈ స్ప్రే చర్మకణాలను కాకుండా బ్యాక్టీరియాను మాత్రమే చంపేసిందని వివరించారు. భవిష్యత్తులో చర్మ కేన్సర్కూ దీన్ని వాడవచ్చునని సూచించారు. -
తొలకరి జల్లులు.. వ్యాధులు మొదలు
వానకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అయితే వానలు పూర్తిస్థాయిలో కురవడం ప్రారంభమయితే మురుగు కాలువలు పొంగిపొర్లుతాయి. చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి నీటి వనరులు కలుషితమవుతాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు అంతుచూస్తాయి. నెల్లూరు(బారకాసు): వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరితో మొదలయ్యే వ్యాధులు ఓ పట్టాన అంతు చిక్కవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో వీటిని కట్టడి చేయడం సామాన్య విషయం కాదు. వర్షాలు పూర్గిగా పడక ముందే డయేరియా బాధితులు ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దరికి చేరవని వైద్య నిపుణుల పేర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ వల్లే వ్యాధులు నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. మంచినీటి పైపులైన్లలో లీకులు ఏర్పడి తాగునీరు కలుషితవుతోంది. అనంతరం ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించి జిల్లా వైద్యారోగ్య, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 12 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులకు కారణాలివే ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియా నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా వ్యాధులు సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరోచనాలతో పాటు, రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవడం వల్ల జలుబుతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతిసార వ్యాధికి కారణాలు కలుషిత నీరు, ఆహారం.లక్షణాలురోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి రోగి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్కు గురై షాక్లోకి వెళ్లిపోతారు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకు పోవడం, నీరసించిపోవడం, చురుకుదనం తగ్గి, మాట్లాడలేక పోవడం, చివరికి మూత్రం కూడా తగ్గి ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అతిసారకు గురైన వారిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి డయేరియా వ్యాధికి కారణాలు కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరోచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స ఎక్కువ సార్లు విరేచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి షాక్లోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది. రక్త విరేచనాలు కలుషిత ఆహారం వల్ల వస్తాయి. తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం అవడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరి మలాన్ని పరీక్ష చేసి వ్యాధి కారకాన్ని గుర్తించాలి. జాగ్రత్తలు డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది. రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు, అన్నం, పప్పు తీసుకోవచ్చు. విరేచనం తర్వాత తప్పనిసరిగా సుబ్బుతో చేతులు కడుక్కోవాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. -
ప్లాస్టిక్ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త
న్యూయార్క్ : ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికే కాదు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పేనట. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల జీర్ణకోశ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన ‘టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటీ’ వారు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఇంఫ్లమేటరి బోవెల్ డిసీస్(ఐబీడీ) అనే జీర్ణకోశ సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఎక్కువని తేలింది. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం కారణంగా మనిషి జీవితకాలం తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలలోని పోషక విలువలను శరీరం గ్రహించటం కష్టంగా మారుతుందని తేల్చారు. అంతేకాకుండా మనం ఉపయోగించే ఫేస్ వాష్లలో కూడా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని నిర్థారించారు. బీపీఏ తినే ఆహార పదార్థాలలో చేరటం ద్వారా మానవ ప్రవర్తనలో మార్పులు తేవటమే కాక చిన్నపిల్లల మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. -
'జూ’పై రోగాల దాడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల మృత్యువాత సీరియల్గా సాగుతోంది. తాజాగా మరో జంతువు చనిపోయింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక దీప అనే ఆడ చిరుతపులి చనిపోయింది. దీని వయస్సు 22 ఏళ్లు. గత కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న చిరుతకు సరైన వైద్యం అందక చనిపోయింది. గడిచిన ఏడాది కాలంలో ఇక్కడి జూలో ఏనుగు, అడవిదున్న, నీటిగుర్రం, నీటి కుక్క, హైనా, సారస్ క్రేన్ పక్షి, చింపాంజి, ఎలుగు బంటి, నామాల కోతులతో సహా 70కి పైగా జంతు వులు చనిపోయాయి. వృద్ధాప్యంతోనే జంతువులు చనిపోతున్నాయని జూ అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు చుట్టుముట్టడంతోనే జంతువులు మరణిస్తున్నాయని రిటైర్డ్ ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. అన్ని జంతువులకూ ఒకటే వ్యాధి చనిపోతున్న జంతువులన్నీ, శ్వాస, జీర్ణ సంబంధ వ్యాధులతోనే చనిపోతున్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నెలల తరబడి ఎన్క్లోజర్లను శుభ్రం చేయకపోవటం, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్లే జంతువులు మరణిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
సిగిరేట్ తాగితే పళ్లు రాలిపోతాయ్..
బర్మింగ్హామ్ : సరదా సరదా సిగరెట్టు.. దొరల్ తాగు బలె సిగరెట్టు... పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి అది తొలిమెట్టు. ఇది ఓ సినిమాలో పాట.. పొగరాయుళ్లు తమకు అన్వయించుకునే మాట. ఓ పూట తిండి లేకపోయినా ఉంటారేమో గానీ పొగతాగంది ఉండలేరు. నష్టం తప్పదు నాయనా అని ఎంత నచ్చజెప్పినా నచ్చిందే చేస్తామంటారు. కొత్త సిగిరేట్లు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో అలానే రోగాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిగిరేట్ తాగటం వల్ల పళ్లు త్వరగా రాలిపోతాయని పరిశోధనల్లో తేలింది. ఇంగ్లాండుకు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్హామ్’’ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొగ తాగని వారికంటే తాగే వారిలో రెండు రెట్లు ఎక్కువగా పళ్లు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పొగతాగే వారికి ఎక్కువగా చిగుళ్ల సమస్యలు వస్తాయని, వీరిలో ఎక్కువమంది చిగుళ్ల సమస్యలతో బాధ పుడతున్నారని తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లైనా ‘రూట్ కెనాల్ ట్రీట్మెంట్’ చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికి నోటి నొప్పి, చిగుళ్ల, పంటి సమస్యలు ఎక్కువంటున్నారు. ఆల్కాహాల్, సిగిరేట్ ఈ రెండిటిని ఎక్కువగా తీసుకోవటం కారణంగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. సిగరేట్ తాగటం వల్ల నోటిలోని వ్యాధి నిరోధక వ్యవస్ధ దెబ్బ తింటుందని తెలిపారు. నోటికి సంబంధించిన అన్ని రోగాలకు పొగాకే కారణమని తేల్చి చెప్పేస్తున్నారు. చైన్ స్మోకర్లలాగా దమ్ము మీద దమ్ము కొడుతూ పోతే నోటితో పట్టుకోవడానికి చివరకు పళ్లే లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. -
అదేపనిగా టీవీ చూస్తే..
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు. జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు. -
అన్ని వ్యాధులకూ చెక్ పెట్టే టైమొచ్చిందా?
భూమ్మీద వ్యాధులన్నవి లేకుండా పోతే ఎంత బాగుంటుందో అని మనలో చాలామందికి అనిపిస్తూంటుంది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఇలాంటి అద్భుతం సాధ్యం కానుంది. అనేకరకాల వైరస్లను మట్టుబెట్టగల సామర్థ్యమున్న ప్రొటీన్లను తయారు చేసేందుకు వీరో వినూత్న పద్ధతిని ఆవిష్కరించడం దీనికి కారణం. ఇప్పటివరకూ మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్న ప్రొటీన్లనే కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి మందులుగా వాడుతూండగా.. వీరు ఒక అడుగు ముందుకేసి అమినోయాసిడ్ల నుంచి ఎక్కడా లేని లక్షల రకాల ప్రొటీన్లను తయారు చేయవచ్చునని నిరూపించారు. పైగా వీటిని రిఫ్రిజిరేటర్లలో చల్లగా ఉంచాల్సిన అవసరం కూడా లేదని.. రోగ నిరోధక వ్యవస్థ స్పందించే అవకాశాలూ తక్కువేనని అంటున్నారు. అమెరికా రక్షణ సంస్థ డార్పా కోసం నాలుగేళ్ల క్రితం తాము ఈ ప్రాజెక్టును మొదలుపెట్టామని... గతంలో తాము ప్రొటీన్ శృంఖలాలను కృత్రిమంగా తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని దీంట్లో వాడామని పెంటల్యూట్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఈ కొత్త రకం ప్రొటీన్లను ఎబోలా, నీపా వైరస్ వంటి అనూహ్యమైన వైరస్ ఇన్ఫెక్షన్లకు సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా. -
ఈ ఐదూ పాటిస్తే మరో 14 ఏళ్లు..
న్యూయార్క్ : వృద్ధాప్యంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారింది. అయితే అయిదు జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని మహిళలు 14 ఏళ్ల పాటు, పురుషులు 12 సంవత్సరాలు పొడిగించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. పొగతాగడానికి దూరంగా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన శరీర బరువు, అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం వంటి ఐదు సూచనలూ పాటిస్తే పదేళ్ల పాటు మన జీవనకాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. అమెరికా జాతీయ సర్వేల్లో 34 ఏళ్ల పాటు మహిళల గణాంకాలు, 27 ఏళ్ల పాటు పురుషుల డేటాను పరిశోధకులు విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. నిపుణులు సూచించిన ఐదు అంశాలను సరిగ్గా పాటించిన వారు ఇతరులతో పోలిస్తే ఈ వ్యవధిలో 74 శాతం మంది అకాల మృత్యువాతన పడలేదు. గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ కారణంగా మరణాల రేటు వీరిలో అతి తక్కువగా నమోదైంది. వ్యాధికి చికిత్స కంటే నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ అథ్యయనంలో కీలకంగా వెల్లడైందని అథ్యయన రచయిత, హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన ఫ్రాంక్ హు అన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని, ఆరోగ్యంపై వెచ్చించే ఖర్చులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. తమ అథ్యయనం ప్రకారం తాము సూచించిన ఐదు సూత్రాలను పాటించిన వారిలో గుండెజబ్బుల ద్వారా మరణించడం 82 శాతం మేర తగ్గిందని, క్యాన్సర్ కారణంగా మరణాలు కూడా మూడింట రెండు వంతులకు పడిపోయిందని చెప్పారు. ఆరోగ్యంగా జీవించడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అథ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. -
నెలసరి సమస్యలకు మండూకాసనం
మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి. ఉపయోగాలు: గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.