Drone camera
-
ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కలకలం
-
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
వనంలో వనితలపై అనుచిత నిఘా
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది! అడవే వారికి జీవనాధారం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది. ‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వాట్సాప్లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇదేం దిక్కుమాలిన పని! ఉత్తరాఖండ్లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు. తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.స్పందించని అధికారులు దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రోన్ చూసి పరుగు పెట్టిన మందు బాబులు
-
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్స్టర్ పారిస్కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
సాక్షి, అమరావతి: ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి, ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారి చేసి.. వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం. మళ్లీ అదే వ్యవస్థను తీసుకు వచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. తొమ్మది మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్లీ అనుసరించాలని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోక పోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించబోనన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, మూడు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సమయం లేదు మళ్లీ వింటా.. రాష్ట్రంలో త్వరలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఖరారు చేయడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభం, ఇతర అంశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రస్తుతం సమయం లేదని, మళ్లీ వింటానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, ఆదోని, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టడంతో పాటు, తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దోమలు అధికంగా ఉన్న 20 వేల ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో మందును పిచికారి చేస్తూ దోమలు లేని ప్రాంతాలను సున్నాకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించామని చెప్పారు. -
ఏఐతో పనిచేసే పక్షులు వచ్చేస్తున్నాయ్!
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉపశమనం -
ఆకాశమే హద్దు..!
సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం.. రానున్న కాలంలో రైతులంతా డ్రోన్లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు. పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు. నిబంధనలు సరళతరం.. డ్రోన్లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు. డ్రోన్లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్లను మధ్యస్థ డ్రోన్లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్లుగానూ వర్గీకరించారు. అనుమతులు తప్పనిసరి.. నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్ల ఆపరేషన్కు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లను నిర్దేశిస్తుంది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే. డ్రోన్ల వేగంపై పరిమితులు.. మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్సైట్లోని మ్యాప్లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ఆపరేషన్కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
టెక్ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!
స్మార్ట్ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్ఫోన్తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్ కెమెరాను అమెరికన్ కంపెనీ ‘హోవర్’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్షాట్ మోడ్ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఫాలో మోడ్ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్లో లైవ్లో చూసుకోవచ్చు. ‘హోవర్ కెమెరా ఎక్స్1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే! -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
అమృత్పాల్ కోసం డ్రోన్తో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్ను రంగంలోకి దించారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్పాల్ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్పాల్ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. -
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం...డ్రోన్ విజువల్స్
-
‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు
సాక్షి, అమరావతి: డ్రోన్ల రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లోని 116 ఐటీఐల్లో ఆరు స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. డ్రోన్ల తయారీ, టెక్నీషియన్, పర్యవేక్షణ, నిర్వహణ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ తదితర కోర్సులకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐటీఐల్లో డ్రోన్లకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. ఏపీలోని 10 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులకు కేంద్రం అనుమతిచ్చింది. అలాగే అసోం, అరుణాచల్ప్రదేశ్, బిహార్, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. -
65శాతం గ్రామాల్లో.. డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో మొదటి ఘట్టమైన డ్రోన్ సర్వే దాదాపు 65 శాతం గ్రామాల్లో పూర్తయింది. రాష్ట్రంలోని 17,460 గ్రామాలకుగాను 13,481 గ్రామాల్లో ఈ డ్రోన్ సర్వే చేయాల్సి వుండగా.. ఇప్పటివరకు 8,804 గ్రామాల్లో పూర్తయింది. విస్తీర్ణపరంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 1,12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలను సర్వే చేయాల్సి వుండగా ఇప్పటివరకూ 65,866 చ.కి.మీ.లలో (59 శాతం) ఈ సర్వే పూర్తయింది. డ్రోన్లు, విమానాలు, హెలీకాప్టర్లతో దేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్రంలో ఈ డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నారు. మిగిలిన 4,677 గ్రామాల్లో (46,134 చ.కి.మీ.) ఏప్రిల్ 23కల్లా పూర్తిచేయడానికి సర్వే, రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 1,500 గ్రామాల్లో దీనిని పూర్తిచేయగలిగారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయిలో సర్వే పూర్తిచేయడాన్ని బట్టి ఎంత వేగంగా జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు. అత్యాధునికంగా.. శరవేగంగా.. డ్రోన్ సర్వేను తొలుత సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. సర్వేను అనుకున్న గడువులోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించి వాటితో చేయిస్తున్నారు. దీంతోపాటు సర్వే, సెటిల్మెంట్ శాఖ సైతం స్వయంగా ఈ సర్వే చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసింది. తమ సర్వేయర్లకే డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇప్పించి మరీ సర్వే చేయిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి శరవేగంగా ఈ డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నాయి. అక్కడక్కడా ఆలస్యమవుతుందనుకున్న ప్రాంతాల్లో ఏరియల్గా (విమానాలు, హెలీకాప్టర్లతో) చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం భూముల రీసర్వే చేయడం దేశంలో ఇదే మొదటిసారి దీన్నికూడా ఇంత అత్యాధునికంగా, పెద్దఎత్తున డ్రోన్లు, విమానాలతో చేస్తుండడాన్ని మిగిలిన రాష్ట్రాలు ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న భూముల సర్వే, డ్రోన్ సర్వే తీరును పరిశీలించి వెళ్లాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏప్రిల్ నాటికి డ్రోన్లతో సర్వే పూర్తికి రెవెన్యూ, సర్వే శాఖలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. 2,079 గ్రామాల్లో తుది రెవెన్యూ రికార్డులు రెడీ.. ఇక డ్రోన్ సర్వే పూర్తిచేసిన తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించిన డ్రోన్ చిత్రాలను సర్వే యంత్రాంగానికి ఇవ్వాల్సి వుంటుంది. ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేసిన 8,804 గ్రామాలకుగాను 5,264 గ్రామాల డ్రోన్ చిత్రాలను సర్వే బృందాలకు అందాయి. 4,006 గ్రామాలకు చెందిన ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీచేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సర్వే చేయాలి. ఇప్పటివరకు 3,191 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేను పూర్తిచేశారు. 2,464 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ను పూర్తిచేయగా, 2,242 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. 2,079 గ్రామాలకు సంబంధించిన తుది రెవెన్యూ రికార్డుల తయారీ పూర్తయింది. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్కాస్ట్ మైన్స్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేలో డ్రోన్లతో భూమిని కొలిచే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. 15 రోజుల్లోనే 700 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం విశేషం. సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డ్రోన్లు 4,769 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా.. ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లు 3,652 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 807 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ సర్వే చేసేందుకు.. సర్వే బృందాలు విస్తృతంగా పని చేస్తున్నాయి. మరోవైపు డ్రోన్ సర్వే పూర్తయిన 4,006 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్(చాయాచిత్రాలు)ను ఇప్పటికే విడుదల చేశారు. వీటితోనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా ఇప్పటికే 3,031 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజ నిర్థారణ(గ్రౌండ్ ట్రూతింగ్)ను పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని 3.58 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 975 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చివరిగా నిర్వహించే గ్రౌండ్ వ్యాలిడేషన్ను కూడా 2,409 గ్రామాల్లో పూర్తి చేశారు. 622 గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయిన గ్రామాల్లో 19,355 అభ్యంతరాలు రాగా.. వాటిలో 19,299 అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మొత్తంగా ఇప్పటివరకు అన్ని దశల్లో రీ సర్తే పూర్తయిన గ్రామాలు 2,913 ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 1,800 గ్రామాల్లో కూడా నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ యంత్రాంగం కృషి చేస్తోంది. -
తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లను ఎగురవేశారు. దీంతో, వీటిని ఎవరు ఎగురవేశారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, డ్రోన్లను ఎగురవేస్తున్న సమయంలో స్థానికులు డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించారు. డ్రోన్లతోనే శ్రీవారి ఆలయ దృశ్యాల చిత్రీకరణ జరిగింది. కాగా, కాకులకోన వద్ద సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలు తీసేందుకే డ్రోన్ ఆపరేటర్ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల ముందు సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ చిత్రీకరించారు. దీంతో, డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయం బయటకు వచ్చింది. -
ఏందిరా నీలొల్లి.. నీటిలో నుంచి ఒక్కసారిగా ఎగిరి డ్రోన్ను..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు దర్శనమిస్తాయి. అయితే, కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుని రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. ఇక, కేటగిరిలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, వన్యప్రాణుల ఫొటోలను, వీడియోలను తీసేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది వినూత్నంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్స్ విజయవంతంగా అయ్యారు. మరికొందరు ఫేయిల్ అయ్యారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి డ్రోన్ సాయంతో స్పెషల్ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఓ నదిలో ఉన్న ఎలిగేటర్ను ఎందుకున్నాడు. దీంతో, రంగంలోకి దిగిన ఫొటోగ్రాఫర్కు చేదు అనుభవమే ఎదురైంది. కాగా, వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న ఎలిగేటర్ కదిలికపై ఫొటోగ్రాఫర్ ఫోకస్ పెట్టాడు. ఓ డ్రోన్ సాయంతో ఎలిగేటర్కు సమీపం వరకు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించాడు. డ్రోన్ కాసేపటి వరకు వీడియో తీసింది. దీంతో, డ్రోన్ సౌండ్కు చిర్రెత్కుకుపోయిన ఎలిగేటర్.. డ్రోన్ తన వద్దకు రాగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. డ్రోన్ను నోటితో పట్టుకుని నీటిలోకి దూకింది. ఎలిగేటర్ దాడిపై ఒక్కసారిగా షాకైన ఫొటోగ్రాఫర్.. చూస్తూ నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022 -
డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!
సాక్షి, ముంబై: ఆన్లైన్ షాపింగ్ సైట్లలో షాపింగ్ అంటే కత్తి మీద సామే అనిపిస్తోంది. పార్సిల్ వచ్చి దాన్ని విప్పి, వస్తువు క్వాలిటీ చెక్ చేసే దాకా ఎలాంటి గ్యారంటీ లేదు. కట్ చేస్తే ..ఆన్లైన్లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే..అలుగడ్డలతో వచ్చిన ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ వివరాల్లోకి వెళితే బిహార్కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యాపారవేత్త, ఆన్లైన్లో డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో గానీ, ప్యాకెట్ డెలివరీ చేస్తున్న బాయ్ ద్వారానే దాన్ని ఆన్బాక్స్ తీస్తూ వీడియో తీశాడు. దీంతోకస్టమర్తోపాటు,డెలివరీ బాయ్ తెల్లముఖం వేశాడు. ఎందుకంటే అందులో గుండ్రటి బంగాళా దుంపలు వెక్కిరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ, లేదా బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఆన్లైన్ కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. (28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!) ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb — UnSeen India (@USIndia_) September 26, 2022 -
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్మహల్ -
కిటికీలన్నా తెరుచుకుంటాం మహాప్రభో!
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని, జీరో కోవిడ్ విధానం పేరిట చైనా అనుసరిస్తున్న నమూనా షాంఘై నగర ప్రజల ప్రాణాలమీదకు వచ్చింది. ఒకపక్క ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో నగరంలో ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కలుగుల్లో చిట్టెలుకల్లా మాడిపోతున్నాం మహాప్రభో అని ప్రజలు మూకుమ్మడి విజ్ఞాపనలు చేస్తున్నారు. చాలా అపార్ట్మెంట్లలో నీళ్లు, ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి. అయినా బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో చాలామంది తమ తమ బాల్కనీల్లో, కిటికీల వద్ద మనసు సాంత్వన పడేదాకా ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫీలైన ప్రభుత్వం ‘స్వాతంత్య్రం కోసం మీ ఆత్మలు పడే తపనను నియంత్రించుకోండి’ అని హెచ్చరించింది. దీంతో మనసారా ఏడ్చే అవకాశమూ ఇవ్వరా, కిటికీల్లో కుమిలే ఛాన్సు లేదా అంటూ ఇంట్లోనే గొల్లుమంటున్నారు షాంఘై వాసులు. డ్రోన్ పడగ నీడలో.. నగరంలో ప్రభుత్వ ఆంక్షలు సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నాయి. పొరపాటున బాల్కనీల్లో, కిటికీల్లో ఎవరైనా తల బయటపెట్టగానే ‘కంట్రోల్ ద సోల్ డిజైర్ ఫర్ ఫ్రీడం అండ్ డోంట్ ఓపెన్ విండో’ అని బ్యానర్లున్న డ్రోన్లు ముఖం ముందు ప్రత్యక్షమవుతున్నాయని ప్రజలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. ప్రభుత్వం మరీ నిర్భంధంగా వ్యవహరిస్తుండడంతో షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి తిరుగుబాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయినా పెద్ద పెద్ద ప్రజాందోళనలనే లెక్కచేయని చైనా ప్రభుత్వానికి ఈ చిన్నపాటి తిరుగుబాట్లు ఏపాటి అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ నిర్బంధానికి తోడు ప్రజలకు కరోనా టెస్టులు తలనొప్పిగా మారాయి. సింగిల్ టెస్ట్ అని, డబుల్ టెస్టులని ప్రభుత్వం ఎడాపెడా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తోంది. మరి ఎంతమంది రోగులు తేలారో, వారేమయ్యారో, మిగిలినవారి పరిస్థితేంటో ఎవరికీ తెలీదు! ఎక్కడైనా కరోనా పాజిటివ్ అని తేలితే చాలు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా తీసుకుపోయి క్వారంటైన్ కేంద్రంలో పారేస్తున్నారు. కొన్నిచోట్ల చిన్న పిల్లలను సైతం తల్లిదండ్రుల దగ్గర్నుంచి లాక్కెళ్లి క్వారైంటైన్ పాలుచేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఫ్యామిలీ క్వారంటైన్ అమలు చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గగనతలం నుంచి గస్తీ...రహదారులపై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకుని వాటి సహాయంతో గస్తీ నిర్వహించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అనుమతితో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలన సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. దీంతో త్వరలో తొలి దఫా మూడింటిని సమీకరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో.. తిప్పలెన్నో.. సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్గా పిలిచే రద్దీ వేళల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ. ఆయా చోట్ల ఉండే అక్రమ పార్కింగ్, ఫుట్పాత్ల ఆక్రమణలు, బాటిల్ నెక్స్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలతో పాటు తేలికపాటి వాహనాల పైనా గస్తీ నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి సరి చేస్తుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులను వినియోగించాల్సి వస్తోంది. ప్రముఖుల పర్యటనల నేపథ్యంలోనూ.. నగరంలో అనునిత్యం ప్రముఖుల పర్యటనలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న వీవీఐపీలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏటా వందల సంఖ్యలో ముఖ్యులు వస్తుంటారు. వీరి రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మళ్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి. కీలక సభలు, సమావేశాలతో పాటు గణేష్, బోనాలు వంటి పండగలు, ఉత్సవాల సమయంలోనూ రహదారులపై ట్రాఫిక్ పోలీసుల కదలికలు ఎక్కువగా ఉంటేనే సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ విధులను స్థానిక ట్రాఫిక్ ఠాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వర్తిస్తున్నారు. టీసీసీసీతో అనుసంధాని వినియోగం... ఈ డ్రోన్లను బషీర్బాగ్లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (టీసీసీసీ) అనుసంధానించనున్నారు. డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వీళ్లు గమనించిన అంశాల ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తారు. డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు సైతం ఈ సెంటర్తోనే అనుసంధానించి ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గరిష్టంగా రెండు నెలల్లో నగర ట్రాఫిక్ విభాగంలో మూడు డ్రోన్లు సేవలు అందించనున్నాయి. తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా.. ఇలా రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో బృందం ఒక సమయంలో కేవలం ఓ రహదారిపై మాత్రమే పని చేయగలుగుతోంది. దాన్ని క్లియర్ చేసిన పోలీసులు మరో చోటుకు వెళ్లేసరికి ఇక్కడ మళ్లీ అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా డ్రోన్ల సాయంతో గగనతల గస్తీ నిర్వహణకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లు ఖరీదు చేస్తున్నారు. రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలోనూ వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రెండుసార్లు డ్రోన్లను వాడి చూశారు. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: అంతా ఆ తాను ముక్కలే!) -
చురుగ్గా భూ సర్వే
సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు. 44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్ పాస్ పుస్తకాలు, వెబ్ల్యాండ్ అడంగల్ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్ఎస్ఆర్తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి. -
వినువీధి వి‘చిత్రం’.. సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయం
పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్ సేవల్ని సిక్కోలు వాసులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పదుల సంఖ్యలో మనుషులు చేయాల్సిన పనిని విహంగ నేత్రం చేసేస్తోంది. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం దగ్గర్నుంచి పొలాల్లో పురుగుమందుల పిచికారీ వరకు.. పోలీస్ నిఘా నుంచి వరద ప్రాంతాల్లో పరిస్థితుల సమీక్ష వరకూ.. డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్లను వినియోగిస్తున్న రంగాలు ఏమిటి.. సేవలు.. ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం. – పాలకొండ రూరల్/ఆమదాలవలస వినువీధి వి‘చిత్రం’ వివాహమైనా.. వేడుకైనా..రాజకీయ పార్టీల మీటింగైనా.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం డ్రోన్ కెమెరా వాడకం సాధారణమైపోయింది. చిత్రీకరించాల్సిన ప్రదేశాన్ని బట్టీ వేర్వేరు రకాల డ్రోన్లను ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్న డ్రోన్ల ఖరీదు రూ.రెండు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. వీటి బరువు 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు ఉంటుంది. 250 అడుగుల ఎత్తు వరకు వీటిని ఎగురవేస్తున్నారు. ఒక సారి బ్యాటరీ చార్జ్ చేస్తే 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. డ్రోన్లతో పెట్రోలింగ్.. ఎక్కడెక్కడ.. ఎవరెవరున్నారు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారెవరు.. ర్యాలీలు, ధర్నాలు జరిగేటప్పుడు సంఘ విద్రోహక శక్తులు ఏమైనా పాల్గొంటున్నాయా వంటి విషయాల్ని తెలుసుకునేందుకు పోలీస్ విభాగం నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. లాక్డౌన్లో ఎస్పీ అమిత్బర్దార్ స్వయంగా డ్రోన్ను వినియోగించి నగరంలో పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఎస్ఈబీ అధికారులు కూడా డ్రోన్ వినియోగాన్ని పెంచారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో వీటి సేవల్ని వినియోగించుకుంటున్నారు. సారా అమ్మకాలు సాగించే స్థావరాలను గుర్తించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రకృతి విపత్తుల అంచనాలో.. ప్రకృతి విపత్తులు సంభవించే వేళ వాటి తీవ్రత ఇతర అంశాలను అంచనా వేసేందుకు అధికారులు డ్రోన్లపై ఆధారపడుతున్నారు. తాజాగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వంగర మండలంలోని మూడు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రజల పరిస్థితులు, వరదనీటి ఉద్ధృతి ఇతర విషయాల్ని పర్యవేక్షించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఈ డ్రోన్లపైనే ఆధారపడ్డారు. గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మీ పొలంలో పిచికారీ కోసం.. వ్యవసాయ పనుల్లో రైతన్నకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కూడా సిద్ధమంటోంది డ్రోన్. ఇటీవలే ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పొలానికి పురుగు మందులు పిచికారీ చేసే అంశంపై డెమో జరిగింది. ఈ డ్రోన్ సాయంతో ఎకరా పొలానికి 10నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని సులభంగా పిచికారీ చేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించారు. ఇలాంటి సేవల్ని రైతులకు అందించేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర భూ సర్వేలో కీలకంగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆధునిక డ్రోన్ను వినియోగిస్తోంది. సగటున రోజుకు 700 ఎకరాల వరకు సర్వే చేయొచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మూడు సబ్ డివిజన్లలో సర్వే కోసం ఒక డ్రోన్ను వినియోగిస్తున్నారు. ప్రత్యేకతలివే.. బరువు: 5 కిలోలు కెమెరా బరువు: 6.5 గ్రాములు 120 మీటర్ల ఎత్తుకు ఎగురవేస్తారు. చార్జింగ్ ఒక గంట వరకు ఉంటుంది. ధర: రూ.25 లక్షలు విహంగ నేత్రం విశేషాలివే.. డ్రోన్ బరువును బట్టి వాటిని విభజించారు. నెనో డ్రోన్ (250 గ్రాములు బరువు) మ్యాకో (250 గ్రాముల నుంచి 2.5 కిలోలు) మినీ (2.5 కిలోల నుంచి 25 కేజీల వరకు) స్మాల్(25 కిలోల నుంచి 250 కిలోలు) లార్జ్ (250 కిలోలకు పైబడి) రకాలున్నాయ్... ప్రొపెల్లర్స్(ఫ్యాన్లు లాంటి రెక్కల) సాయంతో డ్రోన్లు పైకి ఎగురుతాయి. మూడు రెక్కలుంటే ట్రైకాప్టర్, నాలుగుంటే క్వాడ్ కాప్టర్, ఆరుంటే హెక్స్ కాప్టర్, ఎనిమిది ఉంటే ఆక్టో కాప్టర్ అని పిలుస్తారు. అనుమతి తప్పనిసరి.. డ్రోన్లను వినియోగించాలంటే యూఏవోపీ అనుమతితో పాటు స్థానిక పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. n అధికారులు నిర్దేశించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వాడకం పెరిగింది.. వివాహ, రాజకీయ, ఇతర శుభకార్యాల చిత్రీకరణలో డ్రోన్ల వినియోగం పెరిగింది. జిల్లాలో దాదాపు 50 మంది వరకు ఫొటోగ్రాఫర్లు డ్రోన్ వాడకానికి సంబంధించి లైసెన్స్ కలిగి ఉన్నారు. వీటిని వాడాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి. – మండపాక శ్రీధర్,సీనియర్ ఫొటోగ్రాఫర్, పాలకొండ శాఖాపరంగా ఎన్నో సేవలు.. డ్రోన్ కెమెరాలతో శాఖాపరంగా చాలా ఉపయోగాలున్నాయి. జిల్లా కేంద్రంలో డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి వాటి సేవలు పొందుతున్నాం. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, వీఐపీల పర్యటన సమయంలో వీటిని వినియోగిస్తున్నాం. లాక్డౌన్ సమయంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. – మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ పనితీరు అద్భుతం.. సమగ్ర భూ సర్వేలో ఈ డ్రోన్ పనితీరు అద్భుతం. కచ్చితత్వం ఉంది. ప్రకృతి విపత్తులు అంచనా వేయటంలో మా సిబ్బంది డ్రోన్పైనే ఆధారపడుతున్నారు. – టీవీఎస్జీ కుమార్, ఆర్డీవో, పాలకొండ -
Huzurabad Bypoll: 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టివేత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికపై నిఘా కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదయ్యాయి. 12 రోజుల్లో కోటి 27 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 75 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,900 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. త్వరలోనే హుజూరాబాద్కు కేంద్ర బలగాలు రానున్నాయి. నిరంతరం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 406 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హుజురాబాద్లో 110, జమ్మికుంటలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు. -
ఫుల్గా తాగేసి.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు..!
ముంబై: అసలే కోతి, ఆపై కల్లు తాగినట్లు అనే నానుడి గుర్తుండే ఉంటుంది. మామూలుగానే కోతి చంచలమయిన జంతువు. ఇక అటుపై కల్లు తాగితే.. దాని ప్రవర్తన అత్యంత విచిత్రంగా, చుట్టు పక్కల విధ్వంసకరంగా ఉంటుంది. తాజాగా మద్యం తాగిన ఓ వ్యక్తి పోలీసులను ముని వేళ్లపై నిలబెట్టినంత పని చేశాడు. మద్యం మత్తులో ఏకంగా 300 అడుగుల ఎత్తున్న బీఎస్ఎన్ఎల్ టవర్పైకి ఎక్కేశాడు. వివారాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో సోమవారం సాయంత్రం సంజయ్ జాదవ్ అనే తాగుబోతు బీఎస్ఎన్ఎల్ 300 అడుగుల ఎత్తైన టవర్ పైకి ఎక్కాడు. అతను టవర్ ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని ఎవరూ గమనించలేదు. కానీ అతను ఎత్తుకు చేరుకునే సమయానికి ఆ ప్రదేశంలో జనం గుమిగూడడం ప్రారంభించారు. కొంతమంది అతడిని క్రిందికి దించడానికి ప్రయత్నించారు. కానీ అతను వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. పైగా ఓ వైర్ను మెడకు చుట్టుకుని, చొక్కా తీసేసి హల్చల్ చేశాడు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సంజయ్ జాదవ్ బీఎస్ఎన్ల్ టవర్ పైకి ఎక్కేశాడు. అంత ఎత్తులో అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో అతడిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగించారు. డ్రోన్ కెమెరా సహాయంతో.. కొంతమంది అతడిని మిలింద్ నగర్ నివాసి అయిన సంజయ్ జాదవ్గా గుర్తించారు. దాదాపు నాలుగున్నర గంటల తర్వాత అతడిని కిందకు దించడంలో పోలీసులు విజయం సాధించారు. సంజయ్ జాదవ్ కిందకు దిగిన తర్వాత అతడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా తన తల్లితండ్రులు దురుసుగా ప్రవర్తించినందుకు అతను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు అతన్ని వేధించడంతో టవర్ పైకి ఎక్కినట్లు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు. -
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో గింబల్ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్ఫోన్పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్కు తేలికపాటి డ్రోన్ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్ఫోన్కు పేటెంట్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్ను కలిగి ఉంది . ఈ స్మార్ట్ఫోన్ ధర భారత్లో రూ .49,990. -
డ్రోన్తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే
ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో అద్భుతం చేశాడు. వందలాది గొర్రెల మంద ఒకేసారి కదులుతుండగా.. పై నుంచి అవి దిశను మార్చుకుంటున్న తీరును కెమెరాలో బందించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికల్ని ఫాస్ట్ పార్వర్డ్ పద్దతిలో ఒకసారి.. స్లో మోషన్ యాంగిల్లో చూపెట్టాడు. ఒకసారి పాములా మెలికలు తిరుగుతూ కనిపించిన గొర్రెల మంద మరోసారి పక్షి ఆకారంలోకి మారడం కనువిందు చేసింది. డ్రోన్తో అద్భుతం చేసి చూపించిన లయర్ పటేల్ దీని వెనుక కఠోర శ్రమ దాగి ఉందంటూ చెప్పుకొచ్చాడు. ''కొన్ని నెలలుగా 1000-1700 సంఖ్య ఉన్న గొర్రెల మంద కదలికను డ్రోన్లో బందించేందుకు చాలా శ్రమించా. అవి ఒకచోట కుదురుగా ఉండకపోవడంతో వాటి చుట్టే ఏడు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. అలా చివరికి ఒక దగ్గర ఆగి అవి ఆహారం మేస్తుండగా.. ఒకసారి స్లో మోషన్లో.. మరోసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పద్దతిలో చిత్రీకరించా. తీరా వీడియోను చూశాకా అంత అందంగా వస్తుందని ఊహించలేదు. ఇన్నాళ్ల నా కష్టం ఊరికే పోలేదు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా లయర్ పటేల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ రాగా.. లయర్ కెమెరా పనితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. చదవండి: వావ్ అంకుల్.. స్టెప్పులిరగదీశావ్ కదా..! View this post on Instagram A post shared by Lior Patel - Drone Photography (@liorpatel) -
అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు
రేక్జావిక్: డ్రోన్ కెమెరాల వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్ గాలిలో చక్కర్లు కొడుతూ.. ప్రతీ ఒక్కదానిని కవర్ చేసే యాంగిల్స్ భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే సినిమాలు, డాక్యుమెంటరీలు మొదలుకొని చివరికి పెళ్లిలో కూడా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి భగభగమండే అగ్నిపర్వతాన్ని డ్రోన్ కెమెరా ఆధారంగా వీడియో తీయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా తన పనిని ప్రారంభించాడు. అప్పుడే బద్దలైన అగ్నిపర్వతంలో ఎగజిమ్ముతున్న లావాను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.అయితే దురదృష్టవశాత్తూ ఆ డ్రోన్ అగ్నిపర్వతంలో పడి కరిగిపోయింది. అయితే అతను తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోయి హెల్మ్స్ అనే య్యూట్యూబర్.. ఐస్ల్యాండ్లోని జెల్డింగదాలిర్ లోయలో కొత్తగా కనుగొన్న అగ్నిపర్వతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా లావాతో నిండిపోవడంతో అగ్నిపర్వం బిలం వరకు వెళ్లడం కష్టమని భావించాడు. దీంతో అతడి డ్రోన్కు పనిచెప్పాడు. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న లావా కాలువ మీదుగా.. ఆ డ్రోన్ కదిలింది. చివరికి బిలం వద్దకు చేరుకుంది. ఇక్కడే అతను తప్పు చేశాడు. డ్రోన్ను ఇంకా ఎత్తులోకి తీసుకెళ్లకుండా లావాకు మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. దీంతో లావా నుంచి వచ్చే వేడికి డ్రోన్ కరిగిపోయింది. ఆ వెంటనే సిగ్నల్ కూడా పోయింది. అగ్నిపర్వతంలో పడిపోతున్న డ్రోన్.. చివరి క్షణంలో చిత్రీకరించిన వీడియోను చూసేందుకు మాత్రం నెటిజన్లు ఆసక్తి చూపారు. ఫలితంగా ఈ వీడియోకు సుమారు 4.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు.. -
Lockdown: డ్రోన్తో బందోబస్తు పర్యవేక్షణ
డ్రోన్ కెమెరాతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ అమలులో భాగంగా పోలీసులు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటుచేసి సైరన్ కలిగిన డ్రోన్తో గల్లీల్లో సైతం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మీ కోసం పోలీసులు ఉన్నారు అని భరోసా కల్పిసూ్తనే, లాక్డౌన్ నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
కరీంనగర్లో లాక్డౌన్కు పోలీసుల పటిష్ట చర్యలు
-
రౌండప్ చేశాయంటే కష్టమే!
-
గసగసాల సాగును కనిపెట్టేందుకు డ్రోన్లు
సాక్షి, అమరావతి/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో నిషేధిత ఓపిఎం పాపీ సీడ్స్ (గసగసాల) సాగును గుర్తించేందుకు ప్రత్యేక బలగాలు డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. మాదక ద్రవ్యాల్లో వినియోగించే నిషేధిత గసగసాల సాగును మదనపల్లి మండలం మాలేపాడులో గుర్తించిన నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), పోలీస్ శాఖకు చెందిన 100 మందికి పైగా సిబ్బంది మంగళవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పొలాలు, మామిడి తోటలు, సమీప అడవుల్లో డ్రోన్ కెమెరాల సాయంతో గసగసాల పంటల స్థావరాలను గుర్తించడానికి కూంబింగ్ నిర్వహించారు. నిషేధిత పంటను సాగు చేసిన నాగరాజు ఫోన్ కాల్స్ ఆధారంగా డ్రగ్స్ ముఠాను కనుగొనేందుకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం వేట ప్రారంభించింది. మహా నగరాలకు ప్రత్యేక బృందాలు ఈ పంటలను సాగు చేసిన రైతులతో పాటు వారికి విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యాపారులు, తెరవెనుక పాత్ర పోషిస్తున్న మాఫియా ముఠా పాత్రపై ఎస్ఈబీ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబైలోని డ్రగ్స్ మాఫియా వివరాలను ఇప్పటికే సేకరించారు. వారిని పట్టుకోవడానికి ఎస్ఈబీ డీఎస్పీ నేతృత్వంలో ఓ బృందం బెంగళూరు, మరో బృందం చెన్నై, ఇంకో బృందం ముంబై మహా నగరాలకు సోమవారం రాత్రే వెళ్లినట్టు సమాచారం. రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఈబీ సీఐ కేవీఎస్ ఫణీంద్ర, ఎస్ఐలు శ్రీధర్, దిలీప్కుమార్ మాలేపాడులో ఇంకా ఎవరైనా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారా అనే దిశగా అన్వేషణ ప్రారంభించారు. మదనపల్లె, చౌడేపల్లె మండలాల్లో 2014 జనవరిలో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులో పాత ముద్దాయిల కదలికలపైనా ఆరా తీస్తున్నారు. -
కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. మూడ్రోజుల క్రితం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ అదనపు డీజీపీ రవిగుప్తా నివాసాలపైన డ్రోన్ కెమెరా ఐదారుసార్లు తిరగడాన్ని సిబ్బంది గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి సతీమణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి, పక్కింట్లో ఉన్న ఓ యువకుడు ఈ డ్రోన్ను వినియోగించినట్లు తేల్చారు. కెమెరా ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. డ్రోన్ను ఇళ్లపై ఎందుకు తిప్పారు? ఏయే ఫొటోలు తీశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మావోయిస్టుల జాడ కోసం డ్రోన్ నిఘా!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం పోలీసు బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఆయుధాలు, బలగాల పరంగా చూస్తే ఇప్పటివరకు మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా నిలిచింది. అయితే సరిహద్దు దండకారణ్యంలో సంచరించడంలో మాత్రం మావోయిస్టులకే ఎక్కువగా పట్టు ఉంది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. తద్వారా మావోయిస్టుల కదలికలపై వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల బలగాలకు సైతం ఇస్తున్నారు. దీంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు పక్కాగా సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోనూ పలుచోట్ల సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ బేస్ క్యాంపుల నుంచి పోలీసులు దండకారణ్యంపై డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల మేరకు వీటిని వాడుతున్నారు. బలగాల వద్ద 250 గ్రాముల బరువు గల నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉండే మైక్రో డ్రోన్లు, 2 కిలోల నుంచి 25 కిలోల బరువు కలిగిన స్మాల్ డ్రోన్లు, 150 కిలోల లోపు ఉండే మీడియం డ్రోన్లు, 150 కిలోలకు పైగా బరువు కలిగిన లార్జ్ డ్రోన్లు ఉన్నాయి. వీటిలో నానో, మైక్రో డ్రోన్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇవి 250 మీటర్ల నుంచి 400 మీటర్ల ఎత్తుతోపాటు దూరం వెళ్లగలుగుతాయి. పక్షులు ఎగురుతున్నట్టుగానే శబ్ధం రాకుండా పనిచేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. ఇవి పూర్తిస్థాయి నియంత్రణతో ఉండడంతోపాటు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు బేస్క్యాంపుల నుంచి అనుసంధానం చేసి ఉన్నాయి. -
ముగ్గురు మావోల ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు ఎస్పీ సునీల్దత్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో గల గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మిలీషియన్ కమాండర్ సోడి జోగయ్య మృతదేహం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది. కిన్నెరసాని అడవుల్లో ఎదురుకాల్పులు పాల్వంచ రూరల్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే.. మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని ఉల్వనూరు శివారు పాములదున్న గుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరుపుతూ రెండు వర్గాలుగా విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులకు తారసపడింది ఏ దళానికి చెందిన సభ్యులు అనేది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఒక తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ సునీల్దత్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా మావోల కదలికలపై నిఘా మహాముత్తారం: మావోయిస్టుల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలు, అడవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోటగా ఈ ప్రాంతం ఉండేది. తర్వాత కాలంలో పోలీసులు నియంత్రించినా, ఇటీవల సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోలు వచ్చారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపిన నేపథ్యంలో.. మావోల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహాముత్తారం మండలంలోని సరిహద్దు ప్రాంతాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, సింగారంతోపాటు పలిమెల మండలం ముకునూర్, నీలంపల్లి, ఇచ్చంపల్లి అటవీ ప్రాంతాల్లోని నీటి స్థ్ధావరాలను కనుగొనేందుకు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు. -
మావోయిస్టుల కోసం పోలీసుల వేట
-
దేవుడి మాన్యాల ఆక్రమణలపై డ్రోన్లతో సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలోని దాదాపు 22 వేల ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,09,229.99 ఎకరాల భూమి ఉండగా 67,525.06 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. 3,613.62 ఎకరాలను లీజుకు తీసుకున్న కౌలుదారులు నిర్ణీత గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు. ► ఆక్రమణలకు గురైన భూముల్లో డ్రోన్లతో సర్వే నిర్వహించి ఆలయాలవారీగా రికార్డులను సిద్ధం చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం సన్నద్ధమైంది. ► రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రోన్ కార్పొరేషన్ – దేవదాయ శాఖ అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. డ్రోన్లతో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా తదుపరి దశలో చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
అశ్వ, జాగిల.. గరుడదళ సమేత!
సాక్షి, హైదరాబాద్: పక్షులను వేటాడటం చూశాం.. కానీ, ఇక పక్షులే వేటకు వెళ్లే అపూర్వ సందర్భాలను చూడబోతున్నాం. ఇక పోలీసులకు అండ, మావోల పాలిట గండంగా మారనున్నాయి. సంఘ విద్రోహశక్తుల కదలికలపట్ల పోలీసులు నిశితంగా దృష్టి పెట్టారని చెప్పడానికి డేగకన్ను వేశారని అనేవాళ్లం కదా! ఇప్పుడు అసాంఘికశక్తులపై డేగలు నిజంగానే కన్ను వేయనున్నాయి. ఒకప్పుడు అడవుల్లోని మావోయిస్టు దళాల ఆనుపానులు గుర్తించేందుకు పోలీసులు ఉపగ్రహాల చిత్రాలు, డ్రోన్లు వాడేవారు. నిత్యం దండకారణ్యంలో తిరుగాడే మావోలు కూడా ఇప్పుడు డ్రోన్లు వాడుతూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేసేలా మావోలు, ఇతర సంఘ విద్రోహకశక్తుల డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు పలు గద్దలు, డేగలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పుష్కరకాలంగా ఆచూకీ లేకుండాపోయిన మావోలు నెలరోజులుగా తిరిగి తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని కట్టడి చేసేందుకు గరుడదళాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి విధుల్లోకి! గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే తొలిసారి. దేశంలో మరే రాష్ట్ర పోలీసులు పక్షుల సేవలను వాడుకోవడం లేదు. భద్రత కోసం తెలంగాణ పోలీసులు వేసిన ఈ అడుగుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీసు శాఖలోని వివిధ విభాగాలకుతోడు అశ్వ, జాగిల దళాలు పోలీసుల విధినిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ రెండింటినీ పోలీసులు ప్రత్యేక దళాలుగా చూస్తారు. ఆయా సందర్భాల్లో బాంబులను కనిపెట్టడం, హంతకుల ఆనవాళ్లను పసిగట్టడం, పలు ఆధారాలు, నిందితులను పట్టివ్వడంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గరుడదళం చేరికతో పోలీసు శాఖ భద్రతాచర్యలు మరింత పటిష్టమవుతాయని సీనియర్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా..! వాస్తవానికి టెక్నాలజీ పెరిగే నాటికి డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలతో నిఘా సులభతరంగా మారింది. అదే సమయంలో ఇలాంటి సాంకేతికత శత్రువు వద్ద కూడా ఉండే అవకాశాలు పుష్కలం. ఇప్పటికే మావోయిస్టు యాక్షన్ దళాల వద్ద శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూంబింగ్ సమయాల్లో పోలీసులపై మావోలు నిఘా ఉంచుతుండటం గమనార్హం. అందుకే, పోలీసుల అనుమతి లేకుండా ఎగిరే ప్రతి డ్రోన్ను పట్టుకునేందుకు పోలీసులు గరుడదళాలను రంగంలోకి దింపనున్నారు. నిఘా కోసం గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక యూరోప్లో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అది ప్రముఖులకు సమస్యగా మారింది. నెదర్లాండ్ పోలీసులే స్ఫూర్తి... లండన్లోని బకింగ్çహామ్ ప్యాలెస్ చుట్టూ పలుమార్లు డ్రోన్లు ఎగిరాయి. ఇవి భద్రతాపరంగా పలువురికి తలనొప్పిగా మారాయి. ఇలాంటి సమస్యలు పెరగడంతో నెదర్లాండ్స్ పోలీసులు తొలిసారిగా డ్రోన్లను పట్టుకోవడంలో డేగ, గద్దలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఈ స్ఫూర్తితోనే మావోల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో జరిగే పలు ఉత్సవాలు, మేడారంలో జరిగే జాతరలు, భారీ రాజకీయ సభల సమయంలో ఈ గరుడదళం ఇకపై తన ప్రత్యేకత చాటుకోనుంది. -
గ్యాంగ్ వార్ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు
-
కేజీఎఫ్ @ డ్రోన్
కేజీఎఫ్: ఒకనాటి బంగారు సీమ కేజీఎఫ్లో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయడానికి పోలీసులు డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రజలు ఏ మూలన సంచరిస్తున్నా పసిగట్టేలా డ్రోన్ను ఆకాశంలో తిప్పుతూ పర్యవేక్షిస్తున్నారు. బంగారుపేట తాలూకా, కేజీఎఫ్ తాలూకా మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు ఎస్పీ సుజీత మహమ్మద్ తెలిపారు. లాక్డౌన్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో పోకిరీలు గుమిగూడకుండా డ్రోన్తో పరిశీలించారు. -
కరోనా కట్టడికి డ్రోన్ అస్త్రం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు రాచకొండ పోలీసులు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్న బాలాపూర్, పహడీషరీఫ్, మౌలాలి ప్రాంతాల్లో ఈ ఆధునిక సాంకేతికత ద్వారా నిఘా ఉంచుతున్నారు. ఈ మేరకు సైయంట్ కంపెనీ సహకారంతో రెండు డ్రోన్ కెమెరాలను సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో జనాల రద్దీ ఎలా ఉంది? భౌతిక దూరం పాటిస్తున్నారా.. లేదా? కర్ఫ్యూ సమయంలో మెడికల్ దుకాణాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయా? మిగిలిన వ్యాపార సముదాయాలకు అనుమతి లేకున్నా తెరిచి ఉంటే డ్రోన్ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక ద్వారా ఇలా అన్ని విషయాలు తెలుసుకొని లాక్డౌన్ను సమర్థంగా అమలుచేయవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మార్గదర్శనం చేసి సరైన నిర్ణయాల ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పాటునందిస్తాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఆయా డ్రోన్ కెమెరాలు ఫొటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా రాచకొండ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తాయన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ ప్రకటనలు కూడా చేయవచ్చని తెలిపారు. పోలీసు వాహనాలకు శానిటైజేషన్ కరోనా పాజిటివ్ కేసులు ఉన్న వ్యక్తులను ఆస్పత్రులకు అంబులెన్స్ల ద్వారా వైద్య విభాగం అధికారులు తరలిస్తున్న సమయంలో.. వారికి రక్షణగా పోలీసులు కూడా వారి వాహనాల్లో వెళుతూ సేవలందిస్తున్నారు. ఆయా సమయాల్లో వాడుతున్న వాహనాలకు కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా వాటిని రసాయనాలతో స్ప్రే చేస్తున్నారు. ఈ మేరకు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నాలుగు వాహనాలను శుభ్రపరిచారు. ఇందుకు హర్ష మోటార్ సహకారాన్ని తీసుకున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
రేవంత్రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: ప్రముఖుడి నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న అభియోగాల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, రాజేంద్రనగర్ కోర్టు నిర్ణయించిన మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని షరతులు విధించింది. దర్యాప్తునకు అధికారులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి బెయిల్ ఉత్తర్వులు జారీ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య.. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డికి బెయిల్ రావడంతో బుధవారం భారీ బందోబస్తు నడుమ పోలీసులు అతన్ని జైల్ నుంచి తరలించారు. రేవంత్కి బెయిల్ మంజూరైన విష యం తెలిసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు చర్లపల్లి జైల్ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్రెడ్డి తరçఫున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ను కలిసి వచ్చిన మాజీ ఎంపీ మల్లురవిని పోలీసులు చక్రిపురం చౌరస్తాలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో మల్లురవికి పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రేవంత్ ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్పై పోరాటం చేస్తానని రేవంత్రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ పోరాటం నా వ్యక్తిగతం కాదని, రెండు నెలల క్రితం కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర ఇన్చార్జి కుంతియా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. కుంతియా ఆదేశాల మేరకు జన్వాడలోని కేటీఆర్ ఫామ్హౌజ్ను ప్రజలకు చూపించానన్నారు. -
మందులు ఎగురుకుంటూ వస్తాయ్!
మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మందులు, డయాగ్నస్టిక్ శాంపిల్స్ సేవలను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మారుట్ డ్రోన్స్, అపోలో ఆస్పత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2020 కార్యక్రమంలో మెడికల్ డ్రోన్ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్స్ ఫౌండర్ అండ్ సీఈఓ వీ ప్రేమ్ కుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్ డ్రోన్ ఎలా పని చేస్తుందో ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో డ్రోన్లు ఎక్కడ ఉంటాయంటే? ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బ్లడ్ బ్యాంకుల్లో మారుట్ డ్రోన్స్ ఉంటాయి. ఆర్డర్ రాగానే ఇక్కడి డ్రోన్స్లో సంబంధిత సిబ్బంది మందులను అమర్చితే డ్రోన్లు టేకాఫ్ అవుతాయి. 8 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరం డ్రోన్లు ప్రయాణిస్తాయి. ఎవరికి సేవలందిస్తారంటే? గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు, రోడ్లు, రవాణా సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తారు. వర్షా కాలంలో, రాత్రి సమయాల్లో ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్లటం కష్టం కాబట్టి ఇక్కడి ప్రజలకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణిలు, పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర రోగులకు మందులను సరఫరా చేస్తారు. ఈ డ్రోన్ల ద్వారా రక్తం, వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్ శాంపిల్స్, దీర్ఘకాలిక ఔషధాలను సరఫరా చేస్తారు. మెడికల్ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపోలో ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది. డ్రోన్ ఎలా పని చేస్తుందంటే? ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానిత డ్రోన్స్. దీన్ని మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ చేస్తారు. ఓలా, ఉబర్లు ఎలాగైతే గమ్య స్థానాన్ని మ్యాప్లో చూపిస్తాయో అలాగే ఈ డ్రోన్స్ మ్యాప్స్ ఆధారంగా గమ్య స్థానానికి చేరుకుంటుంది. అంతేకాదు మందులను బుక్ చేయగానే వచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తేనే మందు లు డెలివరీ అవుతాయి. దీంతో సరైన మనిషికే మందులు అందుతాయన్న మాట. డ్రోన్ ఎంత దూరంలో ఉంది? ఎంత సమయం పడుతుంది? వంటి సమాచారం లైవ్లో కనిపిస్తుంటుంది. దీంతో రోగికి ఒత్తిడి తగ్గుతుంది. ‘మెడికల్ డ్రోన్స్ సాంకేతికత మీద ఏడాది కాలంగా పని చేస్తున్నాం. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు’ప్రేమ్ కుమార్ తెలిపారు. డ్రోన్కు అమర్చేందుకు మెడికల్ కిట్ సిద్ధం చేస్తున్న దృశ్యం డ్రోన్లతో దోమల నిర్మూలన! గతంలో మారుట్ డ్రోన్స్ జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో మియాపూర్, రాయదుర్గంలోని చెరువుల్లో దోమ మందులను పిచికారి చేసింది. సిరిసిల్ల జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్లను నాటింది. మస్కిటో డ్రోన్స్లోని ఏఐ సాంకేతికత పిచికారితో పాటు దోమల సంఖ్య, లార్వా లెక్కింపు, దోమల జాతి, లింగ బేధాలు వంటి రియల్ టైం నివేదికలను కూడా అందిస్తుంది. గంటకు 6 ఎకరాలకు పిచికారి చేస్తుంది. ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతంలో 52 కిలోమీటర్లు, తెలంగాణలోని 70 చెరువుల్లో యాంటి లార్వా అరాడికేషన్ను ప్రాజెక్టులను చేపట్టామని ప్రేమ్కుమార్ తెలిపారు. డ్రోన్ ద్వారా వచ్చిన మెడికల్ కిట్ తీసుకుంటున్న దృశ్యం -
మావోయిస్టుల చేతిలో డ్రోన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి ఏడు యాక్షన్ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని చెన్నూరు నుంచి పాత ఖమ్మం జిల్లాలోని చర్ల వరకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో లేదో ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండటంతో ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ దళాలు ‘ఆపరేషన్ ప్రహార్’పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడంతోపాటు తెలంగాణలో కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టులు సరిహద్దు దాటి వస్తున్నారు. మార్చి ఆఖరివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నాయి. అంతా అలర్ట్..! కొత్తగూడెం పరిధిలోని నీలాద్రిపేట వద్ద మావోయిస్టులు పోలీసులు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఏడుగురు మావోలు తప్పించుకుని పారిపోయారు. ఈ సందర్భంగా వంటసామగ్రి, విప్లవ సాహిత్యం, ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. భద్రాచలం జిల్లాలో ఎస్పీ సునీల్దత్ ఆధ్వర్యంలో పోలీసులు హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అటు ఆపరేషన్ ప్రహార్, ఇటు తెలంగాణ పోలీసుల కూంబింగ్తో రెండు వైపులా మావోయిస్టులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నూరు, ఏటూరునాగారం, కాటారం, ముత్తారం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో తనిఖీలు పెంచారు. ఆదివాసీలు, గూడెలలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయడంతో మరింత కలకలానికి దారి తీసింది. మరోవైపు పోలీసులు ఎప్పుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియక.. ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు ‘సూడో’ వసూళ్లు.. పోలీసులు గాలింపులు తీవ్రతరం చేయడం, మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలోని స్థానిక వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అదనుగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొత్తగూడెం, భద్రా ద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ నక్సలైట్ల గోల మొదలైంది. స్థానిక వ్యాపారులు, అధికార పార్టీ నాయకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు లేఖలు పంపుతున్నారు. పోస్టర్లు విడుదల దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వీరికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వీరి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా ప్రకటించారు. వాస్తవానికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యం బాగానే ఉంది. కానిస్టేబుల్ కిడ్నాప్, హత్య తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తాజాగా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ని అపహరించి హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అరగట్ట సమీపంలోని అడవుల్లో ఓ కానిస్టేబుల్ను మావోయిస్టులు హతమార్చారు. సుకుమా జిల్లా ఎస్పీ శలాబ్ సిన్హా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను సుకుమా జిల్లాలోని అరగట్ట వద్ద సొంత గ్రామంలోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మావోలు చంపారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకాధికారి పర్యటన ఇటు పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను శుక్రవారం ఐజీ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు. స్థానిక పోలీసులతో కలసి వచ్చిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు మావోల కోసం కూంబింగ్ జరుగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారి గ్రామాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
కానిస్టేబుల్పై దాడి; కఠిన చర్యలు తప్పవు
-
కానిస్టేబుల్పై దాడి; కఠిన చర్యలు తప్పవు
సాక్షి, గుంటూరు: ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో సాధారణంగా డ్రోన్లతో విజువల్స్ తీస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. రెండు రోజుల క్రితం మందడంలో కూడా అలానే విజువల్స్ తీయించామని పేర్కొన్నారు. కానీ, డ్రోన్ ఆపరేట్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నారు: డీఎస్పీ) డ్రోన్ ఆపరేటర్ పై దాడి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటన, తుళ్లూరు డీఎస్పీపై దురుసుగా వ్యవహరించిన ఘటనల్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు చాలా సహనం పాటిస్తున్నారని ఎస్పీ విజయారావు చెప్పారు. కొంతమంది అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వారిని గుర్తించామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మీడియా కూడా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు. -
పోలీసుల చేతిలో డ్రోన్ కెమెరా
సాక్షి, మహబూబాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న పోలీసుల చేతికి డ్రోన్ కెమెరాలు అందాయి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాకు మంజూరైన డ్రోన్ కెమెరాను ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమమానం చేసే వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఈ కెమెరాను ఉపయోగిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. -
డ్రోన్ కెమెరాలపై నిషేధం
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలో డ్రోన్ కెమెరాలు నిషేధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా మన దేశంలోని పంజాబ్ ప్రాంతంలో ఆయుధాలను జార విడిచినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావొద్దని సీపీ సూచించారు. భద్రతా చర్యల రీత్యా పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల వాడకం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా డ్రోన్ కెమెరాలు వాడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఓ ప్రకటనలో హెచ్చరించారు. డ్రోన్లు వాడుతున్నట్లు సమాచారముంటే 100, పీసీఆర్ కంట్రోల్ రూం (08462– 226090) స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం (94906 18000) కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. లేదా ఫోన్ నెం. 94906 18029, 94913 98540లకు వాట్సాప్ ద్వారా సమాచారమివ్వాలని సీపీ కార్తికేయ కోరారు. -
‘డ్రోన్ తిరిగింది బాబు కోసం కాదు..’
సాక్షి, అమరావతి: డ్రోన్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఆదేశాలతోనే వరద ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించారని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో టీడీపీ నేతల తీరును జనచైతన్య వేదిక అధ్యక్షుడు తప్పుపట్టారు. వరద ప్రవాహం ఉన్న అన్ని ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీదనే డ్రోన్ వినియోగించారనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో తక్కువ నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం సమీక్షలు జరుపుతూ తగు ఆదేశాలను ఇస్తూ వరద బాధితులను ఆదుకోవడం హర్షనీయమని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం ‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’ -
‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’
సాక్షి, విజయవాడ: వరద ఉధృతిని అంచనా వేయడం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపైన ఎగరేసిన డ్రోన్ వివాదంపై డీజీపీ స్పందించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనినేషన్ గ్యాప్ వచ్చిందని వివరణ ఇచ్చారు.ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.దీనిని రాజకీయం చేయొద్దని..ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ వివాదం నెలకొందన్నారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. -
టీడీపీ నాయకులపై కేసు నమోదు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): కృష్ణా కరకట్ట వెంబడి ఉండవల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకులపై తాడేపల్లి పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అదే రోజు అక్కడికి చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. అయితే వరద నీరు రాకున్నా ఎమ్మెల్యే ఆర్కే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు దిగారు. డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసాన్ని వీడియో చిత్రీకరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. వరద ఉధృతిని పరిశీలించడానికి అన్ని ప్రాంతాల్లో తామే డ్రోన్ వాడుతున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారులు పంపిన యువకులపై దాడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు దేవినేని ఉమ, దేవినేని అవినాష్, జనార్దన్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్కుమార్ రెచ్చిపోయి తమ అనుచరులతో పోలీసుల వాహనాలపై దాడి చేయడం, పోలీసులను కొట్టడం చేశారు. దీంతో పోలీసులు ఆ రోజు ధర్నాలో పాల్గొన్న తాడేపల్లి నాయకులతోపాటు, విజయవాడ నుంచి వచ్చిన కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం) -
టీడీపీ వరద రాజకీయం
సాక్షి, అమరావతి: ‘డ్రోన్ల ద్వారా నాపై దాడికి కుట్ర పన్నారు. వరదల్ని కావాలని రప్పించి నా ఇంటిని ముంచేలా ప్లాన్ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచుతున్నారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేసేందుకు ఇద్దరు వచ్చారు’.. కృష్ణా నది వరదల సాక్షిగా టీడీపీ బురద రాజకీయానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఉండవల్లి కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంచేందుకు ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న హంగామా చూసి అధికారులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తనను అంతమొందించేందుకు డ్రోన్లు ప్రయోగించారని చంద్రబాబు నెత్తీ నోరూ కొట్టుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ శుక్రవారం డ్రోన్ కెమెరాతో బ్యారేజీ ఎగువన వరద పరిస్థితిని చిత్రీకరించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి వద్ద చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకులు డ్రోన్ల ద్వారా చంద్రబాబు ఇంటిపై బాం బులేయడానికి వచ్చారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నీటి పారుదల శాఖ ఖండించింది. డ్రోన్ల ద్వారా చిత్రీక రణకు తామే ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని పంపా మని చెప్పడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. బాబు ఇంటిని ముంచే ందుకు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా బ్యారేజీలో వరదను సృష్టిం చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరదను ఆపారట! ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలను అడ్డుగా పెట్టి ఉండవల్లిలోని నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆరోపణలకు దిగడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసం ముంపునకు గురైన విషయాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, ఆయన పరివారం ఈ రాద్ధాంతం సృష్టించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్/గుంటూరు: గుంటూరు జిల్లా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్హౌస్ వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేతలు హల్చల్ చేశారు. నదిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, మీడియాను పిలిపించి నానా యాగీ చేశారు. వరద ముంపు ప్రాంతాలను, నీటి ఉధృతిని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇందులో వైఎస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు రెండు గంటల పాటు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ముఖ్యమంత్రిని దూషిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, అందుకే ఆయన నివాసాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, టీడీపీ నేతలు దేవినేని అవినాష్, అశోక్బాబు, బచ్చుల అర్జునుడు ఆరోపించారు. డ్రోన్ కెమెరా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్కు తరలిస్తుండగా వారి జీపును, మరో బస్సు అద్దాలను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని, ఇద్దరు ఆపరేటర్లను పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి ధర్నాకు దిగి, పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని దూరంగా తరిమేశారు. మంత్రులను అడ్డుకున్న బాబు ఇంటి భద్రతా సిబ్బంది ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరుగుతుండడంతో కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న పంటలు, నిర్మాణాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి సంబంధించిన తులసివనం అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద వరద తాకిడి ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది మంత్రులను లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయం చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కరకట్ట పక్కన ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి ఇరువైపులా ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్, చందనా బ్రదర్స్ గెస్ట్హౌస్, తులసి నివాసాలు నీట మునిగిన దృశ్యం లింగమనేని గెస్ట్హౌస్ను చుట్టుముట్టిన వరద ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అరటి, మునగ, కంద, దొండ తదితర పొలాల్లో నీరు నిలిచింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అతిథి గృహం, ఎన్ఆర్ఐ ఆస్పత్రికి చెందిన తులసి వనం గెస్ట్హౌస్లోకి వరద పారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్హౌస్ వద్ద ఉన్న రివర్ వ్యూ ఇప్పటికే మునిగిపోయింది. అక్కడ ఉన్న వరండా పైనుంచి వరద పారుతోంది. లింగమనేని గెస్ట్హౌస్కు ముందు వైపు, వెనక వైపు వరద చుట్టుముట్టింది. చంద్రబాబు ఇంటికి ముందు వంద మీటర్ల దూరంలో, వెనక వైపు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పంటపొలాల్లోకి అడుగు మేర వరద వచ్చింది. చంద్రబాబు ఇంటిని రక్షించేందుకు అక్కడి సిబ్బంది మట్టి, ఇసుక, కంకరను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే తాడేపల్లి రెవెన్యూ అధికారులు కరకట్ట వెంబడి ఉన్న 26 అతిథి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయకుండా మొండికేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించొద్దు: ఐజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద కొనసాగుతోందని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ శుక్రవారం చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలకు వరద ముప్పు పొంచి ఉందన్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వ శాఖల సిబ్బందికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే సంబంధిత జిల్లా పోలీస్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరద తెప్పించారు నా ఇంటిని ముంచేయడానికే ఇలా చేశారు: చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లను అడ్డుగా పెట్టి, తన ఇల్లు మునిగిపోయేలా చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్లో ఉన్న ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మకాం వేసిన టీడీపీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. బ్యారేజీలో నీళ్లు వెనక్కి తన్నడం కోసమే గేట్లకు బోట్లు అడ్డం పెట్టారని అన్నారు. సక్రమంగా వరద నిర్వహణ చేపడితే నీళ్లు వెనక్కి వచ్చేవి కావని, వరద ప్రవాహం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వరద నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను నిర్వహించే విధానం ప్రభుత్వానికి తెలియలేదన్నారు. బ్యారేజీ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని ముందే వదిలితే వరద ఉండేది కాదని చెప్పారు. తనపై ద్వేషంతో వరదలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అక్కసుతో ప్రజలను వరదల్లో ముంచుతున్నారని, బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచి అకస్మాత్తుగా దిగువకు వదిలారని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసాన్ని టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న తన ఇంటిపై డ్రోన్లు ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రినైన తన నివాసంపై డ్రోన్లు తిప్పడం ఏమిటని నిలదీశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు నడిపేముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. -
క్షణం ఆలస్యమైతే దానికి చిక్కేవారే..!
ఫ్లోరిడా : అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్కి కుటుంబంతో కలిసివెళ్లిన డానియెల్ వాట్సన్ ఒడ్డున కూర్చుని తన డ్రోన్ కెమెరాతో నీటిలో కేరింతలు కొడుతున్న తన పిల్లలు, భార్య ఫోటోలు షూట్ చేస్తున్నాడు. ఆ సమయంలో వారి వైపునకు ఏదో నల్లని ఆకారం కదులుతూ వస్తోంది. కెమెరా ఇంకొంచెం క్లారిటీ చేయడంలో అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. మనుషుల్ని మింగే షార్క్ తన కుటుంబం వైపునకు దూసుకొస్తోంది. వెంటనే తన భార్యను అప్రమత్తం చేశాడు. నీటిలో నుంచి బయటికి రావాలని కేకలు వేశాడు. భర్త అరుపుల్ని విన్న ఆ మహిళ కాసింత లోపలికి వెళ్లి ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకొని క్షణాల్లో ఒడ్డుకు చేరింది. డానియెల్ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం వారికి నీటిలో దాగున్న షార్క్ ఫొటోలను చూపించాడు. సరిగ్గా షార్క్ వారం క్రితం అదే బీచ్లో ఓ 18 ఏళ్ల యువకున్ని అదే షార్క్ పొట్టనబెట్టుకోవడం గమనార్హం. షార్క్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. View this post on Instagram See that dark shadow making its way straight for the shore & those people? That was my view this weekend while flying my Mavic 2 Pro… and oh, 3 of those people are my kids! Swipe to see the next image that resulted from my yelling to get out of the water and the unmistakable outline of a shark. Definitely too close of an encounter for my liking! Link in my profile to check out more info & footage from the drone!!! Thinking my @djiglobal drone is now coming with me to every beach day!!! #dji #mavic2pro #polarpro @polarpro A post shared by Dan Watson (@learningcameras) on Jun 24, 2019 at 12:16pm PDT -
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
కశ్మీర్ : జమ్ముకశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం 5.30 గంటలకు అనంతనాగ్ జిల్ల అభివృద్ధి అధికారి ఖలీద్ జహింగీర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్ బేస్ క్యాంప్కు బయలుదేరిన యాత్రికుల బృందం ఈరోజు యాత్రను ప్రారంభించారు. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి దేశ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాలు, డ్రోన్లతో దారి పొడవునా పహారా కాయనున్నట్లు అధికారులు తెలిపారు. అలానే అమర్నాథ్ బోర్డు ఈ ఏడాది నూతనంగా ‘యాత్రి నిర్వహణ వ్యవస్థ’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి యాత్రికుడి మార్గాన్ని లోకేట్ చేసేందుకు అవకాశం కల్గుతుందని అధికారులు తెలిపారు. -
వైఎస్ జగన్ రాకతో జనసంద్రమైన భీమవరం
-
జనసంద్రంగా వైఎస్ జగన్ మడకశిర సభ
-
వైఎస్ జగన్ సభ: జనసంద్రమైన నందిగామ కృష్ణ జిల్లా
-
కావలి: ఎగసిన జనకెరటం
-
మొన్న సెల్ఫోన్లు.. నేడు డ్రోన్ కెమెరాలు
విజయనగరం మున్సిపాలిటీ: చెత్తపై పర్యవేక్షణ ఆధునిక పుంతలు తొక్కనుంది. కొన్నేళ్ల వరకు కేవలం ప్రజారోగ్య సిబ్బంది నేరుగా ఈ పనులను పర్యవేక్షించగా, రెండేళ్ల క్రితం నుంచి అండ్రాయిడ్ ఫోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నారు. తాజాగా ఈ విధానంలో మరింత సాంకేతికను జోడించే దిశగా అడుగులు పడుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై నిశితంగా పరిశీలించనున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండేళ్ల క్రితం బ్లాక్స్పాట్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా మున్సిపాలిటీలకు సెల్ఫోన్లను సమకూర్చింది. ఈ సెల్ఫోన్ల ద్వారా పారిశుద్ధ్య పరిస్థితిని అమరావతిలో ఏర్పాటు చేసిన స్క్రీన్వాల్స్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు ప్రస్తుతం డ్రోన్లు కూడా వినియోగంలోకి రానున్నాయి. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.. డ్రోన్ కెమెరాల వినియోగంపై ప్రతీ మున్సిపాలిటీ నుంచి ఇద్దరు వ్యక్తుల చొప్పున ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. గతంలో వారం రోజుల పాటు గుంటూరులో శిక్షణ ఇవ్వగా, గత నెలలో 15 రోజుల పాటు అమరావతిలో శిక్షణ ఇచ్చారు. త్వరలో పురపాలక సంఘాలకు డ్రోన్లు, ప్లెయిన్లను అందజేయనున్నారు. మున్సిపాలిటీలకు అందజేసే డ్రోన్లు జీపీఎస్ విధానంతో పనిచేస్తాయి. వీటి ద్వారా తీసే వీడియోలు నేరుగా మున్సిపల్ కార్యాలయం సిబ్బందే కాకుండా అమరావతిలో ఏర్పాటు చేసిన స్క్రీన్వాల్స్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో పరిస్థితి ఎలా ఉంది. రహదారులు, కాలువల్లో చెత్త వేస్తున్నారా..? చెత్తకుప్పలు ఎక్కడ ఉన్నాయి అనేవి చూస్తారు. అలాగే పట్టణంలో భవన నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అనుమతి తీసుకుని నిర్మిస్తున్నారా..? లేదా తదితర విషయాలను పరిశీలించనున్నారు. వీటితో మ్యాపింగ్ ప్రక్రియను కూడా నిర్వహించనున్నారు. డ్రోన్ ద్వారా తీసిన వీడియోలను పరిశీలించి అక్కడ నుంచి అధికారులు పారిశుద్ధ్య ంపై సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. ఈ విధంగా పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ఉపకరిస్తుంది. బ్లాక్స్పాట్ల నిర్మూలనలో ఫలితం.. మున్సిపాలిటీల్లో తరుచూ రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి కనిపిస్తే ఆ ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తిస్తారు. ఇలా గుర్తించిన స్థలాలను చరవాణీలో ప్రతీ రోజు ఫొటోలు తీసి సిబ్బంది పంపించాల్సి ఉంటుంది. జీపీఎస్ విధానంతో ఫొటోలు అమరావతికి చేరుతాయి. బ్లాక్స్పాట్గా గుర్తించిన స్థలంలో 30 రోజులు పరిశీలించి చెత్త లేని ప్రాంతాన్ని గ్రీ¯న్ స్పాట్గా గుర్తిస్తారు. జిల్లాలో ప్రతీ మున్సిపాలిటీలో బ్లాక్స్పాట్లు గుర్తించారు. విజయనగరం మున్సిపాలిటీలో గతంలో 212 వరకు ఉండగా, ప్రస్తుతం 167 వరకు బ్లాక్స్పాట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలుచోట్ల పారిశుద్ధ్య పనులు చేస్తుంటే ఏ విధంగా జరుగుతున్నాయో అమరావతిలో ఉన్న అధికారులు స్పాంటేనియా యాప్ ద్వారా వీడియోను నేరుగా చూసేలా ఏర్పాట్లు చేశారు. జీఓ 279 అమలులోకి వచ్చాక ఇంటింటీకి చెత్త సేకరణపైన సాంకేతికతను వినియోగిస్తుంది. చెత్త సేకరించిన ప్రతీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన లేబుల్ను స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే ఆ రోజు వారు చెత్త ఇచ్చినట్లు లెక్క. పారిశుద్ధ్యంలో సాంకేతికతను తీసుకురావడం ద్వారా స్వచ్ఛత సాధనకు చర్యలు చేపడుతున్నారు. ఏ మేరకు ఫలితాలు సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే. బ్లాక్ స్పాట్ల నిర్మూలనకు బాగుంటుంది.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై స్థానిక అధికారుల పర్యవేక్షణ మాత్రమే ఉండేది. స్వచ్ఛభారత్ అమలుతో మార్పులు వచ్చాయి. ప్రతీ మున్సిపాలిటీలో రాష్ట్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించే పరిస్థితి వచ్చింది. బ్లాక్స్పాట్స్ నిర్మూలన కార్యక్రమం కొనసాగుతుంది. గతంలో 212 వరకు డ్రోన్లు ఉండగా, ఇటీవల వాటి సంఖ్య 167కు తగ్గింది. చాలా వరకు బ్లాక్స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్పు చేశాం. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు. – వెంకట్, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్. -
డ్రోన్ ద్వారా అవయవాలు!
న్యూఢిల్లీ: ఓ నగరంలోని ఆసుపత్రిలో దాత నుంచి సేకరించిన అవయవాలను నిమిషాల వ్యవధిలో మరో ఆసుపత్రిలోని రోగికి అమర్చవచ్చు. ఒకచోటి నుంచి మరోచోటికి అత్యవసర పరిస్థితుల్లో మందుల్ని అప్పటికప్పుడు చేరవేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త డ్రోన్ ద్వారా ఈ రెండు ఘటనలు వాస్తవరూపం దాల్చనున్నాయి. ఈ విషయమై పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ..‘ఆసుపత్రుల మధ్య డ్రోన్ల రాకపోకల కొత్త డ్రోన్ విధానానికి సంబంధించి డిసెంబర్ 1(నేటి) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించిన నెలరోజుల తర్వాత డ్రోన్ల వినియోగానికి లైసెన్సులు జారీచేస్తాం. దేశవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో డ్రోన్ల ప్రయాణ దూరాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలను 2019, జనవరి 15న భారత్లోని ముంబైలో జరిగే ప్రపంచ విమానయాన సదస్సులో విడుదల చేస్తాం. అంతేకాకుండా కొత్త డ్రోన్ విధానంలో భాగంగాసరుకుల రవాణాకు ఒకే ఆపరేటర్ బహుళ డ్రోన్లను వినియోగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత్ తొలి డ్రోన్ విధానాన్ని, నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందిస్తూ..‘సహాయక చర్యలు, ఏరియల్ సర్వే, పంటల అంచనా, సరుకుల చేరవేత తదితర రంగాల్లో డ్రోన్ల సేవలను గణనీయంగా వాడుకోవచ్చు. వీటి వినియోగానికి డిజిటల్ ‘కీ’ని జారీచేస్తాం. ఓటీపీ ద్వారా రిజస్టర్ అయ్యాక మాత్రమే డ్రోన్లు టేకాఫ్ కాగలవు’ అని ఆయన వెల్లడించారు. -
పాతబస్తీలో డ్రోన్ కెమెరా కలకలం
-
పాతబస్తీలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్నా మలక్ పేట నియోజకవర్గం ఎంఐఎం పార్టీ ర్యాలీలో డ్రోన్ కెమెరాలు హాలచల్ చేశాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనతో పాటు, నిషేధిత డ్రోన్ కెమెరాలు ఉపయోగించడంతో చాదర్ ఘాట్ ఎస్ఐ, బీజేపీ నాయకులు నిర్వాహకులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
మావోయిస్టులపై ‘డ్రోన్’ వెపన్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల కదలికల నియం త్రణకు కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం నూతన డ్రోన్ పాలసీని ప్రక టించింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీ ద్వారా మావోయిస్టుల నియం త్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తోంది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సెక్యూరిటీ ఎక్స్పో లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కలవరం సృష్టిస్తు న్నాయి. కొత్త డ్రోన్ పాలసీ ద్వారా దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతోపాటు మావోయిస్టులు, తీవ్రవాద సమస్యను తుడిచివేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ఉంటుందని, దేశ అంతర్గత భద్రతాబలగాలకు డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. రంగంలోకి ఐదు రకాల డ్రోన్లు... డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకా ల ప్రకారం ఐదు రకాల డ్రోన్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఇందులో నానో డ్రోన్ 250 గ్రాముల బరువు మాత్రమే ఉంది. మైక్రోడ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు వరకు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 150 కిలోల బరువు, లార్జ్డ్రోన్ 150 కిలోలకు పైబడి బరువుం టుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవులకే పరిమితమైన మావోయిస్టుల కార్యకలాపాలను మరింత నియంత్రించి, మావోయి స్టు కదలికలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించాలని సీఆర్పీఎఫ్కు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసిం ది. గతంలో రోబోల ద్వారా మావోయిస్టులను ఎదు ర్కొనేందుకు కొంత ప్రయత్నించినా ఆశించిన çఫలితా లు రాలేదు. దీనితో ఈసారి గగనతలం నుంచి మావోయిస్టు కార్యకలాపాలను గుర్తించి, ఎన్కౌంట ర్ వ్యవహారాలను డ్రోన్ ద్వారా బలగాల ఆపరేటిం గ్కు ఉపయోగించుకునేందుకు ఈ వ్యవస్థను అంది పుచ్చుకోవాలని హోంశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్... కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రతీ సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి 4 డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆయా బేస్ క్యాంపుల నుంచి ఢిల్లీ వరకు అనుసంధానం చేసేందుకు సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరేశక్తి ఉంటుంది. వీటి ద్వారా డే టైమ్లో హెడ్టీ క్వాలిటీ వీడియో, ఫొటోలు చిత్రీకరించడం సులభమని నిఘావర్గాలు భావిస్తున్నాయి. వీటికన్నా బరువున్న వాటిని ఉపయోగించడం వల్ల శత్రువు అప్రమత్తమవుతాడని, ఇవి చేసే శబ్దం వల్ల టార్గెట్ మిస్ఫైర్ అయ్యే ప్రమాదముంటుందని నిఘా అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి తప్పనిసరి డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికల ను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా ఆయా ప్రభావిత రాష్ట్రాల ప్రత్యేక విభాగా లకు సమాచారమివ్వాలని కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్తోపాటు కోబ్రా తదితర విభాగా లకు సూచించింది. రాష్ట్రాల్లో ఉన్న మావోయి స్టుల కార్యకలాపాలు స్థానిక పరిస్థితులను çప్రభావితం చేస్తాయని, ఇందులో భాగంగా అక్కడి రాష్ట్రాల స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరోల పని కూడా కీలకమని సూచించింది. -
మంత్రి జగదీశ్రెడ్డిపై రెక్కీ?
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా డ్రోన్ కెమెరాలతో గ్రామం మొత్తాన్ని చిత్రీకరించారని, ఇందులో మంత్రి ఇంటి పరిసరాలను కూడా తీశారని సమాచారం. ఈనెల 2న పోలీసు బలగాలు ప్రగతి నివేదన సభకు వెళ్లడంతో నిఘా లేదని భావించిన సదరు వ్యక్తులు దూర ప్రాంతంనుంచి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి ఇటీవల తన స్వగ్రామంలో పాత ఇంటి పక్కనే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. నెల రోజుల క్రితం కూడా ఆయన నాగారం వెళ్లారు. స్వగ్రామం కావడంతో ఆయన వచ్చినప్పుడల్లా గ్రామంలో తనతో సన్నిహితంగా ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లి పలకరిస్తారు. మంత్రి ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ పోలీసు బందోబస్తు ఉంటుంది. గ్రామమంతా చిత్రీకరణ.. ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు అలాగే తుంగతుర్తి రోడ్డు, హెల్త్ సెంటర్ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులు, గ్రామం నుంచి బయటకు వెళ్లే డొంక రోడ్లను చిత్రీకరించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంత్రిపై దాడి చేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా తప్పించుకునేందుకు డ్రోన్తో నాగారం పరిసరాలను చిత్రీకరించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా విభాగాలు కూడా వారం రోజులుగా ఈ విషయమై గ్రామస్తులు ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మా దృష్టికి వచ్చింది: వెంకటేశ్వర్లు, ఎస్పీ ‘నాగారంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విషయం మా దృష్టికి కూడా వచ్చింది. రోడ్లు, ఇళ్లు, మంత్రి ఇంటిని కూడా చిత్రీకరించారని తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. రెండు, మూడు రోజుల్లో దీన్ని ఎవరు తీశారో తేలుస్తాం’. -
డిసెంబర్ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్లో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించేలా వీటిని రూపొందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం డ్రోన్ల వాడకానికి సంబంధించిన నిబంధనలను ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రస్తుతానికి వ్యవసాయ, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మనుషుల రవాణాతో పాటు మందులు, ఆహారం, ఇతర వస్తువులను డెలివరీ చేయడాన్ని ఇందులో చేర్చలేదని పేర్కొన్నారు. పగటిపూటే వినియోగం: తాజా మార్గదర్శకాల ప్రకారం పౌర అవసరాల కోసం వాడే డ్రోన్లను కేవలం పగటిపూట మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ డ్రోన్లు 450 మీటర్లు ఎత్తుకు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. వీటిని వివాహ వేడుకల చిత్రీకరణలో వాడుకోవచ్చు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు విమానాశ్రయాలు, తీరప్రాంతాలు, రాష్ట్ర సచివాలయాలు, సైనిక కేంద్రాలు, ఢిల్లీలోని విజయ్చౌక్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థ వాడుతున్న నానో డ్రోన్లు మినహా అన్ని నానో డ్రోన్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. వీటికి ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. డ్రోన్ల వినియోగం కోసం తప్పు డు పత్రాలు సమర్పించినా, నిబంధనలు ఉల్లంఘించినా.. లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు. అనుమతి లేకుంటే టేకాఫ్ కాదు.. ‘డిజిటల్ స్కై’ ప్లాట్ఫామ్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్తో పాటు టేకాఫ్కు అధికారులు అనుమతులు జారీచేస్తారు. ఈ యాప్ స్థానిక పోలీస్స్టేషన్తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్లను వాడటానికి ముందు వీటిని వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా డ్రోన్లను టేకాఫ్ చేయాలంటే తొలుత మొబైల్ యాప్ ద్వారా అనుమతి కోరాలి. అప్పుడు ఎయిర్ట్రాఫిక్ను బట్టి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రజా భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా డ్రోన్ల టేకాఫ్ను నిరోధించేలా కొత్త విధానంలో నిబంధనలు చేర్చారు. దీనిప్రకారం డిజిటల్ అనుమతులు రాకుండా డ్రోన్ల ను టేకాఫ్ చేసేందుకు వీలుకాదు. కేవలం 50 అడుగుల ఎత్తుకు వెళ్లగల నానో డ్రోన్ల(250 గ్రాముల బరువు)కు పోలీసు అనుమతులు అవసరం లేదు. వ్యవసాయం, ఆరోగ్యం సహా 23 విభాగాల్లో డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అక్కడ ఎంత కరువుందో..వైరల్!
-
ఇదేమి ‘మందా’ ఓరి యలమందా!
సిడ్నీ : ఆస్ట్రేలియాలో మనుషులకేమోగానీ పశువులకు తీవ్రమైన నీటి కరువు వచ్చి పడింది. కాల్వలు, గుంటలు, బావులు ఎండి పోవడంతో అవి బావురుమంటున్నాయి. వాటిని బతికించడం కోసం రైతులు వాటర్ ట్యాంకులు తెప్పించి మరీ వాటి దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి వాటర్ ట్యాంకర్ నీటి కోసం కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు వాటిని తోలుకొని పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తన పశువుల దాహం తీర్చేందుకు తాను తరచుగా గంటసేపు వాటితో ప్రయాణించాల్సి వస్తోంది. 1300 పశువులు కలిగిన అంబర్ లియా అనే ఆవిడ మీడియాకు తెలియజేసింది. పశువుల దాహం తీర్చేందుకు తెప్పించిన ఓ వాటర్ ట్యాంకర్ వద్ద దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్న పశువుల మందను ద్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని వీక్షించిన వారికి అక్కడ ఎంత కరువు పరిస్థితులున్నాయో చెప్పకనే తెలుస్తుంది. -
చార్మినార్ సమీపంలో డ్రోన్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక చార్మినార్ సమీపంలో అర్దరాత్రి డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డ్రోన్ ఆపరేట్ చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు. వివరాలు.. గురువారం అర్ధరాత్రి సమయంలో చార్మినార్ పరిసర ప్రాంతంలో డ్రోన్ చక్కర్లు కొడుతున్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుపర్ణ నాథ్ అనే 26 ఏళ్ల యువతి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆమె నుంచి డ్రోన్ను స్వాధీనం చేసుకుని కెమెరా, రిమోట్ కంట్రోల్ను సీజ్ చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా ఉగ్రవాద దాడుల ప్రమాదం పొంచి ఉందన్న ఇంటిలెజిన్స్ ఏజెన్సీల హెచ్చరికల మేరకు గత ఏప్రిల్ నుంచి హైదరాబాద్ పోలీసులు అనుమతి లేకుండా డ్రోన్లు ప్రయోగించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఏరియల్ వెహికల్ ఆపరేషన్స్, ఏరియల్ సర్వే నిర్వహించాలనుకునే ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్ అథారిటీస్ ముందుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ సిటీ సీపీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటిఫికేషన్ జారీ చేశారు. -
చార్మినార్ వద్ద డ్రోన్ కెమరాతో యువతి హల్చల్
-
డ్రోన్ సర్వే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మైనింగ్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనుంది. ఖనిజ వనరుల సర్వేకు డ్రోన్ కెమెరాలను వినియోగించనుంది. ఇప్పటికే కేటాయించిన మైనింగ్ ప్రాంతాలను ఈ డ్రోన్ సర్వేలో బంధించాలని భావిస్తోంది. ఖనిజ నిక్షేపాలు, నిల్వల సమగ్ర వివరాలను రాబట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మట్టి, కంకర, ఇతరత్రా మినరల్స్ తవ్వకాలకు సంబంధించి వివిధ సంస్థలు, వ్యక్తులకు లీజు ప్రాతిపదికన మైనింగ్ శాఖ కట్టబెడుతోంది. అయితే, ఈ లీజుల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కేవలం లీజుల కేటాయింపేగాకుండా మైనింగ్ విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా లీజుకు కేటాయించిన విస్తీర్ణమేగాకుండా పక్కన ఉన్న భూములను కూడా తవ్వకాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. దీంతో ప్రభుత్వ రాయల్టీకి గండిపడడమేగాకుండా దొడ్డిదారిన సహజవనరులు తరలిపోతున్నట్లు బహిర్గతమైంది. 146 చోట్ల సర్వే.. జిల్లాలో ఖనిజాల తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 24 మండలాల్లో ఈ నిషేధం వర్తిస్తుండగా 146 చోట్ల మాత్రం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. లీజు ప్రాతిపదికన కంకర, మట్టి, పలుగురాళ్ల, క్వార్ట్జ్, కలర్ గ్రానైట్ సంబంధించి క్వారీలను కేటాయించింది. వీటి కేటాయింపు ద్వారా గతేడాది రూ.61.04 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.90.65(148%)వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.91 కోట్లను లక్ష్యంగా నిర్దేశించగా ఇందులో ఏప్రిల్లో రూ.4.58 కోట్లు, మేలో రూ.2.73 కోట్లను సమకూర్చుకుంది. ఖజానాకు ప్రధాన ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన మైనింగ్లో జరుగుతున్న అక్రమాలకు ముకుతాడు వేయడం వల్ల మరింత రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మైనింగ్ లీజులపై కన్నేసింది. ఈ క్వారీల్లో ఏ రకమైన ఖనిజాలున్నాయి? నిల్వల సామర్థ్యమెంత? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? తదితర వివరాలను డ్రోన్ సర్వేతో తేల్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే డీజీపీఎస్ సర్వే పూర్తిచేసినందున డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ పూర్తిచేసి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, తద్వారా అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. ఇదిలావుండగా, జిల్లాలోని 24 మండలాల్లో ఖనిజాల తవ్వకాలపై ఆంక్షలు ఉండడంతో మట్టి, కంకర ధరలు నింగినంటాయి. కేవలం బండరావిరాలలో మాత్రమే మైనింగ్కు అనుమతులు ఇవ్వడంతో సుదూర మండలాల నుంచి వీటిని రవాణా చేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపడువుతుందని ఇళ్ల నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. -
ఏరో హీరో
కోట్ల రెమ్యునరేషన్. సినిమా రిలీజ్ అయితే వందల కోట్ల బిజినెస్. ఇదీ హీరో అజిత్ మార్కెట్. ఇప్పుడు మరో కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. శాలరీ ఎన్ని కోట్లో అనుకుంటున్నారా? కోట్లు కాదండి.. వెయ్యి రూపాయిలు మాత్రమే. అవును.. కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ హీరో వెయ్యి రూపాయిల జీతంతో కొత్త జాబ్ టేకప్ చేశారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అజిత్ను ‘హెలికాప్టర్ టెస్ట్ పైలెట్ అండ్ యూవీఏ సిస్టమ్ అడ్వైసర్’గా అపాయింట్ చేసింది. ఈ పని కోసం అజిత్ విజిట్ చేసిన ప్రతీసారి 1,000 రూపాయిలు జీతంగా ఇస్తారట. చిన్నప్పటి నుంచి ఏరో టాపిక్ అంటే ఇష్టం ఉన్న అజిత్ ఈ అసైన్మెంట్ను తనంతట తాను అడిగి టేకప్ చేశారట. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కాంపిటేషన్ కోసం అజిత్ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) టెస్టింగ్ అండ్ డిజైనింగ్లో తన సేవలు అందిస్తారు. వచ్చే 1,000 రూపాయిల జీతాన్ని కూడా ఎమ్ఐటీలో పేద విద్యార్థుల కోసం డొనేట్ చేయనున్నారు.తాజా చిత్రం ‘విశ్వాసం’ షూటింగ్ కోసం అజిత్ ఆదివారం హైదరాబాద్ వచ్చారని సమాచారం. -
దాచేపల్లి అత్యాచార నిందితుడు ఆత్మహత్య
-
దాచేపల్లి నిందితుడి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. నిందితుడి అరెస్టులో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ అందోళనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దాచేపల్లిలో గురువారం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ వెంకటప్పల నాయుడు పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆత్మహత్య ఓ పక్క నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురజాల దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఘటనాస్థలికి బయలుదేరారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సుబ్యయ్యా? కాదా? అని పోలీసులు మరికాపేట్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మా తప్పు ఒప్పుకుంటున్నాం: హోం మంత్రి మరో వైపు దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తమ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి జరుగకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలని, మీడియా చైతన్య పర్చాలని చినరాజప్ప కోరారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. -
భారత్ చేతికి కిల్లర్ డ్రోన్స్..!!
న్యూఢిల్లీ : భారత్ అమ్ములపొదిలో త్వరలో కిల్లర్ డ్రోన్స్ వచ్చి చేరనున్నాయి. దీంతో సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనాతో ఎదురవుతున్న సవాళ్లకు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాల్లో కిల్లర్ డ్రోన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని దేశాలకు అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్(యూఏవీ)లను అమ్మేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకురానున్నారు. అమెరికా కీలక భాగస్వామ్యులు ఒకటైన ఇండియా కూడా 22 ప్రిడేటర్ బి డ్రోన్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా నియంత్రణ రేఖ(ఎల్వోసి) వెంబడి ఉగ్రస్థావరాలను నాశనం చేయొచ్చు. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి దేశ రక్షణ నిమిత్తం కూడా ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
గుజరాత్లో కుప్పకూలిన నేవీ డ్రోన్
సాక్షి, పోర్బందర్ : గుజరాత్లోని పోర్బందర్ వద్ద భారతీయ వాయుసేనకు చెందిన డ్రోన్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. గురువారం ఉదయం పదిగంటలకు పోర్బందర్ ఎయిర్బేస్లో టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే డ్రోన్ నేలకొరిగింది. డ్రోన్ ప్రమాదం చోటుచేసుకుందని అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత నేవీ నిర్ధారించింది. ఇంజన్ వైఫల్యం కారణంగానే డ్రోన్ కుప్పకూలినట్టు ప్రాధమికంగా తెలియవచ్చిందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం లేకపోవడంతో వాయుసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
జస్ట్.. డ్రోన్లు ఎక్కుపెట్టింది..
యుద్ధం మొదలైంది.. శత్రు సేనలు క్షిపణులు ఎక్కుపెడుతున్నాయి.. ఇటువైపు పక్షం మాత్రం నింపాదిగా ఉంది.. క్షిపణులు ఎక్కుపెట్టలేదు.. జస్ట్.. డ్రోన్లు ఎక్కుపెట్టింది.. వీడియో షూట్ కోసం కాదు.. శత్రు క్షిపణులను షూట్ చేయడానికి..!! ప్రస్తుతం పెళ్లిళ్లు.. మ్యాచుల్లో వీడియో షూటింగ్ కోసం.. పిజ్జాలను డెలివరీ చేయడం కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు.. భవిష్యత్తులో దేశం తరఫున యుద్ధం చేయనున్నాయి! ఇందుకోసం అమెరికా క్షిపణి రక్షణ సంస్థ(ఎండీఏ) లో–పవర్ లేజర్ డెమాన్స్ట్రేటర్(ఎల్పీఎల్డీ) ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ లేజర్ వ్యవస్థతో కూడిన డ్రోన్లు.. లాంచింగ్ పాడ్ నుంచి క్షిపణులను ప్రయోగించకముందే వాటిపై లేజర్ కిరణాలను ప్రయోగించి.. నాశనం చేస్తాయట. 2019 కోసం తమకు రూ.63 వేల కోట్ల బడ్జెట్ కావాలంటూ అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన ఎండీఏ.. అందులో భాగంగా ఎల్పీఎల్డీ ప్రాజెక్టు గురించి వివరించింది. లేజర్ టెక్నాలజీ కోసం రూ.420 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వీటి ఆవశ్యకతను తెలియజెప్పింది. ఒకవేళ క్షిపణిని ప్రయోగించినా.. దానిని దారిలోనే అడ్డుకుని.. నిర్వీర్యం చేసే శక్తిసామర్థ్యాలు దీని సొంతమట. 2020లో ఎల్పీఎల్డీని పరీక్షించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల రక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్న నిపుణులు.. ఎల్పీఎల్డీని ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీగా పేర్కొంటున్నారు. -
కంగారెత్తిస్తున్న పాక్ కొత్త ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యాన్ని కలవరపాటుకు గురిచేసే వార్త. దాయాది పాకిస్థాన్ అమ్ములపొదిలో శక్తివంతమైన ఓ ఆయుధం వచ్చి చేరింది. వింగ్ లూంగ్-1 అనే యుద్ధ విమానాలు(డ్రోన్లు) పాక్ వైమానిక దళంలో చేరినట్లు సమాచారం. చైనా నుంచి పాక్ వీటిని కొనుగోలు చేసుకుంది. వింగ్ లూంగ్ సామర్థ్యం.. మానవ రహిత విమానాలైన 'వింగ్ లూంగ్' ను చైనా తయారు చేస్తోంది. లక్ష్యాలను నిర్దేశిస్తే చాలూ శత్రు స్థావరాలను వాటంతట అవే వెతుక్కుని వెళ్లి బాంబు దాడులు చేసి రాగలవు. పైగా తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో వీటిని కనుగొనటం రాడార్లకు కూడా కష్టమే. సుమారు 280 కిలోమీటర్ల వేగంతో 5 వేల కిలోమీటర్ల దూరం వరకు ఇవి ప్రయాణించగలవు. మెరుపు వేగంతో ఇవి దాడి చేయటంతో ప్రత్యర్థులకు వీటిని గుర్తించే సమయం కూడా ఉండదు. అంతటి విశేషాలున్న వింగ్ లూంగ్ను పాక్ తన అమ్ములపొదిలో చేర్చుకుంది. సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి. తేలికపాటి మిసైల్స్ తోపాటు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. వారం క్రితమే చైనా వీటిని పాక్ కు చేరవేసిందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వింగ్ లూంగ్ సిరీస్లో నాలుగో తరం డ్రోన్ ల కోసం చైనా పరిశోధనలు చేస్తోంది. ఈ తరహా డ్రోన్ లు భారత్ వద్ద లేవని.. భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
హక్కానీ టాప్ కమాండర్ హతం
పెషావర్: ఉగ్రవాదంపై పాకిస్తాన్ అలసత్వాన్ని వీడని పక్షంలో తామే ఆ ఉగ్రస్థావరాలను నిర్వీర్యం చేస్తామని ప్రకటించిన అమెరికా.. ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. బుధవారం అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ మిసైల్ దాడులతో హక్కానీ నెట్వర్క్ కీలక కమాండర్ ఎహసాన్ అలియాస్ ఖవారీని మట్టుబెట్టింది. ఉత్తర వజీరిస్తాన్ (పాకిస్తాన్)లోని గిరిజన ప్రాంతం (అఫ్గాన్ శరణార్థులుండే ప్రాంతం)లోని ఓ ఇంట్లో ఖవారీ ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. ఆ ఇంటిపై అమెరికా గూఢచార విమానాలు రెండు డ్రోన్ మిసైల్స్ను ప్రయోగించాయి. ఈ దాడిలో ఖవారీ సహా అతని ఇద్దరు అనుచరులు హతమయ్యారు. కాగా, అమెరికా డ్రోన్ దాడులు ‘ఏకపక్షం’ అని పాకిస్తాన్ మండిపడింది. సంకీర్ణ ధర్మాన్ని మరచి తమ భూభాగంలో తమకు సమాచారం లేకుండా ఇలాంటి దాడులకు దిగటం సరికాదని నిరసన తెలిపింది. ‘ఇలాంటి ఏకపక్ష దాడులు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న అమెరికా, పాకిస్తాన్ దేశాల సహకార స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై అమెరికా మిలటరీ తరచుగా దాడులు జరుపుతోంది. కానీ ఈసారి మా భూభాగంలో.. మాకు సమాచారం ఇవ్వకుండానే దాడి జరిపారు’ అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపైనా డ్రోన్ దాడులు పెరిగాయి. అయితే.. తన భూభాగంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయటంలో పాక్ విఫలమైందంటూ కొంతకాలంగా ట్రంప్ విమర్శిస్తున్నారు. హక్కానీ నెట్వర్క్ లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడులు చేయటం ఈ వారం రోజుల్లో ఇది రెండోసారి. -
ట్రాఫిక్ చిక్కులకు డ్రోన్లతో చెక్!
ముంబై: ప్రయాణికుల్ని తరలించే డ్రోన్ల తయారీతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ను తగ్గించవచ్చని కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్లకు సంబంధించి అధునాతన పరికరాలను అభివృద్ధి చేయవచ్చని వెల్లడించారు. ఆదివారం ఐఐటీ–బాంబే నిర్వహించిన టెక్ఫెస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో డ్రోన్ల తయారీరంగం వేగంగా విస్తరించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే డ్రోన్ల రూపకల్పనపై పలువురు దృష్టి సారించారనీ.. ఈ రంగంలో భారీ వాటా పొందేందుకు మనం కూడా దేశీయంగా ఆ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. సమర్థవంతంగా డ్రోన్లను తయారుచేయగలిగితే వాటి రవాణా వ్యయం ఆటో ప్రయాణానికయ్యే స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. తగిన చర్యలు తీసుకుంటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలుస్తుందని సిన్హా తెలిపారు. -
చైనా చేతిలో మన అత్యాధునిక టెక్నాలజీ..!
న్యూఢిల్లీ : సమవుజ్జీలు అయిన రెండు దేశాల మధ్య పైచేయి కోసం జరిగే పోరాటం, పడే ఆరాటం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత రక్షణ దళం చేసిన చిన్న పొరబాటు దేశ రక్షణకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితిని తెచ్చింది. కొద్ది రోజుల క్రితం భారత్కు చెందిన మానవ రహిత డ్రోన్ డోక్లాం పీఠభూమి సరిహద్దులో ఎగురుతూ చైనా భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. డ్రోన్ భూభాగంలోకి ప్రవేశించిన రెండు వారాల తర్వాత చైనా దానిపై ప్రకటన విడుదల చేసింది. డ్రోన్ను నేలకూల్చినట్లు పేర్కొంది. అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించినందుకు భారత్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. మన టెక్నాలజీ చైనా చేతిలో.. తాజా సమాచారం ప్రకారం పూర్తి ఫిట్నెస్తో ఉన్న డ్రోన్ హెరాన్ నుంచి టెక్నాలజీని చైనా చోరి చేసిందనే రిపోర్టులు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తయారైన హెరాన్ డ్రోన్ను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఇజ్రాయెలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) తయారు చేసింది. ఏ వాతావరణ పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్ధ్యం హెరాన్ సొంతం. హెరాన్ బరువులో 250 కిలోలు దాని సెన్సార్లే ఉంటాయి. ఆపరేట్ చేసే బేస్ నుంచి తప్పిపోయిన తిరిగి బేస్ను చేరుకునేలా దీన్ని ఐఏఐ రూపొందించింది. దీంతో డ్రోన్ చైనాలోకి తప్పిపోగానే.. అదే తిరిగి బేస్కు వచ్చేస్తుందని భారత రక్షణ వర్గాలు భావించాయి. అయితే అలా జరగలేదు. దీంతో ఎంతో విలువైన టెక్నాలజీని చైనా తస్కరించి ఉండొచ్చని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. డ్రోన్ ఉదంతంపై ఇజ్రాయెల్కు చెందిన ఓ ప్రముఖ భద్రతా సంస్థ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఓ చక్కని గూఢచారిని కోల్పోవడం భారత్కు దెబ్బ అయితే.. అత్యాధునిక సాంకేతికతను చేజిక్కించుకున్న చైనా బలగాలకు విలువ సమాచారం దొరికినట్లే అని పేర్కొంది. కార్గిల్ యుద్ధం తర్వాత వేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సూచనతో భారత్ హెరాన్ మానవ రహిత డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. 2000లో భారత ఆర్మీ, నేవీ, వాయుసేనలు ఈ డ్రోన్లను వినియోగించటం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత ఆర్మీ వద్ద ఇలాంటి డ్రోన్లు 45 ఉన్నట్లు సమాచారం. -
టైమైతే చాలు.. ఆఫీసు నుంచి తరిమేస్తాయి!
మనకంటే పెద్దగా అలవాటు లేదుగానీ.. టైమైపోయినా.. ఆఫీసుల్లోనే ఉండిపోవడం, పనిచేయడం జపాన్లో చాలా ఎక్కువ. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం.. చాలామంది ఉద్యోగులు నెలకు 80 గంటల దాకా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారట. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక లాభం లేదనుకున్నాయి ... బిల్డింగ్స్ కట్టే తైసీ, డ్రోన్లు తయారు చేసే బ్లూ ఇన్నొవేషన్స్ కంపెనీలు. కొంచెం వినూత్నంగా ఆలోచించి.. ఉద్యోగులు రాత్రి పొద్దుపోయే వరకూ ఆఫీసుల్లోనే ఉండిపోకుండా డ్రోన్లను వాడటం మొదలుపెట్టాయి. ఒక్కో ఉద్యోగి ఆఫీసుకు ఏ సమయంలో వస్తాడన్నది ఎలాగూ తెలుసు కాబట్టి, నిర్దిష్ట సమయం పూర్తి అయిన వెంటనే... ఈ డ్రోన్లు ఆ ఉద్యోగి డెస్క్ దగ్గరకు చేరుకుంటాయి. జోరుజోరుగా సంగీతం వినిపించడం మొదలుపెడతాయి. ఎంచక్కా మ్యూజిక్ను ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు. మీరు ఆఫీసు వదిలిపెట్టే వరకూ రొదపెడుతూనే ఉంటాయి. ఎవరైనా ఆగంతకులు గానీ, కంపెనీ ఉద్యోగులుగానీ... రాత్రివేళ రహస్యంగా లోపలికి జొరబడినా ఈ డ్రోన్లు వారిని గుర్తించి, వీడియోలను నిక్షిప్తం చేసుకుంటాయి. లేదంటే దగ్గరలో ఉన్న క్లౌడ్ సర్వర్కు పంపేస్తాయి. దీని ద్వారా సెక్యూరిటీ సిబ్బంది శ్రమ కూడా కొంచెం తగ్గుతుందని అంచనా. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ డ్రోన్ ఖరీదు దాదాపు రెండున్నర లక్షల రూపాయల దాకా ఉంటుంది! -
భారత్కు చైనా మీడియా దురుసు హెచ్చరిక!
చైనీస్ భూభాగంలోకి ప్రవేశించిన భారత్ డ్రోన్ను కూల్చివేశామని ఆ దేశం వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ను తీవ్రంగా హెచ్చరిస్తూ చైనా ప్రభుత్వ మీడియా కథనాలు ప్రచురించింది. ఇరుదేశాల నడుమ సైనిక ప్రతిష్టంభన తలెత్తిన డోక్లాం కొండప్రాంతం సమీపంలోనే భారత్ డ్రోన్ చైనా భూభాగంలోకి ప్రవేశించి కూలిపోయిందని చైనా జాతీయవాద టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. డ్రోన్తో చైనాలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ క్షమాపణ చెప్పాలంటూ ఆ పత్రిక ఓ సంపాదకీయాన్ని రాసుకొచ్చింది. ఇలా చొరబడినందుకు డ్రోన్ను కోల్పోవడమే కాదు.. అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది. 'సైనిక ప్రతిష్టంభన తలెత్తిన ప్రాంతంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన ముగిసి ఎంతోకాలం కాకముందే తాజా చొరబాటు చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు ఉన్న సమయంలో సున్నితమైన ప్రాంతంలో ఎదుటిపక్షాలు రెచ్చగొట్టే చర్యలుగా భావించే వాటిని ఇరువర్గాలు నివారించాల్సి ఉంటుంది. కానీ భారత్ అందుకు విరుద్ధంగా దురుసుగా ప్రవర్తించింది' అని గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది. -
డ్రోన్ దాడిలో తీవ్రవాదులు హతం
ఎడెన్(యెమెన్): దక్షిణ యెమెన్లో అల్ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్పై డ్రోన్ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్ నుంచి బేడా ప్రావిన్స్కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్ కేంద్రంగా నడుస్తున్న అల్ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్ఖైదాపై అమెరికా డ్రోన్ దాడులు సాగిస్తోంది. -
డ్రోన్ల వాణిజ్య వినియోగానికి గ్రీన్సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. డ్రోన్లను వ్యాపార కార్యకలాపాలు సహా అందరూ వినియోగించుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా డ్రోన్ల వినియోగానికి అనుమతిస్తామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చూబే చెప్పారు. 250 కిలోగ్రాముల నుంచి 150 కేజీల బరువుండే డ్రోన్లు ఐదు క్యాటగిరీలుగా విభజిస్తూ నూతన డ్రోన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును నో డ్రోన్ జోన్గా పరిగణిస్తారు. విమానాశ్రయానికి ఐదు కిమీ పరిధిలో డ్రోన్లను అనుమతించరు. ఢిల్లీలోని విజయ్ చౌక్ వంటి ప్రాంతాలు నో డ్రోన్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ సంవత్సరాంతానికి సమగ్ర డ్రోన్ పాలసీ వెల్లడవుతుందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
పాకిస్తాన్ను పణంగా పెడతారా?!
ఇస్లామాబాద్ : భారత్కు అమెరికా ఆర్మ్డ్ డ్రోన్లను విక్రయించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్కు శక్తివంతమైన ఆర్మ్డ్ డ్రోన్లను విక్రయించడం వల్ల.. ఆసియాలో ఆయుధ సమతుల్యం, శాంతి దెబ్బతింటాయని అమెరికాతో పాకిస్తాన్ పేర్కొంది. అంతేకాక సరిహద్దు దేశాలతో భారత్ ఆయుధ పెత్తనం చేసే అవకాశముందని పాకిస్తాన్ చెబుతోంది. ఆర్మ్డ్ డ్రోన్లను భారత్కు విక్రయించాలన్న ఆలోచనను పక్కన పెట్టాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా కోరారు. ఆసియాలోనూ, సరిహద్దు దేశాలతోనూ ప్రాంతీయ స్థిరత్వం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని జకారియా తెలిపారు. ఇప్పటికే సైనిక, ఆయుధ సంపత్తిలో ముందున్నభారత్.. ఆర్మ్డ్ డ్రోన్లను సమకూర్చుకుంటే.. అది పొరుగు దేశాలకు ఇబ్బందికరమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను జకారియా తెలిపారు. భారత్కు ఆర్మ్డ్ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమీ (ఎంటీసీఆర్) టెక్నాలజీని సరఫరా చేసే విషయంలో అమెరికా.. బహుపాక్షిక ఎగుమతి పద్దతులను ఒక్కసారి పరిశీలించాలని ఆయన జకారియా డిమాండ్ చేశారు. భారత్కు ఆర్మ్డ్ డ్రోన్లు, ఎంటీసీఆర్ టెక్నాలజీని అందించడం అంటే.. పాకిస్తాన్ను పణంగా పెట్టడమేనని జకారియా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను స్పష్టం చేశారు. -
అమెరికా నుంచి ఆయుధ సామర్ధ్య డ్రోన్లు
వాషింగ్టన్ : ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లను అమెరికా భారత్కు అందజేయనుంది. భారత వాయుసేన అభ్యర్ధన మేరకు ఆయుధ సంపత్తి కలిగిన డ్రోన్లను అందజేస్తామని ఓ సీనియర్ అమెరికన్ అధికారి చెప్పారు. ఈ డీల్తో భారత్-అమెరికాల మధ్య రక్షణ బంధం బలపడనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ డ్రోన్లు ఇవ్వాలని అమెరికాను కోరింది. ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యయంతో 80-100 డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమని చెప్పింది. జూన్ నెలలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయుధ సామర్ధ్యం లేని గార్డియన్ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ డ్రోన్లను హిందు మహాసముద్రంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. -
భారత్ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్ : రక్షణ రంగాన్ని మరింత బలోపేలం చేసేదిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను మరింత పఠిష్టం చేసుకున్న భారత్.. రక్షణ బంధాన్ని ధృఢతరం చేసుకుంటోంది. అమెరికా, ఫ్రాన్స్లతో ఇప్పటికే కీలక రక్షణ ఒప్పందాలను చేసుకున్న భారత్కు మరిన్ని సానుకూల సంకేతాలను ఆయా దేశాలు పంపాయి. ఫ్రాన్స్కు చెందిన శక్తివంతమైన రాఫెల్ యుద్ధవిమానాలను మరిన్ని భారత్కు అమ్మేందుకు ఫ్రాన్స్ అంగీకిరంచింది. అదే విధంగా ఆర్మ్డ్ డ్రోన్లను భారత్కు విక్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. భారత్-ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫ్రాన్స్ రక్షణ శాఖమంత్రి ఫ్లోరున్స్ పార్లే వచ్చే వారంలో భారత్లో పర్యటించనున్నారు. గత ఏడాది 36 రాఫెల్ విమానాలను భారత్కు విక్రయించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ 36 యుద్ధవిమానాలను భారత్ రూ. 59 వేల కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిని చూపింది. ఈ నేపథ్యంలోనే భారత్కు వస్తున్న ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సీమాంతర ఉగ్రవాదం ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను బలోపేతం చేసే దిశగా ఆర్మ్డ్ డ్రోన్లను అందించాలని భారత్ గతంలో అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం ఆర్మ్డ్ డ్రోన్లపై కనబరిచిన ఆసక్తిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఆర్మ్డ్ డ్రోన్లు రక్షణ శాఖలో చేరితో.. భారత వాయుదళం మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఆర్మ్డ్ డ్రోన్లుగా పిలిచే అవేంజర్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలనుకు సంబంధించి భారత్ ఈ ఏడాది అమెరికాకు లేఖ రాసింది. సుమారు 100 ఆర్మ్డ్ డ్రోన్లును విక్రయించాలని అందులో భారత్ కోరిందని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్ 26న వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా.. 22 గార్డియన్ డ్రోన్లకు భారత్కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే. -
సిటీలోనే ఇక్కడి నుంచి అక్కడికి...
ఎగిరే కార్లు.. ఎగిరే కార్లు అని ఏళ్ల నుంచి చెబుతున్నారేగానీ.. ఎప్పటికొస్తాయి అవి అన్న అనుమానం చాలామందిలో ఉంది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ కంపెనీలు ఒక్కటొక్కటిగా ఎగిరే కార్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో మన ముందుకు వచ్చిందే.. ఈ చైనీస్ ప్యాసింజర్ డ్రోన్. ఇద్దరు మాత్రమే ప్రయాణించగల ఈ డ్రోన్లో దాదాపు 16 ఇంజిన్లు ఉంటాయి. నిట్టనిలువుగా పైకి ఎగిరి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ డ్రోన్ ఒకసారికి 30 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు. నగరాల్లో ఒక మూల నుంచి ఇంకోమూలకు వెళ్లేందుకు ఇది సరిపోతుందని కంపెనీ ప్రతినిధి పీటర్ డెల్కో అంటున్నారు. మనుషుల్లేకుండా తాము ఈ డ్రోన్ను దాదాపు 40 సార్లు నడిపి చూశామని, గత నెలలో మనిషితోనూ గాల్లో పది నిమిషాలపాటు ప్రయాణించామని ఆయన వెల్లడించారు. టచ్స్క్రీన్పై వెళ్లాల్సిన చోటును గుర్తించి ఒక్క బటన్ నొక్కితే చాలు.. ఈ డ్రోన్ ప్రయాణీకులను సురక్షితంగా అక్కడకు చేరుస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది.. అంటే నాలుగైదు నెలల్లోనే ఈ ఎగిరే కారు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫ్రాన్స్లోని ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ కూడా వచ్చే ఏడాదికల్లా తాము ఎగిరే కారును అందుబాటులోకి తెస్తామని చెప్పేసింది. సిటీఎయిర్బస్ పేరుతో వస్తున్న ఈ ఎగిరే కారు ప్యాసింజర్ డ్రోన్ కంటే కొంచెం భిన్నమైంది. దాదాపు 140 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఎగిరే సిటీఎయిర్బస్లో నలుగురు ప్రయాణించవచ్చు. వేగం గంటకు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువే అయినప్పటికీ ఇది 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం గాల్లో ఎగరలేదు. వచ్చే ఏడాది మధ్యభాగంలో ప్రయోగాలు మొదలుపెట్టి 2023 నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ఎయిర్బస్ ప్రణాళిక! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘వెలోకాప్టర్లు’ వస్తున్నాయ్
-
‘వెలోకాప్టర్లు’ వస్తున్నాయ్
దుబాయ్ : ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువులను చేరవేసే డ్రోన్లను ఇప్పటికే కొన్ని దేశాలు ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనుషులను అంటే ప్రయాణికులను ఒక చోటు నుంచి వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసిన పైలెట్లేని ‘వెలోకాప్టర్’ను దుబాయ్ రోడ్డు అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో తయారు చేసిన ఈ వెలోకాప్టర్ను ప్రయాణికులు లేకుండా ప్రయోగించి విజయం సాధించింది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వెలోకాప్టర్ను జర్మనీకి చెందిన ఓ డ్రోన్ సంస్థ తయారు చేసింది. రిమోట్ కంట్రోల్తో అవసరం లేకుండా నడిచే ఈ వెలోకాప్టర్ 30 నిమిషాలపాటు నిరాటకంగా గాల్లో ఎగురగలదు. 18 ప్రొపెల్లర్లు, రోటర్లతో నడిచే ఈ వెలోకాప్టర్లో బ్యాటరీ బ్యాకప్ను, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు పారాసూట్లను కూడా ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వెలోకాప్టర్ను ప్రయాణికులే ఆపరేట్ చేయవచ్చని, యాప్ ద్వారా వెలోకాప్టర్ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెలోకాప్టర్ సీఈవో ఫ్లోరియన్ రాయిటర్ తెలిపారు. -
డ్రోన్ కెమెరా కలకలం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఓపెన్టాప్ జీపులో ర్యాలీగా బయల్దేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు దారి పొడవునా అభివాదం చేసుకుంటూ వచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఈ ర్యాలీని పైనుంచి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రికి ర్యాలీ చేరుకోగానే రహదారి పక్కనున్న చెట్టు కొమ్మల్లో డ్రోన్ కెమెరా చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తుండగానే వెంకయ్య ప్రయాణిస్తున్న వాహనం సమీపించింది. అదే సమయంలో డ్రోన్ కెమెరా పైనుంచి ఒక్కసారిగా కుప్పకూలి వెంకయ్యకు అతి సమీపంలోనే పడింది. దీంతో ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలకలం
న్యూఢిల్లీః ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ పైలెట్ డ్రోన్ను గుర్తించడంతో ఆదివారం సాయంత్రం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని మూడు రన్వేలను తాత్కాలికంగా మూసివేశారు. షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమ్యస్ధానాలకు చేరుకోవడంలో జాప్యం నెలకొనడంతోఅసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొద్ది సేపటికి సర్వీసులను పునరుద్ధరించడంతో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
ఫొటోలు తీసింది... ఇప్పుడు మొక్కలు నాటుతోంది
డ్రోన్లు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది.. హై ప్రొఫైల్ పెళ్లిళ్లలో ఫొటోలు తీసేవి మాత్రమే. కానీ ప్రపంచం చాలా అడ్వాన్స్ అయిపోతోంది. కొన్ని చోట్ల డ్రోన్లు గుండెపోటు వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలందించేందుకు ఉపయోగపడుతూంటే... ఇంకోచోట సుదూర ప్రాంతాల్లో ఉండేవారికి రక్తం సరఫరా చేసేందుకు పనికొస్తున్నాయి. అమెజాన్ లాంటి కంపెనీలు డెలివరీ బాయ్ల స్థానంలో ఏకంగా డ్రోన్ సైన్యాన్ని పెట్టే ఆలోచనల్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒకట్రెండు ఏళ్ల క్రితం ఇలాగే డ్రోన్లతో ఈ భూమిని పచ్చగా మార్చేస్తానని ఓ ఐరిష్ కంపెనీ బయలుదేరింది. పేరు బయోకార్బన్. డ్రోన్ల సాయంతో అడవులను పెంచాలన్నది ఈ కంపెనీ ప్లాన్. ఈ ఐడియా విన్న వారందరూ అప్పట్లో ఆ.. అసలు ఇది అయ్యే పనేనా అని పెదవి విరిచేశారు గానీ బయోకార్బన్ ఇప్పుడు మన పొరుగున ఉన్న మయన్మార్లో రంగంలోకి దిగనుంది. ఇర్రవాడీ నదీ పరీవాహక ప్రాంతంలోని మడ అడవుల్లో దాదాపు 27 లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మనుషులకైతే ఇన్ని మొక్కలు నాటేందుకు ఏళ్లు పట్టేవేమోగానీ.. రోజుకు లక్ష మొక్కల్ని నాటేయగల డ్రోన్లకు ఇది చిటికెలో పని. అయితే ఇందుకోసం బయోకార్బన్ సంస్థ చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అడవులను పెంచాలనుకున్న ప్రాంతాన్ని ముందుగా క్షుణ్ణంగా డ్రోన్లతోనే సర్వే చేయడంతో ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. ఎత్తు పల్లాలు, రాళ్లూ రప్పలు ఎక్కడున్నాయి? నీటి ప్రవాహం ఎక్కడుంది? మొక్కలు ఎక్కడ నాటితే ఎక్కువకాలం మనగలిగే అవకాశముంది? వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇంకో డ్రోన్ ముందుగా నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారం.. విత్తన బాంబులను (మొక్కల విత్తనాలు, పోషకాలు కలిపిన బంతుల్లాంటి నిర్మాణాలు) జారవిడుస్తుంది. మొత్తం 250 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు పది లక్షల మొక్కలను నాటడం వచ్చే నెలలో మొదలు కానుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ప్రాజెక్టు మరింత ముందుకు సాగి.. ఏకంగా వందకోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్లు సిద్ధమవుతున్నాయి! అన్నట్టు.. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కూడా డ్రోన్లతో పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డ్రోన్.. భళా!
♦ 70 కిలోల బరువున్న మర మనిషితో ఎగిరిన మ్యాన్డ్ ఆక్టో కాప్టర్ ♦ చిరెక్ విద్యార్థుల ఘనత.. దేశంలోనే తొలి ప్రయోగం సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా గాల్లో ఎగిరి వీడియోలు, ఫొటోలు తీసే డ్రోన్లనే చూశాం.. కానీ హైదరాబాద్లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మనిషిని కూడా గాల్లోకి తీసుకెళ్లగలిగే డ్రోన్ హెలికాప్టర్ (ఆక్టో కాప్టర్)ను రూపొందించారు. బుధవారం కొండాపూర్లోని స్కూల్ ఆవరణలో 70 కిలోల బరువున్న మర మనిషితో ఆక్టో కాప్టర్ను విజయవంతంగా గాల్లోకి ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఇలాంటి ప్రయోగం చేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగానికి మరింత పదును పెడితే మ్యాన్డ్ ఆక్టో కాప్టర్ను ఆర్మీ, ఎయిర్ఫోర్స్లో ఉపయోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు. స్కూల్లో 12వ తరగతి చదువుతున్న వినయ్ కనుమూరి, వినీత్ ఆలపాటి, అమోగ్ ఇస్కా, ఆదిత్య మద్దుకూరి పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సహకారంతో దీన్ని తయారు చేశారు. ఏడాదిపాటు శ్రమించి, రూ.8.5 లక్షల ఖర్చుతో ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. చివరికి రిమోట్ సాయంతో 15 అడుగుల ఎత్తు వరకు విజయవంతంగా ఎగురవేశారు. మరో 8 నెలల తర్వాత మనిషిని కూర్చోబెట్టి ఆక్టో కాప్టర్ను ఎగురవేస్తామని వైస్ ప్రిన్సిపల్ వెంకట్ రామన్ తెలిపారు. దీనికి 100 అడుగుల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉందన్నారు. మనిషితో ఎగిరే డ్రోన్ను తయారు చేయడం ఎంతో స్ఫూర్తి్తనిచ్చిందని విద్యార్థి అమోగ్ ఇస్కా పేర్కొన్నాడు. -
ఇక గాల్లో నుంచే ఫుడ్ డెలివరీ..
లక్నో: హోటల్కు ఏదైనా ఆర్డర్ ఇస్తే లేటవుతుందా.. ఆకలి నశించిన తరువాత ఫుడ్ మీ ఇంటికి వస్తుందా.. ట్రాఫిక్ సమస్యతో లేటైంది సార్.. అడ్రస్ దొరకడం కష్టంగా మారింది సార్ అని డెలివరీ బాయ్స్ చెప్పె కాకమ్మ కబుర్లకు చికాకు పడుతున్నారా..? అయితే మీకు ఇలాంటి తిప్పలు త్వరలోనే తప్పనున్నాయి. ఈ సమస్యలకు లక్నోలోని ఆన్లైన్ కాకా ఫుడ్ డెలవరీ కంపెనీ వినూత్న పరిష్కారం కనిపెట్టింది. ఏం లేదండి.. లక్నోలో ట్రాఫిక్ సమస్యలతో ఫుడ్ డెలివరీ కష్టంగా మారిందనీ.. గాల్లో ఫుడ్ డెలివరీ చేయాలనే ఆలోచన తట్టింది ఈ కంపెనీకి. ఇక ఆలోచన తట్టడమే ఆలస్యం వెంటనే కార్యచరణ రూపొందించింది. అదేనండి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసినట్లే డ్రోన్లతో ఫుడ్ డెలివరీ చేస్తే ఎలా ఉంటందని.. ఆలోచించి విజయవంతమైంది. దీంతో డెలివరీ టైమ్లో 1/3 వంతు తగ్గిందటా..అంతేకాదండోయ్ టూ వీలర్ అవసరం ఉండదని దీంతో పొగకాలుష్యం కూడా తగ్గుతుందని చెబుతోంది. దీన్ని రూపొందించడానికి కాకా ఆన్లైన్ ఉద్యోగులు అహద్ అర్షద్, మొహద్ బిలాల్లు ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారట.. ఇప్పటికే వీటిని టెస్టు డ్రైవ్ నిర్వహించామని అయితే కేంద్రవిమానాయ శాఖ, లక్నో డీఎంల నుంచి అనమతుల కోసం వేచిచూస్తున్నామంటున్నాడు కంపెనీ సోషల్ మీడియా మేనెజర్ వివేక్ కుమార్. ఈ కంపెనీకి అనుమతులు లభిస్తే నార్త్ ఇండియాలోను నెం.1 డెలవరీ కంపెనీ నిలవనుంది. -
భారత్కు అమెరికా గార్డియన్ డ్రోన్లు..
వాషింగ్టన్: భారత నావికా దళానికి గార్డియన్ డ్రోన్లు అమ్మేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు రక్షణ, భద్రత అంశాల్లో సహకారంపై జరిపిన సమావేశం అనంతరం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే భారత్కు 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లను విక్రయించనున్నట్లు వైట్హౌస్ పేర్కొంది. ట్రంప్తో తొలిసారిగా భేటీ అయిన మోదీ డ్రోన్ల ఒప్పందం గురించి చర్చించారు. భారత దేశానికున్న సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంపై నిఘా ఉంచేందుకు కేంద్రం ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత గల ఈ డ్రోన్లు 50వేల అడుగుల ఎత్తులో 27గంటలపాటు ప్రయాణించగలవు. ఈ డ్రోన్లను అమెరికా భారత్కు విక్రయించే డీల్పై చైనా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
డ్రోన్ కెమెరాలతో పహారా నాగార్జునసాగర్: సాగర్ నుంచి కుడి కాల్వకు కృష్ణా నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ఆవిరి నష్టాన్ని ఇరు రాష్ట్రాలు భరిం చాలని.. ఈ స్పెల్లో జరిగిన నష్టాన్ని మాత్ర మే లెక్కలోకి తీసుకుని 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదే శించడంతో ఆ మేరకు విడుదల చేస్తున్నారు. కాగా, నీటి విడుదల అంశంలో ఆంధ్రా, తెలంగాణ అధికారుల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా విభాగాలు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 511.80 అడుగులు కాగా.. కుడి కాల్వకు 6,536, ఎడమ కాల్వకు 3,758, కృష్ణా డెల్టాకు విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 3,206, ఏఎమ్మార్పీకి 1,453 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు మొత్తం 14,953 క్యూసెక్కుల నీరు విడుదల వుతుండగా.. శ్రీశైలం నుంచి కేవలం 973 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం కనీస నీటిమట్టం 510 అడు గుల కన్నా దిగువకు వెళ్లే ప్రమాదమంది. -
జేబు దొంగలనూ పసిగడుతుంది!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి డ్రోన్ కెమెరా నిఘా వాహనం తిరుపతి అర్బన్: రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు వ్యవస్థలోనే తొలి డ్రోన్, వైర్లెస్ కెమెరా నిఘా వాహనాన్ని రాయలసీమ ఐజీ శ్రీధర్రావు శుక్రవారం పరిశీలించారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈ వాహనం ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ టీటీడీ సీవీఎస్వో, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ చొరవతో రూపొందించిన ఈ వాహనం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిదని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 25 వేల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలోనూ ప్రతి అణువూ గుర్తించేలా సాంకేతిక పరిజ్ఞానం పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చిందన్నారు. వీఐపీల పర్యటనలు, ర్యాలీలు, సభల్లో ఎవరైనా పాత నేరస్తులు, సంఘ విద్రోహులు, చివరకు జేబుదొంగలు సైతం సులభంగా పట్టుపడే విధంగా కెమెరా నిఘా వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఈ వాహనంతో భవిష్యత్లో పోలీసుశాఖతో పాటు ఇతర ప్రభుత్వ, పోలీసు అనుబంధ శాఖలకు కూడా వ్యాపార ధృక్పథంతో సేవలందించేందుకు వినియోగిస్తామన్నారు. -
జూలై నుంచి స్కై టాక్సీలు
దుబాయ్ : ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగురుకుంటూ స్కై టాక్సీ వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో క్లిక్ చేస్తే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు. అవునండీ ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆకాశంలో డ్రోన్లో షికారు చేయాలని వేచి చూస్తున్న వారికి ఇదో శుభవార్త. జూలై నుంచి దుబాయ్లో డ్రోన్లు గాల్లో షికార్లు కొట్టడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వరల్ఢ్ గవర్నమెంట్ సదస్సులో దుబాయ్ రోడ్లు, రవాణా సంస్థ అధిపతి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డ్రోన్లు 100కిలోల వరకు బరువును తీసుకువెళ్లగలవు. ప్రయాణికుడు ఎక్కడికి వెళ్లాలో టచ్ స్క్రీన్పై క్లిక్ చేస్తే చాలు, మరే ఇతర కంట్రోల్ల అవసరం లేకుండానే గమ్యస్థానాన్ని చేరేయోచ్చు. ట్రాఫిక్ సమస్యలేకుండా ఎంచక్కా విహరించవచ్చు. గంటకు గరిష్ఠంగా 160 కిమీ వేగంతో, 50 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలుగుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు 30 నిమిషాల వరకు గాల్లో చక్కర్లు కొట్టొచ్చు. ఉబర్, గూగుల్, అమెజాన్ సంస్థలు కూడా డ్రోన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. -
పంటల ఫలదీకరణకు డ్రోన్లు
టోక్యో: పంటల ఫలదీకరణకు సాయపడే కీటకాల పరిమాణంలో ఉండే డ్రోన్లు రానున్నాయి. జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. పుష్పాల నుంచి పుప్పొడి సేకరణలో కీటకాలు, తేనెటీగల పాత్ర ఎంతో కీలకం. అయితే ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు క్షీణిస్తుండటంతో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. చవకగా కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణ పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మియాకో, చెచెక్తాలు ఈ కీటక పరిమాణంలో ఉన్న డ్రోన్లను అభివృద్ధి చేశారు. పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించేందుకు గాను ఈ డ్రోన్లకు గుర్రపు వెంట్రుకలను అమర్చారు. తిరిగి వీటిద్వారానే మరో పువ్వులోకి ఈ పుప్పొడిని పంపించడం ద్వారా ఫలదీకరణం చెందుతున్నట్లు వీరు రుజువు చేశారు. -
ఆ హెలికాప్టర్ ఎందుకు తిరుగుతోంది!
మైదుకూరు టౌన్ : మైదుకూరు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా ఓ హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో అతి తక్కువ ఎత్తులో తిరుగుతున్న ఆ హెలికాప్టర్ కిందకు జల్లెడ ఆకారంలో ఉన్న డ్రోన్లను వేలాడదీస్తోంది. దీని ద్వారా భూమిలో నిక్షిప్తమై ఉన్న ఖనిజాల ఆచూకీ తెలుసుకుంటున్నారేమో అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని చాపాడు, దువ్వూరు మండలాల్లో తిరిగిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం మైదుకూరుపై దృష్టి సారించింది. సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోనూ ఇలాగే చక్కర్లు కొట్టింది. అయితే ఈ సర్వే నిర్వహిస్తున్నది ఏ శాఖకు చెందిన వారు అనేది స్థానిక అధికారులకు సైతం తెలియడం లేదు. అసలు ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి వస్తోంది.. తిరిగి ఎక్కడ ల్యాండ్ అవుతోంది అనేది సస్పెన్స్గా మారింది. -
సరుకులు చేరవేస్తుంది నాశనమైపోతుంది!
మిషన్ ఇంపాజిబుల్ –2 చూశారా మీరు? ఈ సినిమా మొదట్లో ఓ సీన్ ఉంటుంది. హీరో ఓ కళ్లజోడు పెట్టుకోగానే తాను చేయాల్సిన పనికి సంబంధించిన సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ తరువాత కళ్లజోడు తీసి పారేసిన వెంటనే అది నాశనమైపోతుంది. ఇప్పుడు పక్క ఫొటోలో ఉన్నదాన్ని చూడండి. పైన ఉన్న ‘డాక్టర్ గుర్తు’ గురించి తరువాత చెప్పుకుందాం. ముందుగా ఇదేమిటో తెలుసుకుందాం. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మాదిరిగానే ఇది కూడా తన పని అయిపోగానే నాశనమైపోయే డ్రోన్. అమెరికా రక్షణ పరిశోధన సంస్థ (డార్పా) తరఫున అదర్ల్యాబ్స్ అనే సంస్థ కార్డ్బోర్డుతో తయారు చేసింది. ఊహూ... ఇది కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు కాదు. కీలకమైన టెక్నాలజీలు, ఎలక్టాన్రిక్ పరికరాలు శత్రువుల చేతుల్లో పడి వారికి ఉపయోగపడేలా మారకూడదన్న లక్ష్యంతో డార్పా రెండేళ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్ ఇది. ప్రస్తుతానికి దీన్ని మారుమూల ప్రాంతాల్లోకి మందులు సరఫరా చేసేందుకు ఉపయోగించాలన్నది అంచనా. అందుకే దీని మీద డాక్టర్ గుర్తు ఉంది. విమానాల నుంచి ఒకసారికి కొన్ని వందల డ్రోన్లు ప్రయోగించవచ్చు. ఇంజిన్లు, ఇంధనం వంటివి ఏవీ లేకపోయినా ఇవి దాదాపు కిలో బరువున్న వస్తువులను మోసుకుని 88 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. పక్షిలా గాలివాటానికి అనుగుణంగా రెక్కల స్థానాన్ని మార్చుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అదర్ల్యాబ్స్ ప్రతినిధి సింప్సన్ అంటున్నారు. ఒకసారి లక్ష్యం చేరిన తరువాత ఇది కొన్ని రోజుల వ్యవధిలో తనంతట తానే నాశనమైపోతుంది. తాము ఇప్పటికే ఈ కార్డ్బోర్డ్ డ్రోన్లను విజయవంతంగా పరీక్షించి చూశామని సింప్సన్ తెలిపారు. పేదదేశాల్లో అరకొర రవాణా సౌకర్యాలు ఉన్న మారుమూల ప్రాంతాలకు మందులు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం వంటివాటిని సరఫరా చేసేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మీరే ఉంచుకోండి: చైనాపై ట్రంప్ ఫైర్!
వాసింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. అమెరికా నేవీకి చెందిన డ్రోన్ను చైనా దొంగలించిందని, దానిని చైనా ఉంచేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికా నేవీ ఓషనోగ్రాఫీ (సముద్ర అధ్యయన) డ్రోన్ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నానని, ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చైనా చెప్తుండగా.. ఆ దేశం తీరుపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మీరు దొంగలించిన డ్రోన్ మాకు ఏమీ వద్దని మేం చైనాకు చెప్పదలుచుకున్నాం. దానిని మీరే ఉంచుకోండి’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అపారమైన వనరులున్న దక్షిణ చైనా సముద్రం మొత్తం గంపగుత్తగా తనదేనని, ఇందులో ఇతర దేశాలకు ఏమాత్రం హక్కులేదని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్ను చైనా చెప్పాపెట్టకుండా స్వాధీనం చేసుకుంది. తమ డ్రోన్ను ఇలా స్వాధీనం చేసుకోవడం అక్రమమని అమెరికా వాపోతున్నది. ట్రంప్ గతంలోనూ చైనా తీరుపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. -
ఐడియాఫోర్జ్లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, డ్రోన్లకు సంబంధించిన సొల్యూషన్లను అభివృద్ధి చేసే భారత స్టార్టప్, ఐడియా ఫోర్జ్లో పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఆమోదం పొందాల్సి ఉన్నట్టు ఇన్ఫోసిన్ తెలిపింది. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. కొన్నేళ్లుగా ఇన్ఫోసిస్ తన ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెడుతోంది. ఐడియాఫోర్జ్ రూపొందించే డ్రోన్లను భారత సైనిక దళాలు వాడుతున్నాయి. నిఘా, భారీ సమావేశాలు జరిగేటప్పుడు, రెస్క్యూ కార్యకలాపాలకు ఈ డ్రోన్లను భారత సైన్యం ఉపయోగిస్తోంది. విస్తరించడానికి సహకారం!! ఐడియాఫోర్జ్ అత్యున్నత పనితీరు గల డ్రోన్లను భారత్లోనే డిజైన్ చేసి తయారు చేస్తోందని, వీటిని పారిశ్రామికంగా వినియోగించడానికి భారీగా అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితిక సూరి చెప్పారు. కాగా ఇన్ఫీ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని ఐడియాఫోర్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు,, సీఈఓ అంకిత్ మెహతా చెప్పారు. పారిశ్రామికంగా విస్తరించడానికి ఇన్ఫోసిస్ సహకారం కీలకం కానున్నదన్నారు. 2013లో ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ను ఏర్పాటు చేసింది. 2015లో ఈ ఫండ్ను 50 కోట్ల డాలర్లకు పెంచి పరిపుష్టం చేసింది. కృత్రిమ మేధస్సు వంటి వినూత్నమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసే స్టార్టప్లకు ఈ ఫండ్ రుణాలందిస్తోంది. -
డ్రోన్లకు రిమోట్ గన్
చూసేందుకు తుపాకీలా ఉందిగానీ.. బుల్లెట్లు బయటకు వచ్చేందుకు కన్నాలు లేవేమిటని ఆశ్చర్యపోవద్దు. ఈ తుపాకీ మనుషుల కోసం కాదు లెండి. మానవ రహిత విమానాలు... అవేనండీ డ్రోన్లు అంటామే వాటి కోసం. అలాగని ఇది వాటిని కాల్చి పడేయదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న డ్రోన్లను కూడా ఇది స్వాధీనంలోకి తెచ్చుకొని కావల్సిన చోట ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. రేడియో తరంగాల సాయంతో దాని కమ్యూనికేషన్ ఛానెల్స్ మొత్తాన్నీ గందరగోళానికి గురిచేస్తుందీ తుపాకీ. అమెరికా కంపెనీ డ్రోన్షీల్డ్ వీటిని తయారు చేస్తోంది. -
విద్యుత్ సేవలో డ్రోన్స్
సాక్షి, చెన్నై: విద్యుత్ శాఖ సేవకు డ్రోన్స (మానవ రహిత విమానాలు) రంగంలోకి దిగనున్నాయి. తొలి విడతగా చెన్నైలో మూడు లేదా నాలుగు విమానాల కొనుగోలుకు కసరత్తులు సాగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు పదమూడు వేల మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగం సాగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి, కేంద్ర గ్రిడ్ల నుంచి వచ్చే విద్యుత్ సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా అవుతున్నది. ఇందుకుగాను భారీ విద్యుత్ లైన్లు ఆయా సబ్ స్టేషన్లను అనుసంధానించే విధంగా ఏర్పాట్లు చేశారు. అరుుతే, తరచూ ఈ భారీ విద్యుల్ లైన్లలో ఏర్పడే సమస్యలతో , మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. ఇలాంటి ప్రభావాలతో శుక్రవారం ఎనిమిది జిల్లాలు అంధకారంలో మునగాల్సిన పరిస్థితి. అంతకు ముందు దక్షిణ చెన్నైలో ఇలాంటి సమస్యను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య బయలు దేరిందో గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సమయం వృథా, పని భారం ఎక్కువే. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు వర్గాలు ఎక్కడెక్కడ అయితే, సమస్యలు బయలు దేరుతాయో , తక్కువ సమయంలో వాటిని పరిశీలించి, ఆ ఫొటోలను కంట్రోల్ రూంకు చేరే వేసే విధంగా, సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా మానవ రహిత విమానాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సేవలో డ్రోన్స: తొలి విడతగా చెన్నైలో మానవ రహిత విమానాలను రంగంలోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరు నుంచి తరమణి, మనలి నుంచి మైలాపూర్ , ఉత్తర చెన్నై నుంచి మరలి, మైలాపుర్ నుంచి బేషిన్ బ్రిడ్జి వైపుగా సాగే భారీ విద్యుత్ లైన్లను పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ మానవ రహిత విమానాలు రంగంలోకి దించనున్నారు. ముందుగా ఆ లైన్ల వెంబడి మానవ రహిత విమానాల్లోని కెమెరాల ఆధారంగా వీడియో చిత్రీకరణ సాగుతుంది. ఆ లైన్లలో ఎక్కడైనా సాంకేతిక పరంగా, హై ఓల్టేజీ కారణంగా, ఇతర కారణాలతో ఏదేని మరమ్మతులు చోటు చేసుకున్నా, సమస్య బయలు దేరినా తక్షణం ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు వీలుగా మానవ రహిత విమానాలను పంపిస్తారు. ఆవిమానాలు ఆ ప్రదేశాన్ని గుర్తించి కంట్రోల్ రూంకు ఫొటోలను పంపుతుంది. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో సమస్యను అధిగమించేందుకు వీలు ఉండడం వల్లే, ఈ మానవ రహిత విమానాల మీద దృష్టి పెట్టినట్టు విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలివిడతగా చెన్నైలో మూడు లేదా, నాలుగు విమానాలను కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. టెండర్ల ద్వారా మానవ రహిత విమానాల కొనుగోలు ఉంటుందని, ఈ ప్రయత్నం సత్ఫలితాల్ని ఇచ్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రధాన నగరాల్లో మానవ రహిత విమానాల సేవల్ని విస్తరింప చేస్తామన్నారు. -
గాలిలో షికారు
ఒకవైపు డ్రైవర్లు లేని కార్లు, లారీలు రోడ్లెక్కుతున్నాయా! ఇంకోవైపు డ్రోన్లను చిన్న చిన్న ఎగిరే కార్లుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందా! ఈ మధ్యలో... అసలు ఎగిరే కార్లకు డ్రైవర్లు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది ఇజ్రాయెల్కు చెందిన టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగిరే కారు వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో చెబితే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు అంటోంది ఈ కంపెనీ. వట్టి మాటలతోనే సరిపెట్టలేదు ఈ టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఫొటోలో కనిపిస్తోందే... ఎయిర్మ్యూల్ ఎయిర్ ట్యాక్సీ... దాన్ని ఈ మధ్యే విజయవంతంగా నడిపి చూసింది కూడా. రెండు లేజర్ ఆల్టీమీటర్లు (ఎత్తును కొలిచేందుకు వాడే యంత్రాలు), ఇంకో రాడార్ ఆల్టీమీటర్, కదలికల్ని గుర్తించే ఇనర్షియల్ సెన్సర్లతోపాటు నిట్టనిలువుగా గాలిలోకి ఎగిరేందుకు అవసరమైన మోటార్లు, రోటర్ బ్లేడ్లున్నారుు దీంట్లో. దీంతోపాటు ఒక పైలట్లా ఎప్పటికప్పుడు ఏ దిక్కుకు, ఎంత వేగంతో, ఎలాంటి కోణంలో ప్రయాణించాలి లాంటి నిర్ణయాలన్నీ తీసుకునేందుకు దీంట్లో ప్రత్యేక ఫ్లైట్మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ‘ఇంకేముంది! ఎలాగూ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు కదా! త్వరలోనే వీటిని మనమూ చూడవచ్చా?’ అంటే... కొంచెం ఓపిక పట్టాలి అంటోంది సంస్థ. తొలి ప్రయత్నం విజయవంతమైనప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. అత్యవసర సందర్భాల్లో ఈ పైలట్ లెస్ ఎయిర్ ట్యాక్సీ ఉపయోగం చెప్పే నమూనా చిత్రం ఫ్లైట్ మేనేజ్మెంట్ వ్యవస్థ మూడు సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేదని ఆ సంస్థ అంటోంది. రెండుసార్లు లేజర్ ఆల్టీమీటర్ రీడింగ్స తప్పుగా వచ్చాయట. ఫలితంగా ప్రయాణాన్ని కొంచెం ముందుగానే నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించిన తరువాత మరిన్ని పరీక్షలు నిర్వహించి, వీటిని విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటోంది టాక్టికల్ రోబోటిక్స్. అన్నట్లు... తాజాగా ఇంకో విషయం... కంపెనీ తన వాహనం పేరును ఇప్పుడు ఎయిర్మ్యూల్ నుంచి కొమరాంట్ అని మార్చేసింది! -
తాజ్ వద్ద డ్రోన్ కలకలం
ఆగ్రా: చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్ వద్ద డ్రోన్ ఒకటి కలకలం రేపింది. హైసెక్యూరిటీ జోన్లో ఉన్న తాజ్మహల్ వద్ద శనివారం మధ్యాహ్న సమయంలో డ్రోన్ను ఎగురవేస్తున్న అమెరికా పర్యాటకుడిని పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఒహయో ప్రాంతానికి చెందిన నికోలస్గా గుర్తించారు. రెండు సార్లు తాజ్మహల్ వద్ద డ్రోన్ ఎగరడం గుర్తించామని హైసెక్యూరిటీ జోన్లో వీటిని ఎగరవేయడం నేరమని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆ పర్యాటకుడిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి కూడా తెలిపామన్నారు. -
డ్రోన్ల వ్యవ‘సాయం’
అందుబాటులో ఆధునిక పరికరం రసాయనాల పిచికారీలో ఉపయోగం కూర్చున్నచోటునుంచే సాగు పనులు మానిటరింగ్ పర్యవేక్షణ పరిశోధన స్థానానికి ఒకటి అవసరమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు డ్రోన్.. వ్యవసాయంలో దీని పాత్ర అమోఘం. అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అడుగుపెట్టింది. ఈ పరికరం ద్వారా అన్ని పంటలకు రసాయన మందులు పిచికారీ చేయొచ్చు. అంతేకాదు.. పక్షిలా ఎగిరే ఈ పరికరం ద్వారా భూముల పరిస్థితిని అంచనా వేయొచ్చు. - జగిత్యాల అగ్రికల్చర్ డ్రోన్.. వినేందుకు ఈ పదం కొత్తగా అనిపిస్తున్నా.. వ్యవసాయంలో మాత్రం దీనిపాత్ర అమోఘం. అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే దేశంలోనూ అడుగుపెట్టింది. వ్యవసాయ విశ్వవిద్యాలయూల్లో తన ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తోంది. వ్యవసాయంలో రానున్న రోజుల్లో కీలకంగా మారే ఈ పరికరం ద్వారా అన్ని పంటలకు రసాయన మందులు పిచికారీ చేయొచ్చు. అంతేకాదు.. పక్షిలా ఎగిరే ఈ పరికరం ద్వారా భూముల పరిస్థితిని అంచనా వేయొచ్చు. కూర్చున్నచోట నుంచే పంటలను మానిటరింగ్ చేయొచ్చు. అలాంటి పరికరం గురించి తెలుసుకోవాలని ఉంది కదూ..!! - జగిత్యాల అగ్రికల్చర్ ఇటీవల పలు పెళ్లిళ్లలో కనబడుతున్న డ్రోన్లు (రిమోట్ సహాయంతో పైకి ఎగిరి ఫొటోలు, వీడియోలు తీసేవి) ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లోనూ కనిపించనున్నాయి. వ్యవసాయ రంగంలో కూలీల సమస్య, అధిక పెట్టుబడులు రైతులను వేధిస్తున్న తరుణంలో వీటి వాడకం తప్పనిసరిగా కనిపిస్తోంది. మరోవైపు రైతుల చూపు కూడా కొత్త టెక్నాలజీ వైపు మళ్లుతోంది. ఈ ఆధునాతన డ్రోన్లను చైనా, ఫిలిఫైన్స్, ఇండోనేషియా వంటి దేశాలు విరివిగా ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయూనికీ ఒకటి కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. డ్రోన్లంటే.. మనిషితో ప్రమేయం లేకుండా ఆకాశంలో నడిచే వాహనం. ఇది చిన్నపాటి హెలికాప్టర్ను పోలి ఉంటుంది. దీనికి రెక్కలుంటాయి. మిలిటరీ అవియేషన్ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ పరికరం బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కబ్యాటరీ సుమారు 160 ఎకరాల్లో రసాయన ఎరువులను పిచికారీ చేసేవరకూ పనిచేస్తుంది. రిమోట్తో నడిచే దీనిధర ఆయూ కంపెనీలను బట్టి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ఉంది. డ్రోన్తో ఉపయోగాలు డ్రోన్ల సహాయంతో రసాయన మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఎరువులను చల్లుతుంది కూడా. పైకి లేచిన రెండు నిమిషాల్లోనే పని పూర్తి చేయడం డ్రోన్ ప్రత్యేకత. విదేశాల్లో ఈ యంత్రాన్ని వినియోగించుకున్నందుకుగాను గంటకు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు అక్కడి వ్యవసాయ అధికారుల ద్వారా తెల్సింది. దాదాపు 10 నుంచి 12 లీటర్ల మందును నింపుకుని పైకి ఎగురుతుంది. ఒక్కసారి పైకి ఎగిరితే రెండున్నర ఎకరాల్లో పిచికారీ చేస్తుంది. సంపర్కం చేసేందుకు చాలా ఉపయోగం హైబ్రిడ్ (ఆడ,మగ) సాగు చేస్తే మగ పుప్పొడి రేణువులు ఆడమొక్కపై పడి సంపర్కం జరిగేలా తాళ్లతోగానీ.. కట్టెలతోగానీ.. లాగుతాం. ఈ పరికరాన్ని వరి, మొక్కజొన్న పంటలపై ఎగిరిస్తే.. ఆ గాలి పుప్పొడి రేణువులు రాలేలా చేస్తుంది. ఇలా రోజుకు రెండు, మూడుసార్లు మొక్కలపై తిప్పడం ద్వారా అధిక దిగుబడి సాధించే ఆస్కారం ఉంది. ఫొటోలూ తీస్తుంది.. పంట విస్తీర్ణం అధికంగా ఉండి.. ప్రతిచోటుకూ రైతులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లను పంపించవచ్చు. దానికుండే ప్రత్యేక పరికరం రైతు సెల్కు ఫొటోతోపాటు మెసేజ్ను పంపిస్తుంది. అంతేకాకుండా నేల పరిస్థితి ఎలా ఉంది..? వాతావరణం ఎలా ఉంది..? వంటి విషయాలను ఎప్పటికప్పుడు రైతుకు అప్డేట్ చేస్తుంది. రసాయన మందును సమానంగా చల్లుతుంది. డ్రోన్లో పిచికారీ చేసే మందు అయిపోయినకొద్దీ.. సెల్ఫోన్లో బ్యాటరీ అయిపోయినట్లు సిగ్నల్ ఇస్తుంది. -
జీపీఎస్ ఆధారిత డ్రోన్స్పై దృష్టి
- పుల్లారెడ్డి కాలేజీ ఈసీఈ విభాగాధిపతి - ముగిసిన వర్క్షాప్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాబోయే రోజుల్లో గ్లోబల్ పోజిషన్ సిస్టమ్(జీపీఎస్) ఆ«ధారిత డ్రోన్స్ను తయారు చేస్తామని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సురేష్రెడ్డి అన్నారు. ప్రస్తుతం నాన్ జీపీఎస్ ఆధారిత డ్రోన్స్, రోటర్స్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్స్ సేవలను భారత సైన్యం వినియోగించే అవకాశం ఉందన్నారు. కళాశాలలో టెక్నికల్ జిజ్ఞాసా–2016 జాతీయ వర్కుషాపు రెండో రోజు కొనసాగింది. ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో 108 కళాశాలల విద్యార్థులు సొంతంగా డ్రోన్స్ తయారు చేసి గాల్లో ఎగుర వేశారు. ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో మ్యాట్ల్యాబ్ వర్కుషాపు నిర్వహించగా..50 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారని హెచ్ఓడీ బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు. మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వాటర్ రాకెట్ను తయారు చేసి విద్యార్థులు ప్రయోగించారు. సివిల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో టోటల్ స్టేషన్ అనే అంశంపై వర్కుషాపు నిర్వహించారు. కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్=2 నెట్వర్కు సిములేటర్–2 అనే అంశంపై వర్కషాపు జరిగినట్లు విభాగాధిపతి డాక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బాలాజీ ప్రశాంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జిజ్ఙాసా–2016 కన్వీనర్ డాక్టర్ పీ.అబ్దుల్ ఖయూమ్ పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి అందాలు డోన్లో నిక్షిప్తం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయ పరిసరాలను డోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. రాజగోపురం, ఘాట్రోడ్డు, అర్జున వీధితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ, అమ్మవారి బంగారు గోపురం, పచ్చదనంతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి అందాలను డోన్ కెమెరాతో బంధించారు. -
ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!
అక్షర తూణీరం ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’ అని మరోసారి సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ముఖతా ‘‘ఆనంద ఆంధ్రప్రదేశ్’’ ఆవిష్కృతమైంది. అంతకు ముందు దోమరహిత రాష్ట్రంగా చేయాలని నిర్భయంగా తీర్మానించారు. దానికిముందు కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి కంకణ బద్ధులైనారు. చక్కని ఆలోచనలు చేస్తున్నారు. వింటుంటే పిచ్చి సంతోషంగా ఉంది. మన నేత ఏమి చెయ్యలేరో చెప్పడం కష్టం. ఆయన తలచుకుంటే డ్రోన్లతో దోమలకు పొగ పెట్టగలరు. ఆనంద ఆంధ్రప్రదేశ్లో భాగంగా పుష్కరాల రేవుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు గజ్జెలు కట్టి, తెరలు తీయనున్నారు. ఒకవైపు నాట్యాలు, ఇంకోవైపు గాన గోష్ఠులు, ఆవైపు కవి సమ్మేళనాలు, ఈవైపు జానపద కళారీతులు - కృష్ణా తరంగాలు నవరసా లొలికిస్తూ సాగిపోతుంటాయి. మల్టీఫ్లెక్స్లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అవి రెక్కలు తొడుక్కుని అమరా వతి పరిసరాల్లో వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నిన్నటి మానిఫెస్టో లక్ష్యం. ఉద్యోగులు, శ్రామికులు, మరీ ముఖ్యంగా రైతులు ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మన తెలుగువారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వీధి కూడళ్ల దగ్గర సిగ్నల్స్ ఇస్తే కళాత్మకంగా ఉంటుంది. అవసరమైతే వారందరికీ సామూహిక శిక్షణ ఇప్పిస్తాం. ‘‘ఆనందమే బ్రహ్మ. ఆనందమే విష్ణువు. ఆనందమే యన్టీఆర్.’’ ఈ మూడోది నేవిన్లేదని ఒక రిక్షా కార్మికుడు వాదనకి దిగాడు. ‘‘ఇప్పుడు విన్నా వుగా’’ అంటూ సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. ‘‘నవ్వులో ఆనందం ఉంది. అదే విధంగా ఆనందంలో నవ్వు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాల’’ అనగానే ‘‘ఆయన నవ్వడం నేనెప్పుడూ చూడనేలేదురా’’ అన్నాడు నిష్టురంగా. ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’అని మరోసారి సర్ది చెప్పాడు. ‘‘ఇది కాదుగాని, చూడగా చూడగా ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్గా మారి పోతోందని నాకు సందేహంగా ఉందండీ’’ అంటూ ఒక పెద్దాయన ఇంద్రకీలాద్రి మొగలో నిలబడి టాపిక్ మార్చాడు. ‘‘అదెలాగ’’ అన్నాను. గోదావరి పుష్కరాలు మహోధృతంగా సాగినాయి. నెల్లాళ్లు ఆధ్యాత్మిక శోభ. దర్భలు, పిండాలు, స్నానాలతో గడిచింది. ఆనక కృష్ణా పుష్కరం. పైగా గోదావరి అంత్య పుష్కరం వచ్చి పడింది. ఆ రెండు పుణ్యనదులు బాబుగారి పుణ్యమా అని సంగమించి మహాతీర్థమై కూచుంది. ఇదంతా ఒక నెలపాటు శ్రాద్ధ విధులతో, మంత్రాలతో తల్లడిల్లింది. రకరకాల హారతులతో మహానది వెలిగిపోయింది. ఇంతలో వినాయక ఉత్సవాలు ఓ రెండువారాలు భక్తిలో జనాన్ని ముంచెత్తాయి. ఆ పందిళ్లలోనే ఇప్పుడు అమ్మవారిని నిలుపుతున్నారు. శరన్నవరాత్రులు! ఇక కొండ మీదా సందడే. కొండకిందా సందడే. ఆయన సామాన్యుడు కాదు. అవసరమైతే బోలెడు కొత్త పండుగలు పుట్టించి ఆధ్యాత్మికాంధ్రప్రదేశం చేయడం ఖాయం’’ అంటూ అక్కడనించే దుర్గమ్మకి దణ్ణం పెట్టాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
డ్రోన్లతో వరద ముప్పునకు చెక్: ఫైబర్ నెట్ డైరెక్టర్లు
చిలకలూరిపేట రూరల్: వరదలు వచ్చినప్పుడు డ్రోన్ల సాయంతో వాస్తవ పరిస్థితులను సమీక్షించుకుని, నష్టం వాటిల్లకుండా చూసుకోగలిగే అవకాశం ఉంటుందని ఏపీ ఫైబర్ నెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వి.కృష్ణ, పి.అంజయ్య, టెక్నికల్ డెరైక్టర్ అట్లూరి రామారావులు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో మంగళవారం విలేకరులతో ఫైబర్ నెట్ డైరెక్టర్లు.. ఇటీవల కుప్పగంజివాగు ఉప్పొంగడంతో దెబ్బతిన్న పంటలను డ్రోన్ల ద్వారా పరిశీలించి, నష్టాలను అంచనావేస్తామని చెప్పారు. నరసరావుపేట మండలంలోని గురవాయపాలెం, ఇస్సాపాలెం, క్రోసూరు, అచ్చంపేట మండలాలు, చిలకలూరిపేట మండలంలోని గంగన్నపాలెం, గోవిందపురం, కావూరు, వేలూరు గ్రామాల్లో డ్రోన్ల ద్వారా వాస్తవ వ్యవసాయ పరిస్థితులు పరిశీలించామని, అధికారులతో సమీక్షి నిర్వహించామని తెలిపారు. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా నష్టం శాతాన్ని కచ్చితంగా అంచనా వేసే వెసులుబాటు ఉంటుందని, రెవెన్యూ రికార్డులను డ్రోన్లకు అనుసంధానం చేయడం ద్వారా పంట పొలాల వివరాలు పూర్తిగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రతి డ్రోను 100 మీటర్ల ఎత్తు, ఒక కిలోమీటరు దూరం ప్రయాణించి అక్కడి పరిస్థితులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియజేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, ఏపీ ఫైబర్ నెట్ మార్కెటింగ్ మేనేజర్ సీహెచ్.శ్రీధర్, మండల వ్యవసాయాధికారి కేవీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఎంపీఈవోలు పాల్గొన్నారు. -
రూ.50 కోట్లతో డోన్ల బోర్డు ‘4.0’
హైదరాబాద్: ఎవరు పడితే వారు డ్రోన్లను వినియోగించకుండా నియత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్లకు ప్రత్యేకంగా బోర్డు ‘4.0’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రూ.50 కోట్ల కార్పొస్ ఫండ్ తో బోర్డు ‘4.0’ను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ఆమోదం తెలిపారు. దీంతో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలు రానున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగానే ఈ బోర్డు పనిచేయనుంది. ఐటీ శాఖ కార్యదర్శి, డీజీపీ సభ్యులుగా ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లతో ఇష్టానుసారం చిత్రీకరిస్తారని, చిత్రీకరణకు ఒక హద్దు ఉండాలని, ఇందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ డ్రోన్ల వల్ల శాంతిభద్రతల విషయంలో కూడా ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. రాష్ర్టంలో డ్రోన్లు ఎవరికి అవసరమైనా బోర్డు ద్వారానే పొందాలని నిబంధనను విధించనున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఉత్సవాలు, బహిరంగ సభలు తదితర కార్యాకలాపాలకు కార్పొరేషన్ ద్వారానే డ్రోన్లను పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ కార్యకలాపాలకు డ్రోన్లను అద్దెకు ఇవ్వనున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాలతో పాటు, ఈ ఏడాది కష్ణా పుష్కరాల్లో డ్రోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పటికీ ప్రై వేట్ రంగంలో డ్రోన్లు అయితే చిత్రీకరిస్తాయి. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే అవసరమైన మేరకే చిత్రీకరించేందుకు నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యలోనే డ్రోన్ల నిర్వహించడం మంచిదేనని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్లను వినియోగిస్తామని ఇటీవల సీఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ మంజూరు
– పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు: డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ కేటాయించారు. నేరాల నియంత్రణకు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించిన పోలీసు అధికారులు ఇకపై డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జనసమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించే అవకాశం ఉంది. కెమెరా నిర్వహణపైన జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు 6వ బెటాలియన్ మంగళగిరిలో శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ డ్రోన్ కెమెరాను రిమోట్తో ఆపరేట్ చేసి పనితీరును పరిశీలించారు. టెక్నాలజీ వాడకంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండే విధంగా డ్రోన్ కెమెరా వాడకాన్ని వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ సి.వి.నరసింహులు, ఆర్ఎస్ఐ నగేష్, ఏఆర్పీసీలు ఓబులేసు, విజయ్కుమార్, ఐటీ కోర్డు టీం పీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీని ప్రత్యేకత: డ్రోన్ కెమెరా 2006లో చైనా దేశస్థులు కనుగొన్నారు (ద జియాన్ ఇన్నోవేషన్) డీజేఐ ప్యాంథమ్ 4 బరువు 1380 గ్రాములు, 800 నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి వెళ్తుంది. 3 నుంచి 5 కిలో మీటర్ల దూరం వరకు రిమోట్, జీపీఎస్ సహాయంతో పనిచేస్తుంది. ట్యాబ్, ఐప్యాడ్, సెల్ఫోన్ సహాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు. -
డ్రోన్లు, కెమెరాలతో పరిపాలన: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో డ్రోన్లు, నిఘా కెమెరాల పర్యవేక్షణలో పరిపాలన(రియల్ టైమ్ గవర్నెన్స్) సాగిస్తామని, ఆ విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రియల్టైమ్ గవర్నెన్స్ విధానం ద్వారా ఇది సాధ్యపడుతుందని, ఆమేరకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఫైబర్ నెట్వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో రియల్టైమ్ గవర్నెన్స్లో డ్రోన్ల వినియోగం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, సర్వైలెన్స్ కెమేరాల పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీని, ఈ విధానంపై అవగాహన కోసం ఒక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాల రూపకల్పనకు నలుగురైదుగురు అధికారులు, నిపుణులతో ఒక కమిటినీ నియమించి దానికి పూర్తి అధికారాలిస్తామన్నారు. ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో నగర స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటుచేసి వాటన్నింటినీ అమరావతిలోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎండీ సాంబశివరావు డ్రోన్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్న సేవల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మంత్రి నారాయణ, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాకే కన్నం వేయబోయిన పాక్ వ్యాపారి!
ఆ దేశం వాళ్లకు మహా అయితే సైకిళ్లు, సూదులు చేయడం తప్ప మరేమీ రాదని అంతా అనుకుంటారు. కానీ, కొన్నాళ్లకు ఏకంగా అణుబాంబులు, ఖండాంతర క్షిపణులు కూడా తయారుచేసి చూపించింది. అంత పరిజ్ఞానం ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ, ఆ దేశ అణు పితామహుడు ఏక్యూ ఖాన్ అసలు విషయం చెప్పేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చోరీ చేయడం, కావల్సిన సామగ్రిని స్మగ్లింగ్ చేయడం ద్వారానే తాము అణుబాబులు చేశామన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు తాజాగా ఆ దేశం డ్రోన్లు తయారుచేయాలని అనుకుంటోంది. కానీ, ఎలా చేయాలో తెలియదు. అందుకే అమెరికా నుంచి ఆ పరిజ్ఞానాన్ని చోరీ చేయడానికి ఓ పాక్ వ్యాపారవేత్త ప్రయత్నించాడు. అక్రమంగా గైరోస్కోపులు సేకరించడానికి ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి అమెరికా కోర్టు 33 నెలల జైలు శిక్ష కూడా విధించింది. సయ్యద్ వఖార్ అష్రఫ్ అనే వ్యక్తి లాహోర్లో ఐ అండ్ ఈ ఇంటర్నేషనల్ అనే సంస్థకు సీఈవో. ఇన్నోవేటివ్ లింక్స్ అనే బూటకపు కంపెనీ పేరుతో గైరోస్కోపులు తీసుకోడానికి అతడు ప్రయత్నించాడు. అందుకోసం వఖార్ ఎ జాఫ్రీ అనే దొంగపేరుతో గైరోస్కోపుల ధరలకు కొటేషన్ ఇవ్వాలని టస్కన్కు చెందిన ఓ కంపెనీని అడిగాడు. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం నియంత్రణలు ఉన్నాయని, అమ్మాలన్నా కొనాలన్నా లైసెన్సు కావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించకోలేదు. చివరకు 18 గైరోస్కోపుల కోసం తప్పుడు పత్రాలు సృష్టించాడు. చివరకు అండర్ కవర్ ఏజెంట్లకు దొరికేశాడు. తాను పాకిస్థాన్ ప్రభుత్వం మిలటరీ కోసమే వీటిని కొంటున్నట్లు చెప్పాడు. పాశ్చాత్యదేశాల నుంచి ఇంతకుముందు లైసెన్సు లేకుండానే తమ దేశం అణు పరిజ్ఞానం కూడా తెచ్చుకుందని అతడు చెప్పాడు. రసాయన లేదా జీవ ఆయుధాలలో ఉపయోగించే రిసీవర్ మాడ్యూళ్లు కూడా తమకు కావాలని తెలిపాడట!! అతగాడు చెప్పిన వివరాలు విని విస్తుపోయిన అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు.. చివరకు అతడిని కోర్టుకు అప్పగించగా, ప్రస్తుతానికి అతడికి 33 నెలల జైలుశిక్ష విధించారు. -
డ్రోన్ సాయంతో పోలవరం పనుల పరిశీలన
- ఆన్లైన్ ద్వారా సమీక్షించిన సీఎం చంద్రబాబు పోలవరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం ద్వారా వర్చువల్ ఇన్స్ట్రక్షన్ పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి గురువారం పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా డ్రోన్ కెమెరా ద్వారా స్పిల్వే, స్పిల్ ఛానల్, రాక్ఫిల్ డ్యామ్, పవర్హౌస్ నిర్మాణ ప్రాంతాలను చిత్రీకరించి వర్చువల్ ఆన్లైన్ విధానానికి అనుసంధానం చేశారు. వాటిని పరిశీలించిన అనంతరం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, హెడ్వర్క్స్ ఎస్ఈ వీఎస్ రమేష్బాబు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు చెరుకూరి శ్రీధర్, బి.ప్రభాకర్ సీఎంతో మాట్లాడారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో పనుల తీరుపై సమీక్షించారు. ఇంకా 21 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్స్ (మట్టి పనులు) చేయాల్సి ఉందని, వీటిని పూర్తిచేసి కాంక్రీట్ పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చేయాలని ఆదేశించారు. డ్యామ్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ను అనుమతి నిమిత్తం కేంద్ర జల వనరుల శాఖ (సీడబ్ల్యూసీ) పంపించామని ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధి తెలిపారు. 24 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదు డంపర్లను తీసుకొచ్చామని, 35 క్యూబిక్ మీటర్ల మట్టిని ఒకేసారి తొలగించగల ఎక్స్కవేటర్ను తీసుకువచ్చామని త్రివేణి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. అనంతరం మంత్రి దేవినేని విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల కమిటీ, పోలవరం అథారిటీ సూచనల మేరకు పనులు చేస్తున్నామన్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఈఈ ఎన్.పుల్లారావు, ఎల్ అండ్ టీ ప్రతినిధి రవికుమార్, బావర్ ప్రతినిధి శామ్యూల్ పాల్గొన్నారు. -
పోలేరమ్మజాతరలో డ్రోన్ నిఘా
వెంకటగిరి : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఆయన నివాసంలో మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పాలకేంద్రం సెంటర్, క్రాస్రోడ్డు, కాశీపేట, కాంపాళెం, పాతబస్టాండ్, పోలేరమ్మ ఆర్చి, ఆర్టీసీ బస్టాండ్ తదితర 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జాతరలో వీఐపీ పాస్ల విధానం రద్దు చేస్తామని తెలిపారు. రాజాల సారెతీసుకొచ్చే సమయంలో 15 మందికి మించి వస్తే అనుమతించమన్నారు. అంతకుముందు సూళ్లూరుపేట సీఐ విజయకష్ణ, ఎస్సై రహీమ్రెడ్డిలు జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లలో భాగంగా ముందస్తుగా బందోబస్తు నిర్వహణ, భక్తులకు దర్శన ఏర్పాట్లలో అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలను స్థానిక పోలీస్ అధికారులతో చర్చించామన్నారు. -
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
-
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ప్రజలు ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కొండ కోనల్లో, అటవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సకాలంలో వైద్య సౌకర్యాలు అందక అకాల మృత్యువాత పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటే పదుల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా, వారికి సరైన ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులో పరిష్కార మార్గం ఏమిటీ? దీనికి మిచిగాన్లోని వాయు ఏరియల్ సొల్యూషన్స్ కంపెనీ ఓ మంచి పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని ల్యాబ్లకు క్లినికల్ ల్యాబ్ శాంపిల్స్ను డ్రోన్ల ద్వారా పంపించవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించింది. గత జూలై 27వ తేదీన ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రజల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ను డ్రోన్ ద్వారా సెంట్రల్ ల్యాబ్కు పంపించింది. ప్రపంచంలో క్లినికల్ శాంపిల్స్ను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి డ్రోన్ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను వాయు ఏరియల్ సొల్యూషన్స కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లకు సరకులను చేరవేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని ఇది వరకే చాటిచెప్పాయి. అయితే డ్రోన్లను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలతోపాటు ప్రమాదాలు కూడా పొంచి ఉండడంతో వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగిన అనుమతులు మంజూరు చేయడం లేదు. సామాన్య ప్రజల అవసరాల కోసం డ్రోన్లను వినియోగించడాన్ని అనుమతించినట్లయితే డ్రోన్లను ఉపయోగించి టైస్టులు దాడులకు పాల్పడే ఆస్కారముందనేది ప్రభుత్వాల ఆందోళన. -
ఫేస్బుక్ డ్రోన్
-
శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలు
-
శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలు
– ‘ఎర్ర’స్మగ్లర్లను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ – పర్వత శిఖరాలపై 5 కిమీ రేంజ్ ఫోకస్ కెమెరాలు – ప్రతిపాదనలు తయారుచేసిన అటవీ శాఖ – డ్రోన్ల పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అధికారులు శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలను వినియోగించనున్నారు. వీటిద్వారా 5 కిలోమీటర్ల రేంజిలో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టడమే కాకుండా అడవుల్లో జరిగే అక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ముందుగా డ్రోన్ల ద్వారా శేషాచలంపై నిఘాను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం చెన్నై టెక్వేర్ సిస్టం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రెండు డ్రోన్లను తెప్పించి పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన జరిపారు. గగనతలంలో డ్రోన్లు తీసిన ఫోటోలను పరిశీలించారు. తొలి విడతలో 6 డ్రోన్లు గురువారం సమావేశమైన టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు, అటవీశాఖ సీసీఎఫ్వో చలపతిరావు శేషాచలంపై ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు కట్టించడానికి డ్రోన్లు, లేజర్ కెమెరాల వాడకం అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. చిత్తూరు జిల్లా కరకంబాడి, మంగళం, భాకరాపేట, వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో మొత్తం 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కూలీల చొరబాట్లు, స్మగ్లర్ల రవాణా తగ్గడం లేదు. పైగా ఇటీవల కాలంలో అక్రమ రవాణా బాగా పెరిగింది. దీంతో ఇటీవల తిరుపతిలో సమావేశమైన పోలీస్, టాస్క్ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన డ్రోన్లు, లేజర్ కెమెరాలను వాడి వాటి ద్వారా స్మగ్లర్ల కదలికలను గుర్తించాలని భావించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న కెమెరాలతో పాటు 5 కిలోమీటర్ల రేంజి ఉన్న లేజర్ బీమ్ కెమెరాలను కొండ శిఖరాలపై ఏర్పాటు చేయడం ద్వారా అవి రాత్రింబవళ్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ లేజర్ కిరణాలతో ఫోటోలు తీస్తుంటాయి. ఎక్కడ స్మగ్లర్లు ఉన్నా, ఎర్రచందనం చెట్లు నరుకుతున్నా వెంటనే ఆయా బొమ్మలను కంట్రోల్ రూంకు పంపుతాయి. ఇవన్నీ శాటిలైట్తో అనుసంధానం చేసి ఉండటం వల్ల పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఐవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటికితోడు 20కి పైగా లేజర్ బీమ్ కెమెరాలు, ఆరు డ్రోన్లను నిఘాకోసం వినియోగిస్తే 50 శాతం ఎర్రస్మగ్లర్లను అరికట్టవచ్చన్నది అధికారుల ఆలోచన. -
పుష్కరాల్లో డ్రోన్ ఎంతో కీలకం
గుంటూరు: కృష్ణా పుష్కరాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో బుధవారం డ్రోన్ పనితీరును ఆయన పరిశీలించారు. పుష్కరాల సమయంలో వీటిని వినియోగించనున్న బృందానికి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. డ్రోన్ ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే ఆ సమాచారాన్ని అధికారులు అందజేస్తారన్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచవచ్చని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా వచ్చే సమాచారం కమాండ్ కంట్రోల్రూమ్కు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
డ్రోన్తో భూ సర్వే
♦ ఫార్మాసిటీ భూముల్లో సర్వే ముమ్మరం ♦ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే ♦ హద్దులను గుర్తిస్తున్న టీఎస్ఐఐసీఓ ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం మండలాల్లో తీసుకోవడానికి నిర్ణయించిన 10 వేల ఎకరాల్లో టీఎస్ఐఐసీ సంస్థ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసుకున్న కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో సర్వే పూర్తి చేసిన ఏజెన్సీ ప్రతినిధులు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో సర్వే చేశారు. రిమోట్తో డ్రోన్ (చిన్న విమానం) ను భూములపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేశారు. యాచారం : ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవా లనుకున్న భూముల్లో టీఎస్ఐఐసీఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. కందుకూరు - యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను తీసుకున్న టీఎస్ఐఐసీఓ.. ఇప్పటికే రెండు వేల ఎకరాలకు పైగా అర్హులైన రైతులకు పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేసింది. తాజాగా మిగిలిన భూముల్లో సాంకేతిక పరంగా సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికే కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఏజెన్సీ ప్రతినిధులు సర్వే పూర్తి చేశారు. గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లలో రిమోట్ సాయంతో డోన్ (చిన్న విమానం)ను ఉపరితలంపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేయించారు. డ్రోన్ ప్రతిసారి రెండు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లీ ఆ భూముల హద్దులను తన కెమెరాలో రికార్డు చేసింది. సాంకేతిక సిబ్బంది డ్రోన్ తిరుగుతున్న ప్రదేశాన్ని ల్యాప్టాప్ల్లో చూస్తూ రికార్డు చేశారు. ఇదే విషయమై టీఎస్ఐఐసీఓ ప్రతినిధి పద్మజను సంప్రదించగా ఫార్మాసిటీ కోసం తీసుకోనున్న భూ ముల్లో అటవీ భూముల హద్దులు, అసైన్డ్, పట్టా భూముల హద్దులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకు...
వాషింగ్టన్ః సముద్ర ఆస్తుల రక్షణ, నిఘాకోసం భారత్ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. సరిహద్దుల్లోకి చొచ్చుకొని వచ్చి ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు ఆధునిక డ్రోన్లు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు దేశాలు చేస్తున్న ఆక్రమణలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణంచింది. అమెరికానుంచి అధునాతన నిఘాడ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమౌతోంది. హిందూ మహాసముద్రంలోని ఆస్తుల రక్షణ, నిఘా కోసం పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకోసం అమెరికాకు తాజాగా అభ్యర్థన లేఖ పంపింది. ఇండియా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజెమేను అమెరికా ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించిన పదిహేను రోజుల్లోనే ఈ కదలిక ప్రారంభమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సందర్భంలో భారత్ ను ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించడంతో కొత్త ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ముంబై తీవ్రవాద దాడివంటి అవాంఛనీయ చొరబాట్లు ఇకపై జరగకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సముద్ర పెట్రోల్ ప్రిడేటర్ గార్డియన్ మానవ రహిత వైమానిక వాహనాన్ని జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ఎత్తులోను, విస్తృత ప్రాంతంలో సైతం నిఘాకు పనికివచ్చే ఐఎస్ ఆర్ సామర్థ్యం కలిగిఉన్న ఈ డ్రోన్లు హిందూ మహా సముద్రంలో భారత తూర్పు, పశ్చిమ తీరాల్లోని సముద్ర ఆస్తులను పరిరక్షించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. 50,000 అడుగుల ఎత్తులో, 24 గంటలపాలు నిరవధికంగా పనిచేసే అధునాతన డ్రోన్లు చిన్నపాటి ఫుడ్బాల్ ఆకారంలో ఉంటాయని, ఇంతకు ముందే ఇండియా ఇటువంటి డ్రోన్లు కొనేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఇండియాకు ఎంటీసీఆర్ లో భాగస్వామ్యం లేకపోవడంతో ఒబామా ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసి పుచ్చింది. ప్రస్తుతం పదిహేను రోజులక్రితం ఇండియా ఎంటీసీఆర్ సభ్యత్తం పొందడంతో మరోసారి అమెరికాకు అభ్యర్థనను పంపింది. ఈ డ్రోన్లు ఉగ్రదాడుల చర్యలను దూరంనుంచే పసిగట్టగల్గుతాయి. అంతేకాక కదిలే వాహనాలు, వస్తువులను సులభంగా గుర్తు పట్టగల్గడంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. -
సైబరాబాద్ పోలీసుల చేతిలో ‘డ్రోన్’ అస్త్రం
ప్రముఖుల భద్రత, బందోబస్తు అంశాలతో పాటు కీలక సమయాల్లో ట్రాఫిక్ స్థితిగతుల్ని అధ్యయనం చేయడం కోసం సైబరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరా ఖరీదు చేశారు. రూ.7 లక్షలు వెచ్చించి సమీకరించుకున్న దీన్ని బుధవారం కమిషనరేట్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరా ఇటీవల ప్రారంభించిన సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (సీసీసీ) అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది. దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) సీసీసీలోని కంప్యూటర్లకు అందిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సీసీసీకి అనుసంధానించి ఉన్న ఇతర కెమెరాలు అందించే సమాచారం కంటే డ్రోన్ కెమెరా ద్వారా లభించే విజువల్స్ మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ కెమెరా పనితీరును సైబరాబాద్ అధికారులు బుధవారం గచ్చిబౌలి కమిషనరేట్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీని నిర్వహణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. -
హైదారాబాద్ లో 'డ్రోన్' భద్రత
హైదరాబాద్: ప్రముఖుల భద్రత, బందోబస్తు అంశాలతో పాటు కీలక సమయాల్లో ట్రాఫిక్ స్థితిగతుల్ని అధ్యయనం చేయడం కోసం సైబరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరా ఖరీదు చేశారు. రూ.7 లక్షలు వెచ్చించి సమీకరించుకున్న దీన్ని బుధవారం కమిషనరేట్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరా ఇటీవల ప్రారంభించిన సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (సీసీసీ) అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది. దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) సీసీసీలోని కంప్యూటర్లకు అందిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సీసీసీకి అనుసంధానించి ఉన్న ఇతర కెమెరాలు అందించే సమాచారం కంటే డ్రోన్ కెమెరా ద్వారా లభించే విజువల్స్ మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ కెమెరా పనితీరును సైబరాబాద్ అధికారులు బుధవారం గచ్చిబౌలి కమిషనరేట్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీని నిర్వహణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. -
ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది!
బీజింగ్: చైనాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయం మీదుగా ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంలో అధికారులు ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న చెంగ్డూ షాంగ్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉన్న అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం మీదుగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియని ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న 55 విమానాలను కొంత సమయం పాటు అలాగే నిలిపేశారు. ప్రమాదమేమీ లేదని నిర్థారించుకున్న తరువాత విమానాలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరాయి. ఆ డ్రోన్కు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఓ డ్రోన్ మూలంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగటం ఇదే తొలిసారని అంటున్నారు. -
డ్రోన్ల ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక
బెంగళూరు: కర్ణాటక హోంశాఖలో డ్రోన్ (అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ - యూఏఈ) దళం ఏర్పాటైంది. మొత్తం 20 మంది సిబ్బంది కలిగిన ఈ విభాగం వివిధ రకాల నిఘా విషయాలపై దృష్టి సారించనుంది. ఓ రాష్ట్ర పోలీసు శాఖలో డ్రోన్ దళం ఏర్పాటు కావడం దేశంలో ఇదే మొదటిసారి. దక్షిణ కొరియా నుంచి ఒక్కొక్కటి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 12 డ్రోన్లను కర్ణాటక కొనుగోలు చేసింది. 18.5 మెగాపిక్సల్స్ సామర్ధ్యం కలిగిన ఫాంటం మోడల్ కు చెందిన ఈ డ్రోన్లు రాత్రుళ్లు కూడా ఫోటో, వీడియోలను చిత్రించగలవు. ప్రస్తుతం వీటిని రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు, గనుల తవ్వకాలపై నిఘా ఉంచడానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ మాట్లాడుతూ.. డ్రోన్ వినియోగంపై ఇప్పటివరకు 20 మంది సిబ్బందికి శిక్షణనిచ్చినట్లు తెలిపారు. వీరు కొప్పళ్, యాదగిరి, బళ్లారి, బీదర్, రాయచూర్, కల్బుర్గి జిల్లాల్లో విధులు నిర్వస్తున్నట్లు వివరించారు. -
విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్
బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన విమానాన్ని అనుమానిత డ్రోన్ ఢీకొట్టింది. యూరోప్లోనే చాలా రద్దీగా ఉండే విమానాశ్రయమైన హిత్రూ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. 137 మంది ప్రయాణికులు, విమానసిబ్బందితో ఎయిర్ బస్ ఏ320 విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్, విమానాన్ని ఢీకొట్టినట్టు గమనించిన పైలెట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం సురక్షింతంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే సిబ్బంది తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి హాని జరగకపోవడంతో మరుసటి ప్రయాణానికి ఎయిర్ బస్ ఏ320 బయలుదేరింది. అయితే గడచిన మూడు నెలల్లో యూకేలోనే ఇలాంటివి 23 సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు, ఢ్రోన్లను ఢీకొంటే కలిగే తీవ్రపరిణామాల గురించి తెలియని వారే ఎదో సరదా కోసం ఇలా చేస్తున్నారని బ్రిటీష్ పైలట్స్ అసోసియేషన్ అధికారి స్టీవ్ లాండెల్స్ తెలిపారు. విమానానికి దగ్గరగా డ్రోన్లను తీసుకురావడం చట్ట పరంగా నేరమని పేర్కొన్నారు. -
రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది. తొలిసారి డ్రోన్లతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ)ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించనున్నారు. డీఎఫ్సీ కారిడార్లో మూడు రోజులు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పరిశీలించి దీని ద్వారా స్థాయీ నివేదిక త్వరగా తయారు చేయవచ్చని డీఎఫ్సీ ఎండీ ఆదేశ్ శర్మ తెలిపారు. -
డ్రోన్లే డెలివరీ బాయ్స్..
న్యూయార్క్: తేనెపట్టులాంటి భవనం.. తేనెటీగలను తలపించే డ్రోన్లు.. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే ఆకాశహర్మ్యం.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఉండే బిల్డింగ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 1,400 అడుగులు(423 మీటర్లు). ఇంతకీ ఈ బిల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా.. వస్తువుల డెలివరీకి.. అలాగే డ్రోన్ల డిపోగానూ పనికొస్తుంది. ఈ టవర్ పేరు ‘ద హైవ్’. ప్రస్తుతానికి ఇది ఓ కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. కానీ ఏదో ఒక రోజు వాస్తవ రూపం దాలుస్తుందని దీని రూపకర్తలు చెపుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సుల్వానియాలో చదువుతున్న హదీల్ అయేద్ మహమ్మద్(25), యిఫెంగ్ జావో(24), ఛెంగ్డా జూ(24) అనే ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ యూనివర్సిటీ కోర్సులో భాగం గా ఈ హైవ్ డిజైన్ను రూపొందించారు. న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్ నడిబొడ్డున ఈ టవర్ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న ఒక రెసిడెన్షియల్ టవర్ను కాస్తా.. సిటీకి సంబంధించి డ్రోన్ డిపోగా మార్చి నగరానికి మణిహారంగా మార్చాలనేది వీరి ప్రధాన ఉద్దేశం. సమీప భవిష్యత్తులో హైస్పీడ్ డెలీవరీలను చేసేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేశారు. అమెజాన్, గూగుల్ ప్రస్తుతం డ్రోన్ డెలివరీ సర్వీసుల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అమెజాన్ తమ ఉత్పత్తులను 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే డెలీవరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఇది ఒక ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని గత వేసవిలో కాంగ్రెస్కు తెలిపింది. మరోవైపు డ్రోన్ డెలీవరీ సర్వీసులపై ఉన్న నియంత్రణలను త్వరలోనే ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ అవసరాలు.. సమీప భవిష్యత్లో అవసరాలు పరిగణనలోకి తీసుకుని ఈ కాన్సెప్ట్ రూపొం దించామని మహమ్మద్ చెప్పారు. వెర్టికల్ హైవే మోడల్లో ఈ టవర్ను రూపొందిం చామన్నారు. ఈ ప్లాన్లో నో ఫ్లై జోన్స్, హైస్పీడ్ ట్రాన్సిట్ ఏరియాలు, లో స్పీడ్ లోకలైజ్డ్ ట్రాఫిక్ మొదలైన ప్లాన్లను కూడా పొందుపరిచారు. షేప్, సైజ్ ఆధారంగా తొమ్మిది భిన్నమైన డ్రోన్లు ఈ బిల్డింగ్పై నిలిపేలా ఈ కాన్సెప్ట్ రూపొందించారు. ఆర్కిటెక్చర్ మ్యాగజీన్ ఈవోలో నిర్వహించిన వార్షిక ఆకాశహర్మ్యాల కాంపిటీషన్లో 489 ఎంట్రీలు పోటీపడగా.. ఈ విద్యార్థులు రూపొందించిన ద హైవ్ కాన్సెప్ట్కు సెకండ్ ప్లేస్ దక్కడం విశేషం. -
క్యాచ్ ఇట్!
స్పెయిన్ రాజకుటుంబం ప్రైవసీకి డ్రోన్లతో తెగ ముప్పొచ్చిపడిందట. రాజ కుటుంబీకుల ఎక్స్క్లూజివ్ ఫోటోల కోసం అక్కడి టాబ్లాయిడ్లు డ్రోన్లను ప్రయోగిస్తున్నాయట. భద్రతాపరంగానూ వీటితో ముప్పు ఎదురయ్యే అవకాశాలుండటంతో చివరికి డ్రోన్లను అరికట్టడానికి రెండు డేగలను ఉద్యోగంలో పెట్టుకోవాలని రాజు ఆరో ఫిలిప్ డిసైడయ్యారట. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లను పట్టి నేలకు తేవడంలో రెండు నెలలు ప్రత్యేకశిక్షణ పొందిన డేగలను ఇప్పుడు రాజకుటుంబం రక్షణకు వినియోగిస్తున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ శివార్లలో ఉండే రాజభవనం ‘జర్జుయెలా’ ఇప్పుడిక డేగకన్నుల పహారాలో ఉందన్న మాట. -
డ్రోన్లలో కీటకాల టెక్నాలజీ
లండన్: ఎంతో వేగంతో దూసుకొచ్చే కీటకాలు చెట్లకుండే చిన్ని రంధ్రాల్లోకి అంత నేరుగా ఎలా దూసుకుపోతాయి? దట్టమైన అడవుల్లో ఎగురుతున్నా వేటికీ తాకకుండా అంత కచ్చితంగా తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తల్లో కొత్త ఆలోచనలకు పురుడుపోస్తున్నాయి. డ్రోన్లలో కూడా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తే ఇక వాటిని మనిషి ఆపరేట్ చేయాల్సిన అవసరమే ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసం కీటకాల కళ్లపై పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. దట్టమైన అడవుల్లో ఎంత వేగంగా దూసుకుపోయినా చిన్నపాటి ప్రమాదాన్ని కూడా కీటకాలు ఎదుర్కోకపోవడానికి కారణం వాటి కంటి నిర్మాణమేనని గుర్తించారు. కాంతి తీవ్రతను వేగంగా అంచనా వేయగలశక్తి కీటకాల కళ్లకు ఉందని, అందుకే అవి తమ గమ్యాన్ని అంత కచ్చితంగా చేరతాయని చెబుతున్నారు. 360 డిగ్రీలు చూడగల కీటకాల కంటి నిర్మాణాన్ని పోలిన కెమెరాలను డ్రోన్లకు అమర్చి, వాటి సంకేతాల సాయంతో అవి ప్రయాణించేలా చేయగలిగితే డ్రోన్లు సైతం మనుషుల సాయం లేకుండానే కచ్చితమైన వేగంతో గమ్యాన్ని చేరతాయంటున్నారు. అయితే ఇది సాకారం కావడానికి పది నుంచి పదిహేనేళ్లు పట్టొచ్చని స్వీడన్లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
యమహా నగరి.. కోల్కతా పురి
'నేతాజీ పుట్టిన, గీతాంజలి పూసిన.. ఆ వంగ భూతలం.. భతరజాతికి మకుటం..' అంటూ కోల్ కతా ఉన్నతిని కీర్తించారు తెలుగు సినీ కవి వేటూరి. ఆయనలాగే మరెందరో కవులు, కళాకారులు.. ఆ మహానగర రసహృదయధారను ఒడిసిపట్టి చరితార్థులయ్యారు. ఇప్పుడు పాత ఘాటువాసనల నడుమ అదే కోల్ కతా శోభను సరికొత్త కోణంలో చూపే ప్రయత్నం చేశాడు యువ ఫొటోగ్రాఫర్ సందీప్ డే. అత్యాధునిక డ్రోన్ సహాయంతో గంగాతీరంలోని ఆ మహానగరాన్ని, అక్కడి కొండగుర్తుల్ని కొత్తగా చూపుతూ 'వాకింగ్ అప్ విత్ కల్ కతా' పేరుతో ఆయన రూపొందించిన వీడియో బెంగాలీలేకాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోల్ కతా అభిమానుల్ని అలరిస్తోంది. మొదట షహీద్ మినార్ ను అల్లంత ఎత్తునుంచి, ఆ తర్వాత విక్టోరియా మహల్, సెయింట్ పాల్స్ కాథడ్రల్, గంగానడిపైనున్న హౌరా వారధి, విద్యాసాగర్ సేతుల అందాలను మీరూ వీక్షించండి.. -
డ్రోన్ సర్వేపై గందరగోళం
విజయవాడ : నగర గగనతలంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని వీధులు మొదలుకొని ఇళ్ల లెక్కింపు వరకు అన్నింటిని డ్రోన్లలో అమర్చిన కెమెరాల్లో నగరపాలక సంస్థ అధికారులు బంధిస్తున్నారు. వాటి ఆధారంగా భారీగా సొమ్ము చేసుకునే యత్నాల్లో ఉన్నారు. దీని కోసం ముందస్తుగా రూ.5.60 కోట్లు ఖర్చు పెట్టడానికి అంగీకారం కుదుర్చుకోవటంఇప్పుడచర్చనీయాంశమైంది. నగర సగటు జీవికి డ్రోన్లపై కనీస అవగాహన లేదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దీనిని నిర్వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయం హాట్ టాపిక్గా మారి ప్రతిపక్షాలు, అధికారుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంద అసెస్మెంట్ నంబర్ల నూరు శాతం గుర్తింపే లక్ష్యం... విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారింది.ఈ క్రమంలో నగరంలో జనాభా రోజురోజుకీ పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఉన్న ఇళ్ల సంఖ్యకు, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యకు కొంత వ్యత్యాసం ఉందనేది నగరపాలక సంస్థ అధికారుల అభిప్రాయం. దీంతో అన్ని ఇళ్లను గుర్తించి, అసెస్మెంట్లు సమగ్రంగా పరిశీలిస్తే ఇళ్ల సంఖ్య, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరిగే అవకాశముందనేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా నగరంలో డ్రోన్ సర్వేకు గత ఏడాది అక్టోబర్లో తెర తీశారు. అసెస్మెంట్ నంబర్లను నూరు శాతం గుర్తించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిపై అధ్యయనం చేసి డ్రోన్ సర్వే ఫలితాలు తెలుసుకున్న నగర కమిషనర్ వీరపాండియన్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. సింగపూర్కు చెందిన పేజ్ యూఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేయటానికి ముందుకొచ్చి రూ.5.60 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు అందించగా, బీవోటీ ప్రాతిపదికన సదరు కంపెనీతో గత ఏడాది నవంబర్ 23న ఒప్పందం చేసుకున్నారు -
శక్తివంతమైన యువతి సంప్రీతి..!
ముఫ్పై ఏళ్లు కూడ నిండని ఆమె... అత్యంత ప్రతిభావంతుల జాబితాలో నిలిచింది. అండర్ వాటర్ డ్రోన్స్ ను అభివృద్ధి పరచి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జీపీఎస్ పని చేయని సముద్రాంతర భాగాల్లో కూడ సులభంగా తిరుగుతూ అక్కడి విశేషాలను అన్వేషించే చిన్నపాటి పరికరాన్ని సృష్టించి ఫోర్బ్స్ టాప్ 30 శక్తివంతుల్లో ఒకతెగా పేరు సంపాదించింది. కోల్ కతాకు చెందిన 28ఏళ్ళ సంప్రీతి భట్టాచార్య మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్ డీ చేసింది. అత్యంత సులభంగా అన్వేషించే చిన్నపాటి డ్రోన్ ను కనిపెట్టి ప్రపంచంలోనే ప్రతిభావంతుల సరసన చేరింది. జీపీఎస్ పనిచేయని ప్రదేశాల్లో, సముద్రంలోని నీటి అడుగు భాగంలో అన్వేషణ చేయడంతోపాటు, డేటాను మ్యాప్ చేసే డ్రోన్ ను రూప కల్పన చేసి అత్యంత శక్తివంతమైన యువతిగా పేరు తెచ్చుకుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండి, సుమారు ఫుడ్ బాల్ పరిమాణంలో ఉండే ఓ చిన్న స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ ను మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసి వార్తల్లోకెక్కింది. కోల్ కతాలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయంనుంచి ఇంజనీరింగ్ అభ్యసించిన సంప్రీతి... తరువాత ఓహియోస్టేట్ యూనివర్శిటీ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఎంఐటీలో రోబోటిక్స్ పై అధ్యయనం చేసింది. ప్రస్తుతం సముద్రాంతరాల్లో, నీటి అడుగు భాగంలో చమురు, పర్యావరణ పర్యవేక్షణ, అన్వేషణా కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ (AUV) అనే చాలా ఖరీదైన మిషన్ ఆధారిత పరికరాన్ని వినియోగిస్తున్నారు. పైగా ఆ అతి పెద్ద మెషీన్ తో సముద్రంలోని రోజువారీ విషయాలను, పర్యావరణాన్నిఅధ్యయనం చేసే అవకాశం కూడ ఉండదు. ఇదే విషయాన్ని గమనించిన సంప్రీతి సముద్రాల్లో సులభంగా తిరిగి అక్కడి ప్రతివిషయాన్నీ పరిశీలించే అతి చిన్న డ్రోన్ ను అభివృద్ధి పరిచింది. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మార్పును సముద్రాంతరాల్లో డేటాను సేకరించడం సులభమౌతుందని చెప్తోంది. అండర్ వాటర్ నేవిగేషన్ అనేక సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చిందని, అయితే ఆధునిక పరిశోధనల ద్వారా రూపొందించిన తన డ్రోన్ గూగుల్ మ్యాప్ లా త్వరితగతిన విషయాన్ని సేకరించే అవకాశం ఉంటుందని సంప్రీతి చెప్తోంది. అంతేకాక అతి చిన్న, సూక్ష్మమైన వస్తువులను, జీవులను కూడ ఇది గుర్తిస్తుందని, దీంతో నీటి అడుగుభాగాన ఉండే కాలుష్యాన్ని కూడ గుర్తించే అవకాశం ఉందని చెప్తోంది. జలజీవితాన్ని అధ్యయనం చేయడంలో ఈ డ్రోన్లు గంటకు వంద చదరపు కిలోమీటర్ల వరకు కవర్ చేస్తాయని, లోతైన సముద్రాల్లో కూడ అపారమైన ఒత్తిడిని తట్టుకుని, ఈతకొడుతూ విషయాలను గుర్తిస్తాయని వెల్లడించింది. తన డ్రోన్ ను వ్యాపారాత్మకం చేసే ఉద్దేశ్యంలో ఉన్న సంప్రీతి ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. అందులో భాగంగానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఎంఐటి 100కె. డాలర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పోటీలో టాప్ 8 గా నిలిచి, 15,000 డాలర్లను ప్రైజ్ గా కూడ గెలుచుకుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, చిన్న వయసులోనే ప్రయోగాలను నిర్వహిస్తున్న సంప్రీతి యువలోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. -
చైనాపై నిఘాకు 100 డ్రోన్లు!
వాషింగ్టన్: భారత్ కు అప్పుడప్పుడ తలనొప్పిగా మారుతున్న చైనా దుశ్చర్యల నుంచి బయటపడేందుకు భారత్ ఆలోచన చేస్తుంది. చైనా సైన్యం చేస్తున్న ఆగడాలను, సరిహద్దుల్లో చేస్తున్న నిర్వాహకాలను ఎప్పటికప్పుడు పసిగట్టి, అవసరం అయితే, గట్టి హెచ్చరికలు కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా నుంచి అత్యాధునిక మానవ రహిత విమానాలైన డ్రోన్ లను కొనుగోలుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలను డ్రోన్ల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. ఆయుధ సహిత డ్రోన్లతోపాటు కేవలం నిఘాకు మాత్రమే ఉపయోగించే 100 డ్రోన్లను కొనుగోలుచేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. సమావేశాలు, సదస్సుల సమయంలో భారత్ కు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించే చైనా అప్పుడప్పుడు మాత్రం సరిహద్దుల్లో చెలరేగిపోతూ ఉంటుంది. కవ్వింపు చర్యలకు దిగుతుంటుంది. భారత్ సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా అప్పుడప్పుడు భారత్ మిలటరీ క్యాంపులపై దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దులో భారీ మొత్తంలో డ్రోన్లను భారత్ ఉపయోగించాలనుకుంటున్నట్లు సమాచారం. వీటితోపాటు ప్రిడేటర్ ఎక్స్ పీ డ్రోన్లను కూడా కొనుగోలు చేసి దేశ అంతర్గత భద్రతకు ఉపయోగించనుంది. ఇవి ఉగ్రవాదుల దాడుల వ్యూహాలను ముందే పసిగట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి అమెరికా అధికారులతో చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభం అయినట్లు సమాచారం. -
ఢిల్లీకి గగనతల దాడుల ముప్పు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశముందని, డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారామోటార్లతో దాడులు చేయవచ్చునని అప్రమత్తం చేసింది. ఢిల్లీలో అత్యంత భద్రతా ఉండే 15 కీలక ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హోంశాఖ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హస్తినలో ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపడుతున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) 'అన్ఫ్రెండ్లీ'గా గుర్తించే ఏ ఎగిరే వస్తువునైనా (ఫ్లయింగ్ అబ్జెక్ట్) కూల్చేందుకు భద్రతా సంస్థలకు అనుమతి ఇచ్చారు. ఉగ్రవాదుల నుంచి తీవ్రస్థాయి ముప్పు ఉంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో నార్త్ బ్లాక్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్, పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు, దాడులను తప్పికొట్టేందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఈ సమావేశంలో హోంమంత్రిత్వశాఖ కోరిందని సమాచారం. ముఖ్యంగా ఢిల్లీలోని కీలక ప్రాంతాలైన ప్రధానమంత్రి నివాసం, రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి, హోంమంత్రి నివాసాలు, రాజ్పథ్ చుట్టపక్కల ప్రాంతాలు, ఇండియా గేట్, సీబీఐ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి భద్రతా సంస్థల కార్యాలయాలున్న సీజీవో కాంప్లెక్స్ లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 'దేశంలోనే అత్యంత సున్నితమైన మెట్రో నగరం ఢిల్లీ. పలు ఉగ్రవాద సంస్థల నుంచి హస్తినకు ముప్పును ఎదుర్కొంటున్నది. గగనతలం నుంచి కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్టు తాజాగా భద్రతా ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం.. కీలకాశంగా మారింది. దీంతో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది' అని సీనియర్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. -
డ్రోన్లు పూడ్చేస్తాయి..
గుంతలమయమైన రోడ్లతో ఇబ్బందిపడుతున్నారా..? బైక్పై వెళితే మీ నడుముకు గ్యారంటీ లేకుండా పోతోందా..? ఎవరి సాయం లేకుండా కేవలం డ్రోన్లతోనే ఆ గుంతలు పూడ్చేందుకు, ఎప్పటికప్పుడు రహదార్లపై కన్నేసి ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బ్రిటన్కు చెందిన లీడ్స్ యూనివర్సిటీ రహదార్ల మరమ్మతులకు ఉపయోగించేందుకు డ్రోన్లకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసింది. రోడ్లపై ఉన్న పగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూడ్చేందుకు మూడు రకాల డ్రోన్లను తయారుచేసినట్లు యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఫిల్ పర్నెల్ పేర్కొన్నారు. ఎగురుతూ వెళ్లే ఈ డ్రోన్లు చిన్న చిన్న పగుళ్లను కూడా గుర్తించగలవని చెబుతున్నారు. రహదారిలో ఏర్పడిన గుంతలకు మాత్రమే ఇలాంటి డ్రోన్లను పరిమితం చేయకుండా వీధి దీపాలు, మురికి నీటి కాలువల లీకేజీలు గుర్తించేందుకు కూడా ఉపయోగించాలని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. -
పార్లమెంట్ సమీపంలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో విజయ్ చౌక్ వద్ద డ్రోన్లను శనివారం పోలీసులు గుర్తించారు. దీంతో పార్లమెంట్ వద్ద భద్రతను అధికారులు పటిష్టం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంట్ లోని నార్త్, సౌత్ బ్లాక్ మీదుగా వెళ్లిన డ్రోన్ ను అక్కడున్న వారు గుర్తించారు. అది నో ఫ్లైయింగ్ జోన్ కావడంతో పోలీసులు ఈ సంఘటన పై అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాలకొండ ఉత్సవాలకు డ్రోన్ కెమెరాతో నిఘా
శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికారులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కెమెరా ఆలయంపైన విహరిస్తూ ఆలయ పరిసరాలను చిత్రిస్తుంది. ఈ నిఘా కెమెరాను రిమోట్తో ఆపరేటింగ్ చేస్తారు. ఐదు నిమిషాలు ఛార్జీంగ్ పెట్టడం వల్ల 20 నిమిషాల పాటు పని చేస్తుంది. అమ్మ వారి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు డ్రోన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.