fake documents
-
రూ. 100 కోట్ల భూమికి ఎసరు.. ఎలా కనిపెట్టారంటే..?
హైదరాబాద్: దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు పన్నిన పన్నాగాన్ని అధికారులు గుర్తించారు. స్థలాన్ని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులపై పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ (pet basheerabad police station)లో కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..కుత్బుల్లాపూర్ (Quthbullapur) మండల పరిధిలోని సర్వేనెంబర్ 48లో యూఎల్సీ భూమి 5,800 గజాలు జీడిమెట్ల (Jeedimetla) పేట్ బషీరాబాద్ గ్రామ పరిధిలో ఉన్నట్లు పాత రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి హెచ్ఎండీఏ (HMDA) నుంచి 15 ఫ్లోర్లకు అనుమతులు పొంది నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2001లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులు నిర్వహించిన సర్వే మ్యాప్తో పాటు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం పరిశీలించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్కు నివేదించారు.సమగ్ర విచారణ జరిపించి అది యూఎల్సీ స్థలమే అని నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు రతన్ కుమార్, శ్రీనివాసరావు, శేఖర్ బాబు, వెంకట్రావు, సతీష్ బాబులతోపాటు జిష్ణు ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్పై కేసు నమోదు చేశారు.ఈ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేశారు. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని స్వాదీనం చేసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువచేసే ఈ స్థలం కబ్జా కాకుండా జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు విలువైన స్థలం ప్రభుత్వ సొంతం అయింది.చదవండి: ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు -
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎల్ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్కుమార్ గోయెల్తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ను ని ర్మించాలని టీఎస్ఎల్ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
ఐదేళ్లలో రూ. 300 కోట్లు.. నకిలీ వీసా ముఠా గుట్టురట్టు
ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్ 2 తేదీన సందీప్ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు పట్టుపడిన సందీప్ అనే వ్యక్తి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు. పోలీసులు తిలక్ నగర్లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని మనోజ్ కలిశాడు. మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ చూసి.. జైదీప్ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్పోర్ట్లు, రెండు భారతీయ పాస్పోర్ట్లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్టాప్ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.చదవండి: బాలికపై లైంగిక దాడి.. తృణమూల్ నేత అరెస్టు -
57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు
జోగిపేట(అందోల్): ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అనిల్కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన అంజమ్మ, నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నారాయణఖేడ్ పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్ తండాకు చెందిన రవీందర్లు రియల్టర్లు. వీరు ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వ్యవసాయభూమిని ఎకరాకు రూ.39 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదే భూమిని హైదరాబాద్కు చెందిన యాదగిరిరెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలు చొప్పున రూ.22.80 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ కింద మే 3వ తేదీన యాదగిరిరెడ్డి తన స్నేహితుడు వాసుదేవరెడ్డి ఖాతా ద్వారా రూ.11లక్షలు సంజీవరెడ్డికి చెల్లించారు. నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచి్చంది. దీంతో అందోలు గ్రామంలోని ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీయగా.. తాము ఈ భూమిని ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు.తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కాపీలను చూపించగా, అవి నకిలీవని తేలాయి. దీంతో సంగారెడ్డి ఎస్పీ రూపే‹Ùకు ప్రభాకర్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట సీఐ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేపట్టింది. నిందితులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివ, హోంగార్డు సురేశ్లను సీఐ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్డీని అడ్డుపెట్టుకుని డాక్టర్గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్పోర్టులో వీ.ఎం.థామస్గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
Ministry of Telecom: తప్పుడు సిమ్లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
నకిలీ ధ్రువ పత్రాల నియంత్రణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్టాప్లు, మూడు ప్రింటర్లు, 11 పెన్డ్రైవ్లు, ఒక స్కానర్, పాస్పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్పోర్టుల వరకు హైదరాబాద్కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్పోర్టు బ్రోకర్తో టచ్లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్కు ఒక్కో పాస్పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
నకిలీ దందా.. దామచర్ల చుట్టూనే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది. దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్ లీడర్గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్ వెండర్ లైసెన్స్ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది. నకిలీల చేతిలో 1100 దస్తావేజులు జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్ సిట్ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్ వెండర్ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది. వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో... నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ విభాగం అసోసియేషన్కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్ ఇప్పించాడు. టిక్కెట్ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని.. సిట్ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది. రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం... ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ సురేష్ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు... దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఫేక్ డాక్యుమెంట్లపై ముమ్మర దర్యాప్తు
ఒంగోలు: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డితో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం భేటీ అయ్యారు. ఒంగోలులో గత పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం అంశాలపై నిష్పాక్షిక దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా గురువారం సీఎంవోలో భేటీ అయిన అంశాలపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయని, అందుకు గల కారణం ఏమిటనేది కూడా విచారించాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే బాలినేని తెలియజేసిన అంశాలపై సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తక్షణమే కలెక్టర్, ఎస్పీలను సీఎంవోకు పిలిపించుకుని ముగ్గురి సమక్షంలో చర్చించడం, అనంతరం ఒంగోలు నియోజకవర్గ ప్రజలు, నాయకులు బాలినేని భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనక్కు పంపిన గన్మెన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంవో అధికారులు సూచించడంతో బాలినేని అంగీకరించారు. అలాగే ఈ వ్యవహారాన్ని తొందరగా తేల్చాలని, అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించినట్టు తెలిసింది. ఫేక్ డాక్యుమెంట్స్, భూ రిజిస్ట్రేషన్ వివాదాలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తీసుకెళ్లారు. ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో వాటన్నింటిపై విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావించారు. విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించగలుగుతామన్నారు. దీనిలో జరుగుతున్న జాప్యం వల్లే తాను మనస్తాపానికి గురయ్యానని, అందువల్లే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకొచ్చామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, వారిలో నెలకొన్న ఆందోళన తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం పోలీసు డిపార్టుమెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకుపోయేందుకు గన్మన్లను వెనక్కు పంపినట్లు పేర్కొన్నారు. దీనిపై ధనుంజయరెడ్డి కలెక్టర్తో, ఎస్పీతో చర్చించారు. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే సీఐడీ సహకారం కూడా తీసుకోవాలని సీఎంఓ అధికారులు ఎస్పీకి సూచించారు. శుక్ర, శనివారాల్లో సీఎంవో అధికారులతో బాలినేని భేటీ అంశాలపై మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలను సీఎంవో కార్యాలయం కూడా ఖండిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అంతే కాకుండా తప్పుడు కథనాల అంశాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ఆయన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించినట్లు సీఎంవో అధికారులు బాలినేనికి వివరించారు. అదే విధంగా ఒంగోలులో సుమారు 25 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించి అతి త్వరలోనే నిధులు విడుదలచేసి పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. ఒంగోలులో ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి సరఫరా స్కీము టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడానికి ఉన్న జాప్యాన్ని కూడా సీఎంవో కార్యాలయం దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలినేనికి స్పష్టం చేశారు. కొత్తపట్నం బకింగ్హాంపై కెనాల్పై జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి, ఆర్యవైశ్య ఆరామక్షేత్రం పనులు గురించి చర్చించారు. -
హైదరాబాద్లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్ నగర్లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్బీనగర్లోని సిరీస్ రోడ్లోని సిరినగర్ కాలనీలో ఉన్న జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ సెంటర్కు వచ్చాడు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే నకిలీ డాక్టర్ కార్తీక్రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ హస్పిటల్పై దాడి చేసి జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు
తన ఆస్తిని కాజేశారని నటి గౌతమి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీ మరిన్ని వివరాలను అందించడానికి తిరువణ్ణామలై ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమచారం. గౌతమి 2004లో క్యాన్సర్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆస్తులకు పవర్ ఏజెంట్గా అళగప్పన్ అనే రియల్ఎస్టేట్ ఏజెంట్ను నియమించుకున్నారు. కాగా అళగప్పన్ ఆయన కుటుంబ సభ్యులు శ్రీపెరంబత్తూర్లోని గౌతమికి చెందిన రూ.25 కోట్ల ఆస్తులను పోర్జరీ పత్రాలతో ఆక్రమించినట్లుగా సోమవారం చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలైలో 2019లో రూ.48 లక్షలతో 4 ఎకరాల భూమిని కోనుగోలు చేశానని.. ఇప్పుడు కోట్ల విలువ చేస్తుందని.. ఆ భూమిని అళగప్పన్, అతని భార్య నాచ్చాన్ కాజేశారని తన న్యాయవాది ద్వారా తిరువణ్ణామలై జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అళగప్పన్, అతని భార్యను స్టేషన్కు పలిపించారు. డీఎస్పీ అన్నాదురై, ఇన్స్పెక్టర్ కవిత విచారించారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్చించడానికి నటి గౌతమి ఈ నెల 29వ తేదీ తిరువణ్ణామలై పోలీస్స్టేషన్కు వెళ్లనున్నట్లు సమాచారం. -
బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో టీడీపీ నేత బ్యాంకును బురిడీ కొట్టించి రూ. 8 కోట్లకుపైగా రుణం తీసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రామచంద్రాపురం మండలానికి చెందిన బీఎన్ రెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు నవీన్రెడ్డి, కోడలు ప్రియాంకా చౌదరి కొంత కాలం క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు. 2016, మే 28న నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సమక్షంలో ప్రియాంక చౌదరి రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ద్వారా అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 జూలై 8న తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్బీఐ ఎస్ఎంఈ బ్రాంచ్లో ఓసారి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. కొంతకాలం తర్వాత మరలా రూ. 3.5 కోట్లు రుణం తీసుకున్నారు. 9 ఎకరాలు తమదేనంటూ.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పీర్లగూడలో చిన్నశ్రీరాములు పేరుతో సర్వే నంబర్ 157, 159, 160లో ఉన్న 9 ఎకరాల భూమి, అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న నారియా ఎంటర్ప్రైజెస్ గ్రానైట్ ఇండస్ట్రీ రికార్డులను ఎస్బీఐకు స్యూరిటీగా సమరి్పంచి ఎస్బీఐ నుంచి రూ.4.90 కోట్లు రుణం తీసుకున్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లా పుత్తూరు పాలమంగళంలోని సిరీనా రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో రూ. 3.5 కోట్లను రుణంగా పొందారు. ఆ రుణం పొందిన వెంటనే బ్యాంకుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నారియా ఎంటర్ప్రైజెస్ను అమ్మేశారు. ఆ తరువాత ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఎన్పీఏగా గుర్తించి స్యూరిటీగా పెట్టిన ఆస్తుల అమ్మకానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పీర్లగూడలో ప్రియాంకా చౌదరి, నవీన్రెడ్డి పేరుతో ఎలాంటి భూములు లేవని, బ్యాంకుకు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ డాక్యుమెంట్లని నిర్ధారించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో గతేడాది అక్టోబర్ 3న తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రూ. 4.90 కోట్లకు సంబంధించిన కేసుకు సంబంధించి మాత్రమే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని, ఇది సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిన కేసు అని బ్యాంకు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
మంగళగిరిలో భూకబ్జా.. రూ.15 కోట్ల భూమిపై రియల్టర్లు, టీడీపీ నాయకుల కన్ను
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయరహదారి వెంట ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు పంజా విసురుతున్నారు. నకిలీ పత్రాలు తయారుచేసి ఆ భూముల్ని అమ్మేస్తున్నారు. తాజాగా నకిలీ పత్రాలతో భూమి అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై భూమి యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలో జాతీయరహదారి వెంబడి ఉన్న శ్రీకృష్ణచైతన్య వృద్ధాశ్రమానికి దగ్గరలో 123/1 సర్వే నంబరులో 67 సెంట్ల భూమి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమిపై మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకుల కన్ను పడింది. నగరానికి చెందిన చంద్రమౌళి పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెట్టారు. రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు విశాఖపట్నం కి చెందిన తన అనుచరుడు కోటేశ్వరరావు పేరిట అగ్రిమెంట్ రాయించారు. అగ్రిమెంట్ అయిన వెంటనే భూమిని చదును చేసి మట్టి తోలసాగారు. దీంతో మంగళగిరికి చెందిన సాంబశివరావు ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తనకు అగ్రిమెంట్ ఉందని బయటకొచ్చారు. మొత్తం రూ.2.50 కోట్లు ఇస్తానని, భూమి ఖాళీ చేయాలని కోటేశ్వరరావుతో బేరాలాడసాగారు. ఈ విషయం తెలియడంతో ఆ భూమి అసలు యజమాని విజయవాడ వన్టౌన్కు చెందిన గిరీశ్ మంగళవారం రాత్రి ఆ భూమి వద్దకు చేరుకున్నారు. ఈ భూమి మీదేననే ఆధారాలు తీసుకురావాలని కోటేశ్వరరావు అనడంతో గిరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఆధారాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. తాను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నానని, తహసీల్దారుతోను, రిజిస్ట్రార్తోను మాట్లాడానని కోటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై తహసీల్దారును, రిజిస్ట్రార్ను అడగగా.. తమను రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించలేదని తెలిపారు. దస్తావేజులు, లింకు దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, పోలీసులు విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఐ అంకమ్మరావును అడగగా.. స్థల వివాదంపై ఫిర్యాదు అందిందని తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, విధులకు వచ్చి న తరువాత విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రూ.కోటి విలువ చేసే స్థలం కొట్టేయాలని..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు. ►బీబీనగర్లోని రాఘవాపూర్కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు. ►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు. ►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు. ►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పలు నకిలీ డాక్యుమెంట్స్తో భారీ మొత్తంలో అవినీతి
-
AP: 87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలం
సాక్షి, చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. ఇందుకు ప్రధాన బాధ్యులు టీడీపీ నేతలు.. వారి మాటను కాదనలేకపోయిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనలో 87 మంది హోంగార్డులను తొలగిస్తూ శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. బయటపడింది ఇలా.. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్–పేమెంట్. అగి్నమాపక, టీటీడీ, ఆరీ్టసీ, రవాణాశాఖ, ఎఫ్సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్ఐ మురళీధర్ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, మూణ్ణెల్ల క్రితం వన్టౌన్లో ఆర్ఐ మురళీధర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతల ఆదేశాలతో తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు అంగీకరించాడు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) అరెస్టులకు న్యాయపరమైన సలహాలు హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగి్నమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది టీడీపీ హయాంలో చినబాబుకు కుడిభుజంగా మెలగిన చిత్తూరు జిల్లా పార్టీ నేతగా తెలుస్తోంది. ఇతను ఆడమన్నట్లు ఆడిన అప్పటి చిత్తూరు పోలీసు బాసు, ఓ ప్రత్యేక డీఎస్పీ సైతం ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. మరోవైపు.. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కొందరు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలుచేసిన మొత్తంలో కొంత ఉన్నతాధికారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము చిన్నబాబుకు అందజేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్పటి ఐపీఎస్ అధికారి, డీఎస్పీలు, ఆర్ఐలతో పాటు టీడీపీ నేతలను అరెస్టుచేయడానికి పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తమ్ముళ్లలో వణుకు.. నిజానికి.. పోలీసుశాఖలో అంతర్లీనమైన హోంగార్డులు విధుల్లోకి చేరాలంటే నోటిఫికేషన్, శారీరక దేహదారుఢ్య పరీక్షలు, తుదిగా రాత పరీక్షల్లో ప్రతిభ చూపించడం తప్పనిసరి. అయితే, ఇవేమీ లేకుండా 2014–2019 మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పోలీసుశాఖలోకి దాదాపు 87 మంది హోంగార్డులు చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నకిలీ హోమ్గార్డులు నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంగార్డుల తొలగింపు విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో చిత్తూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారు. ఏ ఒక్కర్నీ వదలం ఇది చాలా పెద్ద నేరం. అసలు ఎలాంటి పరీక్షలు, శిక్షణ లేకుండా పోలీసుశాఖలో చేరిపోవడం అంటే తమాషా కాదు. ప్రాథమికంగా 87 మంది హోంగార్డులను డీఐజీ తొలగించారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు అని తేలితే ఆ హోంగార్డులను సైతం అరెస్టుచేస్తాం. ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. – వై. రిషాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్గ్రౌండ్ చెకింగ్లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్గ్రౌండ్ చెకింగ్లో తేలింది. బ్యాక్గ్రౌండ్ చెక్ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
డీవీ నాయుడు ఎక్కడున్నాడు?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు, నకిలీ ఎన్ఓసీ కేసులో కీలకసూత్రధారి డీవీ నాయుడు గురించి ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆరా తీశారు. మంగళవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్లో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్పతో ఎస్పీ మాట్లాడారు. న్యాయవాదులకు అందుబాటులో ఉన్న డీవీ నాయుడు మీకు మాత్రం కనిపించకుండా పోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక ఈ కేసులో నిందితులైన మనోజ్ను అక్టోబర్ 17న, ఫిర్యాదుదారుల్లో ఒకరైన శ్రీనివాసులును అదే నెల 18న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో ఫిర్యాదిదారి, కేసులో కీలకసూత్రధారి అయిన డీవీ నాయుడు జిల్లాను వీడి బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాడు. ఈ విషయాన్ని నాయుడు తనకు సన్నిహితంగా ఉన్న సమీప బంధువొకరికి చేరవేశాడు. సదరు సమీప బంధువు రెండు రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి జిల్లాలో జరుగుతున్న విషయాలను వివరించి తిరిగి వచ్చాడు. ఆ వెళ్లి వచ్చిన సన్నిహితుడెవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా అనంతపురానికి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి ‘డీవీ నాయుడు తప్పేమీ లేదు’ అని చెప్పినట్లు సమాచారం. ఆ మీడియా ప్రతినిధికి డీవీ నాయుడు గురించి తెలిసే ఉంటుందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. మరో రెండు రోజుల్లో డీవీ నాయుడు శ్రీలంక నుంచి రావాల్సి ఉంది. వీసా గడువు ముగుస్తుండటంతో అతను బెంగళూరు, ఢిల్లీ మినహా మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా పట్టుకోవాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. -
‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!
ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. నిన్నటి వరకు మూన్లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్పై చర్చ నడవగా, తాజాగా ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థలో ఉద్యోగం పొందడానికి నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఆ ఉద్యోగులపై వేటు.. యాక్సెంచర్ కంపెనీ కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తుందని, కంపెనీ నియమ, నిబంధలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియడంతో వారిని తొలగించింది. అయితే అలా పని చేస్తున్నా వారిలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ.. నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది. యాక్సెంచర్లో ఉద్యోగం కోసం కొన్ని ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వాటిని నమ్మకండి యాక్సెంచర్లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్లో హెచ్చరించింది. యాక్సెంచర్లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. కలెక్టర్ పేరుతో టీడీపీ నేతలు నకిలీ ఎన్వోసీ తయారు చేశారు. కూడేరులో రూ.20 కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ ప్లాన్లో భాగంగా స్థానిక తహసీల్దార్, సబ్రిజిస్ట్రార్, ఎస్ఐ, ట్రెజరీ ఉద్యోగి.. టీడీపీ నేతలతో చేతులు కలిపారు. వారి స్కెచ్ బయటకు రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కూడేరు భూబాగోతం కేసును పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు. నోరు మెదపొద్దు.. పెనుకొండ: సీబీఐ దాడులపై ఎక్కడేగాని నోరు మెదపరాదని టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలని, లేకుంటే లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని తన అనుచర గణాన్ని ఆయన అప్రమత్తం చేసినట్లు సమాచారం. రైల్వే పనులకు సంబంధించి కాంట్రాక్ట్లు నిర్వహిస్తున్న వెంకటేశ్వర చౌదరి అధికారులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ధ్రువీకరణ కావడంతో గత శుక్రవారం పెనుకొండలోని వెంకటేశ్వర చౌదరి ఇంటిపై సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర చౌదరితో పాటు ఇతర కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాల వివరాలు, పుస్తకాలను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరందరి ఖాతాలతో పాటు సన్నిహితుల బ్యాంక్ ఖాతాలనూ సీబీఐ అధికారులు సీజ్ చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాక ఆర్థిక నేరాలకు సంబంధించి భార్యాభర్తలు బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా స్థానికులు అంటున్నారు. -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు
ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ.. అవినీతికి తావులేని రాజకీయాలకు పనిచేసే పార్టీ తమదని హడావుడి చేసే జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్నాయుడు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్జరీ, బ్యాంకు గ్యారంటీలతో తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డంగా బుక్కైన జేపీ నాయుడు వ్యవహారం జిల్లా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జేపీ వివాదాస్పద వ్యవహార శైలిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తొమ్మిదేళ్ల్ల కాలంలో అతడిపై 9 కేసులు నమోదై కొన్ని కేసులు ముగిసిపోగా, మరికొన్ని విచారణ దశలోనూ, ఇంకొన్ని కోర్టుల్లో వివిధ దశల్లోనూ ఉన్నాయి. సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అక్కడ చెరువుల్లో చేప, రొయ్యల పిల్లలు పెంచడానికి వీలుగా టెండర్లు ఆహ్వానించింది. ఈ క్రమంలో భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, అతని బృందం టెండ ర్లు దాఖలు చేసి దక్కించుకున్నాకా బ్యాంకు గ్యారంటీ, ఫెర్ఫార్మెన్స్ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్ను తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని 9 జిల్లాలో జేపీ నాయుడు అండ్ టీం టెండర్లు దక్కించుకుంది. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు పాలకొల్లులోని ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీలను తీసుకుని, తీసుకున్న డాక్యుమెంట్లను పూర్తిగా ఫోర్జరీ చేసి గ్యారంటీ విలువను పూర్తిగా పెంచి బ్యాంకు సిబ్బంది సంతకాలు, నకిలీ స్టాంపులతో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు. విచారణలో ఇదంతా వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం టెండర్ రద్దు చేయడంతో పాటు జేపీ నాయుడు అతని బృందంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి సీఐడీకి కేసు అప్పగించినట్టు సమాచారం. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు వ్యవహార శైలి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీపై 2014 నుంచి ఇప్పటివరకు భీమవరం వన్టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్స్టేషన్లల్లో 9 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ముగిసిపోగా, మిగతా కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్) కబ్జాలు.. హత్యాయత్నాలు భీమవరం 32వ వార్డులో గాదిరాజు నాగేశ్వరరాజు జగన్నాథరాజుకు చెందిన 10 సెంట్ల భవనాన్ని శ్రీరామరాజు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిలో జయప్రకాష్నాయుడు కలు గచేసుకుని భవనం తనదేనని, యజమాని రికార్డులో తన పేరు నమోదు చేయాలని కోరారు. అయితే అప్పటికే గాదిరాజు నాగేశ్వరరాజు పేరు రికార్డుల్లో ఉండటంతో జయప్రకాష్ యత్నం విఫలమైంది. దీంతో నాగేశ్వరరాజు తల్లి జయప్రకాష్నాయుడుకు సంబంధించి వెంకటపతిరాజుకు రిజిస్ట్రేషన్ చేసిందని నకిలీ పత్రాలు సృష్టించి జయప్రకాష్ అనుచరులైన పృధ్వీరాజ్, మురళీకృష్ణలను సాక్ష్యులుగా పెట్టుకుని 2014 గణపవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వెంకటపతిరాజు పేరుతో రిజిస్ట్రేషన్కు యత్నించారు. ఈ సమాచారంతో నాగేశ్వరరాజు కోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు భీమవరం టూటౌన్ స్టేషన్లో కేసు పెట్టారు. ►ఇదే రీతిలో ప్రభుత్వ భూమి కబ్జాకు జేపీ ప్రత్యేక స్కెచ్ గీశారు. వీరవాసరంలోని 10వ వార్డుకు చెందిన వలవల రామకృష్ణ అనే వ్యక్తి 439/1 సర్వే నంబర్లో 34 సెంట్ల భూమి దాదాపు 45 ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్ను క డుతున్నారు. దీనిపై జేపీ టీం దృష్టి పెట్టి 2017 జూన్ 24న స్థలంలోకి ప్రవేశించి పాకలు వేసే ప్రయత్నం చేసి అడ్డుకోబోయిన రామకృష్ణపై దౌర్జన్యం చేశారని వీరవాసరం పోలీస్స్టేషన్లో 113/2017తో జేపీపై కేసు నమోదై కొనసాగుతోంది. ►అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇద్దరితో కోర్టులో కేసులు వేయించి ఒకరికి అనుకూలంగా వచ్చాక ఆ భూమి తమదేనని మరొకరికి అమ్మేస్తూ అడ్డగోలు రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా జేపీ చేస్తున్నారు. ►వీరవాసరానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు ఇంటి ప్రహరీ నిర్మిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి ధ్వంసం చేయడంతో పాటు కుటుంబసభ్యులపై హత్యాయత్నం చేశారు. ఈ వ్యవహారంలో జయప్రకాష్నాయుడుది కీలకపాత్ర ఉందని అతనిపై క్రైం నంబర్ 157/2022 కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. -
బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
సాక్షి, ఏలూరు: నకిలీ గ్యారంటీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు, జనసేన నేత గుండా జయప్రకాష్నాయుడు చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తోంది. తప్పుడు గ్యారంటీలతో తెలంగాణ మత్స్యశాఖలో చేపల, రొయ్య పిల్లల సరఫరా టెండర్లను ఆయన దక్కించుకోగా పరిశీలన సమయంలో ఫిర్యాదులు రావడంతో క్షుణ్ణంగా విచారిస్తే ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఈ ఉదంతంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రే గింది. మార్పు కోసం, ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ అంటూ హడావుడి చేసే జనసేన నేతల్లో కొందరు పార్ట్టైంగా ఇలా ఫోర్జరీ వ్యవహారాలు సాగిస్తున్నారు. టెండర్ల కోసం అడ్డదారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడు అతని అనుచరులపై తెలంగాణ ప్రభు త్వం సీరియస్గా దృష్టి సారించింది. తెలంగాణ మత్స్యశాఖ రెండు నెలల క్రితం ఆ రాష్ట్రంలోని చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి రూ.113 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. ఈ క్ర మంలో జయప్రకాష్నాయుడు జనసేన స్థానిక నే తలు, అతని అనుచరులు కరింశెట్టి వీరవెంకట సత్యనారాయణ, మద్దాల గణేష్, గంధం కేశవరావు తదితరులు 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేశారు. టెండర్లు ఖరారు అయిన క్రమంలో బ్యాంకు గ్యారంటీ, పెర్ఫార్మెన్స్ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్లు తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: (ఫోర్జరీ కేసులో జనసేన జెడ్పీటీసీ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ) అయితే వీరు పాలకొల్లులోని ఓ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకుని వాటి విలువలను భారీగా పెంచి, బ్యాంకర్ల సంతకాలు, బ్యాంకు స్టాంపులు అన్ని వారే సొంతంగా తయారు చేసుకుని నకి లీ పత్రాలను తెలంగాణ మత్స్యశాఖకు సమర్పించా రు. వీటిపై అక్కడ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయా దవ్ విచారణకు ఆదేశించడంతో వ్యవహారం బయటపడింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని మోసం చేయడంపై మత్స్యశాఖ సీరియస్ అయి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. జనసేన నేతల్లో కలకలం జయప్రకాష్నాయుడు వ్యవహారం జనసేన నేతల్లో కలవరం పుట్టిస్తోంది. టెండర్ రద్దయి క్రిమినల్ కేసులుగా వ్యవహారం మళ్లిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. 12 జిల్లాల్లో టెండర్లు దక్కించుకుని సుమారు రూ.8 కోట్ల మేర నకిలీ బ్యాంకు గ్యారంటీలను సృష్టించడం కలకలం రేపింది. స్థానికంగా తోటి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేపీ నాయుడుపై గతంలోనూ స్థానికంగా చెక్బౌన్స్, భూకబ్జా, సెంటున్నర భూమికి సంబంధించి వివాదం, వీరవాసరంలో ఓ అధ్యాపకుడిపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి కేసులు నమోదైనట్టు సమాచారం. క్రిమినల్ కేసుల దిశగా.. పాలకొల్లులో జేపీ నాయుడు అండ్ టీం తీసుకున్న బ్యాంకు గ్యారంటీలను, వివరాలను తెలంగాణ అధికారులు సేకరించారు. బ్యాంకర్ల నుంచి తీసుకున్న మొత్తం లక్షల్లో ఉండగా కోట్లల్లో గ్యారంటీ సమర్పించారు. దీనిపై తె లంగాణ ప్రభుత్వం సదరు పాలకొల్లులోని బ్యాంకు నుంచి వివరాలు తీసుకుని నకిలీగా నిర్ధారించారు. ఫోర్జరీ, చీటింగ్ ఘటనలు ఉండటంతో క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీలుగా ఫిర్యాదు చేశారు. -
అసైన్డ్ భూమిపై ‘పచ్చ’ గద్దలు.. కోట్లు దండుకున్న ‘తమ్ముళ్లు’
ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది. కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి.. సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు. అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది న్యాయం కోసం పోరాటం.. వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మా భూమిని లాక్కున్నారు మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి. – సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్ల్యాండ్గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం -
నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో గ్రానైట్ కటింగ్ మిషన్ కోసం బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. కెనరా బ్యాంకు నుంచి ఓమ్ సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని అద్లురీ రాజు బాలానగర్ కెనరా బ్యాంకులో రూ. 95 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాడు. తన వ్యాపార కార్యాలయం పంజాగుట్ట ద్వారాకపూరి కాలనీలో శ్రీదేశి అపార్టుమెంట్లో ఉందని సంబంధింత పత్రాలు బ్యాంకుకు అందించాడు. అనంతరం రూ. 95 లక్షల రుణం బ్యాంకు మంజూరు చేసింది. తరువాత కొన్ని వాయిదాలు చెల్లించి చేతులెత్తేశాడు. వాయిదాలు సక్రమంగా రాకపోవడంతో ఎందుకు చెల్లించడం లేదని, కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అతని కార్యాలయమే లేదని తేలింది. అతడి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, కోటేషన్లు కూడా నకిలీవని తేలాయి. ఒక పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసి రూ. 89 లక్షల వరకు నష్టం చేశారంటూ కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీసీఎస్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అద్లురీ రాజుతో పాటు అతనికి సహకరించిన నరహరి గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ‘నీట్’గా దోచేశాడు... ఎంబీబీఎస్ సీటు పేరుతో గోల్మాల్ ) -
అక్రమ వలసదారులకు ‘ఆధార్’ బంగ్లా ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ అంగీకరించాడు. అకూన్ ఇంట్లో 31 ఆధార్కార్డులు, 13, పాన్కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు. -
ముగ్గురు కిలేడీలు.. పక్కా ప్లాన్ వేసి బతికున్న వారిని..
ఉప్పల్(హైదరాబాద్): బతికున్న వారిని చనిపోయినట్లు డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. రెండు కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్రెడ్డి, బాదితులు శుక్రవారం తెలిపిన మేరకు.. కొత్తపేట రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన పచ్చిపులుసు వరలక్ష్మి(71) రామంతాపూర్లో 1983లో 267 గజాల స్థలం కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా 2021 డిసెంబర్లో ఈశానమ్మ తదితరులు స్థలం తమదంటూ వరలక్ష్మిని బలవంతంగా బయటకు పంపారు. వరలక్ష్మికి ఏకైక కూతురు తనే అంటూ జ్యోతి అనే మహిళ నకిలీ సర్టిఫికెట్లతో వచ్చి.. వరలక్ష్మి 2014 ఆగస్టు నెలలోనే మృతి చెందిందంటూ తన కూతురు పాసల వెన్నెల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ తరువాత పాసల వెన్నెల(19) గొల్లపూడి మరియమ్మకు రిజిస్ట్రేషన్ చేసింది. ఆ తరువాత స్థలం జ్యోతికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం పసుల జ్యోతి(33), జ్యోతి కూతురు వెన్నెల(19), చిలుకానగర్ ప్రాంతానికి చెందిన బల్ల జ్యోతి(27)లను నింధితులుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. వీరికి సహాకరించిన ఎనశమ్మ, శ్రవణ్, మల్లికార్జున్, రాయన్నలపై కూడ పోలీసులు కేసు నమోదు చేసారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈడీనే బురిడీ కొట్టిద్దామని..
సాక్షి, హైదరాబాద్: ఎన్హెచ్–33 పనుల కోసం తీసుకున్న రుణంలో కొంత భాగం పక్కదారి పట్టించిన కేసులో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులనే బురిడీ కొట్టించాలని చూసింది. తమ కాంట్రాక్టును పూర్తి చేయడానికి సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకొని వాళ్లకు డబ్బులు చెల్లించామని కొన్ని లేఖలు ఈడీకి అందించింది. అలా సబ్ కాంట్రాక్టులు ఇచ్చామని చెప్పిన సంస్థల్లో ఓ ఉత్తరప్రదేశ్ కంపెనీ యజమానిని ఈడీ అధికారులు పిలిచి లేఖలు చూపించగా అవన్నీ నకిలీవని తేలింది. దీనిపై ఆ సంస్థ యజమాని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుకాన్ కంపెనీస్పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రూ.1,151 కోట్ల రుణం తీసుకొని.. జార్ఖండ్లో రాంచీ–రార్గావ్–జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి–33 పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో దీన్ని వశం చేసుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్ను చూపించి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు రుణంగా పొందింది. మధుకాన్ తీసుకున్న రుణం నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జార్ఖండ్ హైకోర్టుకు చేరడంతో దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ కేంద్రంగా పని చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను ఆదేశించింది. ఈ శాఖ దర్యాప్తులో రూ.264.01 కోట్లను మధుకాన్ సంస్థ పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో బ్యాంకు కన్సార్టియం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. రాంచీ ఎక్స్ప్రెస్వే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న కె. శ్రీనివాసరావు, ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీతేజను నిందితులుగా పేర్కొంటూ 2019లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆ తర్వాతి ఏడాది న్యాయస్థానంలో అభియోగపత్రాలను దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ జరిగినట్టు గుర్తించి.. సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. గతేడాది జూన్లో నామా నివాసం, కంపెనీల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి 6 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణకు హాజరైన పలువురు మధుకాన్, రాంచీ ఎక్స్ప్రెస్ వే సంస్థల ప్రతినిధులు నిధుల చెల్లింపు విషయమై కొన్ని పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు. రోడ్ కాంట్రాక్టు పూర్తి చేయడానికి చాలా సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకున్నామని, వారికి చెల్లింపులు జరిపామని వాటిలో పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు జరిగినట్లు ఇచ్చిన లేఖలను ఈడీ అధికారులకు అందించారు. ఆ లేఖల ఆధారంగా సబ్ కాంట్రాక్టర్లను ఈడీ అధికారులు పిలిచి విచారించారు. మధుకాన్ వద్ద రాంచీ–రార్గావ్–జంషెడ్పూర్ జాతీయ రహదారి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల్లో ఉత్తరప్రదేశ్లోని మధుపూర్కు చెందిన డీఆర్ విజన్స్ ఒకటి. సదరు ఎక్స్ప్రెస్ వేలో 114 కిలోమీటర్ నుంచి 277 కిలోమీటర్ వరకు ఎర్త్వర్క్ను ఈ సంస్థ నిర్వర్తించింది. దీంతో ఈడీ ఇటీవల బీఆర్ విజన్స్ యజమాని రామ్సాయి సింగ్ను విచారణకు పిలిచింది. ఆ లేఖలను చూసి అవాక్కయిన ఆయన ఆ లేఖలతో తనకు కానీ, తమ ప్రతినిధులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ రెండు లేఖల ద్వారా మధుకాన్ సంస్థ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలకు రూ.18 కోట్లు నష్టం వాటిల్లేలా వ్యవహరించిందని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మధుకాన్ సంస్థపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కొన్ని ఆ«ధారాలు సేకరించాక మధుకాన్ సంస్థతో పాటు బాధ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. -
ఫోర్ట్వంటీ.. నకిలీ ‘గ్యారంటీ’..
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో జాతీయ బ్యాంక్ను మోసం ఘటన చేసిన నగరంలో వెలుగుచూసింది. నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)కు రూ.53 కోట్లు టోకరా వేసిన ఇద్దరు ఘరానా నిందితులను సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్నగర్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కట్టమీది సంతోష్ రెడ్డి (36) కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట 2010 ఏప్రిల్లో కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో కేపీహెచ్బీకి చెందిన నెక్కంటి శ్రీనివాస్ (51), మాదాపూర్ సాయినగర్కు చెందిన కొండకల్ గోపాల్ (42), నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన సోమవరపు సురేందర్ రెడ్డి (52) డైరెక్టర్లుగా చేరారు. వివిధ కంపెనీ సప్లయర్ల నుంచి మెటీరియల్ సేకరణ కోసం యూబీఐ నుంచి బ్యాంక్ గ్యారంటీ పొందాడు. దీని ఆధారంగా హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ లిమిటెడ్, హెచ్పీసీఎల్, ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్, సృజన ఇండస్ట్రీస్, ఎన్ఎస్ఐసీ లిమిటెడ్, ఓఎఫ్బీ టెక్, పవర్2ఎస్ఎంఈ, జెట్వెర్క్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు సంతోష్ రెడ్డికి మెటీరియల్ సరఫరా చేశాయి. నకిలీ గ్యారంటీ సమర్పణ సాధారణంగా బ్యాంక్ గ్యారంటీ పొందాలంటే కంపెనీలోని ఒక డైరెక్టర్ ఆస్తులను సెక్యూరిటీగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితి దాటితే అప్పటికే ఉన్న గ్యారంటీని క్లోజ్ చేయాలి లేదా దాని స్థానంలో గ్యారంటీని పునరుద్ధరించాలి. అయితే ఈ కేసులో సంతోష్ రెడ్డి గరిష్ట గ్యారంటీ పరిమితి రూ.15 కోట్లు ఉండగా.. ఆ పరిమితిని మించి వివిధ కంపెనీల నుంచి మెటీరియల్ పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించాడు. వీటిని సంబంధిత కంపెనీలకు సమర్పించాడు. అలాగే కొత్త బ్యాంక్ గ్యారంటీని పొందేందుకు అప్పటికే గ్యారంటీ సమర్పించిన కంపెనీల లెటర్లను ఫోర్జరీ చేసి బ్యాంక్లకు సమర్పించాడు. ఇలా కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యూబీఐ కొండాపూర్ బ్రాంచ్లో 39 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి 53,18,50,093 రూపాయలు మోసం చేసింది. నకిలీని గుర్తించి.. నకిలీ గ్యారంటీ పత్రాలను గుర్తించిన యూబీఐ బ్యాంక్ ఏజీఎం సరిగాల ప్రకాశ్ బాబు గత జూలై 8న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంపాస్ ఇన్ఫ్రా, నలుగురు డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు సంతోష్ రెడ్డి విదేశాలకు పరారయ్యాడు. ఈఓడబ్ల్యూ బృందం నిందితుడి కదలికలపై నిఘా ఉంచింది. సాంకేతిక ఆధారాలను సేకరించి, విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో సంతోష్ రెడ్డి, శ్రీనివాస్లను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరు నిందితులు గోపాల్, సురేందర్ రెడ్డి పరారీలో ఉన్నారు. -
లేని ఆస్తులు చూపించి బ్యాంక్ లోన్ కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ పేరుతో ఓ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆంధ్రాబ్యాంక్)కు రూ.19.16 కోట్లు స్వాహా చేసింది. పేపర్ కట్టింగ్ యంత్రాలు, ఫ్యాక్టరీ గోడౌన్, స్టాక్, లే అవుట్ ప్లాట్లు.. ఇలాంటివి లేనివి ఉన్నట్లు డాక్యుమెంట్లలో చూపించి ఆంధ్రాబ్యాంక్ అమీర్పేట్ బ్రాంచ్కు ఈ మొత్తం ఎగనామం పెట్టింది. బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి.అపర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమెజాన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. ఆ వివరాల మేరకు.. అమీర్పేటకు చెందిన మన్నెపల్లి కమల్నాథ్ ఎండీగా, కొండపల్లి రాధాకృష్ణ డైరెక్టర్గా అమెజాన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ వ్యాపారానికి లోన్ కోసమంటూ అమీర్పేట్లోని అప్పటి ఆంధ్రాబ్యాంక్(ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చీఫ్ మేనేజర్ కట్రోత్ గోవింద్ను కలిశారు. తమకు పెద్ద పేపర్ కట్టింగ్ మిషన్, వేస్టేజ్ రీ సైక్లింగ్ ఉందని చెప్పి రుణం కోసం దరఖాస్తు చేశారు. అమెజాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన యంత్రాల వివరాలు, గోడౌన్ వివరాలు, కొలట్రాల్ కింద ఇచ్చిన ఏడు ఖాళీ స్థలాల డాక్యుమెంట్లు చూసి రూ.19.16 కోట్ల రుణాన్ని గోవింద్ మంజూరుచేశారు. అయితే ఈ రుణ మంజూరులో సంస్థ చెప్పినట్లు యంత్రాలు, గోడౌన్, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు గుర్తించి వాటిని లెక్కగట్టాల్సిన వ్యాలువర్ కటకం నర్సింహం, లీగల్ ఓపినియన్ ఇవ్వాల్సిన బ్యాంక్ అడ్వొకేట్ శ్రీనివాస్ప్రసాద్ తప్పుడు నివేదిక ఇచ్చారు. గోవింద్ చెప్పినట్లు నర్సింహం, శ్రీనివాసప్రసాద్ ఎలాంటి క్షేత్రస్థాయి పరీశీలన చేయకుండానే సంస్థకు అనుకూలంగా నివేదికలిచ్చారు. దీంతో అమీర్పేట్ బ్రాంచ్ నుంచి రూ.19.16 కోట్ల మేర అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రుణం పొందింది. రుణం పొంది ఏడాది గడిచినా చిల్లి గవ్వ కూడా తిరిగి కట్టకపోవడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మేనేజర్ కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారన్న గుట్టురట్టయింది. దీనితో గోవింద్ను ఉద్యోగం నుంచి తొలగించారు. లేని ఆస్తులు ఉన్నట్లు చూపించి రుణం పొందినందుకు సంబంధిత సంస్థ, దాని ప్రతినిధులపై సీబీఐకి అపర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ
-
రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ
అమరావతి: ఏపీలో రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారంలో అధికారులు మరో రూ.40 లక్షలు రికవరీ చేశారు. ఇప్పటివరకు రూ.కోటి 77 లక్షలు అధికారులు రికవరీ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా నకిలీ చలానాల కేసులో 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్రిజిస్ట్రార్లు, మధ్యవర్తుల పాత్రపై విచారణ జరుగుతోంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. -
విశాఖ : రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు
-
బంజారాహిల్స్లో ఒకే స్థలం ముగ్గురు, నలుగురికి విక్రయం
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సర్కారు స్థలాలను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో ఓ రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయినా.. మరొకరు జైలు ఊచలు లెక్కపెట్టినా.. విలువైన స్థలాలను కబ్జా చేసేందుకు అదే తతంగాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన షేక్పేట మండలంలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ స్థలంపై రోజుకో కబ్జాదారుడు ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తూ.. దర్జాగా కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నారు. గత మార్చిలో డాక్టర్ తిరుమల రాంచందర్రావు నకిలీ పత్రాలు సృష్టించి 9.17 ఎకరాలను ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్కు రూ.10 కోట్లు అడ్వాన్ప్గా తీసుకొని అంటగట్టారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రికార్డులను పరిశీలించిన సదరు ప్రొఫెసర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమిని అమ్మిన రాంచందర్రావు సహా మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే నిందితుడు మళ్లీ ఏకంగా షేక్పేట మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఈ స్థలాన్ని అంటగట్టేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పత్రాల పరిశీలన కోసం తహసీల్దార్ వద్దకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కథ ఇదీ! 1950లో భూమిలేని ముగ్గురికి జీవనోపాధి నిమిత్తం బంజారాహిల్స్ రోడ్డు నం.12లో 25 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అయితే, సదరు అసైన్డ్దారులు వ్యవసాయం చేయకపోవడం..భూమి కూడా సాగుకు అనువుగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ అసైన్మెంట్ను రద్దు చేశారు. విచిత్రమేమిటంటే.. అసైన్మెంట్ రద్దుకు మునుపే.. ఈ భూమి చేతులు మారింది. 25 ఎకరాల భూమిని మూడు సొసైటీలు కొనుగోలు చేశాయి. అసైన్మెంట్ను రద్దు చేయడంతో ఈ సొసైటీలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ వివాద పరిష్కారానికి అప్పట్లో ప్రభుత్వం శాసనసభ కమిటీని వేయగా వీరికి 166 జీవో కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించినా.. సొసైటీ సభ్యులకు ఈ స్థలాన్ని పంపిణీ చేయడం కష్టతరంగా ఉందని చెప్పడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇదే అదునుగా ఈ భూమిపై కన్నేసిన భూ మాఫియా.. రోజుకో ఫోర్జరీ పత్రాలతో స్థలాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ► దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే ఈ భూమిలో 9 ఎకరాల 17 గుంటలు తనదేనంటూ రూ.10 కోట్లకు విక్రయించి పోలీసులకు దొరికిపోయారు. ► కేవలం ఒకరికేగాకుండా..ఈ కేసు నమోదుకు ముందు కూడా మరొకరికి ఇదే భూమిని అమ్మజూపుతూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకోవడం గమనార్హం. ► విచిత్రమేమిటంటే.. విలువైన ఈ భూమిని కాజేసేందుకు తెరవెనుక పావులు కదుపుతున్న రియల్ మాఫియా.. అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలను సృష్టిస్తునే ఉంది. ఈ పత్రాలతోనే బురిడీ కొట్టిస్తూ.. అడ్వాన్స్ రూపేణా రూ.కోట్లు కొట్టేయడం పరిపాటిగా మారింది. ► ఏకంగా 40 మంది కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అడ్వాన్స్గా తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారమవుతుందంటే.. ఈ భూమిని మింగేయడానికి ఎలా పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 9 ఎకరాలు తమవే అంటూ ఆ ప్రాంతానికే చెందిన డా.రాంచందర్రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని విక్రయిస్తామంటూ చెప్పడంతో పాటు కొన్ని పత్రాలను రాంచందర్రావు తమకు ఇచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి షేక్పేట మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ పత్రాలు నిజమైనవైతే సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలంటూ కోరాడు. అతడు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా.. తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నిందితుడు రాంచందర్రావు తదితరులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది బంజారాహిల్స్ రోడ్ నెం.12లో చర్చి ఎదురుగా ఉన్న 25 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఫోర్జరీ పత్రాలతో చాలా మంది కబ్జాదారులు విక్రయాలకు తెగబడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు మేం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. సీసీఎస్లో కూడా రాంచందర్రావు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ స్థలానికి సంబంధించి పత్రాలు తీసుకొని రాగా అవి ఫోర్జరీవి అని తేలింది. గతంలోనే సీసీఎస్ పోలీసులు ఈ స్థలానికి సంబంధించి వివరాలు అడగగా వారికి ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ స్థలాలు విక్రయించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మకానికి ఉందని పత్రాలు ఇస్తే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్, షేక్పేట మండలం -
ఉద్యోగాల పేరిట మోసం.. నకిలీ అపాయింట్మెంట్ అర్డర్ రచ్చ!
సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 74 మంది వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేసినందుకు తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ రబ్బర్స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మేడవాక్కం ప్రాంతానికి చెందిన రంగన్ కుమారుడు బాలాజీ (36) హోమ్ హెల్త్కేర్ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్కుప్పానికి చెందిన జయకాంతన్ కుమారుడు వెంకటాచలం సంప్రదించి తనకు ఉద్యోగం కావాలని కోరాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని నకలీ అపాయింట్మెంట్ అర్డర్ను ఇచ్చాడు. నకిలీవని తెలియడంతో గురువారం తిరువళ్లూరు క్రైమ్బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బాలాజీ ఇప్పటి వరకు 18 మందికి రైల్వే ఉద్యోగం, 54 మందికి ఈఎస్ఐ వైద్యశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. శుక్రవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
ప్లాట్పై కన్నేసి.. నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
హస్తినాపురం: ప్లాట్ యజమాని పేరుతో నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డులు తయారు చేసి కోటి రూపాయల ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు షేక్ హస్సన్(56)ను ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిగూడచమన్కు చెందిన బాలేశ్వర్ 1984లో పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్ జడ్జెస్ కాలనీలో సర్వే నంబర్–33లో 267 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్లాట్పై కన్నేసిన ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్ హస్సన్ పథకం ప్రకారం వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో సదరు ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హస్సన్ మూడు నెలలకు పైగా పరారీలో ఉన్నాడని, అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జయ దశరథ ప్రాజెక్ట్ పేరుతో ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి భూములు విక్రయించి..మోసాలకు పాల్పడుతోంది. వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మోసం చేయడంలో ముఠా దిట్ట అని తెలిపారు. గొల్లూరు గ్రామంలో నకిలీ పత్రాలతో 40 ఎకరాల భూమిని ముఠా విక్రయించినట్లు సీపీ తెలిపారు. డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేయకపోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారని.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. చదవండి: చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ -
తల్లిదండ్రులిద్దరికి వ్యాక్సిన్.. షాకైన కుమారుడు
జైపూర్: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక విధి నిర్వహణలో అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అందరికి తెలుసు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్లో వెలుగు చూసింది. దాదాపు ఏడేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి తల్లిదండ్రులకు కోవిడ్ టీకా ఇచ్చినట్లు అతడి మొబైల్కి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వివరాలు.. పర్వీన్ గాంధీ రాజస్తాన్ దుంగర్పూర్ జిల్లాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2014లో అతడి తండ్రి మరణించగా.. మరుసటి ఏడాది అనగా 2015లో అతడి తల్లి మరణించింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం పర్వీన్ గాంధీ మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది. పర్వీన్ గాంధీ తల్లిదండ్రులిద్దరికి శ్రీ గంగానగర్ జిల్లాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మొదటి డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆ మెసేజ్లో ఉంది. దాన్ని చూసి పర్వీన్ గాంధీ షాక్ అయ్యాడు. ఎప్పుడో చనిపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం ఏంటనుకున్నాడు. దీని గురించి పర్వీన్ గాంధీ ఆరా తీయగా.. శ్రీ గంగానగర్లోని 1కేడీ గ్రామంలో ఎవరో తన తల్లిదండ్రుల పత్రాలపై టీకాలు తీసుకున్నట్లు తెలిసింది. మరణించిన తన తల్లిదండ్రుల పత్రాలను టీకాల కోసం మోసపూరితంగా ఉపయోగించినట్లు జిల్లాలోని ఇద్దరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని పర్వీన్ గాంధీ తెలిపాడు. ‘‘మాస్క్ ధరించడం వల్ల డాక్యుమెంట్లలో ఉన్న వారు.. టీకా తీసుకోవడానికి వచ్చిన వారు వేరు వేరు అని గుర్తించడం వీలు కావడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో పర్వీన్ గాంధీ తల్లీదండ్రుల పత్రాల మీద టీకా తీసుకుని ఉంటారని’’ అధికారులు తెలిపారు. చదవండి: కోవిడ్ వ్యక్తి అంతిమయాత్రకు హాజరు, 21 మంది మృతి..! -
కల్యాణలక్ష్మి కోసం కక్కుర్తి.. అడ్డంగా దొరికిపోయారు!
సాక్షి, బయ్యారం(మహబూబబాద్): నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు అభాసుపాలు చేస్తున్నారు. పథకం ప్రారంభం కాక ముందు జరిగిన వివాహాలు ఇటీవలే జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దీన్ని అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన ముగ్గురు మహిళలకు ఐదేళ్ల క్రితం, మరో మహిళకు రెండేళ్ల క్రితం వివాహాలు జరిగాయి. వీరిలో ఇద్దరికి ఐదు, నాలుగేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా వారి పేరున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్ నాగభవాని మంగళవారం తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాలని స్థానికులు కోరారు. -
నకిలీ పత్రాలతో మాయ.. రూ. 7 కోట్లు కాజేసిన ముఠా
సాక్షి, సిటీబ్యూరో: వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, నగరానికి చెందిన ఓ బిల్డర్కు రూ.7 కోట్లకు విక్రయించిన కేసులో నిందితుల్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్కారుది కాగా... తమదే అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులూ క్లెయిమ్ చేస్తున్నారు. ఓపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జరిగిన మోసం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా 9 ఎకరాల 17 గుంటల స్థలం ఉంది. ఇది తమదేనంటూ తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల హరిలు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ ముగ్గురూ కలిసి ఆ స్థలంతో 2 ఎకరాలు విక్రయిస్తామని, మిగిలిన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించడానికి ఇస్తామంటూ జుబ్లీహిల్స్కు చెందిన మిహిరా బిల్డ్కాన్ మేనేజింగ్ పార్టనర్ సి.సుఖేష్ రెడ్డిని కలిశారు. ఆ స్థలానికి సంబంధించి తయారు చేసిన నకిలీ పత్రాలు ఆయనకు అందించారు. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన సుఖేష్ కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రూ.7 కోట్లు చెల్లించి పత్రాలు రాసుకున్న సుఖేష్ 2 ఎకరాలు ఖరీదు చేసేలా, మిగిలింది అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు కమలేశ్వర్రావు, ఈగ మల్లేశం, సుభాష్ చౌదరీల సమక్షంలో జరిగాయి. సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైన సుఖేష్ అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్థలం పత్రాలపై అనుమానాలు వ్యక్తమై ఆరా తీయగా అవి నకిలీవిగా తేలింది. దీంతో ఆయన జరిగిన మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి నిందితులు రాంచందర్, సంపత్, హరిలను అరెస్టు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. చదవండి: మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. -
రిజిస్టార్ను బురిడీ.. రూ.కోటిన్నర స్థలం హాంఫట్
సాక్షి, శంషాబాద్: నకిలీ పత్రాలతో ఇద్దరు వ్యక్తులు కోటిన్నర విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎంఓ పేరిట పలుమార్లు ఫోన్ చేసి రిజిస్టార్ను బురిడీ కొట్టించారు. జరిగిన తప్పు తెలుసుకున్న రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయంలో భూములు కోల్పోయిన బాధితులకు శంషాబాద్ పట్టణంలో ఎయిర్పోర్టు కాలనీలో సర్వే నంబర్ 626/1లో ప్లాట్లను 2003లో కేటాయించారు. వీటికి అప్పట్లో పట్టా సర్టిఫికెట్లను మాత్రమే జారీచేశారు. అయితే, ఇప్పటికీ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై కన్నేసిన మోసగాళ్లు పెద్ద కుట్రకు తెరలేపారు. ఈ సంవత్సరం జనవరి నెలలో కుమ్మరి అమృత అనే మహిళ ఎయిర్పోర్టు కాలనీలో ప్రభుత్వం తనకు కేటాయించిన 360 గజాల ప్లాటును మొకరాల శ్రీనివాస్శాస్త్రికి విక్రయించేందుకు శంషాబాద్ సబ్రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లింది. ఆమె పేరిట ఉన్న పట్టాపై అనుమానం వ్యక్తం చేసిన శంషాబాద్ సబ్ రిజిస్టార్ సిద్ధిఖీ రిజిస్ట్రేషన్కు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు నకిలీ పత్రాన్ని సృష్టించారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ జనవరి 19న కుమ్మరి అమృత సరైన లబ్దిదారు అంటూ నకిలీ పత్రాన్ని తయారు చేసి సబ్రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి అంటూ రిజిస్టార్కు పలుమార్లు ఫోన్లు కూడా చేయించారు. దీంతో సబ్రిజిస్టార్ వీటిపై పూర్తిగా విచారణ చేయకుండానే ఈ నెల 15న కుమ్మరి అమృత నుంచి శ్రీనివాస్శాస్త్రికి 360 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేశారు. కాగా కుమ్మరి అమృత పాత్రను కూడా కొనుగోలుదారులే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అది బర్త్ సర్టిఫికెట్.. మోసగాళ్లు ఆర్డీఓ పేరిట తయారు చేసిన పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదిగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు జారీ చేసే పత్రాలపై ఎక్కడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎంబ్లం ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాకుండా సదరు పత్రంలో వేసిన ఎస్డీసీఎల్ఈ(ఎల్ఏపీ) బి/691/2003 రికార్డుల పరిశీలనలో అప్పటి చేవెళ్ల ఆర్డీఓ పరిధిలో ఉన్న బాలానగర్ నివాసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఆర్డీఓ జారీ చేసినట్లుగా ఇచ్చిన పత్రం పూర్తిగా నకిలీదిగా తేలింది. కొనుగోలుదారుడైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ తంతంగాన్ని నడిపించారు. మరికొన్ని ప్లాట్లు కూడా ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పథకాన్ని రచించారు. కేసుల నమోదుకు సూచించాం.. విమానాశ్రయం భూ నిర్వాసితులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం నుంచి అధికారులెవరూ లేఖలను ఇటీవల జారీ చేయలేదు. సదరు వ్యక్తులు సబ్రిజిస్టార్ కార్యాలయంలో ఇచ్చిన లేఖ నకిలీది. అధికారికంగా మేము జారీచేస్తున్న వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ రాజముద్ర ఉండదు. లేఖలో వారిచ్చిన నంబరుపై ఇక్కడ మేము బర్త్ సరి్టఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సబ్రిజిస్టార్కు సూచించాం. – చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ నకిలీ డాక్యుమెంట్గా తేలింది తొలుత మేము పట్టా సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో పలుమార్లు సీఎంఓ నుంచి అంటూ ఫోన్లు చేయించారు. అంతేగాకుండా ఆర్డీఓ జారీ చేసినట్లు లబ్దిదారులు లేఖను అందజేయడంతో సరైనదేనని భావించి రిజిస్ట్రేషన్ చేశాం. అనంతరం పరిశీలనలో అది నకిలీ డాక్యుమెంట్గా తేలింది. కొనుగోలుదారుడే వాటిని మాకు సమర్పించాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – సిద్ధిఖీ, సబ్ రిజిస్టార్, శంషాబాద్ చదవండి: ఏ బస్సు ఎప్పుడొస్తుందో..? -
మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..
సాక్షి, మీర్పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్గుల్కు చెందిన వల్లాల ప్రేమ్కుమార్ (45), బాలాపూర్కు చెందిన చెరుకూరి కిరణ్కుమార్, శ్రీనివాస్నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్పేట నందిహిల్స్ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్కుమార్తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు. -
రూ. 23 కోట్లు కొట్టేసిన కిలాడీ
పాకిస్తాన్: సీమా ఖార్బే అనే పాకిస్తాన్కి చెందిన ఓ మహిళ తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి మోసపూరితంగా 1.5 మిలియన్ డాలర్లు(23 కోట్ల రూపాయలు-పాకిస్తాన్ కరెన్సీలో) పొందింది. దీనిపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అధికారి కథనం ప్రకారం..ఖార్బే 2008-09 సంవత్సరాల్లో యుఎస్ వెళ్లి, ఆమె పేరు మీద రెండు భారీ జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసింది. ఆ తరువాత 2011లో పాకిస్తాన్లోని కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులకు, ఓ వైద్యుడికి లంచం ఇచ్చి, తన పేరు మీద నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఖననం చేసినట్లు మరో పత్రం పొందింది. దానిలో భాగంగా రెండు పాలసీలను క్లెయిమ్ చేసుకోవడానికి తన పిల్లల ద్వారా మరణ ధృవీకరణ పత్రాలు ఉపయోగించింది. కనీసం పది సార్లు విదేశాలకు సీమా ఖార్బే చనిపోయినట్లు ప్రకటించిన తరువాత ఆమె కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కనీసం 10 సార్లు విదేశాలకు వెళ్లొచ్చినా అధికారులు గుర్తించలేదు. అయితే అమెరికన్ అధికారులు ఖార్బే గురించి పాకిస్తాన్ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. ఖార్బేతోపాటు ఆమె కొడుకు, కుమార్తె, కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఏ మానవ అక్రమ రవాణా సెల్ ప్రస్తుతం క్రిమినల్ కేసులను నమోదు చేసింది. -
భూ మాయగాళ్లు.. బెడిసికొట్టిన వ్యూహం
కర్నూలు(సెంట్రల్): భూమాయగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో అధికారుల అప్రమత్తతతో విలువైన భూమి అక్రమార్కుల పాలుగాకుండా నిలబడింది. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడు గ్రామ రెవెన్యూలో 154, 155 సర్వే నంబర్లలో బుధవారపేటకు చెందిన గిరిజనులు చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు, పెద్ద వీరన్నకు 4 ఎకరాలు, గిడ్డయ్యకు 4 ఎకరాలు, చిన్న పాపన్నకు 3 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దాదాపు ఎకరా రూ.కోటికి పైగా విలువ ఉంది. చిన్న పుల్లయ్యకు చెందిన 5 ఎకరాల భూమిపై వడ్డెగేరి సూర శ్రీనివాస్ గౌడ్, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్ ఏరియాకు చెందిన పి.బాలచంద్రారెడ్డి, మునగాలపాడు మణిబాబు, కింగ్మార్కెట్ మేకల దాసరి ప్రకాష్, ప్రకాష్నగర్ ఎన్నం రాజశేఖరరెడ్డి కన్ను పడింది. ఎలాగైనా భూమి దక్కించుకోవాలని షేక్ హైదర్అలీ, షేక్ అబ్బాస్అలీ, షేక్ ఉమ్రాన్ అలీ, షేక్ షరీఫ్బాషా, షేక్ జాఫర్, షేక్ ఖాదీర్, షేక్ హుస్సేన్, షేక్ అçఫ్సర్ హుస్సేన్, షేక్ ఖాజా బాషా, షేక్ ఖాజా బాషాల పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. వారి నుంచి తాము కొనుగోలు చేస్తున్నట్లు డాక్యుమెంట్ సృష్టించి కర్నూలు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్నంగా పరిశీలించగా తప్పుడు డాక్యుమెంట్ అని తేలడంతో రిజిస్ట్రేషన్కు నిరాకరించారు. నిరంతరం ఇదే పనిలో భూబకాసురులు కర్నూలు మునిసిపల్కార్పొరేషన్ పరిధిలో భూమి విలువ కోట్లకు పెరగడంతో కొందరు భూబకాసురులు ముఠాలుగా ఏర్పడ్డారు. మొదట ఖాళీ స్థలాలను గుర్తించి దొంగ డ్యాకుమెంట్లు సృష్టించి వాటి ద్వారా అధికారులను మభ్యపెట్టి తప్పుడు రిజి్రస్టేషన్లతో స్వాధీనం చేసుకుంటున్నారు.ఆతర్వాత నిజమైన లబ్ధిదారులకు విషయం చేరేలా చూస్తారు. తమకు రిజి్రస్టే షన్ ఉందని దౌర్జన్యం చేస్తారు. చివరకు పంచాయితీ పేరుతో సగం–సగం అంటూ పంచుకోవడానికి సిద్ధ పడతారు. అలా పంచుకోవడానికి నిజమైన యజమానులు ముందుకు రాకపోతే కోర్టు లో కేసు వేసి ఏళ్లకు ఏళ్లు తిప్పుతారు. ఇలాంటి ముఠా ఎత్తుగడ ను ఇటీవల రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు చిత్తు చేశారు. కలిసొస్తున్న పోలీసుల ఉదాసీనత... భూమాఫియాగాళ్లకు పోలీసుల ఉదాసీన వైఖరి కలిసొస్తోంది. భూకబ్జాలకు పాల్పడే వారిపై నిజమైన యజమానులు ప్రారంభంలోనే ఒక్కోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఇది సివిల్ పంచాయితీ అంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో యజమానులు అంతా తెలుసుకునేలోపే కబ్జాదారులు తప్పు డు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటూ కోర్టుకు వెళ్తున్నారు. ఇక కొందరు రిజి్రస్టేషన్ అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారుల పక్షమే వహిస్తూ రిజిస్ట్రేషన్ చేసి యజమానులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమని అడిగితే డాక్యుమెంట్లు చూసి చేశామని,మరీ కొంచెం ఒత్తిడి చేస్తే పనిలో పడి సరిగా చూసుకోలేదని చెబుతున్నారు. మా భూములకు రక్షణ లేకుండా పోయింది మాకు మునగాలపాడు సమీపంలో సర్వే నంబర్లు 154, 155లలో మొత్తం 20 ఎకరాల భూమి ఉంది. ఇందులో మాన్నాన్న చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు భూమి ఉంది. అందులో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. మిగతా 15 ఎకరాలకు కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారేమోనని భయంగా ఉంది. భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – మనీష్, భూ యజమాని, కర్నూలు తప్పుడు డాక్యుమెంట్గా గుర్తించి తిరస్కరించాం మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని 154, 155 సర్వే నంబర్లలోని 20 ఎకరాల్లో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. అయితే చివరి క్షణంలో మాకు అనుమానం వచ్చి తీక్షణంగా పరిశీలించాం. తప్పుడు డాక్యుమెంట్లుగా గుర్తించి తిరస్కరించాం. విషయాన్ని నిజమైన వారసులకు తెలిపాం. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. – నాగభూషణం, జిల్లా రిజిస్ట్రార్, కర్నూలు -
ఇది ‘బీఎస్-4’ను మించిన స్కాం
సాక్షి, అనంతపురం: తప్పుడు రికార్డులతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన ‘నయాదందా’ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రవాణా శాఖ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా రవాణా ఉప కమిషనర్ (డీటీసీ) శివరామప్రసాద్ మీడియాకు వెల్లడించారు. నాగాలాండ్లో బీఎస్–3 లారీలను తుక్కు కింద కొనుగోలు చేసి బీఎస్–4గా రిజిస్ట్రేషన్లు చేయించిన స్కామ్ను మించిన స్కాంగా ఈ ఘటనను అభివర్ణించారు. జిల్లాకు చెందిన ఓ బృందం ఖరీదైన ఇన్నోవా, షిఫ్ట్ కారులను మరో ప్రాంతంలో చోరీ చేసి ఇక్కడకు తీసుకొచ్చి ఆన్లైన్లోని లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించిందంటూ వివరించారు. రూ.50 లక్షలకు పైగా అవినీతి! వాహనం విక్రయం మొదలు... రిజిస్ట్రేషన్ వరకు దాదాపు రూ.50 లక్షలకు పైగా అవినీతి ఇందులో చోటు చేసుకున్నట్లు ఉప రవాణా కమిషనర్ తెలిపారు. ఈ స్కాంలో బాధితులకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. దాదాపు రూ.25 లక్షలు విలువజేసే వాహనాలు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలకే అందుబాటులోకి రావడంతో వారంతా ఆశపడి కొనుగోలు చేసినట్లుగా తమ విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇప్పటికే ఆరు వాహనాలను గుర్తించి, వాటి యజమానుల కోసం ఆరా తీయగా వారంత డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, పాస్టర్, రైతులుగా తేలిందన్నారు. ఈ ఆరు వాహనాలే కాకుండా మరో 70 వాహనాల వరకూ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా తమ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. వారం రోజుల్లోపు వీటి చిట్టా కూడా బయటపెడతామని పేర్కొన్నారు. అక్రమాలకు ఊతమిచ్చిన ‘వినోద్’ ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను మొత్తం ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కార్యాలయం చుట్టూ ఎవరూ తిరగకుండా ఇంటి పట్టునే ఉంటూ రవాణా శాఖ సేవలను పొందవచ్చునన్నారు. అయితే ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అనంతపురం నగరంలోని వినోద్ ఆర్టీఏ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అక్రమాలకు ఊతమిస్తూ వచ్చిందన్నారు. ఇందులో పాత్రధారులైన ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్బాషాను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం స్కాంను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో సూత్రధారులపై కూడా చర్యలు ఉంటాయని వివరించారు. జాగ్రత్త పడండి... కార్యాలయం చుట్టూ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ సేవలను మరింత వేగవంతంగా పొందవచ్చునని ప్రజలకు డీటీసీ సూచించారు. ఈ విషయమై చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్టీఏకు సంబంధించి 65 రకాల సేవలను సచివాలయాలకు బదలాయించినట్లు తెలిపారు. వాహనాల కొనుగోలుపై అనుమానాల నివృత్తి కోసం రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో హిందూపురం ఆర్టీఓ నిరంజన్రెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్, నరసింహులు పాల్గొన్నారు. -
యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా
సాక్షి, గుంటూరు/మంగళగిరి: ఓ మహిళ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఎలాగైనా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆమె బతికుండంగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మరో మహిళను స్థల యజమాని కూతురుగా సృష్టిస్తూ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందారు. రూ.70 లక్షలకు పైగా విలువ స్థలాన్ని కబ్జా చేయడానికి అక్రమార్కుల వేసిన పన్నాగం స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే 1980 మే 31న విజయవాడకు చెందిన కాగిత సత్యవతి మంగళగిరి మండలం నవులూరు పశువుల ఆసుపత్రి వద్ద సర్వే నెంబర్ 795/1, ప్లాట్ నెంబర్ 22లో 436 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంపై కన్నేసిన కొందరు సత్యవతి 1993 మే 4వ తేదీన మృతి చెందినట్లు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అదే విధంగా సత్యవతితో ఏ సంబంధం లేని శైలజ అనే మహిళను కుమార్తెగా చూపిస్తూ మంగళగిరి తహసీల్దార్ మంజూరు చేసినట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ను పొందారు. వీటిని అడ్డంపెట్టుకుని మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 623/2020తో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె మురళీకృష్ణ పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇతను విలేకరి(సాక్షి కాదు)గా పని చేస్తున్నాడు. ఈ ధ్రువపత్రాలతో స్థలం అమ్మకానికి పెట్టగా విషయం స్థల యజమాని సత్యవతికి తెలిసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ నెల తొమ్మిదో తేదీన కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఏ1 గాదె మురళీకృష్ణ, ఏ2 శైలజలుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏ2 శైలజను అరెస్టు చేసిన అధికారులు విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి సంతకాలు పెట్టిన నవులూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించినట్లు సమాచారం. ఆ ముగ్గురే కీలకం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలం కబ్జా చేయడంలో టీడీపీకి చెందిన యర్రబాలెంకు చెందిన ఓ రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన ఓ విలేకరి(సాక్షి కాదు), మంగళగిరికి చెందిన మరో వ్యక్తి కీలకమని సమాచారం. ఈ ముగ్గురే పెట్టుబడి పెట్టి నకిలీ పతకం ప్రకారం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గాదె మురళీ సహా యర్రబాలెంకు చెందిన టీడీపీకి చెందిన రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. రూ.20 వేలు ఇచ్చి నమ్మించి తన పేరిట ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసుల ఎదుట శైలజ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసు రాజీకి యత్నం కబ్జా వ్యవహారంలో కీలకం పాత్ర పోషించిన ఈ ముగ్గురు ఫిర్యాదుదారులను భయబ్రాంతులకు గురిచేసో, డబ్బు ఇస్తామనో కేసు రాజీ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి ప్రాంతాల్లో రౌడీ షీటర్లు, కొందరు వైట్ కాలర్ నేరస్తులు ఈ తరహాలో భూకబ్జాలకు పాల్పడటం ఇది మొదటి సారి ఏమీ కాదు. గతీడాది మంగళగిరిలో జరిగిన ఓ మాజీ రౌడీషీటర్ హత్యకేసులో కీలక నిందితుడు రౌడీషీటర్ సుమారు రెండు నెలల క్రితం పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో స్థల వివాదం దౌర్జాన్యానికి దిగాడు. తన బావ పేరిట అక్రమ స్థల రిజిస్ట్రేషన్ చేయించి ఎదుటి వారి స్థలాన్ని కబ్జా చేసేందుకు సదరు రౌడీషీటర్ తన అనుచరుల పంపి స్థల యజమానులు వేసుకున్న సరిహద్దు కంచెలను తొలగించారు. ఈ వ్యవహారంలో రౌడీషీటర్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని అప్పట్లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయం కోసం బాధితులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రౌడీషీటర్ను తప్పించి కేసు నమోదు చేశారని విమర్శలున్నాయి. -
పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి
తాడేపల్లిరూరల్: మండల పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి మహిళలపై దౌర్జన్యం చేసి సామాను బయట పడేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. విజయవాడలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతి, ఆయన సోదరి కుంచనపల్లిలోని డోర్ నం 1–37 ఇంటిని 2017వ సంవత్సరంలో గవర్నర్ పేట ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ఆక్షన్లో పాడుకున్నారు. అనంతరం ఆ ఇంటిని బ్యాంకు వారి దగ్గర నుంచి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే బ్యాంకులో ఇంటిని తాకట్టు పెట్టిన కొండా శంకరరెడ్డి, కొండా మోహన్రెడ్డి బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకును మోసం చేసి, తనను కూడా మోసం చేసారంటూ మోహన్రెడ్డి, శంకరరెడ్డి బావమరిది అయిన నాగిరెడ్డి బ్యాంకు అధికారులపైనా, బావలపైనా కోర్టును ఆశ్రయించారు. కోర్టు నాగిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కానీ, ఇల్లు కొనుగోలు చేసిన కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతిని ఖాళీ చేయించమని చెప్పలేదు. అయిన ప్పటికీ నాగిరెడ్డి, అతని బావలైన శంకరరెడ్డి, మోహన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడి ఇంట్లోకి వెళ్లి సామన్లన్నీ బయట పడవేసి, మహిళలనే కనికరం లేకుండా బయటకు నెట్టివేశారు. ఘటనపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
బెయిల్ కోసం నకిలీ డాక్యుమెంట్లు..
సాక్షి, సిటీబ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో ఉన్న నిందితుడిని బెయిల్పై విడుదల చేసేందుకు ష్యూరిటీ సంతకం చేసి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన మహిళా నైజీరియన్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా డాక్టర్ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షలు కొట్టేసిన కేసులో ఈ ఏడాది మార్చి నెలలో నైజీరియన్ గిడ్డి ఇసాక్ ఓలూతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు సమ్మతించిన న్యాయస్థానం ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలని ఆదేశించింది. దీంతో ఒబినా బాతోలోమివూ గొడ్విన్, రొస్లైన్ అన్నా ఎక్యూరేలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి పాస్పోర్టు కాపీలు, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలు సమర్పించారు. అయితే వీరిలో ఒకరైన న్యూఢిల్లీలో ఉంటున్న రొస్లైన్ అన్నా ఎక్యూరే 2016 ఫిబ్రవరి 10న మెడికల్ వీసాపై భారత్కు వచ్చానని పోలీసులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తే అనుమానం వచ్చి సంబంధిత అదికారులకు పంపిస్తే వీసా ఫోర్జరీది అని తేల్చి చెప్పారు. దీంతో ఇటు పోలీసులు, అటు కోర్టును మోసం చేసి తమ వ్యక్తిని బెయిల్పై విడుదల చేసేందుకు యత్నించిన రొస్లైన్ అన్నా ఎక్యూరేను అరెస్టు చేశారు. -
ఏపీ డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
-
ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ
సాక్షి, అమరావతి : రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్సవాంగ్కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు. (‘ఆ లేఖపై రమేష్కుమార్ మౌనం వీడాలి’) ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్ కుమార్కకు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. -
నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంక్కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు, బోగస్ వ్యక్తులతో రంగంలోకి దిగిన ఓ ఘరానా మోసగాడు ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.30 లక్షల టోకరా వేశాడు. దాదాపు పదేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఈ కేసులో నిందితుల అరెస్టు మాట అటుంచి కనీసం వారెవరో గుర్తించడమూ సాధ్యం కాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించి, ముగ్గురిని పట్టుకున్నారు. విదేశంలోని జైల్లో ఉన్న మరో నిందితుడి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి నిర్ణయించామని గోవింద్రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన నిందితులు ఈ స్కామ్కు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఖరీదు చేస్తామంటూ పత్రాలు పొంది... సైదాబాద్ ప్రాంతానికి చెందిన సలావుద్దీన్ వృత్తిరీత్యా రియల్ఎస్టేట్ దళారి. ఈ స్కామ్ మొత్తానికి ఇతడే సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు 2008 ఆఖరులో తన స్నేహితుడైన హసన్ అలీతో కలిసి ఖైరతాబాద్లోని ఏఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహ్మద్ రియాసత్ హసన్ను సంప్రదించాడు. ఆయన నిర్మించిన ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను ఖరీదు చేస్తామంటూ చెప్పారు. న్యాయ సలహా తీసుకోవడానికంటూ ఆ ఫ్లాట్కు సంబంధించిన పత్రాలను సేకరించారు. లోన్ వస్తుందో, రాదో చెప్పడానికి ఓ సారి తమ బ్యాంకు వాళ్ళు వచ్చి చూసి వెళ్తారని ఆయనతో చెప్పాడు. ఆ పత్రాల ఆధారంగా వీరిద్దరూ స్కామ్కు నాంది పలికారు. ఇక్కడ స్థిరాస్తిని కలిగి, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాటి యజమానులు ఆస్తులు విక్రయించే అధికారం ఇక్కడున్న వారికి దఖలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికోసం విదేశంలోని యజమాని స్పెషల్ పవరాఫ్ అటార్నీ (ఎస్పీఏ) రూపొందించి పంపిస్తారు. దీన్నే సలావుద్దీన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. డ్రైవర్ ఫొటోతో ఎస్పీఏ తయారీ... యజమాని రియాసత్ హసన్ విదేశాలకు వెళ్ళినట్లు, ఆయన తన ఫ్లాట్ను విక్రయించడానికి ఎస్పీఏ ఇచ్చినట్లు సలావుద్దీన్ నకిలీ పత్రాలు సృíష్టించాడు. గతంలో తనకు ట్యాక్సీలు తీసుకువచ్చిన డ్రైవర్ అబ్దుల్ కవి ఫొటో వినియోగించి, నకిలీ పేర్లు, చిరునామాలతో దీన్ని తయారు చేయించాడు. ఇలా సదరు ఫ్లాట్ను విక్రయించడానికి నకిలీ యజమానికి సృష్టించేసిన సలావుద్దీన్... దాన్ని ఖరీదు చేయడానికీ ఓ బోగస్ పార్టీని ‘సిద్ధం చేశాడు’. హైదరాబాద్కు చెందిన సర్ఫ్రాజ్ అహ్మద్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడని డాక్యుమెంట్లు సిద్ధం చేసిన సలావుద్దీన్... సదరు ఫ్లాట్ ఖరీదు చేయడానికి ఆయన ఆసక్తి చూపినట్లు కథ అల్లాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అతడు భారత్కు రావడానికి కుదరట్లేదని, ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఉండే తన భార్యకు సదరు స్థిరాస్తి ఖరీదు చేసే అధికారం దఖలు చేస్తూ పత్రాలు పంపినట్లు నకిలీవి తయారు చేశాడు. కమీషన్ ఆశచూపి యువతికి ఎర... తనకు బ్యూటీపార్లర్లో పరిచయమైన, అవివాహిత అయిన ఫర్హా దీబాను సర్ఫ్రాజ్ భార్యగా నటించేందుకు ఒప్పించాడు. ఇలా సహకరిస్తే తనకు వచ్చే ‘లాభం’లో కమీషన్ ఇస్తానంటూ ఎరవేసి ఒప్పించాడు. ఆమె ఫొటో, నకిలీ పేరు వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేయించాడు. ఎస్సార్నగర్లోని సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్కు కవి, ఫర్హా దీబాలను తీసుకువెళ్ళి... ఖైరతాబాద్ ఫ్లాట్ను కవి ద్వారా ఫర్హా పేరు మీదకు బదిలీ చేయించాడు. ఈ సేల్డీడ్ను ఆధారంగా చేసుకుంటూ బేగంపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్ను ఆశ్రయించి ఫర్హా ద్వారా గృహరుణం దరఖాస్తు చేయించాడు. దీనికి ముందే రియాసత్కు చెందిన ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతోనే వేరే వ్యక్తుల్ని యజమానులు చూపించి ఓ నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన సలావుద్దీన్ ఆ పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిచాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో... సదరు బ్యాంకు అధికారులు వెళ్ళి ఖైరతాబాద్లోని ఫ్లాట్ను పరిశీలించారు. ఆ విషయం రియాసత్కు తెలిసినప్పటికీ గతంలో సలావుద్దీన్ చెప్పినట్లు వాళ్ళు వచ్చారని భావించాడు. ఫ్లాట్ను, పత్రాలను సరిచూసిన బ్యాంకు 2009లో రూ.30 లక్షల రుణం మంజూరు చేస్తూ ఏఎస్ కన్సల్టెన్సీ పేరుతో చెక్కు ఇచ్చింది. దీన్ని తాను తెరిచిన నకిలీ ఖాతాలో వేసిన సలావుద్దీన్ డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఈ మొత్తం నుంచి కొంత హసన్ అలీ, అబ్దుల్ కవి, ఫర్హా దీబాలకు ఇచ్చాడు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ ఫ్లాట్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. దీన్ని రియాసత్ అడ్డుకోవడంతో ఆరా తీయగా జరిగిన మోసం వాళ్ళకు తెలిసింది. దీంతో 2010లో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు నిందితులు ఎవరనేది గుర్తించలేకపోయారు. పదేళ్ళకు వీడిన చిక్కుముడి... ఇటీవల ఈ కేసును సమీక్షించిన ఉన్నతాధికారులు మూసేయవచ్చని నిర్ణయించారు. అయితే వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–10 ఇన్స్పెక్టర్ ఆర్.గోవింద్రెడ్డి మాత్రం తనకు ఓ చాన్స్ ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అనుమతించడంతో పునర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులు వివిధ చోట్ల దాఖలు చేసిన నకిలీ గుర్తింపుపత్రాలను అధ్యయనం చేసిన ఇన్స్పెక్టర్ చిన్న క్లూ సంపాదించారు. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన ఆయన సలావుద్దీన్తో పాటు కవి, ఫర్హాలను పట్టుకున్నారు. ఈ ఫ్రాడ్ తర్వాత దుబాయ్ వెళ్ళిన హసన్ అలీ అక్కడ ఓ నేరం చేయడంతో ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారని దర్యాప్తు అధికారి గుర్తించారు. దీంతో ఇతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్ఓసీ జారీ చేయడంతో పాటు ఈ స్కామ్పై ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ఫేక్ పట్టా
-
ఓ మాజీ సైనికుడి దీనగాథ
శత్రు దేశాల కుట్రలను ముందుగానే పసిగట్టగలిగాడుగానీ, సొంత ఊరిలో కుతంత్రాలను గుర్తించలేకపోయాడు. ప్రాణాలకు తెగించి శత్రు మూకలతో పోరాడాడుగానీ, ఉన్న ఊరిలో దురాక్రమణదారుల దెబ్బకు నిలువలేకపోయాడు. యుద్ధంలో కాళ్లు పోయినా ప్రభుత్వమిచ్చిన భూమిని నమ్ముకుని కాలం వెళ్లదీద్దామనుకున్నాడు. ఇంతలో రాబందుల్లా వచ్చి వాలిన ఆక్రమణదారులు ఆ భూమిని లాగేసుకోవడంతో పోరాడి అలసి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబమూ ఉన్న ఆధారాన్ని దక్కించుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. తాడేపల్లిరూరల్: తెనాలి మండలం కొలకలూరుకు చెందిన నంది భీమప్ప 1962లో దేశ రక్షణ కోసం సైనికుడిగా చేరాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన సుశీలతో వివాహమైంది. పెళ్లి అనంతరం 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో, 1971లో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. చివరిగా తన కుడికాలు పోగొట్టుకున్నాడు. 1980లో భీమప్పను ఇంటికి పంపించారు. మాజీ సైనికుల కోటా కింద భీమప్పకు తాడేపల్లి మండలం చిర్రావూరులో సర్వే నంబర్ 26/1ఏలో 1.83 ఎకరాలు కేటాయించారు. కొంత కాలం పండించుకున్న అనంతరం భీమప్ప అనారోగ్యరీత్యా ఆ పొలాన్ని వేరే వారికి కౌలుకు ఇచ్చాడు. అప్పటి నుంచి భీమప్ప పొలాన్ని కొంత మంది దళారులు ఆక్రమించి దౌర్జన్యానికి దిగారు. పదే పదే ఆక్రమణలు 1994లో కోర్టును ఆశ్రయించిన భీమప్ప పొలాన్ని దక్కించుకున్నాడు. తిరిగి మళ్లీ ఆక్రమించుకోవడంతో 1999లోనూ మరోసారి కోర్టుకు వెళ్లాడు. అప్పుడూ న్యాయం భీమప్ప పక్షానే ఉంది. ఈ సమయంలో కొంతమంది దళారులు, ఇరిగేషన్ అధికారులు తమకు సదరు స్థలాన్ని కేటాయించారంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు. ఇవి నకిలీవని కోర్టు కొట్టేసింది. అనంతరం పొలాన్ని భీమప్పకు కేటాయించారు. 2003 సంవత్సరం ఏప్రిల్ 2న భీమప్ప మృతి చెందాడు. కౌలుకు తీసుకున్నారు.. దారిగా మార్చారు భీమప్ప భార్య సుశీల సదరు భూమిని తాడేపల్లికి చెందిన ఓ మోతుబరి రైతుకు కౌలుకు ఇచ్చింది. రెండు సంవత్సరాలు కౌలు ఇచ్చిన అనంతరం మూడో సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఎవరితో చెప్పుకోలేక అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయింది. అనంతరం కౌలుకు తీసుకున్న రైతు మాజీ సైనికుడి పొలంలో నుంచి తన పంట పొలంలోకి కరకట్ట నుంచి ర్యాంపు వేసి ఆక్రమించుకున్నాడు. మరో పక్క షెడ్డు ఏర్పాటు చేసి అందులో కాపలాదారులను పెట్టి పంట పొలంలోకి సుశీలను రానీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం సుశీల స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించింది. ఇది తెలిసిన సదరు రైతు.. లక్ష రూపాయలు పడేస్తాను, పిటిషన్ వెనక్కు తీసుకోవాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మాజీ సైనికుడు కఠెవరపు వివేకానందరెడ్డిని కలిసిన సుశీల తన గోడును వెళ్లబుచ్చుకుంది. దీంతో వివేకానందరెడ్డి సదరు భూమికి సంబంధించిన పత్రాలను సేకరించారు. వీటితో కలెక్టర్ను కలిసి మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించుకోనున్నారు. ఎంఆర్ఓ వివరణవిచారణ చేసి చర్యలుతీసుకుంటాం మాజీ సైనికుడు భీమప్ప పొలం ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చింది. రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. భీమప్పకు 1.83 సెంట్లు ప్రభుత్వం కేటాయించినట్లు రుజువైతే ఆయన కుటుంబీకులకు స్వాధీనం చేస్తాం. -
జడ్జినే బురిడీ కొట్టించబోయి.. బుక్కయ్యారు!
సాక్షి, కావలి: నకిలీ పత్రాలతో జడ్జినే బురిడీ కొట్టించబోయి నకిలీ జామీన్దారులు అడ్డంగా దొరికిపోయారు. న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు ముఠా సభ్యులను గురువారం అరెస్ట్ చేశారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీ హనుమకొండపాళెం చెందిన కర్రా బాలరాజు కన్నకూతురిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి కావలి సబ్జైలులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు బాలరాజుకు బెయిల్ మంజూరు చేసి, కావలి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జామీనులను హాజరుపరచాలని ఆదేశించింది. అయితే బాలరాజుకు జామీన్ ఇచ్చేందుకు స్వగ్రామస్తులను అతని తండ్రి వెంకటయ్య కోరితే ఈసడించుకొన్నారు. న్యాయవాది సహకారంతో.. తన కుమారుడికి జామీన్ ఇచ్చేందుకు వెంకటయ్య కావలిలోని బంధువైన రమణమ్మను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు రహమాన్ అనే న్యాయవాదిని కలిశాడు. ఆయన రూ.20 వేలు ఫీజు అవుతుందని, అవసరమైన జామీనుదారుల కోసం కావలికే చెందిన యాకోబును కలవమని సూచించాడు. వెంకటయ్య యాకోబును కలిస్తే తాను ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదని, నెల్లూరులోని మీరామొహిద్దీన్ను కలవమని చెప్పి పంపాడు. అతన్ని వెంకటయ్య సంప్రదించగా రూ.10 వేలు ఖర్చు అవుతుందని చెప్పి నెల్లూరు నగరంలోని పడారుపల్లి జగ్జీవన్రామ్నగర్కు చెందిన కాకుముడి సుబ్బరామయ్య అలియాస్ చిన్నాతో డీల్ కుదిర్చాడు. చిన్నా నకిలీ రబ్బర్ స్టాంప్లు తయారు చేశాడు. స్వాధీనం చేసుకొన్న నకిలీ రబ్బర్ స్టాంపులు అదే ప్రాంతానికి మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను జామీన్దారులుగా సిద్ధం చేశాడు. అక్కుర్తి సుమన్ జామీన్దారులకు సంబంధించిన నకిలీ ప్రాపర్టీ ఫాంలను ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ, అదే మండలం మైపాడు పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ జామీన్ పత్రాలు సృష్టించారు. న్యాయమూర్తి అప్రమత్తతతో.. ఈ నెల 16వ తేదీ కర్రా బాలరాజు బెయిల్కు సంబంధించిన జామీన్దారులుగా మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను కావలిలోని అడిషనల్ మేజిస్ట్రేట్ పి.చైతన్య ముందు నాయ్యవాది రహమాన్ హాజరుపరిచారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే కేసు కావడంతో మేజిస్ట్రేట్ చైతన్య జామీన్దారుల్లో మందా విద్యాసాగర్ను నిందితుడు నీకు ఏమవుతాడని ప్రశ్నించారు. బాలరాజు తన చెల్లెలు భర్త అని చెప్పడంతో, మీ చెల్లెలు పేరేమిటని ప్రశ్నించడంతో తెల్లముఖం పెట్టేశాడు. దీంతో మేజిస్ట్రేట్ చైతన్యకు అనుమానం వచ్చి మళ్లీ విచారిస్తానని ఫైల్ పక్కన పెట్టారు. కోర్టులో మేజిస్ట్రేట్ ప్రశ్నలు అడుగుతుండగానే నకిలీ పత్రాలు సృష్టించి, వారితో పాటు వచ్చి కోర్టు బయటనే ఉన్న అక్కుర్తి సుమన్ పరారీ అయ్యాడు. జామీన్దారులుగా వచ్చిన మందా విద్యాసాగర్, తాటిపర్తి శివ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి అదృశ్యయ్యారు. ఈ విషయంపై కావలి వన్ టౌన్ పోలీసులకు మేజిస్ట్రేట్ చైతన్య ఫిర్యాదు చేయడంతో సీఐ ఎం.రోశయ్య దర్యాప్తు చేపట్టారు. ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని సభ్యులైన కాకుమూడి సుబ్బరామయ్య, అలియాస్ చిన్నా, అక్కుర్తి సుమన్, మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను అరెస్ట్ చేశారు. కావలిలోని న్యాయవాది రహమాన్ ప్రోద్భలంతో నకిలీ షూరిటీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ముఠాలో ఇంకా సభ్యులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ డి.ప్రసాద్ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎం.రోశయ్య, ఎస్సై సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
నకిలీ దందాకు చెక్..13 మంది అరెస్టు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరుగుతున్న నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ ఆధార్, డాక్యుమెంట్స్, స్టాంప్స్ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. కోర్టులనే మోసం చేస్తూ న్యాయవాదుల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 150కిపైగా కేసులలో నకిలీ ప్రతాలను న్యాయవాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నలుగురైదుగురు న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసలలో నకిలీ దందా సాగిస్తున్నట్లు, గంజాయి కేసులో పూచీకత్తులకు 20 వేలు, రోడ్డు ప్రమాద కేసులో 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టులను మోసం చేసి నిందితులను రక్షించారని, ఇతర రాష్ట్రాల నిందితులకు పూచీకత్తు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించారు. ఈ వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా సాగుతోందన్నారు. గత భూదందా కేసులో రికార్డులు తారుమారుపై ఈ ముఠా పాత్ర ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నమని తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిలో ఒక రౌడీషీటర్ ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. -
కన్ను పడితే.. స్థలం ఖతం!
సాక్షి, కర్నూలు : జిల్లా కేంద్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఖాళీ స్థలాల కబ్జా వెనుక సాంకేతిక పరంగా అనుభవమున్న ఒక ముఠా పని చేస్తోంది. ఈ ముఠా ప్రతి నెలా రెండు, మూడు అక్రమ రిజిస్ట్రేషన్లను చేయించుకుని రూ.కోట్లకు పడగలెత్తుతోంది. ముఖ్యంగా కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ముఠా ఆగడాలు పెచ్చుమీరాయి. నేరచరిత్ర కల్గిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూములు, స్థలాలు, అమాయకుల ఆస్తులను గుర్తించి దొంగ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి రిజిస్ట్రేషన్ అధికారుల అండదండలు కూడా ఉండడంతో వారి పని సాఫీగా సాగిపోతోంది. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు, కల్లూరు మండలాల్లో భూములు, స్థలాల విలువ అమాంతం పెరుగుతోంది. ఏ ప్రాంతంలో చూసినా సెంటు స్థలం నాలుగైదు లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ముఠా సభ్యులు ఐదారేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థలాలను గుర్తించి, వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కర్నూలు, కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ప్రతి నెలా ఒకట్రెండు అక్రమ రిజిస్ట్రేషన్ బాగోతాలు బయటకు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అధికారుల ఉదాసీనత దొంగ రిజిస్ట్రేషన్లను నివారించడంలో ఆ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపు డ్యూటీ కడితే దేన్నైనా రిజిస్ట్రేషన్ చేస్తామన్న ధోరణిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో లింకు డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సక్రమంగా పరిశీలిస్తే నకిలీల బాగోతాన్ని పసిగట్టవచ్చు. అయినా ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. అక్రమార్కులతో మిలాఖత్ కావడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపిస్తూ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే... కోర్టులో తేల్చుకోవాలంటూ బాధితులకు ఉచిత సలహా ఇస్తున్నారు. 2000 సంవత్సరంలో నగరంలోని సంతోష్నగర్ పరిధిలోని షాహరాన్ నగర్లో 20 మంది ఇంటి స్థలాలను కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే 2008లో నగరంలోని రామ్ప్రియానగర్లో సర్వే నంబర్ 686/1లో వేసిన వెంచర్లో కొందరు దొంగ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లను చేయించుకున్నారు. ఇవి దొంగ రిజిస్ట్రేషన్లేనని ఆ శాఖ అధికారులు నిర్ధారించుకున్నప్పటికీ వాటిని రద్దు చేయకుండా కోర్టుకు పంపారు. దీంతో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు బేరసారాలకు రావాలని బాధితులను పిలుస్తున్నారు. వాళ్లు అనుకున్నట్లు వస్తే స్థలం విలువలో 30–40 శాతం తమకు చెల్లించాలని అడుగుతున్నారు. వినకపోతే బెదిరింపులకు సైతం దిగుతున్నారు. కొందరు వివాదం ఎందుకని పంచాయితీ చేసుకుంటున్నారు. -
కబ్జా రాయుళ్లకు అండ!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించడానికి అనువుగా పాత తేదీలతో కూడిన నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సంగ్రహించి, విక్రయిస్తున్న వ్యవస్థీకృత ముఠాకు తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. వివరాల్లోకి వెళితే..స్టాంపు వెండర్లు అయిన అల్వాల్, న్యూ బోయగూడ ప్రాంతాలకు చెందిన క్రాంతి సురేష్ కుమార్, మహ్మద్ అలీ సికింద్రాబాద్ కోర్టు వద్ద నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో తృప్తి చెందని వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, పాత తేదీలతో ఉన్న నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయించడం మొదలెట్టారు. పాతబస్తీకి చెందిన సతీష్ నుంచి పాత స్టాంప్ పేపర్లు సంగ్రహిస్తున్న క్రాంతి వాటిని అలీ ద్వారా విక్రయించేవాడు. ఇలా వీరు విక్రయించిన పత్రాలను వినియోగించి కొందరు వివాదాస్పద స్థలాలను కబ్జా చేయడం చేస్తుండగా, రియల్ ఎస్టేట్ దళారులు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, పి.రమేష్, జి.శ్రీనివాస్రెడ్డి, గోవిందు స్వామి వలపన్ని ఆదివారం క్రాంతి, అలీలను అరెస్టు చేశారు. 228 ఖాళీగా ఉన్న పాత స్టాంప్ పేపర్లు, 105 ఖాళీ కొత్త నాన్–జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు, 104 నకిలీ రబ్బర్ స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్ కోసం గాలిస్తున్నారు. నిందితులను గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
లాన్స్ నాయక్కు రెవెన్యూ తిప్పలు!
ఆర్మీలో ఆయనో లాన్స్నాయక్ ... అయితేనేం ఆయనకు కూడా తన భూములను రక్షించుకునేందుకు ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి. దేశం కోసం ఆర్మీలో పని చేస్తున్నారన్న సానుభూతి కూడా లేకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కోర్టులు ఆదేశించినా ఆక్రమణల చెరలో ఉన్న అతని భూములను పరిరక్షించాల్సింది పోయి 22ఏను అడ్డం పెట్టుకుని అతని జీవితంతో ఆటలాడు కుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన పోలిరెడ్డి శ్రీనివాసరావు ఆర్మీలో లాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన ప్రస్తుతం డెప్యుటేషన్పై ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో ట్రాన్స్మిషన్ యూనిట్లో సేవలందిస్తున్నారు. తన తండ్రి రాజుబాబు, పెదనాన్న అప్పలనాయుడు 1979లో గ్రామంలోని సర్వే నంబర్ 133లో మూడెకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో 2.10 ఎకరాలను బీసీ కాలనీ నిమిత్తం ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు పరిహారం కూడా మంజూరు చేశారు. ఇక మిగిలిన 90 సెంట్లకు శ్రీనివాసరావు తండ్రి, పెదనాన్నల పేరిట ఇవ్వాల్సిన పట్టాదారు పాస్పుస్తకాలను వారు కొనుగోలు చేసిన వారి పేరిట జారీ చేశారు. ఆ పట్టాదారు పుస్తకాలను అడ్డంపెట్టుకుని వారు కోర్టుకెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమి కోసం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత చివరకు పట్టాదారు పాస్పుస్తకాలు రద్దు చేశారు. వాటిని ఆధారం చేసుకుని మరో ఐదేళ్ల పాటు సాగిన వాదోపవాదాలనంతరం సివిల్ కోర్టు కూడా శ్రీనివాసరావు కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మరొక వైపు ఈ భూముల్లోకి సదరు దొంగపట్టాలు పుట్టించిన వారు చొరబడి దాదాపు 12 సెంట్ల భూమిని కబ్జా చేశారు. మిగిలిన భూమి ప్రస్తుతం వీరి అధీనంలోనే ఉంది. కబ్జాకు గురైన భూములను కూడా పరిరక్షించుకునేందుకు ఆర్మీలో పనిచేస్తున్న లాన్స్నాయక్ శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. చివరకు 2017లో మిగిలి ఉన్న భూమినైనా పరిరక్షించుకుందామన్న ఉద్దేశంతో తన సోదరికి గిఫ్ట్డీడ్ రూపంలో రాసిచ్చేందుకు నర్సీపట్నం సబ్ రిజిస్ట్రే షన్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఆసలు విషయం తెలిసి విస్తుపోవడం లాన్స్నాయక్ వంతు వచ్చింది. పోరాటం ఫలించిందనుకున్న సమయంలో తమ భూములు కాస్తా 22 ఏలో (నిషేధిత భూముల జాబితా) ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా 22ఏ జాబితా నుంచి మోక్షం లభించలేదు. దీంతో చివరకు తమ ఆర్మీ కమాండెంట్కు ఫిర్యాదు చేశారు. కమాండెంట్ కూడా సీరియస్గా తీసుకుని తొలుత జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయ్..అప్పటికీ న్యాయం జరగకపోతే కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అభయమిచ్చారు. ఆ మేరకు అనుమతినివ్వడమే కాదు సుబేదార్ గిరిదారిలాల్, సిపాయి బీడీ మహేష్కుమార్లతో శ్రీనివాసరావును కలెక్టరేట్కు పంపించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ సమగ్ర విచారణ జరపాల్సిందిగా పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్ జి.సృజనను ఆదేశించారు. -
కన్సల్టెన్సీ పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వీసా, పాస్పోర్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ కన్సెల్టెన్సీల పేరుతో వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతుందన్నారు. కస్టమర్లకు నకిలీ పత్రాలు ఏర్పాటు చేయడం కోసం వీరు మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. కెనడా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, అరబ్ దేశాలకు వెళ్లే వారే లక్ష్యంగా ఈ ముఠా కార్యకాలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ ముఠా సమకూర్చిన పత్రాలతో కస్టమర్లు కాన్సులేట్లో వీసాకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది నకిలీ పత్రాలతో వీసాలు పొంది స్టడీ, బిజినెస్, వర్క్, విజిటింగ్ కోసం విదేశాలకు వెళ్లారని తెలిపారు. 450 మందికి ఈ ముఠా నకిలీ పత్రాలు అందజేసిందన్నారు. నకిలీ పత్రాలతో వీసా పొంది ఎంత మంది విదేశాలకు వెళ్లారో గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన రహీఉద్దీన్, ఖలిద్ ఖాన్, షైక్ ఇల్లియాస్, సైయాద్, జహీరుద్దీన్లను అరెస్ట్ చేశామని.. వారిపై ఇదివరకే చాలా క్రిమినల్ చేసులు ఉన్నాయని చెప్పారు. సైదాబాద్, గోల్కొండ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తుందని.. నకిలీ పాస్పోర్టులను కూడా తయారుచేస్తుందని ఆయన తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు ముఠా సభ్యులు అధిక నాణ్యత కలిగిన నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 100 పాస్పోర్ట్లు, రబ్బర్ స్టాంప్స్, 3 లక్షల రూపాయల నగదు, కంప్యూటర్, ప్రింటర్స్, సెల్ల్ ఫోన్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
నకిలీ వీసాల దందా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు
-
‘ఇన్నోసెంట్’గా మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: ఇన్నోసెంట్..పేరులో అమాయకత్వం ఉన్నా మనిషి మాత్రం మాయ దారి మోసగాడే. ఫిషింగ్ మెయిల్స్ చేసి కంపెనీ వివరాలు, ఫోన్ నంబర్ తెలుసుకుని.. దాని ద్వారా సిమ్ స్వాప్ చేసి సైలెంట్గా కంపెనీల బ్యాంకు ఖాతాల్ని గుల్లచేసేస్తుందీ అ‘మాయ’క బృందం. కంపెనీల ఖాతాలో డబ్బుల్ని కొల్లగొట్టే ప్రణాళికను నైజీరియాలో వేసి కోల్కతా కేంద్రంగా అమలుచేసి తప్పించుకునే ఎబిగో ఇన్నోసెంట్ ముఠాను అంతే చాకచక్యంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కోల్కతాలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్పై శనివారం నగరానికి తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. సిమ్ స్వాపింగ్తో స్వాహా.. నైజీరియాకు చెందిన ఎబిగో ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్ కోల్కతాలో ఉన్న సమయంలో ఫుట్బాల్ ఆడేందుకు వచ్చిన మరో నైజీరియా వాసి ఒడాఫీ హెన్రీతో 2014లో పరిచయమేర్పడింది. వీరిద్దరూ కలసి సిమ్ స్వాపింగ్ ద్వారా చేసే మోసాలకు తెరదీశారు. డబ్బుల బదిలీకి నకిలీ పేర్లతో బ్యాంక్ ఖాతాలు సమకూర్చే కోల్కతాకు చెందిన సంతోశ్ బెనర్జీ, రిజిష్టర్డ్ సెల్నంబర్ వివరాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు, చిరునామాలు సృష్టించి డూప్లికేట్ సిమ్ సంపాదించే రాజత్ కుందులను హెన్రీకి పరిచయం చేశాడు. అనంతరం నైజీరియాకు వెళ్లిపోయిన ఎబిగో ఇన్నోసెంట్ హ్యాకర్లు హ్యాక్ చేసిన కంపెనీ వివరాలను డార్క్నెట్లో కొనుగోలు చేశాడు. భారత్లోని కంపెనీల ఈ–మెయిల్స్కు ఫిషింగ్ మెయిల్స్ పంపించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలు, రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, కంపెనీ పేరు, చిరునామాలను సేకరించి హెన్రీ, రాజత్ కుందు, సంతోశ్ బెనర్జీలకు చేరవేసేవాడు. మొబైల్ టెలికామ్ స్టోర్స్లో రాజత్ కుందు తనకు పరిచయమున్న వారి ద్వారా మొబైల్ నంబర్ వివరాలు తెలుసుకునేవాడు. కంపెనీకి చెందిన రబ్బర్ స్టాంప్ను తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోల్కతాకు చెందిన చందన్ వర్మకు ఇచ్చేవాడు. అతడు సంజీవ్ దాస్ అనే వ్యక్తితో కలిసి వెళ్లి బాధితుడి సిమ్కు నకిలీ సిమ్ తీసుకునేవాడు. అలసత్వంతో లక్షలు పోగొట్టుకున్నా.. 2017 జూన్ 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నా సెల్నంబర్ పనిచేయడం ఆగింది. ఎయిర్టెల్ కాల్సెంటర్కు కాల్ చేస్తే మీ నంబర్ పనిచేస్తుందని చెప్పారు. సోమవారం ఆ కంపెనీ మొబైల్ స్టోర్స్కు వెళితే మీ సిమ్ యాక్టివ్లోనే ఉంది. మీరు డూప్లికేట్ సిమ్ తీసుకున్నారా అని తిరిగి ప్రశ్నించారు. ఆధార్కార్డు, ఫింగర్ ప్రింట్ తీసుకొని మళ్లీ డూప్లికేట్ సిమ్ ఇచ్చారు. అయితే అప్పటికే నా సెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా రూ.24 లక్షల నగదు బదిలీలు కోల్కతాలోని బ్యాంక్లకు వెళ్లాయని తెలిసింది. సరైన తనిఖీ లేకుండా డూప్లికేట్ సిమ్ జారీ చేసిన సంస్థపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. –గిరి, సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారమే...పని కానిచ్చేస్తారు ఆయా టెలికం స్టోర్స్ నుంచి అసలు సిమ్ కార్డులకు డూప్లికేట్లను శనివారాల్లోనే పొంది సాయంత్రానికల్లా రాజత్ కుందుకు చేర్చేవారు. అతడు అదేరోజు దానిని యాక్టివ్ చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చెందిన వారి సెల్ నంబర్ల సేవలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో నిలిచేపోయేవి. సెల్ సిగ్నల్స్ సరిగా లేవని భావించిన కంపెనీ యజమానులు తిరిగి సోమవారం లోపు ఆయా టెలికం స్టోర్స్కు వెళ్లేలోపు వీరి బ్యాంక్ ఖాతాల నుంచి దశలవారీగా నగదు ఖాళీ అయిపోయేది. అనంతరం కొంత డబ్బును వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి విత్డ్రా చేయడంతో పాటు దుకాణాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలుచేసేవారు. వీటిని సంతోశ్ బెనర్జీ విక్రయించి నగదు రూపంలోకి మార్చి హెన్రీకి అప్పగించేవాడు. అనంతరం ఈ డబ్బుతో బట్టలు, వస్తువులు కొనుగోలు చేసి నైజీరియాలోని ఇన్నోసెంట్కు పంపేవారు. దొంగలు దొరికారిలా.. ఈ విధంగానే నగరంలో ఎలిమ్ కెమికల్స్, షాలోమ్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల నుంచి రూ. తొమ్మిది లక్షలు ఖాళీ కావడంతో చింతల్కు చెందిన వాటి యజమాని వెంకటకృష్ణ గతేడాది డిసెంబర్ 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంక్ఖాతా వివరాలతో పాటు సెల్నంబర్ల లోకేషన్ ఆధారంగా కోల్కతాలో ఉంటున్న ఆరుగురు నిందితులను అక్కడే అరెస్టు చేశారు. వీరి నుంచి 17 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, మూడు పాస్పోర్టులు, డెబిట్కార్డులు, ఆధార్కార్డులు, లామినేషన్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నై,కోల్కతా,అహ్మదాబాద్, ఢిల్లీలోని 11 పరిశ్రమలను చీటింగ్ చేసినట్టు విచారణలో తేలింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు.. గతంలో నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.24 లక్షలు మోసం చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఒకడైన సంతోష్ బెనర్జీని 2015లో ఇటువంటి కేసులో జైపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ సజ్జనార్ అన్నారు. కాగా ఇందులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్ను పట్టుకునేందుకు నైజీరియాకు లేఖ రాస్తామని తెలిపారు. వెరిఫికేషన్ లేకుండా సిమ్ జారీ చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. -
భూంఫట్!
సాక్షి, అమరావతి: అధికారం అండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో విలువైన భూములను కాజేస్తున్నారు. వాగులు, చెరువులను సైతం ఆక్రమించి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ భూ రికార్డులను తారుమారు చేస్తున్నారు. భూములను కొట్టేసేందుకు కొన్నిచోట్ల బాధితుల బంధువులనే పావులుగా వాడుకోవడం గమనార్హం. బాధితుల బంధువులకు వాటాల ఎర... భూదందాల కోసం చిన్న చిన్న వివాదాలున్న విలువైన ఆస్తుల సమాచారాన్ని సేకరించి రంగంలోకి దిగుతున్నారు. వివాదాలు లేనిచోట కూడా ఏదో ఒక మెలికపెట్టి నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హక్కుదారుల బంధువులకు వాటాలిస్తామంటూ ఎరవేసి అప్పు ఇచ్చినట్లు తనఖా పత్రాలు సృష్టిస్తున్నారు. తనఖా పత్రం కూడా తమ పేర్లతో కాకుండా బినామీ పేర్లతోనే రాయించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. తనఖా పత్రం రాయించుకున్న వారి పేర్లతో ఆస్తి బదలాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వీటి ఆధారంగా ఆస్తులు మ్యుటేషన్ చేయించి బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా వ్యవహరిస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా ఇదంతా సివిల్ వివాదమంటూ కేసు నమోదు చేయకుండా తిరస్కరించేలా కబ్జాదారులు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడలో మాఫియా రాజ్యం విజయవాడ సింగ్నగర్లోని సుమారు రూ.50 కోట్ల విలువైన 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బోండా ఉమా తన భార్య, సన్నిహితుల పేరుతో రికార్డులు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో చేతులు మార్పించి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత, తనకు సన్నిహితుడైన మాగంటి బాబులకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్లు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ హక్కుదారులు ఆందోళన చేయడంతో పోలీసులతో కూడా కొట్టించారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో చివరకు ఈ భూమిని వదులుకుంటున్నట్లు బోండా ఉమ ప్రకటించడం గమనార్హం. పెద్దలతో ఎందుకు?.. రాజీ చేసుకోండి! కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక నేత అనుచరులు కూడా విజయవాడలో ల్యాండ్ మాఫియా నిర్వహిస్తున్నారు. గొల్లపూడి ప్రాంతంలో మంత్రి అనుచరులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఓ మహిళ 1978లో కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూమికి మంత్రి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ‘పెద్దవారితో మీకు ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడుకుని రాజీ చేసుకోండి’ అని ఓ రెవెన్యూ అధికారి బాధితురాలికి సూచించినట్లు తెలిసింది. విశాఖలో కూడా ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ. వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు ఓ మంత్రి బంధువులు అంతా సిద్ధం చేసుకున్నారు. వాగులూ వంకల ఆక్రమణ.. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో వందలాది చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని సాగు భూములుగా మారిపోయాయి. భారీ వర్షాలు పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చెరువులు, నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో భారీ నష్టం జరిగింది. పంట కాలువ ఆక్రమించి వంతెన.. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె రెవెన్యూ గ్రామంలో పెద్దఓరంపాడు చెరువు నుంచి రామక్కపల్లెకు వెళ్లే పంటకాలువపై అధికార పార్టీ నాయకులు అక్రమంగా వంతెన నిర్మించి అలుగు పోరంబోకులో బోర్లు వేసి ఏకంగా చెరువు భూమిని చదును చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేశారు. కాలువ గుండా వర్షాకాలంలో నీరు ప్రవహిస్తే చెరువు నిండి 500 ఎకరాలకు నీరు అందుతుంది. కాలువకు అడ్డంగా వంతెన నిర్మిస్తే చెరువులోకి నీరు రాదు. అలుగు కింద భూమిని మొత్తం సాగు చేసుకోవాలని ఓ టీడీపీ నాయకుడి అనుచరుడు 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వెంటనే వంతెనను తొలగించి చెరువు అలుగు వద్ద ఆక్రమణలను తొలగించాలని రామక్కపల్లె, అప్పారాజంపేట, అనంతంపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆవిలాల చెరువులో భారీ భవంతులు.. తిరుపతిలోని ఆవిలాల చెరువు చాలావరకూ ఆక్రమణలతో చిక్కిపోయింది. మట్టి తోలి ఎత్తు చేసి చెరువు భూమినే ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అక్కడ ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు ఉండటంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదేం దారుణం! గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు పంచాయితీకి చెందిన సింగం శాంతాదేవి (టెకులమ్మ) నుంచి ముగ్గురు వ్యక్తులు 1998లో వీలునామా ద్వారా రాయించుకున్న, 2005లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్న 10.78 ఎకరాల విలువైన భూములను 2013లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామా రాయించుకున్న సింగం ప్రసాదరెడ్డి అనే వ్యక్తికి తహసీల్దారు ఏకపక్షంగా బదలాయించి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం గమనార్హం. ఓ టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా సాగినట్లు ఆరోపణలున్నాయి. 2005లో రిజిస్ట్రేషన్ సమయంలో శాంతాదేవి ఆంగ్లంలో సంతకం చేయగా ప్రసాద్రెడ్డి సమర్పించిన అన్ రిజిస్టర్డ్ వీలునామాలో ఆమె వేలిముద్ర ఉండటం ఫోర్జరీ వ్యవహారాలకు నిదర్శనం. దీనిపై బాధితులు ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలంటూ గుంటూరు ఆర్డీవో కోర్టులో అప్పీల్ కూడా చేసుకున్నారు. సెంటు రూ. 20 – 25 లక్షలకు అమ్మకం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో మన్నూరు, ఊటుకూరు, పోలి, క్రిష్టం చెరువులు ఆక్రమణలపాలయ్యాయి. చిత్తూరు జిల్లా పుల్లంపేట మండలంలో పుల్లంగేరు, రాజంపేట ప్రాంతంలో చక్రాలమడుగు అని వ్యవహరించే వాగు ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. భారీ వర్షం కురిస్తే రాజంపేటలో ఇళ్లలోకి నీరు చేరు ప్రమాదం పొంచి ఉంది. కడప – చెన్నై రహదారిని ఆనుకుని చక్రాలమడుగు వాగు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న భూమిని స్థానిక టీడీపీ నాయకులు సెంటు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు. చక్రాలమడుగు వాస్తవంగా జలవనరుల శాఖది. ఈ భూమి క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అయితే భూమి వర్గీవకరణనే నకిలీ రికార్డులతో మార్చేసి కోట్లు దండుకుంటున్నారు. -
సినీ నటుడు రామచంద్రబాబు అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: అతని పేరు ఏ.రామచంద్రబాబు... వృత్తి సినిమాలు, టీవీల్లో నటించడం... ఇతడిపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పదేళ్ల క్రితం కేసు నమోదు చేశారు... అప్పట్లో ముందస్తు బెయిల్ పొందిన బాబు అరెస్టు నుంచి తప్పించుకున్నాడు... ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని పొడిగించుకోవాల్సి ఉండగా అలా జరగలేదు... దీంతో రామచంద్రబాబును సోమవారం అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. ప్రధానంగా బుల్లితెర నటుడిగా ఉన్న ఏ.రామచంద్రబాబు ‘చక్రవాకం’, ‘రుతురాగాలు’ వంటి సీరియళ్లలో నటించారు. అనేక చిత్రాల్లో కథానాయకుడి తండ్రి పాత్రలతో పాటు మరికొన్ని కీలక రోల్స్ పోషించాడు. బంజారాహిల్స్లోని సర్వే నెం. 129/35లో ఖాదర్ భాషాతో పాటు మరి కొందరికి 3 ఎకరాలు, 21 గుంటల స్థలం ఉంది. వీరికి రూ.20 లక్షలు ఇస్తానంటూ రంగంలోకి దిగిన రామచంద్రబాబు కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నాడు. వీటిని వినియోగించి ఆ స్థలం తన పేరుతోనే ఉందని, అయితే కొన్ని విభేదాలు ఉన్నాయంటూ సంతోష్నగర్కు చెందిన శ్రీనివాస్ను సంప్రదించాడు. తనకు రూ. 60 లక్షలు ఇస్తే ప్రతిఫలంగా స్థలంలో 25 శాతం వాటా ఇస్తానంటూ నమ్మబలికాడు. ఈ తతంగంలో కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన ఓ రాజకీయ నాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీ సీరియళ్లు తీస్తానంటూ మళ్లీ శ్రీనివాస్ వద్దకు వెళ్లిన రామచంద్రబాబు మరో రూ.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. తన డబ్బు తిరిగిరాక పోవడం, స్థలంలో వాటా సైతం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ అతడిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ మొత్తానికి పది పోస్ట్డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. ఇలా ఇచ్చినట్టే ఇచ్చిన రామచంద్రబాబు మరోపక్క తన చెక్కులు పోయాయని, వాటిని ఎవరైనా దుర్వినియోగం చేసి తనపై చెక్బౌన్స్ కేసులు పెట్టే అవకాశం ఉందంటూ డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశా డు. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ తనకు వాటా ఇచ్చిన స్థలం విషయంపై ఖాదర్ భాషాను సంప్రదించగా తాను స్థలాన్ని ఎవరికీ అమ్మలేదని చెప్పా డు. దీంతో శ్రీనివాస్ పాణ్యంకు చెందిన రాజకీయ నాయకుడిని సంప్రదించినా స్పందన లేకపోవడం తో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2009లో కేసు నమోదు చేసుకున్న అధికారులు రామచంద్రబాబు కోసం వేట ముమ్మరం చేశారు. దీనిని గుర్తిం చిన బాబు హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు తాజాగా గత నెల్లో ముందస్తు బెయిల్ గడువు ముగిసింది. దీన్ని కోర్టు ద్వారా పొడిగించుకోవాల్సి ఉండగా అలా చేసుకోలేదు. దీంతో అధికారులు సోమవారం రామచంద్రబాబు ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో హాజరైన న్యాయవాది ఇది సాంకేతిక తప్పిదమంటూ కోర్టుకు నివేదించడంతో న్యాయస్థానం మరోసారి అతడికి బెయిల్ మంజూరుచేసింది. -
‘కమీషన్’ కేటుగాళ్లు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వీరు ఘరానా మోసగాళ్లు.. ఇతరుల భూములపై నకిలీ పత్రాలు సృష్టించారు.. వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టారు.. భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్ తీసుకున్నారు.. ఈ పంథాలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ లను మోసం చేసి రూ.100 కోట్ల రుణాలు ఇప్పించి, భారీగా కమీషన్లు తీసుకున్న శ్రీనివాస్రెడ్డి సహా పది మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరో 40 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హైదరాబాద్, రాచకొండతోపాటు ఏపీ లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఎల్బీనగర్ ఇన్చార్జ్ డీసీపీ ప్రకాశ్రెడ్డితో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్రెడ్డి నగరంలోని ఎస్సార్నగర్లో ఉంటున్నాడు. తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపా రాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించా డు. హయత్నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలా ల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూపిన వారితో కమీషన్పై ఒప్పందం చేసుకునేవాడు. వెలుగులోకి వచ్చింది ఇలా... అబ్దుల్లాపూర్మెట్లోని ఓ స్థలానికి సంబంధించి నకిలీపత్రాలను సృష్టించిన శ్రీనివాస్రెడ్డి ఇస్నాపూర్ ఎస్బీ హెచ్లో కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించాడు. ఈ మేరకు రూ.66 లక్షల కమీషన్ తీసుకున్నాడు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామంతాపూర్లోని ఆంధ్రాబ్యాంక్ లో దాఖలు చేశాడు. ఈ 2 బ్యాంకులకు లీగల్ ఒపీయన్ ఇచ్చే అధీకృత సలహాదారు ఒక్కరే. అతను ఈ విష యాన్ని గుర్తించి ఎస్బీహెచ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకోవడంతోపాటు దానిని నాన్పెర్ఫామింగ్ అసెర్ట్గా ప్రకటించింది. నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన స్థలం పై ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్మెట్కి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డి, గోపాలకృష్ణ, వినోద్ కుమా ర్, మహమ్మద్ షఫీ, విశ్వనా థమ్, జగన్రావు, పిల్లి ఐలయ్య, వెంకటరామ్రెడ్డి, గంగరామ్, వేముల అశోక్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. సిబ్బంది తప్పిదంతోనే భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు హాజరుకావడంతోపాటు వారి గుర్తింపుకార్డులు, ఈసీ, టైటిల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్లు తనిఖీ, యజమాన్య హక్కులు తనిఖీ చేయాల్సి ఉండగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీ సు(ఎస్ఆర్వో)ల్లో అటువంటిదేమీ చేయలేదు. బ్యాం కర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయకుండానే రుణాలు ఇచ్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈసీ లో నిక్షిప్తమైన సమాచారాన్ని తొలగించాలంటూ ఎస్ఆర్వోలకు పోలీసులు లేఖ రాయనున్నారు. కొలట్రల్ మోసాలపై తనిఖీ చేసి విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. -
పరిశీలకుల ముందు పెద్ద సినిమా...
సాక్షి, సిటీబ్యూరో: తనవి కాని భూములపై నకిలీ పత్రాలు సృష్టించడం... వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడం... భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్ తీసుకోవడం... ఈ పంథాలో వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.100 కోట్ల వరకు రుణాలు ఇప్పించి, భారీ మొత్తం కమీషన్గా తీసుకున్న శ్రీనివాస్రెడ్డిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, రాచకొండతో పాటు ఏపీలో ఇతడిపై 15 కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. ఇతడి స్కాములపై పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు ఒకటిరెండు రోజుల్లో అరెస్టు చేయనున్నట్లు సమాచారం. మరోపక్క రాచకొండ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న ఇతడి సంబంధీకులు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని, కేసులను కోర్టులో ఎదుర్కొంటామని కోరుతున్నట్లు సమాచారం. ప్రధాన లోపాలను గుర్తిస్తాడు... గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్రెడ్డి నగరానికి వలసవచ్చి ఎస్సార్నగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపారాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా హయత్నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలాలనే ఇతడు ఎంచుకుంటాడు. ఆయా స్థలాల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టో, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూసిన సంస్థల యజమానులతో కమీషన్పై ఒప్పందం చేసుకోవడంతో పాటు ఈ పత్రాలు ఇవ్వడం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తాడు. పరిశీలకుల ముందు పెద్ద సినిమా... ఏదైనా సంస్థకు రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏజెంట్ల ద్వారా కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టే స్థలాలను ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తాయి. దీని కోసం శ్రీనివాస్రెడ్డి పెద్ద సినిమా నడిపించేవాడు. ఈ వెరిఫికేషన్ బృందం రావడానికి ఒక రోజు ముందే ఆ ప్రాంతానికి వెళ్లే శ్రీనివాస్రెడ్డి అక్కడ ‘దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీనివాస్రెడ్డి’ అంటూ బోర్డులు ఏర్పాటు చేసేవాడు. ఆ చుట్టుపక్కల స్థలాల యజమానులంటూ కొందరు అద్దె మనుషులను రంగంలోకి దింపి వారికి సర్వే నెంబర్లు, విస్తీర్ణం కంఠతా అయ్యేలా తర్ఫీదు ఇచ్చేవాడు. దీంతో మరుసటి రోజు వెరిఫికేషన్కు వచ్చిన సిబ్బంది అక్కడ ఉన్న బోర్డు చూసి, ‘అద్దె యజమానులు’ చెప్పే వివరాలు తెలుసుకుని నిజమే అని నమ్మి రుణం మంజూరుకు సిఫార్సు చేసే వారు. ఇలా రుణం మంజూరైన తర్వాత శ్రీనివాస్రెడ్డి 10 నుంచి 25 శాతం వరకు ఆ కంపెనీ నుంచి కమీషన్గా తీసుకునేవాడు. ఈ పంథాలో ఎల్బీనగర్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని స్థలాలను కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టి రూ.100 కోట్లకు పైగా రుణాలు ఇప్పించిన శ్రీనివాస్రెడ్డి రూ.25 కోట్ల వరకు కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెలుగులోకి వచ్చింది ఇలా... శ్రీనివాస్రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఇతడి భాగోతాలు ఓ బ్యాంకు అధీకృత లీగల్ అడ్వైజర్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఓ స్థలానికి సంబం«ధించిన పత్రాలను ఇస్నాపూర్ ఎస్బీహెచ్లో (ప్రస్తుతం ఎస్బీఐ) కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన శ్రీనివాస్రెడ్డి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించి రూ.66 లక్షలు కమీషన్గా తీసుకున్నారు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామాంతపూర్లోని ఆంధ్రాబ్యాంక్లో దాఖలు చేశారు. ఈ రెండు బ్యాంకులకు లీగల్ ఒపీయన్ ఇచ్చే అధీకృత అడ్వైజర్ ఒకరే కావడంతో వారు అతను ఈ విషయాన్ని గుర్తించి ఎస్బీహెచ్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ యజమానిని నిలదీసిన సదరు బ్యాంకు దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు కంపెనీని నాన్–పెర్ఫామింగ్ అసెర్ట్గా (ఎన్పీఏ) ప్రకటించింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన స్థలానికి సంబంధించి ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతానికి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ముగ్గురూ ఒకడే..?
సాక్షి, సిటీబ్యూరో: బోగస్ పత్రాలతో రాజధానిలోని ఖరీదైన భూముల కబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న హైకోర్టు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. భూకబ్జా కేసుల్లో ఇతడు గతంలోనే అరెస్టు కాగా... తాజాగా హైకోర్టు నుంచి ఫైళ్ల మాయం కేసులో కటకటాల్లోకి చేరాడు. ఇతడి కారును స్వాధీనం చేసుకుని అందులో గాలించిన సీసీఎస్ పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. కేసుల దర్యాప్తు పక్కదారి పట్టించడంతో పాటు పోలీసు అధికారులను నైతికంగా దెబ్బతీయడానికి శైలేష్ వారిపై అనేక రిట్ పిటిషన్లు, మూడు ప్రైవేట్ కంప్లైట్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఇవన్నీ హబీబ్ ఇస్లాం ఖాన్, నజీరుద్దీన్ ఇస్లాం ఖాన్, ఇఫ్తెకార్ ఇస్లాం ఖాన్ పేర్లతో దాఖలయ్యాయి. ఆ రిట్ పిటిషన్లతో పాటు ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డులను సైతం జత చేశారు. ఈ కేసులు శైలేష్ సక్సేనా దాఖలు చేస్తున్నట్లు పోలీసులు కొన్ని రోజులుగా అనుమానిస్తున్నారు. తాజాగా అతడి కారును తనిఖీ చేయగా ఈ మూడు పేర్లతో ఉన్న గుర్తింపుకార్డులు లభించాయి. పాతబస్తీలోని యాకత్పుర చిరునామాతో ఉన్న మూడు ఓటర్ ఐడీలు, రాజేంద్రనగర్ చిరునామాతో మరో మూడు, పాన్ కార్డులు మూడు, కర్ణాటక నుంచి సంగ్రహించిన ఆధార్ కార్డులతో కలిపి మొత్తం 12 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై హబీబ్ ఇస్లాం ఖాన్, నజీరుద్దీన్ ఇస్లాం ఖాన్, ఇఫ్తెకార్ ఇస్లాం ఖాన్ పేర్లే ఉన్నాయి. వీటి ఆధారంగానే పంజగుట్ట, మలక్పేట, రాజేంద్రనగర్ ఠాణాల్లో ప్రైవేట్ కంప్లైంట్స్, ఇతర రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే శైలేష్ సక్సేనా మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకుండా తనకు ఏమీ తెలియదన్నట్లే వ్యవహరించాడు. యాకత్పుర చిరునామాకు వెళ్లి ఆరా తీయగా, అక్కడ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉంటున్నట్లు తేలింది. రాజేంద్రనగర్ చిరునామాలో సంప్రదించగా.. అక్కడ ఉంటున్న సయ్యద్ సిద్ధిఖీ అనే వ్యక్తి ఆ ముగ్గురూ తన బంధువులని, అప్పుడప్పుడు వచ్చి వెళ్తారని చెప్పు కొచ్చాడు. దీంతో ఈ ముగ్గురూ బోగస్ వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీలు, పాన్ కార్డుల ప్రతులతో ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖలకు లేఖలు రాశారు. వారి నుంచి వచ్చే జవాబుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోపక్క శైలేష్ సక్సేనాను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విచారించినా సరైన సమాధానాలు రాకపోవడంతో మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్రెడ్డి సైతం నిందితుడిగా ఉన్నాడు. ఇతడి పాత్రను ఆరా తీయడం పైనా అధికారులు దృష్టి పెట్టారు. -
ఉద్యోగాల పేరుతో బురిడీ
అద్దంకి: నకిలీ డాక్యుమెంట్స్, సీల్స్, ఐడీ కార్డులు ఉపయోగించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అద్దంకి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులకు సబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో సీఐ హైమారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. వెల్లంపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన వద్ద రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన వీరాంజనేయరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మారెళ్లకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలింది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ముఠాలో ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బూచి పాపన్నపాలేనికి చెందిన చింతా చిన్న ఓబయ్య, విజయవాడ బాలాజీ నగర్కు చెందిన ముప్పాళ్ల రేఖ, జి.ప్రవీణ్, గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు, పాత గుంటూరులోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన మాలావత్ హనుమంత్నాయక్, అనీల్కుమార్, రామిరెడ్డి, కొత్తపట్నం ఇందిరమ్మ కాలనీకి చెందిన వి.అంకయ్య, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన షేక్ హుస్సేన్, సంతమాగులూరు మండలం ఎనిగపాడుకు చెందిన తలారీ మాధవ, గుంటూరులోని పండరీపురానికి చెందిన ముప్పాళ్ల భవ్య, అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ చెందిన వర్మ(రవి) అనే 13 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో వెల్లంపల్లి శ్రీనివాసులు, చింతా చిన్న ఓబయ్య, ముప్పాళ్ల రేఖ, నక్కా చిన్న వెంకటేశ్వరరావు, వి.అంకయ్య, షేక్ హుస్సేన్, తలారి మాధవ, ముప్పాళ్ల భవ్య అనే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ విశ్వాసం వ్యక్తం చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. -
‘దూర విద్య’ దందా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయి. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిసినా, వాటిలో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు రాష్ట్రంలో చెల్లకున్నా.. తమ కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల గుర్తింపుతో ఇక్కడ కొనసాగుతున్న కాలేజీలు కూడా ఈజీ మనీ కోసం అక్రమాల బాట పట్టాయి. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇచ్చే భారీ కమీషన్ల కోసం తమ కాలేజీల్లో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఇలాంటి స్టడీ సెంటర్లు ఒకటీ రెండూ కాదు వందల్లో ఉన్నాయి. ఒక్క నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లే రాష్ట్రంలో 100కు పైగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20కి పైగా ఉండగా, ద్రవిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 40 వరకు ఉన్నాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, అన్నామలై యూనివర్సిటీ, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, వినాయక విద్యా మిషన్, మధురై కామరాజ్ తదితర యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెలంగాణలో తమ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యా మండలి కానీ, యూనివర్సిటీలు కానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నా ఉన్నత విద్యా మండలికి చలనం లేకుండా పోయింది. రెగ్యులర్గా చదువుకునే స్తోమత లేక.. రాష్ట్రంలో రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనివారే దూర విద్యా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలియక దారుణంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లను రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదన్న విషయం ఉన్నత విద్యా మండలికి తెలుసు. అయినా వాటిని నిర్వహిస్తున్న కాలేజీలకు ఎలాంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. స్టడీ సెంటర్ల నుంచి యూనివర్సిటీల అధికారులు ముడుపులు పుచ్చుకొని ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ విద్యార్థి వేరే రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రంలో (తెలంగాణలోని) చదివిన సర్టిఫికెట్ను పెడితే దాన్ని తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి.. సంబంధిత నిబంధనలపై కనీస ప్రచారం చేయడం లేదు. ఉద్యోగాల్లో అలాంటి సర్టిఫికెట్లను అనుమతించవద్దని చెబుతోందే తప్ప.. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లలో చదవవద్దన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సర్టిఫికెట్లను తెలంగాణలో చెల్లనివిగా పరిగణిస్తారన్న విషయం తెలియక విద్యార్థులు వాటిల్లో చేరుతూనే ఉన్నారు. బయటకు వచ్చినవి కొన్నే.. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. గతేడాది టీఎస్ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఘట్కేసర్లోని ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్కు అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యా మండలికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ విద్యార్థి సర్టిఫికెట్ చెల్లదంటూ ప్రవేశాన్ని తిరస్కరించారు. అలాగే భువనగిరి ప్రాంతంలో ఓ కాలేజీలో గీతమ్ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో మరో విద్యార్థి డిగ్రీ చదివాడు. అతను మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరగా.. సర్టిఫికెట్లను పరిశీలించిన ఉన్నత విద్యా మండలి అతని ప్రవేశాన్ని తిరస్కరించింది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్లోని దూర విద్యా కేంద్రంలో మరో విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి.. లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. ఇలా వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగాల్లోనూ అలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి తిరస్కస్తోంది. అనుమతి లేకున్నా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ (ఎఫ్.ఎన్ఓ.డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. దాంతోపాటు నిబంధనల కాపీని జత చేసి పంపించారు. అవే నిబంధనలను తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. కానీ తెలంగాణలో స్టడీ సెంటర్ల పెట్టవద్దని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు ఓ లేఖ రాయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కనీసం తమ ఆధీనంలోని కాలేజీల్లోనైనా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు పెట్టకుండా కట్టడీ చేయడం లేదు. ఇవేవీ చేయకున్నా అలాంటి స్టడీ సెంటర్లలో చేరవద్దని విద్యార్థుల్లో అవగాహన కూడా కల్పించడం లేదు. మా సర్టిఫికెట్లు చెల్లుతాయి: నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలోని తమ స్టడీ సెంటర్లలో చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని నాగార్జున యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి విద్యా అవకాశాల విధానం అమల్లో ఉన్నందున తమ స్టడీ సెంటర్లు కూడా చెల్లుబాటు అవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా యూనివర్సిటీల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి కనీసం ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితోనైనా ఈ విషయంపై చర్చించడం లేదు. -
అమ్మ..కంత్రీ!
చీమకుర్తి రూరల్: పొట్టపొడిస్తే అక్షరం ముక్కలేదు. చేసే పని గ్రానైట్ క్వారీల్లో పొక్లెయిన్ ఆపరేటర్. వచ్చే జీతం చాలదనుకున్నాడు. కంత్రీ తనానికి పాల్పడ్డాడు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఫైనాన్స్లో తాకట్టు పెట్టటం, పొక్లెయిన్లు, కార్లను తీసుకురావడం.. ఫైనాన్స్లో క్లియరెన్స్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించటం.. ఆ తర్వాత ఆ వాహనాలను వేరే ఫైనాన్స్లో పెట్టి మళ్లీ రుణాలు తీసుకోవడం.. లేక అదే వాహనాలను వేరే వారికి అమ్ముకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇదీ చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్ చీటింగ్ వ్యవహారం. వేలిముద్రగాడైన కంత్రీగాడి చేతిలో మోసపోయిన బాధితులు రెండు వారాల క్రితం ఎస్పీ ఆఫీస్తో పాటు చీమకుర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆయన చేతిలో మోసపోయిన ఇద్దరు ముగ్గురు బాధితులు తమ గోడును శుక్రవారం ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడి స్వస్థలం చీమకుర్తే నిందితుడు నైనాల చంద్రశేఖర్ స్వస్థలం చీమకుర్తిలోని గాంధీనగర్లోని 2వ లైన్. తండ్రి బేల్దారీ పనిచేసుకుంటుంటే తల్లి గేదెలు మేపుకుంటూ పాలు పోసి జీవనం సాగిస్తోంది. క్వారీలో పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేస్తాడు. పొక్లెయన్ కొనుక్కుంటానని అంటే అప్పుగా ఎదురుగా నివాసం ఉంటున్న అంబటి వెంకట రమణారెడ్డి రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అంతే కాకుండా బంధువుల ఇళ్లల్లో పెళ్లి ఉంది బంగారు నగలివ్వమంటే 10 సవర్ల బంగారు నగలు కూడా ఇచ్చి పంపించారు. అది చాలదన్నట్లుగా రూ.17 లక్షల విలువ చేసే పొక్లెయిన్ను తీసుకెళ్లాడు. ఇంత వరకు బండి లేదు. అప్పుతీసుకున్న డబ్లుల్లేవు, పెళ్లికి వెళ్లి వస్తానని తీసుకెళ్లి నగలూ లేవని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఫక్కీలో పొక్లెయిన్ స్వాధీనం టంగుటూరు మండలం కందులూరుకు చెందిన ఒక వ్యక్తి ఫైనాన్స్లో రూ.40 లక్షలు విలువ చేసే పొక్లెయిన్ తీసుకునేందుకు అప్రూవల్ చేయించుకున్నాడు. దాన్ని ఆయనకు తెలియకుండానే సినీ ఫక్కీలో తీసుకున్నాడు. తీరా ఆ బండి వాయిదాలు చెల్లించకపోవడంతో కందులూరు వ్యక్తికి నోటీసులు వచ్చాయి. ఇలా ఎందుకు చేశావని చంద్రశేఖర్ను అడిగితే తాను చెల్లిస్తానంటూనే బండితో పాటు కనపడకుండా పోయాడని బాధితుడు వాపోయాడు. తవ్వుతూ పోతుంటే ఇలాంటివి దాదాపు 10–15 కేసులు ఉన్నట్లు తెలిసింది. రామతీర్థానికి సమీపంలో ఉన్న ఇద్దరికి చెందిన రెండు పొక్లెయిన్లు తీసుకెళ్లి కనపడలేదు. చీమకుర్తి, టంగుటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాలను ఆధారంగా చేసుకొని దాదాపు 8–10 పొక్లెయిన్లు తీసుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రామతీర్థం పరిధిలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కట్టి దాని సర్వే నంబర్ మార్చి మళ్లీ రుణం తీసుకొని దాన్ని వేరే వారికి అమ్ముకొని పోయినట్లు తెలిసింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో కారు తీసుకొని క్లియరెన్స్ అయినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కారును వేరే వారికి అమ్ముకొని పోయినట్లు తెలిసింది. నిందితుడిపై చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫేక్ సర్టిఫికేట్స్: స్పందించిన హర్మన్ ప్రీత్
న్యూఢిల్లీ : నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించారని టీమిండియా మహిళా టీ 20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను పంజాబ్ పోలీస్ శాఖ డీఎస్పీ ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించారు. అవి నకిలీ సర్టిఫికేట్స్ కాదని తాను పరీక్షల్లో పాసై పొందినవేనని స్పష్టం చేశారు. ఆమె ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘నేను పోస్ట్ గ్రాడ్జ్యూయేషన్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను. వీదేశీ పర్యటనల వల్ల ఆ పరీక్షలకు హాజరుకాలేకపోయాను. కానీ నా డిగ్రీ సర్టిఫికేట్ను నకిలీవి అంటున్నారు. మీలాగా నేను హెడ్ ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్రోల్మెంట్ నెంబర్తో రుజువు చేయలేను. ఎందుకంటే నేను క్రికెటర్. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను. నేను అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యాను. ప్రతి సర్టిఫికేట్ లీగలే. ఢిల్లీలో నేను పరీక్షలు రాశాను. నాసబ్జెక్ట్లు సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, జనరల్ అవార్నెస్’ అని తెలిపారు. అయితే ఈ మహిళా క్రికెటర్ను ఏకకాలంలొ కష్టాలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండగా.. మరోవైపు ఈ నకిలీ సర్టిఫికేట్స్ వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఆమె తన డీఎస్పీ ఉద్యోగాన్ని కోల్పోయారు. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఒంటి చేత్తో హర్మన్ ప్రీత్ భారత్ను గెలిపించారు. ఈ ప్రదర్శనకు మెచ్చి పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. అయితే పోలీస్ శాఖకు సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్ నకిలీవని తేలడంతో వారు ఉద్యోగం నుంచి తొలిగించారు. చదవండి: హర్మన్ ఇప్పుడు డీఎస్పీ కాదు! -
బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
బాపట్ల: నకిలీ పత్రాలు, బినామీ పేర్లతో ఐడీబీఐ బ్యాంకుకు టోకరా పెట్టిన వ్యవహారం బాపట్ల నియోజకవర్గాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు బాపట్లకు చెందినవారే. ఈ కేసులో బినామీలుగా ఉన్న 253 మంది కూడా బాపట్లకు చెందిన వారు కావడం, సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2010 సంవత్సరంలో జరిగిన ఈ స్కాములో సీబీఐ అధికారులు విశాఖపట్నంలో మూడు కేసులు, హైదరాబాద్ ఒక కేసులో ప్రధాన నిందితులతోపాటు మరో 253 మందిని నిందితులుగా తేల్చారు. వారి నుంచి అసలు, వడ్డీ కలిపి రూ.141.12 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాన నిందితులుగండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు, ఐడీబీఐ బ్యాంకు అప్పటి మేనేజర్ హరీష్ను ఇప్పటికే అరెస్టు చేశారు. హైదరాబాద్లో మరో ఎఫ్ఐఆర్ గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు ఐడీబీఐ బ్యాంకులో నకిలీ పత్రాలు, బినామీ పేర్లుతో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవటంతో సంస్థ జనరల్ మేనేజర్ ధనుంజయ్లాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 22వ తేదీన హైదరాబాద్లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. రూ.33.81కోట్ల అసలు, వడ్డీతో కలిపి రూ.93.73కోట్లు బ్యాంకుకు చెల్లించాలని 142 మందిపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలో గతేడాది జనవరి 23వ తేదీన రూ.10.42 కోట్లు అసలు, వడ్డీతో కలిపి రూ.20 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన 45 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది జనవరి 28వ తేదీన రెండో ఎఫ్ఐఆర్లో అసలు, వడ్డీ కలిపి రూ.17.09 కోట్లు చెల్లించాలని 35 మందిపై, అసలు వడ్డీ కలిపి రూ.10.14కోట్లు చెల్లిం చాలని 25 మందిపై మూడో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రధాన నిందితులతోపాటు బ్యాం కులో ఆస్తులకు సంబంధించిన అంచనాలు వేసినవారిలో మరో ఆరుగురు సహా 253 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితులను అరెస్టు కావడంతో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కువ మంది చిన్న, సన్నకారురైతులు, వ్యవసాయకూలీలే. పనికి వెళ్లకపోతే పూటగడవని కూలీలను కూడా బినామీలుగా చూపటం తీవ్ర చర్చానీయాంశమైంది. -
హర్మన్ ప్రీత్ డీఎస్పీ హోదా తొలగింపు..!
చంఢీఘడ్ : భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ డీఎస్పీ హోదాను తొలిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పోలీస్ శాఖ అవి నకిలీవేనని తేల్చింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ డీఎస్పీ ర్యాంకు హోదాను తొలిగించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత్కు ఫైనల్కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్నైట్ స్టార్ అయ్యారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్ప్రీత్ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించారు. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది. దీంతో.. ఇక నుంచి హర్మన్ప్రీత్ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలో ఒప్పుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. హర్మన్ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. ఒకవేళ హర్మన్ప్రీత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ ఘటనపై హర్మన్ప్రీత్ కౌర్ మేనేజర్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే సర్టిఫికేట్తో ఆమె రైల్వేలో ఉద్యోగం చేసిందని, అది ఇప్పుడేలా నకిలీది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఆమె పంజాబ్ పోలీస్ శాఖలో చేరేంత వరకు రైల్వే ఉద్యోగం చేశారు. -
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు
పెద్దఅంబర్పేట: ఇంటర్నెట్ కేంద్రంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్ట్యాప్, మూడు సెల్పోన్లు, రూ.6వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన తంగిరాల ఎల్లయ్య కుమారుడు తంగిరాల నాగేష్ అలియాస్ నాగ గత కొన్ని నెలలుగా అబ్దుల్లాపూర్మెట్ కేంద్రంలో డాట్ ఇంటర్నెట్ సెంటర్ను నడుపుతున్నాడు. అయితే సమీపంలో ఉన్న నోవా కళాశాలకు చెందిన నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేస్తూ ఒక్కోకార్డుకు రూ.500 వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటూ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రామకృష్ణాపురంకు చెందిన నీరటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు నీరటి రఘుపతి అలియాస్ రఘుకు నాగేష్తో పరిచయం ఏర్పడింది. దీంతో కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేస్తే డబ్బు సంపాదించవచ్చునని రఘు.. నాగేష్తో చెప్పడంతో అందుకు అంగీకరించిన నాగేష్ సర్టిఫికెట్లు తయారు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు బుధవారం నెట్ సెంటర్పై దాడి చేయగా ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 11 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ల్యాప్ట్యాప్, రూ.6వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులిద్దర్నీ రిమాండ్కు తరలించారు. -
బుక్కయిన మహిళల టీ20 కెప్టెన్..!
భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన హర్మన్ప్రీత్ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కొల్పోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్ప్రీత్ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పంజాబ్ డీజీపీ ఎంకే తివారీ ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ‘హర్మన్ప్రీత్ తాను మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ అందజేసింది. కానీ వెరిఫికేషన్లో ఆ యూనివర్సిటీ అధికారులు హర్మన్ప్రీత్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ రిజిస్ర్టేషన్ నంబర్ తమ రికార్డులో లేదని తెలిపారు. ఈ నివేదికను సంబంధిత శాఖలకు అందజేశామ’ని తెలిపారు. తర్వాత స్పందిస్తాను : హర్మన్ప్రీత్ దీనిపై హర్మన్ప్రీత్ వివరణ కోరగా.. ‘అలాంటిది ఎం జరగలేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను’ అని తెలిపారు. -
‘మార్చ్ ఎండింగ్’ను వాడేసుకున్నారు!
సాక్షి, సిటీబ్యూరో : ఆర్థిక సంవత్సరం ముగింపు సమయమైన మార్చ్ ఎండింగ్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా బిజీగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే రుణ దరఖాస్తులను అన్ని కోణాల్లోనూ పరిశీలించకుండా ఏజెంట్లను నమ్ముతాయి. దీనిని అనుకూలంగా మార్చుకుందో త్రయం. ఇద్దరు బ్యాంకు ఏజెంట్లతో ముఠా కట్టిన సూత్రధారి ఆరు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేయడం ద్వారా కేవలం 20 రోజుల్లో రూ.77 లక్షలు రుణం తీసుకుని ఎగ్గొట్టాడు. గతేడాది చోటు చేసుకున్న ఈ స్కామ్పై రెండు ఆర్థిక సంస్థలు ఇటీవల పంజగుట్ట, బేగంపేట ఠాణాల్లో ఫిర్యాదులు చేశాయి. రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.66 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్రావు గురువారం వెల్లడించారు. జీతం సరిపోకపోవడంతో... పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ ఐటీఐ పూర్తి చేసి 2001లో సిటీకి వలసవచ్చాడు. గచ్చిబౌలిలోని విప్రో సంస్థలో కమ్యూనికేషన్స్ విభాగంలో నెలకు రూ.30 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఈ జీతంతో జల్సాలు, కుటుంబ పోషణ సాధ్యం కాకపోవడంతో అప్పులు పెరిగాయి. వీటి నుంచి బయపడే మార్గాలు అన్వేషిస్తున్న ఇతడికి కూకట్పల్లికి చెందిన వేణుగోపాల్లో పరిచయం ఏర్పడింది. నకిలీ పత్రాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడం ఎలాగో నేర్పిన ఇతగాడు అందుకు అవసరమైన బోగస్ పాన్కార్డులు, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువీకరణలు సైతం తయారు చేసి ఇచ్చాడు. వీటి ఆధారంగా రుణాలు తీసుకోవడానికి మార్చ్ ఎండింగ్ సరైన సమయమంటూ సూచించాడు. అయితే బోగస్ పత్రాల ఆధారంగా రుణం పొందాలంటే బ్యాంకు ఏజెంట్ల సహకారం ఉండాలని భావించిన శ్రీనివాస్ సోమాజిగూడ, మియాపూర్లకు చెందిన మల్లికార్జునరావు, నాగిరెడ్డిలను తనతో కలుపుకున్నాడు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకునే రుణంలో సగం వీరు, మిగిలిన సగం శ్రీనివాస్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఐదు సంస్థలు..రూ.77 లక్షలు... విప్రోలో పని చేస్తున్న శ్రీనివాస్ అక్కడ ధ్వంసం చేయాల్సిన డేటా నుంచి కొన్ని ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించాడు. వీటి ఆధారంగా వేణుగోపాల్ సాయంతో బోగస్ పత్రాలు, «ధ్రువీకరణలు తయారు చేయించాడు. శ్రీనివాస్ జీతం రూ.30 వేలు కాగా, దీనిని రూ.1.26 లక్షలకు పెంచుతూ నకిలీ పే స్లిప్స్ రూపొందించారు. వీటిని దాఖలు చేస్తూ ఈ ముఠా గతేడాది మార్చ్లో మొత్తం ఆరు సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసింది. ఏజెంట్లు మల్లికార్జున్, నాగిరెడ్డి ఫీల్డ్ వెరిఫికేషన్ స్టాఫ్ను, రుణ మంజూరు అధికారులను ఏమార్చడంతో రుణాలు మంజూరయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు, సిటీ బ్యాంక్ నుంచి రూ.12 లక్షలు, ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.12.5 లక్షలు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు, క్యాపిటల్ ఫస్ట్ సంస్థ నుంచి రూ.15 లక్షలు, టాటా క్యాపిటల్ సంస్థ నుంచి రూ.12.5 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తంలో సగం మల్లికార్జున్, నాగిరెడ్డి తీసుకోగా మిగిలింది శ్రీనివాస్ పట్టుకుని తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అప్పులు తీర్చడంతో పాటు జల్సాలకు ఖర్చు చేశాడు. ఏడాది ఆలస్యంగా ఫిర్యాదులు... ఈ వ్యక్తిగత రుణాలకు సంబంధించి శ్రీనివాస్ ప్రతి నెల వాయిదాలు చెల్లించకపోవడంతో క్యాపిటల్ ఫస్ట్, సిటీ బ్యాంక్ సంస్థలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో తమకు దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తుల్లో ఉన్న ఫొటో శ్రీనివాస్ది కాదని తేలింది. వేరే వారి ఫొటో అతడి వివరాలతో వీటిని రూపొందించారని, విప్రోలోనూ ఉద్యోగం మానేసినట్లు బయటపడింది. కూకట్పల్లిలో అతడు ఇచ్చిన చిరునామా సైతం బోగస్గా గుర్తించారు. అయినప్పటికీ దాదాపు ఏడాదికి పైగా ఆల స్యం చేసిన ఈ రెండు సంస్థలూ ఇటీవల పం జగు ట్ట, బేగంపేట ఠాణాలో ఫిర్యాదు చేశాయి. నార్త్జో న్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు శ్రవణ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీకాంత్, కేఎస్ రవి రంగంలోకి దిగారు. అనేక ప్రాంతాల్లో గాలించి గురువారం శ్రీనివాస్, మల్లికార్జున్, నాగిరెడ్డిలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.8.66 లక్షల నగదు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కు సంబంధించిన మరో నిందితుడు వేణుగోపాల్ ఆచూకీ లభించట్లేదు. శ్రీనివాస్ నుంచి తీసుకోవాల్సిన కమీషన్ సైతం అతడు తీసుకోలే దు. అతడు చనిపోయాడంటూ శ్రీనివాస్ చెబుతుండటంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. దొంగలకు రోజుల్లో రుణాలు బోగస్ పత్రాలు, నకిలీ ధ్రువీకరణలతో దరఖాస్తు చేస్తున్న దొంగలకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కేవలం రోజుల్లో రుణాలు ఇచ్చేస్తున్నాయి. సాధారణ వ్యక్తులు పక్కాగా అప్లై చేసుకున్నా వారాలు, నెలలు తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించాలి. తమ వైఖరి మార్చుకుంటూ సంస్థాగతంగా ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. ఏదైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేయాలి. ఈ కేసులో బ్యాంకు సిబ్బంది, అధికారుల పాత్ర ఉందా? అనే కోణ ంలో ఆరా తీస్తున్నాం. ఫీల్డ్ వెరిఫికేషన్ సిబ్బ ంది వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆధారాలు లభిస్తే వారినీ అరెస్టుచేస్తాం. – పి.రాధాకిషన్రావు, డీసీపీ, టాస్క్ఫోర్స్ -
ఎన్డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రిన్సిపాల్తో పాటు నలుగురు బోధనా సిబ్బందిపై సీబీఐ బుధవారం కేసు నమోదుచేసింది. బోధనారంగంలో అనుభవం, పనీతీరుపై నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఐదుగురు నిందితులు ఎన్డీఏలో ఉద్యోగాలు పొందారని అరోపించింది. కేసు నమోదుచేసిన అనంతరం సీబీఐ అధికారులు ఖడక్వాస్లాలోని ఎన్డీఏ ప్రాంగణంతో పాటు నిందితుల ఇళ్లపై దాడిచేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ స్పందిస్తూ.. పుణేలో ఉన్న ఎన్డీఏ–ఖడక్వాస్లా ప్రిన్సిపాల్ ఓంప్రకాశ్ శుక్లా, ప్రొఫెసర్ జగ్మోహన్ మెహెర్(పొలిటికల్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్లు వనీతా పూరి (కెమిస్ట్రీ), రాజీవ్ బన్సల్(గణితం), కెమిస్ట్రీ విభాగం హెచ్వోడీ మహేశ్వర్ రాయ్పై కేసు నమోదుచేశామని తెలిపారు. అలాగే యూపీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి(హెచ్క్యూ–ఐడీఎస్) చెందిన గుర్తుతెలియని అధికా రిపైన కూడా కేసు నమోదుచేశామన్నారు. ఖడక్వాస్లాలోని ఎన్డీఏలో 13 మంది అర్హతలేని బోధనా సిబ్బంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై గతేడాది ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు గౌర్ తెలిపారు. సాధారణంగా ఎన్డీఏలో బోధనా సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందనీ, యూపీఎస్సీ సిఫార్సు ఆధారంగా రక్షణశాఖ నియామకాలు చేపడుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీతో పాటు హెచ్క్యూ–ఐడీఎస్లోని కొందరు అధికారుల సాయంతో ఈ ఐదుగురు నిందితులు 2007–08, 2012–13 మధ్యకాలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో కేసు నమోదుచేశామని వెల్లడించారు. -
నకిలీ పత్రాల ముఠా గుట్టురట్టు.. పాకిస్తానీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పత్రాలతో పాకిస్తాన్ పౌరుడు మమ్మద్ ఉస్మాన్ ఇక్రాన్ భారతీయ పాస్ పోర్టు పొందాడు. దీనికి కారణమైన ముఠాను శనివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మాన్ ఇక్రాన్ దుబాయ్లో పని చేసే సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. అతను అక్కడి నుంచి సరిహద్దులు దాటి నగరానికి వచ్చాడు. అక్కడ పరిచయమైన మహిళతో అతను సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు 12 సంవత్సరాల కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా ఉస్మాన్ ఆ బాలికను వేధిస్తున్నాడని సమాచారం. దీంతో ఆమె ఉస్మాన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఆ మహిళతో అతను దుబాయ్ పౌరుడినని చెప్పాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు ఉస్మాన్ పాకిస్తానీ అని తెలిసింది. ఆరు మాసాలుగా అతను నగరంలో ఉంటూ స్థానికుడికి అవసరమైన పలు ధ్రువీకరణ పత్రాలు సంపాదించాడు. అంతేకాక ఆ పత్రాలతోనే పాస్ పోర్టు పొందాడు. దీనిపై సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న కరీంగనర్ జిల్లాకు చెందిన మసూద్ హైమద్ అనుతో పాటు అతని సహకరిస్తున్న కాజా, మరో వ్యక్తిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో సైబర్ క్రైం పోలీసులు హాజరుపరిచారు. వేలమందికి నకిలీ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు విచారణలో మసూద్ ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి భారీగా నకిలీ డాక్యుమెంట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. -
చనిపోయిన వ్యక్తి జీపీఏ చేశాడట!
సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో (ఎంహెచ్ఏ) క్లర్క్గా పని చేస్తు న్న వ్యక్తి ఇచ్చిన సలహాతో భారీ స్కెచ్ వేశాడు. పుణేకు చెందిన కాందిశీకుడు పుప్పాలగూడలోని 50 ఎకరాలు తనకు విక్రయించినట్లు పత్రాలు సృష్టించాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి భూమి తన పేరిట బది లీ చేయించుకున్నాడు. రంగారెడ్డి కలెక్టర్ ద్వారా విషయం సీసీఎస్ పోలీసులకు చేరడంతో కథ అడ్డం తిరిగింది. చనిపోయిన వ్యక్తి ఏడాది తర్వాత జీపీఏ చేసినట్లు పత్రాలు సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు మొత్తం ఐదుగురు నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు రూ.750 కోట్ల విలువైన ఆ భూమి ప్రభుత్వ పరం కానుంది. ఎంహెచ్ఏ క్లర్క్ ఇచ్చిన సలహాతో... నగరానికి చెందిన న్యాయవాది చెట్ల రాజయ్య లక్ష్మీనారాయణ గతంలో జీపీ ఫర్ రెవెన్యూగా పని చేసిన నేపథ్యంలో నిత్యం ఢిల్లీలోని వివిధ కార్యాలయాలకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఎంహెచ్ఏలోని సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయంలో క్లర్క్గా పనిచేసే దేవేందర్ కుమార్ జైన్తో పరిచయమైంది. ఆయన 1950లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చి కాందిశీకుడిగా మారిన హేమన్దాస్ హెచ్ మకీజ భూమి గురించి లక్ష్మీనారాయణకు చెప్పారు. ఆయనకు అప్పటి సెటిల్మెంట్ కమిషనర్ పుప్పాలగూడ ప్రాంతంలో 50 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని భౌతికంగా పొందక ముందే హేమన్దాస్ 1970లో మరణించగా... ఆయన కుమారుడైన భగవాన్ దాస్ మకీజ పుణేలో స్థిరపడ్డారు. అనంతరం భగవాన్ దాస్ ఈ స్థలం విషయం పట్టించుకోలేదు. ఇదే విషయం జైన్ ద్వారా లక్ష్మీనారాయణకు తెలిసింది. భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి... భారత్లో భూముల పొందిన కాందిశీకులు తమ వారసుల వివరాలను ఢిల్లీలో ఉండే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద ఉండే క్లైమ్ ఇండెక్స్లో నమోదు చేయించాలి. విషయం తెలిసిన హేమన్దాస్ తన కుమారుడు భగవాన్ దాస్ పేరును ఇండెక్స్లో నమోదు చేయించారు. పుప్పాలగూడలో ఉన్న 50 ఎకరాలు స్వాహా చేయడం సాధ్యమైతే తనకు కమీషన్ ఇవ్వాలనే ఒప్పందంతో జైన్ ఈ వివరాలన్నింటినీ లక్ష్మీనారాయణకు చెప్పారు. దీంతో భగవాన్దాస్ మకీజ ఆ 50 ఎకరాలను తనకు విక్రయిస్తూ 1996లో జీపీఏ చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ పత్రాలు సృష్టించారు. 2003లో కేటాయించిన సీసీఎల్ఏ ఈ నకిలీ పత్రాల ఆ«ధారంగా సీసీఎల్ఏ పుప్పాలగూడలోని భూమిని 2003లో లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఇది నిబంధన ప్రకారం జరగలేదనే ఉద్దేశం తో 2006లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి హైకోర్టును ఆశ్రయించగా ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై లక్ష్మీనారాయణ 2016లో సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశా రు. దీంతో ఆ సమయంలో కలెక్టర్గా పని చేస్తున్న రజిత్ కుమార్ సేన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో.. సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాసులు ఆరా తీయగా.. భగవాన్దాస్ 1995లోనే చనిపోయినట్లు తేలింది. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పత్రాల్లో భగవాన్దాస్ 1996లో జీపీఏ చేసినట్లు ఉంది. దీంతో ఇవి బోగస్ పత్రాలుగా నిర్ధారించిన అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆయనతో పాటు దేవేందర్ కుమార్ జైన్, మిర్యాల నరసింహను గతంలో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులపై నాంపల్లి కోర్టులో గతవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టులో దాఖలు చేసి, ఆ 50 ఎకరాలు ప్రభుత్వ పరం చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండూ ఖరీదు చేసింది ఒకరే ‘కాందిశీకుడైన మలానీ స్కామ్లో పుప్పాలగూడలోని 148 ఎకరాలను సుకుమారెడ్డి నుంచి నందకిశోర్ ఖరీదు చేశారు. ఈ మకీజ స్కామ్లోనూ న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి 2005లో ఆ 50 ఎకరాలనూ నందకిశోరే రూ.3 కోట్లకు కొన్నారు. ఈ నేపథ్యంలోనే మకీజ కేసులో నందకుమార్తో పాటు ఈ స్కాంలో పాత్ర ఉన్న పి.కృష్ణను నిందితుడిగా చేర్చి, నోటీసులు జారీ చేశాం. మా విచారణ ఫలితంగా పుప్పాలగూడలోని విలువైన 198 ఎకరాల భూమి ప్రభుత్వ పరం కానుంది’ – డాక్టర్ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ ఏసీపీ -
విద్యుత్ శాఖలో నకిలీ కలకలం
కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలంకలం సృష్టిస్తోంది. ఇందులో కొందరు లైన్మ్యాన్లు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో బహిర్గతం కావడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరి అర్హులకు అన్యాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విచారణ నివేదిక ఉన్నతాధికారులకు పంపినా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖకే ఝలక్.. నిత్యం వినియోగదారులకు షాక్ ఇచ్చే విద్యుత్ శాఖకు నకిలీ వీరులు ఝలక్ ఇచ్చారు. ఐటీఐ చదవకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కొత్తేమీ కాకపోయినా తాజాగా బయటపడిన భాగోతం మాత్రం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జిల్లా వ్యాప్తంగా నలుగురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తేలింది. వీరిలో కర్నూలు డివిజన్లో ముగ్గురు, డోన్ డివిజన్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా వీరంతా 2003 బ్యాచ్కు చెందిన వారని, 69 మంది ఉన్న ఆ బ్యాచ్లో మరికొంత మంది నకిలీలు ఉన్నారని సమాచారం. సీజేఎల్ఎంగా చేరి జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్మ్యాన్లుగా పదోన్నతులు పొంది నెలకు రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నట్లు తెలుస్తోంది. డబ్బివ్వండి.. నేను చూసుకుంటా ‘నాకు డబ్బివ్వండి.. అంతా నేను చూసుకుంటా’ అని జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి నకిలీ లైన్మ్యాన్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ‘నాకు పైన అంతా తెలిసిన వాళ్లే.. మీపై చర్యలు లేకుండా చూస్తా’ అంటూ రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బయటపడింది ఇలా.. ఓ అజ్ఞాత వ్యక్తి ‘విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన్మన్ చిన్నప్పటి నుంచి తనతోపాటు చదివాడని, అతడు ఐటీఐ చేయలేదని, అతడిది బోగస్ సర్టిఫికెట్ అని, దీనిపై విచారణ జరపాలి’ అంటూ ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టాడు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అతడితోపాటు మరో ముగ్గురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజిలెన్స్ ఎస్ఐ స్థాయి అధికారి సంబంధిత కళాశాలలకు వెళ్లి ఆరా తీయగా బోగస్ సర్టిఫికెట్లుగా తేలినట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు రిపోర్టును చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు పంపగా ఆయన వాటిని జేఎండీకి, ఆక్కడి నుంచి ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమచారం. బోగస్ అని తేలాకా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందుకు అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. -
ఇద్దరు మహిళల అరెస్టు
తెనాలి రూరల్ : చోరీ కేసులో బెయిల్ నిమిత్తం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు గానూ ఇద్దరు మహిళల్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరికి సహకరించిన నర్సరావుపేటకు చెందిన న్యాయవాది అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. వివరాలు..2016లో పట్టణంలో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి నిందితురాలు అరుణను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అదే ఏడాది కోర్టులో హాజరుపర్చారు. ఆమె బెయిల్ కోసం వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళలు గండికోట శివ, ముద్రబోయిన వెంకటరత్నం హామీ ఇస్తామంటూ ముందుకొచ్చారు. రేపల్లె మండలం ఉప్పుడి గ్రామంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉన్నాయంటూ నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించగా, అరుణ బెయిల్ పొందింది. ఈ పత్రాల పరిశీలనకు రేపల్లె ఎంపీడీవో కార్యాలయానికి రాగా, నకిలీవని తేలింది. ఎంపీడీవో సుధారాణి ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీసులు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి నర్సరావుపేటకు చెందిన న్యాయవాది బి. కల్యాణ్ సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని, త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ జె. క్రాంతికిరణ్ తెలిపారు. -
రూ.17 కోట్ల ఆస్తులు తనఖా పెట్టి రూ.86 కోట్ల రుణం
-
జూపల్లి వారసులపై సీబీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ మంత్రి కుమారులు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి ఆ భూములను బ్యాంకుల్లో తనకా పెట్టారు. మార్కెట్ విలువ కన్నా నాలుగొంతులు అధిక విలువ చూపి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో స్టేట్ ఆఫ్ ఇండి యా నుంచి కోట్ల రుణాలు తీసుకొని కంపెనీల్లోకి మళ్లించారు. రుణాలు చెల్లించకపోవడంతో తన ఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాం కు అధికారులు సిద్ధమయ్యారు. అప్పుడే అసలు కథ బయటపడింది. తనఖా పెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు పొంతన లేకపోవడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుల ఈ ‘తనఖా’మాయాజాలంపై సీబీఐ రంగంలోకి దిగింది. అసలేం జరిగింది? మంత్రి జూపల్లి కుమారులు వరుణ్, అరుణ్ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. 2011లో వారు శైలి ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. దాన్ని 2015లో క్రిద్యా ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీదకు మార్చారు. ఈ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలకు జూపల్లి అరుణ్, వాసిరెడ్డి కిరణ్రెడ్డి హమీదారులుగా ఉన్నారు. అరుణ్.. అమీర్పేట్లోని రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్లోని మూడు ఫ్లాట్లు, గండిపేట కిస్మత్పూర్లోని 3.2 ఎకరాల భూమి, గగన్పహాడ్లోని ఇల్లును తనఖా పెట్టి 2015 నాటికి ఎస్బీఐ నుంచి రూ.64.80 కోట్ల రుణం పొందారు. వీటిని చెల్లించకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఎస్బీఐ అరుణ్కు నోటీసులు ఇచ్చింది. 2016లో తనఖా పెట్టిన ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. తనఖా పెట్టిన ఈ ఆస్తులను బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిశీలించగా రూ.7.75 కోట్లే ఉందని తేలింది. దీంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టాల్సిన వచ్చింది. కంపెనీ కోసం తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి ఈ ఏడాది జనవరికల్లా రూ.86.30 కోట్లకు చేరింది. మార్కెట్ విలువలో గోల్మాల్ చేసి అరుణ్ బ్యాంకు రుణం పొందినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తనఖా పెట్టిన మొత్తం ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.17.79 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంకుకు రూ.68.50 కోట్ల నష్టం మిగలనుంది. గతేడాదే సీబీఐ నోటీసు బోగస్ పత్రాలతో కోట్లు రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించింది. దీనిపై ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు అంది నట్లు తెలిపింది. గత జూలై 28నే జూపల్లి అరుణ్కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలంటూ గతేడాది ఆగస్టు 18న సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ సంజయ్ దూబే అరుణ్కు జారీ చేసిన నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదీ మాయాజాలం.. సాధారణంగా ఎవరైనా భూములు కొన్న సందర్భంలో మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా చూపిస్తారు. కానీ జూపల్లి అరుణ్ మాత్రం రిజిస్ట్రేషన్ విలువను మార్కెట్ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన ఆ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కిస్మత్పూర్లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంంటే.. అరుణ్ దాని రిజిస్ట్రేషన్ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్పహాడ్లోని ఇల్లు మార్కెట్ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్లో రూ.2.5 కోట్లుగా చూపించారు. -
అచ్చం సినిమాలాగే.. బుక్కైన తండ్రి!
సాక్షి, న్యూఢిల్లీ : అచ్చం ‘హిందీ మీడియం’ సినిమా తరహాలోనే ఓ వ్యక్తి తన కొడుకుకు ప్రముఖ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అక్రమమార్గం తొక్కాడు. తాము సంపన్నులు అయినప్పటికీ.. నిరుపేదగా పేర్కొంటూ నకిలీ పత్రాలు పొంది.. కొడుకును ప్రఖ్యాత విద్యాసంస్థలో చేర్పించాడు. తాజాగా నకిలీ ధ్రువపత్రాల రాకెట్ పట్టుబడటంతో అతని బాగోతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన గౌరవ్ గోయల్ తన కుమారుడిని న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివించాలని ఆశపడ్డాడు. నకలీ సర్టిఫికేట్స్ సృష్టించి ఆర్థికంగా వెనుకబడినవర్గం కింద 2013 సంవత్సరంలో ఆ పాఠశాలలో కొడుకును చేర్పించాడు. తాజాగా అతని గుట్టురట్టు కావడంతో జైలుపాలైయ్యాడు. శనివారం అతనితోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాధుర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, కొడుకుని ఉన్నత పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ్ గోయల్ నకిలీ ఇన్కం సర్టిఫికేట్ సంపాదించాడు. దీనితోపాటు అడ్మిషన్కు కావల్సిన ఇతర పత్రాలను కూడా నకిలీవి సృష్టించాడు. 2015లోనే ఉన్నత విద్యాసంస్థల్లో నకిలీ పత్రాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి నీరజ్ కుమార్ వద్ద నుంచి గౌరవ్ ఈ నకిలీ పత్రాలు పొందాడు. సర్టిఫికేట్ బ్రోకర్ అయిన నీరజ్ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో గౌరవ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కో నకిలీ పత్రాన్ని సృష్టించేందుకు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నీరజ్ ఒప్పుకున్నాడు. -
నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా అరెస్ట్
రాజంపేట: జిల్లాలో నకలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు సంపాదించే ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనగలూరుకు చెందిన బసిరెడ్డి వెంకటశివారెడ్డి 2012లో కువైట్కు వెళ్లి యేడాదిన్నర తర్వాత జీతం సరిపోక తిరిగి వచ్చాడు. మళ్లీ వెళ్లాలనుకొనే సమయంలో మెడికల్ అన్ఫిట్ కావడంతో పాత పాస్పోర్టు చెల్లలేదు. దీంతో ఎలాగైనా కువైట్కు వెళ్లాలనుకుని తమ గ్రామానికి చెందిన నర్సారెడ్డికి తన సమస్యను చెప్పుకున్నాడు. అతను బద్వేలుకు చెందిన పెంచల్రెడ్డి వద్ద నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించి ఇస్తానని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత వీరు బద్వేలుకు వెళ్లి పెంచల్రెడ్డిని సంప్రదించారు. అతను తప్పుడు చిరునామాతో నకిలీ ఓటరు కార్డు తయారు చేశాడు. అనంతరం బద్వేలులోని ప్రసాద్ ఆన్లైన్ సర్వీసెస్ అనే మీసేవ సెంటర్లో యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్ సాయంతో శివారెడ్డి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ నెంబరు పైన నకిలీ చిరునామా అప్డేట్ చేశాడు. ఈ ఆధార్తో పాస్పోర్టుకు దరఖాస్తు చేసి పాస్పోర్టు తీసుకున్నారు. ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినందుకు శివారెడ్డి వద్ద పెంచల్రెడ్డి రూ.25వేలు డబ్బులు తీసుకున్నాడన్నారు. ఇందులో నర్సారెడ్డి , మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్కు వాటా ఇచ్చాడన్నారు. ఈనెల 24న మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్తో పాటు శివారెడ్డి, నర్సారెడ్డిలను అరెస్టు చేశామన్నారు. పెంచల్రెడ్డి పరారీలో ఉన్నాడన్నారు. శివారెడ్డి ఒరిజనల్ ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఓటరు కార్డును సీజ్ చేశామని వివరించారు. సమావేశంలో మన్నూరు ఎస్ఐ మహేశ్నాయుడు, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ ఫీల్డ్ అధికారి అరెస్ట్
ఆకివీడు: నకిలీ ధ్రువపత్రాలతో రూ.కోటి మేర రుణాలు ఇప్పించి అనంతరం ఉద్యోగ విరమణ చేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ ఫీల్డ్ అధికారి చేబ్రోలు పాండురంగాచార్యులును శుక్రవారం భీమవరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాండురంగాచార్యులు 2007–10 మధ్య కాలంలో ఆకివీడుకు చెందిన కూన సత్యనారాయణ అనే వ్యక్తికి నకిలీ ధ్రువపత్రాల ద్వారా రూ.కోటి పైనే రుణాలు అందజేశాడు. అప్పట్లోనే దీనిని గుర్తించి బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సత్యనారాయణను అరెస్టు చేశారు. అయితే పాండురంగాచార్యులు ఉద్యోగ విరమణ అనంతరం తప్పించుకుని హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. శుక్రవారం భీమవరంలోమేనల్లుడి వివాహానికి హాజరైన పాండురంగాచార్యులును భీమవరం రూరల్ సీఐ ఎస్.ఎస్.వి.నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతనిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఆకివీడు ఎస్సై కె.సుధాకరరెడ్డి చెప్పారు. -
చచ్చినోడి పేరుతో ఆధార్ కార్డు
దుండిగల్: చనిపోయిన వ్యక్తి స్థానంలో మరో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుతో పాటు నకిలీ దస్తావేజులను సృష్టించి స్థలాన్ని విక్రయించిన ఏడుగురు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందులోనూ టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత, మాజీ కార్పొరేటర్ సురేష్రెడ్డి ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం. సీఐ శంకరయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ముంబైలో ఉంటున్న సాయిప్రసాద్ చౌదరికి సూరారం కాలనీ సర్వే నెంబరు 44 ప్లాట్ నంబర్ 55లో 230 గజాల స్థలం ఉంది. సాయిప్రసాద్ చౌదరి 2017, జులై 25న అనారోగ్యంతో మృతి చెందడంతో సదరు భూమిపై కన్నేసిన అతని దూరపు బంధువు సూరారం ప్రాంతానికి చెందిన బాలాజీ దానికి కాజేసేందుకు దమ్మాయిగూడకు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రహ్మ మధుకుమార్, జ్ఞానేశ్వర్తో కలిసి కుట్రపన్నాడు. ఇందుకుగాను సాయిప్రసాద్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని జ్ఞానేశ్వర్ పేరున నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ సురేష్రెడ్డిని కలిసి విషయం చెప్పడంతో ఆయన ఇది సరైన పద్దతి కాదని చెప్పి మరో పథకం రచించాడు. ఇందులో భాగంగా సూరారం ప్రాంతానికి చెందిన పుసులూరి వెంకటేశ్వరరావును రంగంలోకి దింపాడు. చనిపోయిన సాయిప్రసాద్ పేరుతో వెంకటేశ్వరరావు ఫొటో, చిరునామాతో ఆధార్ కార్డును రూపొందించాలని తన అనుచరుడు మాదాని విజయ్కుమార్ ను పురమాయించడంతో అతను సుభాష్నగర్కు చెందిన మీసేవా నిర్వాహకుడు షేక్బాబా వలీతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేయించాడు. అనంతరం వెంకటేశ్వరరావును సాయిప్రసాద్గా నమ్మించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ దస్తావేజులు సృష్టించారు. సదరు స్థలాన్ని విక్రయించే బాధ్యతను గాజులరామారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సత్యనారాయణకుఅప్పగించారు. సత్యనారాయణ కావలి శ్రీశైలం అనే వ్యక్తికి సదరు స్థలాన్ని అమ్మేలా ఒప్పందం కుదుర్చుకుని సురేష్రెడ్డికి రూ. 5 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వగా, సురేష్రెడ్డి స్థలాన్ని అమ్మినట్లు సేల్ అగ్రిమెంట్ చేశాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. ఈ విషయం యూఎస్ఏలో ఉంటున్న సాయిప్రసాద్ బావ కోనేరు వీరభద్రరావుకు తెలియడంతో నెల రోజుల క్రితం ఆయన మెయిల్ ద్వారా దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి స్థలాన్ని విక్రయించినట్లు తేలింది. దీంతో నిందితులు మధుకుమార్, వెంకటేశ్వరరావు, షేక్ బాబావలీ, విజయ్కుమార్, సత్యనారాయణ, వీరికి సహకరించిన సయ్యద్ రజీవుద్దీన్, వెంకటరమణ మూర్తి లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలాజీ, జ్ఞానేశ్వర్ పరారీలో ఉండగా సురేష్రెడ్డి ఫోర్జరీ డాక్యూమెంట్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సురేష్రెడ్డిపై నాలుగు భూకబ్జా కేసులు ఉండడంతో అతడిని కస్టడీకి అప్పగించాలని దుండిగల్ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. -
అడ్డంగా వాడేస్తాడు..
మాదాపూర్: నకిలీ డాక్యుమెంట్లు, ఐడీ ప్రూప్లను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.7,50,000 స్వాహా చేసిన వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్ప్రసాద్రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నకిలీ పత్రాలను ఉపయోగించి తమ పేర్లతో క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు డ్రా చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్లోని గోయల్ పెట్రోల్ బంకులో డబ్బులు డ్రా చేసేందుకు యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..చిక్కడపల్లికి చెందిన బొల్లు రామారావు 2014లో ఆస్టూట్ కార్పోరేట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పని చేసేవాడు. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఐడీ ప్రూప్ జిరాక్స్లను పరిశీలించడం అతని విధి. తద్వారా బ్యాంకింగ్కు సంబంధించిన విషయాల పై అవగాహన పెంచుకున్న అతను ధృవపత్రాల్లో మంచి ప్రొఫైల్ ఉన్నవాటిని ఎంచు కుని పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల్లో ఫొటోల మార్చి బ్యాంకులకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేవాడు. ఇలా సంజయ్కుమార్ గూటి, చేటూరి శివకృష్ణలతో పాటు పి.యాదగిరి,సాయి ఉమేష్, సతీష్, సాయిచంద్ పేర్ల మీద ఎస్బీఐ, రత్నాకర్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ బ్యాంకు, అనెక్స్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులలో నకిలీ క్రెడిట్ కార్డులు తీసు కుని సుమారు రూ.7,50,000 వరకు నగదును డ్రా చేసినట్లు తెలిపారు. కనకదుర్గా ఇన్ఫ్రాస్ట్రక్షర్ ప్రైవేటు లిమి టెడ్ కూకట్పల్లి బ్రాంచ్లో రూ. లక్ష రూపాయాల ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి దొంగ ఐడీ కార్డులు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాయదుర్గం సీఐ రాంబాబు, ఎస్ఐ మురళీ పాల్గొన్నారు. -
అనర్హులకు ‘బీడీ పింఛన్’
వేములవాడరూరల్: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును పింఛన్ రూపంలో కాజేస్తున్నవారి గుట్టు రట్టయింది. ఎలాంటి అర్హతలు లేకుండా బీడీ కంపెనీ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది మధ్య దళారులకు కమీషన్లు ఇస్తూ పింఛన్ పొందుతున్న కొంతమంది బండారం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం, అర్బన్ మండలంలోని దాదాపు 29 గ్రామాల్లో 10,295 మంది లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.12 లక్షలు అందిస్తుంది. ఇందులో ప్రధానంగా 3,506 మంది మహిళలు బీడీ కార్మికుల పింఛన్ పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున నెలనెలా బ్యాంకులో జమ అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది బీడీ కంపెనీల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొంది ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండలంలో నెలకు రూ.2 లక్షలు బోగస్ లబ్ధిదారులు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా డీఆర్డీఏ, అడిషనల్ అధికారి మదన్మోహన్, ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వేములవాడ రూరల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో 24 మంది బీడీ కార్మికులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. ఈ విషయంపై ఎంపీడీవో వేణుగోపాల్తో చర్చించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న 24 మంది బీడీ కార్మికులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వెంకట స్వామి తెలిపారు. -
ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్తో ఉద్యోగాలు.. భారీ షాక్!
ముంబై : తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న 11,700 మందిపై వేటు వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీలుగా చెలామణి అవుతూ 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తున్నవారి జాబితాలో క్లర్క్ నుంచి సీనియర్ కార్యదర్శులదాకా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, అయితే ఒకే దఫాలో వేటు వేస్తే ఎదురయ్యే న్యాయసమస్యలపై చర్యలు జరుపుతున్నామని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి మీడియాకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం(ఫిబ్రవరి 5న) పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్ భేటీ కానున్నారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తూ.. : మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో గడిచిన నాలుగు దశాబద్దాలుగా 63,600 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 51,100 మంది అసలైన అర్హులుకాగా, మిగిలిన 11,700 మంది ఫేక్ సర్టిఫికేట్లతో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారు. అక్రమ ఉద్యోగులపై కొన్ని దళిత, గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ‘‘ఒక వ్యక్తి దీర్ఘ కాలం సర్వీసులో ఉన్నప్పుడు అతని కుల ధృవీకరణ తప్పని తేలితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరంలేదు’’ అన్న ముంబై హైకోర్టు తీర్పు మరింత గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017 జులైలో సంచలన తీర్పు చెప్పింది. ‘‘రిజర్వేషన్ కేటగరిలో నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటుకావని, అలా ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుంచి తప్పించాల్సిందే’’నని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆ 11,700 మందిపై వేటుకు రంగం సిద్ధమైంది. -
నకిలీ డాక్యుమెంట్ల సృష్టి
పటాన్చెరు టౌన్ : నకిలీ ఇళ్ల పత్రాలను సృష్టించిన 11 మందిలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్న సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. శుక్రవారం స్థానిక పటాన్చెరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సీతారాం, అమీన్పూర్ సీఐ రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్సీ తెలిపిన వివరాల మేరకు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ నకిలీ డాక్యుమెంట్లు వ్యవహారం బయటపడిందని, దీనికి సంబంధించిన ఇద్దరు బిల్డర్లు,రిటైర్డ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి, మధ్యవర్తులు, బిల్ కలెక్టర్, ఇందులో ముఖ్య పాత్ర పోషించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ అధికారి ఫిర్యాదు మేరకు నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో బిల్డర్గా పనిచేసే దామోదర్, రిటైర్డ్ పంచాయితీ సెక్రెటరీ తిరుమలయ్య, మీడియేటర్లు ఏడుకొండలు, మహేష్, సురేందర్ రెడ్డి, బిల్డర్ లక్ష్మీనారాయణ, కారోబార్ కుంతి నర్సింలును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు టీఆర్ఎస్ అమీన్పూర్ ఎంపీటీసీ అనిల్ కుమార్, బిల్డర్ శ్రీనివాస్, మీడియేటర్ లింగారావు, అమీన్పూర్ పంచాయతీ మాజీ సెక్రెటరీ సోమనారాయణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలతో పాటు, నకిలీ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని కూడా త్వరలోనే ఆదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సుమారు 29 ఇళ్లు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మించినట్టు తెలిపారు. -
ఈసీఐఎల్కు రూ. 40 కోట్ల కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పనిచేసిన ఉద్యోగులే ఆ సంస్థకు కుచ్చుటోపి పెట్టారు. జీఎస్ఎం మానిటరింగ్ సిస్టమ్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు చీఫ్ విజిలెన్స్ అధికారి సి.మురళీధర్రావు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అర్హత లేని ఈఎల్డీ అనే సంస్థకు టెండర్లు అప్పగించినట్టు ఆరోపించారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు 2013లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం సీవీసీ సూచ న మేరకు సీబీఐ హైదరాబాద్ జోనల్ అధికారులు కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2010 మధ్య మానిటరింగ్ పరికరాల కొనుగోలులో రూ.40 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీంతో ఈసీఐఎల్ ఐటీ అండ్ టీజీ విభాగం మాజీ డీజీఎం కె.హరి సత్యనారాయణ, టీసీడీ ఐటీ అండ్ టీజీ మాజీ జీఎం వి.సత్యనారాయణ, పర్చేజ్ విభాగం మాజీ డీజీఎం ఎం.విష్ణుమూర్తి, టెక్ని కల్ విభాగం మాజీ డైరెక్టర్ గడినాగ వెంకట సత్యనారాయణ, మరో రిటైర్డ్ పర్చేజ్ డీజీఎం కాట్రగడ్డ సుబ్బారావుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈఎల్డీ సం స్థకు చెందిన కల్నల్ సురేశ్ భాటియా, లియోపాల్డిక్, నాథిన్ రోథ్విల్, ఈఎల్డీ సంస్థ, హార్టన్ కేస్ కమ్యూనికేషన్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చేశారు. -
డిగ్రీ నుంచి పీహెచ్డీ దాకా..
సుల్తాన్బజార్: డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఈస్ట్జోన్ డీసీపీ శశిధర్రాజు, అదనపు డీసీపీ గోవింద్రెడ్డి, ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ శివశంకర్రావులతో కలిసి వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సిరికి శ్రీనివాస్ వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించేవాడడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన బూతం వెంకట రామకృష్ణ ఏజెంట్గా పని చేసేవాడు. వెలుగులోకి వచ్చిందిలా... రామాంతపూర్ మధురానగర్కు చెందిన రామ్మూర్తి ప్రభుత్వోద్యోగం చేస్తూ మృతి చెందడంతో అతడి కుమారుడు సాయినాథ్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. అయితే అతనికి డీగ్రీ లేకపోకపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్ను జత చేయాలని డీహెచ్ డాక్టర్ లలితాకుమారి నోటీసులు జారీ చేసింది. దీంతో సాయినాథ్ నల్లకుంటకు చెందిన సాదుల రఘురాజ్ సహకారంతో తమిళనాడులోని వినాయక మిషన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుని జత చేశాడు. దీనిపై అనుమానంతో అధికారులు తనిఖీ చేయగా సదరు యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్లో ఉన్నట్లు గుర్తించారు డీహెచ్ సాయినాథ్ను విధులను నుంచి తొలగించి, సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ సర్టిఫికెట్లపై దర్యాప్తు చేపట్టడంతో ఏలూరు నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టు రట్టయ్యింది. దీంతో సిరికి శ్రీనివాస్, వెంకట రామకృష్ణ, రఘురాజ్ల స్థావరంపై దాడి చేసి 115 నకిలీ సర్టిఫికెట్లు, సీపీయూ, ప్రింటర్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. కాగా సాయినాథ్ ముందస్తు బెయిల్ తీసుకోగా, రఘురాజ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శశిధర్రాజు -
ఈ భూమాయకు ఫ్లాట్ అవ్వాల్సిందే
అధికార పక్ష నాయకుడొకరు ప్రభుత్వ భూమిని కాజేశారు. నిబంధనలు పక్కన బెట్టి అధికారులూ సహకరించారు. విలువైన భూమి సదరు నాయకుడికిప్పుడు కాసులు కురిపిస్తోంది. మండల కేంద్రానికి సమీప భూమి సర్కారు విక్రయించకూడదు. ఈ నిబంధన ఉల్లంగించడమే కాదు.. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోడానికి వడివడిగా పచ్చ జెండా ఊపేయడం అక్రమ భూ బాగోతానికి దర్పణం పడుతోంది. చిత్తూరు, సాక్షి: శ్రీరంగరాజపురం మండలంలో విస్తుగొలిపే భూ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వ్యవసాయానికి అనుకూలమైన భూమిని గుర్తించడం.. ప్రభుత్వ ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు.. నకిలీ ఛలానాలు సమర్పించడం.. వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు వేసి అమ్ముకోవడం.. ఇదీ దోపిడీ వరస. దీనికి సూత్రధారి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు భాస్కర్ నాయుడు. ఎస్సార్ పురం గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో 28వ సర్వే నెంబర్ 17.36లో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మండల కేంద్రంలోని విలువైన భూమి కావాలంటూ 2010లో భాస్కర్ నాయుడు మరో నలుగురు కలిసి దరఖాస్తు చేసుకున్నారు. 2013లో రూ.17.36 లక్షలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో భాస్కర్ నాయుడు మిగతా ముగ్గురినీ కాదని భార్య, అక్క కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధం.. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి ఉంటే ప్రై వేటు వ్యక్తులకు ఇవ్వకూడదని 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. భాస్కర్ నాయుడుకు కట్టబెట్టిన భూమి మండల కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉంది. అప్పటి కలెక్టర్లు వీ. శేషాద్రి, సాల్మాన్ ఆరోఖ్యరాజ్ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. రాంగోపాల్ కలెక్టర్గా ఉన్న సమయంలో వీరికి భూమి కట్టబెట్టారు. 2014లో టీడీపీ అధికార పీఠం ఎక్కడంతో చాలా సులువుగా వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తప్పుడు ఛలానా నెంబరు తప్పుడు ఛలానాలతో.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి రూ.2,42,750 లక్షలు 2014 డిసెంబర్లో ప్రభుత్వ ఖజనాకు జమ చేశామని చెప్పడంతో అప్పటి ఆర్డీవో పెంచల కిశోర్ భూ మార్పిడికి అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఈ సొమ్ము చెల్లించలేదని సాక్షి పరిశీలనలో బయటపడింది. భాస్కర్ నాయుడు చెల్లించినట్లు చెబుతున్న ఛలానా నెంబరు 2014 జూలై 23వ తేదీది. ఆర్డీఓ ఉత్తర్వులో 2014 డిసెంబర్ 26న చెల్లించినట్లు చెప్పుకున్నారు. ఆ ఛలానా నెంబరుపై రూ.2 లక్షలు వేరే వ్యక్తి చెల్లించనట్టుగా ఖజానా శాఖ పరిశీలనలో తెలిసింది. వ్యవసాయేతర భూమిగా మార్పి డికి సీసీఎల్ఏ అనుమతి కావాలని నిబంధన ఉంది. దీన్ని తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు. 2015లో 28–2ఏ,3ఏ సర్వే నెంబర్లలోని 8.71 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకున్నారు. ప్లాట్లు వేశారు.. కోట్లు కొల్లగొట్టారు.. చిత్తూరుకు ఎస్సార్ పురం సమీపంలో ఉండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయేతర భూమిగా అనుమతి వచ్చిన తరువాత 8.71 ఎకరాల ను 200 ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. గజం రూ.4500 నుంచి రూ.4700 వరకు అమ్ముకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోం ది. ఇందులో అడుగడుగునా అధికారుల ప్ర మేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నా యి. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను అమ్మకూడదని నిబంధనలున్నా దీన్ని బేఖాతరు చేస్తూ భూములు కట్టబెట్టడంలో అధికారులే కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే సీసీఎల్ఏ అనుమతి ఉండాలి. అదేంలేకుండా అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అతిక్రమించలేదు.. నిబంధనలు అతిక్రమించలేదు. రూల్స్ ప్రకారమే భూమిని తీసుకున్నాను. డబ్బు కట్టలేదనడం అబద్ధం. ఛలానా తీసుకున్న తరువాతే భూమార్పిడి చేశారు. ఛలానా నెంబరు తప్పుకాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. – భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్సార్పురం -
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 200 బైకులు
సాక్షి, నొయిడా (ఉత్తరప్రదేశ్): దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కా స్కెచ్తో వందలాదిగా బైక్లను ఎత్తుకుపోతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ.. నొయిడాలోని సెక్టార్-62కు చెందిన శివ్కుమార్, దినేష్ కుమార్ గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గురువారం ఉదయం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో కాపుకాసే వీరిద్దరూ బైక్పై వస్తున్న ఒంటరి వ్యక్తులను అడ్డగించి, తుపాకీ చూపి బెదిరిస్తారు. అనంతరం ఆ బైక్పై లాక్కుని తమ డెన్కు తీసుకుపోయి నకిలీ పత్రాలు తయారుచేసి, అమ్మేసుకుంటారు. ఈ విధంగా ఇప్పటి వరకు 200పైగానే మోటారుసైకిళ్లను చోరీచేసినట్లు అంగీకరించారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఘజియాబాద్, నొయిడా, బులంద్షహర్ ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు వారి నివాసంలో ఐదు చోరీ బైక్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘరారా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. -
ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్
జంగారెడ్డిగూడెం : వైద్య, ఆరోగ్య శాఖలో నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. 2017 జూలైలో వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ 47 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. వీరిలో ఏడుగురు నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరినట్టు గుర్తించారన్నారు. గౌరీపట్నం పీహెచ్సీలో కె.వరప్రసాద్, పూళ్ల పీహెచ్సీలో మహ్మద్ అజీముల్లా, బొర్రంపాలెం పీహెచ్సీలో ఎస్.దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్సీలో వై.వెంకటరాజు, యలమంచిలి పీహెచ్సీలో ఆర్.ఏడుకొండలు, గుండుగొలను పీహెచ్సీలో ఎన్.నాగేశ్వరరావు, వీఆర్గూడెం పీహెచ్సీలో బి.రాజ్కుమార్ నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరారన్నారు. వీరికి అప్పట్లో డీఎంహెచ్వో కార్యాలయంలో పనిచేస్తున్న అబ్దుల్ కరీం, అవుట్ సోర్సింగ్పై డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న కేవీ సత్యప్రసాద్ ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఏడుగురు ఉద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రస్తుతం లక్కవరం పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ కరీం, ఏలూరుకు చెందిన కేవీ సత్యప్రసాద్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి నుంచి రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీ నియామక పత్రాలపై ఉద్యోగం పొందిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. సమావేశంలో సీఐ కె.బాలరాజు, లక్కవరం ఎస్సై జగదీశ్వరరావు పాల్గొన్నారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. వైద్య, ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సాక్షి’ గత నెల 8న ‘ఆరోగ్య శాఖకు నకిలీ మకిలి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. దీంతో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టైంది. ఈ కేసులో సూత్రదారులను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఆ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులను వదిలి కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేశారని ఆ శాఖ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
రాజకీయ క్రీనీడ
జిల్లాలో క్రీడా మాఫియా ♦ సాఫ్ట్బాల్, ఫెన్సింగ్, జూడోల్లో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ♦ ఇద్దరు నిందితులకు పరిటాల శ్రీరాం అండదండలు ♦ ఒలింపిక్ సంఘం నిధులు డ్రా చేశారని జేసీ పవన్పై కేసు ♦ జడ్జి, ఎస్పీ కుమారులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు! మొన్న పరిటాల శ్రీరాం అనుచరులు...ఇప్పుడు జేసీ పవన్ కుమార్రెడ్డి...టీడీపీ నేతల జోక్యంతో క్రీడారంగం తరచూ వివాదాస్పదమవుతోంది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో శ్రీరాం అస్మదీయులు తెరపైకి వస్తే....ఒలింపిక్ అసోసియేషన్ నిధులు అక్రమంగా డ్రా చేశారని జేసీ పవన్ కుమార్రెడ్డిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు కూడా పెట్టారు. తాజా పరిణామాలు ‘అనంత’ క్రీడారంగంలో కలకలం రేపుతున్నాయి. – సాక్షిప్రతినిధి, అనంతపురం సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని సాఫ్ట్బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్కుమార్రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్కుమార్రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్బాల్, క్రికెట్తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు అరెస్ట్
గుత్తి: మునిసిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన నకిలీ సర్టిఫికెట్ల ముఠా సభ్యుడు మనోజ్ను మంగళవారం కర్నూల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెట్నేపల్లికి చెందిన మనోజ్ కర్నూలుకు చెందిన నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్తో జతకట్టాడు. గ్యాంగ్లో సుమారు పది మంది దాకా ఉన్నారు. సదరు గ్యాంగ్ సభ్యులు అనంతపురంలో ఉంటూ డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, బీపీడీ వంటి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇటీవల కర్నూలుకు చెందిన కొంతమంది వ్యక్తులు తమకు బీఎడ్, డిగ్రీ సర్టిఫికెట్లు కావాలని నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ను కలిసి వేలాది రూపాయలు సమర్పించుకున్నారు. అయితే సర్టిఫికెట్లు ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుకోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు పోలీసులను వెంట బెట్టుకుని నకిలీ గ్యాంగ్ సభ్యుడు మనోజ్ నివాసముండే చెట్నేపల్లికి వచ్చారు. వీరిని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన మనోజ్ను పట్టుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. నకిలీ సర్టిఫకెట్ల గ్యాంగ్లో ఎంత మంది ఉన్నారు? వారు ఏ ప్రాంతాలకు చెందిన వారు? ఇంత వరకు ఎన్ని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
భూకబ్జా కేసులో లేడీడాన్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 400 గజాల ఇంటిని కబ్జా చేసిన లేడీడాన్ను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ గౌస్నగర్ ఉందాహిల్స్ కాలనీలో సంతోష్నగర్ ఈదిబజార్కు చెందిన షేక్ వారీస్కు 400 గజాల ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఫర్జానా బేగం, మన్సూర్, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి కబ్జా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. రెండు రోజుల క్రితం పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్లో ఈమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా బెయిల్పై బయటికి రావడంతో మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న నిందితురాలిపై ల్యాండ్గ్రాబింగ్ షీట్ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ సర్టిఫికెట్లపై కాంట్రాక్టు లెక్చరర్లు !
► ఇంటర్, డిగ్రీలలో 4,375 మంది... ► సగం మంది నకిలి సర్టిఫికెట్లపైన్నే... ► పాత కరీంనగర్లోనే 22 మంది నకిలీలు ► ఈ భాగోతానికి ఆద్యుడు చంద్రబాబు ► లోకాయుక్తలో నిరుద్యోగుల ఫిర్యాదు ► వచ్చే నెల 20న హైదరాబాద్లో విచారణ సాక్షి, కరీంనగర్ : ఇంటర్మీడియట్ విద్యావిధానంలో నకిలీ సర్టిఫికెట్లు కలిగిన కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల (పర్మినెంట్)ను రెగ్యులరైజ్ చేసే వ్యవహారం లోకాయిక్తకు చేరింది. ఈ విధానం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టుతుందని ఫిర్యాదు చేశారు. బీహార్, కువ్వంపు, వినాయక మిషన్, ద్రావిడ తదితర యూనివర్శిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు పొందిన పలువురి నియామకం వివాదస్పదం అవుతోంది. నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విధానం అతిదారుణమని నిరుద్యోగులు, అర్హులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ విధానంలో అనేకమైన లొసుగులున్నాయని వారంటున్నారు. రిజర్వేషన్లను ఉల్లంఘించడం, అనర్హులను అందలమెక్కించడం రాజ్యాంగ విరుద్దమైన విధానంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అనర్హులతో గెజిటెడ్ పోస్టులలో నింపివేశారంటూ పలువురు లోకాయుక్తను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్లో 3685 లెక్చరర్ల పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 1050 వరకు పోస్టులు పూర్తి స్థాయిలో అనర్హులతో నింపివేయగా, ఒక్క పూర్వ కరీంనగర్ జిల్లాలోనే 22 మంది నకిలీలని తేలడం వివాదస్పదం అవుతోంది. నిబంధనలు ఏమి చెప్తున్నాయి.. ఇంటర్మీడియట్లో ఇతర రాష్ట్రాల నుంచి, కొని తెచ్చుకున్న యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల డిగ్రీలు వీరికి ఎలాంటి విద్యా ప్రావీణ్యత లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉంటేనే అదే సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇలాంటి నియమాలు లేని డిగ్రీలు ఉన్నవి. ఒక సబ్జెక్టు లెక్చరర్గా నకిలీ (ఫేక్) సర్టిఫికేట్స్తో జాయిన్ అయిన అతడే మరో సర్టిఫికెట్ సృష్టించుకోని పోస్టు డిమాండ్ ప్రకారం అందులోకి మారినవారున్నారు. దాదాపు అంటే ఇందులో 80 శాతం మంది ఇలాంటి డిగ్రీలు కలిగిన వారున్నారు. ఇక వీరి నియామకం చాలా హాస్యాస్పదం. ఈ ఫేక్ సర్టిఫెకెట్గాళ్లకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 2000 సంవత్సరంలో కాలేజీ వైజ్గా పేపర్ ప్రకటన అంటే (ప్రెస్నోట్)చిన్నగా ఇచ్చి ఇలాంటి వారిని ప్రిన్సిపల్స్ ద్వారా ఎంపిక చేశారు. రెగ్యులర్ పోస్టులు రాజ్యాంగ బద్ద సంస్థ ఏపీపీఎస్సీ ద్వారా నింపాల్సిన పోస్టులను చాలా ‘ఛీప్’గా వారితో నింపారు. వాస్తవంగా గెజిటెడ్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా నింపాలి. నేడైతే తెలంగాణ టీఎస్పీపీఎస్సీ ద్వారా జాతీయ పేపర్లో నోటిఫికేషన్స్ ఇచ్చి రాత పరీక్ష– ఇంటర్వ్యూల ద్వారా నింపాలి. కానీ అలా కాకుండా ఇలా ఫేక్ సర్టిఫికేట్ వారితో వారి అనుకూలమైన వారితో నింపారు. దశాబ్దకాలంగా ఏపీపీఎస్సీ ని నిర్వీర్యం చేసిన ఆంధ్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల విధానంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే వస్తుంది. అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత లేని వారే కొనసాగుతున్నారు. ఇదిలా వుంటే 2007–08 లో శాసనసభ కమిటి సిఫారసు మేరకు ఆర్జేడీ ద్వారా రోస్టర్వైజుగా నోటిఫికేషన్ వేసి 14 సబ్జెక్టులలో 355 మందిని మాత్రమే రోస్టర్ ద్వారా ఎంపిక చేశామంటున్నారు. కానీ ఇందులో కూడా అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో చేరినారు. రోస్టర్ విధానంకు వక్రభాష్యం.. 3650 పోస్టులలో కేవలం 355 మందిని 14 సబ్జెక్టులలో అదీ శాసనసభ కమిటీ సిఫారసు మేరకు రోస్టర్ లో ఎంపిక చేశామంటున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గెజిటెడ్ పోస్టులను ఎక్కడి వారే అక్కడ స్థానికులను అందులో ఫేక్ సర్టిఫికేట్ దూర విద్యా విధానం ఇతర రాష్ట్రాల డిగ్రీల వారే ఉన్నారు. ఎందరో నిరుద్యోగులు రెగ్యులర్ యూనివర్సిటీలు, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలలో చదివిన వారు నిరుద్యోగులుగా ఉన్నారు. వారి నోట్లో మట్టి కోట్టే కనీస విద్యా ప్రావీణ్యత లేనివారు ఎలాంటి పరీక్ష పాస్ కాకుండానే ఇందులో చేరినారు. ఎలా గెజిటెడ్ పోస్టులలో రెగ్యులర్ చేస్తారు? అంటూ నిరుద్యోగులు లోకాయుక్తలో సవాల్ చేశారు. ఇంగ్లీష్ వాటికి అందులో ప్రావీణ్యత ఉండదు గనక కనీస ప్రావీణ్యత లేని వీరికి టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహించి వీరి కొనసాగింపు అపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అన్ని పోస్టులను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా చేయాలంటున్నారు. ఈ వ్యవహారంపై వచ్చే నెల 20న విచారణ జరపనుండగా, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఫేక్ సర్టిఫికేట్లపై తక్షణం సీబీసీఐడీతో దర్యాప్తు జరుపాలని కోరుతున్నారు. -
ఇంటర్ మెమోల్లో ‘ఐ’ కోడ్!
నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి చర్యలు వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచనలు! సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మెమో ల్లో భవిష్యత్తులో ‘ఐ’ కోడ్ రాబోతోంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో వినియోగిస్తున్న క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ తరహాలోనే ఐ కోడ్ను ఇంటర్ మెమోలపై ముద్రించేం దుకు ఆలోచనలు మొదలయ్యాయి. ఫేక్ సర్టిఫికెట్ల నిరోధంలో భాగంగా ఐ కోడ్ను ముద్రించడం ద్వారా సెక్యూరిటీతోపాటు జెన్యూనిటీ వెరిఫికేషన్ సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో సర్టిఫికెట్ల జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం ఏ ఉద్యోగ సంస్థ కూడా ఇంటర్మీడియెట్ బోర్డును సంప్రదించాల్సిన అవసరమే ఉండదని పేర్కొంటున్నారు. జెన్యూనిటీ వెరిఫికేషన్ కావాలనుకునే సంస్థ.. మెమోపై ఒక మూలన ముద్రించే ఐకోడ్ను కోడ్ రీడర్ ద్వారా రీడ్ చేసి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. తద్వారా సదరు విద్యార్థివి ఒరిజినల్ సర్టిఫికెట్లేనా, కాదా అన్నది వెంటనే తెలిసిపోతుంది. వీలైతే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మెమో లపై ఐ కోడ్ను ముద్రించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లకు ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రస్తుతం ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ల జెన్యూనిటీ కోసం వివిధ సంస్థలు ఇంటర్ బోర్డుకు లేఖ రాసి, అభ్యర్థిని పంపిస్తు న్నాయి. అయితే సదరు అభ్యర్థి నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం బోర్డు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీంతో ఒక్కోసారి ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆన్లైన్లో వెరిఫికేషన్ విధానాన్ని త్వరలో అమల్లోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగ సంస్థ కానీ, మరేదైనా విద్యా సంస్థ గానీ అభ్యర్థి సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకునేందుకు ఆన్లైన్లో నిర్ణీత ఫీజు (ప్రస్తుత ఫీజు రూ.100) చెల్లిస్తే వారికి ఒక రెఫరెన్స్ కోడ్ వస్తుంది. సదరు సంస్థ ఆ కోడ్ను, విద్యార్థి వివరాలను ఎంటర్ చేస్తే ఒరిజినల్ మెమో ప్రత్యక్షం అవుతుంది. దాంతో అభ్యర్థి పెట్టిన మెమోలు ఒరిజినలా కాదా అన్నది తేలిపోతుంది. ఇంటర్ బోర్డు కూడా సదరు సంస్థకు మూడు రోజుల్లో వెరిఫికేషన్ వివరాలతో ఓ లేఖను పంపుతుంది. -
నకిలీ సర్టిఫికెట్లకు ఆన్లైన్ చెక్!
♦ వెబ్సైట్లో గత ఐదేళ్లలో ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థుల వివరాలు ♦ అందుబాటులోకి తెచ్చిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదివినట్లు సృష్టిస్తున్న నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. గత ఐదేళ్లలో (2012 నుంచి ఇప్పటి వరకు) రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఉన్నత విద్య కోర్సులను అభ్యసించిన విద్యార్థుల సమాచారాన్ని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ఉద్యోగాలకు వస్తున్నారని, మార్కులను కూడా మారుస్తున్నారని, సీఎం కేసీఆర్కు నాస్కామ్ ప్రతినిధులు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్ కూడా పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఉన్నత విద్యా మండలి అన్ని వర్సిటీ వీసీలతో సమావేశాలు నిర్వహించి, వివరాలు తెప్పించింది. 2012 నుంచి ఇప్పటివరకు ఆయా యూనివర్సిటీల పరిధిలో చదువుకున్న విద్యార్థుల సమాచారన్ని తమ వెబ్సైట్లో ((tsche.ac.in)) అందుబాటులో ఉంచింది. నేరుగా tsstudentverification. org వెబ్సైట్లోకి వెళ్లి కూడా వివరాలు పొందవచ్చు. దీంతో విదేశాల్లోనూ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థుల వెరిఫికేషన్ మరింత సులభం కానుంది. ఉచితంగా సమాచారం... ఇప్పటివరకు జేఎన్టీయూహెచ్ వంటి కొన్ని యూనివర్సిటీలు జెన్యూనిటీ సమాచారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టినా, ఆయా కంపెనీలు ముందుగా రిజిస్టర్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లిస్తేనే వర్సిటీలు ఆ వివరాలు అందజేస్తున్నాయి. దీంతో ఈ ప్రక్రియ అంతా చేయలేక కంపెనీలు కొన్నిసార్లు అనుమానం వచ్చిన విద్యార్థులను రిజెక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా తప్పుచేయని విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. మరికొందరు అభ్యర్థులు కంపెనీలు కోరే కనీస మార్కుల శాతానికి అనుగుణంగా మార్కుల లిస్టు మార్చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు కూడా పదోన్నతుల కోసం నకిలీ సర్టిఫికెట్లు పెడుతుండటమే కాకుండా మార్కులను మార్చుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్ విద్యార్థుల సమాచారాన్ని ఉచితంగా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి తప్పుడు సమాచారం ఇస్తే, అదే వెబ్సైట్లో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ లింకును కూడా అందుబాటులోకి తెస్తారు. భవిష్యత్తులో విద్యార్థి డిగ్రీ రికార్డులు, హాజరు వెరిఫికేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. వెబ్సైట్ను పరిశీలించిన సీపీ... మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ వెబ్సైట్ను నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి పరిశీలించారు. విద్యార్థి వివరాల్లో ఆధార్ నంబరును అనుసం« ధానం చేయాలని, ఫొటో కూడా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో 2007 నుంచి 2011 వరకు కూడా విద్యార్థుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు చెందిన వివరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. -
పేదల ఇళ్లపై పంట రుణాలు
ఇదో విచిత్ర మాయాజాలం ► ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది.. ► అదే భూమిపై బ్యాంకు పంట రుణాలిచ్చింది ► రెవెన్యూ అధికారుల అండదండలతో నకిలీ పత్రాల సృష్టి ► భూమిని పరిశీలించకుండానే రుణాలిచ్చిన బ్యాంకు ► ఆందోళన వ్యక్తం చేస్తున్న నస్కల్ దళితులు రామాయంపేట: 60 ఏళ్ల క్రితం పేదలు నిర్మించుకున్న గృహాల సముదాయాన్ని వ్యవసాయ భూమిగా చూపి రెవెన్యూ అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి రుణం పొందిన వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా దీన్ని కప్పి పుచ్చడానికి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్మయం కలిగించే ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామం 1622, 1623 సర్వేనంబర్ల పరిధిలో మూడున్నర ఎకరాల భూమిలో 60, 70 ఏళ్ల క్రితమే గ్రామానికి చెందిన దళితులు ఇళ్లు నిర్మించుకున్నారు. దళితుల కబ్జాలో ఉన్న ఈ స్థలం అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించినది. అయితే 2003లో ఆ స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కబ్జాలో ఉన్న దళితులకు ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు అందజేసింది. ఈ మేరకు లేఔట్ ఏర్పాటు చేసి అప్పట్లో 51 మందికి పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా పేదలకు పంపిణీ చేసిన ఈ భూమికి సంబంధించిన వివరాలు రికార్డుల్లో మాత్రం మార్చలేదు. దీంతో సదరు భూమి దళితుల పేరుతో కాకుండా భూమి అమ్మిన వ్యక్తి పేరిట రికార్డుల్లో కొనసాగుతోంది. ఇదే అదనుగా గతంలో ఇక్కడ వీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అవినీతికి తెరలేపాడు. సదరు స్థలంలో దళితులు కాకుండా భూమి అమ్మిన వ్యక్తి వ్యవసాయం చేస్తున్నట్లు రికార్డులు, పాసుపుస్తకాలు సృష్టించారు. దీంతో భూమి అమ్మిన వ్యక్తి గత ఏడాది నిజాంపేటలోని ఒక బ్యాంకులో రుణం పొందాడు. ఇందుకుగాను రెవెన్యూ శాఖవారి మద్దతుతోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాము ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న స్థలంపై కొందరు రుణం పొందినట్లు తెలుసుకున్న గ్రామ దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వారు తహసీల్ కార్యాలయానికి వెళ్లి విచారించగా, సదరు భూమి రికార్డుల్లో పాత భూ యజమాని పేరిటే ఉన్నట్లు తెలుసుకున్నారు. తెల్వకుండా మా ఇళ్లపై లోన్లు తీసుకున్నరు 60, 70 ఏళ్ల కిందనే మేం ఇళ్లు కట్టుకొని ఉంటున్న జాగపై మాకు తెల్వ కుండనే లోన్లు తీసుకున్నరు. బ్యాంకోళ్లు జాగ చూడకుండా మా ఇళ్ల జాగపై లోన్లు ఎట్టా ఇచ్చిండ్రో తెల్వ దు. వాళ్లు తీసుకున్న ఈ లోన్లు ఎవరు కట్టాలె. ఇందుల రెవెన్యూవోళ్ల చెయ్యున్నది. మాకు న్యాయం చేయాలె. – కుమ్మరి నర్సవ్వ, నస్కల్ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి లోన్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి మాకు తెలియకుండా మా ఇళ్ల స్థ«లాలపై రుణాలు తీసుకున్న విషయం ఈ మధ్యనే తెలిసింది. ఈ స్థలానికి సంబంధించి పాసు బుక్కులు, సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది. ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. – కాంబోజ రవి, నస్కల్ మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యం అధికారుల సపోర్టుతో తెల్వకుండా మా ఇళ్ల స్థలాలపై లోన్లు తీసుకున్నారు. ఇందుకు ఎవరెవరు సహకరించారనే విషయమై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – కొమ్మాట రాజయ్య, నస్కల్ అధికారి వివరణ విచారణ జరిపి చర్యలు తీసు కుంటాం. ఈ విషయం నాదృ ష్టికి రాలేదు. రికార్డులు పరిశీ లించి దళితులైన నస్కల్వాసులకు న్యాయం చేస్తాం. నకిలీ పత్రాలు సృష్టించి లోన్లు తీçసుకుంటే చర్యలు త ప్పవు. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ఆనందరావు, నిజాంపేట తహసీల్దార్ -
నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు కొలువులు
న్యూఢిల్లీ: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవ్యాప్తంగా 1,832 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తేలిందని కేంద్రం ప్రకటించింది. ఈ వివరాలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2010లో ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 1832 మందిలో సుమారు 1200 మంది బ్యాంకులు, బీమా సంస్థల్లో కొలువులు సంపాదించిన వారేనని బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. నకిలీ పత్రాలు లేదా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించిన 1,832 కేసుల్లో 276 మందిపై సస్పెన్షన్ వేటు లేదా తొలగింపు, 521మందిపై కోర్టు కేసులు ఉండగా 1,035మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కుల ధ్రువీకరణ నకిలీ పత్రాలతో 157 మంది ఎస్బీఐలో, 135 మంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, 112 మంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో, 103 మంది సిండికేట్ బ్యాంక్ లోనూ పోస్టింగులు పొందారని చెప్పారు. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్లో 41మంది చొప్పున ఉద్యోగాల్లో ఉన్నారని జితేంద్ర సింగ్ వెల్లడించారు. -
తప్పుడు డిగ్రీతో ఎన్నికకే ఎసరు
విశ్లేషణ ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకనే ప్రమాణ పత్రంపైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలు ఉన్నాయని అబద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెరియంబం పృథ్వీరాజ్ పదో మణిపూర్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నామినే షన్లో డిగ్రీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చా డని ప్రత్యర్థి పుఖ్రెం శరత్ చంద్రసింగ్ ఫిర్యాదు చేశారు. ప్రమాణ పత్రంలో పేర్కొన్న డిగ్రీలకు సంబంధించి రుజువులు ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి పృథ్వీరాజ్కు సూచించారు. కానీ ఏ పత్రాలూ ఇవ్వకపోయినా నామినేషన్ను ఆమోదించారు. పృథ్వీ రాజ్ 14,521, శరత్చంద్ర 13,363 ఓట్లు పొందడంతో పృథ్వీరాజ్ (మోయిరంగ్ నియోజకవర్గం) గెలిచినట్టు ప్రకటించారు. ఈ ఎన్నికను సవాలు చేస్తూ గువాహటి హైకోర్టులో శరత్చంద్రపిటిషన్ వేశారు. ప్రత్యర్థి ఎన్ని కల నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలనీ, ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్ 125 ఎ, 127 కింద పృథ్వీరాజ్ పైన నేరవిచారణ ఆరంభించా లనీ కోరారు. మైసూర్ విశ్వవిద్యాలయం ఎం.బి.ఎ డిగ్రీ ఉన్నట్టు పృథ్వీరాజ్ ప్రమాణపత్రంలోని, ఫారం 26లో తప్పుడు ప్రకటన చేశారన్నదే ఆరోపణ. తప్పుడు ప్రక టన గణనీయంగా ప్రభావితం చేస్తే ఆ ఎన్నిక చెల్లదన్న సెక్షన్ 100 (1)(డి) ప్రకారం పృథ్వీరాజ్ ఎన్నికైనట్టు ప్రకటించడం సరికాదని వాదించారు. గుమాస్తా కారణంగా దొర్లిన తప్పు ఎన్నికను గణ నీయంగా ప్రభావితం చేసినట్టు రుజువు లేదన్న పృథ్వీ రాజ్ వాదనను నిరాకరిస్తూ గువాహటి హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. పృథ్వీరాజ్ సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఎం.బి.ఎ డిగ్రీ ఉందన్న చిన్న క్లరికల్ తప్పు వల్ల ఎన్నిక కొట్టివేయడం తగదని, ఆ తప్పుడు సమాచారం నమ్మడం వల్లనే ఓటర్లు ఎన్నుకున్నారని రుజువు చేయలేకపోతే ఎన్నిక రద్దు చేయకూడదని వాదించారు. అయితే 2008 ఎన్ని కలలో కూడా పృథ్వీ రాజ్ ఇదేరకం ప్రకటనచేశారని శరత్చంద్ర తరఫు లాయర్ వాదించారు. 2002లో సవరణ ద్వారా చేర్చిన 33 ఎ సెక్షన్ ప్రకారం పోటీచేసే అభ్యర్థి అదనంగా నేరచరిత్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 36 ప్రకారం నామినేషన్ను పరిశీ లించి తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. 2002లో సవరించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు రూల్ 4(ఎ) ప్రకారం సెక్షన్ 33 (1) కింద మొదటి తరగతి మేజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ప్రమాణీకరించిన ఫారం 26లో ఒక కాలమ్లో విద్యార్హతలను వెల్లడించాలి. సెక్షన్ 100 కింద ఎన్నిక చెల్లదని ప్రకటించడానికి దారితీసే కారణాలు: (ఎ) ఉండవలసిన అర్హత లేకపోయినా, అనర్హు డైనా, (బి) అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజంటు గానీ అతని అంగీ కారంతో ఎవరైనా గానీ అవినీతి పనులకు పాల్పడినా, (సి) ఏ నామినేషన్ పత్రమైనా అక్రమంగా తిర స్కారానికి గురైనా (డి) అభ్యర్థి ఎన్నికపైన (1) అక్ర మంగా నామినేషన్ పత్రాన్ని అంగీకరించడం, లేదా (2) అభ్యర్థి లేదా అతని ఏజెంట్ ప్రయోజనాల కోసం ఎన్ని కల అవినీతి వల్ల, లేదా (3) అక్రమంగా ఏదైనా చెల్లని ఓటును స్వీకరించడం వల్ల తిరస్కరించడంవల్ల ప్రభా వం పడినా, లేదా(4) రాజ్యాంగంలో, ఈ చట్టంలో, ఏ ఇతర చట్టం కిందైనా చేసిన నియమాల ఉల్లంఘన ఎన్నికను గణనీయంగా ప్రభావితం చేసిందని హైకోర్టు భావిస్తే ఎన్నిక చెల్లదని ప్రకటించవచ్చు. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థి తాను గానీ, ప్రతిపాదిం చిన వ్యక్తి ద్వారా గానీ సెక్షన్ 33ఎ(1) కింద నామినే షన్లో, ప్రమాణ పత్రంలో సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం అని తనకు తెలిసి లేదా తెలి యడానికి తగిన కారణం ఉండి తప్పుడు సమాచారం ఇచ్చినా, సమాచారం దాచినా, ఇతర చట్టాల్లో ఏ నియమం ఉన్నప్పటికి, ఆరునెలలదాకా జైలుశిక్ష విధిం చవచ్చు. పోటీచేసే అభ్యర్థి గురించిన సమాచారం పొందే ప్రాథమిక హక్కు ఓటరుకు ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులున్నా, విద్యార్హత ఉండడం అవసరమా లేదా, ఆస్తి ఉండాలా లేదా అని ఆలోచించి, ఓటు వేయాలో లేదో నిర్ణయించే స్వేచ్ఛ ఓటరుకు ఉందని కూడా (యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ 2002 కేసులో) ప్రకటించింది. ఈ తీర్పును అనుసరించి సెక్షన్ 33ఎ ను చేర్చి ఓటర్లకు పార్లమెంటు సమాచార హక్కు ఇచ్చింది. ఈ ఆర్డినెన్సును సవాలు చేస్తే పి.యు.సి.ఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఓటరు సమాచార హక్కును సమ ర్థిస్తూ మళ్లీ తీర్పు చెప్పింది. ఈ కేసులో ఓటరుకు ఈ ప్రాథమిక హక్కు ఉందని ఎక్కడా లేదనే వాదాన్ని తోసి పుచ్చింది. తనను పాలించే వారిని ఎన్నుకునేందుకు తెలి విగా ఓటు వేసే బాధ్యతను నెరవేర్చడానికి సమాచారం అవసరం అని సుప్రీంకోర్టు పదేపదే వివరించింది. తను ఇన్ఫోసిస్, ఐబీఎంలో పనిచేసినందున తనకు ఎం.బి.ఎ డిగ్రీ ఉందనుకున్నారని, ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకుం డానే ప్రమాణపత్రం పైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలున్నాయని అబ ద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది. (అక్టోబర్ 28, 2006న న్యాయమూర్తులు అనిల్ దవే, ఎల్. నాగేశ్వరరావు తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రూ. 20.50 కోట్ల రికవరీ
పన్ను ఎగవేత కుంభకోణం కేసు రైస్ డీలర్లు 50 శాతం చెల్లిస్తేనే వే బిల్లులు ఆన్ చేస్తాం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్కుమార్ నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్) : నకిలీ చలానాలతో పన్ను ఎగ్గొట్టిన రైస్ మిల్లర్ల నుంచి రూ. రూ. 20. 50 కోట్లు రికవరీ అయ్యిందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని డీలర్ల నుంచి సొమ్మును రికవరీ రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారు. మంగళవారం జిల్లా డీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ. 70 పైగా అక్రమాలు జరిగాయన్నారు. రూ. 18. 50 కోట్లు వాణిజ్య పన్నుల శాఖలో, రూ. 2 కోట్లు సివిల్సప్లైలో జరిగిన అక్రమాలకు సంబంధించిన డబ్బును రికవరీ చేసినట్లు తెలిపారు. 117 మంది డీలర్లలో 70 మంది డీలర్ల నుంచి ఈ రీకవరీ చేశామన్నారు. డీలర్ల కొంతమంది రూ. 30 లక్షలు, మరికొందరు రూ. 20 లక్షలు, రూ. 5 లక్షల లోపు పన్నులు కట్టాల్సి ఉందన్నారు. మొత్తం డబ్బును రికవరీ చేస్తామన్నారు. ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ప్రతి రూపాయి కక్కాల్సిందే అన్నారు. ఈ విషయంలో సీరియస్గా ఉన్నామన్నారు. అందుకే మా శాఖ నుంచి, సీబీ సీఐడీ విచారణ సైతం జరుగుతోందన్నారు. మార్చి 10 మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. డీలర్లు మొర పెట్టుకున్నా.. డీలర్లు చెల్లించాల్సిన డబ్బులో 50 శాతం కడితేనే వే బిల్లులు ఓపెన్ చేయిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేమని డీలర్లు మొర పెట్టుకోగా కమిషనర్ పట్టించుకోలేదు. మూడు నాలుగు రోజుల్లో పన్ను కట్టాల్సిందే అన్నారు. ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని డీలర్లతో పేర్కొన్నారు. 50శాతం కడితేనే వే బిల్లులు ఓపెన్ చేస్తామని, మిగతా డబ్బులకు ఒక నెల రోజుల గడువు ఇస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. మోసపోయాం రైస్మిల్లర్ల సంఘం సంఘం కార్యదర్శి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు కమిషనర్ను కలిసి విన్నవించుకున్నారు. మేము మోసపోయమని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారన్నారు. మేము సక్రమంగా పన్నులు చెల్లించామని, మధ్యవర్తిగా ఉండి మమ్మల్ని మోసం చేశారన్నారు. మధ్యవర్తులను నమ్మడం వల్లే ఇది జరిగిందన్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేమని, సమయం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో రూ. 1కిలో బియ్యం, గతంలో రూ. 2కిలో బియ్యం తదితర వాటిల్లో మా పాత్ర ఉందన్నారు. ఖచ్చితంగా కట్టుతామని సమయం ఇవ్వాలన్నారు. -
కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?
⇒ ‘కమర్షియల్’ స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్ ⇒ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలని ఆదేశం ⇒ సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు పక్కదారి పట్టినట్లు తేలడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఆడిటింగ్ను తప్పనిసరిగా కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని, అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ నిఘాను పెంచాలని ఆదేశించారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తు తీరుపై డీజీపీ అనురాగ్ శర్మతో సీఎం వాకబు చేశారు. కేసు విచారణలో బయటపడుతున్న సంచలనాత్మక అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని, మరిన్ని బృందాలను రంగంలోకి దించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. (చదవండి: బో‘ధన్’ దొంగలెందరో?) క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం బోధన్ స్కాం అక్రమాల్లో పాలుపంచుకున్న కమర్షియల్ ట్యాక్స్ సీటీవోలు, ఏసీటీవోలు, సూపరింటెండెంట్లు, డీసీటీవోలు, జాయింట్ కమిషనర్ల విచారణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న 18 మంది అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీయనుంది. ప్రైవేట్ ఆడిటర్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్తో పదే పదే సంభాషణలు కొనసాగించిన ఈ అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరిని విచారించేందుకు సీఐడీకి అనుమతి లభించడంతో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. నీకింత.. నాకింత వాటాలు పంచుకున్న 18 మంది అధికారులు బోధన్ స్కాం తవ్వుతున్న సీఐడీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ బయటపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉన్నతాధికారుల జాబితా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 18 మంది ఉన్నతాధికారుల పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. బోధన్లో గతంలో పనిచేసిన ఏసీటీవో, సీటీవోల దగ్గరి నుంచి డివిజన్ కార్యాలయాలు, జాయింట్ కమిషనర్ల వరకు ఈ స్కాంలో పాత్రదారులుగా ఉన్నారని సీఐడీ ఆధారా లు సేకరించింది. ప్రైవేట్ ఆడిటర్గా ఉం టూ ట్యాక్స్ చెక్కులు వసూలు చేసిన శివరాజుతో కలసి ఈ 18 మంది వాటాలు పంచుకున్నారని విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేస్తున్నారు. వీరు పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ శివరాజుతో కలసి ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్నట్టు సీఐడీ గుర్తించింది. అయితే వీరు పనిచేస్తున్న ప్రాంతాలను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. బోధన్లో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించాల్సిన 100 మంది వ్యాపారుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. వీరిలో ట్యాక్స్ కట్టిన వారు, ట్యాక్స్ కట్టకుండా శివరాజుతో కలసి పన్ను కట్టినట్టు నకిలీ చలాన్లు పెట్టుకున్న వారిని విచారించాలని భావిస్తున్నారు. దీంతో పాత నిజామాబాద్ జిల్లాలో కలవరం మొదలైంది. ఎప్పుడు ఏ సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియక సతమవుతున్నట్టు తెలిసింది. -
బో‘ధన్’ దొంగలెందరో?
కమర్షియల్ ట్యాక్స్లో బయటపడని తిమింగళాలు మరెన్నో.. - వెయ్యి కోట్ల దాకా స్కాం జరిగి ఉండొచ్చని సీఐడీ అనుమానం - అన్ని సర్కిళ్లలోనూ బోధన్ తరహా వ్యవహారాలే! - ఒక్క బోధన్లోనే రూ. 200 కోట్లు నొక్కేసిన శివరాజ్ గ్యాంగ్ - ఐదేళ్లుగా అన్నీ దొంగ లెక్కలు.. నకిలీ ఆడిటింగ్లు - బ్యాంకులు, సబ్ ట్రెజరీల్లోనూ అక్రమార్కులు - అధికారులపై దాడులకు సిద్ధమైన ఏసీబీ - ఫైలు సీఎంవోకు వెళ్లకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి? సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ కింద రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాల్లోకి మళ్లించారు.. ఒక వ్యాపారి చెల్లించిన ట్యాక్స్ నగదును మరో ఐదుగురు వ్యాపారుల పేర్ల మీదకు మార్చేశారు.. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో ఇలాంటి ఎన్నో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి! కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారుల కళ్లు బైర్లు కమ్మే విషయాలు కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.200 కోట్లకు పైగా ట్యాక్స్ వసూలు చేసి కేవలం 25 నుంచి రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి చేరాయంటే ఎంతటి స్థాయిలో స్కాం జరిగిందో తెలుస్తోంది. ఇలా కేవలం బోధన్ మాత్రమే కాదు కమర్షియల్ ట్యాక్స్లోని 80 శాతం సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇలా ఏటా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల దాకా వ్యాట్ సొమ్ము గల్లంతైనట్టు సీఐడీ అంచనా వేస్తోంది. కేసు సీఐడీకి బదిలీ వెనుక ఒత్తిడి? బోధన్ స్కాం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే ముందు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ విచారణలో కేవలం బోధన్లోనే రూ.200 కోట్లు స్కాం జరిగినట్టు తేలింది. సీటీఓ, ఏసీటీవోతోపాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బంది, ఆడిటర్ నేతృత్వంలో స్కాం చేసినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇలా రాష్ట్రంలోని 12 డివిజన్లలో 91 సర్కిల్ కార్యాలయాలున్నాయి. ఈ సర్కిళ్లలోని 80 శాతం కార్యాలయాల్లో ఆడిటర్లే వాటిని పరోక్షంగా శాసిస్తున్నారని తేలినట్టు తెలిసింది. ఇలా ఈ సర్కిల్ కార్యాలయాల్లో రూ.1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగి ఉంటుందని ఏసీబీ అనుమానించింది. అయితే ఈ కేసును తామే విచారణ చేస్తామని ఉన్నతాధికారులు పట్టుదల చూపించారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి కేసును కేవలం బోధన్కు మాత్రమే పరిమితం చేసి సీఐడీకి బదిలీ చేయించారని విశ్వసనీయంగా తెలిసింది. అన్ని వారి చేతుల్లోనే.. బోధన్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించింది ఆడిటర్ శివరాజ్గా సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతడి ప్రమేయం లేనిదే ఆ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ చెల్లింపులు జరగవని గుర్తించారు. శివరాజ్తోపాటు అతడి కుమారుడు సునీల్ కూడా కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో బయటపడింది. శివరాజ్ లాబీయింగ్తోనే కమర్షియల్ ట్యాక్స్ అధికారుల బదిలీలు కూడా జరిగాయంటే స్కాంలో అతడి పాత్ర ఎంతటితో అర్థమవుతోంది. ఇలా అతడు ఒక్క బోధన్లోనేగాక.. నిజామాబాద్ డివిజన్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నకిలీ ట్రెజరీ చలాన్లతో ట్యాక్స్ చెల్లించినట్టు వ్యాట్ వెబ్పోర్టల్లో అధికారులు యూజర్ ఐడీ, పాస్వర్డులతో వివరాలు అప్లోడ్ చేసేవాడని సీఐడీ అధికారుల ద్వారా తెలిసింది. ఇలా ఐదేళ్లలో ఇతడి ద్వారానే దొంగ ఆడిటింగ్లు చేయించారని, వాటికి సంబంధించిన ఫైలు కూడా దొరక్కుండా చేశారని తేలింది. ఒక్క చెక్కు.. ఐదుగురికి ట్యాక్స్... బోధన్లో ప్రముఖ వాహనాల డిస్టిబ్యూటర్ ప్రతి నెలా రూ.25 లక్షల ట్యాక్స్ కడుతుంటాడు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు నిత్యం టచ్లో ఉండే ఆడిటర్ శివరాజ్కు రూ.25 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకున్న శివరాజ్ ఐదుగురు వ్యాపారుల పేరిట చలాన్లు తీసి సబ్ ట్రెజరీ ఆఫీస్లో చెల్లించాడు. వాహనాల డిస్టిబ్యూటర్ పేరిట కేవలం రూ.5 లక్షలు చెల్లించి మిగతా డబ్బును ఇతర వ్యాపారుల పేరిట జమ చేశారు. వారిచ్చిన డబ్బును శివరాజ్తో పాటు అధికారులు తమ సొంత జేబుల్లో నింపుకున్నారు. గత అయిదేళ్లలో ఒక వాహనాల డీలర్ రూ.28 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు చెక్కులున్నాయి. కానీ కమర్షియల్ టాక్స్లో ఆయన పేరిట ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే జమ అయినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. మిగతా రూ.26 కోట్లు అధికారులే స్వాహా చేశారనే నిర్ధారణకు వచ్చారు. ఇలా బోధన్ పరిధిలో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించే వారు 150 మంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రైస్మిల్లర్లు, కార్ల డిస్టిబ్యూటర్లుండటంతో కమర్షియల్ టాక్స్ అధికారుల పంట పడింది. ఒకరు కట్టిన ట్యాక్స్ను ఖజానాకు జమ చేసి.. మిగతా వారు కట్టిన డబ్బును తమ సొంతం చేసుకున్నారు. బ్యాంకు, సబ్ ట్రెజరీల్లోనూ... కమర్షియల్ ట్యాక్స్ ప్రభుత్వ ఖాతా ఉన్న బ్యాంకు, చలాన్లు చెల్లించే సబ్ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్టీవో)ల్లో కూడా శివరాజ్ మనుషులున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒకరి పేరుపై ట్యాక్స్ చెల్లించేందుకు ఇచ్చిన చెక్కుతోనే మిగతా వ్యాపారుల పేరిట చలాన్లు స్వీకరించడం ఏంటన్న అంశంపై దృష్టి సారించగా.. ఈ రెండు విభాగాల అధికారుల అక్రమాలు బయటపడినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లోనే రూ.20 కోట్లు బోధన్లో ట్యాక్స్ కుంభకోణం బయటపడి 15 రోజులు గడుస్తోంది. ఈ పక్షం రోజుల్లో బోధన్ మిల్లర్లు రూ.20 కోట్ల వరకు పెండింగ్ ట్యాక్సులు చెల్లించినట్టు తెలిసింది. ఇవి కేవలం 20 శాతం మంది మిల్లర్లు మాత్రమే చెల్లించినవి సీఐడీ తన దర్యాప్తులో బయటపెట్టింది. మొద్దు నిద్రలో వాణిజ్య విభాగం బోధన్లో ఈ స్కాం ఐదేళ్ల నుంచి జరుగుతోందని సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఐదేళ్లకు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా దొరక్కుండా కాల్చి బూడిద చేశారు. మరి ఐదేళ్ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఉన్నతాధికారులు, ఆడిటింగ్ విభాగం ఎందుకు పట్టించుకోలేదన్న అంశంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీరి చేతుల్లోకి కూడా వసూళ్ల డబ్బు వచ్చి ఉంటుందని అనుమానిస్తోంది. 2012 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు స్కాం జరిగినట్టు విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వసూళ్లనే దోచుకుంటే వాణిజ్య విభాగం చూసీచూడకుండా ఉండటంపై విమర్షలు వెలువెత్తుతున్నాయి. ఆ అధికారులపై నజర్ ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలకు సంబంధించి కేసుల నమోదు, దాడులు చేసే అధికారం కేవలం ఏసీబీకి మాత్రమే ఉంది. బోధన్ స్కాంతో వెలుగులోకి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై త్వరలోనే కొరడా ఝళిపించే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే అధికారులపై దాడులకు సంబంధించిన ప్రతిపాదన పైలు జీఏడీలో పెండింగ్లో ఉందని, ఆ ఫైలును సీఎం కార్యాలయానికి చేరకుండా కమర్షియల్ ట్యాక్స్లోని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి ఆపించే కుట్ర చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 10 రోజులుగా ఆ ఫైలు సీఎంవోకు వెళ్లకుండా పక్కనబెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ నుంచి జాయింట్ కమిషనర్లకు వరకు ఉన్నట్టు తెలిసింది. -
తప్పుడు ధ్రువపత్రాలతో భార్యకు విడాకులు
దిండి: తప్పుడు ధ్రువపత్రాలతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని విడాకులు పొంది తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. నల్గొండ జిల్లా దిండి మండల పరిధిలోని గొల్లనపల్లి గ్రామానికి చెందిన ఆర్కపల్లి నాగార్జున హైదరాబాద్ గోషామహల్ పోలీసు స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ నాంపల్లి పుష్పలతను 2015లో వివాహం చేసుకున్నాడు. కాగా, కోర్టులో ఆమె ఊరి పేరు మార్చి 2016లో పెళ్లి చేసుకున్నట్లు కోర్టులో తప్పుడు పత్రాలతో విడాకుల కోసం దాఖలు చేసుకున్నాడు. గత డిసెంబర్ 19న విడాకులు కూడా పొందాడు. తనను వివాహం చేసుకున్న సంవత్సరం, తన ఊరి పేరుపై తప్పుడు పత్రాలు సమర్పించి విడాకులు తీసుకుని పుష్పలత ఆరోపించింది. భర్త నాగార్జున తనను మోసగించాడంటూ పుష్పలత స్థానిక పోలీసు స్టేషన్ సెంటర్లో ధర్నాకు దిగింది. పెద్ద మనుషులు న్యాయం చేస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆమె ఆరోపిస్తోంది. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. -
నకిలీ ప్లాట్ల పత్రాల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు తయారు చేసి వాటిని అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ముఠాలో ఉన్న ఐదుగురి సభ్యుల్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు రాచకొండ జాయింట్ కమిషనర్ శశిధర్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నగదు, 655 రబ్బరు స్టాంపులు, వెయ్యికిపైగా రిజిస్ట్రేషన్ రెవెన్యూ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 332 నాన్ జుడీషియల్, 94 పాత నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఎలాంటి సర్టిఫికెటైనా అందిస్తాడు..
నాంపల్లి: విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి సర్టిఫికెట్నైనా అందించే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీఎన్ఆర్ లేని వారు ఎంప్లాయిమెంట్ వీసాపై విదేశాలకు వెళ్లే అవకాశం లేక పోవడంతో దీనిని అవకాశంగా మార్చుకున్న అతను ఎస్సీఎస్సీల తయారీని ఉపాధిగా మార్చుకున్నాడు.. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి రెడ్హిల్స్కు చెందిన అబ్దుస్ సత్తార్ (46) ఇంటర్ చదివి, ఆ తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేశాడు. అనంతరం ఉపాధి కోసం 1995లో సౌదీ అరేబియాకు వెళ్లి 2008 నగరానికి తిరిగి వచ్చాడు. సీసీటీవీ ఇన్స్టాలేషన్ బిజినెస్ చేస్తున్న సత్తార్ గ్రాఫిక్ డిజైనర్గా తనకున్న అనుభవంతో నేర్చుకున్న విద్యను నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ల తయారీని ఎంచుకున్నాడు. సికింద్రాబాద్లోని రీజినల్ పాస్ పోర్టు ఆఫీస్ వద్ద ఏజెంట్గా చెలమణి అవుతూ ఈసీఎన్ఆర్ పాస్పోర్టు తిరస్కరణదారుల డాటాను సేకరించి వారికి సర్టిఫికెట్లు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో సర్టిఫికెట్గా ఒక్కో రేటు వసూలు చేసేవాడు. ఎస్ఎస్సీ సర్టిఫికెట్స్కు రూ.15000, ఇంటర్ సర్టిఫికెట్కు రూ.20000, డిగ్రీ, ఆపైన సర్టిఫికెట్స్ కోసం రూ.25వేలు వసూలు చేసేవాడు. ఓయూ, జేఎన్టీయూ...ఇలా ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ అయినా తయారు చేసి ఇచ్చేవాడు. ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కోసం ఎస్ఎస్సీ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులు రెడీ చేసి పాస్పోర్టు స్లాట్లు కూడా బుక్ చేసేవాడు. రెడ్హిల్స్లోని తన ఇంటి నుంచే ఈ దందా నిర్వహించేవాడు. అతని బారిన పడి మోసపోయిన వ్యక్తులు ఈ విషయాన్ని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టికి రావడంతో దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. -
రూ. 1000 కోట్ల విలువైన భూమి స్వాధీనం
బొమ్మనహళ్లి : నకిలీ దాఖలాలను సృష్టించి రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారిపై దాడులు జరిపి సదరు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ శంకర్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని కెంగేరీ పరిధిలో ఉన్న మాళిగొండనహళ్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి తార్ ప్లాంటేషన్ ఇండస్ట్రీ పేరుతో సంస్థకు 55 ఎకరాల భూమిని మంజూరు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రెవెన్యూ అధికారులకు అక్కడికి చేరుకుని రెండు జేసీబీ యంత్రాలు, నాలుగు టిప్పర్లు, సంస్థకు చెందిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కరోజే రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
స్మృతి ఇరానీని వేధించేందుకే: కోర్టు
-
స్మృతి ఇరానీని వేధించేందుకే: కోర్టు
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ కేసు వివాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో స్మృతి తన విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మంగళవారం పాటియాల కోర్టు కొట్టివేసింది. ఆమెకు సమన్లు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. కేంద్ర మంత్రి కావడం వల్లే ఆమెను వేధించేందుకు కేసు వేశారని కోర్టు అభిప్రాయపడింది. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా స్మృతి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో బీఏ చదివినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి 1996లో డిగ్రీ పట్టా అందుకున్నట్టు వెల్లడించారు. అయితే ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకోలేదని ఫ్రీలాన్స్ రచయిత కేసు వేయడంతో వివాదం ఏర్పడింది. -
పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!
జడలో పూలు, మెడలో నగలతో ఆడవేషం ధరించి చాలా గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులను బోల్తా కొట్టించింది. పెదవులకు లిప్స్టిక్, బుగ్గలకు మేకప్, సన్నని కనుబొమ్మలు, వయ్యారంగా చీర కట్టి అచ్చం మహిళలాగా వ్యవహరిస్తూ.. అక్రమ దందాలకు తెరతీసింది. మహిళలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్ను తాజాగా బిహార్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్ను నడిపిస్తున్నది మోనిక కాదు.. ఆ పేరుతో ఆడవేషంలో తిరుగుతున్న అవినాష్ అని తెలిసి పట్నా పోలీసులు షాక్ తిన్నారు. తవ్వితీస్తున్న కొద్దీ ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. మోనిక పేరుతో అవినాష్ అలియాస్ గోల్డీ ముఠా చాలా అక్రమాలే సాగిస్తున్నది. ఆధార్ కార్డులు మొదలు పదో తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీఈడీ, జేఈ, ఐటీఐ ఇలా ఏ నకిలీ పత్రం కావాలన్నా మోనికా ముఠా చిటికెలో సృష్టిస్తూ మోసం చేస్తున్నది. ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది. అంతేకాదు బిహార్లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్న ఉన్నది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత లక్ష్యంగా ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు.. పరుషుడు అంటూ ఇచ్చిన సమాచారంతో అతని గుట్టు రట్టయింది. ప్రస్తుతం అవినాష్ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భూదాన్ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
⇒ రాష్ట్ర భూదాన్ బోర్డు కార్యదర్శి కె.కృష్ణారెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో భూదాన్ యజ్ఞ బోర్డు భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భూదాన్ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయంలో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు అధికారుల సంతకాలతో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి.. భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నారు. హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ మండలం కుంట్లూరు పాపాయిగూడెం సర్వే నంబర్ 215 నుంచి 224 వరకు 100 ఎకరాల్లో ప్లాట్స్ వేశారని.. వారికి నకిలీ పత్రాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇక షేక్పేట మండలంలోని 591/13 సర్వే నంబర్లో 52 ఎకరాలను గతంలో ఉమ్మడి రాష్ట్ర భూదాన్ బోర్డు లీజుకు ఇచ్చిందని.. కానీ ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నందున బాధ్యులపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర భూదాన్ బోర్డు పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని.. అందులో ఉమ్మడి రాష్ట్రబోర్డు 47 వేల ఎకరాలను లీజుకు ఇచ్చిందని చెప్పారు. మిగతా భూమి రికార్డులపై తహసీల్దార్లు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇంతవరకు బోర్డు ఎవరికీ భూములు కేటాయించలేదని.. ప్రజలెవరూ మోసపోవద్దని కృష్ణారెడ్డి సూచించారు. -
ముగ్గురు కబ్జాదారుల అరెస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో రూ.10 కోట్ల విలువ చేసే 1200 గజాల ఖరీదైన ప్లాట్కు అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు కబ్జాదారులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. దారుసలాంకు చెందిన అమృత్ కల్రేజా అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ప్లాట్ నెం.864 ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తమ సమీప బంధువు బ్రిజేష్ కుమార్ బజాజ్, అనుచరుడు అస్గర్ అలీతో కలిసి శనివారం ఈ ప్లాట్లోకి వెళ్లి చుట్టూ గోడలు నిర్మించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ సొసైటీ కార్యదర్శి టి.హన్మంతరావు సొసైటీకి చెందిన ప్లాట్ను బోగస్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా స్థలంలో అమృత్ కల్రేజాతో పాటు బ్రిజేష్కుమార్ బజాజ్, అస్గర్ అలీలను అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 471, 427, రెడ్విత్ 34, సెక్షన్ 5ఆఫ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 1982లో ఈ ప్లాట్ను బ్రిజ్వేశ్వర్నాథ్ గుప్తాకు కేటాయించారు. అయితే సకాలంలో సభ్యత్వ రుసుము చెల్లించకపోవడంతో ఆయనకు ఇంకో ప్లాట్ కేటాయించారు. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగకముందే ఆయన మృతి చెందారు. బ్రిజ్వేశ్వర్నాథ్ కొడుకు రాజేంద్రనాథ్ 1999లో ఈ ప్లాట్ తనకు అలాట్ అయిందంటూ బోగస్ పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా.. అమృత్ ఈ ప్లాట్పై కన్నేశాడు. నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరణ
కేయూ క్యాంపస్ : ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి ఆడం ఫర్సూనస్ సూచించారు. వీసా దరఖాస్తు, యూనివర్సిటీల ఎంపికలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం కేయూ సెనేట్ హాల్లో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆడం ఫర్సూనస్ పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా పలు అంశాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువు ఖ ర్చుతో కూడుకున్నదని తెలిపారు. దీన్ని గుర్తించి స్థోమతకు తగినవి ఎంపిక చేసుకోవాలని సూ చించారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరించడంతో పాటు భవిష్యత్లో దారులు మూసుకుపోతాయన్నారు. కాగా, ఆడం ఫర్సూనస్ తొలుత కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.బెనర్జీ, ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.పురుషోత్తం, ఇన్ఫార్మటిక్స్ విభాగం డాక్టర్ మంజులతో భేటీ అయ్యా రు. కేయూ సర్టిఫికెట్ల ముద్రణలో తీసుకుంటు న్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు సునీత, తన్నీరు, కిషోర్ పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు లక్నో నుంచి తెస్తారిలా!
హిమాయత్నగర్: ప్రముఖ యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను బుధవారం రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సీఐ భీమ్రెడ్డి కథనం ప్రకారం...లక్నోకు చెందిన అర్పిత్జైన్ అదనపు డిగ్రీ కోసం ఎదురు చూసే విద్యార్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తుంటాడు. అర్పిత్జైన్కు ఇంటర్నెట్ ద్వారా అమన్గుప్తా, కరీంనగర్ జిల్లాకు చెందిన చాంద్పాషా పరిచయం అయ్యారు. అతడితో ముఠా కట్టిన వీరిద్దరూ నగరంలో నకిలీ సర్టిఫికెట్ల విక్రయానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా అమన్గుప్తా, చాంద్పాషా కలిసి రెండు నెలల క్రితం హిమాయత్నగర్లో ‘ఇంటెలిజెంట్ మైండ్స్’ పేరిట స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. జాబ్ కోసం ఇంటర్నెట్లో దరఖాస్తు పెట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ చేస్తారు. అదనపు డిగ్రీ కావాలంటే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని చెప్తారు. తమను కలిసిన వారికి బీఏ, బీకాం, ఎంకాం, ఎంసీఏ తదితర సర్టిఫికెట్లు మీకు నచ్చిన యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. పరీక్ష రాస్తే రూ.60 వేలు, రాయకపోతే రూ.70 వేలు అని చెప్పి.. ఆ మేరకు వసూలు చేస్తారు. అనంతరం వారి వివరాలు లక్నోలో ఉన్న అర్పిత్కు చేరవేస్తారు. అతడు వారు కోరిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్ ఖండ్, అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్టీయూ తదితర వర్సిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాడు. సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు మంగళవారం రాత్రి ‘ఇంటెలిజెంట్ మైండ్స్’ సంస్థపై దాడి చేయగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 10 సర్టిఫికెట్లు, బుందేల్ఖండ్ యూనివర్సిటీకి చెందిన మూడు సర్టిఫికెట్లు దొరికాయి. అమన్గుప్తా, చాంద్పాషాపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు అర్పిత్జైన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఇన్స్పెక్టర్ భీమ్రెడ్డి చెప్పారు. -
నకిలీతో పోస్టింగ్కు దరఖాస్తు
నకిలీ సర్టిఫికెట్ అని తెలిసినా రికార్డులు కదిపిన అధికారులు గుర్తించిన కలెక్టరు... క్రిమినల్ కేసుకు సిఫార్సు చేయాలని ఆదేశం విజయనగరం: నకిలీ ధ్రువపత్రాలతో కారుణ్యనియామకం ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకున్న వ్యక్తి బాగోతాన్ని జిల్లా కలెక్టర్ బట్టబయలు చేశారు. క్రిమినల్ కేసుకు సిఫారసు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన టి.రామచంద్రరావు పోలీసు ఉద్యోగం చేస్తూ మతి చెందారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందులో భాగంగా కుమారుడు టి.కిరణ్కుమార్కు ఉద్యోగం ఇవ్వాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కిరణ్కుమార్ విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయనగరం జిల్లాలో సాగడంతో ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాలని విశాఖపట్నం పోలీసు అధికారుల నుంచి జిల్లా కలెక్టరుకు విజ్ఞాపన వచ్చింది. పరిశీలించిన కలెక్టరేట్ అధికారులు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం అప్పటి కలెక్టరు ఎం.ఎం.నాయక్కు పెట్టారు. ఆయన జూనియర్ సహాయకుల పోస్టింగ్తోపాటు ఐసీడీఎస్ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి విధుల్లో చేర్చుకోవాలని సూచిస్తూ ఐసీడీఎస్ పీడీకి కలెక్టర్ ఉత్తర్వులు పంపారు. నకిలీ ధ్రువీకరణ పత్రం గుర్తించిన అధికారులు ధ్రువపత్రాలు పరిశీలన సమయంలో ఆయన విద్యార్హత పత్రాలు పరిశీలించిన అధికారులు అందులో డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని గుర్తించారు. డిగ్రీ ఫుణే శ్రీధర్ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రం ఉద్యోగం కోసం జత చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీగ్రీ ఉత్తీర్ణత కాకుంటే అటెండరు పోస్టు ఇస్తారు. ఈ నేపధ్యంలో జూనియర్ సహాయకునిగా పోస్టు పొందాలన్న తపనతో కిరణ్కుమార్ అక్రమ మార్గం వెతికారు. ఐసీడీఎస్ అధికారుల పరిశీలనలో అది దొంగ ధ్రువీకరణ పత్రం అని తేలడంతో వారు కలెక్టరుకు వాస్తవాన్ని నివేదించారు. అప్పటి కలెక్టరు ఎం.ఎం.నాయక్ ఆయన ఉద్యోగ నియమకాన్ని నిలుపుదల చేశారు. వెంటనే విచారణ చేయాలని కోరారు. సంబంధం లేదన్న యూనివర్శిటీ కలెక్టరేట్ పరిపాలనాధికారి రమణమూర్తి దీనిపై విచారణ చేశారు. విశాఖపట్నం బ్రాంచిలో ఉత్తీర్ణులైనట్లు చూపడంతో ఆరా తీశారు. విశాఖపట్నంలో ఆ యూనివర్సటీ బ్రాంచి లేదని తేలింది. దీంతో పుణే శ్రీధర్ యూనివర్సటీ అధికారులను సంప్రదించారు. తమకు విశాఖపట్నంలో బ్రాంచి లేదని, తాము ఆ« వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేయలేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టరేట్ పరిపాలనా అధికారి రమణమూర్తి ‘సాక్షి’ వద్ద స్పష్టం చేశారు. కొత్త కలెక్టరు రాకతో కదిలిన రికార్డులు కలెక్టరు ఎం.ఎం.నాయక్కు బదిలీ జరగడంతో కొత్త కలెక్టర్గా వివేక్యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ రికార్డు మళ్లీ తెరపైకి వచ్చింది. డీగ్రీ ధ్రువీకరణ పత్రం నకలీదని తెలిసినప్పటికీ మానవతా దక్పథంతో ఇంటర్మీడియట్ వరకు సరైన ధ్రువపత్రాలు ఉన్నాయని అటెండరు పోస్టింగ్ ఇచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటీవల కొత్తగా చేపట్టిన కారుణ్య నియమకాల్లో కిరణ్కుమార్కు పోస్టింగ్ కోసం కలెక్టరేట్ అధికారులు కలెక్టర్కు ఫైలు పెట్టారు. అయితే ఆప్పట్లో ఇవ్వకుండా ఇప్పుడు మళ్లీ పెట్టడంపై కలెక్టర్ వివేక్ అనుమానం వ్యక్తం చేసి, వాస్తవాలు తెలుసుకుని అడ్డదార్లు తొక్కిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వవద్దని, క్రిమినల్ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
జోరుగా నకిలీ సర్టిఫికెట్లు దందా
సాక్షి, సిటీబ్యూరో: ముగ్గురు సూత్రధారులు... ఇద్దరు ఏజెంట్లు... మరో ఇరువురు సహాయకులు... ఇలా ఏడుగురు వేర్వేరు ముఠాలు ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల దందా ప్రారంభించారు. ఎస్సెస్సీ నుంచి ఇంజినీరింగ్ వరకు వివిధ విద్యార్హత పత్రాలను తయారు చేసి అమ్మేస్తున్నారు. వీరి గుట్టును రట్టు చేసిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చి కర్మన్ఘాట్ ప్రాంతంలో స్థిరపడిన వి.దినకర్రెడ్డి అలియాస్ దినేష్ రెడ్డి అలియాస్ దిన్ను రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో తృప్తిపడని ఇతగాడు నకిలీ సర్టిఫికెట్ల దందా సైతం ప్రారంభించాడు. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన కొత్తపేటలోని మోహన్నగర్లో స్థిరపడిన మార్కెటింగ్ ఉద్యోగి సి.సునీల్రెడ్డిని ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్నాడు. మరోపక్క దిల్సుఖ్నగర్లో గాయత్రి ఎడ్యుకేషనల్ అకాడెమీ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న ఎ.రామారావు సైతం ఇదే దందా ప్రారంభించి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి నాగోల్లో స్థిరపడిన బి.మనోజ్ను ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన జియాఉల్ హసన్ సైతం నకిలీ విద్యార్హత పత్రాలు తయారు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. దినకర్, రామారావులు తమ ఏజెంట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్లు అవసరమైన వారిని గుర్తించే వారు. కొన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేయడం ద్వారా కంప్యూటర్లో సా‹ఫ్ట్కాపీల రూపంలో భద్రపరిచే వాడు. ఏజెంట్లు తీసుకువచ్చిన వివరాలను ఫొటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా సాఫ్ట్కాపీల్లో పొందుపరిచి ప్రింట్స్ తీసేవారు. వీటిపై ఉంచాల్సిన హెలోగ్రామ్స్తో పాటు స్టాంపుల్ని స్థానికంగానే తయారు చేయించే వారు. దినకర్రెడ్డికి వరంగల్కు చెందిన రాఘవ, రామారావుకు అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మోహన్లాల్ వీటిని తయారు చేసి ఇచ్చే వారు. ఉస్మానియా వర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, జేఎన్టీయూ, శ్రీధర్ యూనివర్శిటీ (బెంగళూరు), ఛత్రపతి షానుజీ యూనివర్శిటీ (కాన్పూర్) తదితర విద్యా సంస్థలు, యూనివర్శిటీల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు ఉండేవి. హసన్ ఉత్తరప్రదేశ్లోనే సర్టిఫికెట్ల సిద్ధం చేసి తీసుకువచ్చి అమ్మేవాడు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియల్, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో సర్టిఫికెట్లను అవకాశం, అవసరాన్ని బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వేలకు విక్రయించే వారు. ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కమీషన్ ఇచ్చే వారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్రెడిడ తమ బృందాలతో ఆదివారం వలపన్ని మోహన్లాల్ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 450 నకిలీ సర్టిఫికెట్లు, 92 బోగస్ రబ్బర్ స్టాంపులు, ల్యాప్టాప్, కంప్యూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు వీరి నుంచి సర్టిఫికెట్ల ఖరీదు చేసిన వారినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. ఈ నిందితుల్లో కొందరు గతంలోనే ఇదే తరహా కేసుల్లో పోలీసులకు చిక్కారు. -
డ్రైవింగ్ లెసైన్సుల్లో 30 శాతం బోగస్
♦ వాటిని ఏరిపారేయాల్సిందే ♦ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి సాక్షి, విశాఖపట్నం : దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్లు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై రెండు రోజుల జాతీయ వర్క్షాప్ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమైంది. 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, దాదాపు వంద మంది దేశవిదేశీ అధికారులు ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నారు. రహదారుల భద్రతపై వారు 69 రకాల సిఫార్సులను అందించారు.ఈ సదస్సులో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడారు. రవాణా శాఖలో అవినీతికి మూల్యంగా ప్రాణాలను చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పారు. ఈ సంఖ్యను బ్రెజీలియా డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి 50 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రోడ్డు భద్రతకు సంబంధించి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజినీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్విరాన్మెంట్ అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదాలను 50 శాతం తగ్గిస్తాం రాష్ర్టంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2025 కల్లా 50 శాతానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ర్టంలో రోడ్లు, పోర్టుల అభివృద్ధిపై చర్చించారు.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్టు అండ్ రోడ్ సేఫ్టీ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. -
ఫీజు రీయింబర్స్.. హాం ఫట్
► విద్యార్థిని ఫీజురీయింబర్స్ కాజేసిన అనిత ఇంజినీరింగ్ కాలేజ్ ► కళాశాల చైర్మెన్ అరెస్ట్ కుషాయిగూడ: విద్యార్థిని పేర నకిలీ పత్రాలను సృష్టించి ఫీజు రీయింబర్స్మెంట్ కాజేసిన ఓ కాలేజీ యాజమాన్యం పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని అశ్విత ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్తో కలిసి సోమవారం విలేకరులకు వివరించారు. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామానికి చెందిన గుగులోతు అనిత అనే వివాహిత అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో 2013–14 విద్యా సంవత్సరంలో ఎంటెక్ అడ్మిషన్ తీసుకుంది. ఎస్టీ సామాజికవర్గం కావడంతో ఆమె ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అన్ని పత్రాలు జతపరిచి రంగారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. కొద్ది రోజులు కళాశాలకు వెళ్లిన అనిత గర్భవతి కావడంతో కళాశాలకు వెళ్లలేక పోయింది. తనను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సిబ్బందిని కోరగా కళాశాల అభివృద్ధికి సంబంధించి రూ. 5,500 ఫీజు చెల్లిస్తే అనుమతిస్తామన్నారు. ఆమెకు ఫీజు చెల్లించడం వీలు కాకపోవడంతో పరీక్షలు రాయలేదు. తరువాత చదువుకోవడం వీలుపడక పోవడంతో టీసీ కోసం కళాశాలకు వెళ్లింది. సెకెండ్ ఇయర్ ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. అయితే అనిత మొదటి సంవత్సరం కళాశాలకు హాజరైనట్లు, పరీక్షలు రాసినట్లు నకిలీ పత్రాలు, మెమోలను తయారు చేసిన కళాశాల యాజమాన్యం సెకండ్ ఇయర్కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసింది. అందుకు సంబంధించి అనిత అకౌంట్లోకి వచ్చిన రూ. 57 వేలు రీయింబర్స్మెంట్ డబ్బును అప్పటికే డ్రా చేసుకుంది. తిరిగి డబ్బులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని బుకాయించారు. ఇదిలా ఉండగా ఆమె అకౌంట్లో హాస్టల్ ఫీజుకు సంబంధించిన రూ. 6,400 జమయ్యాయి. అనుమానం కలిగిన అనిత ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా సెకండ్ ఇయర్కు కూడా రీయింబర్స్మెంట్ డబ్బు మంజూరైనట్లు తెలిసింది. తన వేలి ముద్రలు లేకుండా ఏ విధంగా అప్రూవల్ చేశారంటూ అధికారులను నిలదీసి కళాశాల యజమాన్యంపై కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులకు వాస్తవాలు వెలుగులోకి రావడంతో కళాశాల చైర్మన్ వసంత తరుణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వివరించారు. ట్రైబల్ వేల్పేర్ అధికారులపై కూడా విచారణ చేపడతామన్నారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటుఅట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కీసర, కుషాయిగూడ ఇన్స్పెక్టర్లు గురువారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర సర్టిఫి‘కేటుగాళ్ల’ ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శనివారం వెల్లడిం చారు. రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాలేద్ ఉప్పర్పల్లిలో నూర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ఇతగాడు ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు వివిధ రకాలైన నకిలీ సర్టిఫికెట్లు విక్రయించడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేవాడు. ఢిల్లీకి చెందిన విశాల్ అనే వ్యక్తి ద్వారా మహాత్మాగాంధీ కృషి విద్యాపీ(ఉత్తరప్రదేశ్), వీర్భద్రసింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ, భర్కతుల్లా యూనివర్శిటీ (మధ్యప్రదేశ్), బుంధేల్ఖండ్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్), మానవ్భారతి యూనివర్శిటీ (హిమాచల్ప్రదేశ్) పేర్లతో సర్టిఫికెట్లు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసేవాడు. అక్కడ నుంచి ఈ ధ్రువీకరణపత్రాలను విశాల్ కొరియర్లో ఖాలేద్కు పంపేవాడు. వీటిని సైఫాబాద్ ప్రాంతంలో లిమ్రా అటెస్టేన్స్ సంస్థను నిర్వహిస్తున్న మహ్మద్ ఉస్మాన్కు అప్పగించేవాడు. ఇతడు ఈ సర్టిఫికెట్లపై వివిధ రకాలైన స్టాంపులు వేసేవాడు. ఇలా పక్కాగా తయారు చేసిన సర్టిఫికెట్లను అవసరమైన వారికి రూ.40 వేల వరకు విక్రయించేవాడు. మెహిదీపట్నానికి చెందిన నిరుద్యోగి జీషాన్ అలీఖాన్ ఉద్యోగం పొందడానికి రూ.20 వేలతో నకిలీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. ఈ సర్టిఫికెట్ల ముఠాతో ఢిల్లీ, హిమాయత్నగర్లకు చెందిన షోయబ్, సబిత్లకు ప్రమేయం ఉంది. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం వలపన్ని శనివారం విశాల్, షోయబ్, సబిత్ మినహా మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి 24 బోగస్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకుని కేసును బహదూర్పుర పోలీసులకు అప్పగించింది. మరోపక్క నల్లకుంట పోలీసుస్టేషన్ పరిధిలో మూడు ముక్కలాట నడుస్తున్న ప్రాంతంపై టాస్క్ఫోర్స్ దాడి చేసింది. నిర్వాహకుడు డి.లక్ష్మణ్తో పాటు 10 మందిని అరెస్టు చేసి రూ.1.51 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. నెల రోజులుగా వ్యవస్థీకృతంగా దందా నిర్వహిస్తున్న లక్ష్మణ్.. ఒక్కో గేమ్కు ఆడేవారి నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. -
’సిరిసిల్ల సెస్లో నకి‘లీలలు’
ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కక్కుర్తి నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ముష్టిపల్లి ఏఎల్ఎం చంద్రయ్య సస్పెనషన్ మరికొందరిపై అనుమానం సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల సెస్లో మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. టెండర్లు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు కొనుగోలులో తలెత్తిన వివాదం సమసిపోకముందే..ఉద్యోగులు అక్రమ బాట్టారు. తప్పుడు పత్రాలు సమర్పించి ప్రమోషన్లు పొందారు. ఈ వ్యవహారం విచారణలో తేలడంతో ఎండీ నాంపెల్లిగుట్ట సిరిసిల్ల మండలం ముష్టిపల్లిలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న ఏ.చంద్రయ్యను శనివారం సస్పెండ్ చేశారు. గతేడాది హెల్పర్ నుంచి అసిస్టెంట్ లైన్మెన్గా ప్రమోషన్ పొందిన చంద్రయ్య నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడు. తేలింది ఒకటి..తేలాల్సినవి ఎన్నో..? సెస్లో హెల్పర్లు, అసిస్టెంట్ హెల్పర్లు, పదోన్నతుల కోసం అక్రమ మార్గాలను అనుసరించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రమోషన్ కోసం ఐటీఐ తత్సమాన కోర్సుల సర్టిఫికెట్లు అవసరంకాగా ఆయా అర్హతలు లేనివారు అక్రమబాట పడుతున్నారు. ఇటీవల సుమారు 160 మంది వరకు అసిస్టెంట్ హెల్పర్లు, హెల్పర్లు పదోన్నతులు పొందారు. కొంతమంది అర్హత లేకున్నా..ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చి 12న 37 మంది హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తూ..సెస్ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో చంద్రయ్య ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు పొందిన మరో ఆరుగురు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. ఉద్యోగాలు సమర్పించిన పత్రాలపై ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ. నాంపెల్లిగుట్ట తెలిపారు. -
నగరంలో నయా మోసం
హైదరాబాద్: మోసపోయే వాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడనడానికి నిదర్శనమే ఈ సంఘటన. ఒకే సంవత్సరంలో డిగ్రీ మూడు సంవత్సరాల పరీక్షలు పాస్ చేయిస్తామని నమ్మించి అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసిందో సంస్థ. ఈ సంఘటన నగరంలోని సరూర్నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ఘాట్లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నాగార్జున అకాడమీ పేరుతో ఓ అనామక సంస్థను ఏర్పాటు చేసిన విశ్వపాల్రెడ్డి.. డిగ్రీ, ఇంటర్, టెన్త్ గ్యారెంటీ పాస్ అని ప్రచారం చేసి సుమారు 80 మంది విద్యార్థుల నుంచి రూ. 30 వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు తమ పరీక్షలు ఎప్పుడు అని నిలదీస్తుండటంతో కనిపించకుండా వెళ్లాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లపై విచారణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్యారోగ్యశాఖ సంచాలకుల (ఆర్డీ) కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతలు తీసుకున్నారనే ఆరోపణలపై బుధవారం విచారణ చేపట్టారు. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని విచారణ చేశారు. గతంలో ఆర్డీ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్( ఏఎస్ఓ) గా పనిచేసిన సాయిబాబు అనే ఉద్యోగి నకలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చి పదోన్నతి పొందాడని ఓ వ్యక్తి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో సదరు ఉద్యోగిపై విచారణ చేసి అతడిని ఎల్డి కంప్యూటర్గా ఉద్యోగ కేడర్ తగ్గించి ప్రకాశం జిల్లాకు బదలీ చేశారు. దీంతో సదరు ఉద్యోగి ఆర్డీ కార్యాలయం పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు నకలీ విద్యార్హలతో పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆ ఫిర్యాదుపై విచారణ జరిగింది. గుంటూరులో ఏఎస్ఓలు గా పనిచేస్తున్న జి. వెంకటలక్ష్మి, కె.శ్రీనివాసరెడ్డి, డీఎస్ఓగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావు, తెనాలిలో ఏఎస్ఓగా పనిచేస్తున్న ఎంవీ ప్రసాదరావు, హైదరాబాద్లో ఏఎస్ఓగా పనిచేస్తున్న డి జయంత్, బాపట్లలో ఏఎస్ఓగా పనిచేస్తున్న షేక్ సయ్యద్ షరీఫ్, ఒంగోలులో ఏఎస్ఓగా పనిచేస్తున్న కె.కామేశ్వరరావు, పి. మణిగంధకుమార్, నెల్లూరులో ఏఎస్ఓగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసమూర్తి, పిడుగురాళ్లలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర్లు, పొదిలిలో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్న తిప్పయ్యలపై ఫిర్యాదు అందటంతో విచారణ జరిగింది. వీరంతా 2002 సంవత్సరంలో పదోన్నతులు పొందగా నేడు వారివి తప్పుడు సర్టిఫికెట్లు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. -
ఎన్నారై జంటకు రూ.52 కోట్ల జరిమానా
వాషింగ్టన్: నకిలీ రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు దాఖలుచేసి అమెరికా ప్రభుత్వ బీమా సంస్థ ‘మెడికేర్’, ఇతర ప్రైవేటు బీమా సంస్థల నుంచి అక్రమంగా రూ.కోట్ల నగదు వసూలుచేసిన కేసులో ఓ భారతీయ-అమెరికన్ జంటకు అక్కడి కోర్టు దాదాపు రూ.52 కోట్ల జరిమానా విధించింది. కీర్తీష్ పటేల్, నీతా పటేల్లు న్యూజెర్సీలో ‘బయోసౌండ్ మెడికల్ సర్వీసెస్, హార్ట్ సొల్యూషన్స్’ పేరిట మొబైల్ డయాగ్నస్టిక్ కంపెనీని ప్రారంభించారు. వీరు న్యూయార్క్, న్యూజెర్సీల్లోని డాక్టర్లు సూచించిన ప్రాంతాల్లోని వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వైద్య నివేదికలను డాక్టర్లకు పంపాలి. వైద్యులు సంతకం చేసిన రిపోర్టులకు మాత్రమే బయోసౌండ్కు మెడికేర్ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యుల సంతకాలు ఫోర్జరీచేసి వందలాదిగా రిపోర్టులు సృష్టించి వాటిని మెడికేర్కు దాఖలుచేసి దాదాపు రూ.30 కోట్లు పొందారు. -
మరొకరి ఆస్తిపై రూ. 1.50 కోట్ల రుణం
రుణం కేసులో నలుగురికి జైలు ముగ్గురికి 3 ఏళ్ల జైలు, రూ. 10వేల జరిమానా నకిలీ డాక్యుమెంట్ పెట్టిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.5వేల జరిమానా కాకినాడ లీగల్: కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్లో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్న కేసులో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్, టాక్స్ కన్సెల్టెంట్, నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన వ్యక్తికి ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేల జరి మానా, నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.ఐదువేలు జరిమానా విధి స్తూ కాకినాడ మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ పి.శివరామప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడకు చెందిన జీవీ కనస్ట్రక్షన్ ప్రొప్రైటర్ గరికిపాటి వెంకట్రావు రుణం కోసం కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్లో రూ.కోటి 50 లక్షలకు రెండు ఆస్తులను హామీగా పెట్టాడు. అందులో కాకినాడ అచ్యుతాపురం వద్ద ఉన్న బిల్డింగ్ ఒకటి కాగా, మరొకటి వైజాగ్లో ఉన్న ఆస్తి. అయితే నెల నెలా రుణం వాయిదా కట్టకపోవడంతో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్ గ్యారంటీగా ఉంచిన రెండు ఆస్తులను గుర్తించారు. గ్యారంటీగా ఉంచిన కాకినాడ ఆస్తి కరెక్టుగానే ఉండగా, వైజాగ్లో ఉన్న ఆస్తి రిసు అప్పలకొండ అనే మహిళ పేరుపై ఉన్న డాక్యుమెంట్ను నండూరి సత్యవతి పేరుపై నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి బ్యాంక్కు ఇచ్చినట్టు గుర్తిం చారు. నకిలీ డాక్యుమెంట్ను సత్యవతి కుమారుడు నండూరి చినప్రసాద్ తయారు చేశాడు. దీనిపై వన్టౌన్ పోలీసులకు ధనలక్ష్మి బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ కేసరాజు సత్యనారాయణ 2008లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. రుణం మంజూరుకు సహకరించిన వ్యక్తులకు జైలు ఈ రుణం మంజూరు చేసిన ధనలక్ష్మి బ్యాంక్ కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఘంటశాల దామోదరరావుకు, కాకినాడకు చెందిన టాక్స్ కన్సెల్టెంట్ గరిమెళ్ల నాగ వెంకట రవిశర్మకు, కాకినాడకు చెందిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన నండూరి చినప్రసాద్కు ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. అలాగే నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన నండూరి సత్యవతికి రెండేళ్ల జైలు, రూ. ఐదువేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ ఎ.బి.అప్పారావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
టాపర్స్ స్కాం.. కీలక పురోగతి
పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ వేగంగా జరుగుతుంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లాల్ కేశ్వర్ సింగ్, ఆయన భార్య అయిన జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పోలీసుల కోరిన ప్రకారం పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఓమ్ ప్రకాశ్ బుధవారం భార్యాభర్తలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించారు. అవినీతి అరోపణలు రావడంతో జూనియర్ ప్రొఫేసర్ దిలీప్ కుమార్ వర్మను ప్రిన్సిపాల్ గా నియమించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టాపర్స్ స్కాంలో ఇప్పటికే కొందరు టాపర్స్ ను, మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. -
నకిలీ ధ్రువపత్రంతో టీచర్ ఉద్యోగం
శ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల భర్తీ చేసిన డీఎస్సీ-14లో ఎస్జీటీ కేటగిరీ నుంచి ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నకిలీ ధ్రువపత్రం సమర్పించారని, మరో అభ్యర్థి జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. కింతలి అన్నపూర్ణ అనే అభ్యర్థి తనకు అంధత్వం ఉన్నట్టు ధ్రువీకరణపత్రం జతచేసి ఉద్యోగం పొందిందని కూర్మాపు మీన ఫిర్యాదులు పేర్కొంది. 2012లో ఇదే అభ్యర్థి మెదక్ జిల్లా నుంచి డీఎస్సీ పరీక్ష రాసినప్పుడు బీసీ-ఎ జనరల్ అభ్యర్థిగా పరీక్ష రాశారని, 2014 డీఎస్సీ సరికి వికలాంగ ధ్రువీకరణ పత్రంతో ఎలా పరీక్ష రాశారన్నదానిపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వికలాంగురాలి పత్రం నకిలీదని తేలిస్తే డి.జయశ్రీ అనే నిజమైన వికలాంగురాలు ఉద్యోగం పొందుతుందని తెలిపారు. దీనిపై అధికారులు లోతైన దర్యాప్తు జరిపిస్తే ఫిర్యాదు వాస్తవమా, కాదా అన్నది తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయి. ముస్లిం మైనారిటీ అభ్యర్థుల ఫిర్యాదు ఇదిలా ఉంటే ఓ ఇద్దరు ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఇటీవల కలెక్టర్కు ఓ ఫిర్యాదు చేశారు. తాము బీసీ-ఇ కేటగిరీకి చెందినవారమని, పొరపాటునో, మరో కారణంగానో బీసీ-బిగా నమోదైందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దార్ ద్వారా విచారణ చేరుుంచి, ఇద్దరు అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారుగా నిర్ధారించారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణరుుంచి, అంతకుముందు బీసీ-ఇ కేటగిరీ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థులను తప్పించాలని ఆదేశించారు. అయితే, వీరిద్దరు కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తూ తమ స్థానాల్లో ఉద్యోగం ఇవ్వాలని చూస్తున్న అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారు కాదని ఆరోపించారు. దీంతో అధికారులు ఈ విషయంపై విచారణ జరిపించేందుకు డీఆర్ఓకు నివేదించారు. డీఆర్ఓ నుంచి నివేదిక అందిన తరువాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా ఫిర్యాదు అందినమాట వాస్తవమేనన్నారు. అయితే రిఫరల్ ఆస్పత్రి నుంచి కూడా 40 శాతం అంగవైకల్యంతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. మైనారిటీల విషయమై డీఆర్ఓకు నివేదించినట్టు చెప్పారు. -
నకిలీ పత్రాలతో యాజమానినే భయపెట్టాడు..
నాంపల్లి: నకిలీ దస్తావేజులు తయారు చేసి ఓ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురిచేసిన కిరాయిదారుడితోపాటు అతని అనుచరులను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్ఘాట్లో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించి ఇన్స్పెక్టర్ మధు మోహన్రెడ్డి తెలిపిన వివరాలివీ.. బజార్ఘాట్లో నివాసం ఉండే గణపతి రావుకు ఎనిమిది పోర్షన్లున్న భవనం ఉంది. దానిని ఎనిమిది మందికి అద్దెకిచ్చారు. షేర్గల్లీకి చెందిన సయీద్ అనే వ్యక్తికి 2009లో అద్దెకు దిగాడు. ఈ ఏడాది మేనెలలో ఇంటి యజమాని గణపతిరావు మరణించారు. హుమాయూన్ నగర్ ఉండే ఆయన కుమారుడు ప్రవీణ్ అద్దె కోసం సయీద్ వద్దకు ఇటీవల వెళ్లారు. అద్దె చెల్లించకుండా ఈ ఇల్లు తనదేనంటూ సయీద్ తిరగబడ్డాడు. ‘అద్దె లేదు.. ఇల్లు లేదు.. దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ దబాయించాడు. ‘మీ తండ్రి నాకు అమ్మేశాడం’టూ దొంగ డాక్యుమెంట్లు, దొంగ రసీదులు చూపించారు. అంతటితో ఆగకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. మున్సిపల్ ట్యాక్స్ రసీదు, ఇళ్లు కొన్నట్టుగా ఇంటి యజమానికి నగదు చెల్లించిన రసీదు, ఎలక్ట్రిసిటీ, నల్లా కనెక్షన్ రసీదులు నకిలీవి సంపాదించాడు. ఈ రసీదులతో గోల్కొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ముస్తాక్ అనే బ్రోకర్ సాయంతో సయీద్ తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు నివేదించిన తప్పుడు డాక్యుమెంట్లతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. సయీద్ను అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో సయీద్, ముస్తాక్, ఖలీమ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సయీద్ తమ్ముడు, భార్య పరారీలో ఉన్నారు. -
ఆ కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష
కాకినాడ లీగల్(తూర్పు గోదావరి జిల్లా): కాకినాడ నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్లకు నకిలీ చలానాలు చెల్లించిన కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తూ కాకినాడ రెండో అదనపు సివిల్ జడ్జి, సీబీసీఐడీ మేజిస్ట్రేట్ కె.శివశంకర్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 1999-2005 మధ్యకాలంలో ఉద్యోగులు నకిలీ చలానాలు తయారు చేసి, బిల్డింగ్ ప్లాన్లకు అనుమతులు ఇచ్చి, భవన యజమానుల నుంచి యథాతథంగా సొమ్ములు వసూలు చేశారు. కార్పొరేషన్ ఆడిట్ విభాగం ఆడిట్ చేసిన సమయంలో ఈ కుంభకోణం బయటపడింది. సుమారు 250 చలానాలకు రూ.26,68,356 సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. దీనిపై అప్పటి కమిషనర్ కె.వెంకటేశ్వర్లు 2006లో నాటి కలెక్టర్ జవహర్రెడ్డికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అప్పటి కలెక్టర్ సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ అనంతరం 14 మంది ఉద్యోగులపై సీబీసీఐడీ కేసులు నమోదు చేసింది. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముగ్గురు సిబ్బందికి రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. మిగిలిన 11 మందికి ఆరు నెలల జైలు, జరిమానా విధించారు. మొత్తం 14 మందికి వివిధ సెక్షన్ల కింద రూ.94 వేల జరిమానా విధించారు. ఏపీపీ ఎంవీఎస్ఎస్ ప్రకాశరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
అడ్డదారిలో అమెరికా వెళ్లేందుకు యత్నించి..
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన ఓ యువకుడు నకిలీ పత్రాలతో వీసా పొందేందుకు యత్నించి అమెరికా కాన్సులేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బేగంపేట పోలీసులు శుక్రవారం ఇతడితో పాటు నకిలీ పత్రాలు సమకూర్చిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. అల్వాల్కు చెందిన బి.సాయివర్దన్రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలని భావించాడు. వీసా పొందేందుకు అవసరమైన పత్రాల కోసం కర్నూల్కు చెందిన డెంటిస్ట్ వెంకటేష్ను సంప్రదించగా... అతను రాజస్థాన్లోని సీజర్ యూనివర్సిటీలో చదివినట్లుగా నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించి ఇచ్చాడు. వీటితో సాయివర్దన్రెడ్డి బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో గత మార్చిలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీవిగా గుర్తించారు. ఇదిలా ఉండగా... సాయివర్దన్రెడ్డి శుక్రవారం సర్టిఫికెట్ల కోసం యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి రాగా... అక్కడి అధికారుల సమాచారం మేరకు ఎస్ఐ నాగరాజు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే, ఇతనికి నకిలీ పత్రాలు సమకూర్చిన వెంకటేష్ను సైతం పట్టుకున్నారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
‘కు.ని’ చేయించుకున్నాం.. ఒట్టు..
♦ ఆర్టీసీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల దందా ♦ నకిలీ పత్రాలతో ఖజానాకు కన్నం సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంక్రిమెంటు... వారం రోజుల సెలవు.... ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను బాగా ఆకట్టుకొంటున్న అంశాలు. ఈ ‘డబుల్ బెనిఫిట్’ కోసం కొందరు ఉద్యోగులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నట్టు నకిలీ పత్రాలతో నమ్మిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రభుత్వ పర్యవేక్షణ పడకేయటం, ఎవరేం చేసినా అడిగేవారే లేకపోవటంతో ప్రస్తుతం ఎవరి ఇష్టం వారిదిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తాజాగా వెలుగు చూసిన అడ్డగోలు వ్యవహారమిది. డొంక కదిలిందిలా... కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ సిబ్బందికి సంస్థ ప్రోత్సాహకాలను అందిస్తోంది. శస్త్రచికిత్స చేసుకున్న సమయంలో వారికి వారం రోజుల సెలవు, అదనంగా ఓ ఇంక్రిమెంటు జత చేస్తున్నారు. అర్హులైన వారు దీన్ని పొందుతుండగా, కొందరు దొడ్డిదారిన ఈ బెనిఫిట్లను సొంతం చేసుకోవటం తాజాగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం నిర్లిప్త ధోరణిని అలుసుగా చేసుకుని సిబ్బంది బోగస్ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తూ పలు రకాల బెనిఫిట్లు పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని పేర్కొంటూ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి జారీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి విధులకు హాజరు కాకుండా అడ్డదారిలో సెలవులు పొంది సొంత పనులు చూసుకొంటున్నారు. ఆ కాలానికి ఠంచన్గా వేతనం పొందున్నారు. అలాగే కొందరు డ్రైవర్లు కష్టతరమైన డ్రైవింగ్ విధుల నుంచి తప్పుకుని అంతగా కష్టపడాల్సిన పనిలేని శ్రామిక్లాంటి పనులు చేసుకునేలా తప్పుడు అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. శ్రామిక్లాంటి అతి తక్కువ వేతనం ఉండే పోస్టులో ఉంటూ డ్రైవర్ స్కేలు ప్రకారం వేతనం పొందుతున్నారు. అన్ని డిపోల్లో విజిలెన్స్ తనిఖీలు... ఎవరేంచేసినా చెల్లిపోతున్న నేపత్యంలో కొందరు ‘కు.ని.’ ఆపరేషన్లను అవకాశంగా చేసుకున్నారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో కొందరు సిబ్బంది అక్రమంగా బెనిఫిట్లు పొందారంటూ ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఒకే ఆసుపత్రి పేరుతో జారీ అయిన పత్రాలను తనిఖీ చేశారు. అవి నకిలీవని తేలడంతో సదరు సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరందరికీ అదే డిపోలో పనిచేసే ఓ డ్రైవర్ ఆ నకిలీ పత్రాలు జారీ చేయించినట్టు పోలీసు దర్యాప్తులో తేలటంతో అతడిని అరెస్టు చేశారు. అప్రమత్తమైన యాజమాన్యం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో తనిఖీ చేసేందుకు విజిలెన్సు విభాగాన్ని రంగంలోకి దింపింది. ఇందులో చిత్రవిచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు 15-20 ఏళ్ల వయస్సు పిల్లలున్నవారు కూడా ఇప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నట్టు పత్రాలు దాఖలు చేస్తున్నారని, గతంలోనే ఆ చికిత్స చేయించుకున్నవారు ఇప్పుడు చేయించుకున్నట్టు పేర్కొంటున్నారని తేలినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ విచారణ సాగుతోంది. రెండేళ్లుగా దాఖలైన పత్రాలన్నింటినీ పరిశీలించి నకిలీల నివేదిక అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది. -
సీబీఐ విచారణతో రెవెన్యూ వర్గాల్లో కలకలం
► తప్పుడు పత్రాలతో రూ.31.83 కోట్ల ► రుణం పొందిన ఘనులు ► బెంగళూరు నుంచి వచ్చి ► దర్యాప్తుచేసిన సీబీఐ డీఎస్పీ పడన రూరల్ : సీబీఐ దాడులతో పెడన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. తప్పుడు ధ్రువపత్రాలతో గుడివాడ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.31.83 కోట్ల రుణాలు పొందిన వ్యక్తి పెడన మండలంలో చేపల చెరువులు ఉన్నట్లు చూపించిన వైనంపై కేసు నమోదైంది. విజయవాడకు చెందిన వీనస్ ఆక్వా ఫుడ్స్ ైప్రైవేటు లిమిటెడ్ యజమాని నిమ్మగడ్డ రామకృష్ణ, పెడన , బంటుమిల్లి, గుడివాడ, అవనిగడ్డకు చెందిన నలుగురు వ్యక్తులు గుడివాడ ఆంధ్రాబ్యాంకులో రూ.31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి 2010లో రూ.31.83 కోట్లు రుణం పొందారు. హామీగా పెడన మండలం నందమూరు గ్రామం లజ్జబండ కాలువకు అనుకుని ఉన్న (నందమూరు నుంచి మడక మీదుగా బల్లిపర్రు వెళ్లే మార్గం) 31.97 ఎకరాల చేపల చెరువులను చూపించారు. హామీ దారుల్లో ఒకరైన పామర్రు మండలానికి చెందిన ఆరేపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు ఆరేపల్లి వెంకటనాగరమేష్, మరి కొందరి పేరుతో నందమూరులో 31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు అప్పటి వీఆర్వో కూనపురెడ్డి వీరమోహనరావు ధ్రువీకరించిన పత్రాలను బ్యాంకులో సమర్పించారు. ఈ పత్రాలు అసలైనవా? కావా? తేల్చాలంటూ బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు ఏప్రిల్ ఆఖరి వారంలో పెడన తహసీల్దార్కు లేఖ పంపించారు. ఏప్రిల్ 29న బెంగళూరులోని తమ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ డి.వి.ఎస్.ఎల్లారావు ఆ రోజున డెప్యూటీ తహసీల్దార్ కుమార్ను బెంగళూరు పంపించారు. కుమార్ అందించిన వివరాలను తీసుకుని సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర గురువారం సాయంత్రం పెడన వచ్చి, చేపల చెరువులున్న ప్రాంతంలో విచారణ చేశారు. అయితే ఆ చెరువుల సర్వే నంబర్లు వేరొకరి పేరుతో ఉండడంతో సీబీఐ డీఎస్పీ అవాక్కయ్యారు. మరి కొన్ని సర్వే నంబర్లు నందమూరులో లేవని స్థానిక వీఆర్వో రాజును విచారించిన సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర తెలుసుకున్నారు. ఆరేపల్లి వెంకట నాగరమేష్ తమ్ముడు, అన్నయ్య పేరుతో నందమూరులో చేపల చెరువులున్నట్లు గుర్తించారు. సీబీఐ విచారణ రెవెన్యూ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
నమ్మకస్తులనుకుంటే నట్టేట ముంచారు...
ఎంతో నమ్మకంగా తమ వద్ద ఉంటున్న ఆ ఇద్దరికీ వారు రూ.3 కోట్ల విలువైన ఆస్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి, విదేశాల్లో ఉంటున్నారు. అయితే, ఆ ఇద్దరూ కూడబలుక్కుని ఆ ఆస్తిని వేరొకరికి అమ్మేశారు. విషయం తెలుసుకున్న యజమాని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ...జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీలో ఫ్లాట్ నంబర్ 84-ఏ యజమానులు అబ్దుల్ వాహిద్ అలీ దంపతులు షార్జాలో నివాసముంటారు. ఈ ఫ్లాట్ నిర్వహణ బాధ్యతను తమకు ఎంతో నమ్మకస్తులైన హైదరాబాద్కు చెందిన సయ్యద్ వాజిద్ మోయినొద్దీన్, ఆసిఫ్ సయీద్లకు అప్పగించారు. అయితే సయ్యద్ వాజిద్ మోయినొద్దీన్, ఆసిఫ్ సయీద్లు ఇద్దరూ కలిసి రూ.3 కోట్ల విలువ చేసే ఈ ఫ్లాట్ డాక్యుమెంట్లను నకిలీవి రూపొందించి ఇటీవల వేరొకరికి విక్రయించేశారు. అంతేకాదు, బాధితుడు అబ్దుల్ వాహిద్ భార్యకు రూ.2 కోట్లు ఇచ్చినట్లుగా స్టాంప్ పేపర్లు కూడా పుట్టించారు. యజమాని అబ్దుల్ వాహిద్కు ఇటీవలనే తమ ఇంటిని నకిలీ డాక్యుమెంట్లతో విక్రయించినట్లు తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. ఇటీవలి వరకు ఈ ఫ్లాట్లో లర్నియమ్ స్కూల్ కొనసాగింది. స్కూల్ను ఖాళీ చేయించిన తర్వాత ఆ ఇద్దరూ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో ఇంటిని విక్రయించారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 468, 471, 420, 120(బి) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆటకట్టు
► ముగ్గురిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో: వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 160 నకిలీ సర్టిఫికెట్లు, 30 బోగస్ ఉద్యోగ సిఫార్సు లేఖలు,10 నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన బి.శేఖర్ నర్సారావుపేటలో 2010లో బీటెక్ ఫెయిలయ్యాడు. గుంటూరులో మూడు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగం కోసం 2014లో అమెరికా వెళ్లాలని భావించిన శేఖర్ గుంటూరులో శౌర్య కన్సల్టెన్సీ నిర్వాహకుడు రవిని సంప్రదించాడు. డిగ్రీ లేనిదే ఆయా దేశాలకు వెళ్లడం అసాధ్యమని అతను చెప్పాడు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేల్ నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తాడని తన బంధువు విజయ్ ద్వారా శేఖర్ తెలుసుకున్నాడు. రూ.38 వేల వెచ్చించి ఇమ్మానుయేల్ ద్వారా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు నుంచి బుందేల్ఖండ్ వర్శిటీకి చెందిన డిగ్రీ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. దీని ఆధారంగా న్యూజిలాండ్లోని ఓ సంస్థలో పీజీ డిప్లమోకు దరఖాస్తు చేసుకున్నా సీటు రాలేదు. దీంతో తాను కూడా నకిలీ సర్టిఫికెట్ల విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న శేఖర్... రవి, ఇమ్మానుయేల్తో కలిసి రంగంలోకి దిగాడు. ఎస్సార్నగర్ పరిధిలో శేఖర్ గ్రూప్ ఓవర్సీస్ సర్వీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. నకిలీ సర్టిఫికెట్ల కోసం తమ వద్దకు వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ముఠా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు సాయంతో వాటిని రూపొందించి అందిస్తున్నారు. ఢిల్లీ, తమిళనాడు, ఝూన్సీ, సిక్కిం యూనివర్శిటీల పేర్లతో తయారవుతున్న నకిలీ సర్టిఫికెట్లను భారీ మొత్తాలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం ఆదివారం దాడి చేసిన శేఖర్, రవి, ఇమ్మానుయేల్లను అరెస్టు చేసింది. కేసును ఎస్సార్నగర్ పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తోంది. -
వ్యక్తిని పట్టుకుంటే ‘వ్యవస్థ’ గుట్టురట్టు!
⇒నకిలీ సర్టిఫికెట్లతో వీసా ఇంటర్వ్యూకు వచ్చిన యువకుడు ⇒కాన్సులేట్ సమాచారంతో పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ⇒అతడి విచారణలో విక్రయిస్తున్న సంస్థ వ్యవహారం వెలుగులోకి ⇒నల్లగొండ చౌరస్తాలోని కార్యాలయంపై దాడి: నిందితురాలి అరెస్టు సిటీబ్యూరో: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో అమెరికా కాన్సులేట్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూకు హారయ్యాడో యువకుడు... ఆ విషయం గుర్తించిన కాన్సులేట్ సిబ్బంది టాస్క్ఫోర్స్కు సమాచారం ఇచ్చారు... సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా... అతడికి డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ అమ్మిన సంస్థ వ్యవహారం వెలుగులోకి వచ్చింది... బుధవారం నల్లగొండ చౌరస్తాలోని ఆ సంస్థపై దాడి చేసి చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ను అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చంచల్గూడకు చెందిన విద్యార్థి మహ్మద్ అఖీల్ అహ్మద్ గతేడాది జూలైలో నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎన్సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్ సంస్థను సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు తనకు బీఎస్సీ (ఐటీ) డిగ్రీ సర్టిఫికెట్ పాత తేదీలతో కావాలని కోరాడు. దీనికి అంగీకరించిన సంస్థ నిర్వాహకుడు వారణాసిలోని మహాత్మాగాంధీ కృషి విద్యాపీఠ్ పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. అడ్డంగా దొరికిన అఖీల్... ఈ సర్టిఫికెట్లతో అఖీల్ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూ నిమిత్తం మంగళవారం బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వచ్చాడు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన కాన్సులేట్ అధికారులు డిగ్రీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు నకిలీవిగా గుర్తించారు. టాస్క్ఫోర్స్కు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి... అఖీల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తాను నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎన్సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్ నుంచి సదరు సర్టిఫికెట్లు ఖరీదు చేశానని చెప్పాడు. దీంతో ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్రెడ్డిలతో కలిసి సిటీ టవర్స్లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. ఈ సంస్థ చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ (సీఓఓ) అఫ్షాన్ సిద్ధిఖీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ యజమాని మహ్మద్ హయత్ హుస్సేన్ పరారయ్యాడు. సంస్థ కార్యాలయం నుంచి 83 నకిలీ సర్టిఫికెట్లు, వీటి తయారీకి వినియోగించే కంప్యూటర్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అఫ్షాన్ సిద్ధిఖీ ఎన్సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్లో ఎనిమిది నెలలుగా సీఓఓగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. ఎనిమిది విశ్వవిద్యాలయాల పేర్లతో... అఫ్షాన్ సిద్ధిఖీ తన యజమాని హుస్సేన్తో కలిసి ఛత్రపతి షాహూజీ యూనివర్శిటీ (కాన్పూర్), భర్ఖతుల్లా విశ్వవిద్యాలయ (భోపాల్), రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ (కర్ణాటక), మహారాణి రామేశ్వ రి ఆయుర్వేదిక్ కాలేజ్ (దర్భంగా, బీహార్), శివాజీ యూనివర్శిటీ (గ్వాలియర్), బుందేల్ఖండ్ యూనివర్శిటీ (ఝాన్సీ), మహాత్మా గాంధీ కృషి విద్యాపీఠ్ (వారణాసి), గ్లోబల్ యూనివర్శిటీ (నాగాలాండ్) పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో పాటు తమకు నాగాలాండ్లోని గ్లోబల్ యూనివర్శిటీతో ఒప్పందం ఉందంటూ డిగ్రీకి రూ.40 వేలు, పీజీకి రూ.45 వేలు ఫీజు వసూలు చేసి, విద్యార్థులతో కార్యాలయంలోనే పరీక్షలు రాయిం చి నకిలీ సర్టిఫికెట్లు అంటగడుతున్నా రు. అఖీల్, అఫ్షాన్లను బేగంపేట పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తోంది. -
రూ. కోటి ఆస్తిపై కన్ను !
► నకిలీ డాక్యుమెంట్లతో బేరం ► నాల్గో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ► నిందితులకు అధికార పార్టీ నేతల అండ? అనంతపురం: నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖరీదైన స్థలాలను కారుచౌకగా కొట్టేస్తున్నారు. అసలు యజమాని సీనులోకి వస్తే తమకూ రిజిస్ట్రేషన్ అయిందంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. పైగా అధికార పార్టీ నేతల అండ కూడా ఉండడంతో సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా అనంతపురం నగరంలోని మారుతీనగర్లో రూ. కోటి విలువైన ఆస్తిపై కొందరు కన్నేశారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బేరం పెట్టారు. విషయం తెలుసుకున్న స్థల అసలు యజమాని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. మారుతీనగర్ శివారులో పది సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ స్థలంపై వేణుగోపాల్నగర్ తారకరామాపురం కొట్టాలకు చెందిన ఇద్దరు సోదరుల కన్నుపడింది. దీంతో అసలు యజమాని ప్రమేయం లేకుండానే ఈ స్థలాన్ని మరో నలుగురి వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ నలుగురికి కొంత మొత్తం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. అసలు య జమాని డాక్యుమెంట్లను నకిలీవి సృష్టించారు. చివరకు రేషన్కార్డు, ఆధార్కార్డు కూడా నకిలీకి జత చేసినట్లు తెలిసింది. నలుగురి పేర్ల మీద ఉన్న ఆస్తిని తిరిగి మరో వ్యక్తికి అమ్మేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం కొనుగోలు చేసిన వ్యక్తి స్థలాన్ని శుభ్రం చేయిస్తున్నాడనే సమాచారంతో అసలు యజమాని అక్కడికి చేరుకున్నాడు. తనస్థలంలో ఎందుకు శుభ్రం చేయిస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఫలానా వారు అమ్ముతున్నారని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పాడు. డాక్యుమెంట్లను పరిశీలించిన అసలు యజమాని తమ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ నాల్గో పట్టణ పోలీస్స్టేషన్కు పరుగులు తీశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా సూత్రధారులైన ఇద్దరు సోదరులకు అధికార పార్టీకి చెందిన నేత ఒకరు సహకరిస్తున్నట్లు సమాచారం. -
పాములపాడు తహశీల్దార్పై కేసు నమోదు
పగిడ్యాల(కర్నూలు జిల్లా): తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన పాములపాడు మండల తహశీల్దార్ అనురాధపై కేసు నమోదు చేసినట్లు ముచ్చుమర్రి ఎస్ఐ శివాంజల్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన షేక్ హుసేన్పీరాకు ఆరుగురు కుమారులు. వీరిలో పెద్దవాడైన షేక్ చాంద్భాషాకు జూపాడుబంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామంలో 5 ఎకరాల భూమి ఉంది. అయితే చాంద్భాషా తమ్ముడైన ఫారూక్ భాషా తనను చాంద్భాషా అని పిలుస్తారని నోటరీ సర్టిఫికెట్ సమర్పించడంతో 2014లో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్భాషా అని అప్పటి పగిడ్యాల తహశీల్దార్గా పనిచేసే అనురాధ రెసిడెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేశారని వివరించారు. తప్పుడు సర్టిఫికెట్ పొందిన ఫారూక్ భాషా చాంద్భాషా పేరు మీద ఉండే 5 ఎకరాల పొలాన్ని తన పేరు మీదుగా పట్టా పొంది అనుభవంలో ఉన్నాడని చెప్పాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఫారూక్ భాషాకు జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికెట్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును పరిశీలించిన రెవెన్యూ అధికారులు వివరాలు అందజేశారు. అందులో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్భాషా అని ఉండడం గమనించిన చాంద్భాషా నందికొట్కూరు కోర్టును నెల రోజుల క్రితం ఆశ్రయించాడు. ఫిటిషన్ను పరిశీలించిన కోర్టు తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన తహశీల్దార్పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన షేక్ ఫారూక్ భాషా, తహశీల్దార్ అనురాధ, ఆర్ఐ, వీఆర్వోలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
♦ డిగ్రీ, పీజీ పట్టాలు తయారు చేసిన ఘనులు ♦ ప్రధాన నిందితుడు సహా నలుగురి అరెస్టు కీసర: డిగ్రీ, పీజీతో పాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను కీసర పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ టీం సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సంఘటన కీసర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. విలేకరుల సమావేశంలో సీఐ గురువారెడ్డి, ఎస్ఐ అనంతచారి, ఎస్ఓటీ ఎస్ఐ రాములు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిరుమల్నగర్ మండలం ఈతూర్ గ్రామానికి చెందిన రాములు పీజీ వరకు చదువుకొని నగరంలోని తిలక్నగర్లో విద్యాధర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యూకేషన్తో పాటు ఏపీ స్టేట్ ఓపెన్ స్కూల్ పేరిట ఇన్స్టిట్యూట్లను నిర్వహిస్తున్నాడు. 2013లో యూపీలోని సోభిత్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ నుంచి వన్ సిట్టింగ్ డిగ్రీ ఎగ్జామ్ పేరిట అనుమతి తీసుకున్నట్లు పత్రాలు సృష్టించి పెద్దఎత్తున నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు గాలం వేశాడు. డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి పలువురి నుంచి రూ. 45 వేల చొప్పున ఫీజు తీసుకొని చేర్చుకున్నాడు. అభ్యర్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ, ఎస్కేడీ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ, షోబిత్ యూనివర్సిటీఆఫ్ మీరట్ ఉత్తరప్రదేశ్ పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు కీసర మండలం నాగారం గ్రామంలోని వెస్ట్ గాంధీ నగర్లో రాములు నివసిస్తున్న ఇంటిపై బుధవారం మెరుపు దాడిచేశారు. వివిధ యూనివర్సిటీల పేరుతో ఉన్న 45 నకిలీ డీగ్రీ, పీజీ సర్టిఫికెట్లతోపాటు వివిధ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను, 7 సెల్ఫోన్లు, రూ. 30,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాములుతో పాటు, నకిలీ సర్టిఫికెట్ల తయారీలో అతడికి సహకరిస్తున్న కొప్పుల ప్రశాంత్, దేశం నాగరాజు, కృష్ణమోహన్లను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాసభ్యులు వంశీకృష్ణ, అనంత క్షవీర్, మనోజ్కుమార్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలిం చినట్లు సీఐ గురువారెడ్డి పేర్కొ న్నారు. -
నకిలీ సర్టిఫికెట్లపై నేడు విచారణ
చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2012 లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లలో నకిలీవనే అనే అనుమానం వచ్చిన వాటి విచారణ శుక్రవారం ఉదయం 10గంటలకు డీఈవో కార్యాలయం లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అభ్యర్థులకు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గత నెల ఫిబ్రవరిలో తిరుపతిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి డీఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరి శీలించిన విషయం విదితమే. పరిశీలనానంతరం అభ్యర్థులు అందజేసిన నకలు కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తరలించారు. అప్పటి నుంచి ఆ సర్టిఫికెట్లపై డీఈవో నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టిని పెట్టి పలుమార్లు పరిశీలించారు. అనుమానం వచ్చిన సర్టిఫికెట్లను పరిశీలించడానికి అభ్యర్థులు చదివిన సంబంధిత మండలాలకు విచారణ నిమిత్తం పంపారు. దాదాపు 8 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు నకిలీవని అనుమానం రాగా, ఆ విచారణాధికారులు వారిని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఫోన్ ద్వారా తెలియజేశారు. -
నకీలీ దస్తావేజులతో మోసగించే ముఠా అరెస్ట్
విజయవాడ(కృష్ణాజిల్లా): నకిలీ దస్తావేజులతో కొనుగోలుదారులను మోసగించే ముఠాను శనివారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 5న కంకిపాడు పోలీస్స్టేషన్లో యలమంచిలి శేఖర్బాబు అనే వ్యక్తిని పలివేటి కృష్ణప్రసాద్(55) స్థల కొనుగోలు విషయంలో మోసం చేశాడనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా గురించి తెలుసుకున్నారు. గుంటూరుకు చెందిన చింతం రమణారెడ్డి అలియాస్ పలివేటి కృష్ణప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనితో ఖాళీ స్టాంపు పేపర్లు విక్రయించే వెళ్లచెరువు కృష్ణారావు, రబ్బరు స్టాంపులను తయారు చేసే అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి(48)లు కలసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు పలు ఏరియాల్లోని వెంచర్ల సర్వేనంబర్లతో నకిలీ స్టాంపు పేపర్లు తయారుచేసి కొనుగోలు దారులను మోసం చేశారు. వీరి పై దృష్టి పెట్టిన కంకిపాడు పోలీస్ బృందం నిందితులను అరెస్ట్ చేసి భారీగా నకిలీ స్టాంపు పేపర్లు, దస్తావేజులను స్వాధీనం చేసుకుంది. -
విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!
విశాఖపట్నం: విశాఖలో ఘరానా మోసం చోటుచేసుకుంది. మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు నిందితులు యూనియన్ బ్యాంక్కు రూ.2 కోట్లు టోకరా వేశారు. బ్యాంక్ నుంచి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డ నిందితులు కనకారావు, రవికుమార్ లను అరెస్టు చేసినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టి నిందితుల నుంచి నగదు రికవరీ చేస్తామని వివరించారు.