Hyundai
-
తాజా ఆటోమొబైల్ అప్డేట్స్
హ్యుందాయ్, హోండా కార్స్ వాహన ధరల పెంపుఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి ముంబై: వాహన ధరల పెంపు కంపెనీల జాబితాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్), హోండా కార్స్ చేరాయి. ‘‘పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇన్పుట్ వ్యయాలను కొంత భర్తీ చేయడానికి ధరలను సవరించాల్సి వస్తుంది. అందుకే వాహన ధరలను ఏప్రిల్ నుంచి 3% వరకు పెంచుతున్నాము’’ అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. అమేజ్, సిటీ, సిటీ ఈ:హెచ్ఈవీ, ఎలివేట్తో సహా వేరియంట్, మోడల్ బట్టి ధరల పరిధి మారుతుందని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్లు తమ వాహన ధరలు వచ్చే నెల నుంచి పెంచే యోచనలతో ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు. టఫే వైస్చైర్మన్గా లక్ష్మీ వేణున్యూఢిల్లీ: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) వైస్ చైర్మన్గా లక్ష్మీ వేణు నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె సంస్థ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీకి ట్రాక్టర్లు, ఆటో విడిభాగాల పరిశ్రమలో గణనీయంగా అనుభవం, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉన్నట్లు సంస్థ చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో టఫే, ఐషర్ ట్రాక్టర్స్ బృందాలతో కలిసి పని చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు. బిజినెస్ టుడే ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలు‘, ఎకనమిక్ టైమ్స్ ‘యంగ్ లీడర్స్ – 40 అండర్ 40‘ జాబితాల్లో లక్ష్మీ చోటు దక్కించుకున్నారు. ఆమె సుందరం–క్లేటన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉబెర్ టూవీలర్ రైడర్లకు మరింత భద్రతన్యూఢిల్లీ: టూ–వీలర్ డ్రైవర్లు, రైడర్లకు మరింత భద్రత కలి్పంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రైడ్–õÙరింగ్ సంస్థ ఉబెర్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఉబెర్ మోటో డ్రైవర్లకు సేఫ్టీ కిట్లను అందించింది. వీటిలో హెల్మెట్లు, సేఫ్టీ స్టిక్కర్లు మొదలైనవి ఉన్నాయి. ఉబెర్ మోటో యాప్లో హెల్మెట్లు ధరించాలంటూ ప్రయాణికులకు కూడా కోరే విధంగా ఫీచర్లు ఉంటాయని సంస్థ వివరించింది. ట్రాఫిక్లోను సులభంగా వెళ్లగలిగే వెసులుబాటు, సౌకర్యం, తక్కువ ఖర్చు వంటి అంశాలు బైక్ ట్యాక్సీలకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత -
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్ను తయారీ హబ్గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
ఎక్కువ మైలేజ్ కోసం.. ఇవిగో బెస్ట్ సీఎన్జీ కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ (Maruti Suzuki Fronx CNG)మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG)భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ (Hyundai Exter S CNG)రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ. -
వదిలేసిన కారులో రూ. కోటి నగదు
యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
-
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్తో..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో 'క్రెటా' (Creta) కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
లాభాల ‘ఆఫర్లు’.. క్యూకట్టిన ఇన్వెస్టర్లు
సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.మరింత స్పీడ్ డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024హ్యుందాయ్ ఐయోనిక్ 5హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్షిప్ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్వర్క్ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్బ్యాక్ల నుంచి ఎస్యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్: సేఫెస్ట్ కారుగా టక్సన్
భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ టక్సన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. బీఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు టక్సన్ కావడం గమనార్హం. ఇది అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.84 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49కు 41 పాయింట్లు సాధించింది.హ్యుందాయ్ టక్సన్ కారులో ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్, బెల్ట్ ప్రీటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్ వంటివి ఉన్నాయి. ఇందులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్లు మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 156 బీహెచ్పీ పవర్, 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 186 బీహెచ్పీ పవర్, 416 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.హ్యుందాయ్ టక్సన్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇది రెండు డ్యూయల్-టోన్ షేడ్స్, ఐదు మోనోటోన్ రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టార్రీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అబిస్ బ్లాక్ రూఫ్ తో ఫియరీ రెడ్.Safety ratings of Hyundai-Tucson Gasoline.The Hyundai Tucson Gasoline has scored 5 Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests#bharatncap #safetyfirst #safetybeyondregulations #drivesafe pic.twitter.com/9vpaEUga8y— Bharat NCAP (@bncapofficial) November 28, 2024 -
భారత్లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్..
కొత్త ఫీచర్లతో సరికొత్తగా అప్డేట్ చేసిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ను రూ. 14.99 లక్షలు, డీజిల్ వేరియంట్ను రూ.15.99 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన అప్డేట్తోనైనా ఈ ఎస్యూవీ నెలవారీ విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విభాగంలో టాటా సఫారి, మహీంద్రా ఎక్స్యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్, కియా కారెన్స్ వంటివి దీనికి పోటీగా ఉన్నాయి.2024 హ్యుందాయ్ అల్కాజార్ లుక్స్ పరంగా క్రెటాను సాగదీసినట్లుగా ఉంటుంది. హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, పెద్ద రేడియేటర్ గ్రిల్ , విశాలమైన స్కఫ్ ప్లేట్తో బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్ ఇందులో ఇచ్చారు. ఇక వాహనం ఇరువైపులా చేసిన పెద్ద మార్పులు ఏంటంటే.. కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్.ఆల్కాజర్ రియర్ ఫేస్ కూడా కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్తో భారీగా సర్దుబాట్లు చేశారు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లను కూడా దీనికి ఇచ్చారు. కొలతల విషయానికొస్తే, అల్కాజర్ అవుట్గోయింగ్ మోడల్తో పోల్చితే 2024 ఆల్కాజర్ 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటాయి. 2,760 ఎంఎం వీల్బేస్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్లోనూ డ్యాష్బోర్డ్తోపాటు మరికొన్ని మార్పులు చేశారు.అల్కాజార్ ఫేస్లిఫ్ట్లో 1.5లీటర్ డీజిల్, 1.5లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికలు, మూడు డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్లు (స్నో, మడ్, శాండ్) ఉన్నాయి. కొత్త బోల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ 9 రంగులలో లభిస్తుంది. వీటిలో 8 మోనో-టోన్ ఎంపికలు అవి కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాటీ, టైటాన్ గ్రే మ్యాటీ, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫైరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, ఒక డ్యూయల్- బ్లాక్ రూఫ్తో అట్లాస్ వైట్లో టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్రూఫ్తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్ను ఎలక్ట్రిక్ సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్బ్యాగ్లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
1974 మోడల్ తరహాలో కొత్త కారు (ఫొటోలు)
-
ఇకపై కావాలన్నా.. ఈ కారును కొనలేరు!.. ఎందుకంటే?
హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్.. ఎందుకంటే..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన ఈవీ అయానిక్5 మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్గ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్ 5 మోడల్ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్ 5 మోడల్కార్లను రీకాల్ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్గ్రేడ్ చేస్తాం. రీకాల్ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్షోరూం)గా ఉంది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్!
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు. ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్ను విక్రయిస్తున్నాయి. -
న్యూయార్క్ ఆటో షోలో హల్చల్ చేసిన లేటెస్ట్ కార్లు (ఫోటోలు
-
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
రూ.16.8 లక్షల ఎస్యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్లైన్ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
భారత్లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
-
సేల్స్ బీభత్సం.. భారత్లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
భారత్లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్సైజ్ ఎస్యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది. ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు. -
Hyundai IPO: ఐపీవో బాటలో హ్యుందాయ్.. రూ.27500 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్ఎంఐఎల్.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్ఎంఐఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ రికార్డును అధిగమించే వీలుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్ఎంఐఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది. -
పిచ్చెక్కిస్తున్న దీని డిజైన్..SUVలకు విపత్తుగా మారుతోంది..!
-
షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ తన 'ఐయోనిక్ 5' (Ioniq 5) ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత 20 సంవత్సరాలుగా హ్యుందాయ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్కు కంపెనీ 'ఐయోనిక్ 5' 1100వ యూనిట్ను డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ఐయోనిక్ 5 ఈవీ లాంచ్ సమయంలో కూడా షారుక్ పాల్గొన్నారు. ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' కావడం గమనార్హం. మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ ఛార్జ్తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదీ చదవండి: తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు షారూఖ్ ఖాన్ ఇతర కార్లు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో ఒకరైన షారుక్ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద ఉన్న కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, బుగట్టి వేరాన్ స్పోర్ట్స్, ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, హ్యుందాయ్ క్రెటా వంటివి మరెన్నో ఉన్నాయి. -
అమెజాన్ ద్వారా కారు కొనేయొచ్చు - పూర్తి వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్లాట్ఫామ్ అమెజాన్. ఇప్పటి వరకు ఫ్యాషన్, హోమ్ యుటిలిటీ, మొబైల్స్, టీవీలు వంటి వస్తువులను విక్రయించిన ఈ సంస్థ త్వరలో కార్లను కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు వర్చువల్ షోరూం ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా వివిధ బ్రాండ్లకు సంబంధించి కార్ల ధరలు, ఫీచర్ల వంటి వాటిని గురించి తెలియజేయడానికి హ్యుందాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ద్వారా కారు భాగాలను, ఇతర యాక్ససరీస్ కూడా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కొనుగోలుదారులు మరింత సులభమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ అవకాశం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అమెజాన్ ద్వారా లావాదేవీలు జరిగినప్పటికీ.. ఇందులో అసలు విక్రేత కంపెనీ అధికారిక డీలర్ ఉంటారు. అంటే డీలర్షిప్కి.. కస్టమర్కి మధ్య వారధిలా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా వినియోగదారుడు కొన్ని అదనపు సౌకర్యాలను పొందవచ్చు. -
ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్
కార్లను కొనుగోలు చేసినప్పుడు డీలర్షిప్ వర్గాలు కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాలకు బలైన బాధితులు కన్స్యూమర్ కోర్టు ద్వారా పరిష్కారం లేదా నష్టపరిహారం పొందుతారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన వ్యక్తి 2019 జూన్ 11న 'అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి 'హ్యుందాయ్ శాంట్రో ఎమ్టి స్పోర్ట్జ్' (Hyundai Santro M.T Sportz) కారును రూ. 6,25,663కు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఇందులో లోపాలు ఉన్నట్లు, రెండు సర్వీసింగ్ సెషన్లకు లోనయ్యిందని డీలర్షిప్కు విన్నవించాడు. కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్షిప్ రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ చేసిన తరువాత 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటపడ్డారు, అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. సంఘటన జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్కు తెలియజేశాడు, డీలర్షిప్ యాజమాన్యం స్పందిస్తూ.. కారును రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా కస్టమర్కు కారుని అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్ బాణవర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. కారు తయారీలో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్కు తెలియజేశాడు. కాలిపోయిన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ వాగ్దానాలను వెల్లడించాడు. ఈ సంఘటన మానసిక ఒత్తిడికి దారితీసినట్లు, ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు ప్రస్తావించాడు. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్.. తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించి, దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త హ్యుందాయ్ శాంత్రోను అందించాలని, కస్టమర్కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్స్ వచ్చేశాయ్!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. ఇక రానున్నది విజయ దశమి. ఈ సందర్భంగా చాలామంది వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్స్ అందిస్తున్న కార్ల కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా వంటివి ఉన్నాయి. హోండా కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ వంటి కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా సిటీ కారు మీద రూ. 75,000 వరకు ప్రయోజనాలు, అమేజ్ మీద రూ. 57,000 బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, ఇప్పుడు సంస్థ ఐ10 ఎన్ లైన్ మీద రూ. 50000, గ్రాండ్ ఐ నియోస్ మీద రూ. 43000, ఆరా మీద రూ. 33000, వెర్నా అండ్ అల్కజార్ మీద వరుసగా రూ. 25000 & రూ. 20000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? మారుతి సుజుకి కూడా ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్ కింద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో మారుతి ఇగ్నీస్, బాలెనొ అండ్ సియాజ్ ఉన్నాయి. వీటి మీద కంపెనీ వరుసగా రూ. 65000, రూ. 55000 & రూ. 53000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. Note: హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్తో బడ్జెట్ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?
Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్లకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు, ఫ్రంట్ వీల్స్పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్సర్ట్లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి. వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్బాక్స్తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
హ్యుందాయ్ చేతికి జనరల్ మోటార్స్ ప్లాంట్.. కొత్త ప్లాన్ ఏంటంటే?
ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జనరల్ మోటార్స్' భారతదేశంలోని తన తాలెగావ్ ప్లాంట్ సౌత్ కొరియా దిగ్గజం 'హ్యుందాయ్ ఇండియా' చేతికి అందించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ మహారాష్ట్రలోని జనరల్ మోటార్ యూనిట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 2025 నుంచి ఉత్పత్తి.. హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ప్లాంట్లో 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏకంగా రూ. 20వేలకోట్లు పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాలెగావ్ కొత్త ప్లాంట్లో ఏడాదికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! భారతదేశంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ఇండియాను వదిలేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్లాంట్ వదులుకోవడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ కూడా మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?
Hyundai Exter: భారతీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో భాగంగానే నేడు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ కొత్త మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్' (Exter) లాంచ్ చేసింది. ఈ ఆధునిక మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు ట్రిమ్స్లో లభిస్తుంది. అవి ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) అండ్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. వీటి ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల వరకు ఉంటుంది. ఆటో ట్రిమ్లో టాప్ వేరియంట్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ ఎస్యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. ఇది 83 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG వెర్షన్లో కూడా లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ప్రత్యేకమైన డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్ కలిగి సైడ్ ప్రొఫైల్ 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎస్యువి పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది హ్యుందాయ్ నియోస్, ఆరా వంటి వాటిని పోలి ఉంటుంది. ఇందులో 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లాక్ అండ్ ఆలివ్-గ్రీన్ షేడ్స్లో సెమీ-లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీని పొందుతాయి. అంతే కాకుండా ఇందులో సింగిల్-పేన్ సన్రూఫ్, 8 ఇంచెస్ టచ్స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉందులో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతీయ విఫణిలో టాటా పంచ్, సిట్రోయెన్ సి3, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ ఇదే! ప్రత్యర్థులకు తిప్పలు తప్పవా?
Hyundai Exter First Unit Rolls Out: భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ తన 'ఎక్స్టర్' (Exter) ఎస్యువిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే గతంలో అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్స్, ఫోటోలు వంటివి కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా దేశీయ విఫణిలో విడుదలయ్యే ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ చెన్నైలోని కంపెనీ ప్లాంట్ విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ 2023 జులై 10న ఇండియన్ మార్కెట్లో విడుదలచేయనున్న ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్లు ఎట్టకేలకు వెల్లడించింది. ఇప్పటికే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, డెలివరీలు జులై చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారుకి బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్స్లో అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ ప్లస్ అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, కాస్మిక్ బ్లూ ప్లస్ అబిస్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ టైటాన్ గ్రే, టామ్బాయ్ ఖాకీ, టామ్బాయ్ ఖాకీ ప్లస్ అబిస్ బ్లాక్ అనే మోనో టోన్ అండ్ డ్యూయెల్ టోన్ వున్నాయి. డిజైన్ పరంగా హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు వర్టికల్ టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. ఈ SUV 3,595 మిమీ పొడవు, 1,595 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మొదలైనవి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ ఎంకరేజ్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) హ్యుందాయ్ కొత్త ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది. అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
హార్దిక్ పాండ్యాకు అరుదైన గౌరవం - అదేంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రానున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్ ప్రచారకర్తగా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. టాటా మోటార్స్ పంచ్, సిట్రియోన్ సీ3 మోడళ్లకు ఎక్స్టర్ పోటీ ఇవ్వనుంది. బ్రాండ్ ప్రచారాన్ని పాండ్యా విస్తృతం చేస్తారని, హ్యుందాయ్ ఎక్స్టర్ను మిల్లేనియల్స్, జనరేషన్ జడ్కు అనుసంధానం చేయడంలో సహాయపడతారని విశ్వసిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్స్: గ్రామీణ భారతంపై కన్ను
హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్స్క్రీన్తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది) తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
టాటా పంచ్ ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఎక్స్టర్ - లాంచ్ డేట్ ఫిక్స్
Hyundai Exter: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కొత్త కారుని (ఎక్స్టర్) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ SUV ఫోటోలను, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు సంస్థ ఎక్స్టర్ లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ నివేదికల ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్టర్ 2023 జులై 10న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎస్యువి మార్కెట్లో అడుగుపెట్టడాని మరెన్నో రోజులు లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 11,000లతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు జులై చివరినాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. వేరియంట్స్ & డిజైన్ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉండే ఈ కారు ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్కు టెక్స్చర్డ్ ఫినిషింగ్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ డిస్ప్లే, ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్రూఫ్ వంటివి వుంటాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంజిన్ కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) సేఫ్టీ ఫీచర్స్ ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం డిజైన్, ఫీచర్స్, మైలేజ్ వంటి విషయాలతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్లో విడుదలైన తరువాత టాటా పంచ్ మైక్రో ఎస్యువికి ప్రత్యర్థిగా నిలబడనున్న ఎక్స్టర్ తప్పకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో) ప్రత్యర్థులు & అంచనా ధర హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
టిక్టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్టాకర్లు. ‘టిక్టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్టాక్లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజైన్ & వేరియంట్స్: భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్కు టెక్స్చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) సేఫ్టీ ఫీచర్స్: ఇటీవల కంపెనీ తన ఎక్స్టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడతాయి. ఇంజిన్: ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) అంచనా ధర & ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డెలివరీలు ఆగస్టు నాటికి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంలో మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎనర్జీ రంగంలో ఉన్న షెల్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హ్యుందాయ్కి చెందిన 36 డీలర్షిప్ కేంద్రాల వద్ద 60 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్లను షెల్ ఏర్పాటు చేస్తుంది. దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను పెంచడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం అని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్పై కీలక ప్రకటన ‘కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ప్రాథమికమైనవి’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. హ్యుందాయ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 72 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 'ఎక్స్టర్' మైక్రో SUV గురించి కొంత కొంత సమాచారంగా వెల్లడిస్తూనే ఉంది. ప్రారంభంలో టీజర్లను మాత్రమే విడుదల చేసిన కంపెనీ కొన్ని రోజులకు ముందు కారుకి సంబంధించిన ఒక అధికారిక ఫోటో విడుదల చేసింది. అయితే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్.. భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా పంచ్ కారుకి ప్రధాన ప్రత్యర్థిగా నిలబడటానికి సిద్దమవుతున్న ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఇటీవల వెల్లడైన ఫోటోల ద్వారా స్పష్టంగా తెలిసింది. సేఫ్టీ ఫీచర్స్.. హ్యుందాయ్ ఎక్స్టర్ అన్ని వేరియంట్లలోనూ ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అవి డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్, సైడ్ ఎయిర్ బ్యాగ్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి. ఈ నియమాన్ని హ్యుందాయ్ అనుసరిస్తోంది. ఎయిర్ బ్యాగులు మాత్రమే కాకుండా హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. కావున భద్రత పరంగా ఈ కారు పటిష్టంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిపోయింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) లాంచ్ టైమ్ & ఇంజిన్ డీటైల్స్.. ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ కొత్త SUV CNG వెర్షన్ లో కూడా రానున్నట్లు సమాచారం, ఇది కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు 2023 జులై చివరలో లేదా ఆగష్టు ప్రారంభంలో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ రూ.20,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్లో రూ.20,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వచ్చే 10 ఏళ్లలో ఈ మొత్తాన్ని దశలవారీగా వెచ్చించనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అభివృద్ధి, వాహనాల ప్లాట్ఫామ్స్ ఆధునీకరణకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంటును ఈవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. 1,78,000 యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. అయిదేళ్ల వ్యవధిలో ప్రధాన రహదార్లలోని కీలక ప్రదేశాలలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. హ్యుందాయ్ వార్షిక తయారీ సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది. -
విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న ఎక్స్టర్ SUV టీజర్లను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారుని అధికారికంగా వెల్లడించింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బుకింగ్స్ & లాంచ్ టైమ్ హ్యుందాయ్ ఎక్స్టర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు 2023 జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆ తరువాత ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX (O), SX(O) కెనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలకానుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది రేంజర్ ఖాకీ అనే కొత్త కలర్లో లభించనుంది. ఇందులో H షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్, DRL, విశాలమైన ఫ్రంట్ ఫాసియా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూప్ రెయిల్స్ వంటివి ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మొదలైనవి ఉంటాయి. కంపెనీ ఏ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్, డిజైన్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో ఆధునిక కాలంలో వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & పర్ఫామెన్స్ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యువిలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ కార్లలో అందుబాటులో ఉంది. పర్ఫామెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడికానప్పటికీ ఇది 83hp పవర్ 114Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నాము. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ ఎస్యువిని లాంచ్ చేసే సమయంలోనే ధరలను గురించి కూడా అధికారికంగా వెల్లడించనుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
కొనసాగిన ఆటో అమ్మకాల జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటి వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్(5% క్షీణత) మినహా టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎంఎస్ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి. ► విద్యుత్ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ ఏప్రిల్లో 62,581 యూనిట్లకు తగ్గాయి. -
ఎలక్ట్రిక్ వెర్షన్లో రానున్న హ్యుందాయ్ క్రెటా.. లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు దూసుకెళ్తున్న సమయంలో హ్యుందాయ్ కంపెనీ దేశీయ విఫణిలో మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేయనున్న ఈ లేటెస్ట్ మోడల్ టెస్టింగ్ కూడా మొదలైపోయింది. ఇంతకీ హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు ఏది? ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు అరంగేట్రం చేయనుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కోనా (Kona) ఎలక్ట్రిక్ కారుతో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ తన క్రెటా SUV ని కూడా ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఎలాంటి క్యామోఫేజ్ లేకుండానే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత MG ZS EVకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు చూడటానికి సాధారణ క్రెటా మాదిరిగా కనిపించినప్పటికీ తప్పకుండా కొన్ని మార్పులు పొందనుంది. ఇందులో ఎటువంటి మార్పులు జరిగాయనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కోనా ఎలక్ట్రిక్ ఆధారంగా ఇది తయారయ్యే అవకాశం ఉందని, ఇది 400 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) హ్యుందాయ్ కంపెనీ అమ్మకాల్లో క్రెటా పాత్ర చాలా ప్రధానమైనది, కావున ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదలైతే మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!
ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ కంపెనీ మరో కారుని దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త కారు టీజర్ కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ విడుదల చేయనున్న కొత్త కారు పేరు 'ఎక్స్టర్' (Exter). ఇది మైక్రో SUV విభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రకారం ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు 2023 జులై నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన ఫ్రంట్-ఎండ్ డిజైన్ కలిగి ఉండటం వల్ల కంపెనీకి చెందిన ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. H-ఆకారంలో ఉండే ఎల్ఈడీ DRLలతో స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్ చూడచక్కగా ఉంటుంది. (ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!) ఫ్రంట్ బంపర్, బంపర్ వెడల్పు అంతటా విస్తరించి ఉండే బ్లాక్ గ్రిల్ నిటారుగా, అడ్డంగా ఉండటం మీరు ఇందులో గమనించవచ్చు. రెండర్లో ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు విదేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్యాస్పర్ని గుర్తుకు తెస్తుంది. డిజైన్ పరంగా ఇది ఐయోనిక్ 5కి అదగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాదు, కానీ ఇది గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఇంటీరియర్ పొందే అవకాశం ఉంది. అయితే ఇది బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, రీట్యూన్డ్ సస్పెన్షన్ వంటివి పొందనుంది. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ ఇందులో ఆరా, ఐ20, వెన్యూలోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్బాక్స్ ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ 2023 ఆగస్ట్లో 'ఎక్స్టర్'ని లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ధర నియోస్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ కారు ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
హ్యుందాయ్ ఐయోనిక్ 5 బుక్ చేసుకున్నారా.. ఇది మీకోసమే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' భారతీయ మార్కెట్లో 2023 ఆటో ఎక్స్పో వేదికపై తన లేటెస్ట్ 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలను ఎట్టకేలకు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలైన హ్యుందాయ్ ఐయోనిక్ 5 డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి కంపెనీ మొదట బుక్ చేసుకున్న 500 మందికి మాత్రమే ప్రారంభ ధరతో విక్రయిస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే రూ. 1 లక్షతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలెట్టేసింది. కావున ఇప్పుడు మొదటి బ్యాచ్ డెలివరీలను ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్ పెర్ల్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు భారత్లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?) 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' గత 2022 లోనే వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ & వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. కావున అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రేక్డ్ రియర్ విండ్షీల్డ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్లు (ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & ఇన్స్ట్రుమెంట్) ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించారు. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఆధునిక డైజిన్, ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్లు, లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? బడ్జెట్ ధరలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యూందాయ్ భారతీయ మార్కెట్లో చిన్న ఎస్యూవీని త్వరలో పరిచయం చేయబోతోంది. బడ్జెట్లో (ప్రారంభ ధర రూ.6లక్షలు) ఏఐ3 కోడ్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారునే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టాటా పంచ్, సిట్రోవెన్ సి3, మారుతీ సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. 1.2 లీటర్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో రంగ ప్రవేశం చేయవచ్చని సమాచారం. దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో ఎస్యూవీల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్లో హ్యుండై వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్ ఎస్యూవీలను విక్రయిస్తోంది. -
వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్ ఇదే...
హ్యుందాయ్ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కార్ ఐయోనిక్ (Ioniq 6) న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ను సొంతం చేసుకుంది. దీంతో పాటు వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అలాగే వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా అందుకుని సత్తా చాటింది. హ్యుందాయ్ మోటార్ కంపెనీకి ఇది ఒక విజయవంతమైన క్షణం. ఎందుకంటే ఐయోనిక్6 కంటే ముందు వచ్చిన ఐయోనిక్ 5 కార్కు గతేడాది మూడు అవార్డులూ వచ్చాయి. మరో ఆనందకరమైన విషయం ఏంటంటే హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ సెంటర్ అధినేత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సాంగ్యుప్ లీ ఇటీవల 2023 వరల్డ్ కార్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. న్యూయార్క్ అంతర్జాతీయ ఆటో షోలో ఐయోనిక్6 తోపాటు మరికొన్ని ఇతర అసాధారణమైన వాహనాలు కూడా కొన్ని అవార్డులు అందుకున్నాయి. లూసిడ్ ఎయిర్ 2023 వరల్డ్ లగ్జరీ కార్ అవార్డును, కియా EV6 GT వరల్డ్ పెర్ఫార్మెన్స్ కార్ అవార్డును గెలుచుకున్నాయి. సిట్రోయెన్ C3 వరల్డ్ అర్బన్ కార్ అవార్డు విజేతగా నిలిచింది. భారతదేశంలో ఐయోనిక్6ను హ్యుందాయ్ ఇంకా పరిచయం చేయలేదు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఈ కార్ను ప్రదర్శించింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల విజేతలను 32 దేశాల నుంచి 100 మంది ఆటోమోటివ్ జర్నలిస్టుల ప్యానెల్ ఎంపిక చేసింది. ఓవరాల్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హత పొందాలంటే వాటి ఉత్పత్తి పరిమాణం సంవత్సరానికి కనీసం 10,000 యూనిట్లు ఉండాలి. వాటి ధర ప్రాథమిక మార్కెట్లలో లగ్జరీ కార్ స్థాయి కంటే తక్కువ ఉండాలి. అలాగే కనీసం రెండు దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉండాలి. -
వాహన అమ్మకాలు రికార్డ్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్ 19 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమవ్యాప్తంగా... చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్ 30.62 లక్షలు. రిటైల్గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు. మార్చిలో చూస్తే... మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. -
దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..
2023 ఆటో ఎక్స్పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
ఎట్టకేలకు భారత్లో విడుదలైన 2023 హ్యుందాయ్ వెర్నా: పూర్తి వివరాలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ 'హ్యుందాయ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన '2023 వెర్నా' (2023 Verna) లాంచ్ చేసింది. ఈ కొత్త సెడాన్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు ధరలు & బుకింగ్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్లలో విడుదలైంది. అవి EX, S, SX, SX(O). ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ కూడా 8,000 దాటినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. డిజైన్ & కలర్ ఆప్సన్స్: కొత్త హ్యుందాయ్ వెర్నా మొత్తం ఏడు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. అవి టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే, 2023 హ్యుందాయ్ వెర్నా సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇందులో విస్తృతంగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్లాంప్, వెడల్పు అంతటా వ్యాపించి ఉండే డిఆర్ఎల్, కలిగి డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్పై క్రోమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. వెనుక వైపు పారామెట్రిక్ కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 2023 వెర్నా పరిమాణం పరంగా కూడా దాని ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 1,765, వెడల్పు 1765 మిమీ, వీల్బేస్ 2670 మిమీ ఉంటుంది. కావున ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) ఇంటీరియర్ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా డ్యాష్బోర్డ్, డోర్ ట్రిమ్లపై డ్యూయల్ టోన్ బేజ్-బ్లాక్ కలర్ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది 64 కలర్ యాంబియంట్ లైటింగ్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్లో క్లైమేట్ కంట్రోల్ నాబ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి లేటెస్ట్ ఫీచర్లతో పాటు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. లేటెస్ట్ వెర్నా ఆడియో అండ్ నావిగేషన్ కోసం 10.25 ఇంచెస్ కలర్ TFT MID ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాలెట్ మోడ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది హిందీ, ఇంగ్లీష్ మిక్స్లో వాయిస్ కమాండ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) ఇంజిన్ & మైలేజ్: భారతీయ విఫణిలో అడుగుపెట్టిన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.5l MPi పెట్రోల్ ఇంజన్ 115 హెచ్పి పవర్, 143.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ & ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ IVTతో లభిస్తుంది. ఇది 18.6 కిమీ/లీ (MT), 19.6 కిమీ/లీ (IVT) అందిస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 160హెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన 7 స్పీడ్ DCTతో జతచేయబడి ఉంటుంది. ఇది 20 కిమీ/లీ(MT), 20.6 కిమీ/లీ (DCT) మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) సేఫ్టీ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా ఆరు ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, నాలుగు డిస్క్ బ్రేక్లు వంటి భద్రతా ఫీచర్లతో పాటు ఆధునిక ADAS సిస్టం కూడా పొందుతుంది. కావున ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీప్ వార్నింగ్, అసిస్ట్ బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యర్థులు: ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా దేశీయ మార్కెట్లో హోండా సిటీ, ఫోక్స్వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ సెడాన్ మీద 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ అందిస్తుంది. -
భారత్లో విడుదలకానున్న కొత్త కార్లు, ఇవే!
భారతదేశంలో ప్రతి రోజూ ఏదో ఒక వెహికల్ ఏదో ఒక మూలన విడుదలవుతూనే ఉంది. కాగా త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్ర చేయడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ వెర్నా, ఇన్నోవా క్రిస్టా డీజిల్ మొదలైనవి ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెర్నా: హ్యుందాయ్ కంపెనీ గత కొన్ని రోజులుగా తన కొత్త వెర్నా సెడాన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా సమాచారం వెల్లడైంది. అయితే ఇది మార్చి 21న గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్: దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఇన్నోవా క్రిస్టా త్వరలోనే డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో విడుదలకానున్నట్లు సమాచారం. ఇది 2.4 లీటర్ డీజిల్ పవర్ట్రెయిన్తో మాత్రమే అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా ఇది అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు కూడా నివేదికల ద్వారా తెలుస్తోంది. లెక్సస్ ఆర్ఎక్స్: 2023 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించిన చాలా కార్లలో 'లెక్సస్ ఆర్ఎక్స్' ఒకటి. ఇది మొదటి చూపుతోనే ఎంతోమంది వాహనప్రేమికుల మనసు దోచింది. ఈ SUV దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది. ఇది RX 350h లగ్జరీ, RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ట్రిమ్లలో లభిస్తుంది. అదే సమయంలో 2.5 లీటర్, 2.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి: సిఎన్జి వాహనాలను పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇప్పటికే చాలా కార్లను ఈ విభాగంలో విడుదల చేసింది. కాగా ఇప్పుడు బ్రెజ్జాను కూడా సిఎన్జి రూపంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది 1.5 లీటర్ కె15సి డ్యూయెల్ జెట్ ఇంజిన్ పొందుతుంది. ఈ కారు కూడా త్వరలో విడుదలయ్యే కొత్త కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇక మన జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది 2023 ఆటో ఎక్స్పోలో మొదటిసారిగా కనిపించింది. ఈ SUV 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్తో విడుదల కానుంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి మరెన్నో రోజులు లేదని తెలుస్తుంది. -
సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది
హ్యుందాయ్ సెకండ్ జనరేషన్ కోనా ఎలక్ట్రిక్ కారు మళ్ళీ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇప్పటికే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ వెల్లడించింది. కాగా ఇప్పుడు పవర్ట్రెయిన్ స్పెసిఫికేషన్లను గురించి చెప్పుకొచ్చింది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండు పవర్ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 48.4kWh బ్యాటరీ, ఇది 153 హెచ్పి 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 65.4kWh బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 215 హెచ్పి మరియు 255 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భారతదేశంలో 39.2kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రేంజ్ విషయానికి వస్తే లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్తో 490 కిమీ పరిధిని అందిస్తుందని సమాచారం. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంటుంది. అయితే ఖచ్చితమైన రేంజ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు పరిధి వాస్తవ ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది. (ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు.. దుమ్మురేపిన ఫిబ్రవరి సేల్స్) హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్లిమ్ ర్యాప్రౌండ్ ఫ్రంట్ లైట్ బార్, క్లామ్షెల్ బానెట్, ముందు & వెనుక వైపు ఫంక్షనల్ ఎయిర్ ఇన్టేక్స్, గ్రిల్స్, స్కిడ్ప్లేట్ వంటి వాటిని పొందుతుంది. పరిమాణం పరంగా కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఆధునికంగా ఉంటాయి. -
Women's Day 2023: మహిళల కోసం హ్యుందాయ్ స్పెషల్ ఆఫర్స్, ఇవే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ మహిళా కస్టమర్లకోసం ప్రత్యేకమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. మార్చి 06 నుంచి 09 వరకు హ్యుందాయ్ డీలర్షిప్ లేదా సర్వీస్ సెంటర్లో ఈ ఆఫర్స్ పొందవచ్చు. హ్యుందాయ్ కంపెనీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫ్రీ వాషింగ్ కూపన్, పిక్-అండ్-డ్రాప్ వంటి సర్వీసులు ఉన్నాయని, అంతే కాకుండా కారుని మెరుగైన పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై కూడా ప్రత్యేక సెషన్లు కూడా నిర్వహించనున్నట్లు, మహిళల కోసం బ్రాండ్లపై myHyundai యాప్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ కేవలం మార్చి 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు.. దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్) ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల 2023 హ్యుందాయ్ వెర్నా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు డీలర్షిప్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఈ నెల 21న మార్కెట్లో విడుదలవుతుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నాకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే ధరల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
భారత్లో ఆల్కజార్ కొత్త వేరియంట్ లాంచ్: త్వరలో డెలివరీలు
హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పుడు ఆల్కజార్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ లాంచ్ చేసింది. ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఆల్కజార్ కొత్త ఇంజిన్ ఆప్షన్తో విడుదలవ్వడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 16.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 20.25 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హ్యుందాయ్ కంపెనీ కొన్ని వారాలకు ముందు ఈ ఆల్కజార్ 1.5-లీ టర్బో కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఈ ఇంజిన్ 159 హెచ్పి పవర్ 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 1.5 టర్బో మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి ఇంటిగ్రేటెడ్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ పొందుతాయి. కంపెనీ ప్రకారం, DCT గేర్బాక్స్ 18 కిమీ/లీ, మాన్యువల్ గేర్బాక్స్ 17.5 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. (ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా) కొత్త ఆల్కాజర్ ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది, ఇప్పుడు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్బ్యాగ్లు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభిస్తాయి. ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా హెక్టర్ ప్లస్, ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్జి మోటార్: సేల్స్లో టాటా స్థానం ఎంతంటే?
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఇటీవల గత నెల కార్ల విక్రయాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం వాహన అమ్మకాలు మునుపటికంటే కొంత పురోగతిని కనపరిచినట్లు తెలుస్తోంది. టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో ఎంజి మోటార్స్ చోటు సంపాదించింది. 2023 ఫిబ్రవరిలో 2,82,799 యూనిట్ల వాహనాలను విక్రయించి మునుపటి ఏడాది ఫిబ్రవరి (2,58,736 యూనిట్లు) నెలకంటే 13.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో 1,18,892 యూనిట్ల కార్లను విక్రయించిన మారుతి మొదటి స్థానంలో నిలిచి, అమ్మకాల పరంగా 2022 ఫిబ్రవరి కంటే 8.47 శాతం వృద్ధిని పొందింది. రెండవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఫిబ్రవరి 2022 కంటే 1.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు గత నెలలో 39,106 యూనిట్లు. టాటా మోటార్స్ 38,965 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్తో 450 కి.మీ రేంజ్!) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరి కంటే 11,092 యూనిట్లను ఎక్కువ విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 29,356 యూనిట్లు. కియా మోటార్స్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి, మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే 43.54 శాతం పెరుగుదలను పొందింది. ఇక తరువాత స్థానాల్లో టయోట, స్కోడా, హోండా, రెనాల్ట్, ఎంజి మోటార్స్, నిస్సాన్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కార్ల అమ్మకాలు 2022 ఫిబ్రవరి కంటే కూడా ఉత్తమంగా ఉన్నట్లు ఫాడా నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వారాగాలు ఆశిస్తున్నాయి. -
2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి. మన దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి. 2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్ సీ క్లాస్, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
హ్యుందాయ్ అల్కజార్ ఇప్పుడు కొత్త ఇంజిన్తో.. బుకింగ్స్ స్టార్ట్
ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'హ్యుందాయ్ అల్కజార్' ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఈ SUV కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. కంపెనీ అందించే హ్యుందాయ్ అల్కజార్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ 158 బీహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్సన్స్ పొందుతుంది. మ్యాన్యువల్ వెర్షన్ 17.5 కిమీ/లీటర్ మైలజీని అందించగా, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్ 18 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ఈ నెల ప్రారంభంలో 2023 అల్కజార్ SUV విడుదల చేసింది. ఇది మునుపటికంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఐడిల్ స్టార్ట్ అండ్ గో ఫంక్షన్తో కూడా వస్తుంది. కావున ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో కొంత ఇంధనాన్ని అదా చేయడానికి ఉపయోగపడుతుంది. అప్డేటెడ్ అల్కజార్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. -
2023 హ్యుందాయ్ వెర్నా ఇలాగే ఉంటుంది - ఫోటోలు
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో 2023 వెర్నా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ సెడాన్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ వెర్నా దాని మునుపటి మోడల్స్ కంటే చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్ ముందు భాగంలో స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి, పారామెట్రిక్ గ్రిల్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. బోనెట్ మీద బ్రాండ్ లోగో చూడవచ్చు. స్ప్లిట్ హెడ్లైట్ సెటప్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్ గ్రిల్ పక్కన అమర్చబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ చూడవచ్చు. దాని పైన హ్యుందాయ్ బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ వంటివి ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ ఇందులో బెస్ట్ ఫీచర్స్, ఏడిఏఎస్ టెక్నాలజీ వంటివి వుండే అవకాశం ఉంది. 2023 హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. ఇందులో మొదటి 1.5 లీటర్ ఇంజిన్, ఇది 115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్, పర్ఫామెన్స్ వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. -
హ్యుందాయ్ లేటెస్ట్ కారు, రేపే లాంచ్: డిజైన్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!
దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సర్వం సిద్ధం చేసింది. రేపు మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్స్ ప్రారభించింది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉంది. (ఇది కూడా చదవండి: మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్కు జీతం ఎంతంటే?) హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొత్త డిజైన్ పొందుతుంది. ఇందులో స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్గా ఉండే బోనెట్, డోర్స్ మీద క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్బాక్స్తో వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ లేదు. కావున ఇది EX, S, SX, SX (O) ట్రిమ్లలో విక్రయించబడుతుంది. ధరలు మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సెడాన్ ధరలు అధికారికంగా రేపు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్తో పాటు ADAS టెక్నాలజీ ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో పొందవచ్చు. కొత్త హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ యొక్క సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉండటం వల్ల కొత్తగా దర్శన మిస్తుంది. ఇది చూడటానికి లేటెస్ట్ హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరిగా ఉంటుంది. ఇది మార్కెట్లో విడుదలైన తరువాత స్కోడా స్లావియా, ఫోక్స్వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
టిక్టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్తో కారు ఇంజిన్ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్తో వస్తున్నాయి. -
మళ్లీ షాకిచ్చిందిగా హ్యుందాయ్: ఐ20 ఎన్-లైన్ ధరల పెంపు, ఆ వేరియంట్లు ఔట్
సాక్షి, ముంబై: దక్షిణ ఆఫ్రికా కారు దిగ్గజం హ్యుందాయ్ తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కార్ల ధరలును మరోసారి పెంచేసింది. ఈ మేరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఐ20 లైనప్ కార్ల ధరలు పెరగడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఫెస్టివల్ సీజన్ ముందు సెప్టెంబర్లో ధరలను పెంచింది. ఐ 20 లైనప్లో వేరియంట్లను బట్టి రూ.21,500 వరకు ధర పెరగనుంది. ఐ20 హ్యాచ్బ్యాక్ మోడల్ లైనప్ నుండి1.0L టర్బో-పెట్రోల్ iMT వేరియంట్లను (స్పోర్ట్జ్ టర్బో ఆస్టా టర్బో) తొలగించింది. ఇపుడిక టర్బో-పెట్రోల్ ఇంజన్ స్పోర్ట్జ్ , ఆస్టా ట్రిమ్లలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్బాక్స్తో మాత్రం ఐ20 అందుబాటులో ఉంటుంది. వేరియంట్ లైనప్ను అప్డేట్ చేయడంతో పాటు, కార్మేకర్ హ్యుందాయ్ ఐ20 ధరలను రూ. 21,500 వరకు పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత, హ్యాచ్బ్యాక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 7.18 లక్షల నుండి రూ. 10.91 లక్షల వరకు ఉంటుంది. మోడల్ లైనప్లో మూడు 1.0L టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి . Sportz DCT, Asta DCT , Asta DCT డ్యూయల్-టోన్ - ధర రూ. 10.11 లక్షలు, రూ. 11.68 లక్షలు, రూ. 11.83 లక్షలు. నాలుగు 1.5L డీజిల్ వేరియంట్లు లలో మాగ్నా (రూ. 8.42 లక్షలు), స్పోర్ట్జ్ (రూ. 9.28 లక్షలు), ఆస్టా (ఓ) (రూ. 10.83 లక్షలు) , ఆస్టా (ఓ) డ్యూయల్-టోన్ (రూ. 10.98 లక్షలు). పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. -
హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్; స్పెషల్ ఎట్రాక్షన్గా షారూఖ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభంమైన ఆటో ఎక్స్పో 2023 (జనవరి 11నుంచి 18 వరకు) వాహన ప్రియులను, బిజినెస్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 45 దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలు కొత్త మోడళ్లు, విద్యుత్తు కార్లు, కాన్సెప్ట్ కార్లు, త్రి, ద్విచక్ర వాహనాలు, కమర్షియల్ వెహికల్స్ ఎగ్జిబిట్ కానున్నాయి. ఈ క్రమంలో ఆటో ఎక్స్పో మొదటి రోజున, ప్రముఖ వాహన తయారీదారు హ్యుందాయ్ మోటార్స్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ స్యూవీని లాంచ్ చేసింది. దీంతోపాటు స్లీక్ అండ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ సెడాన్ Ioniq 6నికూడా ప్రదర్శించింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఈ కారును ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ తనదైన 'సిగ్నేచర్ స్టైల్'లో Ioniq 5తో పోజులివ్వడం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. లక్ష రూపాయలతో బుకింగ్లకు సిద్ధంగా ఉన్న ఈ కారు ధరను ఆటో ఎక్స్పో 2023లో కంపెనీ తాజాగా వెల్లడించింది. ప్రారంభ ధర రూ. 44.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. తెలుపు, నలుపు , ప్రత్యేకమైన మ్యాట్ సిల్వర్ కలర్స్లో ఇది లభ్యం. ఐనాక్ 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీలో 6 ఎయిర్బ్యాగ్లు (డ్రైవర్ & ప్యాసింజర్, సైడ్ & కర్టెన్), వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ (VESS), ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్లు, మల్టీ కొలిజన్-ఎవాయిడెన్స్ బ్రేక్ (MCB) పవర్ ఫీచర్లున్నాయి. ముఖ్యంగా కేవలం 18 నిమిషాల్లో (350kw DC ఛార్జర్) 10- 80శాతం వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుందని కంపెనీ తెలిపింది. Handsome Hunk #𝐒𝐡𝐚𝐡𝐫𝐮𝐤𝐡𝐊𝐡𝐚𝐧 on stage at #Hyundai Auto Expo event in #Delhi. 😎 at #AutoExpo2023 | Launched Hyundai #Ioniq5 EV priced at Rs 44.95 lakh with his signature step!#Pathaan #HyundaiAtAutoExpo2023 #HyundaiIndia #HyundaiAE2023 #Hyundai #SRK #AutoExpo2023 https://t.co/eFi7o77MEE — SHAsHikant CHavan (@iamsmCHavan) January 11, 2023 -
న్యూఇయర్కి ముందే.. ఈ కార్ల కొనుగోలుపై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలు మెరుగుపడి కార్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ నాలుగేళ్లుగా పేరుకున్న డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. దీనికి సంవత్సరాంతం కూడా తోడు కావడంతో కొన్ని విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. చాలా మటుకు సంస్థలు డిసెంబర్లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకటించిన 2 – 2.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డీలర్లు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 దాకా విలువ చేసే ప్రయోజనాలు అందిస్తామంటూ కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ఎంట్రీ–లెవెల్ కార్ల సెగ్మెంట్లోనూ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు సంబంధించి పెట్రోల్ సెగ్మెంట్లోనూ ఇలాంటి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్సే్చంజ్ బోనస్ ప్రయోజనాలు, బీమా కంపెనీలు ఓన్ డ్యామేజీ ప్రీమియంను తగ్గించడం, డీలర్లు నిర్వహించే స్కీములు మొదలైన వాటి రూపాల్లో ఇవి ఉంటున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా 2018–19 స్థాయిలోనే రూ. 17,000 – రూ. 18,000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎన్జీకి, సాంప్రదాయ ఇంధనాల రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గిపోతుండటంతో సీఎన్జీ మోడల్స్ వైపు కొనుగోలుదారులు దృష్టి పెట్టడం తగ్గుతోంది. దీంతో సీఎన్జీ మోడల్స్ను విక్రయించేందుకు కంపెనీలు అత్యధికంగా రూ. 60,000 వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ విక్రయాలు పటిష్టంగా ఉన్నాయని, నవంబర్తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా విక్రయాలు ఉండొచ్చని భావిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న నిల్వలతో ఒత్తిడి.. డీలర్ల దగ్గర నిల్వలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరినట్లు ఎస్అండ్పీ మొబిలిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 45–50 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నాయి. దీంతో డిస్కౌంట్లు ఇచ్చి అయినా వాహనాలను అమ్మేసేందుకు డీలర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటం కూడా సమస్యాత్మకంగా మారుతోంది. అటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. టాటా మోటార్ ఈ–నెక్సాన్కి ఇటీవలి వరకూ కొద్ది నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ ప్రస్తుతం డీలర్షిప్లో బుక్ చేసుకుని అప్పటికప్పుడే కారుతో బైటికి వచ్చే పరిస్థితి ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్పై ఆచి తూచి.. ప్రస్తుతం దాదాపు 4,17,000 వాహనాల ఆర్డర్లతో కార్ల కంపెనీల ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దీంతో కొంత ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. అయితే, భవిష్యత్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మార్కెట్ సెంటిమెంట్ మొదలైన వాటిని బట్టి డిమాండ్ పరిస్థితి ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. 2018–19కి భిన్నంగా ప్రస్తుతం సంవత్సరాంతపు డిస్కౌంట్లు కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమితంగా ఉంటున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
కొత్త వెర్షన్లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన 'ఐ10' మోడల్ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్లిఫ్ట్ వెర్షన్లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ను గుర్తుకు తెస్తుంది. కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ అప్డేట్ చేయబడిన డ్యాష్బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్
సాక్షి,ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా హ్యుందాయ్ తొలి ఈవెహికల్ కోనా ఎలక్ట్రిక్తో పాటు హ్యుందాయ్ ఐ20, ఆరా, ఐ10 నియోస్, లాంటి కొన్ని కార్ల కొనుగోలుపై లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.1.2L NA పెట్రోల్, 1.2L Bi సీఎన్జీ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్తో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాల్యూ ఫర్ మనీ హ్యాచ్బ్యాక్లలో ఒకటి. (హైదరాబాద్లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) హ్యుందాయ్ ఆరా హోండా అమేజ్, టాటా టిగోర్ లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఆరాపై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (యాపిల్ గుడ్న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్స్ కొనుగోళ్లపై రూ. 13 వేల వరకు నగదు రాయితీ, ఇతరప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంకా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 తగ్గింపు కూడా. హ్యుందాయ్ i20 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ , 1.2L NA పెట్రోల్ ఇంజన్తో లభ్యం. హ్యుందాయ్ కోనా EV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తొలి ఈవీ కోనా ఇప్పుడు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇందులో ఎలాంటి ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో లేవు. -
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త కార్ను భారత మార్కెట్లో నేడు (సెప్టెంబరు 6, 2022) లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ తర్వాత, స్పోర్టీ అవతార్లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఈ స్పోర్టీ ఎస్యూవీకి సంబంధించి ఇండియాలో రూ. 21వేలతో బుకింగ్లను కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇంజీన్,ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 2వ జెన్ 7-స్పీడ్ డిసిటితో వస్తున్న ఈ ఇంజీన్ పవర్ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw (120 PS), 172 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్క్యామ్ అందిస్తోంది. 60కి పైగా హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లున్నాయి. అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో హోమ్ టు కార్ (H2C)ని కూడా కలిగి ఉంటుంది. అలాగే కస్టమర్లకు సాధారణ, ఎకో, స్పోర్ట్ మోడ్ల మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పించే డ్రైవ్ మోడ్ ఎంపికను కూడా ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 30కి పైగా భద్రతా ఫీచర్లు , 20కిపైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 4 డిస్క్ బ్రేక్లు, ISOFIX, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్ లాంటి హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్లోని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ ఎన్ ధరలు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఎన్6, ఎన్8 అనే అనే రెండు వేరియంట్లలో లభ్యం. ఎన్ 6 వేరియంట్ ధర రూ. 12.16 లక్షలు కాగా, ఎన్8 వేరియంట్ ధర రూ. 13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
హ్యుందాయ్ ఎన్–లైన్ మెటావర్స్ కమింగ్ సూన్, బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎన్–లైన్ బుకింగ్స్ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6న ఈ కొత్త మోడల్ భారత్లో రంగ ప్రవేశం చేయనుంది. అప్డేటెడ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసింది. అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి ఆన్లైన్ద్వారా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్ శ్రేణిలో ఐ20 ఎన్-లైన్ తర్వాత రెండో మోడల్. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు ఉంది. -
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
టెస్లాకు షాక్: స్లీక్ అండ్ స్టైలిష్ ఎలక్ట్రిక్ సెడాన్, రేంజ్ ఎంతో తెలిస్తే
Hyundai IONIQ 6: లగ్జరీ కార్ మేకర్ టెస్లాకు షాకిచ్చేలా హ్యుందాయ్ తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 6ని విడుదల చేసింది. ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిమీల రేంజ్ను అందజేస్తుందని వాహన తయారీ సంస్థ వెల్లడించింది. ఇదే నిజమైతే లాంగ్-రేంజ్ టెస్లా మోడల్ 3 కంటే మెరుగైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టెస్లా ఆధిపత్యం చలాయిస్తున్న ఈవీ మార్కెట్లో పాగా వేసే లక్ష్యంతో `ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్లైనర్` ఐయోనిక్-6 సెడాన్ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్పై 602 కిలోమీటర్లు దూసుకుపోతుంది. 5.1 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 12 రంగులలో అలరించనున్న హ్యుందాయ్ ఐయోనిక్ 6 కేవలం 18 నిమిషాల్లో 350-kW ఛార్జర్తో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈవీ పెర్ఫార్మెన్స్ ట్యూన్-అప్ ఎలక్ట్రిక్ యాక్టివ్ సౌండ్ డిజైన్ (e-ASD) తో అత్యంత ఏరోడైనమిక్ స్టైలింగ్ డ్యూయల్ కలర్, యాంబియంట్ లైటింగ్, స్పీడ్ సింక్ లైటింగ్, అత్యాధునిక ఫీచర్లున్న కారు ఇదేనని హ్యుందాయ్ మోటార్ ప్రెసిడెంట్ , సీఈవో జేహూన్ చాంగ్ తెలిపారు. అల్ట్రా-ఫాస్ట్, మల్టీ-ఛార్జింగ్ సామర్థ్యం, డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్ 64 కలర్స్ స్పెక్ట్రమ్ , స్పెషల్ థీమ్స్, స్పీడ్ సింక్ లైటింగ్ మోడ్, నాలుగు టైప్-సి, ఒక టైప్-ఏ యూఎస్ బీ పోర్ట్లు, సిస్టమ్ డ్రైవర్ స్టీరింగ్ ఎఫర్ట్, మోటార్ పవర్, యాక్సిలరేటర్ పెడల్ సెన్సిటివిటీ లాంటివి ఫీచర్లు ఇందులో జోడించినట్టు చెప్పారు. విశాలమైన ఇంటీరియర్, ప్రత్యేకమైన సీట్లు, స్లీక్ అండ్ స్టైలిష్ లుక్లో వినియోగదారులు మనసు దోచుకుంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ డివిజన్ హెడ్ థామస్ స్కీమెరా అన్నారు. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో విక్రయించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఇండియాలో ఎపుడు తీసుకొచ్చేది కూడా స్పష్టత లేదు. -
స్టైలిష్ లుక్తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
ఎస్యూవీ లవర్స్ కోసం: సరికొత్తగా న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ టక్సన్ 2022నికొత్త డిజైన్తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ ఆగస్ట్ 4 ఇండియాలో లభ్యం కానుంది. కొత్త డిజైన్, పలు సేఫ్టీ ఫీచర్లతో దీన్ని తీసుకురానుంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ తాజాగా ఎస్యూవీ కార్ లవర్స్ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్ బెస్ట్ ఎస్యూవీగా ఉన్న ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ టక్సన్: డిజైన్, ఫీచర్లు ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కొత్తగా రూపొందించిన 'పారామెట్రిక్-జువెల్' గ్రిల్ను ఫ్రంట్ ఫాసియా , బంపర్పై హెడ్ల్యాంప్లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్తో పాటు పదునైన కట్తో స్పోర్టినెస్ డిజైన్తో తీర్చిదిద్దింది. 6 ఎయిర్బ్యాగ్లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్, లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తుంది. వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇచ్చే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే 10.25అంగుళాల టచ్స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ ఛార్జర్లాంటి ఫీచర్లున్నాయి. హ్యుందాయ్ టక్సన్: ఇంజీన్ , ధర 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కొత్త Nu 2.0 పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కొత్త ఆర్ 2.0 డీజిల్ ఇంజన్తో లభించనుంది. అంతేకాకుండా, ఇంజిన్లు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో పని చేస్తాయి. ఎలాంటి కఠినమైన భూభాగంలో నావిగేట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్వ్యాగన్ టిగువాన్, ఇతర మోడళ్లతో పోటీపడనుంది. The all new @HyundaiIndia #TUCSON premieres in India. #HyundaiTUCSON #NextdriveNow #HyundaiSUVLife @MobilityOutlook pic.twitter.com/T0IaikZVAU — Deepangshu Dev Sarmah (@deepangshu) July 13, 2022 -
హ్యుందాయ్ కొత్త వెన్యూ.. 40కి పైగా మార్పులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ వెన్యూ కొత్త వర్షన్ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో 1.2 లీటర్ పెట్రోల్ ట్రిమ్ రూ.7.53 లక్షలు, 1.0 లీటర్ టర్బో పెట్రోల్తోపాటు డీజిల్ ట్రిమ్స్ రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. నాలుగు మీటర్లలోపు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ విభాగంలో తొలిసారిగా 11 ఫీచర్లను కొత్త వెన్యూకు జోడించారు. డిజైన్, ఇతర అంశాల్లో 40 రకాల మార్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది. 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లున్నాయి. వెనుక సీట్లకు రీక్లైనింగ్ ఫంక్షన్, ఆంబియెంట్ నేచుర్ సౌండ్, 12 భాషలు, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్ సీట్స్ వంటి హంగులు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, వెహికిల్ స్టేటస్ వంటి ఫంక్షన్స్ను ఇంటి నుంచే నియంత్రించవచ్చని హుందాయ్ వివరించింది. చదవండి: సీఎన్జీ వాహనాలకు డిమాండ్.. -
వాకింగ్ వెహికిల్.. నాలుగు కాళ్ల కారు
అదేం చోద్యం! కారుకు చక్రాలు ఉంటాయి గాని, కాళ్లేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ‘హ్యుండాయ్’ కంపెనీ తయారు చేయనున్న కారుకు నాలుగు కాళ్లు ఉంటాయి. అయితే, ఆ నాలుగు కాళ్లకూ నాలుగు చక్రాలు కూడా ఉంటాయనుకోండి. హ్యుండాయ్ కంపెనీ ఈ నాలుగు కాళ్ల కారు నమూనాను 2019 నాటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించి, సందర్శకులను ఆకట్టుకుంది. నాలుగు కాళ్లతో అడుగులు వేసుకుంటూ ఈ కారు ఎన్ని మెట్లయినా ఇట్టే ఎక్కేస్తుంది. అంతేకాదు, ఎంత ఎత్తైన గుట్టలనైనా అవలీలగా ఎగబాకగలదు. లోపల ప్రయాణించే వారికి పెద్దగా కుదుపుల్లేకుండా, గుట్టల్లోని ఎగుడు దిగుడు ప్రయాణం సుఖప్రదంగా సునాయాసంగా సాగేందుకు వీలుగా ఈ విచిత్ర వాహనాన్ని త్వరలోనే రూపొందించడానికి హ్యుండాయ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని తయారీ కోసం అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. -
హ్యుందాయ్ కొత్త వెన్యూ సొంతం చేసుకోవడానికి రెడీనా?
గురుగ్రామ్: సరికొత్త ఫీచర్స్తో కొత్తగా తీర్చిదిద్దిన వెన్యూ కార్ల అమ్మకాల కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. రూ. 21,000 కట్టి దేశవ్యాప్తంగా తమ డీలర్షిప్లలో లేదా తమ వెబ్సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. కొత్త వెన్యూలో 60కి పైగా ఫీచర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు. అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లతో హోమ్ టు కార్ (హెచ్2సీ) టెక్నాలజీతో కారులోని అనేక ఫంక్షన్లను ఆపరేట్ చేయొచ్చని గర్గ్ పేర్కొన్నారు. రిమోట్ క్లైమేట్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, వివిధ డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), 2 స్టెప్ రియర్ రిక్లైనింగ్ సీటు వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తెలుగు, హిందీ సహా 12 భాషలను సపోర్ట్ చేస్తుందని గర్గ్ పేర్కొన్నారు. చదవండి: Mercedes Benz: లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్కు భారీ షాక్! -
Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. కేటీఆర్తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా.. డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు. ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్ క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్ల అంతర్జాతీయ తయారీ యూనిట్ను హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో నెలకు 20 లక్షల కిట్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు. హైదరాబాద్లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. -
అమ్మకాల్లో ఔరా! ఈ కార్ల అమ్మకాలు అప్పుడే మూడు లక్షలు దాటాయట!
ఆటోమొబైల్ సెక్టార్లో దేశంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్ మార్కెట్లో పాగా వేస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మోడల్స్ క్రమంగా మార్కెట్లో పాతుకుపోతున్నాయి. ఇప్పటికే క్రెటా మోడల్ అమ్మకాల్లో దుమ్ము లేపుతుండగా ఇప్పుడు దాని సరసన వెన్యూ కూడా చేరింది. హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు దేశీయంగా మూడు లక్షల మార్క్ని క్రాస్ చేశాయి. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీగా 2019లో మార్కెట్లో రిలీజ్ అయ్యింది వెన్యూ. ఏడాది గడిచేప్పటికే లక్ష కార్ల మైలు రాయిని చేరుకుంది. అయితే తర్వాత ఏడాదికే కరోనా రావడంతో అమ్మకాలు మందగించాయి. కానీ కరోనా ముగిసిన తర్వాత అమ్మకాల్లో వెన్యూ దూసుకుపోతోంది. కియా వెన్యూ ఈ, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో లభిస్తోంది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కావడంతో సిటీల్లో తిరగడానికి బయట ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం ఈ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహాదం చేసింది. వచ్చే నెలలో వెన్యూ అప్డేటెడ్ వెర్షన్ మార్కెట్లోకి రాబోతుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు! -
గుట్టలెక్కగలదు.. ఈ హ్యుందాయ్ మెట్లనెక్కగలదు..
పక్కన చిత్రం చూస్తుంటే... స్టార్వార్స్లో వాకింగ్ కార్ (ఆల్ టెరైన్ ఆర్మర్డ్ ట్రాన్స్పోర్ట్) నేరుగా నడిచొస్తున్నట్టు ఉంది కదూ. ఇది అలాంటి కారే.. కానీ నిజమైనది. దీనిని తయారు చేయడానికి సిద్ధమవుతోంది ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్. స్టార్వార్స్లో సెల్యులాయిడ్పై కనిపించిన నడిచేకారును నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 2019లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆ కారు డిజైన్స్ను ప్రదర్శించిన ఆ సంస్థ... తయారీకోసం దాదాపు రూ.154 కోట్లతో మోంటానాలో అభివృద్ధి కేంద్రం (న్యూ హారిజాన్ స్టూడియో)ని ఇటీవలే ఏర్పాటు చేసింది. ఆ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇట్టే ప్రయాణించగలదు. మెట్లను సులభంగా ఎక్కగలిగే ఈ కారును ట్యాక్సీలా వాడితే.. వీల్చైర్ ఉపయోగించే వారు సులభంగా ట్రావెల్ చేయొచ్చు. భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడినుంచి గాయపడినవారిని తరలించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇది అంబులెన్స్లా పనిచేస్తుంది. రాళ్లు రప్పలు, గుట్టలు, మంచు గడ్డలు... ఉపరితలాన్ని బట్టి మోడ్ను మార్చుకుంటుంది. ఉన్నపళంగా ఏ దిశలోనైనా పోగలగడం దీని ప్రత్యేకత. అయితే... ఈ కారు ప్రజలకు అందుబాటులోకి వస్తుందా? రాదా? ధర ఎంత? అనే విషయాలేవీ ఈ సంస్థ ప్రకటించలేదు. -
హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ కారు.. మైలేజ్, మ్యాగ్జిమమ్ స్పీడ్ ఎంతంటే?
ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టూ వీలర్ సెగ్మెంట్పై పెద్దగా దృష్టి పెట్టని బడా కంపెనీలు కార్ల మార్కెట్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో టాటా దూసుకుపోతుండగా కియా నేను వస్తున్నా అంటూ ప్రకటించింది. తాజాగా ఈవీ పోటీకి రెడీ అంటోంది హ్యుందాయ్. దేశీయంగా కార్ల అమ్మకాల్లో రెండో పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయబోతుంది. ఐయోనిక్ 5 పేరుతో ఈ ఎలక్ట్రిక్ కారుని రిలీజ్ చేయబోతుంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందిన సమచారం ప్రకారం ఐయోనిక్ 5 కారు 58 కిలోవాట్ ప్యాక్, 77.4 కిలోవాట్ బ్యాటరీ సామర్యంతో రెండు వేరియంట్లలో లభించనుంది. డ్యూయల్ మోటార్ కాన్ఫిగిరేషన్తో ఈ కార్లు రానున్నాయి. సింగిల్ ఛార్జ్తో 481 కిలోమీటర్ల మైలేజ్ అందివ్వనుంది. గరిష్టంగా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5.2 సెకన్లలో వంది కిలోమీటర్ల స్పీడ్ టచ్ చేయగలదు. ఇందులో 800వీ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ అమర్చారు. దీంతో 350 కిలో వాట్స్ ఛార్జర్ సాయంతో 18 నిమిషాల వ్యవధిలో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 50 కిలోవాట్ల ఛార్జర్ సాయంతో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పొడవు, వెడల్పు, వీల్బేస్ తదితర విషయాల్లో హ్యుందాయ్ టక్సన్ కంటే ఒక ఇంచు ఎక్కువే ఉండవచ్చని సమాచారం. ఎంట్రీ నుంచి హై ఎండ్ వరకు మొత్తం ఆరు ఈవీలను ఇండియాలో పరిచయం చేయాలని హ్యుందాయ్ ప్రణాళికలో ఉంది. కాగా ఇందులో మొదటి వాహనంగా ఐయోనిక్ 5 రిలీజ్ కానుంది. దక్షిణ కొరియాలో తయారైన కార్లను ఇండియాలో అసెంబ్లింగ్ చేయనున్నట్టు సమాచారం. చదవండి: ఈలాన్మస్క్ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది! -
ఢిల్లీ విమానాశ్రయంలో హ్యుందాయ్ రోబోటిక్ ‘నమస్కారం’
హైదరాబాద్: భారత సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎదుటివారిని ఆహ్వానిస్తూ.. పలకరిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించడం సంప్రదాయంలో భాగం. దీన్ని గుర్తిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యందాయ్ ఇండియా ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 మీటర్ల ఎత్తయిన నమస్కార రోబోను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు నమస్కారంతో స్వాగతం పలుకుతుంది. ఒక మనిషి చేయి, ఒక రోబో చేయి కలిసిన ప్రతిరూపంగా ఇది కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. మానవత్వం, టెక్నాలజీ ఈ రెండూ కలసి మెరుగైన భవిష్యత్తుకు ప్రతిరూపమని తెలియజేయడమే దీని ఏర్పాటులోని ఉద్దేశమని పేర్కొంది. ‘‘భారత్లో మనుషులు, టెక్నాలజీ మధ్య అంతరం పూడ్చడమే హ్యుందాయ్ అసలైన విజన్. దీన్ని ప్రతిబింబించే రూపమే ఈ ఏర్పాటు’’అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూకిమ్ తెలిపారు. -
మారుతి జోరులో టాటా పంచ్లు !?
కరోనా తీసుకొచ్చిన సెమికండక్టర్ చిప్ల కొరత ఉక్రెయిన్ మోసుకొచ్చిన సప్లై చైయిన్ ఇబ్బందుల మధ్య ఇండియాలో కార్ల అమ్మకాలు మార్చిలో చెప్పుకోతగ్గ రీతిలోనే జరిగాయి. ఎప్పటి లాగే టాప్ సెల్లింగ్ లిస్ట్లో అధిక భాగం మారుతి సుజూకివే ఉన్నాయి. మరోవైపు భారత్ మార్కెట్లో మారుతికి సమీప ప్రత్యర్థిగా ఎదిగేందుకు టాటా దూసుకొస్తోంది. Maruti Wagon R - 2022 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి వ్యాగన్ ఆర్ నిలిచింది. గతేడాది వచ్చిన ఫేస్లిఫ్ట్ వెర్షన్ మార్కె్ట్లో దూసుకుపోతోంది. గతేడాది టాప్ సెల్లర్గా నిలిచిన వ్యాగన్ ఆర్ ఈ మార్చిలోనూ హవా కొనసాగించింది. 2022 మార్చిలో 24,636 మారుతి వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.5.18 లక్షలుగా ఉంది. Swift Dezire - మారుతిలో అత్యంత సక్సెస్ఫుల్ మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ డిజైర్ మార్చిలో తన ప్రతాపం చూపించింది. మారుతి స్విఫ్ట్ని క్రాస్ చేసి ఏకంగా 18,623 కార్లు సేల్ అయ్యాయి. స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలుగా ఉంది. Suzuki Baleno - సూజుకి పోర్ట్ఫోలియోలో మార్కెట్లో ఎక్కువ ప్రభావం చూపించిన కారుగా బాలేనోకి గుర్తింపు ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా 14,520 కార్లు అమ్ముడయ్యాయి. సగటున 22 కి.మీ మైలేజ్ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకత. ప్రారంభ ధర రూ. 9.49 లక్షలుగా ఉంది. Tata Nexon - ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో టాటాకి సిరుల పంట పండించిన మోడల్గా నెక్సాన్ నిలిచింది. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో మార్కెట్ లీడర్లుగా ఒక వెలుగు వెలిగిన బ్రెజా విటారా, క్రెటాలను నెక్సాన్ వెనక్కి నెట్టింది. ఇదే ఊపులో మార్చిలో 14,315 కార్ల అమ్మకాలు సాగాయి. ఈ కారు ధరలు రూ.7.42 లక్షల నుంచి మొదలు. Maruti Swift - ఇండియాలో ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లిన కనిపించే కారుగా మారుతి స్విఫ్ట్ గురించి చెప్పుకోవచ్చు. పదేళ్లుగా ఈ మోడల్ రారాజుగా వెలుగుతోంది. కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ వాటా స్విఫ్ట్దే అన్నట్టుగా పరిస్థితి ఉంది. 2022 మార్చిలో 13,623 కార్ల అమ్మకాలు జరిగాయి. ప్రారంభ ధర రూ.5.90 లక్షలు Maruti Brezza Vitara - ఇండియాలో ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్ సత్తా ఎంటో ప్రపంచానికి చాటిన మోడల్ మారుతి విటారా బ్రెజా. సగటున 17.5 కి.మీ మైలేజీ ఇవ్వడం ఈ ఎస్యూవీ ప్రత్యేకత. మార్చిలో 12,.439 కార్లు రోడ్లపైకి వచ్చాయి. Hyundai CRETA - వివిధ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నా ఇప్పటికీ హ్యుందాయ్కి మార్కెట్లో మేజర్ షేర్ ఉండటానికి కారణం క్రెటా మోడల్. మిడ్ సైజ్ ఎస్యూవీల్లో క్రెటా రారాజుగా వెలుగుతోంది. మార్చిలో 19,532 కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 10.23 లక్షలు TATA PUNCH - ఊహించనదానికి కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారు. ఈ కారు విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకోగా.. తర్వాత కూడా అదే జోరు చూపించింది. చిప్సెట్ల సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ దేశ్యాప్తంగా ఏకంగా 10,526 పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.5.67 లక్షలు. చదవండి: హాట్ కేకుల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు.. మరీ ఈ రేంజ్లోనా! -
చేతులు కలిపాయ్..దుమ్ము దులిపేస్తున్నాయ్! దేశీయ రోడ్లపై ఎస్యూవీ చక్కెర్లు!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్యూవీ వెహికల్స్కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్యూవీ మార్కెట్ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్యూవీ వెహికల్స్ టెస్ట్లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వెహికల్ ఒక్కటే.. కోడ్లు మాత్రం రెండు మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్యూవీ వెహికల్స్ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్యూవీ కోడ్ వైఎఫ్జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్లను విడగొట్టి.. అదే ప్లేస్లో బంపర్, ఎల్ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి. అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్ల్యాంప్తో ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. రెండు ఎస్యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు. మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్లో ఉండనున్నాయి. చదవండి: ఉద్యోగులకు బిగ్షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
కార్ల కొనుగోలు దారులకు శుభవార్త!!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కొనుగోలు దారులకు బంపరాఫర్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఇండియా ఫిబ్రవరి నెల వరకు ఐ20, గ్రాండ్ఐ10 నియోస్, ఆరా,శాంత్రోపై డిస్కౌంట్తో పాటు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20 హ్యాచ్బ్యాక్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లను రూ.40,000 విలువైన తగ్గింపుతో అందిస్తుంది. ఐ20 అనేక రకాలైన ఇంజన్, గేర్బాక్స్ కాంబినేషన్లో అందించబడుతోంది. దీని ధరలు రూ. 6.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్). ఈ నెలలో శాంత్రో కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కేవలం పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. సీఎన్జీ వెర్షన్లకు ఎలాంటి ఆఫర్లను లేవని హ్యుందాయ్ తెలిపింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా వెహికల్స్పై రూ.50వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. వీటిలో సంబంధిత మోడళ్ల సీఎన్జీ వెర్షన్లు మినహా పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఆఫర్లు ఉన్నట్లు ఆ కంపెనీ నిర్వాహకులు తెలిపారు. -
ముదురుతున్న హ్యుందాయ్ "కాశ్మీర్" ట్వీట్ వివాదం..!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్కు చెందిన పాకిస్థాన్ విభాగం "కాశ్మీర్" వ్యవహారంపై సోషల్మీడియాలో చేసిన ఓ పోస్ట్తో ఆ సంస్థ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. హ్యుందాయ్ "కాశ్మీర్" ట్వీట్ వివాదం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ పాకిస్తాన్ విభాగం కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ యూ-యోంగ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ఫోన్లో మాట్లాడుతూ.."విచారం వ్యక్తం చేశారు". హ్యుందాయ్ పాకిస్తాన్ సోషల్ మీడియా ఫిబ్రవరి 5న "కాశ్మీరీ సోదరుల త్యాగాలను" గుర్తుచేసుకుంటున్నట్లు ఒక పోస్టు పెట్టింది. దీంతో వివాదం మొదలైంది. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి హెచ్.ఇ.చుంగ్ యూ-యోంగ్ ఈ ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ఫోన్లో మాట్లాడారు. వారు అనేక అంశాలపై చర్చించగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి కూడా సోషల్ మీడియా పోస్ట్ వల్ల భారత ప్రజలకు, ప్రభుత్వానికి కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని తెలియజేసినట్లు" ఎంఈఏ తన వివరణాత్మక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలోని భారత రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరినట్లు ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. Received a call from ROK FM Chung Eui-yong today. Discussed bilateral and multilateral issues as also the Hyundai matter. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 8, 2022 ఇంతలో, న్యూఢిల్లీలోని దక్షిణ కొరియా రాయబారిని కూడా ఎంఈఏ ఈ విషయం గురుంచి పిలిపించి అడిగినది. "కాశ్మీర్ సాలిడారిటీ డేకు మద్దతు తెలుపుతూ హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన సోషల్ మీడియా పోస్టును మేము చూశాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ గురుంచి ఆదివారం, 6 ఫిబ్రవరి 2022న, సియోల్'లోని మా రాయబారి హ్యుందాయ్ హెడ్ క్వార్టర్స్ సంప్రదించి వివరణ కొరాము. ఆ వెంటనే సోషల్మీడియా నుంచి పోస్ట్ను వారు డిలీట్ చేశారు. సోషల్మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని అరీందమ్ బాగ్బీ ఓ ప్రకటనలో వెల్లడించారు. (చదవండి: గూగుల్ సెట్టింగ్స్లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!) -
హ్యుందాయ్ ‘సారీ’.. మరో మలుపు తిరిగిన వివాదం
హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో #BoycottHyundai బాయ్కాట్ హుందాయ్ ట్విటర్లో ట్రెండ్ అయ్యింది. వాహనదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు. కశ్మీర్ కోసం పాక్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ కడిగిపడేశారు హ్యుందాయ్ని. ఈ నేపథ్యంలో కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్.. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా.. హ్యాందాయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యూందాయ్(హెచ్ఎంఐఎల్) భారత విభాగం చెప్పుకొచ్చింది. కానీ.. Hi Hyundai. So many wishy-washy words not needed. All you need to say is - we are unequivocally sorry. Rest is all unnecessary https://t.co/wjqNh7YsXv — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 6, 2022 Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd — Hyundai India (@HyundaiIndia) February 6, 2022 రాజకీయ విమర్శలు అయినా వివాదం చల్లారడం లేదు. పైగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. పలువురు రాజకీయ నేతలు.. హ్యుందాయ్పై విరుచుకుపడుతున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. హ్యూందాయ్ ఇండియా ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన సందేశంలో అనవసరమైన పదాలు అక్కర్లేదని, స్పష్టంగా సారీ చెప్తే సరిపోయేదని, మిగతాదంతా అనవరసరమని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌథాయివాలే సైతం హ్యుందాయ్పై విరుచుకుపడ్డారు. కేవలం సారీ సరిపోదని, వివరణ ఇవ్వాల్సిందేనని, ఇలా భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలపై హ్యుందాయ్ గ్లోబల్ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు. .@HyundaiIndia , this is not sufficient. You must explain if you endorse statements of @PakistanHyundai ? What's your global stand on such anti-India rhetoric? @Hyundai_Global https://t.co/jA0QQjU3Az — Dr Vijay Chauthaiwale (@vijai63) February 6, 2022 ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారుతీ సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రముఖ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV అయిన క్రెటాతో సహా కంపెనీ 12 మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో, హ్యుందాయ్ 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశంలో సుమారు ₹ 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించుకుంది. చదవండి: హ్యుందాయ్ కంపెనీపై ఫైర్! ఏ రేంజ్లో అంటే.. -
మారుతికి షాకిచ్చిన మహీంద్రా, టాటాలు
Auto Sales In January 2022: దేశీయ ఆటో తయారీ కంపెనీల జనవరి వాహన విక్రయ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ 2022 ఏడాది తొలి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే జనవరిలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ అమ్మకాల్లో రెండెంకల క్షీణత నమోదైంది. మూడోదశ లాక్డౌన్ ప్రభావంతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతో వాహన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. - మారుతీ సుజుకి ఇండియా జనవరిలో మొత్తం అమ్మకాలు 3.96 శాతం పడిపోయి 1,54,379 యూనిట్లకు చేరింది. గతేడాది 2021 జనవరిలో కంపెనీ 1,60,752 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. - ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో ఈ సంస్థ 59,866 కార్లను అమ్మగా.. ఈ 2022 జనవరిలో 76,210 యూనిట్లను అమ్మింది. - ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. గతేడాది జనవరిలో 4.25 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ ఏడాది తొలి నెలలో 3.63 లక్షల యూనిట్లకు పరిమితమైంది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఎస్యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్లో ప్రీమియం వెర్షన్ను, మరో ఎలక్ట్రిక్ ఎస్యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టిసారించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ డెవలప్మెంట్ సెంటర్ మూసివేత..! హ్యుందాయ్ కొత్త అంతర్గత దహన ఇంజిన్లను అభివృద్ధి చేయడం ఆపివేస్తోందని కొరియన్ ఎకనామిక్ డైలీ పేర్కొంది. దీంతో డెవలప్మెంట్ సెంటర్లోని ఇంజిన్ డెవలప్మెంట్ విభాగం మూసివేసినట్లు తెలుస్తోంది. పవర్ట్రెయిన్ విభాగంను ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ డెవలప్మెంట్ టీమ్గా మార్చినట్లు కొరియన్ ఎకనామిక్ డైలీ వెల్లడించింది. వీటితో పాటుగా బ్యాటరీ డెవలప్మెంట్ సెంటర్ను కూడా హ్యుందాయ్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త కేంద్రంలో బ్యాటరీ డిజైన్ బృందం, బ్యాటరీ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ అనే రెండు బృందాలు పనిచేయనున్నాయి. 2030 నాటికి 30 శాతం వరకు.. 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచే ఆదాయాలను రాబట్టేందుకు హ్యుందాయ్ ప్రణాళికలను రచిస్తోంది. 2030 నాటికి మొత్తం అమ్మకాలలో 30 శాతం జీరో-ఎమిషన్ వాహనాల నుంచి పొందాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వాహనాలు కనుమరుగు..! హ్యుందాయ్ అనేక రకాలైన కంబ్యూషన్ ఇంజిన్ వాహనాలను తయారుచేస్తోంది. వాటిలో ముఖ్యంగా 1.1-లీటర్ల నుంచి 2.0-లీటర్ల సామర్ధ్యం కల్గిన ఇంజిన్స్ ఉన్నాయి. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు, సీఎన్జీ, డిజీల్ ఇంజిన్ వాహనాలు ఉన్నాయి. కంపెనీ నిర్ణయం మేరకు ఈ వాహనాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోనుంది. కొత్తగా ఆరు మోడల్స్తో..! భారత ఆటోమొబైల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై కసరత్తు ప్రారంభించినట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. 2028 నాటికి భారత్లో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి 4,000 కోట్లను కంపెనీ ఖర్చు చేయనుంది. ఇప్పటికే IONIQ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్లో తారసపడ్డాయి. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా!
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా! అని పాడుకుంటూ హడావుడి చేస్తోంది ఒక రోబో! ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి ఉపరితలాలపైనైనా కిందపడకుండా తీసుకుపోయేందుకు ఉపయోగపడే మోబ్ఎడ్(మొబైల్ ఎసెంట్రిక్ డ్రాయిడ్) రోబోను హ్యుండాయ్ అభివృద్ధి చేసింది. పార్సిళ్లు, పానీయాల ట్రేలనే కాకుండా చిన్న పిల్లలను సైతం ఎలాంటి కుదుపులు లేకుండా మోసుకుపోవడం దీని ప్రత్యేకత. కంపెనీ విడుదల చేసిన వీడియోలో ఈ రోబో ఒక బేబీని మోస్తూ కనిపించింది. అలాగే గ్లాసులతో పేర్చిన పిరమిడ్ ఆకృతి చెదరకుండా ఒక ఎత్తయిన ప్రాంతాన్ని దాటింది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. వచ్చే జనవరిలో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)2022లో దీన్ని ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్థిరమైన, యుక్తి అవసరమైన పనులు చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశామని పేర్కొంది. నాలుగు చక్రాలున్న ఈ రోబోకి ఫ్లాట్ బాడీని అమర్చారు. మెరుగైన సస్పెన్షన్ వల్ల ఎలాంటి కుదుపులు లేకుండా బరువులు మోయడం సాధ్యమవుతుంది. ప్రయాణ మార్గానికి అనుగుణంగా తనపై ఉన్న బరువు కిందపడకుండా తగినట్లు అడ్జెస్ట్ చేసుకుంటూ సాగిపోవడం దీని ప్రత్యేకత. ఇందులో మూడు చక్రాలకు మూడు మోటార్లున్నాయి. మరికొన్ని విశేషాలు.. ► పొడవు: 26 అంగుళాలు ► వెడల్పు: 23 అంగుళాలు ► ఎత్తు 13: అంగుళాలు ► బరువు: 50 కిలోలు ► వీల్ బేస్: హైస్పీడ్ డ్రైవింగ్లో 25 అంగుళాల వరకు విస్తరిస్తుంది, లోస్పీడ్ డ్రైవింగ్లో 17 అంగుళాలకు తగ్గుతుంది. ► వేగం: గంటకు 30 కిలోమీటర్లు ► బ్యాటరీ సామర్థ్యం: 2 కిలోవాట్లు ► బ్యాటరీ రన్నింగ్ సమయం: 4 గంటలు ► ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ వీల్ డ్రైవింగ్, హైటెక్ స్టీరింగ్, బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. -
ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్ ఎండ్సేల్ను ప్రకటించాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి. ఇయర్ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..! రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా పొందవచ్చును. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్ను కూడా పొందవచ్చును. మహీంద్రా అల్టురాస్ G4 మహీంద్రా అల్టురాస్ G4 ఎస్యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్ టర్బో వేరియంట్పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్జ్ పెట్రోల్ DT వేరియంట్పై ఏలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. సీఎన్జీ మోడల్స్పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్పై గరిష్టంగా రూ. 45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్ బోనస్ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ రైడ్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత్లో ఎలక్ట్రిక్ రైడ్కు సిద్ధమైంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లను రంగంలోకి దింపనుంది. వీటిలో ఒకటి వచ్చే ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగుతీయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా, అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ–జీఎంపీ ప్లాట్ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేయనుంది. 77.4 కిలోవాట్ అవర్ వరకు సామర్థ్యం గల బ్యాటరీ పొందుపరిచే వీలుంది. 2, 4 వీల్ డ్రైవ్తోపాటు గంటకు 260 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ వాహనాల అభివృద్ధి, పరిశోధన కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్.ఎస్.కిమ్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చెన్నై ప్లాంటులో చేపడతామని, బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. భారత్లో కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్ను విక్రయిస్తోంది. -
Whistel Blower : లోపాలు ఎత్తి చూపాడు.. రూ.178 కోట్లు అందుకున్నాడు
హ్యుందాయ్ కార్లలో ఉన్న సాంకేతిక లోపాలు, రోడ్ సెఫ్టీ విషయంలో కంపెనీ చెబుతున్న మాటల్లో డొల్లతనాన్ని ఆధారాలతో సహా నిరూపించిన ఓ విజిల్ బ్లోయర్ భారీ బహుమతిని అందుకున్నాడు. వినియోగదారుల భద్రత విజయంలో రాజీ పడొద్దంటూ ఆ ఉద్యోగి ఎంతగా చెప్పినా కంపెనీ యాజమాన్యం వినకపోవడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గ్వాంగ్ హో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీలో 26 ఏళ్లుగా ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈ ఘటన జరగడానికి ముందు హ్యుందాయ్లో క్వాలిటీ స్ట్రాటజీ టీమ్లో ఆయన పని చేశారు. అయితే హ్యుందాయ్తో పాటు దాని సబ్సిడరీగా ఉన్న కియా సంస్థ ఉత్పత్తి చేస్తున కార్లలో భద్రపరమైన లోపాలు ఉన్నట్టు కంపెనీ అంతర్గత సమావేశాల్లో అనేక సార్లు కిమ్ గొంతెత్తాడు. అయితే అతని సూచనలను హ్యుందాయ్ మేనేజ్మెంట్ బుట్టదాఖలు చేసింది. దీంతో వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చిన కిమ్ గ్వాంగ్ హో అసలు నిజాలు బయటకు చెప్పారు. హ్యుందాయ్, కియా నుంచి వస్తోన్న కార్లలో నెలకొన్న భద్రతాపరమైన లోపాలను అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ)కి కిమ్ ఉప్పందించాడు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్హెచ్టీఎస్ఏ పరిశీలించగా లోపాలు నిజమేనని తేలింది. దీంతో హ్యుందాయ్, కియా సంస్థలకు జరిమానాగా వరుసగా 140 మిలియన్లు, 70 మిలియన్ డాలర్లు విధించింది. ఐదేళ్ల కాలపరిమితిలో ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. భద్రతాపరమైన లోపాలు తెలియజేసినందుకు ప్రోత్సాహాకంగా కిమ్గ్యాంగ్ హోకి రూ.24 మిలియన్ డాలర్లు (రూ.178 కోట్లు)ను బహుమతిగా ప్రకటించింది ఎన్హెచ్టీఎస్ఏ. వినియోగదారుల భద్రత కోసం నా భవిష్యత్తును ఫణంగా పెట్టినందుకు సరైన న్యాయమే జరిగిందంటూ కిమ్ గ్యాంగ్ హో స్పందించారు. కార్ల భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు త్వరలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో మరింత మంది విజిల్ బ్లోయర్లు ముందుకు వస్తారని, మరిన్ని చీకటి నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని కిమ్ అన్నారు. -
దేశంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
Electric Cars Breaks Sales Records in India: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో(ఏప్రిల్ 2021 - సెప్టెంబర్ 2021) మొత్తం 6,261 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఈవీ కార్ల అమ్మకాల్లో ఇది ఒక కొత్త రికార్డు. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్ 2020 - సెప్టెంబర్ 2020) 1,872 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 234 శాతం అమ్మకాలు పెరిగాయి. నెంబర్ వన్ టాటా నెక్సన్ ఈవీ ఈ అమ్మకాల్లో ఎక్కువగా టాటా నెక్సన్ ఈవీ కార్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 3,618 యూనిట్లు విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 214 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో అమ్మకాల పరంగా ఏంజీ జెడ్ఎస్ ఈవీ రెండో స్థానాన్ని పొందింది. హెచ్1 ఎఫ్ వై21-22లో 1,789 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 250 శాతం అధికం. 801 యూనిట్ల అమ్మకాలతో టాటా టిగోర్ ఈవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు 701 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ కోనా అమ్మకాల పరంగా నాల్గవ స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 51 యూనిట్లు విక్రయించింది. కానీ, గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ఆ తర్వాత స్థానంలో మహీంద్రా వెరిటో ఉంది. ఈ ఆరు నెలల కాలంలో మహీంద్రా 2 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 75 శాతం అమ్మకాల క్షీణతను నమోదు చేసింది. సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లో మరిన్ని ఈవీలు విడుదల కానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఈకెయువీ100ని లాంచ్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టాటా మోటార్స్ కూడా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. ఈ వరుసలో ఆల్ట్రోజ్ ఈవీ, పంచ్ ఈవీ ఉన్నాయి. ఏంజీ మోటార్ ఇండియా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. హ్యుందాయ్, కియా కూడా కొన్ని ఈవీలను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. (చదవండి: జియో ఫోన్ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?) -
కారు పార్కింగ్ కష్టాలకు చెక్.. హ్యుందాయ్ సరికొత్త ఆవిష్కరణ
కారు కొన్న ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య పార్కింగ్. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ హ్యుందాయ్ పరిష్కారం కనుగొంది. పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ఈ-కార్నర్ మాడ్యూల్ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ అనే ఒక వ్యవస్థను అభివృద్ది చేసింది. ఈ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ ద్వారా ఇక నుంచి రెండు వాహనాల మధ్య సులభంగా పార్క్ చేయవచ్చు. హ్యుందాయ్ మోబిస్ ఈ-కార్నర్ మాడ్యూల్ కారులో ఎలక్ట్రిక్ మోటార్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్, స్టీరింగ్ అన్నీ ఒకే బ్లాక్ లో ఉంటాయి. ప్రతి చక్రం వద్ద ఉండే స్టీరింగ్, బ్రేకింగ్, సస్పెన్షన్, స్టీరింగ్ వ్యవస్థ గల ఎలక్ట్రిక్ కార్నర్ మాడ్యూల్ నమూనాను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కార్నర్ మాడ్యూల్ మొదట లాస్ వెగాస్ లోని సీఈఎస్ 2018లో ఒక కాన్సెప్ట్ సిస్టమ్ గా ఆవిష్కరించారు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. గత మూడు ఏళ్లుగా కార్నర్ మాడ్యూల్ యూనిట్ సాంకేతికపరిజ్ఞానాన్ని నియంత్రించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్(ఈసీయు)ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వాహనాలు సుమారు 30 డిగ్రీల వరకు మాత్రమే తిరుగుతాయి. అందుకే సాధారణంగా డ్రైవర్లు ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేయలేరు. కొన్ని సార్లు కారును బయటకి తీయడం కష్టం అవుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాంకేతికపరిజ్ఞానాన్ని హ్యుందాయ్ అభివృద్ది చేస్తుంది. ఈ టెక్నాలజీని 2023 నాటికి అందరికీ తేవాలని కంపెనీ యోచిస్తుంది. (చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే?) -
ఇంధన ధరలతో సతమతమవుతున్నారా..! అయితే ..!
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సెంచరీ దాటేసి... తగ్గేదేలే అంటూ.. పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో కొంత మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సంప్రాదాయి శిలాజ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. మనలో చాలా మంది మైలేజీ ఎక్కువ ఇచ్చే వాహనాలపైనే మొగ్గుచూపుతాం. అంతేందుకు ఎవరైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే మొదట మనం వారిని అడిగే ప్రశ్న...మైలేజ్ ఎంత ఇస్తుందని..? ఇంధన ధరల మోత తగ్గనప్పటికీ...మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడంతో కాస్తనైనా ఉపశమనం కలిగే వీలు ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) స్టాండర్స్ ప్రకారం.. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి. మార్కెట్లలోని టాప్-10 మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...! 1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ డీజిల్ వేరియంట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో ఉత్తమ మైలేజీని అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో డీజిల్ ఇంజిన్తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. ARAI రికార్డుల ప్రకారం... డీజిల్ వేరియంట్ 25 kmpl వరకు మైలేజీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్21 kmpl మైలేజీను అందిస్తోంది. 2. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23 kmpl కంటే కొంచెం ఎక్కువ, ఆటోమేటిక్ వెర్షన్ 23.76 kmpl రేంజ్ను ఇస్తోంది. 3. హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో, హ్యుందాయ్ i20 అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారులో అద్భుతమైన ఫీచర్సే కాకుండా గొప్ప మైలేజ్ ఈ కారు సొంతం. ARAI ప్రకారం...హ్యుందాయ్ i20 డీజిల్ వేరియంట్ 25.2 kmpl, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.35 kmpl రేంజ్ను ఇస్తోంది. 4. మారుతి బాలెనో ఇటీవలి కాలంలో హ్యుందాయ్ ఐ 20 మైలేజీకు సమానంగా మారుతి బాలెనో అందిస్తోంది. ARAI ప్రకారం... బాలెనో పెట్రోల్ ఇంజన్తో 23. 87 kmpl రేంజ్ వస్తోంది. 5. హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఆరా నిలుస్తోంది. ARAI డేటా ప్రకారం...ఆరా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తుంది.సీఎన్జీ వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 6.మారుతి డిజైర్ మారుతి డిజైర్ కూడా సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.26 kmpl మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్ 24.12 kmpl మైలేజీను అందిస్తోంది. 7. కియా సొనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్ కియా సోనెట్. ARAI సర్టిఫికేట్ ప్రకారం... సోనేట్ డీజిల్ వేరియంట్ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్ 18 kmpl ను అందిస్తోంది. 8. హ్యుందాయ్ వెన్యూ హ్యూందాయ్ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది. 9. హ్యుందాయ్ క్రెటా మిడ్ రేంజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు సాటి లేదు. క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 21 kmpl అందిస్తోంది. 10. హ్యూందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా డిజీల్ వేరియంట్ 25 కెఎమ్పీఎల్, పెట్రోల్ వేరియంట్ 18.4 కెఎమ్పీఎల్ను అందిస్తోంది. -
హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే!
ఎలక్ట్రిక్ మార్కెట్లో రోజు రోజుకి కంపెనీల మధ్య పోటీ వేడెక్కిపోతుంది. రాబోతున్నది ఎలక్ట్రిక్ ప్రపంచం అని తెలుసుకొని భారీగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. జపనీస్ ఆటోమేకర్ ఇటీవల చైనా ఆటో మార్కెట్లో నిలబడటం కోసం రాబోయే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ మోడల్స్ ను ఇతర మార్కెట్లోకి ఎప్పడూ తీసుకువస్తారు అనేది పేర్కొనలేదు. చైనీస్ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను కొత్త ఈ-ఎన్ సిరీస్ పేరుతో కార్లను తీసుకొని రావాలని ఆలోచిస్తుంది. ఈ-ఎన్ సిరీస్ లో మొదటి రెండు మోడల్స్ ఈ-ఎన్ఎస్1, ఈ-ఎన్ పి1 పేరుతో పిలుస్తారు. ఈ కార్లను 2022 వసంతకాలంలో చైనా ఆటో మార్కెట్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. డాంగ్ ఫెంగ్ హోండా, జీఎసీ హోండా మధ్య జాయింట్ వెంచర్లో కార్ల తయారీదారు హెచ్ ఆర్-వి శ్రేణి కింద కార్ల తయారీ ప్రారంభించారు. అయితే, భారతదేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. హోండా ప్రత్యర్థి టాటా మోటార్స్ ఈవీ కార్లతో భారతదేశంలో తుఫాను సృష్టించేందుకు 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని యోచిస్తోంది. (చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..!) -
ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు గత 10 ఏళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే!. వీటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన చరిత్ర గురుంచి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర మొదటి సారిగా 1830లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వాహనంలో గ్యాసోలిన్-శక్తితో పనిచేసే మోటారు కాకుండా ప్రొపల్షన్ కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కారుతో పాటు, బైక్లు, మోటారు సైకిళ్ళు, పడవలు, విమానాలు, రైళ్లు అన్నీ విద్యుత్తుతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నాయి కూడా... ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభం 1828లో హంగేరియన్ అన్యోస్ జెడ్లిక్ అతను ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే చిన్న తరహా మోడల్ కారును కనుగొన్నాడు. సుమారు 1832లో రాబర్ట్ ఆండర్సన్ మొదటి క్రూడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తాడు. 1835లో మరొక చిన్న-తరహా ఎలక్ట్రిక్ కారును హాలండ్లోని గ్రోనింగెన్కు చెందిన ప్రొఫెసర్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బెకర్ కలిసి రూపొందించారు. 1835లో వెర్మోంట్లోని బ్రాండన్ కు చెందిన కమ్మరి థామస్ డావెన్పోర్ట్ ఒక చిన్న తరహా ఎలక్ట్రిక్ కారును నిర్మించాడు.(చదవండి: Starlink: శాటిలైట్ ఇంటర్నెట్పై అసహనం) 1842లో థామస్ డేవెన్పోర్ట్, స్కాట్స్ మాన్ రాబర్ట్ డేవిడ్సన్ ఇద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశారు. కానీ, దీనిని చార్జ్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేది. ఫ్రెంచ్ వ్యక్తి గాస్టన్ ప్లాంటే 1865లో ఒక మంచి బ్యాటరీని కనుగొన్నాడు. దానిలో సమస్యలు రావడంతో అతని తోటి దేశస్థులు కామిల్లె ఫౌర్ 1881లో ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ ఉంచుకునే బ్యాటరీని మరింత మెరుగుపరిచారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ముఖ్యంగా బ్యాటరీ అవసరం. 1899లో బెల్జియంలో నిర్మించిన ఎలక్ట్రిక్ రేసింగ్ కారు 68 మైలు వేగంతో వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని కామిల్లె జెనాట్జీ రూపొందించారు. 1900-1920 ఎలక్ట్రిక్ కార్లను ఉదయం ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. తర్వాత ఫోర్డ్ ఒక చౌకగ్యాస్ కారుని తయారు చేసింది. ఫోర్డ్ మోటార్ కంపెనీ మోడల్ టి పేరుతో పరిచయం చేసింది. అప్పట్లో ఇది చాలా ఉపయోగపడినప్పటికి అనుకున్నంత రాణించలేక పోయింది.జనరల్ మోటార్స్ కాడిలాక్ టూరింగ్ ఎడిషన్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత దశాబ్దాలలో గ్యాసోలిన్, డీజిల్ కార్ల జోరు పెరడంతో ఎలక్ట్రిక్ కార్లు కొద్ది కాలం పాటు కనుమరుగు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల పరిమిత డ్రైవింగ్ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం, భారీ బ్యాటరీల వల్ల నిలదొక్కుకోలేక పోయింది.(చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు) 1961-1970 ప్రధాన ఆటోమేకర్లు ఎలక్ట్రిక్ కార్ల తయారిని అపలేదు. బ్యాటరీలతో రన్ చేయడానికి జనరల్ మోటార్స్ ప్రయోగాలు చేసింది. అమెరికన్ మోటార్స్ కార్పొరేషన్ అమిట్రాన్ అనే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కేవలం కొన్ని సంవత్సరాలలో అమిత్రాన్ ను అమ్మకానికి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ అలా, జరగలేదు.(చదవండి: మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!) 1971 -1980 ఆ తర్వాత ఫ్లోరిడాలోని సెబ్రింగ్-వాన్ గార్డ్ కంపెనీ సిటీకార్ పరిచయం చేసింది. ఇది కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. చివరికి 4,400 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. సిటీకార్ టాప్ స్పీడ్ గంటకు 38 మైళ్లు. కానీ, ఆ తర్వాత ఈవీ కూడా కనుమరుగు అయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీ గుండె అయిన కోబాల్ట్-ఆక్సైడ్ క్యాథోడ్ ను జాన్ గుడ్ ఎనౌన్, అతని సహచరులు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో కనుగొన్నారు. రాబోయే దశాబ్దాల్లో, ఈ ఆవిష్కరణ ద్వారా సాధ్యమైన బ్యాటరీల వస్తాయి అని పేర్కొన్నారు. 2019లో గుడ్ ఎనౌన్, మరో ఇద్దరు పరిశోధకులకు లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2000-2010 2003లో స్థాపించబడిన టెస్లా మోటార్స్ కంపెనీ మొదటి కారు టెస్లా రోడ్ స్టర్ రహదారి మీదకు రావడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. దీని ధర $80,000 కంటే ఎక్కువ. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 200 మైళ్ల కంటే ఎక్కువ వెళ్ళగలదు. దీనిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇక ఆ తర్వాత నుంచి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్, హ్యూందాయి, టెస్లా, ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొనివస్తున్నాయి. -
కార్ల అమ్మకాలు గప్'చిప్'
సాక్షి, అమరావతి: పండగ వేళ కొత్త కారు కొందామనుకుంటున్నారా.. ఆ కారును మీరు నడపాలంటే కనీసం 6 నుంచి 20 నెలల పాటు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు కొత్త కారు బుక్ చేస్తే కనీసం ఆరు నెలలు దాటితే కానీ డెలివరీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చైనాలో తలెత్తిన సెమీ కండక్టర్ చిప్ల కొరత ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో దసరా–దీపావళి సీజన్ అమ్మకాలపై భారీగా అంచనాలు పెట్టుకున్న రాష్ట్ర ఆటోమొబైల్ డీలర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఆటోమొబైల్ అమ్మకాల్లో దసరా–దీపావళి సీజన్ అత్యంత కీలకమైనది. ఏడాది మొత్తం మీద జరిగే అమ్మకాల్లో 40 శాతం ఈ సీజన్లో జరుగుతాయి. 50 శాతం అమ్మకాలూ కష్టమే.. గతేడాది జరిగిన కార్ల విక్రయాల్లో కనీసం 50 శాతం కూడా చేరుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి పండుగ సీజన్లో కుశలవ హ్యూందాయ్ నాలుగు జిల్లాల్లో 570 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది 400 మార్కును అందుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ బి.వెంకటరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. చిప్ల కొరత కారణంగా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేయడంతో సరఫరా నిలిపోయిందని, దీంతో ఈ సీజన్కు 200 కార్లను మించి సరఫరా చేయలేమని హ్యూందాయ్ సంస్థ చెబుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హ్యూందాయ్లో మంచి డిమాండ్ ఉన్న క్రెటా వంటి మోడల్స్కు వెయిటింగ్ పీరియడ్ 9–10 నెలలకు పెరిగిపోయిందన్నారు. అలాగే క్రెటా డీజిల్ వెర్షన్తో పాటు కొన్ని మోడల్స్పై బుకింగ్ను నిలిపివేసినట్టు తెలిపారు. గతేడాది వరుణ్ మారుతి దసరా సీజన్లో 578 కార్లను విక్రయించగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 కార్లను కూడా విక్రయించలేకపోయామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. మారుతి డిజైర్, బ్రెజా, స్విఫ్ట్ వంటి మోడల్స్ సరఫరా ఆగిపోవడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 50 శాతం క్షీణిస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది జనవరి వరకు సెమీ కండక్టర్ చిప్ల కొరత సమస్య ఉంటుందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.15.54 లక్షల కోట్ల నష్టం సెమీ కండక్టర్స్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూ.15.54 లక్షల కోట్లు (210 బిలియన్ డాలర్లు) నష్టపోతుందని అంతర్జాతీయ సంస్థ అలెక్స్ పార్టనర్ అంచనా వేసింది. చిప్ల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల యూనిట్ల ఉత్పత్తి నష్టపోనున్నట్టు తెలిపింది. మన దేశంలో కూడా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని 40 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడంతో ఆ మేరకు అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దసరా–దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల యూనిట్ల కార్లను అమ్ముతుండగా.. అది ఈ ఏడాది 3.5 లక్షల మార్కును దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశ ఆటోమొబైల్ రంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని, కార్లకు భారీగా డిమాండ్ ఉంటే ఉత్పత్తి లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఉన్న ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్న్యూస్..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఇటీవలి కాలంలో మద్దతు ప్రజల బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే వాహన తయారీ కంపెనీలు కూడా విద్యుత్ వాహనాలకు(ఈవీలు) సంబందించి తమదైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే, వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో వారానికి ఒక వాహనం బయటికి విడుదల అవుతుంది. తాజాగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి రాబోయే మూడు ఏళ్లలో భారతదేశంలో హ్యుందాయ్, కియా రెండూ ఒక్కొక్కటి మూడు ఈవీలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి హ్యుందాయ్ అయోనిక్ 5, కియా ఈవి6 కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ 18 నిమిషాలలోపు 80 శాతం ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అయోనిక్ 5లో కొన్ని వేరియెంట్లలో బ్యాటరీ చార్జ్ కోసం కారు పైకప్పుపై సోలార్ ప్యానెల్ తో కూడా రావచ్చు. ఒక నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ కోనా ఈవిలో మరో మోడల్ ను ఈ సంవత్సరం చివర్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు, కియా ఈ-నీరో రెండు కార్లు 39.2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 136 హెచ్పీ మోటార్ లేదా 64కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 204 హెచ్పీ మోటార్ తో వస్తాయని సమాచారం. ఈ-నీరో వరుసగా 289 కిలోమీటర్లు, 455 కిలోమీటర్ల పరిధితో వస్తే, కోనా 305 కిలోమీటర్లు, 484 కి.మీ పరిధితో వచ్చే అవకాశం ఉంది.(చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్లో దుమ్మురేపిన ఇండియన్స్..!) -
హ్యుందాయ్ నుంచి మరో సరికొత్త కారు.. అదిరే డిజైన్ తో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఐ20 ఎన్ లైన్ వర్షన్ను విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.11.76 లక్షలు. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 88.3 కిలోవాట్ అవర్ పవర్తో ఎన్6, ఎన్8 వేరి యంట్లలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 188 డీలర్షిప్స్ వద్ద కొత్త వర్షన్ లభిస్తుంది. వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డైనమిక్ గైడ్లైన్స్తో రేర్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, న్యూ వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్ ఫీచర్లు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్షోరూంలో ఐ20 రెగ్యులర్ మోడల్ ధర రూ.6.91 లక్షల నుంచి రూ.11.4 లక్షల వరకు ఉంది. -
హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!!
కొరియర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్లైయింగ్ కార్ టెక్నాలజీపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది. హైడ్రోజన్తో నడిచే కారును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈవీలకు ధీటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) కార్ల ట్రెండ్ నడుస్తోంది. ఇండియా మొదలు అమెరికా వరకు మారుతి నుంచి జనరల్ మెటార్స్ వరకు అన్ని కంపెనీలు ఈవీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇక టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ కార్లయితే కొత్త ట్రెండ్నే క్రియేట్ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈవీ కార్లకే పరిమితం అవుతామంటూ ఆడి ప్రకటించింది. ఇలా ఆటో మొబైల్ ఇండస్ట్రీ అంతా ఈవీ కార్ల గురించి, దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి బిజీగా ఉంటే హ్యుందాయ్ వీటికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటోంది. ఈవీ కార్లకు తోడు హైడ్రోజన్ కార్ల తయారీపై ఫోకస్ పెట్టింది. హైడ్రోజన్ వేవ్ సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించుకునే వాటిలో బ్యాటరీల తర్వాత స్థానం హైడ్రోజన్ సెల్స్దే. అయితే బ్యాటరీ ఆధారిత ఈవీలతో పోల్చితే హైడ్రోజన్ సెల్స్ ఆధారిత ఇంజన్ల పనితీరు సంక్లిష్టమైంది. ఆ టెక్నాలజీ ఇంకా కమర్షియల్గా విరివిగా వినియోగంలోకి రాలేదు. కానీ హ్యందాయ్ ఓ అడుగు ముందుకు వేసి హ్రైడోజన్ వేవ్ పేరుతో కాన్సెప్టు కారుని సిద్ధం చేసింది. సెప్టెంబరు 7న హైడ్రోజన్ సెల్ బేస్డ్ కాన్సెప్టు కారుకు సంబంధించిన విశేషాలు సెప్టెంబరు 7న జరిగే వర్చువల్ సమావేశంలో హ్యందాయ్ సంస్థ వెల్లడించనుంది. ఆ తర్వాత కొరియాలోని గొయాంగ్లో ఈ కారుకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించనుంది. ఈ మేరకు హ్యుందాయ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. హైడ్రోజన్ కారుకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే సెప్టెంబరు 7 వరకు వేచి చూడాలి. చదవండి : ఏసీ ఎకానమీ కోచ్.. ధర తక్కువ సౌకర్యాలు ఎక్కువ -
స్పోర్టీ లుక్తో హ్యుందాయ్ ఐ20 కారు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా స్పోర్టీ లుక్తో ఐ20 ఎన్-లైన్ కారును ప్రవేశపెట్టింది. ఎన్-లైన్ శ్రేణిలో యువ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన తొలి మోడల్ ఇది. ప్రస్తుతం ఈ శ్రేణి మోడళ్లను యూరప్, దక్షిణ కొరియా, యూఎస్, రష్యా వంటి దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. స్పోర్టీ లుక్ కోసం కారు వెలుపలా, లోపలా పలు మార్పులు చేశారు. (చదవండి: మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు) 1 లీటర్ పెట్రోల్ టర్బో జీడీఐ ఇంజిన్ పొందుపరిచారు. 6 స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో ప్రవేశపెట్టింది. 120 పీఎస్ పవర్, నాలుగు డిస్క్ బ్రేక్స్, 50కిపైగా కనెక్టివిటీ ఫీచర్స్, సన్రూఫ్, ఆరు ఎయిర్బ్యాగ్స్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలో అందుకుంటుంది. సన్రూఫ్ కోరుకునే కస్టమర్ల సంఖ్య 2018లో 13 శాతముంటే ప్రస్తుతం 30 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్వ్యాగన్ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
వినియోగదారులకు 'హ్యుందాయ్' శుభవార్త, తక్కువ ధరకే..
హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ‘‘షీల్డ్ ఆఫ్ టస్ట్ర్ సూపర్’’ పేరుతో మెయింటెనెన్స్ సర్వీసులను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కొత్త కారుకు ఐదేళ్లు గడువు లేదా 50వేల కిలోమీటర్ల దూరం సేవలను అందిస్తామని తెలిపింది. బ్రేక్లు, క్లచ్, వైపర్, బెల్ట్తో సహా మొత్తం 14 ప్రధాన భాగాల రిపేర్లు ఈ సర్వీసు పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్కు చెందిన 10 మోడళ్లలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వాహన నిర్వహణ వ్యయ నియంత్రణ లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. -
Huyndai N Line: హ్యుందాయ్ నుంచి ఎన్ లైన్... కీలక అప్డేట్స్ ఇవే
ఆటోమోబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా దూకుడు పెంచింది. యూత్తో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త లైన్లో వెహికల్స్ని లాంఛ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ని హ్యుందాయ్ వెల్లడించింది. ఎన్ సిరీస్ డైనమిజం, స్పోర్టీనెస్ థీమ్తో రెండేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ లైన్ సిరీస్ను హ్యుందాయ్ ప్రవేశపెట్టింది, తాజాగా ఇప్పుడు ఇండియాకు ఎన్ లైన్ సిరీస్లో వెహికల్స్ తెస్తామంటూ ప్రకటించింది. ఐ20 ఎన్ ప్రస్తుతం హ్యుందాయ్లో పాపులర్ మోడల్గా ఉన ఐ20లో సెగ్మెంట్లో తొలి ఎన్ లైన్ను తేనన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న ఐ 20 కారుకి డిజైన్, ఇంజన్లో స్పోర్టీనెస్, డైనమిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి మార్కెట్లోకి తేనున్నారు. ఈ ఏడాదిలోనే ఇట్స్ టైమ్ టూ ప్లే అంటూ ఎన్ లైన్ సిరీస్కి సంబంధించిన ప్రోమోను హ్యుందాయ్ విడుదల చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దసరా, దీపావళి పండగల సమయానికి ఎన్సిరీస్ కారు ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉండవచ్చని అంచనా మార్కెట్ను ఆకట్టుకునేలా ఇండియన్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్కి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ మార్కెట్ లీడర్ కాలేకపోయింది. అయితే ఎన్ లైన్ సిరీస్తో మార్కెట్లో తన పట్టు పెంచుకునే ఉద్దేశంలో హ్యుందాయ్ ఉంది. దీంతో డైనమిజం, స్టోర్టీనెస్ వంటి ఫీచర్లు జోడించినా మార్కెట్ను ఆకట్టుకునే విధంగా రూ. 11 నుంచి 13 లక్షల మధ్య ధర ఉండవచ్చని అంచనా. The globally popular #HyundaiNLine, is now coming to India. N Line range comes with motorsports inspired styling elements to compliment your aspirations. N Line is a statement of dynamism and sportiness. #ItsTimeToPlay!#NLineInIndia #ComingSoon — Hyundai India (@HyundaiIndia) August 9, 2021 -
టాప్గేర్లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
భారత మార్కెట్లలోకి హ్యూందాయ్ ఎలక్ట్రిక్ వాహనం..! లాంచ్ ఎప్పుడంటే..!
ప్రపంచ వ్యాప్తంగా పలు మల్టీనేషనల్ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి నడుం బిగించాయి. పలు కంపెనీలు భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పలు కంపెనీల చర్యలు ఊపందుకున్నాయి. కంపెనీల విధానాలు, మౌలిక సదుపాయాల కల్పించడంలో, ప్రభుత్వాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలవైపు సానుకూల పవనాలు వీస్తుండడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తికి వేగం పుంజుకోనుంది. తాజాగా భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు హ్యుందాయ్ అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి కంపెనీ యోచిస్తోంది. 2024 నాటికి అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "క్లీనర్ మొబిలిటీ వైపు కంపెనీ అడుగులు ప్రారంభమైనాయి. హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఇప్పటికే కోనా ఈ.వీ. వాహనాన్ని ప్రకటించాము. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్ మార్కెట్కు సరిపోయే ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువస్తామ’’ని పేర్కొన్నారు. కోనా ఈవీ 2021 ఆగస్టు 10 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హ్యూందాయ్ భారత మార్కెట్లలో రిలీజ్ చేయనున్న కొత్త ఈవీ కాంపాక్ట్ ఎస్యూవీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ కార్ రేంజ్ను , బ్యాటరీ సామర్థ్యాన్ని ఇంకా ఖరారు చేయలేదు. హ్యూందాయ్ తీసుకువస్తోన్న కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ ఏఎక్స్1 మైక్రో ఎస్యూవీ కాన్సెప్ట్ తరహాలో అభివృద్ది చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఈవీ ఎస్యూవీ ధర సుమారు రూ. 15 లక్షల వరకు ఉండొచ్చునని తెలుస్తోంది. అంతేకాకుండా టాటా నెక్సాన్ ఈవీ, ఎమ్జీ హెక్టార్ ఈవీ తో పోటీ పడనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. -
ఎలన్ మస్క్కు చురకలంటించిన ఓలా సీఈవో...!
ప్రపంచ వ్యాప్తంగా పలు మల్టీనేషనల్ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి నడుం బిగించాయి. పలు కంపెనీలు భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్న టెస్లాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లో ప్రవేశపెట్టాలని ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం భారత్లో వేగంగా టెస్లా వాహనాలను ప్రవేశపెట్టాలని ఓ ట్విటర్ యూజర్ అడిగిన ప్రశ్నకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ జవాబిచ్చాడు. భారత్లో అత్యధికంగా దిగుమతి సుంకాలు ఉండడంతో ఆటంకంగా మారనుందని నెటిజన్కు సమాధానమిచ్చాడు. అంతేకాకుండా దిగుమతికి లైన్ క్లియర్ అయితే భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చాడు. ఎలన్ మస్క్తో పాటు హ్యూందాయ్ ఎండీ ఎస్ఎస్ కిమ్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్ డ్యూటీస్ తక్కువగా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. తక్కువ సుంకాలు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. తాజాగా టెస్లా అధినేత ఎలన్ మస్క్, హూందాయ్ ఎండీ ఎస్ఎస్ కిమ్లకు ఓలా కో ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ చురకలంటించారు. భారత్లోని దిగుమతి సుంకాలను, కస్టమ్ డ్యూటీలను తగ్గించాలని వారు చేసిన ప్రతిపాదనను భవీష్ అగర్వాల్ తప్పుబట్టారు. భారత్లోనే ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించగల సామర్థ్యంపై ఆయా కంపెనీలు విశ్వాసం కలిగి ఉండాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ఏర్పాటుచేయడంతో ప్రపంచంలోని తయారీరంగ దిగ్గజాలను భారత్లోకి ఆకర్షించ వచ్చునని తన ట్విట్లో భవీష్ పేర్కొన్నారు. Strongly disagree with both. Let’s have confidence in our ability to build indigenously and also attract global OEMs to build in India, not just import. We won’t be the first country to do so! https://t.co/n6k7ShYeJX — Bhavish Aggarwal (@bhash) July 27, 2021 -
భారీ వర్షాలు, స్పెషల్ ఆఫర్ ప్రకటించిన హ్యుందాయ్
భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్ ప్రకటించింది.ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్ సర్వీస్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 52మంది ఆచూకీ లభ్యం కాలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్ సర్వీస్లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 50శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్,మార్కెటింగ్ డైరక్టర్ తరుణ్ గార్గ్ ప్రకటించారు. -
బాలెనో, ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో.. i20 ఎరా!
న్యూఢిల్లీ: హ్యచ్బ్యాక్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి హ్యుందాయ్ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మాగ్నాకంటే తక్కువ హ్యచ్బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్లో మాగ్నా వేరియంట్ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్ షోరూమ్లో మాగ్నా ట్రిమ్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ను మార్కెట్లోకి తెస్తోంది. రూ. 6 లక్షల దగ్గర కేవలం పెట్రోల్ వెర్షన్లోనే లభించే హ్యుందాయ్ ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్ ప్రైస్ ఉండేలా హ్యుందాయ్ జాగ్రత్త పడుతోంది. నో కాంప్రమైజ్ ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్ క్వాలిటీలో హ్యుందాయ్ పెద్దగా కాంప్రమైజ్ కావడం లేదు.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎయిర్ కండీషన్, మాన్యువల్ గేర్ సిస్టమ్ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్ విండోస్కి బదులు మాన్యువల్ విండోస్ అందించింది. నేటి ట్రెండ్కి తగ్గ ఇన్ఫోంటైన్ సిస్టమ్ కాకుండా బేసిక్ ఇన్ఫోంటైన్ సిస్టమ్ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్ వెల్లడించనుంది. -
Flying Cars: ఆకాశంలో నడిచే కార్లు.. వచ్చేది ఎప్పుడంటే ?
వెబ్డెస్క్: రోడ్లపై నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గాలిలో ప్రయాణించే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు, ఆకాశంలో నడిచేలా కార్ల డిజైన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఎయిర్ ట్యాక్సీలు ఎయిర్ ట్యాక్సీల తయారీ విషయంలో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అయితే కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమితాసక్తితో ఉంది. 2030 నాటికి గాలిలో ఎగిరే కార్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామనే నమ్మకం ఉందంటూ హ్యుందాయ్ యూరోపియన్ ఆపరేషన్స్ సీఈవో మైఖేల్ కోలే తెలిపారు. 4 సీట్ కెపాసిటీ భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎయిర్ ట్యాక్సీలే మేలైన మార్గం. అందుకే నలుగురు నుంచి ఐదుగురు ప్రయాణించే కెపాసిటీతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. పూర్తిగా బ్యాటరీతో నడిచేలా ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేస్తోంది హ్యుందాయ్. ఎయిర్ట్యాక్సీల విషయంలో ఇప్పటికే పలు కంపెనీల ప్రోటోటైప్ విజయవంతం అయ్యాయి. కమర్షియల్ తయారీపై ఆయా కంపెనీలు కూడా దృష్టి సారించాయి. టూ ఇన్ వన్ సాధారణంగా ఎయిర్ పోర్టు వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి తిరిగి విమానం ఎక్కి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఎయిర్ట్యాక్సీలు ఈ రెండు పనులు చేసేలా ప్రస్తుతం డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. రోడ్డుపై నడిచేలా, గాలిలో ఎగిరేలా ఈ ఎయిర్ట్యాక్సీని డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ట్రావెల్ ముగిసిన తర్వాత రెక్కలు, ఇతర భాగాలు అన్ని ముడుచుకుని కారులాగా మారి పోతుంది ఈ ఎయిర్ ట్యాక్సీ. రోడ్డుపై ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక ఎయిర్పోర్టులు ఎయిర్ట్యాక్సీల్లో కొన్ని ఎటవాలుగా ల్యాండింగ్, టేకాఫ్ తీసుకుంటుండగా హ్యుందాయ్ మాత్రం నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకునే డిజైన్పై దృష్టి సారించింది. ఎయిర్ ట్యాక్సీలు తిరిగేందుకు వీలుగా యూకేలో ప్రత్యేక ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో హ్యుందాయ్ తలమునకలై ఉంది. ఈ ఎయిర్పోర్టులో దిగే విమానాలు ఏటవాలుగా కాకుండా నిట్టనిలువగా పైకి ఎరగడం, దిగేలా ఈ ఎయిర్పోర్టును డిజైన్ చేస్తున్నారు. . అర్బన్ ఎయిర్ మొబిలిటీపై 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. -
హ్యుందాయ్ ‘కోటి’ కార్లు రోడ్డెక్కాయి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న ప్లాంటులో కోటి కార్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ మార్కును సొంతం చేసుకుని ఫ్యాక్టరీ నుంచి వెలుపలికి వచ్చిన ప్రీమియం ఎస్యూవీ ఆల్కజార్పై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సంతకం చేశారు. కొరియా వెలుపల భారత్లో 1998లో హ్యుందాయ్ ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించింది. ఇప్పటివరకు దేశంలో రూ.29,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సంస్థ వెల్లడించింది. ఇక్కడ చదవండి: 3 నెలల్లో రూ.25.46 లక్షల కోట్ల సంపద సృష్టి -
హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర
ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో స్పొర్ట్ప్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తునే ధర తగ్గించి సంచలన నిర్ణయం తీసుకుంది హ్యుందాయ్. అధునాతన ఫీచర్లు, తక్కువ ధరతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ను సైలెంట్గా మార్కెట్లోకి తెచ్చింది. క్రెటా ఎగ్జిక్యూటివ్ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్లో తిరుగులేదని ఆధిపత్యం చలాయిస్తోంది హ్యుందాయ్ క్రెటా మోడల్. క్రెటా ఎస్, హైఎండ్లో క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. అయితే ఇతర కంపెనీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చింది హ్యుందాయ్. క్రెటా ఎస్, కెట్రా ఎస్ఎక్స్ వేరియంట్ల కలయికతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ని హంగు ఆర్భాటం లేకుండా ప్రవేశపెట్టింది. పైగా క్రెటా ఎస్ఎక్స్తో పోల్చితే ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ కారు ఎక్స్ షోరూం ధరలో రూ. 78,000 తక్కువకే ఇది లభిస్తోంది. లేటెస్ట్ ఫీచర్స్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో యాంటెన్నా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ మైక్, యూఎస్బీ పోర్టులు వంటి ఫీచర్లు అందించింది. అయితే మ్యూజిక్ సిస్టమ్ని ఇన్బిల్ట్గా కాకుండా యాక్సెసరీగా అందివ్వనుంది. మరోవైపు ఎస్ఎక్స్ వేరియంట్లలో ఉన్న డోర్ హ్యాండిల్ క్రోమ్, రియర్ వ్యూ మానిటర్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్, బర్గ్లర్ అలారమ్ వంటి ఫీచర్లు ఎగ్జిక్యూటివ్లో లేవు. అయితే ఎక్కువ మంది ఇష్టపడే సన్రూఫ్, వైర్లెస్ సేవలు అందించే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ వంటి ఆటో ఫీచర్లు అందించింది. క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో 1.5 లీటర్ పెట్రోలు / డీజిల్ ఇంజన్ అమర్చారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ‘ అల్కజార్’
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ సరికొత్త అల్కజార్ మోడల్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రెస్టీజ్, ప్రీమియం, సిగ్నేచర్ వేరియంట్లలో భారతీయ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ అల్కజార్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనుంది. ప్రారంభ ధర రూ.16.3లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ రూ.20 లక్షలుఎక్స్ షోరూం)గా ఉండనుంది. ఫీచర్ల ఆధారంగా మొత్తం 14 వేర్వేరు వేరియంట్లలో ఇది అందుబాటులోఉంటుంది. హ్యుందాయ్ భారత మార్కెట్లో 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘అల్కాజార్’ తో ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. 25వేల రూపాయలనుచెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు కొత్త అల్కాజార్ డీజిల్ వేరియంట్ ధర 16.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ,పెట్రోలు వేరియంట్ ధర 16.30లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. అల్కజార్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 14.5 కిమీ, డీజిల్ వెర్షన్ లీటరుకు 20.4 కిమీ మైలేజీ ఇస్తుంది. 2.0-లీటర్ పెట్రోల్ ఎంపిఐ ఇంజన్ 9.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగం అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఇస్తుందని హ్యుందాయ్ వెల్లడించింది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ (ఆప్షనల్) ట్రాన్స్ మిషన్ లతో లభ్యమవుతాయి. హ్యుందాయ్ అల్కజార్ ఎస్యూవీ ప్రధానంగా టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్ యూవీ-700, ఎంజీ హెక్టర్ ప్లస్ లకు గట్టి పోటీగా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. హ్యుందాయ్ 10.25-అంగుళాల మల్టీ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే బోస్ సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్లు),ఏక్యూఐ డిస్ప్లేతో ఆటో హెల్తీ ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్రూఫ్, టంబుల్ సీట్లు (కెప్టెన్ & 60:40 స్ప్లిట్ సీట్లు), డ్రైవ్ మోడ్ సెలెక్ట్ (కంఫర్ట్ | ఎకో | స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు (మంచు | ఇసుక | మట్టి ), ప్రధాన ఆకర్షణలు. -
Hyundai Alcazar : ఆరు వేరియంట్లు... 8 రంగుల్లో..
హైదరాబాద్: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సెగ్మెంట్లో హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఆల్కజార్ మోడల్పై ఆటో వరల్డ్లో ఆసక్తి నెలకొంది. జూన్ 18న మార్కెట్లోకి రానున్న ఆల్కజార్ మోడల్కి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన బ్రోచర్లో కారుకు సంబంధించిన కీలక అప్డేట్స్ తెలిశాయి. 6 వేరియంట్లు హ్యుందాయ్ ఆల్కజార్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తోంది. అవి ప్రెస్టీజ్ (ఎంటీ) , ప్రెజ్టీజ్ (ఓ) ఏటీ, ప్లాటినమ్ (ఎంటీ), ప్లాటినమ్ (ఓ) ఏటీ, సిగ్నేచర్ (ఎంటీ), సిగ్నేచర్ (ఓ) ఏటీలుగా ఉన్నాయి. ఇందులో ప్రెస్టీజ్ ఎంటీ వేరియంట్ ఆరు సీట్లు, ఏడు సీట్ల లే అవుట్తో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 6 సీట్ల వేరియంట్లో పెట్రోల్ వెర్షన్లో లభిస్తున్న ఏకైక మోడల్గా ప్రెస్టీజ్ ఓ వేరియంట్ నిలిచింది. కలర్ ఆప్షన్స్ హ్యుందాయ్ ఆల్కజార్ కలర్ ఆప్షన్స్కి సంబంధించి సింగల్ టోన్లో టైఫూన్ సిల్వర్, టైగాబ్రౌన్, పోలార్వైట్, టైటాన్ గ్రే, ప్లాటినమ్ బ్లాక్, స్టేరీ నైట్ మొత్తం ఆరు కలర్లు ఉండగా డ్యూయల్టోన్లో పోలార్ వైట్ ప్లాటినమ్ బ్లాక్, టైటాన్ గ్రే ఫాంటమ్ బ్లాక్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు 7 సీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో అనేక నూతన ఫీచర్లు ఆల్కజార్లో అందుబాటో ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచ్ మల్టీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ వ్యూ మానిటర్, వెనుక వరుసలో కూర్చున్న వారికి వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ బేస్డ్ సన్రూఫ్, కంఫర్ట్, ఏకో, స్పోర్ట్ డ్రైవింగ్మోడ్లతో పాటు ట్రాక్షన్ మోడ్ (మడ్, స్నో, శాండ్) తదితర ఆధునాత ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్లెస్ కార్! -
మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు!
హ్యుందాయ్ ఇండియా కొన్ని ప్రత్యేక మోడళ్లపై ఈ నెలలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కారు మోడల్, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు లాభం పొందవచ్చు. సాంట్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, కోనా ఎలక్ట్రిక్ వెహికల్ కు సంబందించిన మోడళ్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి. మే 1 నుండి మే 31 మధ్య కొన్న కార్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఈ ఆఫర్ను ఆన్లైన్లో లేదా దగ్గరలో ఉన్న షో రూమ్ లో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. హ్యుందాయ్ సాంట్రో: హ్యుందాయ్ సాంట్రోపై వినియోగదారులు రూ.35,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పెట్రోల్ మోడల్ కార్లపై మాత్రమే వర్తిస్తుంది. సాన్ట్రోకు గరిష్టంగా రూ .20,000 నగదు తగ్గింపు, రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ .5 వేలకు మంచి కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: నియోస్ హ్యాచ్బ్యాక్పై గరిష్టంగా 50 వేలు ఆదా చేయవచ్చు. ఈ కారుపై రూ.35,000నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5 వేలు వరకు లభిస్తుంది. హ్యుందాయ్ ఆరా: హ్యుందాయ్ ప్రస్తుతం ఆరాపై రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20: భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20ను 2020 ఏడాది చివరలో విడుదల చేశారు. మొదటిసారిగా దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్లో రూ.15 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5 వేల కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. హ్యుందాయ్ కోనా ఈవీ: హ్యుందాయ్ రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్న కారు హ్యుందాయ్ కోనా ఈవీ. హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ క్రాస్ఓవర్ ఈవీకి రూ .1.5 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. ఈ కారును హ్యుందాయ్ దేశంలో లభించే మొత్తం వాహన శ్రేణిలో 60 శాతానికి పైగా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. సంస్థ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాన్ని కూడా అందిస్తోంది. చదవండి: డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా? -
అమ్మకాల్లో దుమ్ము లేపిన హ్యుందాయ్
సాక్షి, ముంబై: భారత్లో తయారు చేసిన ఎస్యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. ఈ మొత్తం విక్రయాల్లో క్రెటా ఎస్యూవీ సింహభాగాన్ని ఆక్రమించినట్లు కంపెనీ పేర్కొంది. 2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు 5.9 లక్షల అమ్మకాలు దేశీయ మార్కెట్లోనూ, 2.2 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లో అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక 2019లో విడులైన వెన్యూ ఎస్యూవీ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్యూవీ రంగంలో విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో ఈ ఘనతను సాధించామని కంపెనీ డెరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్లోనే ఎస్యూవీలను తయారీ చేస్తున్న సంగతి గార్గ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు
సాక్షి, ముంబై: గడిచిన ఏడాది కాలంలో తన పాపులర్ ఎస్యూవీ ఆల్-న్యూ ‘క్రెటా’ వాహనాలు 1.21 లక్షలు అమ్ముడైనట్లు హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తెలిపింది. సరికొత్త వెర్షన్లో ఆల్–న్యూ క్రెటా కిందటేడాది మార్చిలో విడుదలైంది. ఈ మోడల్ దేశంలో కంపెనీ ఎస్యూవీ విభాగానికి తలమానికంగా నిలిచింది. భారత ఆటో పరిశ్రమలో ఒక ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా ఆల్-న్యూ క్రెటా రికార్డును నమోదు చేసినట్లు హ్యుందాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. మన్నికైన తయారీ, ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన మోడళ్లను కస్టమర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారనేందుకు క్రెటా విక్రయాలే నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు. ఇక 2015 జూలైలో విడుదలైన క్రెటా కార్ల అమ్మకాలు ఇప్పటి వరకు భారత్లో 5.8 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 2.16 లక్షలకు చేరుకున్నాయి. -
కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్
మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా తన మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్ను అందిస్తోంది. దీంతో కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. హ్యుందాయ్ తన కార్ల అమ్మకాలలో గత నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గత నెలలో 51, 600 యూనిట్లను విక్రయించింది. ఇది 2020 ఫిబ్రవరిలో 40,010 యూనిట్ల పోల్చితే 29 శాతం ఎక్కువ. హ్యుందాయ్ కార్లలో క్రెటా, ఐ20 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. గణనీయమైన వృద్ధిని నమోదు చేయడానికి ప్రధాన కారణం తన కార్ల మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్ను అందించడమే. అందుకే ఈ నెలలో కూడా కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎలంట్రా, శాంట్రో, ఆరా, కోనా వంటి మోడళ్లకు ఈ ఆఫర్ వర్తించనుండగా.. మార్చి నెలాఖరు దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది క్రింద తెలుసుకోండి. మోడళ్ల వారీగా డిస్కౌంట్: హ్యుందాయ్ కోనా మోడల్ పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు హ్యుందాయ్ ఎలంట్రా మోడల్ పై రూ.1 లక్ష వరకు తగ్గింపు హ్యుందాయ్ ఆరా మోడల్ పై రూ.70 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ నియోస్ మోడల్ పై రూ.60 వేలు వరకు తగ్గింపు హ్యుందాయ్ శాంట్రో(ఎంట్రీ లెవెల్) మోడల్ పై రూ.50 వేలు వరకు తగ్గింపు -
టెస్లాకి షాకిస్తున్న హ్యుందాయ్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో ఈ-వెహికల్స్కు పెట్టింది పేరైన అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ దేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ మౌతోంది. మరోవైపు హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఐయోనిక్ 5 టీజర్ను విడుదల చేసింది. సూపర్బ్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు షాక్ ఇవ్వనుందంటూ ఈ టీజర్పై చర్చ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ డిజిటల్ స్క్రీన్ సహా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్తో పాటు ఎల్ఇడి యాంబియంట్ లైటింగ్ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. ఐయోనిక్ 5లో యూనివర్సల్ ఐలాండ్ కన్సోల్ ద్వారా ముందు, వెనుక సీట్లను ముందుక వెనుకకు మూవ్ కావడం విశేషంగా నిలుస్తోంది.దీని సహాయంతో డ్రైవర్ , ప్రయాణీకులు ఇద్దరూ ఇరువైపుల నుండి వాహనంలోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించే సౌలభ్యం ఉంటుందనీ హ్యుందాయ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్పై లివింగ్ స్పేస్ థీమ్తో మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఈ టీజర్పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్ షోకి రెడీ అవుతున్న తరుణంలో హ్యుందాయ్ దీన్ని విడుదల చేసింది. గత నెలలోనే హ్యుందాయ్ ఐయోనిక్ 5 ని రిలీజ్ చేసిన సందర్భంలోనే కొత్త వెర్షన్ ఐదు నిమిషాల ఛార్జింగ్తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐయోనిక్ 5 ఇంటీరియర్లో వాడిన మెటీరియల్ కూడా ఎకో ప్రాసెస్డ్ లెదర్ను వినియోగించింది. అలాగే కారు మొత్తం సహజసిద్దమైన పెయింట్, రీసైకిల్డ్ ఫైబర్ వాడారు. సీట్లను కవర్ చేసే ఈ ఎకో లెదర్కి తోడు అవిసెగింజల నూనె నుంచి తీసిన డైలతో పెయింట్ వేసినట్లు కంపెనీ ప్రకటించింది. కారులోని క్యాబిన్లో కూడా ఊలు, పాలీయార్న్ కూడా చెరకు నుంచి ఉత్పన్నమైన ఫైబర్ను వినియోగించింది. అంతేకాదు పర్యావరణ హితంగా పెట్ బాటిల్స్..వాటినుంచి ఫైబర్ చేసి ఐకానిక్ 5కి వాడిందట. ఫ్లోర్ మాట్స్, కారు డ్యాష్ బోర్డ్, స్విచ్చులు, స్టీరింగ్ వీల్, డోర్ ప్యానెల్స్ జొన్న,తదితర పూల నుంచి తీసిన బయో కాంపొనెంట్స్తో కోటింగ్ ఇవ్వడం మరో హైలైట్. ఇదంతా పర్యావరణానికి సంబంధించిన కోణమైతే, కారులోపల డ్రైవర్తో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చునేవారు హాయిగా రిలాక్స్ అవడానికి లెగ్ రెస్ట్ సదుపాయాన్ని జోడింది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పూర్తయ్యేవరకూ ఈ ఇద్దరూ హ్యాపీగా రిలాక్స్ అయ్యేలా డిజైన్ చేసింది. పెద్దలు, పిల్లలు, వెనుక కూర్చున్న పెంపుడు జంతువుల కోసం కూడా సీట్ల అరేంజ్మెంట్ కూడా మనకి అవసరమైనట్లుగా రీపొజిషన్ చేసుకోవచ్చు. [#HMG] #IONIQ5’s Living Space and Sustainable Interior. IONIQ 5 virtual world premiere on February 23, 2021. #IONIQ #EV #Hyundai pic.twitter.com/t1ucBmW81v — Hyundai Motor Group (@HMGnewsroom) February 15, 2021 -
స్పీడు పెంచనున్న ఆటోరంగం
న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్’ (ఆఫ్లైన్ స్టోర్స్, డిజిటల్) నెట్వర్క్ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్ ఎండీ ఖూఖ్యున్ షిమ్ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది. విద్యుత్ వాహనాలపైనా కసరత్తు .. 2021లో పెరిగే డిమాండ్కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సర్వీస్ విభాగాలు) నవీన్ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది. -
స్టార్టప్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్టార్టప్ అవార్డులు (ఎన్ఎస్ఏ) –2021 రెండో ఎడిషన్ను కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ప్రారంభించింది. ఎన్ఎస్ఏ –2021కు జనవరి 31,2021 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. 15 విస్తృత రంగాల్లో 49 విభాగాల్లో స్టార్టప్లకు ఈ అవార్డులు ఇస్తారు. విజేతలకు రూ.5లక్షల నగదు ఇవ్వడంతోపాటు రన్నరప్లకు కూడా పైలెట్ ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు పొందడానికి అవకాశాలు కల్పించనుంది. అవార్డుల దరఖాస్తుకు www.startupindia.gov.in వెబ్సైట్ను సందర్శించాలని డీపీఐఐటీ పేర్కొంది. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే) హ్యుందాయ్ గ్రేట్ ఇండియా డ్రైవ్ 4.0 హైదరాబాద్: రాబోయే కొత్త దశాబ్దికి స్వాగతం పలుకుతూ హ్యుందాయ్ మోటార్స్ ‘‘గ్రేట్ ఇండియా డ్రైవ్ 4.0’’కు శ్రీకారం చుట్టింది. ఈ డ్రైవ్లో కస్టమర్ల కోసం సరికొత్తగా రూపొందిందిన ప్రీమియం కారు ఐ 20 మోడల్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. దేశవ్యాప్తంగా అటల్ టన్నెల్, డల్హౌసీ, గోవా, జైసల్మీర్, నర్ఖండా, భింతిక గుహలు, ఇండోర్, పుదుచ్చేరి, ఊటీ, కేరళ వంటి భిన్న ప్రాంతాల మీదుగా ఈ డ్రైవ్ కొనసాగనుంది. (చదవండి: ప్రతీ సెకనుకో బిర్యానీ.. స్విగ్గీ సీక్రెట్) -
ఆటో కంపెనీలకు దసరా పండగ..
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్ కార్లు, ఎస్–క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్లో హ్యుందాయ్ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్ సెంటిమెంట్కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. నవరాత్రుల్లో అమ్మకాలు.. అక్టోబర్ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
హ్యుందాయ్ ఐ20 సరికొత్తగా వస్తోంది..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తన ఆల్-న్యూ ఐ20 బుకింగ్స్ను బుధవారంనుంచి ప్రారంభించనుంది. ఈ మోడల్ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ కోసం అధికార వెబ్సైట్ను, ఆఫ్లైన్ బుకింగ్స్కు హ్యుందాయ్ డీలర్షిప్ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్ఎస్ మాట్లాడూతూ... భారత్లో ప్రీమియం హాచ్బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్-న్యూ ఐ20 నవంబర్ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా. -
కార్ల షోరూమ్లో సేల్స్ పర్సన్గా శునకం
బ్రెజిల్: షోరూమ్కు వెళ్లగానే అక్కడి సేల్స్ పర్సన్లు మనకు స్వాగతం చెప్తూ అవసరమైన వాటిని చూపిస్తుంటారు. అయితే హ్యుందాయ్ షోరూమ్లో మాత్రం ఓ వీధి శునకం మీకు సేల్స్ పర్సన్గా వెల్కమ్ చెప్తుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్లోని సెర్రాలో హ్యుందాయ్ షోరూమ్ దగ్గర ఓ కుక్క ఎప్పుడూ అక్కడే తచ్చాడుతూ కనిపించేది. దాన్ని చూసి అక్కడుండేవారు ఎంతో జాలిపడేవారు. అయితే రోజులు గడుస్తున్నా అది షోరూమ్ ముందు ఎదురు చూడటం మానలేదు. దీంతో ఆ షోరూమ్ వాళ్లకి కూడా జాలేసి దాన్ని దత్తత తీసుకుని "టుస్కాన్ ప్రైమ్" అని నామకరణం చేశారు. (కరోనా భయం.. కారే నయం!) అనంతరం దాన్ని ఆ షోరూమ్లో సేల్స్ పర్సన్గా నియమిస్తూ ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అది కూడా ఎంతో బుద్ధిగా, బాధ్యతగా తన పనులు నిర్వర్తిస్తోంది. ఆ షోరూమ్కు వచ్చే వినియోగదారులు కూడా కుక్క ప్రవర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్కాన్ ప్రైమ్కు ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక అకౌంట్ కూడా ఉంది. దీన్ని 43 వేల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ శునకం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?) View this post on Instagram Bom Dia meus AUmigos 🐾🐶🐕 hoje meu dia começou cedo, mas não foi nas vendas, estou tentando ler e responder as milhares, juro, milhaaaares de mensagens que recebi nos últimos dias, mas é que de onde eu vim, não tinha essa tecnologia toda, eu e meus humanos estamos tentando ainda encontrar uma forma de como lidar com tanto amor e carinho assim, se eu não abri sua mensagem ou respondi, queria pedir desculpas, mas estamos tentando ao máximo abrir todas as mensagens para tentar agradecer a todos vocês, estou muito feliz com tudo isso! Muuuitos LAMbeijos para vocês 🐶 #tucson #prime #hyundai @primehyundai A post shared by TUCSON PRIME (@tucson_prime) on Aug 5, 2020 at 5:53am PDT -
లాక్డౌన్లో హ్యుందాయ్ క్రెటా రికార్డు
సాక్షి,ముంబై: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్)కు చెందిన ప్రముఖకారు క్రెటా కొత్త వెర్షన్ బుకింగ్లలో దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ చేసిన క్రెటా వెర్షన్ కారు రికార్డు స్థాయి బుకింగ్లను సాధించి మార్కెట్ లీడర్గా నిలిచింది. క్రెటా కొత్త వెర్షన్కు 55 వేల బుకింగ్లు వచ్చాయని కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు) 2020 మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్యూవీ విభాగంలో టాప్లో ఉందని హెచ్ఎంఐఎల్ తెలిపింది. 2015 లో ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీలో బెంచ్ మార్క్గా నిలిచిందనీ, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లను సాధించిందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు. కొత్త వెర్షన్ ద్వారా కంపెనీ మరోసారి ఈ విభాగంలో ఎస్యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 55,000 బుకింగ్లు, 20,000 మందికి పైగా కస్టమర్లను సాధించిందన్నారు. ఈ కష్టకాలంలో కూడా భారతదేశం అంతటా ఆదరణకు నోచుకోవడం తమ ఎస్యూవీ పనితీరుకు నిదర్శనమని గార్గ్ వెల్లడించారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటా 2020 మార్కెట్లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. (మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!) -
సరికొత్తగా హ్యుందాయ్ వెన్యూ వెర్షన్లు
సాక్షి,న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూలో కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఐఎంటీ) అమర్చిన వెర్షన్ను బుధవారం విడుదల చేసింది. ఐఎంటీ వెర్షన్ వెన్యూ ఎస్యూవీ ప్రారంభ ధర 10.20లక్షలు (ఎక్స్ షోరూమ్, పాన్ ఇండియా). దీంతో పాటు స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ను కూడా పరిచయం చేసింది. దీని ధర 10-11.58 లక్షల రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఐఎంటీ వెర్షన్ ఎస్యూవీ ద్వారా వినియోగదారులకు క్లచ్ పెడల్ ఫ్రీ డ్రైవ్ను అందిస్తున్నామని, అయితే సిక్స్-స్పీడ్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ గేర్ షిఫ్ట్తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కప్పా 1.0 లీటర్ టీ-జీడీ బీఎస్-6 పెట్రోల్ ఇంజన్ అమర్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఎస్ఎస్ కిమ్ ప్రకటించారు. ఇందులో ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుందన్నారు. ఐఎంటీ వెన్యూ, స్పోర్ట్ ట్రిమ్కార్ల విడుదల ద్వారా మరోసారి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నామన్నారు. హ్యుం ఇంటెండేషన్ సెన్సార్, హైడ్రాలిక్ యాక్యుయేటర్ , ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్తో ట్రాన్స్మిషన్ గేర్ షిఫ్ట్ లివర్ను ఐఎంటీ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. వివిధ భాగాల మధ్య సమైక్య తర్కాన్ని చేర్చడం ద్వారా అతుకులు లేని డ్రైవ్ అనుభవాన్ని అందించడానికి సిస్టమ్ రూపొందించబడింది. స్పోర్ట్ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ బీఎస్-6 ఇంజిన్ (6 ఎమ్టి) తో పాటు కప్పా 1.0 లీటర్ టీ-జీబీ పెట్రోల్ బీఎస్-6 ఇంజిన్ ఇంజిన్పై ఐఎఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. -
మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!
సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి హ్యుందాయ్ షాకిచ్చింది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలచింది. దీంతో ఇప్పటిదాకా ఈ జాబితాలో టాప్ లో నిలిచిన మారుతిని వెనక్కి నెట్టివేసింది. 2020 మేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా స్థానాన్ని దక్కించుకుంది. (వాహన అమ్మకాలు రివర్స్గేర్లోనే..) హ్యుందాయ్ కొత్తగా ప్రారంభించిన క్రెటా 2020, మే నెలలో 3212 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. కాగా మారుతి సుజుకి ఎర్టిగా (ఎంపీవీ) రెండవ స్థానంలో నిలిచింది. అయితే అమ్మకాల పరంగా ఆల్టో, డిజైర్ , స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోలిస్తే ఎర్టిగా ఎక్కువ ఆదరణను నోచుకుంది. (మారుతి కూడా : బై నౌ.. పే లేటర్) కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు పూర్తిగా పడిపోయి కుదేలైన సంగతి తెలిసిందే. సడలించిన నిబంధనలతో తిరిగి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విక్రయాలు ఇంకా వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల 1,25,552 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే గత నెలలో 13,888 యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్లో తమ కార్పొరేట్ ఆఫీస్ను, కొన్ని డీలర్షిప్లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్షాప్లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్షిప్లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
చల్ వాహన రంగ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ సహా పలు కారణాలతో కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ పుంజుకునే ప్రయత్నాల్లో పడింది. వేసవి సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పటిదాకా మూతబడిన షోరూమ్లను, నిల్చిపోయిన ఉత్పత్తిని కంపెనీలు పునఃప్రారంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 600 డీలర్షిప్లను తిరిగి ప్రారంభించినట్లు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బుధవారం వెల్లడించింది. వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే, వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేలా అవుట్లెట్స్ కొత్త ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు, డిజిటల్ సౌలభ్యాన్ని సైతం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఈడీ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సుమారు 600 డీలర్షిప్లను తెరవగలిగాం. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన అనుమతుల కోసం డీలర్లు దరఖాస్తు చేసుకున్నారు‘ అని వివరించారు. ఇప్పటికే 55 వాహనాలు డెలివరీ కూడా చేసినట్లు చెప్పారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 1,960 నగరాలు, పట్టణాల్లో 3,080 డీలర్షిప్లు ఉన్నాయి. తాజాగా తెరిచిన వాటిల్లో 474 ఏరీనా అవుట్లెట్స్, 80 నెక్సా డీలర్షిప్లు, 45 వాణిజ్య వాహనాల అవుట్లెట్స్ ఉన్నాయని శ్రీవాస్తవ చెప్పారు. కార్లకు డోర్ స్టెప్ డెలివరీ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి మొదలు.. దేశవ్యాప్తంగా తమ ఫ్యాక్టరీలన్నింటిలోనూ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ వెల్లడించింది. హోసూరు, మైసూరు, నాలాగఢ్లోని ఫ్యాక్టరీల్లో కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో వివరించింది. అటు, మారుతీ సుజుకీ తమ మానెసర్ ప్లాంటులో ఉత్పత్తిని మే 12 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్ సైతం పుణేలోని చకన్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిమిత సంఖ్యలో సిబ్బందితో మొదలుపెట్టినట్లు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో డీలర్షిప్లు కూడా కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇక యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా సైతం ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ ప్లాంటులో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు వెల్లడించింది. తయారీకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఫీల్డ్ ప్లాంట్ ప్రారంభం చెన్నై: ఐచర్ మోటార్స్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న ఒరగాడమ్ తయారీ యూనిట్లో కార్యకలాపాలను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు చెన్నైలోని ఒరగాడమ్తోపాటు, తిరువొత్తియార్, వల్లమ్ వడగల్ వద్ద కూడా ప్లాంట్లు ఉన్నాయి. తొలుత ఒరగాడమ్ ప్లాంట్లో కొద్ది మంది సిబ్బందితో ఒకే షిఫ్ట్గా పనులు ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది. తిరువొత్తియార్, వడగల్ ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. షోరూ ములు పాక్షికంగా కార్యకలా పాలు మొదలయ్యా యని, 10 రోజుల్లో దాదాపు 300 షోరూమ్లు షురూ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే బాటలో హ్యుందాయ్.. వివిధ రాష్ట్రాల్లో 250 దాకా కంపెనీ డీలర్షిప్లు కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఉన్నాయని పేర్కొంది. కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 500 పైచిలుకు డీలర్షిప్లు ఉన్నాయి. ‘రెండు రోజులుగా వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టాం. పెండింగ్ బుకింగ్స్ చాలా ఉన్నాయి. డీలర్ల దగ్గరున్న నిల్వలు వీటికి సరిపోతాయి‘ అని సంస్థ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గర్గ్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లోని డీలర్లు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, రాగానే కార్యకలాపాలు ప్రారంభిస్తారని వివరించారు. కరోనా కష్టకాలంలో కొనుగోలుదారులు ఈఎంఐల గురించి ఆందోళన చెందకుండా కొన్ని కార్ల మోడల్స్పై ఈఎంఐ అష్యూరెన్స్ పేరిట ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని గర్గ్ చెప్పారు. హోండాకు సిబ్బంది సమస్యలు.. తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) తెలిపింది. రాజస్థాన్లోని తపుకరా ప్లాంట్కి అనుమతులు గతవారమే వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. వచ్చే వారం కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అనుమతులు, సిబ్బంది కొరత సమస్యలను అధిగమించాకా గ్రేటర్ నోయిడా ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభించగలమని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. అటు, డీలర్షిప్ల్లో కొన్ని తిరిగి తెరుచుకున్నట్లు వివరించారు. -
హాట్ ఇంటీరియర్స్తో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా..
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెలలో భారత్లో లాంఛ్ కానున్న ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్స్ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ రూ 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్, గేర్బాక్స్ కాంబినేషన్తో కూడిన న్యూ హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్లు ఉన్నాయి. తొలిసారి హ్యుందాయ్ క్రెటాకు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తోంది.ఇంకా ప్రత్యేకతల విషయానికి వస్తే రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రియర్ సీట్ హెడ్రెస్ట్ కుషన్, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు-దశల వెనుక సీటు రిక్లైనింగ్ ఫంక్షన్తో అందుబాటులోకి రానుంది. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 7 అంగుళాల డిస్ప్లేతో,10.25-అంగుళాల సమాంతర టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూలింక్ స్మార్ట్వాచ్ యాప్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో రూపొందింది. బీఎస్ 6 ప్రమాణాలతో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది. చదవండి : ఆటో ఎక్స్పో: కార్ల జిగేల్.. జిగేల్ -
కరోనా ఎఫెక్ట్ : మూతపడ్డ కార్ల పరిశ్రమ
సియోల్ : కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ హ్యుందాయ్ మోటార్పై పడింది. హ్యూందాయ్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు వైరస్ సోకినట్లు నిర్థారణ కావడంతో దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్ను యాజమాన్యం మూసివేసింది. కరోనా లక్షణాలతో ఓ ఉద్యోగిని గుర్తించిన యాజమాన్యం.. వెంటనే అతనికి వైద్య పరీక్షలు చేయగా.. వైరస్ నిర్థారణ అయింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సహా ఉద్యోగులకు వైరస్ సోకకుండా ప్లాంట్ను మూసివేసి.. అతన్ని వైద్యల పర్యవేక్షణకు తరలించారు. కాగా ప్రమాదకార వైరస్ ప్రభావం కారణంగా కంపెనీ షేర్లు ఇప్పటికే 5శాతం కుంగిపోయాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) కాగా ఉల్సాన్లోని ప్లాంట్లో దాదాపు 34వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఇదే కావడం గమనార్హం. కరోనా విజృంభణ కారణంగా చైనా తరువాత అత్యధికంగా ప్రభావితమైన రెండో దేశం దక్షిణ కొరియా. దీంతో ప్రపంచంలో అతిపెద్ద సంస్థలైన శాంసంగ్, హ్యూందాయ్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొరియాలో ఇప్పటికే 2,022 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క శుక్రవారం నాడే ఏకంగా 256 కేసులు నమోదయ్యాయి. -
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ ప్రీమియమ్ హ్యాచ్బాక్, గ్రాండ్ ఐ10 నియోస్లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్లను 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో, బీఎస్–సిక్స్ ప్రమాణాలతో రూపొందించామని కంపెనీ తెలిపింది. స్పోట్జ్ వేరియంట్ ధర రూ.7.68 లక్షలని. స్పోట్జ్(డ్యుయల్ టోన్) వేరియంట్ ధర రూ.7.73 లక్షలు (ఈ రెండు ధరలు ఎక్స్ షోరూమ్) అని పేర్కొంది. ఈ కంపనీ ఈ మోడల్ను పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలలో విక్రయిస్తోంది.