jana sena party
-
అపరిచితుడికి నెక్ట్స్ లెవల్లో జనసేనాని!
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్సింగ్లోని డైలాగ్ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా? 👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్. 👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు. జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. 👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి. 👉వైఎస్ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే.. అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!
సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్ కల్యాణ్కు సనాతనాభివందనాలు!ఇప్పుడు పవన్ కల్యాణ్ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్ మాట్లాడలేదు.ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.లెఫ్ట్ నుంచీ సెంటర్కూ, అక్కడి నుంచి రైట్కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్ నార్మన్ బెథూన్, డాక్టర్ ద్వారకానాద్ కోట్నిస్ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు. తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. ‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్కే పార్టీ మీద దాడి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.పవన్ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్ పరి వార్ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాలినేని.. జగన్ గురించి మాట్లాడే స్థాయేనా నీది?
ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వైఎస్సార్సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్. నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్కు బంధువైంది. అలాంటిది జగన్ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?. నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్. నీలాంటి వాడికి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
జనసేన టీడీపీ మధ్య ఇసుక వేస్తే భగ్గుమనేలా..!
కృష్ణా, సాక్షి: ఏపీలో కూటమి నేతల మధ్య ‘ఇసుక మాఫియా’ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ విషయంలోనూ టీడీపీనే పైచేయి సాధిస్తోంది. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఇసుక పంచాయతీ కొట్టుకునేదాకా తీసుకెళ్లింది. ఆ వీడియోలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడాలేకుండా ఇసుక తరలిస్తూ.. పార్టీకి చెందిన వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన తరఫు వాళ్లకు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసి రేటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేనవాళ్లను అసభ్యంగా తిట్టడంతో అది బాహాబాహీకి దారి తీసింది. ఇరు పార్టీల వాళ్లు అర్ధరాత్రి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్ వైజర్ అఖిల్కు గాయాలయ్యాయి. అనంతరం గొడవ.. ఘంటసాల పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పోలీసులు కాంప్రమైజ్కు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి లారీ, జేసీబీని సీజ్ చేశారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు , అల్లుడు రంగంలోకి దిగారు. కేసు లేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
పవన్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయ్: లక్ష్మి
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారామె. కిరణ్ రాయల్తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. నేను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి చెబుతున్నారు. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పిఠాపురం జనసేనలో ‘కోడ్ చిచ్చు’
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్ వైశాలి వివరణతో మరింత ముదిరింది. పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్చల్ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ఆ హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం! -
అమ్మాయిల వీక్నెస్.. నేనింతే: లక్ష్మితో కిరణ్ రాయల్!
తిరుపతి, సాక్షి: సంచలనంగా మారిన జనసేన స్థానిక ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్లిప్ బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే.. ఎలాగైనా డబ్బులిచ్చేస్తానంటూ కిరణ్ బాధితురాలితో చెప్పిన మాటలు బయటకొచ్చాయి. అంతేకాదు..అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడిన మాటలు కూడా ఆడియో క్లిప్లో ఉన్నాయి. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆడియోలో ఏమని ఉందంటే.. ‘‘నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా... ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం ఫర్వాలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారెంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabutvam) రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా’’ అని కిరణ్ రాయల్(Kiran Royal) తన మాటల గారడీని లక్ష్మిపై ప్రయోగించాడు. నా కూతురి మీద ఒట్టు.... నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చు..’’ అంటూ బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆ ఆడియోలో వాయిస్ ఉంది. -
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్చుప్గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. -
కిరణ్ రాయల్ పరమ నీచుడు.. నాకే పార్టీతో సంబంధం లేదు: లక్ష్మి
తిరుపతి, సాక్షి: అమ్మాయిలను మోసం చేసి వాళ్ల డబ్బుతో విలాసజీవితం గడిపే పరమనీచుడు వ్యక్తి కిరణ్ రాయల్ అని, జనసేన అధినేత పవన్ మద్దతు చూసుకునే రెచ్చిపోతున్నారని, అలాంటి వాడిపై తన పోరాటం కొనసాగుతుందని లక్ష్మి మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతిలో శనివారం ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి.. కిరణ్ రాయల్పై మరికొన్ని సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘కిరణ్ రాయల్(Kiran Royal) అనే వ్యక్తి ఎవరు?. అతనేం బిజినెస్ చేస్తున్నాడు?. జనాన్ని మోసం చేయడం తప్ప ఎలాంటి వ్యాపారం చేయడు. అమ్మాయిలను మోసం చేసి విలాసజీవితం గడిపే వ్యక్తి. ఆడవాళ్ల దగ్గర డబ్బులు దోచుకుని రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అతనిలా మేం మోసాలు చేసి బతకలేదు. నా డబ్బుతో నేను బతుకుతున్నా. కిరణ్ రాయల్ బాధితులు ఎందరో ఉన్నారు. పరమ నీచుడైన కిరణ్ రాయల్.. కొందరిని దుర్మార్గంగా కొట్టాడు. అందుకు అతని భార్య రేణుక, కూతురే సాక్ష్యం. త్వరలో మరింత మంది బాధితులు బయటకు వస్తారు.నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు. నిజాలు బయటపెడతానని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కిరణ్ రాయల్ వ్యవహారాలపై అన్నింటికి ఆధారాలు ఇచ్చాం. నేను న్యాయపోరాటం చేస్తుంటే.. వైఎస్సార్సీపీ నేతలకు అంటకడుతున్నారు. భూమన కుటుంబంతో నాకేం సంబంధం?. నాకు, భూమన కుటుంబ సభ్యులకు సంబంధం అంటగట్టి కిరణ్ రాయల్ నీచ ప్రచారం చేస్తున్నారు. నాకు అండగా ఎవరూ లేరనే భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది.మా అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) నా వెనక ఉన్నాడని కిరణ్ రాయల్ తరచూ నాతో చెప్తుండేవాడు. ఆ మద్దతు చూసుకునే చెలరేగిపోతున్నారు. ఇది నిజమో కాదో.. పవనే చెప్పాలి. కిరణ్ రాయల్ ఎంతో మంది ఆడవాళ్లను వేధించాడు. ఆ అరాచకాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో కిరణ్ రాయల్ అరెస్ట్ అయితే.. తన భర్తను బయటకు రప్పించాలని ఓ బాధితురాలిని రేణుక బ్లాక్మెయిలింగ్కు దిగారు’’ అని లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు.తన డబ్బు తనకు వచ్చేదాకా పోరాటం ఆగదని, ఆయన వెనకాల ఉన్నవారిపై దర్యాప్తు చేయాలని, కిరణ్ రాయల్లాంటి నీచుడ్ని ఎవరూ నమ్మొద్దని లక్ష్మి(Laxmi) విజ్ఞప్తి చేశారు. -
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్రాయల్కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్కు ముందే ఎలా తెలుసు? -
అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. రోడ్డెక్కిన జనసేన
సాక్షి, కృష్ణాజిల్లా: పెడనలో న్యాయం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన పోరాట దీక్షకు దిగింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యక్తలకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ జనసేన కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. మా గోడు తెలియజేయడానికి సమయం ఇవ్వాలంటూ బ్యానర్లు కట్టారు.కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన సీరం సంతోష్ దీక్షతో టీడీపీ,జనసేన పార్టీలో కలవరం రేగుతోంది. జనసేన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా, సీరం సంతోష్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరో వైపు, నిన్న(బుధవారం) కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
కోడి పందాల బరుల దగ్గర బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
పవన్ పరామర్శ కోసం పడిగాపులు
కాకినాడ, సాక్షి: ఎవరైనా బాధితులను ఎలా పరామర్శిస్తారు?. స్వయంగా వెళ్లి పరామర్శించే వాళ్లు కొందరైతే.. బాధితుల్నే తమ దగ్గరకు రప్పించుకునేవాళ్లు మరికొందరు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం మూడో రకం!. సమయం-సందర్భం ఈ రెండింటితో సంబంధం లేకుండా బాధితులను తన దగ్గరికి రప్పించుకుని మరీ వాళ్లను వెయిట్ చేయిస్తారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈవెంట్కు వెళ్లి మెగా అభిమానులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత సంగతి తెలిసిందే. సినిమా పిచ్చి.. అంతకు మంచి హీరోలంటే వెర్రి అభిమానం తమవాళ్ల ప్రాణాలు తీసిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అటు చిత్ర యూనిట్గానీ, ఇటు ఆ ఈవెంట్కు చీఫ్గెస్ట్గా హాజరైన పవన్ కల్యాణ్గానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఓదార్చలేదు. సరికదా.. గత ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయలేదని, అందుకే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ రాజకీయం చేయబోయారు. ఆపై కంటితుడుపు చర్యగా.. తన జనసేన తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే.. పవన్ నియోజకవర్గం పిఠాపురం నుంచి బాధిత కుటుంబాలు ఉండేది పది కిలోమీటర్ల దూరంలోనే. ఘటన జరిగి వారం అవుతున్నా బాధితులను పవన్గానీ, జనసేన తరఫు నేతలుగానీ కలిసింది లేదు. పోనీ.. ఇప్పుడు వాళ్లను రప్పించుకున్న సందర్భమైనా బాగుందా? అంటే అదీ లేదు. పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఇప్పుడు తన కోసం పడిగాపులు పడేలా చేశారాయన. పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో వాళ్లను పవన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఓవైపు సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు ఆ వేదిక వద్ద కింద వాళ్లు కూర్చున్నారు. ఉదయం నుంచి వాళ్లు ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించలేదంటారా?. ఆయన అభిమానులైనా.. ఇదేం పరామర్శ అని అనుకోరంటారా?!. -
సూపర్ సీఎం సెల్ఫ్ గోల్స్.. టీడీపీ ఫుల్ హ్యాపీ!
రాజకీయాలలో ఓర్పు,నేర్పు అవసరం. వ్యూహం కూడా ముఖ్యమే. ఏపీలో జరుగుతున్న కూటమి రాజకీయాలను పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అభాసుపాలు అవుతున్నారు. అది ఆయనకు అర్దం కావడం లేదేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగానే అవగతమవుతోంది. రాజకీయాలలో కలిసి ఉంటూనే బోల్తా కొట్టించడం ఒక ప్లాన్ గా ఉంటుంది.ఈపాటికే పవన్ కళ్యాణ్ కు ఆ విషయం బోధపడవలసి ఉంది.కాని అలా జరగడం లేదు. దానికి కారణం.... ఆయనకు అనూహ్యమైన రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ,దానిని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండడం ఒకటైతే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో తొందరపడుతున్న వైనం మరో కారణంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎల్లకాలం అబద్దాలు ఆడితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు!. ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శైలి అలవరచుకుని నిత్యం అబద్దాలు చెప్పడం ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. జనంలో అవసరం ఉన్నా,లేకపోయినా తిరుగుతూ తానేదో సూపర్ సీఎంనని అనుకుంటే అది అంత తెలివైన పని కాదని ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఇటీవల పలు ఘట్టాలలో చేసిన ప్రకటనలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి.రాజమండ్రి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం చాలా అభ్యంతరకరంగా ఉంది. యువకులకు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యతలో ఉన్న పవన్.. అల్లరి ,చిల్లర పనులు చేయండని సలహా ఇవ్వడం పై విమర్శలు తలెత్తాయి.యువకులకు ఉద్యోగాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ,ఇలాంటి సినిమా ఉత్సవాలలో పాల్గొనాలని, సినిమాలు చూస్తూ చొక్కాలు చించుకోవాలని, స్టంట్ లు నేర్చుకోవాలని, మోటారు సైకిళ్ల సైలెన్సర్ లు తొలగించి విపరీతమైన ధ్వని సృష్టిస్తూ గోల చేయాలని చెప్పడం చూస్తే పవన్ కు అసలు మెచ్యూరిటీ ఉందా అన్న సందేహం కలుగుతుంది.ఒక వైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత,పేద వర్గాలు మంచి విద్య అభ్యసించాలని, చదువే సంపద అని హితబోధ చేస్తూ వచ్చారు. కానీ, పవన్ మాత్రం అల్లరి చేయండని చెబుతున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.గేమ్ చేంజర్ సినిమా కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం విషాదం. ఇందుకు ఎవరైనా బాధ పడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తప్పు చేసినట్లు చెప్పరు. కాని హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ఆయనకు బంధువు, మరో నటుడు అయిన అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరు .. చేసిన వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. అల్లు అర్జున్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా తెలంగాణ పోలీసులు కేసు పట్టారని సినిమా ప్రముఖులంతా భావించి ఆయనను పరామర్శించారు. చివరికి ఆయన పార్టనర్ చంద్రబాబు కూడా ఫోన్ చేసి పలకరించారు. కానీ, ఫోన్ పలకరింపు కూడా చేయలేదు పవన్?!.పైగా..రేవంత్ కు మద్దతుగా ప్రసంగించారు.అల్లు అర్జున్ మానవత్వంతో వ్యవహరించలేదని అనుచిత వ్యాఖ్య చేశారు.తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సుమారు రెండు కోట్ల మేర వివిధ రూపాలలో సాయం అందింది. అయినా రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేట్లు పవన్ కామెంట్లు చేశారు.పోనీ అదే సమయంలో బెనిఫిట్ షో లు, టిక్కెట్ల దరలు పెంచుకోవడానికి , తొక్కిసలాటకు ఏమి సంబంధం అని పవన్ ప్రశ్నించలేదు.సినిమా టిక్కెట్ల రేట్లతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని గతంలో జగన్ ప్రభుత్వంపై పెద్దపెట్టున అరచిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం ధైర్యం చేయలేకపోయారు. రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు, మెగా కుటుంబ వీరాభిమానులు మరణిస్తే జనసేన తరపున చెరో ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఇది మానవత్వమేనా? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ కాని, రామ్ చరణ్ తేజ కాని, గేమ్ చేంజర్ సినిమా బృందం కాని ఎవరూ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు.అర్జున్ విషయంలో ఒక నీతి, తన వరకు వచ్చేసరికి మరో రీతా అనే విమర్శ వచ్చింది.పైగా జగన్ టైమ్ లో రోడ్డు బాగు చేయలేదు కనుక ప్రమాదం జరిగిందని దిక్కుమాలిన ఆరోపణ చేశారు.తీరా చూస్తే ఆయన అబద్దం ఆడారని తేలిపోయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఎక్కడా ఒక్కగొయ్యి కూడా లేదు.అయినా ప్రమాదం జరిగింది. తమ అభిమానులు మరణించిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పవన్ ఈ ప్రయత్నం చేశారని అనుకోవాలి.మరణించిన యువకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ మెగా కుటుంబం పట్ల వారికి ఎంత అభిమానమో వివరించారు. ఈ సినిమా పిచ్చి తోనే వారు మరణించారని వాపోయారు. దాని గురించి పవన్ నోరెత్తడం లేదు. రోడ్డు బాగోలేదని చెబుతున్నారు. నిజానికి ఆ ఏడీబీ రోడ్డు దశాబ్దాల తరబడి రకరకాల సమస్యలను ఎదుర్కుంటోంది. దాంతో రోడ్డు పాడవుతోంది. అయినా తాము రాగానే అన్నీ చేసేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఈ ఏడు నెలలు ఏమి చేసినట్లు అన్న ప్రశ్న కూడా వస్తుంది.తాజాగా కూటమి ఎమ్మెల్యే ఒకరు తనకు కమిషన్ ఇవ్వకుండా మెటల్ గ్రావెల్ తొలనివ్వడం లేదని ఆరోపణ వచ్చింది.ఇలా ఏది పడితే అది మాట్లాడితే పవన్ కు ఏమి ఉపయోగం?. అది టీడీపీకే ప్రయోజనం అవుతుంది. పవన్కు సీఎం అవ్వాలనే కోరిక ఉన్నా, ఆయన తీరు ఆ స్థాయిలో లేదని , లోకేష్ సీఎం అయితేనే బెటర్ అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తాయి.నిజానికి అబద్దాలు చెప్పడం పవన్కు కొత్త కాదు.ఆయన ఈ విషయంలో చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కాని అబద్దాలు ఆడడంలో చాకచక్యం కూడా అవసరమే అని అంటారు. అందులో చంద్రబాబు సిద్దహస్తులనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలియక చంద్రబాబు చెప్పినట్లే చెబుతూ, ఆయన చేసినట్లే చేస్తూ పవన్ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో పవన్ ఏపీఅంతటా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణ చేసి.. దానికి వలంటీర్లను బాధ్యులు చేసి అప్రతిష్ట మూట కట్టుకున్నారు.చంద్రబాబుతో పాటు అనేక వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ప్రజలు భావించే పరిస్తితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయంటూ ,హోం మంత్రి బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించి , ఆ తర్వాత జారిపోయి,దానిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సూచించినట్లు సోషల్ మీడియాపై దాడి చేశారు. ఆ విషయం జనానికి అర్ధం అయింది.పవన్ తాను ఎక్కడకు వెళితే అక్కడే పుట్టానని చెప్పడం,చదువుపై ఒక్కోసారి ఒకరకంగా మాట్లాడడం వంటివాటిని ఆయన అభిమానులు కూడా సరిపెట్టుకున్నారు.కాని అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చంద్రబాబు మెప్పుదల కోసమో లేక, తాను సూపర్ సీఎం అని పరోక్షంగా ప్రజలు అనుకోవాలన్న లక్ష్యంతోనో ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు👉 తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అసత్య ఆరోపణ చేశారు. వెంటనే పవన్ సనాతని అవతారం ఎత్తి అంతకన్నా గట్టిగా ప్రచారం చేసి బోల్తా పడ్డారు.👉తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రేప్ బాధితులను ,జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ-ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు గురైన బాధితులను పరామర్శించకుండా.. కడపలో జరిగిన ఒక చిన్న ఘటనపై ఆవేశంగా స్పందిస్తూ అక్కడకు వెళ్లిన తీరుతో అపహాస్యం పాలయ్యారు.👉 వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల వద్దకు అవసరం లేకపోయినా సందర్శించి ఏదో చేయాలని అనుకున్నారు. కాని అధికారులు అక్కడ ఏమీ లేదని చెప్పడంతో తుస్సుమన్నారు.👉కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి తనకు అధికారం లేకపోయినా ‘‘సీజ్ ద షిప్’’ అంటూ ఆదేశించి ఈయనేం ఉప ముఖ్యమంత్రి? అని అధికారులు తల పట్టుకునేలా చేసుకున్నారు.ఇవన్నీ చూస్తే తాను లోకేష్ కన్నా సమర్ధుడనని, అన్ని వ్యవహారాలలో తను జోక్యం చేసుకోగలనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టవచ్చని పవన్ పై ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాయడం ఆరంభించింది. పవన్ వేస్తున్న తప్పటడుగులతో జనసేన కార్యకర్తలు నెత్తి,నోరు కొట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం లోలోపల సంతోషిస్తున్నాయి. ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రకటనల ద్వారా పవన్ కల్యాణ్ భ్రష్టు పడితే అది తమకే మరింత ఉపయోగమన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పైకి ఏదో పవన్ కు బాగా మర్యాద ఇస్తున్నట్లు కనిపిస్తూ.. మరోవైపు ఆయా సందర్భాలలో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా టిడిపి నాయకత్వం ,ముఖ్యంగా లోకేష్ అనుచర వర్గం ప్రయత్నిస్తున్నట్లు కొందరి భావనగా ఉంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాకుండా పవన్ అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడడమే!.ఈ టరమ్ మాత్రమే కాకుండా ఆ పై పదేళ్లు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పి సంతోషపెడుతున్నానని పవన్ భావిస్తుండవచ్చు.కాని ఇది లోకేష్ కు మంట పుట్టించే అంశమే అవుతుంది. వైఎస్సార్సీపీ చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా.. టీడీపీ నేతలు అమలు చేసే వ్యూహాల వల్లే పవన్ కు అధికనష్టం కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ అయినట్లు కాకుండా.. తనకంటూ ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. సరైన రీతిలో రాజకీయం చేయకపోతే నష్టపోయేది పవనే అవుతారు. ఏపీలో గత ఏడు నెలల పరిస్థితులు చూస్తే.. ఏదో రకంగా వచ్చిన రాజకీయవకాశాన్ని పవన్ తనకు తాను చేజార్చుకుంటున్నారన్న భావన ఏర్పడుతోంది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
టార్గెట్ నాగబాబు.. లోకేష్కు బూమరాంగ్!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్గా ఆడేసుకోవడం!.2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.2019-24 మధ్య వైఎస్సార్సీపీతో పాటు టీడీపీని టార్గెట్గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.సంబంధిత వార్త: లోకేష్కు ఓ.. వేస్కోండి!ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్కు అన్వయింపజేస్తూ కౌంటర్కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
పబ్లిక్గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ. -
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తున్నారు. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
బొలిశెట్టి నోటి దురుసు.. మళ్లీ అల్లు అర్జున్పై కామెంట్స్
పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు.. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు. -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. -
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
డిప్యూటీ స్పీకర్ విషయంలో ట్విస్ట్ తప్పదా?
అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్ టాక్. డిప్యూటీ స్పీకర్ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం. -
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్తో పాటు నారా లోకేష్కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న లీక్స్.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?
విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ శాసన సభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన సీనియర్.. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, పవన్ పేరును ప్రతిపాదించగా.. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవుల కోసమూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి పవన్తో పాటు జనసేన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. -
ఏపీ గవర్నర్ను కలిసిన కూటమి నేతలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్కు లేఖ ఇచ్చారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.:: పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. ::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్స్టాపబుల్ విజయం. ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ::చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతల ఎంపికకూటమి మీటింగ్ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్ కొనసాగుతోంది.రేపే ప్రమాణం.. స్టేట్ గెస్ట్గా చిరుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్గా నటుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. మంత్రి వర్గంపై ఉత్కంఠమరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్హౌస్కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..
జూన్ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్ ట్యాగులు ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్పోల్స్ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 18 నుంచి 21 లోక్సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో!. -
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు -
మంగళగిరి పోలింగ్ బూత్లో పవన్ ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం. -
PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
గజ ఈతగాడు అన్నారు.. ఆకాశాన్నంటే హైప్ క్రియేట్ చేశారు... మనోడు లేస్తే పరశురాముడు గండ్ర గొడ్డలి తీస్తే హరిహరాదులు కూడా అడ్డుకోలేరు అన్నారు. అయన మౌనంగా కూర్చుంటే వశిష్ఠుడు అన్నారు.. ఒంటి చేత్తో కూటమి ముంగిటకు అధికారాన్ని తెచ్చి పడేసాడు అన్నారు. అన్న కన్నెర్ర చేస్తే భూమ్యాకాశములు ఏకమవుతాయన్నారు. పిడికిలి బిగించి గుద్దితే పిడుగులు కురుస్తాయి.. కన్నెర్ర చేస్తే నిప్పుల వాన.. ఆయన ప్రేమ ఆకాశం... ఆయన ఆగ్రహం అనంతం.. ఈ మాదిరి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ను మోశారు. పాపం సినిమావాడు కదా.. నమ్మేసాడు.. సినిమాల్లో ఐతే స్క్రిప్ట్ ప్రకారం నచ్చినట్లు రాసుకోవచ్చు.. పిడికిలి బిగిస్తే భూమి బద్దలయ్యేలా గ్రాఫిక్స్ పెట్టొచ్చు.. ఒంటి చేత్తో లక్షలాదిమందికి శాసించొచ్చు ఎందుకంటే వాళ్లంతా జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి.. వింటారు.స్టూడియోలో స్క్రిప్ట్ ప్రకారం అట్ట కత్తులు తిప్పి పదులసంఖ్యలో శతృవులను కూల్చడం వేరు.. నిజంగా సమాజంలో నిలబడి.. ప్రజల మద్దతు పొందడం వేరు.. తన సినీగ్లామర్ చూసి జనం వస్తారు అంతవరకూ నిజమే కానీ వాళ్ళను ఆకట్టుకోవడం.. తన వ్యక్తిత్వం.. వ్యవహారశైలితోబాటు క్యారెక్టర్.. ఇవన్నీ చూసిగానీ ప్రజలు తనవెంట నడవరు. ప్రజలు.. సమాజం.. ఏమీ గమనించనట్లే ఉంటారు. కానీ అవకాశం వచ్చినపుడు నాయకులూ వేసే ప్రతి అడుగునూ ఆచితూచి చూసి అప్పుడు కానీ అనుసరించరు.. తన వెంట నడవరు.. పార్ట్ టైం నాయకుడైన పవన్కు ఇప్పుడు ఆ విషయం అర్థమైంది. జగన్ను, వైసీపీ నేతలను గుడ్డలూడదీసి కొడతాను.. సంకెళ్లు వేస్తాను.. ఇలాంటి డైలాగ్స్ పవన్ మానసిక సంతులితను తెలియజేస్తున్నాయి. దానికితోడు పిఠాపురంలో పవన్ మీద పోటీలో ఉన్న వంగా గీత తక్కువైనవ్యక్తి కాదు.. ముప్పయ్యేళ్లుగా ప్రజల్లో ఉంటూ ఎక్కడా మచ్చపడకుండా ప్రజల మద్దతుపొందుతూ వస్తున్నారు. గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్కు ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగిడాలని కోరిక బలపడింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా మొదట ఉన్నంత సానుకూలత కనిపించడం లేదు. ఆదుకుంటాడు అనుకున్న వర్మ చివరలో పోటు పొందితే అంతకుమించిన అవమానం మరోటి ఉండదు. జబర్దస్త్ నటులతో చేయించిన ప్రచారం ప్రజలను నవ్వించింది.. పవన్ను నవ్వులపాల్జేసింది.. తప్ప ఓట్లు తెచ్చేది లేదని తేలిపోయింది.ఆఖరి అస్త్రంగా మెగాస్టార్పవన్ వద్ద ఉన్న డైలాగ్స్ .. యాక్షన్ సీన్లు అన్నీ ముగిసాక కూడా గెలుపు మీద నమ్మకం రాలేదు.. అటు గీత.. ఒక మహిళగా ప్రతి ఇంటినీ టచ్ చేస్తూ.. మీ ఇంటి ఆడబిడ్డను.. గెలిచినా గెలవకున్నా నా నివాసం ఇక్కడే.. కానీ వాళ్ళు గెలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం కోసం హైదరాబాద్.. మద్రాస్.. షూటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి అని చెబుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో పవన్ పరిస్థితి చిల్లుకుండలోని నీళ్లు మాదిరి మారింది.పూటపూటకూ గ్రాఫ్ తగ్గిపోతోంది.. దీంతో చివరి అస్త్రంగా మెగాస్టార్ చిరంజీవిని దించారు.. అయన కూడా తమ్ముడి గుణగణాలు.. వీరగాధలను ఉదహరిస్తూ పాపం పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. గెలిపించండి... ఈసారైనా గెలిపించండి.. లేకుంటే అవమానభారంతో చచ్చేలా ఉన్నాడు అని విజ్ఞప్తి చేశారు. ఆఖరుకు పవన్ పరిస్థితి అక్కడికి వచ్చింది.. చంద్రబాబును సీఎంను చేయగలిగిన చరిష్మా ఉందని భావిస్తున్న పవన్.. ఇప్పుడు అన్నతో వీడియో పోస్ట్ చేయించుకునే స్థితికి చేరారు.. ఇది దాదాపుగా ఓటమితో సమానం... గెలిచినా ఓడినట్లే..:::: సిమ్మాదిరప్పన్న -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.ప్రస్ట్రేషన్తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. -
ప్చ్.. పవన్ మెడలు వంచిన చంద్రబాబు
మన్యం, సాక్షి: పాపం.. పవన్ కల్యాణ్ జనసేనకు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక ఎంత సతమతం అవుతున్నారో!.. ఇది ఏపీ ప్రజల్లో కొందరి అభిప్రాయం. కానీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు అర్థం చేసుకునేవాళ్లెవరైనా పవన్ను పాపం అని కాదు కదా.. ఛీ కొట్టి తిరస్కరిస్తారు. పాలకొండ అభ్యర్థి విషయంలో రాత్రి పూట పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ దఫా ఎన్నికల టైంలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు పొత్తు, కూటమి అంటూ ఇటు జనసేనకు, అటు బీజేపీకి సీట్లు ఇచ్చారే గానీ, ఆ సీట్లలో కూడా తన వాళ్లనే పోటీ చేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. బీజేపీ, జనసేన బీఫాంల మీద పోటీకి దిగబోతున్నారు.. అంతే! బీజేపీలో, జనసేనల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు దాదాపుగా తన మనుషులతో నింపేశారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల్లో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల్లో.. ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, రోషన్న, సీఎం రమేష్ లాంటివాళ్లే కాకుండా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు పురంధేశ్వరి పేరు చెప్పుకుని.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఓ ఆడియో లీక్ కావడం, బీజేపీ-టీడీపీ చీకటి ఒప్పందాలకు ఊదాహరణ అనే చెప్పొచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని చోట్లా అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. మరోవైపు జనసేన పరిస్థితి ఇంతే!. దక్కిన 21 సీట్లలోనూ అభ్యర్థుల్ని నింపేందుకు పవన్ తెగ ఇబ్బంది పడిపోయారు. పవన్లోని ఆ గందరగోళాన్ని చంద్రబాబు ఎంచక్కా క్యాష్ చేసుకున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ యాదవ్, అరణి శ్రీనివాసులకు టికెట్లు ఇవ్వడం కూటమిలో మంట రాజేసింది. ఇది చాలదన్నట్లు భీమవరం, అవనిగడ్డ, ఇప్పుడు పాలకొండకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ఈ మధ్యలో రైల్వే కోడూరు అభ్యర్థిని తప్పించి మరీ టీడీపీ మనిషి అయిన అరవ శ్రీధర్కు టికెట్ ఇవ్వడం చూస్తే చంద్రబాబు పవన్ మెడల్ని ఏమేర వంచి తాను అనుకున్నది చేశారో స్పష్టం అవుతోంది. వాస్తవానికి పాలకొండ విషయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ ఎంపిక జనసేన శ్రేణుల్ని ఏమాత్రం సహించని విషయమే. ఎందుకంటే.. గతంలో పోటీ చేసిన ప్రతీసారి ఆయన విజేతలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. అదే సమయంలో పడాల భూదేవీ కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లడంతో.. ఈ ఇద్దరూ అందులో చేరి టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఈలోపు జనసేన నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపు రావడంతో జనసేన శ్రేణులు తమ అభ్యర్థే పోటీ చేయబోతున్నట్లు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు.. బాబు కుట్ర రాజకీయమే ఫలించి టీడీపీ నుంచి చేరిన జయకృష్ణకే టికెట్ దక్కింది. పోటీ చేయడానికి జనసేనలో సరైన అభ్యర్థులే లేరా?.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని మరీ వారికి పవన్ టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసేన నేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని చెబుతూ.. ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం టైం పాస్ వ్యవహారమేనని పవన్ చేష్టలతో ఇప్పుడు అర్థమవుతోంది కదా!. -
పవన్తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు పవన్ కల్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కల్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది అన్నీ ఆధారాలను బయటపెడతాను కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు? సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా? విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు? పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా! మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా.. అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా? మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా? పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు కులాల మధ్య కుట్రలకు తెరలేపారు గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్? అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు? అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం నాదెండ్లా(నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది ‘‘కొత్తతరం నేతల్ని పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్కు పోతిన మహేష్ చురకలు అంటించారు. ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్ పవన్ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు. అయినా కూడా మహేష్ సీటు కోసం ప్రయత్నించారు. పవన్పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ను పవన్ దగా చేశారు. పవన్ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్ తదుపరి రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది. -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
చుక్కాని లేని జనసేనాని
విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఒక సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. ఇవి చాలదన్నట్లు ఆయన కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉంటుందా?స్థాపించి నిండా పది సంవత్సరాలు గడిచినా తన సిద్ధాంతాలు ఏమిటో తెలియని రాజకీయ పార్టీ ఒకటి ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి అయినా సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలన్నవి చుక్కాని వంటివి. కానీ పవన్ కల్యాణ్ 2014లో స్థాపించిన జనసేన పార్టీకి నేటి వరకు కూడా ఒక సిద్ధాంత పత్రం ఏమీ లేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా వారు మేనిఫెస్టో ఏదీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటి. అక్కడి అయిదు కోట్లమంది ప్రజలు అనేక రంగాలలో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా క్రియాశీలంగా ఉన్న వివేకవంతులు. అటువంటి రాష్ట్రానికి సారథ్యం వహించగోరే ఒక పార్టీ ఇంత దారీ తెన్నూ లేని విధంగా సాగుతుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటివి ఆలోచించదగిన విషయాలనే స్పృహ అయినా ఆ పార్టీ అధ్యక్షునికి ఉందా అనే అనుమానం కలుగుతున్నది. పవన్ కల్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టినట్లు? పెట్టిన ఈ పదేళ్లుగా ఏమి చేసినట్లు? మునుముందు ఏమి చేయాలన్నది తన ఆలోచన? తన మాటలను, చేతలనుబట్టి చూస్తే రాజకీయ పరిశీలకు లకు ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు అయినా స్పష్టమైన సమాధానాలు కన్పించటం లేదు. ఆయన పార్టీ ప్రకటించిన 2014లో ఆంధ్రప్రదేశ్ ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడి పోయింది. విభజిత రాష్ట్రం అనేక వనరులను కోల్పోయింది. రాజ కీయ పార్టీలకు, సాధారణ ప్రజలకు కూడా కొత్త రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెట్టాలనేది ఒక పెద్ద సమస్య. అప్పటి పరిణామాలన్నీ వారికి మానసికంగా కూడా కొంత అయోమయాన్ని సృష్టించాయి. అటువంటి స్థితిలో ఏర్పడే ఒక కొత్త రాజకీయ పార్టీ తనదైన విధంగా సమాధానాలను వెతకాలి. వాటిని ఒక సిద్ధాంత పత్ర రూపంలో రూపొందించి ప్రజల ముందుంచాలి. ఆ మేరకు స్వయంగానూ, ఏకీ భావం గల ఇతర పార్టీలు, వర్గాలతోనూ కలిసి కార్యాచరణను చేప ట్టాలి. కానీ ఇటువంటిదేమీ చేయలేదు. నేటికీ చేయటం లేదు. ఇది ఒక కోణం కాగా, మరొక కోణాన్ని చూద్దాము. పవన్ కల్యాణ్ సామాజికంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ బలమైన వర్గం. అయినప్పటికీ రాజకీయాధికారం తమకు లేకుండా పోయిందని, దానిని అందు కోవాలనే కోరిక వారిలో బలంగా ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం గట్టి ప్రయత్నాలు మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో పి. శివశంకర్ ఆధ్వర్యాన జరిగాయి. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి కూడా ఈ సామాజిక తరగతులను కదిలించారు. ఆ ప్రయత్నాలు విఫల మయ్యాయి. తర్వాత చిరంజీవి రాకతో వారిలో తలెత్తిన ఆశలు కూడా ముందుకు సాగలేదు. ఇపుడు ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ను వారిలోని కొందరు తమ వాడు అనుకోవటం తప్ప ఆశాభావాలు గత రెండు విడతలలోనూ ఎంత మాత్రం కనిపించటం లేదు. అందుకు ఒక కారణం ఆయన... శివశంకర్, చిరంజీవి వంటి గౌరవ ప్రతిష్ఠలను, నమ్మకాన్ని సంపాదించు కోలేక పోవటం. రెండు – తనలో అటువంటి పరిణతిగానీ, దార్శనికత గానీ ఉన్నా యనే అభిప్రాయం ఆ వర్గం వారికి 2014లో గానీ, తర్వాత ఈ పదే ళ్లలోగానీ ఏర్పడక పోవడం. మూడు – ఒక పార్టీని సీరియస్గా నడిపే ఆలోచన, దక్షత, స్థిరత్వం, వ్యవహార ధోరణి అసలెప్పుడూ కన్పించక పోవటం. నాలుగు – పైన అనుకున్నట్లు తన సిద్ధాంతాలు, విధా నాలు, ప్రణాళికలు, ఆ ప్రకారం ఆచరణలు ఏమిటో అర్థం కాక పోవటం. అయిదు – సినిమాలలో కావలసిన కొన్ని లక్షణాలకు, సీరి యస్ రాజకీయాలకు అవసరమైన పద్ధతులకు మధ్య తేడా పాటించక తన విలువను తానే తగ్గించుకోవటం. దానితో, కాపులలోని యువతరానికి పవన్ కల్యాణ్ పట్ల ఇతర త్రానూ గల సినిమాటిక్ ఆకర్షణ రాజకీయ ఆకర్షణగా మారటం తప్ప, వారిలోని ఇతరులకు ఆయనపై తమనేదో ఉద్ధరించగలడనే ఆశా భావం ఏమీ కలగటం లేదు. గత ఎన్నికల ఫలితాలు ఇందుకొక స్పష్టమైన సూచన. గమనించదగినదేమంటే, ఒకవేళ ఆయన శివశంకర్, చిరంజీవిల వలె తమ సామాజిక వర్గాన్ని, ఇతర బడుగు, బల హీన వర్గాలను కూడదీసే ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్ర రాజకీ యాలలో మూడవ ధ్రువం ఏర్పడే అవకాశం ఉండేది. వ్యక్తిగతంగా తనకు ఆ దార్శనికత, సమర్థత ఉన్నట్లు కనిపించదనేది వేరే విషయం. కానీ కనీసం సూత్రరీత్యా అటువంటి అవకాశం ఉండేది. ఈ పరిస్థితుల దృష్ట్యా పవన్ కల్యాణ్ గత పది సంవత్సరాలలో ఎటువంటి విలువనూ పెంచుకోలేక పోయారు. తనకు సంబంధించి అంతా సినిమాటిక్ గానే కనిపిస్తుంది. జనసేన అనే పేరు, కార్యకర్తలను సైనికులు అనటం, మహిళా సభ్యులను వీర మహిళలనటం, ఎక్కడైనా సమస్య కనిపిస్తే తోకచుక్క తెగిపడినట్లు వచ్చి హడావిడి చేసి మాయమవటం తప్ప అందుకు కొనసాగింపు లేకపోవడం, ప్రసంగాలలో దురుసుతనం, వీరాలా పాలు, అందుకు తగినట్లు సినిమా లలో వలెనే హావభావాలు. ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్య రాష్ట్రం ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటుండిన దశలో, ఒక సిద్ధాంతం, విధానాలంటూ లేకుండా ఒక పార్టీని నెలకొల్పటం, పదేళ్లయినా అదే పరిస్థితి ఉండటం, రాజకీయాధికారాన్ని కోరుకుంటున్న తన సామాజిక వర్గా నికి ఎటువంటి ఆశాభావాన్ని కల్పించలేక పోవటం, చివరకు పార్టీ నిర్వహణ సైతం గందరగోళంగా సాగుతుండటాన్ని బట్టి, పవన్ కల్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్లో, నిజమైన అర్థంలో ఒక నికరమైన, స్థిరమైన, సీరియస్ రాజకీయ పార్టీ అనే గుర్తింపును, గౌరవాన్ని సంపా దించుకోలేక పోయింది. సిద్ధాంతాలు, లక్ష్యాల మాట ఇలా ఉంటే, జనసేన అధ్యక్షుని ఎన్నికల వ్యవహరణ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకి. కానీ ఆ విషయంలో డబుల్ గేమ్ ఆడిన టీడీపీ అ«ధ్యక్షుడు చంద్రబాబును 2014 ఎన్నికలలో బలపరిచారు. చంద్ర బాబు రైతాంగానికి, పేదలకు నష్టం చేసినందున 2004లో, 2009లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి. అదే విధంగా, రాష్ట్ర విభజ నను పూర్తిగా బలపరచిన బీజేపీతోపాటు అపుడు చంద్రబాబు వెంట నిలబడ్డారు. తర్వాత 2019 ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేశారు. అప్పటికి అయిదేళ్లు రాజకీయం చేసినా, తన సామాజిక వర్గం పెద్ద సంఖ్యలోగల గాజువాక, భీమవరం స్థానాల నుంచి స్వయంగా పోటీ చేసి కూడా ఓడారు. అయిదేళ్లలో తన సిద్ధాంతాలేమిటో చెప్ప లేదు. సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పేరిట తమ వారినీ ఒప్పించ లేక పోయారు. ఆ వర్గానికి కంచుకోటలైన జిల్లాలు అంతటా అదే పరిస్థితి ఎదురైంది.విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ తనకు సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. సోదరుడు చిరంజీవి రాజకీయాలలో ఉండినప్పటిలా తన సామాజిక వర్గంగానీ, ఇతర బడుగు బలహీన వర్గాలుగానీ ఆయనను ఒక ఉద్ధారకునిగా ఏమీ చూడటం లేదు. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. తీరా అందులో గెలిచేదెన్ని, తమ కూటమి అధికారానికి రాగలదనే హామీ ఎంత అనేవి ఎవరికీ అంతు పట్టని ప్రశ్నలయ్యాయి. మౌలికంగా చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉండగలదా? - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు - టంకశాల అశోక్ -
PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?
కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. గత ఎన్నికల్లో 130 ఫ్లస్ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్కు నిరసన తగిలింది. పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్ నామినేషన్ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్పైనే ప్రయోగిస్తున్నారు. తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్లలో తనపై బ్లేడ్లతో దాడి జరిగిందంటూ ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు. ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే ట్యాగ్లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్ బాబ్జీ అంటూ పవన్కు మరో ట్యాగ్ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్తో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలా పవన్ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు. -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్
సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba — JanaSena Party (@JanaSenaParty) April 4, 2024 అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. -
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
Pawan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
సాక్షి, కృష్ణా: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
Pawan Kalyan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. పిఠాపురం జనసేన నేతలతో పవన్
పిఠాపురం: ‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన నేతలందరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరుతో ఫొటో దిగాలని ఉందని, పరిస్థితులు అనుకూలించగానే రోజుకు 200 మందితో ఫొటోలు దిగాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన విజయం కోసం స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెజారిటీ ఎంత తీసుకురావాలనేది వారిపైనే వదిలేస్తున్నానని, వారు పడే కష్టం మీదే తన మెజారిటీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, పాలకొండకు చెందిన నిమ్మక జయకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. సాయంత్రం పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతా టీడీపీ నేతలతోనే అని పవన్ అంటుంటే.. ఇక తామెందుకు అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటే ఎవరి కిందో పని చేయాలనడం ఎంత వరకూ సమంజసమంటూ పవన్ తీరుపై వారు రుసరుసలాడుతున్నారు. -
Jana Sena: పెండింగ్ స్థానాలు ఇక వాళ్లకే!
గుంటూరు, సాక్షి: పొత్తుల ప్రకటన మొదలు, చంద్రబాబు నుంచి సీట్లు దక్కించుకోవడం, అభ్యర్థుల ఎంపిక.. ఇలా అన్నింటా పవన్ కల్యాణ్ ఇంతలా అయోమయానికి గురవుతారని పదేళ్లు ఆయన వెంట నడుస్తున్న నేతలెవరూ ఊహించి ఉండరు. పైగా మునుపెన్నడూ లేనంత కుట్ర పూరిత రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జెండాలు మోసే వారి కంటే, జెండాలు మార్చే వారికే విలువ పవన్ ఇస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. నమ్ముకున్నవాళ్లకు సైతం పవన్ వెన్నుపోటు పొడుస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. కేడర్ బలం కంటే ధనబలానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ తీరును నిరసిస్తూ పలువురు పార్టీని వీడారు. కొందరైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆగాలనుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంకా గుడ్డిగా పవనే నమ్ముకుంటున్నారు. పెండింగ్లో ఉన్న విశాఖ సౌత్, ఆళ్లగడ్డ, పాలకొండలోనూ జనసేన అసలైన నేతలకు మొండిచేయే దక్కనున్నట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ పేరు నుంచి తొలి నుంచి వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ వంశీని ఎమ్మెల్సీని చేస్తే.. పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారాయన. అయితే విశాఖ సౌత్ నియోజకవర్గం హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు తొలి నుంచి ప్రచారం ఉంది. అయితే.. జనసేనలో తామేమీ గొర్రెలం కాదని, వంశీకి సీటు ఇస్తే ఊరుకునేది లేదంటూ జనసేన నేతలు అక్కడ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో వంశీ తన అనుచరులతో వీరమహిళలపై దాడి కూడా చేయించారు. అయినప్పటికీ పవన్ మాత్రం వంశీకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్ను పక్కనపెడితే.. అవనిగడ్డ(కృష్ణా), పాలకొండ(మన్యం) అభ్యర్థుల కోసం జనసేన తీవ్ర కసరత్తులు చేసింది. పవన్ గొంతుతో ఐవీఆర్ఎస్ సర్వేలు సైతం నిర్వహించింది. మరోవైపు.. తాజాగా జనసేనలో చేరికలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కేడర్ను కాదని బయటివాళ్లకే అవకాశం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారనే చర్చ ఊపందుకుంది. పాలకొండలోనూ.. పాలకొండ ( పార్వతీపురం మన్యం జిల్లా) టికెట్ను నిమ్మక జయకృష్ణకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న జయకృష్ణ.. ఇవాళ జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ‘‘ పార్టీ ఏది అయితే నేమి కూటమిలోనే ఉంటాం కదా’’ అని ఆయన అనుచరులు సైతం మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాలకొండలో రాజకీయ కుటుంబంగా ఉన్న జయకృష్ణ.. వరుసగా పోటీ చేస్తున్నారే తప్ప గెలవడం లేదు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. ఇక ఇక్కడ హ్యాట్రిక్పై వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి కన్నేశారు. అవనిగడ్డ బరిలో ఆయన? కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లింది. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పవన్ చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు. మండలి బుద్ధప్రసాద్ ఇవాళ అధికారికంగా జనసేనలో చేరనున్నారు. దీంతో సీటు దాదాపుగా ఆయనకే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అవనిగడ్డ నుంచి మూడు పర్యాయాలు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గానూ పని చేశారు. ఇప్పుడు ఈయన కూడా జనసేన తరఫునే పోటీకి దిగడం దాదాపుగా ఖరారయ్యింది. అవనిగడ్డలోనూ పవన్ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. కృష్ణారావుతో పాటు శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ (టివి9)లాంటి పలువురు అభ్యర్థుల పేర్లనూ పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచే వలస వస్తున్న సీనియర్ నేతకు పవన్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఈ పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థి ప్రకటన
కృష్ణా, సాక్షి: పెండింగ్ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే.. పెండింగ్లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల కోసం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ సీటును వంశీ యాదవ్కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్ వాయిస్తో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది. -
పిఠాపురంలో పవన్ గెలవడు: ముద్రగడ
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్ వల్లే పవన్ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్కు సినీ గ్లామర్ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్. రాజకీయాలు పక్కనపెట్టి పవన్ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్ జగన్ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్ ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
March 27th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 27th Latest News Telugu.. 9:04 PM, March 27th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 7:06 PM, March 27th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి. లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతా: పరిపూర్ణానంద ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు. పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించా 6:06 PM, March 27th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 5:06 PM, March 27th 2024 ‘మేము సిద్దం’ బస్సు యాత్రకు గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం జనసంద్రంగా మారిన యర్రగుంట్ల గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యం ప్రొద్దుటూరుకు భారీగా చేరుకున్న ప్రజలు 4:58 PM, March 27th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయునిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో యర్రగుంట్ల మీదగా ప్రొద్దుటూరు చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరు బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 4:34 PM, March 27th 2024 అధికారంలో వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం.. ప్రజాగళం సభలో చంద్రబాబు నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 3:55 PM, March 27th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 3:39 PM, March 27th 2024 నెల్లూరు సిటీలో నారాయణ చేసిన అభివృద్ధి ఓ బూటకం మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్ది ఫైర్ నెల్లూరు సిటిలో నారాయణ చేసిన అభివృద్ధి బూటకం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో నారాయణ.. హడ్కొ ద్వారా 11 శాతం వడ్డీతో 90 శాతం అప్పు తీసుకొచ్చారు.. టీడీపీ ప్రభుత్వం నుంచి సాయం శున్యం 830 కోట్లు అప్పు తీసుకుని పనులు కూడా పూర్తి చేయలేని అసమర్ధుడు పొంగూరు నారాయణ. 2019లో కేంద్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు, రాష్ట్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు.. స్మార్ట్ సిటీ జాబితాలో నెల్లూరుని చేర్చి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా నెల్లూరు అభివృద్ధి జరిగేది రాజకీయాలకు నారాయణ సరిపోరు.. ఆయనోక అపరిచితుడు.. పని ఉంటే ఒకలా.. పని లేకపోతే మరోలా ప్రవర్తిస్తారు రూ 1100 కోట్లతో కేవలం రెండేళ్లలో పెన్నా నది.. సర్వేపల్లి కాలువ రిటైన్ వాల్స్.. పెన్నాపై కొత్త వంతెన వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి నెల్లూరు జిల్లా అభివృద్ధి.. 2007,2008,2009లో వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది. 3:29 PM, March 27th 2024 ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఈ చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరణ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉన్న సినిమా చర్యలు కోరిన లేళ్ల తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 1:25 PM, March 27th 2024 ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై అనర్హత పిటిషన్ ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్ 1:20 PM, March 27th 2024 సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ దేశంలోనే ఎక్కడలేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేశారు ఇప్పటివరకు మాటలు చెప్పే నేతలే తప్ప సీఎం జగన్ చేసినట్టు చేతల్లో చూపించే నేతలు దేశంలో లేరు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కామెంట్స్.. ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్ను జనం అభ్యర్థిగా చూస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయం తథ్యం 1:00 PM, March 27th 2024 చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్.. గుడివాడలో ఐదోసారి నేను గెలవబోతున్నాను. ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు ఎంత మంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను. గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్ చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం 12:45 PM, March 27th 2024 మేమంతా సిద్ధం యాత్ర.. పచ్చ మందలో టెన్షన్! మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలకు మధ్యకు సీఎం జగన్. సీఎం జగన్ యాత్రలో పచ్చ మందలో టెన్షన్! జగనన్న మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/29WsfAYt6w — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 12:30 PM, March 27th 2024 లోకేష్ నుంచి అంతే ఆశించగలం: వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే. అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుంది. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్లకు టికెట్లు ఇచ్చారు. వీరికి టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం. 12:10 PM, March 27th 2024 కూటమికి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కాడు. బోండా ఉమ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్కు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు. గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబుని పెద్ద దొంగ అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ముగ్గురు దొంగలే. సీఎం జగన్కు రాష్ట్రంలో జన బలం ఉంది. 11:41 AM, March 27th 2024 ప్రజాగళం.. పలమనేరు బయల్దేరిన చంద్రబాబు నేటి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత పలమనేరు నుంచి ప్రజాగళం ప్రారంభం రోజుకి నాలుగు నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్మ్యాప్ రూపొందించిన టీడీపీ కాసేపటి కిందట కుప్పం నుంచి పలమనేరుకు బయల్దేరిన చంద్రబాబు 11:20 AM, March 27th 2024 కుప్పంలో చంద్రబాబు ఓటమి ఫిక్స్.. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదం. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చూలు పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్ళే పాల్గొన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇచ్చాము. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది. కోర్టును శాసించే హక్కు మాకు లేదూ. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగతొక్కారు. చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా కేటాయించారా?. 11:00 AM, March 27th 2024 టీడీపీ, చంద్రబాబకు దేవినేని అవినాష్ కౌంటర్.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం జగన్. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం జనసేన అధినేత పవన్ను సైతం చంద్రబాబు మోసం చేశారు జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇస్తాం 10:30 AM, March 27th 2024 కూటమికి అభ్యర్థి కరువు.. అనపర్తిలో కూటమికి అభ్యర్థి కరువు అభ్యర్థులు దొరక్క అనపర్తి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న కూటమి నేతలు. బీజేపీ తరఫున అనపర్తిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు లేరు. దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూటమి నాయకులు 10:00 AM, March 27th 2024 ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ప్రొద్దుటూరులో మేము సిద్ధం సభ ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు ఫ్లెక్సీలను చించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాచమల్లు ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు. సీఎం సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించేశారు. సభా కార్యక్రమాలను ఆటంకం కలిగే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదంటూ టీడీపీ అభ్యర్ది వరదరాజులరెడ్డి సొదరుడు రాఘవరెడ్డి బెదిరిస్తున్నాడు. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేయాలి. 8:45 AM, March 27th 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ వెంటే ప్రజలు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధం. సీఎం జగన్ రాక కోసం వేచిచూస్తున్న ప్రజలు. ఎన్నికల సమరానికి తెరతీస్తూ నేడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం🔥#MemanthaSiddham #YSJaganAgain#VoteForFan pic.twitter.com/CTGG2ovhZd — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 8:00 AM, March 27th 2024 టీడీపీ, జనసేనకు షాక్ కోడూరు మండలంలో టీడీపీ, జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్.. పేదలకు ఉపయోగపడే వ్యవస్థలపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి గ్రామ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని చెప్పటం టీడీపీ తీరుకు నిదర్శనం గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు చంద్రబాబుని, పవన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగనన్నకు మద్దతు పలుకుతున్నారు. పేదల కోసం చేపట్టిన పనులు అమలు చేసి సీఎం జగన్ సఫలీకృతుడయ్యారు సీఎం జగన్ మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు 7:30 AM, March 27th 2024 బాబు, పవన్పై ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఫైర్ వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణం వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై భరత్ సీరియస్ చంద్రబాబు, లోకేష్, పవన్ చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై @JaiTDP నేతలు కత్తి కట్టడం దారుణం@ncbn, @naralokesh, @PawanKalyan చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు -రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్#YSJaganDevelopsAP#APVolunteers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/ctYANQ5pu0 — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 7:15 AM, March 27th 2024 నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం. ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి 99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత 175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 7:00 AM, March 27th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 6:45 AM, March 27th 2024 దిక్కుతోచని ‘కూటమి’! పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్ మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి 6:30 AM, March 27th 2024 టీడీపీలో తిరుగుబాటు.. అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంతో నిరసన పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం -
March 26th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 26th Latest News Telugu.. 06:40 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు) కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ 06:17 PM, March 26th 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 06:05 PM, March 26th 2024 అమరావతి: ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం నిత్యం వైఎస్సార్సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం 05:50 PM, March 26th 2024 విజయవాడ: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్సీపీకి అడ్డా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు -షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 05:40 PM, March 26th 2024 తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం. అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా? బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి 05:30 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి) మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 05:25 PM, March 26th 2024 వైఎస్సార్సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య 05:20 PM, March 26th 2024 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 05:18 PM, March 26th 2024 టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం 05:15 PM, March 26th 2024 పల్నాడు : పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అమరావతిలో వైఎస్సార్సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్ సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు 05:13 PM, March 26th 2024 ఏలూరు : నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట 05:12 PM, March 26th 2024 AP: ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం 05:11 PM, March 26th 2024 అమరావతి : రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ 04:45 PM, March 26th 2024 బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం. పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు. పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం 03:41 PM, March 26th 2024 రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే హైదరాబాద్ లో హల్చల్ చేసిన రఘురామ మనుషులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ 03:39 PM, March 26th 2024 కర్నూలు : కలకలం రేపుతున్న ఆడియో రికార్డు ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ 02:51 PM, March 26th 2024 విజయవాడ: వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది 02:49 PM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి 02:34 PM, March 26th 2024 అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు మాడుగుల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు 01:47 PM, March 26th 2024 వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు వలంటీర్లను టెర్రెరిస్ట్లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు వైఎస్సార్సీపీ ఎవ్వరికి భయపడదు ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది స్టీల్ ఫ్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి? చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా? రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది 01:47 PM, March 26th 2024 టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు సుధీర్రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు 01:31 PM, March 26th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 01:26 PM, March 26th 2024 నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్ బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా? నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? : రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు 01:16 PM, March 26th 2024 విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక 12:28 PM, March 26th 2024 కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం 12:25 PM, March 26th 2024 ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్రెడ్డి హైదరాబాద్లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి 12:19 PM, March 26th 2024 తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 12:01 PM, March 26th 2024 వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్ జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో.. ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు? ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు 11:24 AM, March 26th 2024 ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ సీఎం రమేష్పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు 11:19 AM, March 26th 2024 అనపర్తి టీడీపీలో కలకలం అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్ మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత 11:17 AM, March 26th 2024 టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది 11:03 AM, March 26th 2024 అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం 10:05 AM, March 26th 2024 వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు.. వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు. సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. 09:26 AM, March 26th 2024 మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్ టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక 09:22 AM, March 26th 2024 విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..? వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్ ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు.. ఆందోళనలో వంశీ వర్గీయులు.. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్ జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్ 09:13 AM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు చంద్రబాబు మాటమీద నిలబడడు వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు 08:56 AM, March 26th 2024 పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ 08:36 AM, March 26th 2024 కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు 08:31 AM, March 26th 2024 జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ మచిలీపట్నం ఎంపీ టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్ బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్ ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్ 08:26 AM, March 26th 2024 సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్ ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్ను బరిలోకి దించేందుకు సన్నాహాలు సూరి, శ్రీరామ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం 08:13 AM, March 26th 2024 మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్ చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం 87శాతం మందికి సంక్షేమం అందించాం ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు పర్సనల్గా పవన్ను చూస్తే జాలేస్తోంది అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ లేదు రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు 07:52 AM, March 26th 2024 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం మూడు విడతలుగా ప్రచారం రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు 07:21 AM, March 26th 2024 ‘శవా’లెత్తిపోతున్న టీడీపీ వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం నల్లమాడ మండలంలో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి హత్య టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్ 07:15 AM, March 26th 2024 ‘దేశం’లో కమలం కల్లోలం ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక పలువురు టీడీపీ నేతల రాజీనామా రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణకు అందజేత అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు 07:02 AM, March 26th 2024 ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్ కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు 06:50 AM, March 26th 2024 రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’.. ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe — YSR Congress Party (@YSRCParty) March 25, 2024 06:47 AM, March 26th 2024 ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే 06:43 AM, March 26th 2024 వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం -
‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ.. బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరఫున డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి ఆ మార్క్ను ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వాళ్లను సైతం పక్కనపడేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తోంది. అందులో ఇప్పటిదాకా 18 మంది అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. ఇందులో కేవలం రెండే స్థానాలను(అనకాపల్లి, నరసాపురం) బీసీలకు కేటాయించారాయన. అందులో.. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా, చేనేత కులాలల ప్రస్తావన లేదు. ఇక ఓసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. మైనారిటీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు(నో టికెట్). జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి.. వీర మహిళలెవరూ పోటీకి పనికి రారనే సంకేతాలు పంపించినట్లు ఉంది. ఇక.. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో ఆయన అనుసరించిన తీరును జనసేన నేతలే మరీ దుర్మార్గమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్ . మొత్తంగా.. ధనసేన చేతిలో జనసేన నేతలుగా దగా పడ్డామనే మాట వినిపిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లు, గత ఎన్నికల్లో దారుణ ఓటమిపాలైనా కూడా పక్కపార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరిన కొందరు ఉన్నారు. ఆ లిస్ట్లో బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ నేతల అనుచరులు ఏమాత్రం భరించలేకపోతున్నారు. -
March 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 25th Latest News Telugu.. 9:10PM, March 25th 2024 పశ్చిమ గోదావరి జిల్లా: ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చినాక మరో లెక్క: పీవీఎల్ నరసింహ రాజు, ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ పేదలందరూ సీఎం జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆక్వా రైతుల్ని జగన్మోహన్రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు సీఎం జగన్ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల వల్లేసాధ్యం పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం. నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ చంద్రబాబుటీడీపీ బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు 7: 05PM, March 25th 2024 విశాఖ: వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్ వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి 6: 20PM, March 25th 2024 ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ను మోసం చేశారు ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి 6:18 PM, March 25th 2024 గుంటూరు మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు 6:15 PM, March 25th 2024 విజయవాడ పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ 6:12 PM, March 25th 2024 జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా 6:10 PM, March 25th 2024 బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను పిఠాపురంలో మా విజయం తధ్యం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు 6:08 PM, March 25th 2024 బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ 6:05 PM, March 25th 2024 కాకినాడ: జనసేనలో మహిళలకు గౌరవం లేదు జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది. ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు. జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను. 5:08 PM, March 25th 2024 అనకాపల్లి జిల్లా: టీడీపీలో మంటలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు 5:01 PM, March 25th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ 4:33 PM, March 25th 2024 YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత 3:57 PM, March 25th 2024 శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్ అమరావతి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం కడప: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్ కృష్ణా : అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు 3:48 PM, March 25th 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు బాటలోనే పవన్ సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు 3:18 PM, March 25th 2024 ఏపీ బీజేపీ లిస్టు రెడీ.! రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి 3:05 PM, March 25th 2024 చిత్తూరు జిల్లా: టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 2:43 PM, March 25th 2024 పిఠాపురంపై పవన్లో పెరుగుతున్న ఆందోళన సీన్ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్కళ్యాణ్ సమాలోచనలు నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం ఈసారికి హెల్ప్ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు పవన్ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు 2:35 PM, March 25th 2024 టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు. ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం.. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం. 2:25 PM, March 25th 2024 సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్ ఒక పవిత్ర ఆత్మను చంపేశారు సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది వీలైతే కొత్త చట్టాలను తేవాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు జనాన్ని భయపెడుతున్నారు ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్ తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్ 2:21 PM, March 25th 2024 అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు 2:16 PM, March 25th 2024 నో టికెట్.. జీవీఎల్ వీడియో సందేశం విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్ వీడియో సందేశం విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించింది విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక కమిట్ మెంట్ తో చేసేవి త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం విశాఖ అభివృద్దే లక్ష్యం విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా 1:52 PM, March 25th 2024 తిరుపతి టికెట్ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ 1:46 PM, March 25th 2024 ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి 1:35 PM, March 25th 2024 ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో పెట్టిన కూటమి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ టీడీపీ -7, జనసేన - 3 పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు. 1:20 PM, March 25th 2024 కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది. ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను. జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను. దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు. ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు. 1:05 PM, March 25th 2024 చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి? సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు బుకాయింపులు వద్దు. చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ.. 12:55 PM, March 25th 2024 ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రచార షెడ్యూల్పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి 12:40 PM, March 25th 2024 బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని వెస్ట్లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్పై పెద్ద కుట్ర జరుగుతోంది మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం సీఎం జగన్ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్కు టిక్కెట్ ఇచ్చారు మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 12:20 PM, March 25th 2024 పొత్తులో సీటు చిచ్చు.. అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్ అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్ భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 12:00 PM, March 25th 2024 రఘురామకు బీజేపీ కౌంటర్ రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ఆర్ఆర్కు నో ఛాన్స్ జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 11:36 AM, March 25th 2024 పవన్పై నమ్మకం ఉంది: పోతిన మహేష్ విజయవాడ వెస్ట్లో తేలని టికెట్ పంచాయితీ జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్ కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్ ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్ పవన్పై నమ్మకం ఉంది: మహేష్ నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్ 11:03 AM, March 25th 2024 కుప్పంలో భారీగా మద్యం పట్టివేత? చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు 10:47 AM, March 25th 2024 బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా? రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్ టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్ వంశీ యాదవ్కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్ సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్ ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు 10:02 AM, March 25th 2024 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం 09:38 AM, March 25th 2024 చివరకు బండారు ఇలా.. పెందుర్తి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కకపోవడంతో మనోవేదన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల పల్స్ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్లోనూ నో టికెట్ పెందుర్తి టికెట్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ 09:27 AM, March 25th 2024 అద్దెకు మరో జనసేన కార్యాలయం జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఆఫీస్కు తాళం పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్ బోర్టు కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 09:10 AM, March 25th 2024 పవన్.. మరీ ఇంత దుర్మార్గమా? ధనసేన చేతిలో జనసేన నేతలు దగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్ 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్ హ్యాండ్ ఇచ్చిన లిస్ట్ పెద్దదే 08:40 AM, March 25th 2024 సీ-విజిల్ యాప్.. అనంతలో 29 మంది సస్పెండ్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్ గౌతమి ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్ 08:30 AM, March 25th 2024 గీత టికెట్పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి 08:12 AM, March 25th 2024 నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్రెడ్డి కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్ పిల్లి సూర్యప్రకాష్కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం 07:45 AM, March 25th 2024 మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్ తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి బస్సుయాత్రతో వైఎస్సార్సీపీ కేడర్లో మరింత జోష్ 07:28AM, March 25th 2024 నేడు కుప్పానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం సెంటర్లో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు హంద్రినీవా పరిశీలన 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 07:26AM, March 25th 2024 ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్కి అనకాపల్లి ఎంపీ టికెట్ కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం సీఎం రమేష్కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్ నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్ ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్కి తిరుపతి టిక్కెట్ ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్ 07:04AM, March 25th 2024 ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’ అధికార వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్ పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ఇంటెరాక్షన్లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే. నాతో నడిచిన మీకూ అలవాటే... కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/GGPuif7Ig2 — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 06:57AM, March 25th 2024 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్ రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ అమిత్ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్ కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడని స్పష్టీకరణ 06:52AM, March 25th 2024 లోకేష్ ఎక్కడికెళ్లినా.. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్కు చుక్కలు ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా చివరకు అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్ మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన? ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం 06:48AM, March 25th 2024 ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా? వలసలకే సీట్లా?.. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ ఈ మధ్యే చేరిన కిరణ్కుమార్రెడ్డికి రాజంపేట పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు సీనియర్లలో తీవ్ర ఆవేదన వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్ బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్ 06:35AM, March 25th 2024 బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ ఎన్ఆర్ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్ బాబు, లోకేష్ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం! 06:30AM, March 25th 2024 టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు సీట్లు రాక పలుచోట్ల రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్లు వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ ఏలూరు ఎంపీ టికెట్పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద -
ఎన్నికల బాండ్లలోనూ తిరకాసే!
ఎన్నికల బాండ్ల విషయంలో ఎల్లో మీడియా ఏడుపులు మాములుగా లేవు. అయితే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపేణా భారీగానే డబ్బును మూటగట్టుకుంది. ఇక గుర్తింపులేని జనసేన కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ద్వారా ఏయే పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా రూ.80 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను విరాళంగా టీడీపీ స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. టీడీపీకి ఎన్నికల బాండ్లు విరాళాలుగా సమర్పించిన వాళ్లలో.. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ.28 కోట్లతో రెండోస్థానంలో నిలిచాయి. యూపీ పవర్ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ రూ.14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ రూ.13 కోట్లు.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల లిమిటెడ్ రూ.10 కోట్లు ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్ఫెసిలిటీ మేనేజ్మెంట్ తరఫున రూ. 5 కోట్లు ఇచ్చింది. ఇక జనసేన సంగతి భిన్నంగా ఉంది. సాధారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు వచ్చిన దాఖలాలు లేవు. అయితే.. బీజేపీ, టీడీపీ కూటమి భాగస్వామి, జనసేన మాత్రం ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించింది. పవన్ కల్యాణ్ పార్టీకే కాదు.. 2019-21 మధ్య గుర్తింపు లేని ఏ ఒక్క పార్టీకి కూడా విరాళాలు రాలేదు. కానీ, 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. కొత్త పార్టీలు లేదంటే మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా ఈసీ ప్రకటిస్తుంది. తద్వారా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలవడం కొసమెరుపు. -
March 21st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 09:17 PM, మార్చి 21 2024 నెల్లూరు జిల్లా: కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేని సోమిరెడ్డి ఎన్నికలు దగ్గర పడడంతో నానాయాగి చేస్తున్నాడు: మంత్రి కాకాణి సర్వేపల్లి టికెట్ విషయంలో చంద్రబాబు అనేక రకాల సర్వేలు చేసినా.. ఏ సర్వే కూడా టీడీపీ కి అనుకూలంగా రాలేదు గత్యంతరం లేక సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు పేర్లు పరిశీలిస్తున్నారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు 08:30 PM, మార్చి 21 2024 విశాఖ: జనసేన కార్యకర్తలు ఆరుగురిపై కేసు నమోదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ అనుచరులు.. నిన్న సాదిక్ పార్టీ ఆఫీస్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు జనసేన కార్యకర్తలు ఆరుగురుకి 15 రోజులు రిమాండ్ విధించిన కోర్టు 08:00 PM, మార్చి 21 2024 శ్రీకాళహస్తి: టీడీపీ నేతల్లో తారాస్థాయికి చేరిన అసమ్మతి టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి వినుత భేటీ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీల నాయకులు రహస్య భేటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కోలా ఆనంద్ ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత కోలా ఆనంద్, పొత్తు ధర్మం పాటించాలని, శ్రీకాళహస్తి బీజేపీకి కేటాయించాలని డిమాండ్ 07:02 PM, మార్చి 21 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:30 PM, మార్చి 21 2024 అమరావతి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ముగిసిన మూడు జిల్లాల ఎస్పీల భేటీ. ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి వివరణ అడిగిన ఏపీ సీఈఓ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈఓ ముగ్గురు ఎస్పీలిచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. 06:15 PM, మార్చి 21 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:02 PM, మార్చి 21 2024 ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, అనుచరులు దాడికి దిగారు నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు నా డ్రైవర్, మా కార్యకర్తలకి గాయాలయ్యాయి మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు నాపై హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోంది పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజంని ప్రోత్సహిస్తున్నారు -ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ని కోరాం ఈనాడు పత్రిక అడ్డగోలు రాతల పై ఫిర్యాదు చేశాం సీఎం జగన్ పై విషపు రాతల తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈనాడు పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరాం -నారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ నేత 05:45 PM, మార్చి 21 2024 కాకినాడ: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏటిమొగలోని 14,15 డివిజన్ లలో ప్రచారం ఏటిమొగ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహరం అందేలా కృషి చేస్తాను ఉప్పలంక నుండి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో రిలియన్స్ సీఎస్ఆర్ నిధులు అందించే పట్టుపదలతో ఉన్నాను ఏటిమొగ లో రోడ్లు,డ్రైన్లు నిర్మించి మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేశాను 05:42 PM, మార్చి 21 2024 నెల్లూరు: ప్రచారానికి వెళుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి సిటీ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, NDCC బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు తమ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాం -మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు 05:39 PM, మార్చి 21 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నారా లోకేష్ను కలిసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 05:30 PM, మార్చి 21 2024 అనకాపల్లి.. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో బయటపడే విభేదాలు మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న నిరసనలు ఎన్నారై పైల ప్రసా ద్కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అంటూ నిరసన టీడీపీ అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని డిమాండ్. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక.. 05:26 PM, మార్చి 21 2024 విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41-ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ లోకేష్ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ సీఐడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన లోకేష్ తరపు న్యాయవాదులు ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 04:40 PM, మార్చి 21 2024 టీడీపీకి టికెట్.. జనసేన కార్యకర్తల ఆందోళన.. రామచంద్రపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన.. జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు.. రామచంద్రపురం టికెట్ జనసేనకే ఇవ్వాలని డిమాండ్. .జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు.. నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్కు ఇవ్వడంపై ఆగ్రహం. 04:10 PM, మార్చి 21 2024 విజయవాడ: పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 03:38 PM, మార్చి 21 2024 మా ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో టీడీపీ కూటమి : వైవీ సుబ్బారెడ్డి మోదీ వస్తే తప్ప ప్రచారం చేయలేని పరిస్థితిలో వాళ్లు ఉన్నారు వారాహిని ఎన్నిసార్లు దించుతారు... ఎన్నిసార్లు ఎత్తుతారు 03:36 PM, మార్చి 21 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు 02:30 PM, మార్చి 21 2024 విజయవాడ విజయవాడ వెస్ట్లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడి కి 108 కొబ్బరికాయలు కొట్టి మరి వేడుకొంటున్న జనసేన కార్యకర్తలు 7రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు 02:15 PM, మార్చి 21 2024 మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారు కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారు బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారు మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోంది ఐఎంజీ స్కామ్కు ఆద్యుడు చంద్రబాబు రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 5 రోజుల్లోనే 400 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే బాబు ప్లాన్ చేశారు అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం ఇలాంటి అవినీతిపురుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి 02:12 PM, మార్చి 21 2024 స్కిల్ బిల్ పాండే చంద్రబాబు తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా ‘‘స్కిల్ బిల్ పాండే’’ చంద్రబాబు స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది -రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు వ్యాఖ్యలు 02:00 PM, మార్చి 21 2024 ముగిసిన బాబు-పవన్ భేటీ ముగిసిన చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కల్యాణ్ 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు-పవన్ భేటీ ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ 01:45 PM, మార్చి 21 2024 వలంటీర్ల మీద ఫేక్ ప్రచారం.. స్పందించిన ఈసీ వలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే.. ఫొటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యూలర్ ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈవో ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈవో FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 01:37 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ టికెట్ మాదే: అడ్డూరి శ్రీరామ్ విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలు ముగిశాయి.. బీజేపీకే టికెట్ 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది పొత్తులో త్యాగాలు సహజం, జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యలు 01:22 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి : పోతిన మహేష్ పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జి పోతిన మహేష్ వ్యాఖ్యలు 01:10 PM, మార్చి 21 2024 చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ 23,24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ 12:43 PM, మార్చి 21 2024 ఏపీ బీజేపీకి ఇంఛార్జిల నియామకం లోక్సభ ఎన్నికల వేళ మూడు రాష్ట్రాలకు ఇంఛార్జిల నియామకం ఏపీకి బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ 12:27 PM, మార్చి 21 2024 ఏపీలో నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ దివాళ తీసింది: విజయసాయిరెడ్డి 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను చూశాం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసింది బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ AP has already seen a “double-engine” sarkar between 2014-18 to realize that both the engines of BJP and TDP work in the opposite directions leading to policy paralysis, stagnation of rural economy and rampant corruption. Only, 1 district, 1 caste and 1 family prospers under TDP. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2024 12:02 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ ఎవరికో? విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్ టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ పట్టు మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు నిన్న పవన్ తో పోతిన మహేష్ భేటీ చర్చలు నడుస్తున్నాయి.. ఆందోళన వద్దన్న పవన్! పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం పవన్ తాజా హామీతో.. జనసేన - బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ 11:38 AM, మార్చి 21 2024 నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయితీ డోన్ 1అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన అదిష్ఠానం టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు రెండుసార్లు బహిరంగంగా చెప్పారు: ధర్మవరం సుబ్బారెడ్డి నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం : ధర్మవరం సుబ్బారెడ్డి 11:27 AM, మార్చి 21 2024 రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్ రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు 10:39 AM, మార్చి 21 2024 చంద్రబాబుపై బోడె ప్రసాద్ అసహనం పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు చంద్రబాబు సర్వేల పై బోడే ప్రసాద్ అసహనం పార్టీకోసం ఎంతో కోల్పోయా : బోడే ప్రసాద్ సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: బోడే ప్రసాద్ పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు: బోడే ప్రసాద్ పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: బోడే ప్రసాద్ పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?: బోడే ప్రసాద్ సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి: బోడే ప్రసాద్ కానీ చంద్రబాబు నన్ను విస్మరించారు: బోడే ప్రసాద్ పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను: బోడే ప్రసాద్ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది: బోడే ప్రసాద్ ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం: బోడే ప్రసాద్ 10:11 AM, మార్చి 21 2024 ఇళ్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్: దేవినేని అవినాష్ ఫైర్ టీడీపీ హయాంలో లో ఏటువంటి అభివృధి జరగలేదు కలువ గట్ల వాసులకు 1.20లక్షల రూపాయలు తో మంచి నీటి సౌకర్యం కల్పించాం మౌలిక సుడుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు కలువ గట్ల ఇల్లు తీసేస్తారు అనీ గద్దె రామ్మోహన అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్ హయాంలో లో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా గతం లో కలువ గట్ల ప్రాంతం లో ఇళ్ళ తొలగింపు పై లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్ ఎవరు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు కలువ గట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థ కు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది హుందా తనం కోల్పోయి రెచ్చ గొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెర లేపుతున్న టీడీపీ నేతలు నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అనీ అన్నది చంద్రబాబు కాదా? బీసీ లు అంటే ఓటు బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు చూస్తారు 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం గతంలో జగన్ పథకాలను మెచ్చుకుని.. నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:56 AM, మార్చి 21 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లపై వేటు చిన్నపురంలో బందరు అభ్యర్థి పేర్ని కిట్టు తరఫున వలంటీర్ల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు 10:34 AM, మార్చి 21 2024 పి.గన్నవరం బీజేపీకే? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని మార్చి బిజెపి అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు... రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టి ఎస్ ఎన్ మూర్తి ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ 10:01 AM, మార్చి 21 2024 అనంతలో YSRCP ప్రచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రజల నుంచి అపూర్వ స్పందన 09:32 AM, మార్చి 21 2024 చోడవరం టీడీపీలో విభేదాలు అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య బాబు, మల్లు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న కె ఎస్ ఎన్ రాజుకు సహకరించేది లేదంటున్న తాతయ్య బాబు మల్లు నాయుడు చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ 09:14 AM, మార్చి 21 2024 గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన జనసేన తరఫున పోతిన మహేష్కుకి టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్ బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పు పట్టిన కాపు సంఘం నేతలు మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం పశ్చిమ సీటు మహేష్ కే కేటాయించాలి పీక తెగిపోయే పొత్తు ఎందుకు? గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన 08:44 AM, మార్చి 21 2024 దుత్తలూరులో బరితెగించిన టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన పరుష పదజాలంతో దూషణలు.. దాడికి యత్నం.. అధికారితో తీవ్రవాగ్వాదం అనుమతులు లేవంటూ ఎంపీడీవోకి పోలీసులకు ఫిర్యాదు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఐపీసీ 188 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు 08:34 AM, మార్చి 21 2024 ఉల్లం'ఘను'లు యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్ఎం సస్పెన్షన్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 08:28 AM, మార్చి 21 2024 నేడు ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు ఈసీ ముందు హాజరుకానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక ఘటనలపై వివరణ కోరిన ఈసీ వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు 08:07 AM, మార్చి 21 2024 నాగబాబు చెంతకు తిరుపతి పంచాయితీ తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు టికెట్ శ్రీనివాసులుకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ! అరణి శ్రీనివాసులుకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్ నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు శ్రీనివాసులుకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం పవన్ సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు 07:38 AM, మార్చి 21 2024 బీజేపీలో కొలిక్కికరాని అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ మధుకర్ రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమువీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమువీర్రాజు స్పష్టీకరణ ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురందేశ్వరి 07:18 AM, మార్చి 21 2024 వారాహి దుమ్ము దులుపుతున్న పవన్ మరోసారి తెరపైకి వారాహి యాత్ర ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం అప్పట్లో వారాహి మీద రాష్ట్రవ్యాప్త యాత్ర అంటూ హడావిడి స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. వారాహిని పూర్తిగా పక్కనపడేసిన పవన్ ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన కాపులు ఓటేసి గెలిపిస్తారా? అనే అనుమానంతో.. పిఠాపురం పోటీ డైలమాలో పవన్ 06:42 AM, మార్చి 21 2024 పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే పిఠాపురంలో మారుతున్న రాజకీయం బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్ కి పిఠాపురంలో ఎదురుగాలి పార్టీని వీడుతున్న కీలకకాపు నేతలు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ ఛార్జి మాకినీడు శేషు కుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషుకుమారి 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి పవన్ కి సిద్దాంతం లేదు... నిబద్దత లేదు: శేషు కుమారి జనసేనకి విధివిధానాలు లేవ్: శేషు కుమారి ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిక పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం పవన్ వ్యవహారశైలి...నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరుసగా ఎదురుదెబ్బల నేపధ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే! ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు 06:42 AM, మార్చి 21 2024 మైనారిటీలకు మంచి చేసిందెవరు?: YSRCP చంద్రబాబు అసత్య ప్రచారం ముస్లిం మైనారిటీల సంక్షేమం,అభివృద్ధికోసం తాను తెచ్చిన ప్రతీ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్కు వైఎస్సార్సీపీ కౌంటర్ Everyone knows who did what to minorities! https://t.co/oOscpTDN1h pic.twitter.com/DLtTaoqtmA — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 06:30 AM, మార్చి 21 2024 కడప, అన్నమయ్య సిద్ధం ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంజాద్ భాషా, ఇతర ముఖ్య నేతలు కపడ, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు ఈ నెల 27న సీఎం @ysjagan ఇడుపులపాయ నుంచి "మేమంతా సిద్ధం" పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమై బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/Uky7UD4H4K — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 -
జనసేనలో జగడం
సాక్షి, విశాఖపట్నం: జనసేనలో అభ్యర్థి ప్రకటన ఇంకా వెలువడక ముందే గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ యాదవ్ను విశాఖ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో.. జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని.. తామేం మేకలం కాదంటూ సింబాలిక్గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లామని.. టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు. -
March 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 20th Latest News Telugu 08:30 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయుడుపేటకు చెందిన 300 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య 08:00 PM, మార్చి 20 2024 తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో టీడీపీకి బిగ్ షాక్ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 7:27 PM, మార్చి 20 2024 విజయవాడ సెంట్రల్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రహస్య సమావేశం పెట్టుకున్న సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఉమా వైఖరితో విసిగిపోయిన సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఒంటెద్దు పోకడపై అసహనంలో టీడీపీ నేతలు బోండాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం బోండా ఉమాని మార్చకపోతే తామే పార్టీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో సెంట్రల్ టీడీపీ నేతలు 7:30 PM, మార్చి 20 2024 తూర్పుగోదావరి: నల్లజర్ల టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసన మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన ఏడాదిన్నర నుంచి టీడీపీలో కొనసాగుతున్న వర్గ పోరు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడంటున్న అసమ్మతి వర్గీయులు అయినప్పటికీ అధిష్టానం మళ్లీ మద్దిపాటికే టికెట్ ఖరారు చేయడంపై భగ్గుమన్న వర్గ విబేధాలు 5:47 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి మాకినీడి శేషుకుమారి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి 2019ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శేషుకుమారి జనసేనకి అసలు విధివిధానాలే లేవు: శేషకుమారి గత ఎన్నికలలో 28 వేల ఓట్లు నాకు వచ్చాయి పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు పవన్ని జనం నమ్మే పరిస్థితి లేదు పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి జగన్తో అసలు పవన్ని ఎవరూ పోల్చుకోరు జగన్ స్థాయి వేరు.. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం.. ఆచరణలో శూన్యం 5:34 PM, మార్చి 20 2024 సీఎం జగన్ పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు: ఎంపీ ఆర్.కృష్ణయ్య 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా 12 వేల ఉద్యమాలు చేశాం 2 వేల జీవోల సాధించాం జగన్ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు సీఎం జగన్కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు సీఎం జగన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు నేను కర్నూలులో స్వయంగా చూశా సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మేలు చేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను ఓటేసి గెలిపించాలి 5:13 PM, మార్చి 20 2024 పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు: వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారు మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం పవన్ని కూడా నేను మా వైఎస్సార్సీపీకి రమ్మంటే బావుంటుందా? జగన్ మీద జనానికి నమ్మకం ఉంది ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు 4:51 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీ నుంచి ఎవరూ టీడీపీలో చేరడంలేదు: కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబంపై తాడిపత్రిలో ఎవరైనా గెలుస్తారు రోడ్డు పక్కన ఉన్నవారికి డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్రతిష్టను దిగజారుస్తోంది 2019 ఎన్నికల కంటే ఈసారి బలంగా ఉన్నాం నిజమైన కార్యకర్తలు నా వెంటే ఉన్నారు : కేతిరెడ్డి పెద్దారెడ్డి 4:33 PM, మార్చి 20 2024 పశ్చిమగోదావరి: ఉండిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి శివరామరాజు ప్రచారం ఉండిలో ప్రచారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అనుచరులతో, అభిమానులతో భారీ కార్ల ర్యాలీ ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానంటున్న శివరామరాజు 4:01 PM, మార్చి 20 2024 టీడీపీ, జనసేనకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ పరిధిలో లేని అంశంపై మాకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేసిన సీఈవో ప్రధానమంత్రి సభ ఫెయిల్యూర్పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన ఎన్డీఏ సభ ఫెయిల్యూర్ని పోలీస్లపై నెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ, జనసేన బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీస్ కారణమంటూ గగ్గోలు పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడనికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన సీఈఓ సమాధానంతో బట్టబయలైన టీడీపీ, జనసేన బండారం డీజీపీ, ఎస్పీని టార్గెట్ చేస్తూ సీఈవోకి ఫిర్యాదు ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి ప్రధాని పర్యటన భద్రత అంతా హోం శాఖనే చూస్తుంది ఎన్నికల కమిషన్ కి ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు 03:26 PM, మార్చి 20 2024 గుంటూరు: ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణుల రౌడీయిజం ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలసాని ఇంటిపై దాడి టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కారులో ఉండి దాడికి డైరెక్షన్ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు 03:20 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ ఆ పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి కాసేపట్లో వైఎస్సార్సీపీలో చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషకుమారి 02:51 PM, మార్చి 20 2024 27 నుంచి ‘మేము సిద్ధం’ బస్సు యాత్ర.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం 27న వైఎస్సార్ జిల్లాలో ‘మేము సిద్దం’ బస్సుయాత్ర 28న నంద్యాల జిల్లాలో కొనసాగనున్న సిద్దం బస్సుయాత్ర అనంతరం కర్నూలు జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్ర సిద్దం కావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్న బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, నియోజవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు ధోరణి అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు 01:27 PM, మార్చి 20 2024 పవన్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్ పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకి మోయను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తాం వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు 01:04 PM, మార్చి 20 2024 జనసేనలో జగడం విశాఖ జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వంశీ యాదవ్కు టికెట్ ఇవ్వొద్దంటూ మరో వర్గం మహిళా కార్యకర్తల నిరసన మహిళలపై దాడికి దిగిన వంశీ వర్గీయులు పరిస్థితి ఉద్రిక్తం 12:53 PM, మార్చి 20 2024 బాబు ఓ ఊసరవెల్లి: కేశినేని నాని దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు ,పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది కేశినేని నాని వ్యాఖ్యలు 12:44 PM, మార్చి 20 2024 అణగారిన వర్గాలకు జగనన్న ప్రభుత్వం భరోసా: దేవినేని అవినాష్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అణగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 12:34 PM, మార్చి 20 2024 అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేశారు: కిలారి రోశయ్య మంచి చేస్తేనే ఓటు వేయాలన్న ఏకైక నేత జగన్ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వంద సీట్లు ఇచ్చారు సీట్ల సర్దుబాటులో విపక్షాలు మునిగి తేలుతున్నాయి ఎన్ఆర్ఐలకు స్ధానిక సమస్యలు తెలియవు ఎన్నికల ప్రచారంలో కిలారి రోశయ్య వ్యాఖ్యలు 12:14 PM, మార్చి 20 2024 టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఎంపీ సీట్ల లో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ ని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కోరుతున్న బీజేపీ పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు ఏలూరు పార్లమెంట్ కు తెరపైకి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఇప్పటికే ఏలూరు స్థానాన్ని, ఆశిస్తున్న కంభంపాటి, డా. పవన్, భాష్యం రామకృష్ణ అనంతపురంలో చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన జేసీ పవన్ కుమార్ రెడ్ 12:11 PM, మార్చి 20 2024 పురుగుల మందు తాగిన టీడీపీ నేత పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లో టికెట్ గొడవ పార్టీకి కష్టపడి పనిచేసిన అరవింద బాబుకు టికెట్ కేటాయించాలంటూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ప్రెస్ మీట్ అరవింద్ బాబు టికెట్ ను లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం అరవింద్ బాబు టికెట్ కేటాయించాలంటూ ప్రెస్ మీట్ లోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం పాల్పడిన పులిమి రామిరెడ్డి వెంటనే హాస్పిటల్ కి తరలింపు 11:49 AM, మార్చి 20 2024 బాబు ఓ రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరు చంద్రబాబు రాజకీయ వికలాంగుడు జనసేన, బీజేపీలు ఊతకర్రల్లా వచ్చాయి ఈ పొత్తులను ముందుగా ఊహించిందే బాబుది అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం జుట్టు అందలేనది ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లు పట్టుకున్నారు మూడు రాజధానులకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు కర్నూలు న్యాయరాజధాని తప్పక అవుతుంది 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలు ఉంటాయి 11:33 AM, మార్చి 20 2024 సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ, వంగా గీత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభం, వంగా గీత నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ ముద్రగడ, ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం వైఎస్సార్సీపీలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మాకినీడు శేషు కుమారి 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసిన శేషు కుమారి జనసేన పరిణామాలపై గత కొంతకాలంగా ఆమె తీవ్ర అసంతృప్తి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషు కుమారి 11:33 AM, మార్చి 20 2024 పవన్ పోటీపై ద్వారంపూడి సెటైర్లు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్కు ఏమిటీ ఖర్మ? తన సామాజిక వర్గం ఎక్కువగా ఉందనే పిఠాపురం వెళ్లారు కానీ, పిఠాపురం ప్రజలు పవన్ను కచ్చితంగా ఓడిస్తారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలు 11:06 AM, మార్చి 20 2024 లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉండవల్లి కరకట్ట వద్ద తనిఖీలు సహకరించిన నారా లోకేష్ కాన్వాయ్లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు 10:45 AM, మార్చి 20 2024 కొండబాబుపై పరువు నష్టం దావా వేస్తా: ద్వారంపూడి వార్నింగ్ మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ ఓఎన్జీసీ నుండి రూ.1000 కోట్లు తీసుకున్నానని నిరూపించు:ద్వారంపూడి నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను:ద్వారంపూడి నిరూపించకపోతే వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటావా? :ద్వారంపూడి ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టదావా వేస్తా:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం కోసం మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని కొండబాబు నీరుగారుస్తున్నాడు:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం నూటికి నూరు శాతం అందాలని నా కోరిక:ద్వారంపూడి రాజకీయాలకు అతీతంగా మత్స్యకారుల ఉద్యమానికి నా మద్దతు:ద్వారంపూడి మత్స్యకారుల ఉద్యమానికి ఓఎన్జీసీ అధికారులు దిగివచ్చారు:ద్వారంపూడి నష్టపరిహరం పై కమీటీ వేసి నెలరోజుల్లో నివేదిక ఇస్తామన్నారు:ద్వారంపూడి 10:03 AM, మార్చి 20 2024 పవన్కు ఇదేం కొత్త కాదు: వెల్లంపల్లి పవన్ కల్యాణ్ కు ఓటమి కొత్త కాదు. పిఠాపురంలో పవన్కు ఓట్లే పడవు వంగా గీత మీద పవన్ గెలవడం అసాధ్యం ఓటమి భయంతోనే భీమవరం గాజువాకను పవన్ వదిలేశారు ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే పవన్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గాని పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జనసేన పార్టీ పవన్ విలీనం చేస్తారు శ్రీపాద వల్లభుడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని పవన్ను చెప్పమనండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ , మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఓటమి కాయం. 175/175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 09:44 AM, మార్చి 20 2024 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ ప్రజా రాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వంగా గీత.. జనసేనలోకి రావాలంటూ పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్సార్సీపీ నేత వంగా గీత నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?: వంగా గీత 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నా: వంగా గీత చిరంజీవి గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు: వంగా గీత పవన్ వి దింపుడు కల్లెం ఆశలు: వంగా గీత పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు: వంగా గీత కాకినాడలో పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత వ్యాఖ్యలు 09:02 AM, మార్చి 20 2024 కూటమి అభ్యర్థుల జాబితాపై ఎదురుచూపులు అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ ఇప్పటివరకు 128 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మరో 16 స్థానాలపై కసరత్తు జనసేన లో ఐదు అసెంబ్లీ సీట్లకు రావాల్సిన క్లారిటీ బీజేపీ పోటీచేసే పది స్థానాలపై ఇంకారాని స్పష్టత ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని ఏపీ బీజేపీ 08:45 AM, మార్చి 20 2024 లిస్ట్పై బాబులో వణుకు తేలని టీడీపీ ఎంపీ సీట్ల పంచాయతీ ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి ని ప్రకటించని చంద్రబాబు 3 రోజులుగా జాబితా విడుదల అంటూ మీడియాకు లీకులు బీజేపీ సీట్ల లెక్క తేలక పెండింగ్ లో టీడీపీ లిస్ట్ వందల కోట్లు ఇచ్చిన వాళ్ళకే టీడీపీ ఎంపీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తో టీడీపీ లో రచ్చ రచ్చ ఎంపీ సీట్లు ప్రకటిస్తే మరింత రచ్చ అవుతుందని బాబు లో వణుకు ఇదీ చదవండి: ఢిల్లీ పెద్దలకు చేరిన బాబు కుట్ర 08:06 AM, మార్చి 20 2024 సీఎం జగన్ బ్రాండ్గా ఎన్నికల ప్రచారం ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర బస్సు యాత్ర ద్వారా కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేస్తాం ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రవరకు విరామం లేకుండా బస్సు యాత్ర నిత్యం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. సాయంత్రం భారీ బహిరంగ సభ 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభం.. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ 28న నంద్యాల, 29న కర్నూలు లోక్సభ నియోజకవర్గాల్లో యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది మా బ్రాండ్ సీఎం జగనే నోటిఫికేషన్ తరువాత సీఎం జగన్ మలివిడత ప్రచారం 27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద యాత్రకు శ్రీకారం. సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ. 28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ. 29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి 08:01 AM, మార్చి 20 2024 రెండుగా చీలిన తిరుపతి జనసేన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వద్దంటున్న కూటమి రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన పొత్తు ధర్మం పాటించని టీడీపీ తెరవెనుక చక్రం తిప్పుతున్న చంద్రబాబు నేడు మరోసారి భేటీ కానున్న జనసేన అసమ్మతి వర్గం తిరుపతి నగరం 50 డివిజన్లలో జనసేన అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తే ఊరుకునేది లేదంటున్న కిరణ్ రాయల్ వర్గం నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న జనసేన జనసేన తరఫు అయినా పోటీ చేస్తానంటున్న టీడీపీ సుగుణమ్మ 07:31 AM, మార్చి 20 2024 జనంలోకి సీఎం జగన్.. 27 నుంచి బస్సు యాత్ర వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలా కొనసాగనున్న యాత్ర ప్రజల నుంచి సూచనలు,సలహాలు స్వీకరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ముగియనున్న బస్సు యాత్ర యాత్ర అనంతరం.. ప్రతీరోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం ఉండడంతో.. ఒకవైపు పాలన చూస్తూనే మరోవైపు ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 07:28 AM, మార్చి 20 2024 అయోమయం పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్పై తర్జన భర్జన నిన్న కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరును ప్రకటించిన పవన్ ఆ వెంటనే మరో గందరగోళమైన ప్రకటన బీజేపీ పెద్దలు నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు: పవన్ ఒకవేళ అమిత్ షా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా: పవన్ నేను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారు: పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటన ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:15 AM, మార్చి 20 2024 హస్తినలోనే ఏపీ బీజేపీ నేతలు ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల లొల్లి ఢిల్లీకి చేరిన పంచాయితీ టిక్కెట్ల కోసం ఢిల్లీలోనే తెలుగు బీజేపీ నేతల పాగా ఢిల్లీలోనే ఉండి సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరుల తీవ్ర ప్రయత్నాలు అనకాపల్లి సీటు కోసం రమేష్ ఒత్తిడి ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ఢిల్లీ లాబీయింగ్ నరసాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణంరాజు పైరవీలు ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామ చక్కర్లు రఘురామకృష్ణంరాజు చంద్రబాబు కోసం పనిచేసే మనిషంటూ సీనియర్ల ఫిర్యాదులు సీనియర్ల ఫిర్యాదు నేపధ్యంలో రఘురామకృష్ణంరాజుకి అపాయింట్ మెంట్ సైతం ఇవ్వని బీజేపీ అధిష్టానం అయినా నరసాపురం టిక్కెట్ నాదేనంటూ రఘురామకృష్ణంరాజు ప్రగల్బాలు విశాఖ సీటుకోసం జీవీఎల్ ఢిల్లీలోనే మకాం నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఏపీలోని ఆరు ఎంపీ స్ధానాలపై అభ్యర్దుల ఎంపిక ఉంటుందంటున్న బీజేపీ శ్రేణులు ఒకటి, రెండు రోజులలోనే బీజేపీ ఎంపీ స్ధానాలు, అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నరసాపురం, రాజంపేట, హిందూపూర్ , తిరుపతి స్ధానాలు బీజేపీకి అంటూ టీడీపీ లీకులు టీడీపీ లీకులపై గుర్రుగా ఉన్న బీజేపీ సీనియర్లు గెలిచే స్ధానాలే తీసుకోవాలంటున్న బీజేపీ సీనియర్లు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకి మరోసారి పార్టీని బలి చేయద్దంటున్న సీనియర్లు 06:53 AM, మార్చి 20 2024 ‘ఎవరైనా ఒకటే.. వెన్నుపోటే’ చంద్రబాబు తీరుపై నిమ్మల, బీకే వర్గాల గుర్రు వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన కదిరిలో మైనార్టీకి సీటివ్వకుండా మోసం చేశారంటున్న చాంద్బాషా వర్గం కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు అనంతపురం, గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం 06:42 AM, మార్చి 20 2024 ఉండవల్లిలో టీడీపీ దౌర్జన్యం తాడేపల్లి మండలం ఉండవల్లి లో తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం తెలుగుదేశం బోర్డులు తొలగించేందుకు వచ్చిన సచివాలయం సిబ్బంది అడ్డుకున్న తెలుగుదేశం నాయకులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేని బోర్డులు తొలగించాల్సిందేనన్న సచివాలయం సిబ్బంది సచివాలయం సిబ్బందితో వాదనకు దిగిన తెలుగుదేశం నాయకులు 06:30 AM, మార్చి 20 2024 సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ వినూత్న పంథా సోషల్ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్ సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకున్న సీఎం జగన్ తాము వైఎస్సార్సీపీ వైపు అని కరాఖండిగా చెప్పేస్తున్న జనం తద్వారా.. ఐటీడీపీ, జనసేన సోషల్ ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వైనం ఒక్కరితో చెప్పించండి చూద్దాం..స్లీవ్స్ మడతపెట్టి మరీ @JaiTDPకి ఓ సామాన్యుడి ఛాలెంజ్!#Siddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/FNzeqdn2Ey — YSR Congress Party (@YSRCParty) March 19, 2024 06:28 AM, మార్చి 20 2024 జనసేనతో ‘బాబు’ బంతాట ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకూ చంద్రబాబు అడ్డు బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తనూ ప్రకటించక, జనసేననూ ప్రకటించనివ్వక బాబు రాజకీయం చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలూ మండిపాటు 06:26 AM, మార్చి 20 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి -
March 19th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 19th Latest News Telugu తిరుపతి: తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు నాన్ లోకల్ వద్దు - లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన నేతలు, టీడీపీ నాయకులు తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి కిరణ్ రాయల్ ఇంటిలో సమావేశమైన అసమ్మతి నాయకులు తిరుపతి కార్పొరేషన్ 50 డివిజన్ జనసేన అధ్యక్షులతో కిరణ్ రాయల్ సమావేశం ఆరని శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న తిరుపతి జనసేన నాయకులు 50 డివిజన్ జనసేన అధ్యక్షులను మార్పులు, చేర్పులుపై కసరత్తు చేస్తున్న ఆరని శ్రీనివాసులు శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకుంటాము అంటున్న కిరణ్ రాయల్ 07:50 PM, మార్చి 19 2024 పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ తర్జనభర్జన బీజేపీ నాయకత్వం నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పింది కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ ఒకవేళ అమిత్ సా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారన్న పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:30 PM, మార్చి 19 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి 07:10 PM, మార్చి 19 2024 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పైన దేవుడు కింద ప్రజలు అనే బలమైన నమ్మకంతో సీఎం జగన్ ప్రజల ముందుకు వస్తున్నారు.... రాష్ట్ర చరిత్రలో భారీ ప్రజా మద్దతు లభించింది కేవలం సిద్ధం సభల ద్వారానే... ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది సింగిల్ గా వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దలు కాళ్లు పట్టుకోవడం ప్రతిపక్షాలవంతయింది రానున్న రోజుల్లో మండపేటతో సహా రాష్ట్రమంతా మళ్లీ జగనన్న పాలన రావడం ఖాయం ఎమ్మెల్యే జోగేశ్వరరావు తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు ఎవరుపులో ఎవరు నక్కో రెండు నెలల్లో ప్రజలే తేలుస్తారు నేను వచ్చిన మూడుఏళ్ళలో నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోషిస్తున్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి 07:03 PM, మార్చి 19 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు). కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి 07:00 PM, మార్చి 19 2024 గుంటూరులో జనసేన నేత బాలశౌరిని కలిసిన వంగవీటి రాధా దాదాపు గంటసేపు బాలశౌరితో వంగవీటి రాధా భేటీ నిన్న రాత్రి తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను కలిసిన రాధా మరుసటి రోజే బాలశౌరిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ 06:50 PM, మార్చి 19 2024 వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ మైదుకూరు టీడీపీ నేత వెంకట సుబ్బారెడ్డి రాజీనామా వైఎస్సారసీపీలో చేరిన రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రెడ్యం సోదరులు 06:10 PM, మార్చి 19 2024 విజయవాడ : బీజేపీలో మరోసారి సీట్ల పంచాయితీ బీజేపీకి పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు చంద్రబాబు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించారని అధిష్ఠానానికి లేఖ రాసిన బీజేపీ సీనియర్లు పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్ల పై బీజేపీ అభ్యంతరం గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించటం పై బీజేపీ అభ్యంతరం బీజేపీ అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి ఈనెల 21లోగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ 05:20 PM, మార్చి 19 2024 సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ కామెంట్స్.. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. సీఎం జగనన్న బీసీ, ఎస్సీ , ఎస్టీ మైనార్టీలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాలని అత్యధిక శాతం సీట్లు కేటాయించారు సీఎం జగన్ ప్రజారంజకమైన పారదర్శక పాలన పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన తీరును చూసి ప్రజలు మరో చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వనున్నారు ఈ ఎన్నికలతో పెత్తందారుల పార్టీలన్నీ కనుమరుగుకానున్నాయి 05:00 PM, మార్చి 19 2024 కాకినాడ చిత్రాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీతా సెంటుమెంట్ గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు రెండు దశబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను పిఠాపురం ఆడపడుచును నేను పిఠాపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మంచి పాలన అందించిన జగన్..ప్రజల దీవెన నాకు ఉంది.అదే నా విజయం మా టలు చెప్పే వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగా గీతా... పని చేసే వ్యక్తి వంగా గీతా 04:45 PM, మార్చి 19 2024 విశాఖ: ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు.. చిన్న పిల్లలను టీడీపీ స్టిక్కర్లు అంటించడానికి వాడుకుంటున్న వెలగపూడి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వెలగపూడి చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 04:38 PM, మార్చి 19 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టీడీపీ టికెట్పై నో క్లారిటీ అభ్యర్ధిని ఖరారు చేయకుండా నాన్చుతున్న చంద్రబాబు రోజుకో అభ్యర్ధి పేరును తెరపైకి తెస్తున్న చంద్రబాబు టిక్కెట్ ఆశించి భంగపడ్డ పెనమలూరు టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గతంలో బోడేతో పాటు దేవినేని ఉమా,వసంత కృష్ణప్రసాద్, ఎం.ఎస్.బేగ్ పేర్లతో సర్వే చేయించిన చంద్రబాబు తాజాగా ఆలపాటి రాజా పేరుతో ఐవీఆర్ ఎస్ సర్వే చేయించిన చంద్రబాబు ఆలపాటి వద్దు బోడే ముద్దు అంటున్నారు పెనమలూరు క్యాడర్ నాన్ లోకల్ వద్దంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో నోటా బటన్ను నొక్కుతున్న టీడీపీ క్యాడర్ 03:20 PM, మార్చి 19 2024 ఇడుపులపాయ నుంచే బస్సుయాత్ర ప్రారంభం: సజ్జల రామకృష్ణారెడ్డి ఈనెల 27నుంచి వైఎస్ జగన్ బస్సుయాత్ర ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు బస్సుయాత్ర సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన చోట్ల బస్సుయాత్ర తొలుత ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ప్రొద్దుటూరులోనే వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ 4 సిద్ధం సభలతో క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేశాం ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర చేస్తారు ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ 28న నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుంది 03:18 PM, మార్చి 19 2024 తిరువూరు(ఎన్టీఆర్ జిల్లా): సీఎం జగన్ అవకాశం కల్పించారు.. కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు: నల్లగట్ల స్వామిదాస్ ఇక్కడ ఎల్లలు కూడా తెలియని వ్యక్తి వచ్చాడు జగనన్న కల్పించిన నవరత్నా పథకాలు ప్రజలందరికీ చేరాయి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చానూ జగనన్న బాటలోనే నేను.. పేదల పక్షపాతిగా జీవించాను.. తుది శ్వాస వరకు ప్రజల సేవ కోసమే పని చేస్తాను జగనన్నకు కృతజ్ఞుడిగా ఉంటా 03:15 PM, మార్చి 19 2024 తిరువూరు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం ఎంపీ నందిగం సురేష్ కామెంట్స్ 2019లో సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చారు సీఎం జగన్ 175 అంటున్నారు అదే మన లక్ష్యం 2024 స్వామిదాస్ను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనపై ఉంది తిరువూరులో మెజార్టీనే లెక్కలోకి తీసుకోవాలి, గెలుపు లెక్కే కాదు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు మనం ఉన్నతంగా ఉండాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్న జగనన్న కావాలి ఎస్సీ, బీసీ, మైనార్టీలను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు చిలకలూరిపేట సభలో మోడీ వచ్చారు వాళ్ళందరూ జగన్ను దూషిస్తారని ఆశించారు కానీ ఒక్కమాట కూడా ప్రధాని మాట్లాడలేదు దేశ ప్రధానికి సభలో కనీసం శాలువా, బొకే కూడా ఇవ్వకుండా అవమానపరిచారు లక్ష మంది కూడా రాలేదు కానీ లక్షల్లో వచ్చారని చెప్పుకున్నారు చంద్రబాబు పంపిన వ్యక్తే తిరువూరు అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ అమరావతి అనేది ఒక కుల రాజధాని పవన్ కళ్యాణ్ బాధేంటి అంటే నాకంటే చిన్నవాడు సీఎం కావడం ఏంటని సిద్దం సభకు 10,15 లక్షల మంది వస్తుంటే ప్రజాగళం సభలో సినిమా యాక్టర్ తప్ప మరెవరూ లేరు మనం జగన్ను వదులుకుంటే మన జీవితాలను వదులుకున్నట్లే వైఎస్ఆర్ పేరు లాగా, తండ్రి ఫోటో ప్రక్కన తన ఫోటో ఉండాలన్నదే జగన్ తపన 2024లో జగన్ గెలిస్తే చంద్రబాబు హైదరాబాద్,లోకేష్ సింగపూర్ వెళ్ళిపోతారు మరో ముప్పై ఏళ్ళు సీఎంగా జగనే ఉంటారు చంద్రబాబు నాపై తప్పుడు కేసులు పెట్టాడు జగనన్న నన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ ఒక మహిళపై పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కొడుకు లోకేష్ ను గెలుపించుకొలేక పోయాడు 03:00 PM, మార్చి 19 2024 విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో మరోసారి బయటపడ్డ విభేదాలు వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు వంశీకి సీటు వద్దంటూ నిరసన వంశీ వద్దు జనసేన ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన స్థానికులకే సీటు ఇవ్వాలంటూ డిమాండ్ 02:55 PM, మార్చి 19 2024 చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా 02:25 PM, మార్చి 19 2024 విజయవాడ ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు టిక్కెట్ల కేటాయింపులో కొనసాగుతున్న ప్రతిష్టంబన బిజెపికి ఓడిపోయే సీట్లని కేటాయించేలా చంద్రబాబు వ్యూహం బిజెపికి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం బిజెపి అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి బిజెపి అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బిజెపి నేతలు విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి... బిజెపికి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలని ప్రకటించిన చంద్రబాబు హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి మరియు ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ లకి నిరాశే కడప పార్లమెంట్ లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బిజెపికి బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్న బిజెపి సీనియర్లు బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేక బిజెపికి కేటాయింపు టీడీపీ నుంచి బిజెపిలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించిన చంద్రబాబు ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బిజెపి అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బిజెపికే చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న బిజెపి ఢిల్లీలో శివప్రకాష్ జీ కి ఫిర్యాదు చేసిన బిజెపి సీనియర్లు కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై బిజెపి ఒత్తిడి 02:11 PM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్.. ఎన్టీఆర్ కలెక్టర్, సీపీ ప్రెస్ మీట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాలో అందరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్ ఢిల్లీరావు సభలు,సమావేశాలకు ముందుగా అనుమతి తీసుకోవాలి : కలెక్టర్ ఢిల్లీరావు ప్రభుత్వ కార్యాలయాల పై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫొటోలు ఉండరాదు: కలెక్టర్ ఢిల్లీరావు ఇప్పటి వరకు ఉన్న ప్రకటనలు మొత్తం పూర్తిగా తొలగించాం: కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో 1102 విగ్రహాల పై ముసుగులు కప్పాం: కలెక్టర్ ఢిల్లీరావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు : కలెక్టర్ ఢిల్లీరావు ప్రజల నుంచి ఫిర్యాదు లు స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాం: కలెక్టర్ ఢిల్లీరావు కంట్రోల్ రూమ్ నెంబర్ .. 0866 2570051: కలెక్టర్ ఢిల్లీరావు వాట్సప్ నెంబర్.. 9154970454 కు ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్ ఢిల్లీరావు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1863 : కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో మొత్తం ఓటర్లు 16 లక్షల 83 వేలు: కలెక్టర్ ఢిల్లీరావు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లు 37,760 : కలెక్టర్ ఢిల్లీరావు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు 24,410 మంది: కలెక్టర్ ఢిల్లీరావు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎస్ఈబీ, పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం 845 లీటర్లు: సీపీ కాంతిరాణా టాటా 3.4 కోట్ల ఖరీదైన 33.97 కిలోల లోహాలు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా 48,26,880 రూపాయల నగదు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి: సీపీ కాంతిరాణా టాటా జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 3215 బైండోవర్ కేసులు నమోదుచేశాం : సీపీ కాంతిరాణా టాటా జిల్లాలో 361 లైసెన్స్ గన్ లు డిపాజిట్ చేసుకున్నాం : సీపీ కాంతిరాణా టాటా నిబంధనలకు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి: సీపీ కాంతిరాణా టాటా నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 02:04 PM, మార్చి 19 2024 పవన్కు హరిరామ జోగయ్య లేఖ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ కాపుల కోసం మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని లేఖలో డిమాండ్ బీసీ డిక్లరేషన్కు సమానంగా కాపు, బలిజ, తెలగ వర్గాల కోసం మేనిఫెస్టో పెట్టాలి బీసీలకు ప్రకటించిన హామీలను కాపులు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలి 01:50 PM, మార్చి 19 2024 సీఎం జగన్ బస్సు యాత్రపై కాసేపట్లో క్లారిటీ మధ్యాహ్నాం 3గం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ప్రెస్ మీట్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్న పార్టీ నేతలు 27 నుంచి ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగింపు? వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ప్రొద్దుటూరులో లక్షమందితో తొలి బహిరంగ సభ వైఎస్సార్సీపీ ప్లాన్ 01:26 PM, మార్చి 19 2024 చంద్రబాబుపై కేఏ పాల్ ఫైర్ ఎన్టీఆర్ బతికుంటే మోదీ పక్కన కూర్చునే వాడా? అది తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి బాబు చంపేశారు చంద్రబాబు దుర్మార్గుడు అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని బాబు ఎప్పుడైనా అడిగారా? 01:24 PM, మార్చి 19 2024 బాబు నివాసం వద్ద లోకేష్ కాన్వాయ్కి అడ్డుపడి.. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళన కదిరి టిక్కెట్ ను అత్తర్ చాంద్ భాషా కు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే కదిరి టిక్కెట్ ను కందికుంట ప్రసాద్ సతీ మనకి కేటాయించిన టీడీపీ ఐదేళ్లుగా కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని డిమాండ్ హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని చెబుతున్న అనుచరులు లోకేష్ కాన్వాయ్ ని ఆపిన కార్యకర్తలు అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని చెప్పిన లోకేష్ బాషా కి టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పున కార్యకర్తలు ఎవరు గెలుస్తారో, ఎవరు ఎం చేసారో అన్ని మాకు తెలుసని.. గొడవ పడొద్దని చెప్పి వెళ్లిపోయిన లోకేష్ 01:22 PM, మార్చి 19 2024 జనసేన నుంచైనా పోటీ చేస్తా: టీడీపీ నేత సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గం టీడీపీ నేతలు కీలక సమావేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఖరారు అంటూ ప్రచారంపై మండిపాటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో సమావేశం... ఎమ్మెల్యే శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది: సుగుణమ్మ స్దానికులకు సీటు ఇవ్వాలని అనేది మా ఏకగ్రీవ నిర్ణయం: సుగుణమ్మ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా ఒకే.. వారి గెలుపు కోసం పనిచేస్తాం: సుగుణమ్మ ఆరిణి శ్రీనివాసులకు మాత్రం ఇవ్వద్దు.. గెలిచే వ్యక్తికి మాత్రమే సీటు ఇవ్వండి: సుగుణమ్మ జగన్ 151 సీట్లు గెలిచినప్పుడే నేను వెయ్యి ఓట్ల స్వల్ప ఓటమీ చెందాను : సుగుణమ్మ తిరుపతి టీడీపీ పోటి చేయడం లేదనేది ప్రజలకు,కేడర్ తీరని లోటుగా ఉంది: సుగుణమ్మ కూటమిలో బిజెపి, జనసేన తిరుపతి సీటును కోరాయి: సుగుణమ్మ పోత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు: సుగుణమ్మ పార్టీ అదేశిస్తే జనసేన నుండి అయినా బరిలో దిగుతా: సుగుణమ్మ 01:13 PM, మార్చి 19 2024 ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? కేవలం ప్రచారానికే పరిమితం కానున్న రాధా! జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేసే అవకాశం రాధాతో ప్రచారం చేయించాలని తీవ్రంగా యత్నిస్తున్న జనసేన నిన్న నాదెండ్ల మనోహర్.. ఇవాళ బాలశౌరితో భేటీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రాధా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించేందుకు నిరాసక్తి?! పవన్తో పాటు రాధా కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు పడతాయని జనసేన ప్లాన్ 12:43 PM, మార్చి 19 2024 చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన ఆమె అనుచరులు 25 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పడం లేదని ఆవేదన సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తల ధీమా జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన ఆలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంట్లోకి అనుమతించాలంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చంద్రబాబును కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం.. ఉద్రిక్తత 12:18 PM, మార్చి 19 2024 టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ తెరమీదకు కొత్త పేర్లతో మారుతున్న సమీకరణాలు మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు పరిశీలన ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో జనసేనకి కేటాయింపు దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారు గతంలో గన్నవరం సీటు ఆశించిన దేవినేని చందు ఫ్యామిలీ పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు రెండు లేదా మూడు రోజుల్లో టికెట్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తులు 12:05 PM, మార్చి 19 2024 TDP ఎంపీ జాబితా నేడే! నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల పొత్తులో భాగంగా 17 స్థానాలు తీసుకున్న టీడీపీ పదికి పైగా స్థానాలకు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు మిగిలిన స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు బీజేపీ ఎంపీ అభ్యర్థులపై నేడు సాయంత్రానికి రానున్న క్లారిటీ ఈ నేపథ్యంలో.. తమ జాబితా విడుదలకు సిద్ధమైన టీడీపీ లిస్టులో.. గుంటూరు - పెమ్మసారి చంద్రశేఖర్ ఒంగోలు - మాగుంట రాఘవ రెడ్డి నంద్యాల -బైరెడ్డి శబరి శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం - భరత్ అమలాపురం - గంటి హరీష్ విజయవాడ - కేశినేని చిన్ని నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ 11:51 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ తొలి సభ ప్రొద్దుటూరులో! ఈ నెల 27 నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర తొలిరోజు కడప ఎంపీ సీటు పరిధిలో పర్యటన.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల స్టార్ క్యాంపెయినర్లతో(సామాన్య ప్రజలతో) సభ లక్ష మంది అంచనాతో ప్రొద్దటూరు సభ రెండో రోజు నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి, సాయంత్రం అక్కడే బహిరంగ సభ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగనున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర కర్నూలు పార్లమెంట్ లో వివిధ వర్గాల ప్రతినిధులు తో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభ 11:48 AM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ.. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి ప్లాన్ చేసిన లోకేష్ చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టోను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్ట్ చేసిన లోకేష్ మేనిఫెస్టో పై బీజేపీ గుర్తు మాయం ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా నిలిపివేసిన పోస్టల్ శాఖ అధికారులు మంగళగిరి పోస్ట్ ఆఫీస్ లో 23 బస్తాల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలు ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తా అంటున్న పోస్టల్ శాఖ అధికారులు 11:32 AM, మార్చి 19 2024 గంటా శ్రీనివాస్ సీటు పై కొనసాగుతున్న సందిగ్ధత భీమిలి టికెట్ కోసం పట్టుబడుతోన్న గంటా చీపురుపల్లిలో పోటీ చేయాలంటోన్న అధిష్టానం మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా? పక్కచూపులు చూస్తోన్న గంటా అనుచరులు 11:23 AM, మార్చి 19 2024 నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ తెనాలి జనసేన ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ గంటసేపు కొనసాగిన ఇద్దరి సమావేశం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాధా తాజా రాజకీయ పరిస్థితుల పై ఇద్దరి మధ్య భేటీ రాష్ట్రవ్యాప్తంగా రాధా పర్యటన ఉండేలా చర్చ జరిగినట్లు సమాచారం 11:21 AM, మార్చి 19 2024 మూడు పార్టీల్లో రగులుతున్న కుంపటి ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డిని అంగీకరించిన మిత్రపక్షాలు టికెట్ కోసం బీజేపీ, జనసేన ఇన్ ఛార్జ్ ల యత్నం బీజేపీ, జనసేన వేర్వేరుగా ఇంటింటి ప్రచారం టీడీపీలో అసంతృప్తి లేకుండా చేసుకునే పనిలో సుధీర్ 11:18 AM, మార్చి 19 2024 నంద్యాల నందికొట్కూరులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు టీడీపీ నంద్యాల ఎంపీ రేసులో ఉన్న బైరెడ్డి శబరమ్మ, తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముస్లిం ఓటర్లకు టీడీపీ చీరలు పంచే కార్యక్రమం హజీనగర్, మారుతినగర్,శాంతి టాకీస్, బైరెడ్డి నగర్ కాలనీలో రంజాన్ తోఫా పేరుతో ఇంటింటికి చీరెలు పంపిణీ చేసిన టీడీపీ కార్యకర్తలు. చీరెలు పంపిణీలో శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్రించి ఉన్న ఫొటోలు, కోడ్ ఉల్లంఘనను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్సీపీ 10:51 AM, మార్చి 19 2024 ఓట్ల కోసం టీడీపీ కుల రాజకీయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం కుల రాజకీయం ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి పేర్లు మార్చేస్తున్న చంద్రబాబు నాయుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామ చందర్రావు భార్య గల్లా మాధవి ప్రయత్నం సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమైన రామ చందర్రావు భార్య టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవి గా పేరు మార్చేసిన చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిడుగురాళ్ల( గళ్ళ) మాధవిగా పరిచయం బీసీల ఓట్ల కోసం ఇంటిపేరు పిడుగురాళ్ల తగిలించిన చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం బ్రాకెట్లో గళ్ళ అని చేర్చిన చంద్రబాబు నాయుడు మాధవి రెండు ఇంటిపేర్లు పెట్టుకోవటం చూసి షాప్ తింటున్న వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఓట్ల కోసం ఈ కుల రాజకీయాలు ఏంటని ఆగ్రహం 10:33 AM, మార్చి 19 2024 కుళ్లిపోయిన కొబ్బరి ‘బోండాన్ని’ నమ్మొద్దు సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరిగింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం లేదు. మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని కోరుతున్న వ్యక్తి సీఎం జగన్. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ప్రజలకు సంక్షేమంలో సీఎం జగన్ పెద్దపేట వేశారు. పేదలకు సీఎం జగన్ అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గం చంద్రబాబు అడ్డుకున్నాడు. పేదవారిని అరగదొక్కే వ్యక్తి చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గం లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాన్ని(బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశిస్తూ..) ఎవరు నమ్మొద్దు. సెంట్రల్ లో పనికిరాని ఈ కొబ్బరి బోండం ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమ ఇక్కడ పోటీ చేస్తున్నాడు బోండా ఉమకి ఓటు అడిగా అర్హత లేదు బోండా ఉమకి రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి కావాలి ప్రజలను బోండా ఉమ భయపెడితే సహించబోము బోండా ఉమా బెదిరిస్తే ఎవరు భయపడనవసరం లేదు బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ప్రజలను బెదిరిస్తే బోండా ఉమ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విజయవాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇదీ చదవండి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’ 10:05 AM, మార్చి 19 2024 అనకాపల్లి ఎంపీ టికెట్ వైఎస్సార్సీపీ క్లారిటీ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది అనకాపల్లి ఎంపీ టికెట్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఈనెల 27 నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది సిద్ధం సభలు జరగని ప్రతి జిల్లాలో సీఎం పర్యటిస్తారు అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది వైజాగ్లో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు 09:55 AM, మార్చి 19 2024 ఇదే నా లాస్ట్ పోటీ.. ప్లీజ్: వక్కలగడ్డ విజయవాడ వెస్ట్లో బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం నేను బీజేపీ టికెట్ ఆశిస్తున్నాను.. మీరంతా నన్ను ఆశీర్వదించండి.. 2014లో కూడా ప్రయత్నం చేశాను ఇదే నా చివరి అవకాశం గెలిచిన, ఓడిన వొచ్చే ఎన్నికల్లో పోటీ చేయను వెస్ట్ టికెట్ వైశ్యులకే ఇవ్వాలని కోరుతున్నా విజయవాడ పశ్చిమ సీటు రచ్చ బీజేపీకి పోటీగా జనసేన ఆత్మీయ సమావేశం జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్న పోతిన మహేష్ 09:43 AM, మార్చి 19 2024 కొత్తపల్లి గీత.. వెనక పురంధేశ్వరి 2014లో వైఎస్ఆర్సిపి అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత పురందేశ్వరి స్వలాభం కోసం అరకు ఎంపి గా కొత్తపల్లి గీతకు టికెట్ గత ఎన్నికల్లో ఎంపీగా 1,159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవీవీకి 4,36,906 ఓట్లు టీడీపీ అభ్యర్థికి 4 32.492 ఓట్లు కొత్తపల్లి గీతకు కేవలం 1,159 ఓట్లు.. తుది ఫలితాల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లతో ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి అనే పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి.. టికెట్కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన గీత 09:32 AM, మార్చి 19 2024 విశాఖలో రగిలిపోతున్న బండారు పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంపై కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు పెందుర్తి సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్న బండారు మాజీ మంత్రి బండారుకు సీటు ఇవ్వాలని కార్యకర్తలు నిరసన బైక్ ర్యాలీతో బల ప్రదర్శనకు దిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే అసమ్మతి నేతలతో సమావేశమైన బండారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు బండారు 09:17 AM, మార్చి 19 2024 ప్చ్.. కూటమిది ఒక విచిత్రమైన పరిస్థితి చిలకలూరిపేట ఎన్డిఎ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో సాకులు వెతుకుతున్న టీడీపీ, జనసేన ప్రజాగళం సభకి 15 లక్షల మంది వస్తారంటూ ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టిన టీడీపీ నేతలు లక్ష మంది కూడా హాజరుకాకపోవడంపై పోలీసులపై నెపం నెట్టేసిన టీడీపీ, జనసేన ఆర్టీసీ బస్సులు ఇచ్చినా కూడా జనాన్ని సమీకరించుకోలేని స్థితి మొదట 2,500 బస్సులు కావాలని.. జనం రాకపోవడంతో 1,540 బస్సుల క్యాన్సిల్ డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లిచ్చినా కూటమి సభ వైపు ముఖం చూడని జనం సగం కుర్చీలు ఖాళీగా ఉండటంతో తేలిపోయిన సభ ఆనక.. పార్టీలు, నేతలమధ్య సమన్వయ లోపాన్ని పోలీసులపైకి నెట్టేసిన టీడీపీ, జనసేన జనం మద్దతు లేదని తేలిపోవడంతో పోలీసుల వల్లే జనం హాజరు కాలేదంటూ ఫిర్యాదులు ఎస్పీ వల్లే సభకి జనం రాలేదని ఎన్నికల కమీషన్ కి జనసేన ఫిర్యాదు సభ పేలవంగా జరగడంపై మూడు పార్టీల కార్యకర్తలలో నైరాశ్యం జనం రాకపోయినా.. కుర్చీలు ఖాళీగా ఉన్నా సభ విజయవంతమైందంటూ మరోవైపు ఎవరికి వారే గొప్పలు 09:10 AM, మార్చి 19 2024 మైలవరం సీన్ రివర్స్ మైలవరం నియోజకవర్గం టీడీపీలో సీన్ రివర్స్ వసంత కృష్ణప్రసాద్ సీటుపై డైలమా ఫుల్ ఫ్రస్టేషన్ లో వసంత కృష్ణ ప్రసాద్ టిక్కెట్ ఎవరికిస్తారో తేల్చని చంద్రబాబు రెండో జాబితాలో ను కనిపించని వసంత పేరు సన్నిహితుల దగ్గర మండిపడుతున్న వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టిక్కెట్ తనదేనని చెప్పుకున్న వసంత కృష్ణప్రసాద్ వసంతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు మైలవరం లో కనిపించని దేవినేని ఉమా వసంత కి సహకరించేది లేదని తెగేసి చెప్పిన ఉమా తన సీటు కోసం చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్న దేవినేని ఉమా 08:39 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధమంటూ వైఎస్సార్సీపీలో జోష్ బస్సుయాత్రకు సీఎం వైఎస్ జగన్ రెడీ 27 నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యే అవకాశం జగన్ బస్సుయాత్ర ప్రకటనతో వైఎస్సార్సీపీ కేడర్లో ఫుల్ జోష్ యాత్రలో పాల్గొనేందుకు రెడీ అవుతున్న నేతలు, కార్యకర్తలు ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో నేడు క్లారిటీ 08:36 AM, మార్చి 19 2024 విజయవాడ వెస్ట్: కూటమిలో ఆగని ముసలం బీజేపీ, జనసేన పోటాపోటీ ఆత్మీయ సమావేశాలు జనసేన నేతలతో పోతిన మహేష్ ఆత్మీయ సమావేశం బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం పశ్చిమ సీటు బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారంతో రచ్చ గప్చుప్ అయిపోయిన టీడీపీ నేతలు 08:22 AM, మార్చి 19 2024 ఢిల్లీ వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధిష్టానం పెద్దల్ని కలవనున్న పురందేశ్వరి లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఖరారుపై చర్చ టీడీపీ జనసేన కూటమిలో భాగంగా.. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న బీజేపీ ఆయా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసుకురానున్న పురందేశ్వరి 07:45 AM, మార్చి 19 2024 పిఠాపురంలో వర్మ కండిషన్లు కాకినాడ పిఠాపురంలో మళ్ళీ మొదటికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పరిస్ధితి పవన్ పోటీపై కండిషన్లు పెడుతున్న వర్మ పవన్ తరఫు ప్రచారంలో తనకు స్వేచ్చను ఇవ్వాలంటున్న వర్మ జనసేనతో తనకున్న గ్యాప్ను బయపెట్టిన వర్మ టీడీపీ నుండి గెంటేసిన వాళ్ళు జనసేనలో ఉన్నారంటూ విమర్శ వాళ్ళే తనను హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపణ. కలకలం రేపుతున్న వర్మ వాఖ్యలు పవన్ గెలుపుకు కష్టమని నడుస్తున్న చర్చ 07:30 AM, మార్చి 19 2024 మేం గెల్చాం.. గుర్తుందా?: బీజేపీ విశాఖ ఎంపీ స్థానం పై పట్టు వదలని బీజేపీ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ నేతలు.. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బీజేపీ గెలిచింది.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది గెలిచిన పార్టీకే సీటు ఇవ్వాలనే డిమాండ్ విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది బీజేపీ 90 వేల మెజారిటీతో గెలిస్తే, టీడీపీ 4,500 మెజారిటీతో ఓడింది 07:25 AM, మార్చి 19 2024 నేడు వైఎస్సార్సీపీ కీలక ప్రకటన ఎన్నికల ప్రచారం.. జనంలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 21 రోజులపాటు.. ఒక్కో జిల్లా పార్లమెంట్ స్థానం పరిధిలో టూర్ ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానున్న యాత్ర.. శ్రీకాకుళంతో ముగింపు ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ ప్రచారంలో.. ప్రభుత్వ పని తీరు మెరుగుపర్చుకునేందుకు జనాల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించే పనిలో సీఎం జగన్ ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్న సీఎం జగన్ నేడు యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించనున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడనున్న ప్రకటన మేనిఫెస్టో ఎప్పుడనేదానిపైనా కూడా ప్రకటన వచ్చే ఛాన్స్? 07:04 AM, మార్చి 19 2024 తిప్పల నాగిరెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్గా నియమించిన సీఎం జగన్ 06:54 AM, మార్చి 19 2024 వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరి శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్ 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక 06:41 AM, మార్చి 19 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో టీడీపీకి మొట్టికాయలు వేసిన ఎలక్షన్ కమీషన్! సీఎం @ysjagan గారిని అవమానించేలా @JaiTDP అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్ట్ని డిలీట్ చేసిన టీడీపీ ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్ట్లు కాదు టీడీపీ పార్టీనే డిలీట్… pic.twitter.com/7aKALv3C8e — YSR Congress Party (@YSRCParty) March 18, 2024 06:30 AM, మార్చి 19 2024 రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి -
March 18th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections March 18th Latest News Telugu 08:50 PM, మార్చి 18 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో 07:50 PM, మార్చి 18 2024 తాడేపల్లి: సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.. టీడీపీ, జనసేన, బీజేపీలు పదేళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం ప్రారంభించాయి పొత్తులు లేనిదే చంద్రబాబు పోటీ చేయలేరు 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏం మేలు చేశారు? నాలుగేళ్ల తర్వాత మళ్ళీ విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు మోదీని చంద్రబాబు అడ్డమైన మాటలు అన్నారు పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు? ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు? ప్రధానిని సైతం అవమానపరిచారు కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు? నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి జగన్ ప్రభుత్వంలో 87% కుటుంబాలు లబ్ది పొందాయి అందుకే సీఎం జగన్ను ప్రజలు ఓన్ చేసుకున్నారు షర్మిళ ఎక్కడ నుండైనా పోటీ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు 07:29 PM, మార్చి 18 2024 ప్రధాని మోదీని ఆనాడు బాబు ఇష్టానుసారం దూషించారు: సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మొహం పెట్టుకొని ముగ్గురు స్టేజ్పైకి వచ్చారు పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం పొత్తులు వారికి కొత్త కాదు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారు నాడు విడాకులు తీసుకొని విడిపోయి దూషించుకున్నారు 07:14 PM, మార్చి 18 2024 తాడేపల్లి : అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ ఎన్నికల షెడ్యూలు వల్ల ఈ వెసులుబాటు వచ్చింది ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి 07:10 PM, మార్చి 18 2024 తాడేపల్లి: భారీ ప్రచారానికి వైఎస్ జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర ఈనెల 26 లేదా 27 తేదీన ప్రారంభం దాదాపు 21రోజులపాటు పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో " మేమంతా సిద్ధం " ,పేరుతో బస్సు యాత్ర బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ మీడియాతో పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురామ్. 06:20 PM, మార్చి 18 2024 పిఠాపురం: కార్యకర్తలతో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ సమావేశం ఇప్పుడు జనసేనలో ఉన్నవాళ్లు నిజమైన కార్యకర్తలు కాదు కొత్త జనసేన వాళ్లు మనల్ని కొడతారు..కేసులు పెడతారు టీడీపీ నుంచి విసిరేసినవాళ్లను జనసేన కొనుక్కుంది కాకినాడ నుండి వచ్చిన వాళ్లు మాస్కులు పెట్టుకుని జనసేనలో చేరుతున్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలి కొత్త జనసేన వాళ్లు టిడిపి వాళ్ళను కొడతారు..కేసులు పెడతారు టిడిపి నుండి విసిరేసిన వాళ్ళని....కొనుక్కున్న వాళ్ళు జనసేన ఉన్నారు వాళ్ళు టీడీపీనే తొక్కి రాజకీయాలు చేశారు చివరికి నన్ను హత్య కేసులో ఇరికించాలనుకున్నారు. 05:49 PM, మార్చి 18 2024 విశాఖ: విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించాలని కోరుతున్నాం మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మిత్ర పక్షం టీడీపీ కూడా ఇదే సీటు కావాలని అడుగుతుంది.. 2014లో విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు అంతే కాకుండా విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది అందుకే టికెట్ బీజేపీ అభ్యర్థికే ఇవ్వాలని కోరుతున్నాం 2019 ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ఓడిపోయారు కనుక ఆయనకే టికెట్ ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతుంది 05:14 PM, మార్చి 18 2024 తాడేపల్లి : క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశం సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మ్యానిఫెస్టో తదితర అంశాలపై చర్చ మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై దిశానిర్దేశం చేయనున్న జగన్ 04:30 PM, మార్చి 18 2024 విజయవాడ: పవన్ రూ. 500 కోట్లు తీసుకుని 21 సీట్లకి సరెండర్ అయ్యాడు: కేఏ పాల్ 2014లో మోదీ మోసం చేశాడు ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ నన్ను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తాను. లేకపోతే ప్రజలే నష్టపోతారు 03:19 PM, మార్చి 18 2024 గుంటూరు: తెలుగుదేశం పార్టీపై మండిపడ్డ బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది 50 శాతం ఉన్న బీసీలను అసలు మనుషులుగా కూడా చూడలేదు బీసీలు ఓట్లు వేసే యంత్రాలు అనుకుంటున్నారు గుంటూరులో టీడీపీ పార్టీ కోసం పనిచేసే పేదల డాక్టర్ గా ఉన్న శేషయ్యను వాడుకుని వదిలేసింది ఎక్కడో అమెరికా నుంచి డబ్బులు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇవ్వటం దారుణం ఎన్నారైలు వస్తారు డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు మంగళగిరి సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది సామాజిక న్యాయం అంటే అది కానీ లోకేష్ మాత్రం వైఎస్సార్సీపీకి చెందిన బీసీ అభ్యర్థి పైన పోటీ చేసి వారిని ఆనగదొక్కడానికి రెడీ అయ్యారు లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో తప్పుకుని ఆ సీటును బీసీలకు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ డబ్బు సంచులను మోసుకొచ్చే కంచర గాడిదలకు సీట్లు ఇస్తుంది కృష్ణ , ఎన్టీఆర్, గుంటూరు ,నరసరావుపేట ,బాపట్ల లోక్సభ పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా అవకాశం కల్పించలేదు తెలుగుదేశం పార్టీ యాదవుల నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం 03:12 PM, మార్చి 18 2024 ప్రకాశం కొండేపిలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆద్వర్యంలో టీడీపీ నుండి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు 02:43 PM, మార్చి 18 2024 జగ్గంపేట(కాకినాడ జిల్లా): కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సమక్షంలో పార్టీలో చేరిన కొత్తపల్లి టీడీపీకి చెందిన 25 కుటుంబాలు 02:33 PM, మార్చి 18 2024 తిరుపతి: నగర కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు : రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు తిరుపతి నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న అన్ని పోస్టర్లను, బ్యానర్లను తొలగించడం జరిగింది , ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు నగరంలో పర్యటిస్తూ నియమ నిబంధనలు పటిష్టంగా అమలు పరిచేలా తగు చర్యలు తీసుకుంటున్నాం ఎన్నికల నిబందనలకు వ్యతిరేకంగా ఎవరైన ప్రవర్తిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటాం 02:25 PM, మార్చి 18 2024 తిరుపతి జిల్లా: సత్యవేడు టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు సత్యవేడు మండల కేంద్రంలోని భేరి శెట్టి కళ్యాణమండపంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల ఆందోళన సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలానికి ఎట్టి పరిస్థితిలో సహకరించేది లేదని స్పష్టం చేసిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ పార్టీలో చేరకుండానే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారంటూ నిలదీత చంద్రబాబు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని నాయకులు కార్యకర్తలు డిమాండ్ 02:22 PM, మార్చి 18 2024 కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన మెయిన్ రోడ్డులో అన్న క్యాంటిన్ వద్ద టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు ఎన్టీఆర్ విగ్రహనికి వేయని ముసుగు 02:20 PM, మార్చి 18 2024 ‘మేమంతా సిద్ధం’ పేరు సీఎం జగన్ బస్సు యాత్ర.. భారీ ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్ బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ మరో వారంరోజుల్లో బస్సు యాత్ర ప్రారంభం ఈనెల 26 లేదా 27 తేదీల్లో ప్రారంభం దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడి 02:10 PM, మార్చి 18 2024 టీడీపీ అభ్యర్ధి కొలికపూడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్వామిదాస్ ఒక కుహనా మేధావి తిరువూరుకు వచ్చాడు రంగా హత్యకు వైఎస్సార్ కారణమని ఓ కుక్క మొరుగుతోంది కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు కొలికపూడి ఒక కుసంస్కారి కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు విద్యార్ధి దశ నుంచే రంగా గురించి నాకు తెలుసు రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి తిరువూరులో 70 వేల మంది ఎస్సీల్లో చంద్రబాబుకు ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా? చందాలు వసూలు చేసి వాటాలు పంచుకోవడానికే కొలికపూడిని తిరువూరు పంపించారు నేను పక్కా లోకల్.. తిరువూరులోనే పుట్టాను. జీవితాంతం తిరువూరులోనే ఉంటాను. చంద్రబాబు తన ప్రధాన శత్రువు మోదీతో జీవితంలో కలవనన్నాడు ఇప్పుడు తన స్వార్ధం కోసం.. తన కొడుకుని సీఎం చేయడానికి చేతులు కలిపాడు ఏం చేశారని మోదీతో చేతులు కలిపాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు, పవన్ జిమ్మిక్కులను కాపులు నమ్మరు సీఎం జగన్కు ఓడించడానికి ముగ్గురూ కలిసి వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ సింహంలా సింగిల్గా వస్తారు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సభ్యుల్లో సగం బీసీలకు కేటాయించారు కాపులకు జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యం కల్పించారు కాపులను అన్ని విధాలా ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్రెడ్డి కాపులను బిసిల్లో చేర్చాలని రంగా చేసిన పోరాటానికి వైఎస్సార్ అండగా నిలిచారు నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం కాపులను మంత్రులు.. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సీఎం జగన్ టీడీపీలో ఉన్న కాపులు ఆలోచించాలి కాపులకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు కాపులకు రిజర్వేషన్లు వైఎస్సార్సీపీతోనే సాధ్యం తిరువూరులో నల్లగట్ల స్వానిదాస్కు కాపులు అండగా నిలవాలి కాపులకు వైఎస్సార్సీపీ అండగా ఉందనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి రేపట్నుంచే ప్రతీ గ్రామానికీ తిరిగి వైసీపీ చేసిన మేలును గుర్తు చేయాలి 01:45 PM, మార్చి 18 2024 సీనియర్లతో చంద్రబాబు సమావేశం తన నివాసంలో టీడీపీ సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు నాయుడు నిన్నటి ప్రజాగళం మీద సమీక్ష నిర్వహించిన టీడీపీ అధినేత రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరిట మరిన్ని సభలు నిర్వహించాలని భేటీలో తీర్మానం 01:43 PM, మార్చి 18 2024 కాపు రాజ్యాధికారం జగన్ వల్లే సాధ్యమైంది: అడపా శేషు పవన్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయింది జనసేన పెట్టి 11 ఏళ్లయ్యింది వైఎస్సార్సీపీ పెట్టి 14 ఏళ్లయ్యింది కాపుల పై ఒక ముద్ర వేశారు ఈ ముద్ర వల్ల మనం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం కాపులకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు 30 మందిని ఎమ్మెల్యేలను చేశారు ...మంత్రి పదవులిచ్చారు కాపులు ఎవరికీ తలొంచరు...అదే మన ఆత్మవిశ్వాసం ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కింది జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారు రాజ్యాధికారం కోరుకోరా? ఇల్లూవాకిల్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి ? 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడు జగన్ మోహన్ రెడ్డి మనకు ఏంచేయలేదని వ్యతిరేకించాలి జగన్ మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారు చెప్పాడంటే చేస్తాడంతే...అదే జగన్ మోహన్ రెడ్డి పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కొలికపూడి శ్రీనివాస్ పై అడపా శేషు ఫైర్ రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి...పథకాలు ఆగిపోతాయి కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్ మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే చిరంజీవి,పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ,చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు తిరువూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు వ్యాఖ్యలు 01:38 PM, మార్చి 18 2024 ప్రధాని సభలో భద్రతా వైఫల్యం:నాదెండ్ల చిలకలూరిపేట ప్రజాగళం సభపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందన ప్రధాని సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని వ్యాఖ్య ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న నాదెండ్ల టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొందరికి నచ్చట్లేదు.. అందుకే పొత్తులపై అపోహ సృష్టించే యత్నమన్న నాదెండ్ల దుష్ప్రచారాలను నమ్మొద్దు.. తిప్పికొట్టాలంటూ జనసేన కేడర్కు నాదెండ్ల పిలుపు 01:25 PM, మార్చి 18 2024 నితీశ్లాగే చంద్రబాబు కూడా.. : ఆదినారాయణ రెడ్డి బీహార్ లో నితీష్ కుమార్ ఎన్నోసార్లు బయటకి వచ్చి మళ్లీ ఎన్డీయేలో చేరలేదా? చంద్రబాబు కూడా అంతే! ప్రత్యేకహోదా కోసం బయటకి వచ్చారు.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ ఎన్డీయేలో చేరారు ఏపీలో కూడా ఎన్డియే ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నా ఏపీ ఎన్నికల గురించే నిన్నంతా చంద్రబాబు, పవన్, మోదీ మాట్లాడుకున్నారు మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు 01:21 PM, మార్చి 18 2024 బీసీలను వాడుకున్న చరిత్ర బాబుది: వాసుపల్లి గణేష్ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనే సీఎం జగన్ ఆలోచనకు హ్యాట్సాఫ్.. సీఎం జగన్ చేసిన సామాజిక న్యాయం.. వేరే పార్టీ వాళ్లు ఎవ్వరూ చెయ్యలేరు.. దేశ చరిత్రలో వాడబలిజ కులం నుంచి నేను ఒక్కడినే ఎమ్మెల్యే మళ్లీ సీఎం జగన్ నాకు అవకాశం ఇచ్చారు అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు బీసీలను వాడుకున్నారు మత్స్యకారులకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి బాబు మోసం చేశారు నేను ప్రశ్నిస్తే.. బాబు నన్ను తిట్టారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా బాబుకి గుర్తుండవు కోలా గురువులు కి సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తే చంద్రబాబు ఓడించారు మాకు పదవులు ఇస్తే చంద్రబాబు చూడలేకపోయారు ఒకప్పుడు మోదీని తిట్టిన బాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నారు చంద్రబాబు మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారు సాక్షి టీవీతో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 01:14 PM, మార్చి 18 2024 కొలికపూడి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీ కాపు నేతలు తిరువూరులో వైఎస్సార్సీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, ఆకుల శ్రీనివాస్,తిరువూరు అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్ తదితరులు రంగా చనిపోయిన తర్వాత కాపులకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్.రాజశేఖర్ రెడ్డి : ఆకుల శ్రీనివాస్ వైఎస్సార్ పై తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : ఆకుల శ్రీనివాస్ రంగా అనే వ్యక్తి అసలు కొలికపూడి శ్రీనివాస్ కు తెలుసా : ఆకుల శ్రీనివాస్ ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చి రంగా శిష్యుడినని చెప్పుకుంటున్నాడు: ఆకుల శ్రీనివాస్ కొలికపూడిని కాపులంతా వ్యతిరేకించాలి : ఆకుల శ్రీనివాస్ తిరువూరులో స్థానికుడైన నల్లగట్ల స్వామిదాస్ కు కాపులంతా అండగా ఉండాలి : ఆకుల శ్రీనివాస్ పవన్ ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు పెద్దన్న అయ్యాడు: ఆకుల శ్రీనివాస్ టీడీపీతో కలిశాక చిన్నయ్య అయ్యాడు: ఆకుల శ్రీనివాస్ 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగ్గించుకుని పవన్ దిగజారిపోయాడు: ఆకుల శ్రీనివాస్ కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ : ఆకుల శ్రీనివాస్ కాపులకు కాపు కాసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి: ఆకుల శ్రీనివాస్ 12:49 PM, మార్చి 18 2024 విశాఖ జనసేనలో టికెట్ల రచ్చ విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణయాదవ్ కు కేటాయిస్తారంటూ ప్రచారం స్థానికులకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతల డిమాండ్ 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదంటూ అభ్యంతరాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని పట్టుబడుతున్న కార్యకర్తలు 12:34 PM, మార్చి 18 2024 సిగ్గుందా ?.. ప్రజలన్నీ గమనిస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్ తన తల్లిని లోకేష్ తిట్టించారని పవన్ కల్యాణ్ యాగీ చేశారు తల్లిని తిట్టిన లోకేష్ క్షమాపణ చెప్పకుండా పవన్ ఎలా కలిశారు పవన్ కల్యాణ్కి సిగ్గుందా ? చంద్రబాబుపై పవన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసాడు ఆరోపణలు నిజమైతే చంద్రబాబుతో పవన్ క్షమాపణలు చెప్పించాలి అబద్దమైతే పవన్ క్షమాపణలు చెప్పాలి మోదీని చంద్రబాబు ఇష్టానుసారంగా తిట్టారు పోలవరం ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీ విమర్శించారు ఇప్పుడు వీళ్ళంతా కలవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అందుకే ప్రధాని, ఒక సినిమా స్టార్, 40ఏళ్ల ఇండస్ట్రీ, తొడలు కొట్టే బాలయ్య కలిసినా సభ వెలవెలబోయింది జగన్ ఒక్క పిలుపు ఇస్తే సిద్ధం సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు మూడు పార్టీలు పొత్తు పొత్తు పెట్టుకున్నా విజయం వైఎస్సార్సీపీదే 12:15 PM, మార్చి 18 2024 మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పిఠాపురం వర్మ టీడీపీ శ్రేణుల పై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు పిఠాపురం టీడీపీ కార్యకర్తలెవరూ జనసేనలోకి వెళ్లడం లేదు కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకొని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారు కాకినాడ నుంచి వచ్చినవాళ్లే మా వాళ్ల పై దాడులు చేస్తున్నారు పవన్ పల్లకి మోసినంతమాత్రాన మేమేమీ చేతులు కట్టుకుని కూర్చోము పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది 12:01 PM, మార్చి 18 2024 కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా??: మాజీ ఎంపీ మేకపాటి చంద్రబాబు బతిమాలితేనే పొత్తుకి మోదీ ఒప్పుకున్నారని నిన్న సభ స్పష్టం చేసింది.. సీఎం జగన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా అనలేదు.. జగన్ అవసరం మోదీకి చాలా ఉంది చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరు.. అందుకు నిన్నటి ప్రజాగళం సభే నిదర్శనం చంద్రబాబు దుర్మార్గుడు కాబట్టే ప్రజలు, ప్రధాని మోదీ ఆయన్ని నమ్మడం లేదు పవన్ కల్యాణ్ తన స్థాయికి మించి జగన్ పై విమర్శలు చేస్తున్నారు కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా?? పవన్ కల్యాణ్ తాత ముత్తాతలు దిగివచ్చినా.. సీఎం వైఎస్ జగన్ను ఏం చేయలేరు పాదయాత్ర సమయంలో లక్షణాలు చూసి జగన్ గొప్ప నాయకుడు అవుతారని అప్పుడే ఊహించాను ప్రధాని నరేంద్ర మోదీ పెద్దమనిషి తరహాలో మాట్లాడారు ఎన్డీయేకి మద్దతు ఇవ్వమని అడిగారు తప్ప.. టీడీపీని గెలిపించమని మోదీ ఎక్కడా కోరలేదు సాక్షి టీవీతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్ది వ్యాఖ్యలు 11:53 AM, మార్చి 18 2024 అక్రమ కలయిక కాబట్టే.. : మార్గాని భరత్ కౌంటర్ చిలకలూరిపేటలో ప్రతిపక్షాల బహిరంగ సభ అపశకునం.. ప్రధాని సభలో మైకులే మూగబోయాయి పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడు అందుకే మైకులు పనిచేయలేదు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఆ మూడు పార్టీలే.. ఈ మూడు పార్టీలది అక్రమ కలయిక పోలవరం పూర్తి చేయలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్ఛిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు అయినా జనసేన, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చిలకలూరిపేట వేదికగా ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ మీకు హామీ ఇచ్చారా? ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరంతా కలసి తాకట్టు పెడుతున్నారు ఎన్డీయేలో మీరంతా ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలి విలువలు విశ్వసనీయతకు చంద్రబాబు జీవితంలో అసలు చోటు ఉందా? ఆంధ్ర ప్రదేశ్ ను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య నాపై ఆదిరెడ్డి వాసు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఆయనకిదే స్ట్రాంగ్ కౌంటర్ రాజమండ్రిలో పర్సంటేజీలు తీసుకుంటున్నానని నాపై దుష్ప్రచారాలు చేస్తున్నావ్ గంజాయి బ్యాచ్ లను పెంచి పోషించే నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివా? నీ అనుచరులు హైదరాబాదులో గంజాయితో దొరకలేదా? సానిటరీ ఇన్స్పెక్టర్ల వద్ద వెయ్యి రెండువేలు లంచం తీసుకునే పరిస్థితి నీది ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్సీపీ పెట్టిన భిక్ష నిన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు అడగలేదు? విభజన హామీలు బీజేపీ ఇంకా అమలు చేయలేదు ప్రజాగళం సభపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యలు 11:38 AM, మార్చి 18 2024 పొత్తుతో కూడా ఈసారి బాబు ఓడి తీరతారు చంద్రబాబు ఎప్పుడూ సింగిల్గా విజయం సాధించలేదు ఈసారి పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విజయం సాధించలేరు సీఎం పవన్ కావాలనుకున్న పవన్.. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే చాలన్నట్లున్నారు బీజేపీకి అభ్యర్ధులు కూడా దొరకడంలేదు డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు 11:11 AM, మార్చి 18 2024 పిఠాపురం వెళ్లనున్న పవన్ కల్యాణ్ వచ్చేవారం పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ ప్రకటించాక తొలిసారి అక్కడికి జనసేన అధినేత నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో కార్యకర్తలతో సమావేశం గ్రామాలవారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం వర్మ చల్లబడ్డట్లు కనిపిస్తున్నా.. టీడీపీ సహకరిస్తుందా? అనే అనుమానాలు పిఠాపురం పోటీ ప్రకటించగానే.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు 10:56 AM, మార్చి 18 2024 సీఎం జగన్ ఆ ధైర్యమిచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ లో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్ధి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపి అభ్యర్ధి మద్దెల గురుమూర్తి, ఇతర ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది రామ్ కుమార్ రెడ్డి అందరికీ అండగా నిలబడుతారు అందరం కలిసి మెలిసి వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్దిని మనం గెలిపించుకోవాలి ఎంపీగా గురుమూర్తి నిత్యం శ్రమించారు అభివృద్ది కార్యక్రమాలు, నిధులు రాబట్టడం లో గురుమూర్తి చుకైన పాత్ర పోషించారు వారిద్దరినీ ఎన్నుకోవడం మన బాధ్యత ప్రతి ఇంటి సంక్షేమ పథకాలు అందించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యాన్ని సీఎం జగన్ మనకు ఇచ్చారు జన్మభూమి కమిటీలతో దోచుకున్న టీడీపీ నాయకులకి ప్రతి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు భారీ మెజారిటీ తో విజయం సాధించడమే మన లక్ష్యం రామ్ కుమార్ రెడ్డి అభ్యర్ధిగా ఖరారు అయ్యారు... ఆయనే వెంకటగిరి నుండి పోటీ చేస్తారు మిగిలిన వారిని కూడా కలుపుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి.. వైఎస్ జగన్కు అత్యధిక స్థానాలు అందించాలి 10:54 AM, మార్చి 18 2024 వైఎస్సార్సీపీలో చేరారని కత్తులతో దాడి అనంతపురం తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీ లో టీడీపీ నేతల దాష్టీకం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఖాదర్ బాషా, షేక్షావలి పై కత్తులతో దాడి వైఎస్సార్ సీపీ లో చేరారన్న అక్కసుతో దాడికి పాల్పడిన జేసీ వర్గీయులు ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి కి తరలింపు 10:52 AM, మార్చి 18 2024 విజయవాడ వెస్ట్లో చల్లారని కూటమి మంట బీజేపీ సీటు వెళ్లిందని ప్రకటించిన పవన్ కల్యాణ్ భగ్గుమన్న జనసేన కార్యకర్తలు విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశించిన పోతిన మహేష్ నిరసనగా ప్రజాగళం సభను బహిష్కరించిన జనసేన కార్యకర్తలు ఇవాళ జనసేన యువత ఆధ్వర్యంలో ఆందోళన 10:43 AM, మార్చి 18 2024 ‘జగనన్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం’ చంద్రబాబు.. పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైన సీఎం వైఎస్ జగన్ 175కి 175 గెలవాలన్నదే జగన్ లక్ష్యం ఆ లక్ష్యాన్ని మేం నెరవేరుస్తాం అంటూ ప్రజా గళం పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి @ncbn. సీఎం వైయస్ జగన్ ఒంటరిగానే వస్తున్నారు. 175కి 175 గెలవాలన్న సీఎం @ysjagan లక్ష్యాన్ని మేం నెరవేర్చి చూపిస్తాం.#PublicVoice#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/wxKVvI47M1 — YSR Congress Party (@YSRCParty) March 18, 2024 10:39 AM, మార్చి 18 2024 బాబు ఎన్డీయే సహకారంతోనే అన్నీ చేశారట ఎన్నికల వేళ.. మళ్లీ ఎన్డీయే పంచన చేరిన చంద్రబాబు గతంలో ఎన్డీయే కూటమి, బీజేపీని బహిరంగంగా విమర్శలు గుప్పించిన బాబు చిలూకలూరిపేట ప్రజాగళంలో ఎన్డీయే, మోదీపై ప్రశంసలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఎన్డీయే సహకారంతోనే చేశామంటూ ప్రసంగం విభజన తర్వాత ఎన్డీయే భాగస్వామ్యంతో ఏపీలో 11 జాతీయ విద్యాసంస్థలని నెలకొల్పాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం తలపెట్టాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశాం.#PrajaGalam #TDPJSPBJPWinning #APWelcomesNamo pic.twitter.com/ip9MtNKjGJ — N Chandrababu Naidu (@ncbn) March 18, 2024 10:34 AM, మార్చి 18 2024 కడప ఎంపీ బరిలో షర్మిల? కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ అభ్యర్థినిగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల షర్మిలకు సీటు కేటాయించే యోచనలో ఏఐసీసీ కొనసాగుతున్న అభ్యర్థుల ఎంపిక ఉగాది లోపు కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదలయ్యే అవకాశం 10:10 AM, మార్చి 18 2024 కాసేపట్లో YSRCP మేనిఫెస్టోపై చర్చ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం కాసేపట్లో తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దనున్న వైఎస్సార్సీపీ ఎప్పుడు ప్రకటిస్తారనేదానిపైనా భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఇదీ చదవండి: నవరత్నాలకు అప్గ్రేడ్ వెర్షన్లా మేనిఫెస్టో! 10:05 AM, మార్చి 18 2024 ఫ్రస్టేషన్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరినా వసంతకు టిక్కెట్ ఎక్కడో చెప్పని చంద్రబాబు తనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆవేశంతో ఊగిపోతున్న వసంత టీడీపీలోకి చేరిన విషయం పై వసంతను ప్రశ్నించిన జర్నలిస్టులు సమాధానం లేక జర్నలిస్టుల పై బూతులతో విరుచుకుపడ్డ వసంత కృష్ణప్రసాద్ జర్నలిస్ట్ లు ఛానల్స్ మారట్లేదా? రాజకీయనాయకులు పార్టీలు మారితే తప్పేంటని దబాయింపు తనను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై బూతులతో విరుచుకుపడిన వసంత కృష్ణప్రసాద్ వసంత వైఖరితో షాకైన జర్నలిస్టులు 09:42 AM, మార్చి 18 2024 విశాఖ: ‘వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు’ విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన పార్టీలో బయటపడ్డ విభేదాలు వంశీకి సీటు ఇవ్వొద్దంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సాదిక్, మూగి శ్రీనివాస్ జనసేన సౌత్ నియోజక వర్గం సీటు స్థానికులకే కేటాయించాలి నేనే అభ్యర్థినని వంశీ హడావిడి చేస్తున్నారు పార్టీ ఎక్కడ అధికారికంగా వంశీని అభ్యర్థిగా ప్రకటించలేదు వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు గతంలో 50 వేల ఓట్లు ఓడిపోయిన వంశీకి సీటు ఎలా ఇస్తారు విశాఖ చరిత్రలో అంత మెజార్టీతో ఓడిపోయిన నేత మరొకరు లేరు వంశీకి సీటు ఇస్తే వైఎస్ఆర్సిపి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుంది పక్క నియోజకవర్గంలో పనికిరాని వంశీని మా నెత్తిన పెడతారా? జనసేన జెండా మోయని వంశీకి జనసేన సీటు ఇస్తారా? వంశీకి సీటు ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు 08:59 AM, మార్చి 18 2024 ఎన్నికల సమరం.. ఇక ప్రచారంలోకి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ జిల్లాల వారీగా క్యాంపెయిన్ షెడ్యూల్ పై కీలక భేటీ నేడు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లతో మధ్యాహ్నం మీటింగ్ ఎన్నికల ప్రచారం, కార్యాచరణపై చర్చ నియోజకవర్గాల్లో పార్టీ పోరాట సన్నద్ధత పైనా చర్చ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి నియోజకవర్గంలో పర్యటన నేడో రేపో సీఎం ప్రచార షెడ్యూల్పై రానున్న స్పష్టత దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ 08:08 AM, మార్చి 18 2024 ఇది మోదీ సభేనా అసలు? టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్ ఎన్టీయే కూటమి పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని మోదీకి ఘోర అవమానం ప్రదాని మోదీకి వేదికపై కనీసం బొకె, శాలువా కూడా తీసుకురాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రదాని మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటించడంతో బిత్తరచూపులు చూసిన చంద్రబాబు, పవన్ వ్యాఖ్యాత సన్మాన ప్రకటనతో లేచి నిల్చున్న ప్రధాని ఎవరూ బొకే ఇవ్వకపోవడంతో తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహుకరించిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి జనం లేక సభ వెల వెలబోయిన సభ 15 లక్షల మంది వస్తారంటూ ఊదరగొట్టిన టీడీపీ నేతలు కనీసం లక్షమంది కూడా హాజరుకాకపోవడంపై నేతల్లో నైరాశ్యం పవన్, చంద్రబాబు ప్రసంగ సమయానికి సగం కుర్చీలు ఖాళీయే సభకి పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ కార్యకర్తలు పార్టీల మధ్య సమన్వయ లోపంతో సభ అట్టర్ ప్లాప్ కవరింగ్ చేసుకోవడానికి చంద్రబాబు పాట్లు.. కార్యకర్తలకి సైగలు స్టేజ్ ముందు టీడీపీ కార్యకర్తల హంగామాతో పనిచేయని మైకులు ప్రదాని మోదీ ప్రసంగ సమయంలో పలుమార్లు పనిచేయని మైకులు ప్రదాని సభలో మైకులు పనిచేయకపోవడం ఇదే మొదటిసారి అంటున్న బీజేపీ నేతలు ప్రదాని సభకి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై బీజేపీలో అసహనం మైకులు పనిచేయకపోవడంపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి పదే పదే మైకులు మొరాయించడంతో ఉత్సాహంగా మాట్లాడలేకపోయిన ప్రదాని స్టేజ్ పైనా చంద్రబాబు, పవన్ లతో ముభావంగానే ప్రదాని సభ ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ లపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని? ప్రధాని వచ్చే సభని ఇలాగేనా నిర్వహించేదంటూ చురకలు ఎన్డీయే తొలి సభనే సరిగ్గా నిర్వహించలేకపోయారని బీజేపీ శ్రేణులు ఎద్దేవా 08:00 AM, మార్చి 18 2024 జనసేన ఆఫీస్కు Tolet బోర్డు జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డ్ ఏర్పాటు.. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం మాధవధారలో జనసేన కార్యాలయం ఏర్పాటు రీజనల్ పార్టీ కార్యాలయం నుంచి సమీక్షలు సమావేశాలు.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిలిపివేత కొన్ని రోజుల క్రితం అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన నాగబాబు ఆ తర్వాత పార్టీ కార్యాలయం మూసివేసిన నాగబాబు పార్టీ కార్యాలయం మూసివేత పై జనసేన నాయకుల ఆగ్రహం పార్టీ కార్యాలయం లేని పార్టీగా జనసేన తయారయ్యిందంటూ అసంతృప్తి పార్టీ కార్యాలయం నడిపించలేని స్థితికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారని ఆవేదన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించలేని దుస్థితి జనసేనకు ఏర్పడిందని మండిపాటు 07:33 AM, మార్చి 18 2024 YSRCP మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి తుది దశకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మ్యానిఫెస్టోని ప్రకటించే అవకాశం వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వబోమని పార్టీ ఆవిర్భావం నుంచి చెబుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీల విషయంలో కాంప్రమైజ్ కాని వైనం 2019 మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజల్లో బలంగా నమ్మకం ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ 07:19 AM, మార్చి 18 2024 ప్రజాగళంపై అంబటి సెటైర్ మైక్ ఫెయిల్ ! మీటింగ్ ఫెయిల్ ! టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ ! అంటూ అంబటి ట్వీట్ మైక్ ఫెయిల్ ! మీటింగ్ ఫెయిల్ ! టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ !@ncbn @PawanKalyan @BJP4India — Ambati Rambabu (@AmbatiRambabu) March 17, 2024 కూటమి కుదేలవుతుందన్న భయం వీళ్లిద్దరి మొహాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని తెలివిగా ముందే పసిగట్టిన @naralokesh స్టేజ్ ఎక్కకుండా జాగ్రత్త పడ్డాడు! #MahaDustaKutami#EndOfTDP pic.twitter.com/1qxcg7kYwD — YSR Congress Party (@YSRCParty) March 17, 2024 07:11 AM, మార్చి 18 2024 ఓటమి భయంతో.. టీడీపీ నేత తప్పుడు ఫిర్యాదు ఓటమి భయంతో టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు తప్పుడు ఫిర్యాదు తనిఖీలు నిర్వహించి తప్పుడు ఫిర్యాదుగా తేల్చిన అధికారులు గ్రీన్ గార్డెన్ లో క్రికెట్ కిట్లు, చీరలు ఎంవీవీ పంపిణీ చేస్తున్నారని తప్పుడు ఫిర్యాదు చేసిన వెలగపూడి ఫిర్యాదు రాగానే ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, భీమిలి, ఈస్ట్ పోలీసులు అపార్ట్ మెంట్ లోని 65 ప్లాట్ లు తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించిన అనంతరం టీడీపీ నేత ఇచ్చింది తప్పుడు ఫిర్యాదుగా తేలిన వైనం ఈ తనిఖీ పై 24 గంటల్లో రిపోర్ట్ పైకి పంపాలని నిర్ణయించిన ఆర్డీఓ భాస్కర్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత తమకి వచ్చిన మొదటి ఫిర్యాదుగా పేర్కొన్న అధికారులు 06:59AM, మార్చి 18 2024 బాబు బండారం బయటపడింది టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అరకొరగా సీట్లు రెండు విడతలుగా ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకే ప్రాధాన్యం సొంత సామాజిక వర్గానికంటే తక్కువగా బీసీలకు బీసీలకు 24తో సరి కమ్మ సామాజికవర్గానికి 28 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కాపులకు 8, మైనారిటీలకు 3 మహిళలకు ఇచ్చిన సీట్లు కేవలం 17 సామాజిక న్యాయానికి పాతర.. ఇదీ బాబు బండారం సంబంధిత కథనం కోసం క్లిక్ చేయండి 06:49AM, మార్చి 18 2024 ప్రజాగళంలో వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ కనీసం ఓ శాలువా, ఓ పూల బొకే కూడా తీసుకురాని బాబు, పవన్ మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటన లేచి నిల్చున్న మోదీ.. దిక్కులు చూసిన టీడీపీ, జనసేన అధినేతలు తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించిన పురందేశ్వరి 15 లక్షల మంది ప్రజలు వస్తారని నేతల ప్రకటన లక్ష మంది కూడా లేక వెలవెలబోయిన సభ వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే జనం లేకపోవడంతో బాబు కవరింగ్ టీడీపీ కార్యకర్తలతో స్టేజి ముందు హంగామా పని చేయని మైకులు.. మోదీ అసహనం పవన్ ప్రసంగం మధ్యలో ఆపి మరీ వారిని కిందికి దించిన ప్రధాని కూటమి తొలి సభ అట్టర్ ఫ్లాప్తో నైరాశ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇదీ చదవండి: బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు 06:47AM, మార్చి 18 2024 చంద్రబాబుకి మాదిగల అల్టిమేటం కొవ్వూరు టికెట్ విషయంలో చంద్రబాబుకు మాదిగల అల్టిమేటం జవహర్ కి టికెట్ కేటాయించకపోతే టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక చంద్రబాబు మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నాడని ఆగ్రహం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి జవహర్ కి టికెట్ ఎందుకు ఇవ్వలేదని? సూటి ప్రశ్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్దమైన మాదిగలు టీడీపీ కష్ట కాలంలో వున్నపుడు జవహర్ పార్టీ కోసం కృషి చేసారు: మాదిగ సంఘాల ప్రతినిధులు మాదిగలకు ఒక పెద్ద దిక్కుగా జవహర్ వున్నాడు: మాదిగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు కష్ట కాలంలో వున్నపుడు మాదిగల సహకారం తీసుకోవడం, తర్వాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది: మాదిగ సంఘాల ప్రతినిధులు వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు: మాదిగ సంఘాల ప్రతినిధులు వాగ్ధానాలకు, ప్రకటనకు బాబు పరిమితం.. ఆచరణ మాత్రం శూన్యం : మాదిగ సంఘాల ప్రతినిధులు జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే బాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు : మాదిగ సంఘాల ప్రతినిధులు జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తాం : మాదిగ సంఘాల ప్రతినిధులు పార్టీని సేవ చేయనివాళ్ళు, పార్టీ జెండా పట్టుకొని వాళ్లకు బాబు టికెట్ ఇస్తున్నారు : మాదిగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు ఎన్నికలు కాకముందే సీఎం అయ్యిపోయాననే భావనలో కూరుకుపోయారు: మాదిగ సంఘాల ప్రతినిధులు 06:29AM, మార్చి 18 2024 కూటమి పరిస్థితి దారుణం ఒకేసారి 175 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రతిపక్ష కూటమి మాత్రం నాన్చుడు ధోరణి ఎటూ తేల్చలేక చంద్రబాబు సతమతం బలమైన అభ్యర్థులు దొరకకపోవడమే కారణం ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం తేలని మైలవరం, పెనమలూరు పంచాయితీ ఆలూరు, గుంతకల్లు సీట్లపైనా నాన్చుడే టికెట్ల ఖరారులో బీజేపీ, జనసేనదీ అదే తీరు 06:25AM, మార్చి 18 2024 YSRCP.. జయహో బీసీ గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి 2019, ఫిబ్రవరి 17న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సమున్నత స్థానం డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో వారికి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనం ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తేటతెల్లం అదే 2012లో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతర కనీసం కేబినెట్లో కూడా ప్రాధాన్యత లేదు.. పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపని టీడీపీ అధినేత బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని.. తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళన చేసిన బాబు ఇప్పుడు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచించారంటూ ఫైర్.. తమ వెన్నువిరిచిన చంద్రబాబు నాయకత్వంపై బీసీల్లో ఆగ్రహావేశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వార్ వన్సైడే అంటున్న విశ్లేషకులు 06:23AM, మార్చి 18 2024 పవన్కు షాకిచ్చిన బెజవాడ జనసేన కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు షాకిచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీతో మిత్రపక్షం అధినేత చంద్రబాబుతో ప్రజాగళం పేరిట బహిరంగ సభ నిర్వహించిన పవన్ జనంతో పాటు జనసేన కార్యకర్తలూ దూరం విజయవాడ వెస్ట్ టికెట్లో తీవ్ర అసంతృప్తితో ప్రజాగళం బహిష్కరణ బెజవాడలో @PawanKalyan కు షాకిచ్చిన సైనిక్స్. నువ్వు @ncbnకు ఊడిగం చేస్తే చేసుకో, నీ వెంట మేము రాలేమన్న జనసైనికులు. పెడన, విజయవాడ వెస్ట్ కార్యకర్తలు మూకుమ్మడిగా ప్రజాగళం సభను బహిష్కరించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ ను నిలదీసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.#MahaDustaKutami… pic.twitter.com/pIg7s6ol2Y — YSR Congress Party (@YSRCParty) March 17, 2024 -
నేను రాజకీయాల్లో హీరోను.. పవన్పై ముద్రగడ ఫైర్
సాక్షి, కాకినాడ: రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే.. బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.. .. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరు?. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు?. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. .. ‘‘సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. మీరేంటీ పొడుగు?.. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు. నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది?’’.. అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. .. ‘వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్కు దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం’ అంటూ ముద్రగడ ప్రకటించారు. -
బాబు, పవన్కు విశ్వసనీయత, విలువల్లేవ్: సీఎం జగన్
సాక్షి, నంద్యాల: పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమంమే ఈ వైఎస్సార్ ఈబీసీ నేస్తం. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు. 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు. అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది.ూ ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం 610 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. వైఎస్సార్ చేయూత ద్వారా 4560 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4560 సంవత్సరాల వయసున్న కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడటం, ఆర్థిక సాధికారతకు సహకారం అందిస్తున్నట్లుగానే వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 33,14,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి మంచి జరిగించాం. మొత్తంగా 4560 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 44,74,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ గానీ, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదు, వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదుూ అర్హత ఉంటే చాలు.. ప్రతి అక్కచెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తున్నాం. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ ఇస్తూ అండగా నిలబడుతున్న పరిస్థితి.ూ గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరుమీదే, వారి పేరు మీదే బ్యాంకు అకౌంటు తెరిచి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తున్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే.. .. మీ మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లతో అడగండి. 10 సంవత్సరాల డేటా ఇవ్వండని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాలకు సంబంధించనది, మన 5 సంవత్సరాల పాలన డేటాను ఒకసారి చూసుకోండి. చంద్రబాబు 5 సంవత్సరాల డేటా చూస్తే మీ బ్యాంకు అకౌంటుకు ఒక్క రూపాయి అయినా పంపించాడా?.ూ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంటు డీటెయిల్స్ చూస్తే ఎన్ని లక్షల రూపాయలు నేరుగా మీ చేతికే వచ్చిందన్నది కనిపిస్తుంది. గతంలో ఏ పథకం ఉందో ఎవడికీ తెలియదు. ఎప్పుడిస్తారో తెలియదు. అసలిస్తారో లేదో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్. ఒకటో తేదీ ఉదయం ఆదివారమైనా, సెలవుదినమైనా లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంటికే వచ్చి మీ మనవడిలా, మనవరాలిలా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకం ప్రతి కుటుంబానికీ అందుతోంది. ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం..ూ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. మహిళా సాధికారత పరంగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి, అందులో ఏదైతే హామీలిచ్చామో ఆ హామీలన్నీ ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటికి వచ్చి మన ప్రజా ప్రతినిధులు మీరే చూడండి. చెప్పిన ప్రతి ఒక్కటీ జగనన్న చేసి చూపించాడని, మీరే టిక్కు పెట్టండని ధైర్యంగా మీ ఇంటి గడప తొక్క గలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ూ మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలివ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేయడం అనే సంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ గా భావించిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది. మరోవంక.. మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబును, దత్తపుత్రుడిని చూడండి. ూ వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.ూ ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. ఒక్క స్కీము కూడా గుర్తుకురాని పరిస్థితి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. ఏదేండ్లకోకసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కల్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగేనే స్టేజీ మీద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు. చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా?. ఈ మాదిరిగా పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పేజీ నంబర్ 16, 17లో.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలు గుర్తుచేస్తా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు అందిస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ పై రూ.100 సబ్సిడీ. 5 ఏళ్లలో రూ.6,00 ఇస్తామన్నారు. హైస్కూలు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్.. ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించిన 9 హామీలు... ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన సీఎం అయిన తర్వాత 2014-19లో ఆయన, ఆయనతోపాటు దత్తపుత్రుడు, ఈ బీజేపీ ముగ్గురూ కలిసి ఫొటోలు దిగి, మేనిఫెస్టో రిలీజ్ చేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపిచాడు. ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా.. ఇంతటి దారుణంగా మోసం చేస్తున్న ఈ వ్యక్తులకు మనం మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనల్ని మోసం చేస్తూ, రంగు రంగుల మేనిఫెస్టో అని పేర్లు చెబుతూ, మళ్లీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని చెబుతూ, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబితే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా, న్యాయమేనా? ఆలోచన చేయమని అడుగుతున్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో రిలీజ్ చేస్తే ఒక బైబిల్ గా, భగవద్గీత, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి ఆశీస్సులు అడుగుతున్నాడు. మరోవైపున పచ్చి మోసగాళ్లు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయామాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. అబద్ధాలు చెప్పడం చేతకాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఇంకా ఎక్కువ వింటాం. మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టోకన్నా ఇంకా రంగురంగుల మేనిఫెస్టో ఇస్తారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని పిలుపునిస్తున్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతామని గట్టిగా చెప్పండి. కాసేపటి క్రితం రామిరెడ్డి అన్న.. బనగానపల్లెకు ఔకు రిజర్వాయర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారారూ.100 కోట్లు ఖర్చయ్యే నీళ్ల సప్లయ్ గురించి అడిగాడు. ఇది కచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. వంద పడక సీహెచ్ సీ ఆస్పత్రిని. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు. పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకొంటే 100 మందికిపైగా హాస్పటల్ లో ఉండి అండగా ఉండే కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరిగింది. దేవుడి చల్లని దీవెనలుండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మీ అందరితో ఇంకో చిన్న విన్నపం చేయదల్చుకున్నా. ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తున్నాం ఈబీసీ నేస్తం కూడా. డబ్బులొచ్చే కార్యక్రమం ఒక వారం అటో ఇటో జరుగుతుంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరుతాయి. ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఆంధ్రజ్యోతి టీవీ, టీవీ5 చూడొద్దండి. ఆటోమేటికలీ డబ్బులు పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా పర్లేదు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయి ఉన్న మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తున్నాం. న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి, అన్యాయంగా చూపించే ఒక చెడిపోయి ఉన్న కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా యుద్ధం చేస్తున్నామన్నది మర్చిపోకండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడి దయతో నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. మన రామిరెడ్డి అన్న.. మీ అందరికీ పరిచయస్తుడే. నిరుడుకన్నా ఇంకా గొప్ప మెజార్టీతో ఆశీర్వదించమని కోరుతున్నా. అటువైపున టీడీపీ అభ్యర్థి చాలా ధనవంతుడు. చాలా డబ్బులున్నాయి.ఓటుకు రూ.2 వేలైనా రూ.3 వేలైనా ఇస్తాడు. రామిరెడ్డి అన్న ధనవంతుడు కాదు. ఆ మాదిరిగా ఇవ్వలేకపోవచ్చు. రామిరెడ్డి అన్నను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకూ కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయన్నది మనసులో పెట్టుకోండి. వాళ్లిచ్చే డబ్బులు రెండువేలిచ్చినా, మూడు వేలిచ్చినా వద్దనద్దండి. ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు, బటన్ నొక్కేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రామిరెడ్డి అన్నను కచ్చితంగా గెలిపించుకోవాలన్నది గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, అక్కచెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాల్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం పండుగగా జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం.. ఇవన్నీ జరగాలన్నా. ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని ఒక మనవడిగా, మనవరాలిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా.. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష వస్తాయి.ూ పేదల బతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి. అంధకారమయమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ గుర్తెరగమని సవినంగా కోరుతున్నా. వీళ్లు ఎంత అన్యాయస్తులు వీరంటే.. ఇదే బనగానపల్లెలో మనం 3200 మంది ఇళ్ల స్థలాలిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకుపోయి చంద్రబాబు గారు.. ఎక్కడ జగన్ కు మంచి పేరొస్తుందో, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటిస్థలాలు ఇవ్వకూడదని కోర్టుకుపోయి అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఇదే బనగానపల్లెలో కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలివ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడుల్లో నాడునేడు చేయాలన్నా యుద్ధం చేయాలి. ఇంగ్లీషు మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి. పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నది అందరూ గుర్తెరగాలి. ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపోమాపో జడ్జిమెంట్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. వారంరోజుల్లోపు 3200 కుటుంబాలకు మంచి శుభవార్త వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నా. మంచి జరిగించేదానికి ఎప్పుడూ మీ బిడ్డ అండగా, తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. -
నాగబాబు గాయబ్.. ఫోన్ స్విచ్ ఆఫ్!
సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్మీట్లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు. వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది. ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది. ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
25 ఇస్తే పావలాకి పావలా సీట్లు అంటారు.. ఆర్జీవీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు వెల్లడించాడు. పవన్పై విమర్శలు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన లేకుంటే టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించినట్లేనని విమర్శింస్తున్నారు. పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ..గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ..ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితం అయిందంటే.. చంద్రబాబు ట్రాప్లో పవన్ పడ్డాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ నేతలు సైతం జనసేన అధినేతపై సైటైర్లు వేస్తున్నారు. ‘24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా?’, కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నాడు. అతన్ని చూస్తే జాలేస్తోందంటూ’ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ఎద్దేశా చేశాడు. అందుకే 24 సీట్లు.. ఆర్జీవీ సెటైర్లు జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. ట్రోల్ చేస్తారనే భయంతోనే 24 సీట్లు కేటాయించారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ‘23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 స్థానాలు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశాడు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 😳 — Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2024 -
Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు!
ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం బాగుంటే చాలకునుకేవాళ్లు ఇంకొందరు. అచ్చం అలాంటివాళ్లే రాజకీయాల్లోనూ ఉంటారు. విలువలు... గౌరవం.. మట్టిగడ్డ ఏమి ఎలా పొతే నాకేం.. నా లాభం... నా ప్రయోజనం నాకు ముఖ్యం అనుకుంటారు... అందులో చంద్రబాబు ఎలానూ ఉండనే ఉంటారు... ఇప్పుడు ఆ టీంలో చేరిన పవన్ కళ్యాణ్ సైతం అచ్చం అదే పాలసీ ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇంకా బీజేపీ వంటి పార్టీలు సైతం.. ‘‘అమ్మో.. ఎన్నికలు వస్తున్నాయి... పార్టీని నడపాలి... ఇంఛార్జులను వేయాలి ... క్యాడర్ను సమాయత్తం చేయాలి.. ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడి పార్టీని ఒక స్థాయికి తీసుకు రావాలి... అధికారం చేపట్టాలి’’ అంటూ వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వ్యూహాలు.. సమీకరణాలు వేస్తున్నారు... కానీ జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా హాయిగా డబ్బులు కలెక్షన్ మీద దృష్టి పెట్టారు. నా పార్టీ కోసం ఎవరూ పైసా ఇవ్వొద్దు అని, తన సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాను అని, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను అని చెబుతూ వచ్చిన జనసేనాని ఇప్పుడు ఏకంగా అధికారికంగా విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం ఏకంగా క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసి నేరుగా విరాళాలు దండుకుంటున్నారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం కొత్త కాదు, తప్పు కాదు కానీ ఏకంగా ఇలా చిల్లరగా క్యూ ఆర్ కోడ్ పెట్టి దండుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నడపడం లేదు. క్యాడర్ కోసం ఏమీ చేయడం లేదు.. పవన్ సభలకు వాహనాలు.. ఇతర ఏర్పాట్ల ఖర్చు సైతం స్థానిక నాయకులే చూసుకుంటున్నారు తప్ప పార్టీ నుంచి ఏమీ మద్దతు లేదు. దీనికితోడు చంద్రబాబు కోసం దశాబ్దకాలంగా పని చేస్తున్నందుకు అయన నుంచి కూడా భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు పవన్ మీద ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నవే!. మరి అలాంటప్పుడు.. ఇంకా ఈ చిల్లర కలెక్షన్ ఎందుకు అన్న అనుమానాలు వస్తున్నాయి. అటు బాబు నుంచి భారీగా ప్యాకేజి అందుకుంటూనే ఇటు చిల్లర కలెక్షన్ సైతం వదలడం లేదని అంటున్నారు. అంటే అయన కూడా తన గురువు చంద్రబాబు మాదిరి తనకు వాచీ , ఉంగరం లేదని, ఏదోలా బతుకుతున్నాను అని చెప్పడానికే ఈ విరాళాల సేకరణ అని అంటున్నారు. వాస్తవానికి జనసైనికులే తల్లిదండ్రులమీద ఆధారపడి బతుకుతుంటారు. వారి జేబు ఖర్చులకే పేరెంట్స్ నుంచి వంద యాభై అడిగి తీసుకుంటారని, ఇప్పుడు వారి దగ్గరున్న ఆ చిల్లర సైతం లాగేసేందుకు పవన్ కల్యాణ్ భలే ఎత్తులు వేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి. :::సిమ్మాదిరప్పన్న -
ఆ పేరే ప్రభంజనం!
ఆ పేరే ఇప్పుడొక సూపర్ బ్రాండ్. జగనన్న అనే నాలుగ క్షరాలు ప్రభంజనానికి పర్యాయపదంగా మారిన వైనాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. గనిలో వనిలో కార్ఖానాలో... అన్నట్టుగా ప్రతి జీవనరంగంలోనూ ఈ ప్రభంజనపు వికాసాన్ని మనం కాంచవచ్చు. ఊరూవాడ, పొలమూ పుట్ర, బడీగుడి, ఆస్పత్రీ ఆఫీసూ... ఇలా ప్రతిచోటా మారాకు తొడుగుతున్న మార్పులను మనం గమనించవచ్చు. ఈ మార్పులు నిస్సహాయులను నిటారుగా నిలబెడు తున్నాయి. పేదవర్గాల భుజాలకు హక్కుల అమ్ములపొదులను తొడిగి సాయుధం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని కబ్జా చేసి తమను దగా చేసిన పెత్తందార్లపై యుద్ధానికి పేద వర్గాలను సమాయత్తపరిచేవిగా ఉన్నాయి. నాటి విప్లవకారులు పాడుకున్న పాటొకటి గుర్తుకొస్తున్నది. ‘‘విప్పపూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములు నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా... రాయలసీమ రాళ్లలోని రతనాలను మాలలల్లి నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా.’’ ఈ స్ఫూర్తిని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో రాజ్య ప్రాయోజిత సాధికార రథయాత్రల్లో వీక్షించవచ్చు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’... అంటూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవ త్సరాల ఏడు మాసాలు గడిచాయి. ముఖ్యమంత్రి హోదాలో వందలాది సభల్లో ఆయన పాల్గొన్నారు. జనం సమక్షంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నారు. వేలాదిమంది సహాయార్థులను విడివిడిగా కలిసి వారి బాధలు విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. ఇంతగా నిరంతరం జనంలో తిరుగాడినప్పటికీ ఆయన జనాకర్షణ చెక్కుచెదరలేదు. పైగా పెరిగింది. ఆయన జనంతో మమేకమయ్యే వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో విస్తారంగా దొరుకుతాయి. సెల్ఫీలకోసం ఎగబడేవారు, లాఠీల నెదిరించి బ్యారికేడ్లు దూకేవాళ్లు, ‘జగనన్నా’ అంటూ ఎలుగెత్తేవాళ్లు, కిలోమీటర్ల పొడవునా రోడ్ల పక్కన, మిద్దెల మీద నిలబడి కేరింతలు కొట్టేవాళ్లు ఇప్పుడింకా పెరిగారు. వేలాదిమంది పాల్గొన్న సభల్లో జనతరంగ విన్యా సాలు, మెక్సికన్ వేవ్స్ ఇంకా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వాల మీద అంతో ఇంతో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. మరోసారి టిక్కెట్ దొరకదని ఖాయంగా తెలిసినవాళ్లలో, సొంత పనులు చక్క బెట్టుకోవడం కుదరని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తున్నది కానీ, జనబాహుళ్యంలో మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ పిడికెడుమంది అసంతృప్తిపై వైడ్ యాంగిల్ వేసి చూపెడుతున్న యెల్లో మీడియా లక్షలాదిమంది సంతృప్తిపై సిరా మరకలు రుద్ది దాచేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజాదరణ రేటింగ్ విషయంలో జాతీయ సంస్థల సర్వేల్లో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లో కూడా మన ‘ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్త్రీ’ లేరు. ‘ఇండియా టుడే’ వారు గత జనవరిలో చేసిన సర్వేలో జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ 56 శాతంగా ఉంటే, ఈ డిసెంబర్లో 58 శాతానికి పెరిగింది. తాజా సర్వేల్లో మన విజనరీ లీడర్కు 36 శాతం, క్వశ్చన్ మార్క్ లీడర్కు 7 శాతం జనాదరణ ఉన్నట్టు తేలింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనం గుండెచప్పుళ్లు వింటే ఈ తేడా ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. 371 కోట్ల రూపాయల ధనాన్ని సర్కారు ఖజానా నుంచి సొంతానికి దారి మళ్లించిన స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు యాభై రెండు రోజులు జైల్లో గడిపారు. ఈ జైలు జీవితం వల్ల రాష్ట్రంలో సానుభూతి గంగ ఉప్పొంగి ప్రవహిస్తుందని తెలుగుదేశం, యెల్లో మీడియాలు బోలెడు ఆశలు పెట్టు కున్నాయి. ‘టైమ్స్ నౌ’ వాళ్లు ఆయన జైల్లో ఉన్నæ సమయంలోనే సర్వే చేసి రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 గెలుచుకుంటుందని తేల్చేశారు. టీడీపీకి సున్నా నుంచి వస్తేగిస్తే ఒక సీటు రావచ్చని చెప్పారు. ఎన్నికల భాషలో దాన్నే ‘ఊడ్చేయడం’ అంటారు. ఇదీ వాస్తవ రాజకీయ పరిస్థితి. కేవలం తెలుగుదేశం – జనసేన కలిసి పోరాడినంత మాత్రాన వైసీపీని ఓడించడానికి బలం చాలదు. సమస్త రాజ కీయ శక్తుల ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేలా చూడాలి. 50 శాతానికి పైగా ఉన్న వైసీపీ ఓట్లలో సాధ్యమైనంత మేరకు కోత పెట్టాలి. ఇప్పుడు బాబు కూటమి ఆ ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నది. వీళ్లవెంతటి వికృతమైన, జుగుప్సా కరమైన ఆలోచనలో పరిశీలించండి. తెలుగుదేశం – జనసేన కూటమికి బీజేపీ తోడవ్వాలి. మరోపక్క కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసి వీరి సలహాల మేరకు అవగాహనతో పని చేయాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహకారం అందించిన సంగతి బహిరంగ రహస్యమే. అందువల్ల రాహుల్తో ఏర్పడిన సత్సంబంధాలను ప్రస్తుత అవసరాలకు బాబు వినియోగించు కుంటున్నారని సమాచారం. 22 మంది ఏపీ కాంగ్రెస్ నాయ కులను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో ఢిల్లీ పెద్దలు ఏపీ కాంగ్రెస్ మీద ఈ మాత్రం శ్రద్ధ పెట్టడం ఇదే ప్రథమం. ఏపీలో గెలవడం గురించి కంటే ఓట్ల శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారట! ఈ సందేశాన్ని చంద్రబాబు రాజకీయ భాషలోకి తర్జుమా చేస్తే వైసీపీ ఓట్లను చీల్చడం మీద దృష్టి పెట్టాలి. సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు రాజకీయ ఆలోచనలు ఈ విషయంతో పట్టాలు తప్పినట్టు మనకు బోధ పడుతున్నది. ఎందుకంటే రెండు మూడు బలమైన ప్రతిపక్షాలు న్నప్పుడు ప్రభుత్వ నెగెటివ్ ఓటు చీలుతుంది. ఆ చీలికను నివారించడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు. అలా చీలిన దాఖలాలూ లేవు. కాంగ్రెస్ ద్వారా పాజిటివ్ ఓటును చీల్చాలనే బాబు ఆలోచన ఆయన నిస్పృహకు నిదర్శనంగానే భావించాలి. ఢిల్లీ సమావేశంలో రాహుల్గాంధీ మరో సూచన కూడా చేశారు. పార్టీలోకి ఎవరు చేరుతానన్నా ఆహ్వానించాలనీ, అలా ఆహ్వానించకపోతే నష్టపోతామనీ హితవు చెప్పారట! ఏపీ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకొని ఒక్క శాతం ఓటు కూడా లేని దుఃస్థితికి చేరుకున్న పార్టీలో చేరడానికి పరుగు పరుగున వస్తున్న వారెవరో? ఎక్కడా టిక్కెట్ దొరక్క ఏదో ఒక బీ–ఫామ్ కోసం ఎవరైనా వస్తే రావచ్చు. ఇంకేదైనా తెర వెనుక వ్యూహంలో భాగంగా మరెవరైనా రావచ్చు. వారు చూపగలిగే ప్రభావం శూన్యం. ఇక బీజేపీ కూడా తమ పొత్తులో భాగస్వామి కావాలన్న కోర్కె టీడీపీ – జనసేనలదే తప్ప బీజేపీది కాదు. పొత్తు కుదిరి పోయిందన్న ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తమున్నదని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. వారు అధిష్ఠానానికి ఈ మేరకు పిటిషన్లు పెడుతున్న మాట కూడా నిజమే! అయితే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ జాతీయ నాయకుల నిశ్చితాభిప్రాయం. పొత్తును వారు ఇంత వరకూ ఆమోదించలేదు. కానీ చంద్రబాబు పార్టీ మాత్రం పొత్తు కుదిరిపోయిందన్న కథనాన్ని తయారుచేసింది. యెల్లో మీడియా విశ్వసనీయత అడుగంటిన నేపథ్యంలో ఈ కథనాన్ని నడప డానికి ఇంకో తటస్థ ఛానల్ను ఆ పార్టీ ఎంచుకున్నదని బీజేపీ వారి పరిశీలనలో తేలింది. స్కోరింగ్ల మీద, బ్రేకింగ్ల మీద న్యూస్ ఛానెళ్లకు సహజంగా ఉండే ఆసక్తిని అవకాశంగా తీసుకుని, ఇది పక్కా సమాచారమని నమ్మబలికి, ఓ ప్రముఖ ఛానల్లో టీడీపీ కథనం ప్రసారమయ్యేట్లు వ్యూహాన్ని రచించారు. దీని వెనకో పిట్ట కథ ఉన్నది. మొన్న బెంగళూరు ఎయిర్పోర్టులో కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాంగ్ మ్యాన్ డీకే శివకుమార్, చంద్రబాబు తారస పడ్డారు. పక్కనున్న సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందికి దూరంగా వెళ్లి ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు. బాబు గ్రహచారం బాగాలేక ఈ వార్త, ఫోటో మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. దాంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయట! దీన్ని పూర్వపక్షం చేయడం కోసం బీజేపీతో పొత్తు కహానీని సిద్ధంచేసి ఒక తటస్థ ఛానెల్పైకి గురిపెట్టి విసిరారు. ఈ కథనం ప్రకారం ఏపీ బీజేపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణలో టీడీపీతో పొత్తు వుండాలనే అంశానికి మద్దతు లభించిందట! దీనిపై రాష్ట్ర నాయకత్వం ఒక రిపోర్టు తయారుచేసి జాతీయ నాయకత్వానికి పంపించిందట! ఇందులో బీజేపీకి పది నుంచి పన్నెండు, జనసేనకు 20 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారట! కన్నపు దొంగలు ఇక్కడే దొరికి పోయారు. నిజంగానే బీజేపీ వాళ్లు లేఖ రాస్తే జనసేనకు, తమకూ కలిపి ముచ్చెంగా 30 సీట్లే అడుగుతారా! కనీసం 70 సీట్లు అడిగేవారు. జనసేనకు 20 సీట్లే అని చెబుతున్న టీడీపీ వైఖరికి తగినట్టుగానే ‘బీజేపీ లేఖ’ ఉండటం ఆసక్తికరం. ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని ఆపసోపాలు పడటానికీ, అగచాట్ల పాలవడానికీ కారణం క్షేత్రస్థాయి వాస్తవికత. నాలుగేళ్లలోనే ప్రజాజీవనంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొని రాగలిగింది. ఒకప్పుడు వ్యవసాయంలో చిన్న కమతాలు లాభదాయకం కాదనే వాదన ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న కమతాల రైతులు లాభాలు పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని దేవీందర్శర్మ జాతీయ పత్రిక ‘ట్రిబ్యూన్’లో ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. రైతు భరోసా కేంద్రాలపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పరిపాలనలో సంపూర్ణ వికేంద్రీకరణ, పారదర్శకత సాధించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. బలహీనవర్గాలకూ, మహిళలకూ అధికార హోదాలను కట్టబెట్టడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ స్కూళ్లలో అందజేస్తున్న విద్యను ఏపీ ప్రభుత్వం ఉచితంగా పేద బిడ్డలకు అందజేయ గలుగుతున్నది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఇంటినీ పరామర్శి స్తున్నది. రైతులకు వారి భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ దేశంలోనే తొలి అడుగును ఆంధ్ర ప్రదేశ్ వేసింది. మద్య నియంత్రణను అమలులోకి తెచ్చి బెల్టు షాపుల తాట తీసింది. నడివయసు దాటిన మహిళలకు చేయూతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసింది. లక్ష ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగు నీరిచ్చి మరో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరపరిచింది. వైఎస్ జగన్ పరిపాలనలో బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వెనుకబాటుతనాన్ని ఛేదించుకొని ముందడుగు వేస్తున్నారు. ఇది గిట్టని పెత్తందారీ వర్గాలు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు చేస్తున్న రాజకీయ అవకాశవాద ప్రయోగాలను చూడాలి. ఇక పేదల ప్రభుత్వం మీద యెల్లో మీడియా విష వాయువులను ప్రయోగిస్తున్నది. కష్టజీవులందరూ పేదల ప్రభుత్వం వెనుక మరింత బలంగా సంఘటితం కావడమే ఈ విష ప్రచారాలకు విరుగుడు. ప్రతి ఉదయం ఒక కొత్త రోజును ఆవిష్కరిస్తుంది. రేపటి ఉదయం మరో కొత్త సంవత్సరాన్ని ఆవిష్కరించబోతున్నది. సామాజిక – ఆర్థిక న్యాయ సాధనలో నాలుగేళ్లుగా పడుతున్న అడుగులకు కొత్త సంవత్సరం మరింత ఉత్తేజాన్నివ్వాలని కోరు కుందాం. పెత్తందారీ శక్తుల అవకాశవాద రాజకీయాలను చిత్తుచేస్తూ పేదల ప్రభుత్వానికి మరో అఖండ విజయం ఈ కొత్త సంవత్సరం ప్రసాదించాలని కాలచక్రాన్ని ముందుకు నడిపే ఉదయార్కుడైన సూర్యభగవానుని ప్రార్థిద్దాం. సప్తాశ్వ రథమారూఢం... ప్రచండం కశ్యపాత్మజం... శ్వేతపద్మధరం దేవం... తం సూర్యం ప్రణమామ్యహమ్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కపటపు పొత్తుల ఎత్తులు... చిత్తు!
మరో మూడు మాసాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమర శంఖరావం వినిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపు సాధ్యాసాధ్యాలను విశ్లేషించుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కూడా ఖరారు చేసే పనిని వేగవంతం చేస్తున్నాయి. అధికార వైసీపీ తన అభ్యర్థుల ప్రకటనను రెండు వారాల క్రితం నుండే ప్రారంభించింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఇదే అసలు సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. సీఎం అభ్యర్ధి ఎవరు అన్నదానిపై ఉన్న సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేననీ, ఇందులో రెండో ఆలోచనే లేదనీ చెప్పారు. అందుకు పవన్ కూడా అంగీకరించారని అన్నారు. దీంతో ఇప్పటి వరకూ ‘సీఎం ... సీఎం ...’ అంటూ గొంతు చించుకుని నినాదాలు చేసిన జన సైనికులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లోకేశ్ బాహా టంగా సీఎం అభ్యర్థిని ప్రకటించినా... జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండి పోవడంతో రా్రçష్టంలో ఆ పార్టీని నమ్ము కున్న సామాజికవర్గ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇదిలా ఉండగా పీకే వ్యూహాలు మొట్ట మొదటిగా జన సేన పార్టీపైనే ప్రయోగించడం మొదలుపెట్టారన్న వాదన ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ ఇంత బాహాటంగా చంద్రబాబే సీఎం అని చెప్పడానికి ప్రశాంత్ కిశోర్ సలహానే కారణమని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేసిన చంద్రబాబు వ్యూహానికి ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ సలహా మరింతగా ఉపయోగడిందని అంటున్నారు. పవన్ కల్యాణ్ను జీరో చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండబోదని, వచ్చే సీట్లన్నీ కేవలం తెలుగుదేశం, చంద్ర బాబు ఇమేజ్తోనే వచ్చాయని ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్ కిశోర్ సూచన గన్ షాట్గా పనిచేసిందన్నది విశ్లేషకుల మాట. నిన్న మొన్నటి వరకూ టిక్కెట్ల కేటాయింపు అంశంలో జనసేనాని అలిగితే చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తెలుగుదేశం – జనసేన పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన సీట్లు పోతున్నాయన్న బాధ తెలుగు తమ్ముళ్లలో ఉంది. ఇక జనసేనానిని నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురమే అన్న ఆందోళన కూడా జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పార్టీ ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఉంటుంది తప్ప గెలిచే అవకాశాలు ఉండవని వ్యూహాత్మకంగా ఒక వాదనను తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్లు పార్టీ కేడర్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం జనసేనను పలుచన చేశారని తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత పవన్ను సీఎంగా చూడాలన్న అభిలాష నెరవేరకుండా ఉండేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్ను తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందొకసారి 28 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు లేదా మూడు పార్లమెంటు స్థానాలంటూ మీడియాకు లీకులిచ్చి తమను, తమ పార్టీని తక్కువగా జనానికి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీకి 20 సీట్లు మాత్రమే ఇస్తామంటూ చంద్రబాబు చెబుతున్నారన్న ప్రచారాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కినుక వహిస్తే వచ్చే ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు పవన్ను కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. అసలు పవన్ లక్ష్యాన్ని మరిచారా, లేక పవన్ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడకు పవన్ గురయ్యారా అని రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. పార్టీ ఏర్పాటుచేసి 10 ఏళ్లు దాటిన తరువాత కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం జనసేన అధినేతకు లేక పోవటం, అందివచ్చిన ప్రతి అంశాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబుకు ఉన్న నైపు ణ్యం వంటి కారణాల వల్ల తమ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలబడ లేక పోతోందని జనసైనికులు వాపోతున్నారు. తాము బలంగా ఉన్నామని అనుకొంటున్న ఉభయ గోదావరి జిల్లా ల్లోనూ తమకు కావల్సిన సీట్లను అడిగి తీసుకోవడంలో జనసేనాని పూర్తిగా వైఫల్యం చెందారని జనసైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాక తెలుగుదేశం ప్రస్తుతం నియమించుకున్న రాజకీయ సలహాదారు తెలుగుదేశానికి ఉపయోగ పడేలా సలహాలు ఇస్తారనీ, తమకు మాత్రం ఆ సలహాలు నష్టం చేకూర్చేలా ఉంటాయనీ వారి అభిప్రాయంగా కనిపి స్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో రానున్న రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టే... తెలుగుదేశంవారు పథకం ప్రకారం తమ పార్టీని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపా రని జనసేన కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండటం ఇప్పుడు ఆ పార్టీలో పలు అనుమానాలకు తావిస్తోంది. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
ఐడియా సార్.. మీరు బర్రెలన్నగా పేరు మార్చుకుంటే?
ఐడియా సార్.. మీరు బర్రెలన్నగా పేరు మార్చుకుంటే? -
Times Now Survey : ‘ఫ్యాన్’ ప్రభంజనం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్ తుపాన్లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది. అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. అధికార పార్టీకి మరింత పెరిగిన ఆదరణ దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్ నౌ చానల్ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. గత 52 నెలలుగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని విశ్లేషించారు. అందుకే అధికార పార్టీ 22 లోక్సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు. The @TimesNow -ETG survey predicts clean sweep for @YSRCParty in AP with 24 -25 Lok Sabha seats.#YSJaganAgain#YSRCPAgainhttps://t.co/G6dY75KvHE — YSR Congress Party (@YSRCParty) October 3, 2023 విశ్వసనీయతకు పట్టం.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే స్థాయికి దారితీసిన పరిస్థితులపై టైమ్స్ నౌ ఛానల్ చర్చ నిర్వహించింది. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి ప్రధాన కారణమేంటని చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. సీఎం జగన్ ఏదైనా చెప్పారంటే చేస్తారనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన.. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తుండటం.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణల ద్వారా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. దీన్ని చంద్రబాబు పాలనతో పోల్చుకుంటున్న ప్రజలు సీఎం జగన్తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారని, అందుకే 25కుగానూ 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నది సర్వే ద్వారా తేలిందన్నారు. ఫలించని సానుభూతి డ్రామా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏమైనా కనిపిస్తోందా? అని చర్చలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ అశుతోష్ను వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. దీనిపై అశుతోష్ స్పందిస్తూ.. అవినీతి కేసులో రిమాండ్పై జైలులో ఉన్న చంద్రబాబు పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుభూతి కనిపించడం లేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం వల్లే ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుకూల అభిప్రాయం లేదని విశ్లేషించారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపారని నారా లోకేష్తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు రావాలని, ఆయన వైఖరిపై పునరాలోచించుకోవాలని సూచించారు. 2019 కంటే మిన్నగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం జగన్ దేశం దృష్టిని ఆకర్షించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథాన అగ్రభాగాన నిలబెట్టారు. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 52 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.36 లక్షల కోట్లను జమ చేశారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమే అందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా అంటే 51.10 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్ 175..?’ అని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న అంశాలకు ఈ సర్వే ఫలితాలు దగ్గరగా ఉండటం గమనార్హం. -
ఆ మీటింగ్ తర్వాత పవన్లో నీరసమెందుకు?
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీలో ఏమి జరిగిందన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న. సాధారణంగా ప్రధానిని కలిసిన తర్వాత ఎవరైనా హుషారుగా కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కానీ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కానీ అలా కనిపించలేదు సరికదా.. ఏదో తద్దినం పెట్టినట్లు పొడి, పొడిగా మీడియా ముందు మాట్లాడడంతో పవన్కు ఏదో ఇబ్బంది ఎదురైందన్న భావన కలుగుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత మోదీని కొద్దిసేపు పవన్ కలిశారు. అదే గొప్ప విషయంగా తొలుత జనసేన ప్రచారం చేసుకుంది. తీరా భేటీ జరిగాక పవన్ నీరసంగా కనిపించడం ఆ పార్టీ వారికి కూడా తీవ్ర ఆశాభంగం కలిగి ఉండవచ్చు. ప్రధానితో తన భేటీ గురించి వెల్లడించకపోయినా, పవన్ చేసిన ఒక వ్యాఖ్యతో ఆయనకు మోదీ ఏవో కొన్ని హెచ్చరికలు చేసి ఉండవచ్చనిపిస్తుంది. వైఎస్సార్సీపీ నేతలు తనపై ఢిల్లీలో పితూరీలు చెప్పారని ఆయన వాపోయారు. బహుశా మోదీ.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ చెట్టపట్టాలేసి తిరుగుతున్న సంగతిపై నిలదీసి ఉండాలి. అలాగే పవన్ నిర్వాకాలపై బీజేపీ వారు ఎవరైనా డిల్లీ పెద్దలకు చెబితే, ఆ మాట అనలేక వైసీపీ పితూరి అని చెబుతున్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ అటు బీజేపీని వదలలేక, ఇటు తెలుగుదేశం వైపు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారని చెప్పాలి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడాలని పవన్ గట్టిగా కోరుతున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ముందుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే. ఎలాగొలా బీజేపీ చంక ఎక్కాలన్న చంద్రబాబు యత్నాలకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పెద్దలు గండి కొడుతున్నారు. దానికి కారణం అందరికి తెలిసిందే. తనను వ్యక్తిగతంగా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కాని దూషించిన సంగతిని మోదీ మర్చిపోలేకపోతున్నారు. అలాగే హోం మంత్రి అమిత్ షా గతంలో పార్టీ అధ్యక్షుడిగా తిరుపతి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన విషయాన్ని విస్మరించడానికి సిద్దపడడం లేదు. అలాగే టీడీపీతో పొత్తుపెట్టుకుంటే అదంతా ఆ పార్టీకి ఉపయోగం తప్ప, బీజేపీకి ఉండడం లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీలోని టీడీపీ కోవర్టులు, పవన్ కళ్యాణ్ వంటివారు మాత్రం ఎలాగొలా టీడీపీకి బీజేపీ మద్దతు ఇచ్చేలా చేయడానికి నానా తంటాలుపడుతున్నారు. బీజేపీ తనకు రోడ్ మాప్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ బీజేపీని కోరినా, అదేమీ జరగలేదు. అసలు బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా? అన్న సంశయం కలిగేలా రాజకీయాలు సాగాయి. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ కన్నా, టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు సూచనల మేరకు నడుచుకోవడం చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం తమతోనే జనసేన ఉంటుందని, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా పవన్ మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు చీలనివ్వమని అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆయన మోదీని కలిసినప్పుడు ఈ విషయం సహజంగానే చర్చకు వచ్చి ఉండవచ్చు. అయినా టీడీపీతో కలవడానికి మోదీ సుముఖత చూపి ఉండకపోవచ్చు. అందువల్లే పవన్ కల్యాణ్ నీరసంగా కళ తప్పిన ముఖంతో తిరుగు ముఖం పట్టారనిపిస్తుంది. ఆ ఫలితంగానే మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కేవలం రెండు నిమిషాలపాటే మాట్లాడి వెళ్లి ఉండవచ్చనిపిస్తుంది. దీంతో జనసేన కార్యకర్తలలో కూడా నైరాశ్యం ఏర్పడింది. అయితే రాష్ట్ర భవిష్యత్తుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని పవన్ అన్నప్పటికీ, అదెలా సాధ్యమో ఆయన వివరించలేదు. కాగా పవన్ ఇటీవలి జరిగిన పరిణామాలపై తనకు అనుకూలమైన వాదన వినిపించారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఉదాహరణకు జనసేన కార్యకర్తలు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులపై దాడి చేస్తే, ఆ విషయాన్ని పక్కనబెట్టి, తనను పోలీసులు నియంత్రించారన్న ఆరోపణ ఆయన చేసి ఉండవచ్చు. ఒక వైపు బీజేపీనేమో జనసేన తమతో పొత్తులో ఉంటుందని చెబుతుంటే, తెలుగుదేశం వారేమో పవన్ కల్యాణ్ తమ వైపు వచ్చేశారని, ఆ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలన్న చర్చ కూడా జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. కానీ నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకునే ధైర్యాన్ని పవన్ ఇప్పటికైతే చూపలేకపోతున్నారు. దానికి కారణం ఆయన గత ఎనిమిదేళ్లుగా రాజకీయాలలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేయడమే. ప్రత్యేక హోదాపై బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందని గతంలో ఆయన విమర్శించారు. తదుపరి బీజేపీ, టీడీపీలకు దూరం అయి వామపక్షాలు, బిఎస్పీలతో పొత్తు కట్టి 2019 ఎన్నికలలో పోటీచేసి దారుణ పరాజయం చవిచూశారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను బతిమలాడుకుని మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఆ విషయాన్ని విస్మరించి, ఇప్పుడు బీజేపీని కాదని, టీడీపీ వైపు వెళితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న భయం ఆయనకు ఉంటుంది. టీడీపీ ట్రాప్లో పడ్డ పవన్కు ఇప్పుడు ఏమి చేయాలన్నదానిపై స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎవరైనా మోదీని కలిస్తే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరతారు. కాని పవన్కు ఆ ధైర్యం కూడా లేదని అనుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై పవన్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన కూడా మాట్లాడారు. కాని ఇప్పుడు మోదీని నేరుగా అడిగే పరిస్థితి లేదు. విభజన సమస్యలను, కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినట్లు కనిపించదు. అదేమైనా జరిగి ఉంటే ఘనంగా చెప్పుకుని ఉండేవారు. పవన్, మనోహర్లు మీడియా ముందు మాట్లాడి వెళ్లిన కాసేపటికే సోషల్ మీడియాలో వారిని ఎద్దేవా చేస్తూ పలు కామెంట్లు వచ్చాయి. పవన్ మాటల వెనుక విషాద సంగీతాన్ని పెట్టి కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్ తీరు చూస్తే, కల చెదిరింది.. కథ మారింది అన్నట్లు గా అనిపిస్తుంది. ఆయన మనసు టీడీపీ వైపు, మనిషి బీజేపీ వైపు ఉంటున్నారు. ఒకవేళ ప్రధాని టీడీపీతో పొత్తుకు నో అని చెబితే పవన్ కల్యాణ్ దారి ఎటు? అన్న ప్రశ్న వస్తుంది. గతంలో బతిమలాడుకుని బీజేపీతో జతకట్టిన పవన్ ఇప్పుడు ఆ పార్టీని కాదని వెళ్లే ధైర్యం చేయగలరా? ఎంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్పై ఏడుపుకొట్టు విమర్శలు చేసే పవన్ కల్యాణ్ రాజకీయంగా సందిగ్దంలో పడి తన పార్టీ కాడర్ను కూడా గందరగోళంలోకి నెడుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పోలీసులు చెప్పినా పవన్ వినలేదు: సీపీ శ్రీకాంత్
సాక్షి, విశాఖపట్నం: అనుమతి లేకుండా పవన్ కల్యాణ్ ర్యాలీ చేశారని వైజాగ్ సీపీ శ్రీకాంత్ అన్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా పవన్ వినలేదన్నారు. పవన్పై దాడి జరుగుతుందని సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసిన తప్పుడు ప్రచారంతో జనసేన కార్యకర్తలు భారీగా వచ్చారు. ఎయిర్పోర్ట్ వద్ద పథకం ప్రకారమే దాడి జరిగిందని సీపీ తెలిపారు. దాడి ఘటనలో 9 మందిని అరెస్ట్ చేశామని, 100 మందిపై కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. -
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, వైఎస్ జగన్తో పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదన్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు వైఎస్ జగన్. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత జగన్.. ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ఆయనకు పోటీ ఎవరూ లేరు. జగన్కు జగనే సాటి. సీఎంను విమర్శించే ముందు పవన్, లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు. ఇవీ చదవండి: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ -
పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదు..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దివీస్ ల్యాబరేటరీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ సెక్షన్ 144 అమలులో ఉన్నందున జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి నిరాకరించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తుని రైలు కాల్చివేత, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం, దివీస్ ల్యాబరేటరీపై దాడి ఘటనలు నేపథ్యంలో ముందస్తు చర్యగా సున్నిత ప్రదేశాల్లో ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ నయీం అస్మీ హెచ్చరించారు. (చదవండి: ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు) సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గత ఏడాది డిసెంబర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి స్పష్టం చేయడంతో పాటు రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్తో చర్చలు జరిపిన సంగతి విధితమే. -
పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల కారణంగా నెలకొన్న తాత్కాలిక ఇసుక కొరత సమస్యను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీతో ఉన్న అవగాహన మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్ అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసలు ఇసుక సమస్యే ఉండదని ప్రభుత్వం చెప్తోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలకు పాల్పడ్డం దారుణమని సర్కార్ ఆక్షేపిస్తోంది. ఐదేళ్ల టీడీపీ పాలనలో వర్షాలు లేక, వరదలు రాక ఆంధ్రప్రదేశ్లో కరువు కరాళనృత్యం చేసింది. నదులన్నీ జలకళ కోల్పోయాయి. నీళ్లులేక ఎడారులుగా మారిన నదులపై టీడీపీ అగ్రనేతలు కన్నేశారు. నిబంధనలకు నీళ్ళొదిలేసి.. టీడీపీ నేతలు ఇసుక రీచ్లను పంచుకున్నారు. ఇసుక సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలు దందాను అడ్డుకొన్న అధికారులపై ఒంటికాలుమీద లేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాక్షాత్తు టీడీపీ శాసనసభ్యుడే మహిళా తాహశీల్దార్ వనజాక్షిపై దాడిచేసాడు. మహిళా అధికారి అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కాలితో కడుపులో తన్నాడు. నా అడ్డాలోకే వస్తావా అంటూ రాయలేని భాషలో దుర్భాషలాడాడు. ఇసుక కాసులకోసం పసుపు తమ్ముళ్ల బరితెగింపు బజారునపడ్డా అధినేత చంద్రబాబు చలించలేదు. పైగా ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు లేకుండా రాజీ కుదిర్చి అధికారుల నోళ్లు మూయించారు. దాంతో తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇసుకను యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఇసుక డిమాండ్ ఉన్న బెంగళూరు, చెన్నై నగరాలకు తరలించి సొమ్ముచేసుకొన్నారు. ఇంత దారుణంగా మహిళా అధికారిపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కూడా ఆయనకు అనిపించలేదు. ఇరవై ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక స్మగ్లర్లుగా మారి దొంగ వ్యాపారం చేశారు. రాజధాని నడిబొడ్డులో చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో నదీపరీవాహక చట్టాలకు తూట్లు పొడిచారు. డ్రెడ్జర్ల ద్వారా నదిలోని ఇసుక తోడి అమరావతి నిర్మాణాలకంటూ కవరింగ్ ఇచ్చారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాల గురించి అస్సలు పట్టించుకోలేదు. టీడీపీ ఇసుకాసురులకు చెక్ పెట్టాలని భావించి పర్యావరణహితం కోరే ఓ సామాజికవేత్త జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. దాంతో విచారణ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి వందకోట్ల జరిమానా విధించింది. ఇప్పటికీ ఈ వివాదం చంద్రబాబు మెడకు చుట్టుకొనే ఉంది. టీడీపీ నేతలు సృష్టించిన ఇసుక సామ్రాజ్యానికి అండగా నిలిచిన చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించటం దెయ్యాలు వేదాలు వళ్లించటమేనని అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇసుక మాఫియా ఆగడాల పాపం పండటంతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని పక్కన పెట్టారు. టీడీపీకి కేవలం 23 స్థానాలు దక్కాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టంకట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. నదులన్నీ జలకళతో మెరిశాయి. చెరువులకు సమృద్ధిగా నీరు రావటంతో నిండు కుండల్ని తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుతోంది. నీటి చుక్కకోసం ఐదేళ్లు ఎదురుచూసిన నేలతల్లి ఇప్పుడు పులకరించిపోతోంది. పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. అదే సమయంలో నదుల్లో వరద ప్రవాహం ధాటికి ఇసుక తవ్వకాలకు వీలుపడని పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇసుక కొరత నెలకొంది. ఇపుడీ కొరతనే భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు చంద్రబాబు. వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రమే కొత్త రీచ్లు ప్రారంభించారు. కొంతమేర ఇసుక సేకరించి నిర్మాణ పనులకు అప్పగించారు. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్ష ప్రభావం పెరిగి ఇసుక సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. తమ ఇసుక దందాకు చెక్ పెట్టేలా కొత్త పాలసీ తెచ్చారన్న అక్కసుతో పచ్చనేతలు ఇసుకను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి వల్ల ఇసుక కొరత ఏర్పడితే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వికృత ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆందోళనలు చేసినా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారు. మహిళా అధికారిపై దాడి చేసిన ఇసుకాసురుడిని జైలుకెళ్లి కలిసొచ్చిన చినబాబు లోకేష్ ఇసుక సమస్యపై తాను పరాజయం పాలైన మంగళగిరిలో వీధినాటకాన్ని రక్తి కట్టించారు. విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేత లాంగ్ మార్చ్కు టీడీపీ అధినేత చంద్రబాబే ప్లాన్ చేశారు. వరదలు తగ్గతే ఇసుక వారోత్సవాలు నిర్వహించి ఇసుక కొరత లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరదల కారణంగానూ నదుల్లో విపరీతమైన ప్రవాహాల కారణంగానూ తాత్కాలికంగా ఇసుక కొరత ఉన్న విషయం వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ సమస్య శాస్వతంగా పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తోంది కూడా. ఈ లోపే టీడీపీ-జనసేన పార్టనర్షిప్ సమ్మిట్లా లాంగ్ మార్చ్ కు స్కెచ్ గీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. -
పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!
-
విశాఖ : జనసేన సభలో అపశ్రుతి
సాక్షి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఆదివారం విశాఖపట్నంలో నిర్వమించిన బహిరంగ సభలో అపశృతి దొర్లింది. సభ వేదిక వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం చెలరేగింది. వేదిక వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లకు విద్యుద్ ప్రవహించడంతో ఇద్దరు వ్యక్తులకు విద్యుత్ షాక్తో గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే జనరేటర్ను నిలిపివేసి.. విద్యుత్ సప్లైను ఆపేశారు. గాయపడిన వ్యక్తులను అంబులెన్స్లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, ఇసుక అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్మార్చ్ కొంత ఆలస్యంగా మొదలైంది. -
పవన్ తీరు మారలేదు
-
ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!
ఎన్నికల ముందు అసమ్మతి స్వరాలు. ఎన్నికల తర్వాత అంతకన్నా ఎక్కువ శృతిలో బీభత్సమైన విమర్శలు. ఒక పక్క దారుణమైన ఓటమి. రెండుచోట్ల పోటీ చేసినా ఫలితం లేదు. ఇంత జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతోంది? అంతర్మథనం జరగలేదా? మేధోమథనం పనికిరావడం లేదా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారని ప్రజలు అనుకున్నారో.. లేక ఆయన చెప్పినదాంట్లో అర్థంపర్థం లేదని భావించారో మొత్తం మీద ఓ రేంజ్లో తీర్పునిచ్చారు. ఆయన రెండుచోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు. చివరాఖరికి ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన పార్టీ. ఇంత పెద్ద ఓటమి నుంచి కోలుకోవాలంటే అంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే పవన్ చాలాకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు. రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ఓటమి బాధనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.. గత కొన్ని రోజులుగా జనసేనపార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులోకి వస్తున్నారు. పార్టీ నాయకులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడుగా పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో చాలామందికి రుచించడం లేదని సమాచారం. అంతేకాదు వారిలో కొందరు పవన్ కళ్యాణ్ తీరును బాహటంగానే విమర్శిస్తున్నారు. మరికొంతమంది నేతలైతే ఇక ఈయన మారేలా లేరని తమ దారి తాము చూసుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మంట్లవారీగా పేరున్న నేతలు పలువురు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ సెగ్మంట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పసుపులేటి రామారావు.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రాజీనామా చేయడం గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతోంది. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అధ్యక్షుని తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన చుట్టూ ఒక కోటరీని తయారు చేసుకొని పవన్ పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను కలవాలంటే అంత ఈజీ కాదని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినవారే ఆవేదన చెందుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించకోవచ్చు. పవన్ దర్శనం కావాలంటే ముందు కోటరీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోందని, వారికి డబ్బుయావ తప్ప మరొకటి లేదని పార్టీని విడిచిపెడుతున్న వారు పబ్లిగ్గానే ధ్వజమెత్తుతున్నారు. ఈ మధ్య పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చాలాచోట్ల నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తణుకు నుంచి జనసేన పార్టీ రెబెల్ గా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని ఈ మధ్యనే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ రాజీనామా చేసిన పసుపులేటి రామారావు ఫైరవుతున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన పార్టీ ఏం చేస్తుంది? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసుకొని.. తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న కమిటీలపట్ల సీనియర్ నేతలు సైతం అసంతృప్తిలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్ను నియమించడం ఆ పార్టీలోని పలువురు నేతలకు రుచించడం లేదట. ఎప్పటినుంచో ఉన్న నేతలను కాదని, ఎన్నికలకు ముందు వచ్చిన నాదెండ్ల మనోహర్ను ఎలా నియమిస్తారంటూ వారు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు వినూత్నంగా, ఆచరణీయంగా, ఆలోచనాత్మకంగా ఉంటాయని జనసేన కార్యకర్తలు, అభిమానులు భావించారు. ఆ దిశగా అడుగులు పడకపోగా.. మరింత నష్టం కలిగించేవిధంగా పవన్ వ్యవహరిస్తున్నారని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పలువురు బలమైన నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లడానికి పవన్ వైఖరియే కారణమని చెప్పుకుంటున్నారు. అద్దెపల్లి శ్రీధర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు, కోశాధికారిగా సేవలందించిన రాఘవయ్య జనసేనను వీడడం దీనికి నిదర్శనమని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మేలుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేదంటే పార్టీ మరింత పాతాళంలోకి పడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. -
‘జనసేన’ వ్యాన్లో మద్యం సీజ్
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): మద్యం లోడుతో వెళుతున్న వ్యానులో ఉన్న భారీ మద్యం బాటిళ్లను శనివారం అర్ధరాత్రి నోడల్ ఆఫ్ కాండాక్టు స్వా్కడ్ సిబ్బంది, అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్బాబు ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్సై డి.సురేష్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ కథనం ప్రకారం మాచవరం శివారు పోతాయిలంక నుంచి అంబాజీపేట వైపు వెళుతున్న బొలోరో వ్యాన్ పోలీసులు గస్తీ చేస్తుంటే, ఒక్కసారిగా వేగంతో దూసుకుపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వ్యానును నిలిపి తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న రూ.5.50 లక్షల విలువ జేసే 4,795 మద్యం సీసాలు, 624 చిన్న బీరు బాటిళ్ల స్వాధీనం చేస్తున్నారు. రాజోలు మండలం కడలికి చెందిన వ్యాన్ డ్రైవర్ బోణం సాయి నరసింహమూర్తి, అతనితో ఉన్న అంత్రి రాజేష్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాన్ను పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ వ్యాను ఎక్కడ నుంచి వస్తుందో తెలియదని, మామిడికుదురులో వ్యాన్ను తనకు అప్పగించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడని తెలిపారు. అంబాజీపేటలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఫోన్ ద్వారా తెలియజేస్తామని చెప్పాడని ట్రైనీ ఎస్సై తెలిపారు. బోడసుకుర్రు వచ్చిన తరువాత సెల్ఫోన్ కాన్ఫరెన్స్లో అంబాజీపేట వైపు రమ్మని చెప్పారన్నారు. వ్యాను ముందు బైక్పై ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఫోన్ కాన్ఫరెన్స్లోనే సంభాషించినట్టు తెలిపాడు. ఈ వ్యాన్పై జనసేన స్టిక్కర్ ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. -
నేను లోకల్..
సాక్షి, భీమవరం : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, వారికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండటమే నాకు తెలిసింది. ఎక్కడి నుంచో దిగుమతి అయిన నాయకులు గెలిస్తే ఎలా ఉంటుందో గడిచిన పది సంవత్సరాలుగా భీమవరం ప్రజలు అనుభవిస్తున్నారు. మరోసారి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానికుడిని గెలిపించాలని భీమవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఓటర్లలో ఉత్కంఠతను రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజాసమస్యలపై పోరాటమే శ్వాసగా భావించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సినీనటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి? గ్రంధి: భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన, యనుమదుర్రు డ్రెయిన్పై అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన, అప్రోచ్రోడ్లు, బైపాస్ రోడ్డును విస్సాకోడేరు శివారు వరకు అభివృద్ధి చేయడం వంటివి ప్రధానమైన అజెండా. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్స్ నిర్మాణం, పట్టణ శివారు ప్రాంతాల్లో కొత్తరోడ్లు ఏర్పాటు, వీరవాసరం, భీమవరం మండలాల్లో మంచినీరు, మురుగునీరు సమస్య, పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మాణం వంటివాటిని ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను. ప్రశ్న: మీరు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏమిటి? గ్రంధి: భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చాను. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయించాను. పేదలకు సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించాను. 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాను. యనమదుర్రు డ్రెయిన్పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్రోడ్డుకు శ్రీకారం చుట్టాను. ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశాను. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్ల జోన్ ఏర్పాటు చేయించాను. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశాను. ప్రశ్న: ఎన్నికల బరిలో మీ బలం ఏమిటి? గ్రంధి: ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాను. ఏ సమయంలోనైనా నా వద్దకు రావచ్చు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటమే నా బలం. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఉంది. అందుకే మరోసారి రాజన్న రాజ్యం సాకారం చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాను. ప్రశ్న: రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు? గ్రంధి: మా నాన్న గ్రంధి వెంకటేశ్వరరావే నాకు రాజకీయంగా స్ఫూర్తి. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్పేయ్, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సూపర్స్టార్ కృష్ణ నా అభిమాన నాయకులు. ప్రశ్న: రాజకీయ ప్రవేశం ఎప్పుడు? గ్రంధి: విద్యార్థిదశలో ఉండగానే దాదాపు 1977 ప్రాంతంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నా. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో చురుకుగా పనిచేశా. ప్రశ్న: చేపట్టి రాజకీయపదవులు? గ్రంధి: మొట్టమొదటిసారిగా భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పదవిని చేపట్టి వెనువెంటనే జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి వరించింది. ప్రశ్న: ప్రజాక్షేత్రంలో ఎప్పుడు పోటీలో పాల్గొన్నారు? గ్రంధి: 1995లో భీమవరం అర్బన్బ్యాంక్ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించా. అనంతరం 2004లో భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించా. ప్రశ్న: ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం? గ్రంధి: నా తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగా. కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేగాక ఎంతో అండదండగా ఉంటున్నారు. ప్రశ్న: రాజకీయాల్లో మీ లక్ష్యం? గ్రంధి: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించడమే లక్ష్యం. -
జనసేనలో రచ్చ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జనసేన పార్టీ వివాదాల సుడిలో చిక్కుకుంది. పార్టీలో సీట్లు అమ్ముకున్నారని పోలవరం నియోజకవర్గ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అటువంటి అవినీతిపరుడైన వ్యక్తికి సీటు ఎలా ఇచ్చారని జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలంగాణ వైస్ చైర్మన్ దువ్వెల సృజన నిలదీశారు. జనసేన నేత కరాటం సాయి పోలవరం టికెట్ను సిర్రి బాలరాజుకు డబ్బులు చెల్లించి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. చాలాకాలంగా పార్టీలో ఉన్న తాను ఆ సీటు కోసం ప్రయత్నించానని, తనను రూ.50 లక్షలు అడిగారని సృజన తెలిపారు. అయితే ఆ తర్వాత కరాటం సాయి బాలరాజుకు సీటు ఇప్పించారన్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో అవినీతి లేకుండా రాజకీయం చేస్తామంటూ అవినీతిపరుడికి టికెట్ ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు చెబుదామంటే అవకాశం ఇవ్వలేదన్నారు. కరాటం ఫ్యామిలీ వల్ల పోలవరం స్థానాన్ని కోల్పోవలసి వస్తోందని సృజన మండిపడ్డారు. తణుకులో ఆరని చిచ్చు మరోవైపు తణుకు నియోజవర్గంలోని జనసేన పార్టీలో తలెత్తిన విబేధాలు చల్లారలేదు. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన విడివాడ రామచంద్రరావు రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం భీమవరం విచ్చేసిన పవన్కల్యాణ్ను కలిసిన విడివాడకు ఆయన నుంచి సానుకూలత రాకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో లోపాయకారీ పొత్తు ఉండడం వల్లే జనసేన తనకు టికెట్ కేటాయించలేదని విడివాడ ఆరోపించారు. తాను పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నానని, ఇప్పుడు టీడీపీ సూచనతోనే వేరే అభ్యర్థిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి పోలవరం తెలుగుదేశం పార్టీలో కూడా అసమ్మతులు ఆగడం లేదు. పోలవరం అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా వంకా కాంచనమాల శుక్రవారం నామినేషన్ వేశారు. వంకా కాంచనమాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కుమార్తె. పోలవరం నుంచి టికెట్ను ఆశించిన వారిలో కాంచనమాల ఒకరు. అయితే కాంచనమాలకు టికెట్ దక్కకపోవడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని బుజ్జగించేందుకు తెలుగుదేశం అధిష్టానం విశ్వప్రయత్నం చేస్తోంది. గురువారం మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు వెళ్లి కొత్తపల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి కొత్తపల్లి సుబ్బారాయుడు ససేమిరా అన్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడితో మాట్లాడించి బుజ్జగించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాత వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి సమావేశానికి కూడా పీతల సుజాత గైర్హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు నెంబర్–1 అని ప్రకటించి కొద్ది నెలలకే పదవి నుంచి తప్పించారని, అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుంచానని పొగడ్తలు కురిపించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలు విని తనకు సీటు లేకుండా చేశారని సుజాత ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆమె వర్గం పూర్తిగా సహాయనిరాకరణ చేస్తోంది. మరోవైపు మాల సామాజిక వర్గం నేతలు కూడా సుజాతను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జనసేన పార్టీలో ముసలం
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని వెల్లడించారు. దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదు. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అన్నారు. ‘పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టలోకి వచ్చా. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదని అనుకున్నా. కానీ ఇది కూడా స్వార్ధ రాజకీయ పార్టీనేనని తేలిపోయింది. నా రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నా. అభిమానుల అభిప్రాయంతో తదుపరి కార్యాచరణ రెండురోజుల్లో ప్రకటిస్తాన’ని యర్రా నవీన్ తెలిపారు. (చదవండి: జనసేన అభ్యర్థులు వీరే) -
అందుకే పవన్ను కలిసిరమ్మంటున్నా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో పొత్తు కోసం కలిసి రావాలంటూ మరోసారి పవన్ను చంద్రబాబు కోరారు. రాష్ట్రం కోసమే పవన్ కల్యాణ్ను కలిసి రావాలని కోరుతున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రూ. 70వేల కోట్లు ఇవ్వాలని పవన్ కల్యాణ్ గతంలో కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి తాను వెళ్లిపోలేదని, బీజేపీయే తనను మోసం చేసిందని ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చారు, కానీ వాటిని బీజేపీ అమలు చేయకుండా మోసం చేసిందని చెప్పారు. 11 జాతీయ సంస్థలను రాష్ట్రానికి ముష్టివేసినట్టు వేశారని, అమరావతికి రూ. 1500 కోట్లు ముష్టివేశారని చెప్పుకొచ్చారు. ఏమన్నా అంటే యూసీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) ఇవ్వలేదని కేంద్రం అంటోందని చంద్రబాబు నిష్టూరమాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉదారంగా వ్యవహరించి, విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చిందని ఆయన పేర్కొనడం కొసమెరుపు. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో జతకలిసి మహాకూటమి పేరిట తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసిన చంద్రబాబు అక్కడ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
యనమలను మళ్లీ గెలిపిస్తారా : పవన్
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని నూతన రాజకీయ శకానికి నాంది అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పవన్ కల్యాణ్ జన్మభూమి ఎక్స్ప్రెస్లో తుని చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న హాకర్స్తో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడినా కుటుంబ పోషణ భారమవుతోందని, ఉండటానికి సొంత ఇల్లు లేదని పలువురు పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి గొల్ల అప్పారావు సెంటర్లో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ తుని ప్రజలు యనమల రామకృష్ణుడుకు 30 ఏళ్ల పాటు పట్టం కట్టారని, ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించారన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామికవాడను తీసుకు రాలేకపోయారన్నారు. ఇటువంటి నాయకులకు మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారా అని అడిగినప్పుడు జనం లేదు.. లేదు అంటూ జవాబిచ్చారు. తుని ప్రజలు చూపించిన ప్రేమ ,ఆప్యాయత, ఆదరణ మరులేనన్నారు. నూతన తరం కోసం జనసేన పుట్టిందని, మీరందరూ ఆశీర్వదిస్తే సుపరిపాలన వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకులు కొండలను పల్లీల మాదిరిగా తినేస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.2019లో జరిగే ఎన్నికల్లో ఇటువంటి రాబందులు ఓటు అనే గాలివానలో కొట్టుకుపోతారన్నారు. తుని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడా గరుదత్ప్రసాద్, గెడ్డం బుజ్జి, ముత్తా గోపాలకృష్ణ, శెట్టిబత్తుల రాజ బాబు, తుని నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడిశెట్టి గణేష్, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి : కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారని, ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టాలని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశముందని పేర్కొన్నారు. ఒంగోలులో ఆదివారం ఆయన దళిత సంఘాల సమావేశంలో మాట్లాడారు. దళితులు రాజ్యాధికారం సాధించాలని, 2019 ఎన్నికల్లో దళితులదే వాయిస్ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దళిత నాయకత్వం రావాలని అన్నారు. రాజకీయంగా ఇంకా దళితులు వెనుక బడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కులదురహంకార హత్య అని అభివర్ణించారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి మారుతీరావు ఈ హత్య చేయించారని పేర్కొన్నారు. -
జనసేన పార్టీ గుర్తును ప్రకటించిన పవన్
-
పవన్జీ... ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఈమధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, విసురుతున్న సవాళ్లు వింతగా ఉన్నాయి. నాలుగేళ్లపాటు కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఉన్న అధికార పక్షాలతో అంటకాగిన మహానుభావుడాయన. గత ఎన్ని కల్లో ప్రత్యేక హోదా, ఇతర వాగ్దానాల విష యంలో టీడీపీ, బీజేపీలతోపాటు పవన్ కూడా జవాబుదారీ. దాన్ని తప్పించుకోవడం కోసం ఆ శిబిరం నుంచి పారిపోయి వచ్చి ప్రతిపక్ష నాయ కుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడికి దిగడం వంచనకు పరాకాష్ట. అయ్యా... పవన్ గారూ టీడీపీ, బీజేపీలతోపాటు మీరు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రజాకోర్టు బోనులో నిలబడి ఎన్నో అభియోగాలకు జవాబు ఇవ్వాల్సి ఉంది. అమరావతి రైతుల్ని ప్రభుత్వం అనేకవిధాల భయపెట్టి వారి భూముల్ని కబ్జా చేసినప్పుడు మీరెక్కడ ఉన్నారు? తుందుర్రులో ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులంతా పోరాడుతున్నప్పుడు, మహిళలను సైతం పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లి అవమానిస్తున్నప్పుడు, ఆ కుటుంబాలను జైళ్లలో బంధించినప్పుడు కనీసం చంద్రబాబు దగ్గర మీ పలుకుబడి ఉపయోగించి ఆ అణచివేత చర్యలను ఆపగలిగారా? గరగపర్రు ఉదంతంలో దళితులను ఊరి నుంచి వెలివేసిన పెద్దలకే ప్రభుత్వం అండగా నిలబడినప్పుడు, ఆందోళన చేస్తున్నవారిని అరెస్టులు చేసినప్పుడు మీరు కనీసం ఇది తప్పు అని చెప్పారా? అప్పుడు బాబు ఏం చేస్తారని భయపడి మీరు మౌనంగా ఉండిపోయారు? ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళా తహసీల్దార్ను ఎమ్మెల్యే జుట్టు పట్టి ఈడ్చినప్పుడు మీ ధైర్యసాహసాలు ఏమయ్యాయి? మీ నోటినుంచి మాట పెగల్లేదు ఎందుకని? రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్యకు కారకులైనవారిని ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడాలని చూసినప్పుడు ఒక్కసారంటే ఒక్కసారైనా అడిగారా? ఆమె కుటుంబానికి ధైర్య వచనాలు పలికారా? బ్లాక్ డే సందర్భంగా ఆందోళన చేయమని పిలుపునిచ్చిన మీరు పత్తా లేకుండా పోతే ఆరోజు విశాఖపట్నానికి తరలివెళ్లి పోరాడింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆరోజు మీరు కనీసం మాట మాత్రంగానైనా బాబు తీరును ఖండించారా? పొరుగునున్న తెలంగాణలో ‘ఓటుకు కోట్లు’ కేసులో బాబు ఇరుక్కున్నప్పుడు అది సబ్ జ్యుడీస్ గనుక మాట్లాడనని మీరు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిపై బాబు అండ్ కో కుట్రపన్ని, వ్యవస్థల్ని వాడుకుని కేసులు నడిపిస్తుంటే వాటిపై ఇంకా తీర్పు రాకుండానే మీరు ఆయనపై అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు సార్? వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బాబు కొన్నప్పుడూ మీరు మాట్లాడలేదు. వారికి మంత్రి పదవులిచ్చి సత్కరించినప్పుడూ అడగలేదు. తమ పార్టీ సహచరులే అధికారపక్షానికి ఫిరాయించి, మంత్రుల ముసుగులో కూర్చుని సభలో తాము నిలదీసిన ప్పుడల్లా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడితే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భరించాలా? ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే మద్దతు ఇవ్వబోనని బాబుకు ఆరోజు మీరెందుకు చెప్పలేకపోయారు? లేస్తే మనిషిని కాదన్నట్టు నాకు ఎమ్మెల్యేలుంటే శాసనసభను ఊపేసేవాడినని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న పదవులను కూడా వదులుకుని కాంగ్రెస్ నుంచి ఒంటరిగా బయటకు వచ్చి సోనియాగాంధీపై పోరాడారు. ఆ పోరాటాన్ని చూసి ప్రజలు ఆదరించి జగన్ వెంట నడిచినవారిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. నా వెనక ఎమ్మెల్యేలు ఉంటేనే పోరాటం చేస్తానని ఆయన షరతు పెట్టలేదు. ముందు ఎవరిని నిలదీయాలో, ఎవరిపై పోరాడాలో తెలుసుకుని అప్పుడు యుద్ధానికి దిగండి. పోరాటమంటే నలుగురు ఎమ్మెల్యేలను నెగ్గించుకుని అసెంబ్లీలో కూర్చోవడం కాదు. అవసరమైతే ఆ అసెంబ్లీని బహిష్కరించడం కూడా పోరాటరూపమే. గతంలో ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆ పని చేశారు. చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు సన్ జూ రాసిన ‘యుద్ధ కళ’ పుస్తకం చదవండి. మీకు కాస్తయినా జ్ఞానం వస్తుంది. సినిమా గ్లామర్తో నేనేం చెప్పినా చెల్లుతుందని మీరు అనుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ముందు నాలుగేళ్ల తప్పిదాలకు క్షమాపణలు చెప్పే సంస్కారాన్ని ప్రదర్శించండి. తర్వాత ఇతరాలు మాట్లాడండి. - పిల్లి ప్రేమ్కుమార్ పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా సెల్: 85558 70102 -
ప్రభుత్వానికి ఎదురుతిరగండి: పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. మూడు పంటలు పండే భూములను ప్రభుత్వం సేకరించకూడదని ఆయన అన్నారు. మూడు పంటలు పండే భూముల్ని మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా అని ఆయన సర్కారును నిలదీశారు. మంత్రి నారాయణ పంట భూములను ట్రాక్టర్లతో దున్నారని, ఆయనకు రైతుల గురించి, వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే భూదాహం తగ్గించుకోవాలని హితవు పలికారు. రైతుల భూములను ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని, రాజధాని గ్రామాల్లో నియతృత్వంతో వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సింగూరు పోరాటం, బషీర్బాగ్ కాల్పుల వంటి ఘటనలు పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. -
లోకేశ్కు పవన్ కళ్యాణ్ సవాల్
-
దమ్ముంటే చేయ్.. లోకేశ్కు పవన్ సవాల్
సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేశ్ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ అన్నారు. దొడ్డిదారిన లోకేశ్ను మంత్రిని చేశారని, ఆయనను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమని, తనతో లోకేశ్ బహిరంగ చర్చకు రావాలని పవన్ పేర్కొన్నారు. విశాఖ రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్లో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గతంలో తన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందజేశారు. పాయకరావుపేటకు చెందిన మృతుడు శివ తల్లిదండ్రులకు రూ. లక్షన్నర, ఆయన భార్యాపిల్లలకు రూ. రెండున్నర లక్షలు పవన్ అందజేశారు. మరో మృతుడు తోళం నాగరాజు భార్యాపిల్లలకు రూ. మూడు లక్షల చెక్ను అందించారు. గతంలోనూ మృతుల కుటుంబాలకు రూ. మూడు లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ అందజేశారు. -
అద్దె ఇల్లు తీసుకున్న పవన్కల్యాణ్
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చారు. విజయవాడలోని పడమటలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్ శుక్రవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఇంట్లోనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మరో వైపు పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యంమవుతుండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
‘అవనిగడ్డ నుంచి పవన్ కల్యాణ్ పోటీ’
సాక్షి, అవనిగడ్డ: వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ముత్తంశెట్టి విజయనిర్మల పాల్గొన్నారు. కాగా, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. జనసేన పార్టీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
సారీ రవిప్రకాష్.. పవన్ వ్యంగ్య ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి టీవీ9 ఛానల్ సీఈవో రవిప్రకాష్ అని వెల్లడించిన పవన్.. వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 'రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు. అందుకు కొంత సమయం ఇవ్వు. కొద్దిసేపు వేచి చూడు. రవిప్రకాష్.. నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తానంటూ' పవన్ తన తాజా ట్వీట్లో పోస్ట్ చేశారు. మరోవైపు తన అభిమానులనుద్దేశించి సందేశం పంపారు పవన్. ఈ వివాదంలో ఆవేశపడొద్దదంటూ అభిమానులకు సూచించారు. అభిమానులందరూ సంయమనంతో ఉండాలని కోరారు. వాళ్లు తప్పు చేసి తనపై కేసులు వేస్తున్నారని.. కానీ తాను ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయపోరాటం చేస్తానని మరోసారి పేర్కొన్నారు. నిన్న మీడియాపై జరిగిన దాడిలో పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని సోషల్ మీడియా ద్వారా వివరించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్పై పోరాడుతూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన అంశం అనూహ్య మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి పవన్ను దూషించడం.. ఆపై తానే దూషించమని చెప్పానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరపైకి రావడంతో వివాదం మరింత పెద్దదైంది. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. Raviprakash ,I will text to you separately .. give me sometime.kindly wait! Apologies for making you wai!🙏😊 — Pawan Kalyan (@PawanKalyan) 21 April 2018 -
నిజమైన అజ్ఞాతవాసి అతనే..
-
నిజమైన అజ్ఞాతవాసి అతనే.. వెల్లడించిన పవన్!
సాక్షి, హైదరాబాద్ : సంబంధంలేని విషయాల్లో తనను లాగి.. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి.. నిజమైన అజ్ఞాతవాసి టీవీ9 చానెల్ సీఈవో రవిప్రకాశ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ9 యజమాని శ్రీనిరాజుపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై.. టీవీ9 చానెల్ ఈ వ్యవహారాన్ని నడిపిందని మండిపడ్డారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్ మార్గదర్శకత్వంలో తన తల్లిని బూతులు పదేపదే తిట్టించారని, శ్రీసిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కై.. రవిప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు చేసిందంతా చేసి.. లీగల్ నోటీసులు పంపించడమేమిటని శ్రీనిరాజును పవన్ తప్పుబట్టారు. తన తల్లిని తిట్టించిన డ్రీమ్టీమ్లో లాయర్లు భాగం కాదంటూ.. శ్రీనిరాజు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ ట్వీట్ చేశారు. ఉదయం నుంచి వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల పచ్చ మీడియా తీరును తప్పుబడుతున్న ఆయన.. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ అంతకుమునుపు ట్వీట్ చేశారు. ‘నాకు ఇష్టమైన స్లోగన్ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి’. అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ‘స్టే ట్యూన్డ్.. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్.. నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్ కళ్యాణ్’ అంటూ పేర్కొన్నారు. ఈ ‘అజ్ఞాతవాసి’ని ‘వాడో బ్లాక్మెయిలర్’ అని.. స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు... తెలుసుకోవాలనివుందా.. స్టే ట్యూన్డ్ టు “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం నుంచి - పవన్ కల్యాణ్ విత్ కెమెరామ్యాన్ ట్విటర్’ అని పోస్టు చేశారు. టాలీవుడ్లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ దుమారం.. అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా శ్రీరెడ్డి పవన్ను దూషించడం.. ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక టీడీపీ అనుకూల మీడియా, లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పవన్ అంతకుముందు ట్వీట్ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ మరికొన్ని ఇతర చానళ్ల ద్వారా తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు అని మండిపడ్డారు. మహా న్యూస్లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పెట్టుబడులు లేదా ఆయన బినామీలు ఉన్నారని ఆరోపించారు. -
చంద్రబాబు.. మీ తప్పులని రోజూ ప్రశ్నిస్తా !
-
పవన్ కళ్యాణ్ స్థలం అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు తీసుకున్న భూమి ముస్లిం మైనార్టీలదేనని పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదులు తేల్చిచెప్పారని ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు షేక్ జలీల్ అన్నారు. ఇకనైనా జనసేన అధినేత పవన్కళ్యాణ్ స్థలం లీజు అగ్రిమెంట్ను రద్దు చేసుకోవాలని కోరారు. ఆక్రమించిన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించిన తనపై రౌడీషీట్ తెరిపించారన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్కళ్యాణ్ ముస్లిం మైనార్టీలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 15 రోజుల్లోగా లీజు అగ్రిమెంట్ రద్దు చేసుకోకపోతే జనసేన పార్టీపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కబ్జా స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లి గుర్తింపు ఇవ్వవద్దని కోరతామన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు అహ్మద్బాషా, ఆరిఫ్బాషా, అన్సారీ బేగ్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. -
భౌతిక దాడులకు భయపడను
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం క్రైం: ప్రజాక్షేత్రంలోకి వచ్చాక భౌతిక దాడులు, రాజకీయ విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన ప్రత్యక్షమవుతుందని, తాను తెలంగాణ బాగు కోరితే తప్పేంటని నిలదీశారు. సినిమాల్లో ఉంటే అందరూ పొగుడుతున్నారని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే అన్ని కులాలు, మతాల మద్దతు అవసరమని.. ఆ మద్దతు కూడగట్టేందుకే ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టానని తెలిపారు. మన యాస, భాషతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించినపుడే జై తెలంగాణ నినాదానికి అర్థం ఉంటుందన్నారు. జై తెలంగాణ అంటూ సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మార్పు కోసమే.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ప్రతి కార్యకర్త దీన్ని గుర్తించాలని పవన్ చెప్పారు. సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన కార్యకర్త ప్రత్యక్షమవ్వాలని, వాటిని పరిష్కరించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. 2019లో అధికారంలోకి వస్తామని చెప్పడం లేదని.. కానీ కనీస మార్పుకు ఆ ఎన్నికలు నాంది కావాలన్నారు. శ్రీకాకుళంలో ఉన్నట్లే తెలంగాణలోని నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఉందని, దాన్ని అంతమొందించే వరకు కృషి చేస్తామని ప్రతినబూనారు. వారికేం ఇబ్బందో.. రాజకీయాల్లో విమర్శలు సహజమని, సహేతుక విమర్శలు స్వీకరించేందుకు తాను సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. కానీ అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలూ తనపై విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉందని.. తన రాజకీయ విధానాలు ప్రచారం చేసుకుంటే ఇతర పార్టీలకు ఏం ఇబ్బందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మాజీ ఎంపీ హనుమంతరావును ఆ పార్టీ తరఫున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన మద్దతిస్తుందని వెల్లడించారు. వీహెచ్ వంటి నేత తనతో కలిసొస్తే ఇంటింటికీ తిరిగి సమస్యలేంటో తెలుసుకుందామన్నారు. చెప్పు విసిరిన అగంతకుడు పవన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఓ అగంతకుడు చెప్పు విసిరాడు. కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ఓపెన్టాప్ కారులో వస్తుండగా.. తల్లాడ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పవన్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా నిలిచారు. చెప్పు ఎవరు విసిరింది తెలియలేదు. కాగా, కొత్తగూడెం నుంచి ఖమ్మం వస్తు న్న సమయంలో వాహన శ్రేణిలోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి కాలు విరిగింది. అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పవన్ కాన్వాయ్లో ని ఓ కారు.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఖమ్మం రూరల్ ఎస్ఐ చిరంజీవి కాలిపైకి ఎక్కడంతో గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
డీఎస్పీ చొరవతో సద్దుమణిగిన టిక్కెట్ల లొల్లి
నెల్లూరు(క్రైమ్): అభిమానుల మధ్య తలెత్తిన టిక్కెట్ల వివాదం డీఎస్పీ చొరవతో సద్దుమణిగింది. పవన్కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదల నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు బ్లాక్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే థియేటర్ యాజమాన్యాలు, అభిమాన సంఘ నాయకులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి డీఎస్పీ తన కార్యాలయంలో థియేటర్ యాజమాన్యాలు, చిరంజీవి యువత, జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వేల సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడం కుదరదని డీఎస్పీ తేల్చిచెప్పారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. మంగళవారం చిరంజీవి యువత నాయకులు మెగా బ్రదర్ నాగబాబు, ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించారు. మరోమారు డీఎస్పీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఉన్న థియేటర్లు, వాటి సీటింగ్ సామర్థ్యాలను డీఎస్పీ అడిగి తెలుసుకొన్నారు. సగం టిక్కె ట్లు అభిమాన సంఘాలకు ఇవ్వాలని, మిగిలిన టిక్కెట్లు థియేటర్లో క్యూలో, ఆన్లైన్లో విక్రయించాలని సూచించారు. తొలి మూడు షోలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
పవన్ మానేయటం లేదు.. జస్ట్ బ్రేక్ అంతే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అవ్వనున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో బరిలో దిగుతానని పవన్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించాడు. దీంతో పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానే పవన్ చివరి సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ఏ ఎం రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు పవన్ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. పవర్ స్టార్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో పవన్ సినీ భవిష్యత్తుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా తరువాత పవన్ పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నాడట. అయితే 2019 ఎన్నికల తరువాతే తన సినీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆశించినట్టుగా రాజకీయాల్లో సత్తా చాటలేకపోతే తిరిగి సినిమాల మీదే పవన్ దృష్టి పెడతారన్న టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల విరామం తరువాత తిరిగి పవన్ సినిమాల్లో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
2019 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో నూ పోటీ
జనసేన పార్టీపై పవన్ కల్యాణ్ సాక్షి, అమరావతి: వచ్చే మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా అవతరిస్తుందని, 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి మూడేళ్లయిన సందర్భంగా ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్ర బాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని భావిం చానని, అయితే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కార్యక్రమాలు ప్రజలకు సరిగా చేరువ కావడం లేదని అభిప్రాయపడ్డారు. తాను ఏపీ నుంచే పోటీ చేస్తా నని, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని చెప్పారు. పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. అన్నయ్యదీ నాదీ వేర్వేరు దారులు చిరంజీవి, తాను ఒకే పార్టీలో కలసి పనిచేసే ఆలోచన లేదని పవన్కల్యాణ్ చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుచేశామని.. భూ సమీకరణ, మైనింగ్ తదితర 39 అంశాలపై ప్రజలు, మేధావులు, విద్యార్ధుల నుం చి పార్టీకి సలహాలు, సూచనలు ఇవొచ్చన్నారు. ప్రజా రాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్లో ప్రజల తరుఫున పోరాడిన ఇరోం షర్మిలకు ఎన్నికల్లో 90 ఓట్లు రావడం బాధించిందన్నారు. -
పవన్తో సీపీఐ నేతల కీలక భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్తో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీకి ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు భూ సేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు, నోట్లరద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించునట్లు జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయం ఆలోచన చేసినట్లు రామకృష్ణ ప్రకటించారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్ పేర్కొన్నారు. సీపీఎం నేతలతో కలిసి మరోసారి పవన్తో భేటీ అవుతామని రామకృష్ణ తెలిపారు. -
నాటకం మొదలైంది...!
ప్రజల చేతులు కాలాక పవన్ ఆకులు పట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా ప్రజలను మభ్యపరి చేలా పవన్ మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సార థ్యంలో కొనసాగిన ప్రత్యేక హోదా అనే సినిమా అయి పోయింది. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ నాటకం మొద లైంది. అసలు విషయం పక్కన పడింది. అయోమయం అల ముకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పవన్ కల్యాణ్ నడుం బిగించారన్న విషయం కాకినాడ సభలో తేటతెల్లమైపోయింది. పవన్ కల్యాణ్ ఆత్మగౌరవ సభ తెలుగుదేశం పార్టీ మారువేషంలో ఏర్పాటు చేసిన సభగానే స్పష్టమైపోయింది. కేవలం బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని టార్గెట్ చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని బతికించడానికి చేసిన ప్రయత్నంగానే స్పష్ట మైంది. ఏపీకి ప్రత్యేకహోదాని కల్పించే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆడుతున్న దాగుడుమూతల్ని పవన్ తూర్పార పట్టలేకపోయారు. పవన్ నిర్వహించిన ఆత్మ గౌరవ సభ బాబు గౌరవసభగానే మిగిలిపోయింది. తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మంచి నినాదం ఈ సభలో దొరుకుతుందని అందరూ ఆశించారు. కానీ నినాదం పక్కకు పోయి సినీఫక్కీని మించి ఉన్మాదం తీరులో పవన్ ప్రసంగం సాగింది. ఈ రాష్ట్రానికి దశ, దిశలను సూచించే మార్గం ఎక్కడా కనిపించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు రాజీపడి ప్యాకేజీకి ఒప్పేసుకున్న విషయం అందరికీ స్పష్టంగానే అర్థం అయింది. తను తీసుకున్న నిర్ణయంవల్ల ప్రజల్లో తనకు అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? అన్న విషయమై బాబు సర్వే కూడా చేసేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ ప్రజలు నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తున్నారు. ఈ విషయం పవన్కి తెలుసు. అయినప్పటికీ ఈ నెపాన్ని ఒక్క బీజేపీ మీదకే నెట్టేసి బాబును గట్టె క్కించడానికి మారువేషంలో వచ్చిన ‘తమ్ముడు’గానే పవన్ బయట పడ్డారు. ప్రత్యేక హోదాపై బాబు గతంలో చేసిన ప్రకటనను గాని, ఇప్పటి ప్రకటనలను గాని పవన్ ప్రశ్నించలేక పోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన అన్న చిరంజీవిని, తల్లిని, వదినను వదులు కుని ప్రాణాలకు తెగించానన్న పవన్ ఇప్పుడు బాబు నిర్ణయం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఎలుగెత్తి చాటలేకపోయారు. అయితే సినిమా డైలాగులు రాసు కొచ్చి నోటికొచ్చినట్టు ఉన్మాది స్టైల్ల్లో పవన్ పలికేసి వెళ్లిపో యారు. సమావేశానికి అశేష సంఖ్యలో వచ్చిన అభిమాను లకు గాని, టీవీల్లో చూసిన జనాలకుగాని పవన్ ఎందుకు ఈ ఆత్మగౌరవ సభ పెట్టారో అర్థం కాలేదు. ఈ స్పెషల్ స్టేటస్ గండం నుంచి బాబును తప్పించి ‘ఆత్మరక్షణ’ చేసు కునే సమావేశంగానే పవన్ మలిచారన్నది స్పష్టం. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధినేత బాబు ఆదేశాలు లేకుండా స్పెషల్ స్టేటస్ గురించి ఆందోళన చేయగలరా? మరి బాధ్యులైన బాబును విడిచిపెట్టి పవన్ కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేశారు? స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి బాబు బాధ్యతను పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ‘హోదా కోసం ప్రధాని మోదీని ప్రశ్నించడానికి బాబు భయపడుతున్నారా..? మీ మధ్య లొసుగులు ఏమైనా ఉన్నాయా?’ అని పవన్ తిరు పతి సభలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పవన్ తీరును చూసిన తర్వాత, ‘బాధ్యత’ గల ముఖ్యమంత్రిగా ఉన్న బాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని, వీరిద్దరి మధ్యా లొసుగులు ఏమైనా ఉన్నాయా..? అని ప్రజలకు అనుమానం కలుగుతోంది. ప్రజల చేతులు, మూతులు కాలాక పవన్ ఆకులు పట్టుకు వస్తున్నారు. ఆయనకిది కొత్తకాదు. అమరావతి భూముల విషయంలో పవన్ బాధిత రైతులతో కలసి చిన్నపాటి సమావేశంతో హడావుడి చేశారు. అప్పుడు బాబు పవన్కు కండువా వేసి తిరుపతి ప్రసాదం ఇచ్చి పంపారు. తర్వాత రాజమండ్రి పుష్కరాల సమయంలో బాబు హారతి షూటింగ్ సందర్భంగా 27 మంది అమా యక ప్రజలు బలైపోయిన సందర్భంలో పవన్ వచ్చి అది ‘అసాంఘిక శక్తుల పనే’ అంటూ నాలుగు డైలాగ్లు చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ హోదా స్క్రిప్ట్తో వచ్చారు. ఇలా రావడం... నాలుగు డైలాగ్లు చెప్పడం.. వెళ్లిపోవడం పవన్కు పరిపాటే. ఇదంతా ‘సేమ్ టు సేమ్’ గానే పవన్ కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చంద్రబాబు అంగీకరిం చారు. శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసి ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. హోదా లేకుండా ప్యాకేజీని స్వాగతించడమేమిటంటూ పవన్ ఒక్క డైలాగ్ కూడా చెప్ప కపోవడాన్ని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. జనంలో జనసేన మీద పెరిగిన అనుమానాలను కాకినాడ సభ నిజం చేసిందని చెప్పక తప్పదు. బీజేపీతో టీడీపీ విడి పోతే దాన్ని కొమ్ము కాయడానికే జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పకనే చెప్పేశారు. చివరికి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే ‘నేనే’ అక్కడ కూర్చుని గెలిపిస్తా నని పవన్ ప్రకటించేశారు. ఒక పక్క బాబు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా పవన్ ప్రజలను మభ్యపరిచే మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది. వి.వి. రమణమూర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 93485 50909 -
భజన సేన తో జరభద్రం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా సంపాదించేయాలన్న ఆశ.. కాస్తో కూస్తో నిజాయితీపరుడిగా ఉన్నపేరు పోయి అవినీతిపరుడిగా ముద్ర పడిపోతుందోమోనన్న అనుమా నం.. ఇలా రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక అధికారికి ఈ మధ్యకాలంలో ఓ మంచి అవకాశం వచ్చిపడింది. తన బిడ్డ పుట్టిన రోజును పురస్కరించుకుని భారీ వేడుక నిర్వహించారు. అంతే.. ఎన్నాళ్లగానో సదరు అధికారిని ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం కోసం వేచిచూస్తున్న వారంతా కానుకలతో క్యూ కట్టారు. విలువైన వస్తువులు వెల్లువలా వచ్చిపడ్డాయి. భారీస్థాయిలో నగదూ గిట్టుబాటైంది. హమ్మయ్య ఈయన పంట పండింది. ‘మనల్ని కొన్నాళ్లు బాగానే చూసుకుంటాడు...’ అనుకుని ఎవరికి వారు ఊరట చెంది ఆ వేడుక నుంచి తృప్తిగా బయటపడ్డారట. సదరు అధికారి మాత్రం ఇన్నాళ్లకు ఓ ఫంక్షన్ చేస్తే వచ్చింది ఇంతేనా అన్న అనుమానంతో ఇంకో ఫంక్షన్ పెట్టేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారట. భజన సేన రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల వేళ పుట్టుకొచ్చిన జనసేన పార్టీ గురించి తెలియని వారుండకపోవచ్చు. ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎక్కడా సదరు పార్టీ అధినేత ఊసు లేదు కానీ.. పార్టీ అభిమానుల హడావుడి మాత్రం ఇక్కడ బాగానే కనిపిస్తోంది. అది కూడా కేవలం ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలోనే. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, పదవులు చేపట్టిన మంత్రులు, ఇతర నాయకులను అభినందిస్తూనో, కృతజ్ఞతలు ప్రకటిస్తూనో ఊళ్లలో రోడ్ల వెంబడి ఎక్కడిక్కడ జనసేన పేరిట భారీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టుకొచ్చిందంటూ ఎన్నికల వేళ పార్టీ నేత ఆవేశపూరిత ప్రసంగాలు చేయగా.. ఇక్కడ మాత్రం కేవలం ప్రశంసించడానికే పార్టీ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు పాకులాడుతున్నారు. జనం గురించి, జనం సమస్యల గురించి కనీసమాత్రంగానైనా స్పందించాలన్న సామాజిక స్పృహ లేని సేన క్యాడర్ ఫ్లెక్సీలపై మంచి కొటేషన్లు రాస్తూ నానా హడావుడి చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రానే అంతా అయిపోతుందా? మధ్యలో ఈ ‘గారి’లేంటో హైదరాబాద్.. విజయవాడ.. విశాఖపట్నం.. ఇలా ఏ ఊళ్లోనైనా మహాత్మా గాంధీ రోడ్డు.. కార్ల్మార్క్స్ స్ట్రీట్.. బీసెంట్ రోడ్డు వంటి పేర్లతో వీధులు కనిపిస్తుంటాయి. కానీ ఫలానా సుబ్బారావు గారి రోడ్డు.. అప్పారావు గారి రోడ్డు అని ఎక్కడైనా కనిపిస్తాయా? ఇవి చూడాలంటే ఏలూరు రావాల్సిందే. ఇక్కడి రోడ్ల పేర్లకు చివరలో ‘గారి’ తోకలు కనిపిస్తాయి. సదరు మనుషులంటే ఒకింత గౌరవంతో కూడిన భయంతోనే నగరపాలక శాఖ అధికారులు బహుశా ఈ ‘గార్లు’ తగిలించి ఉంటారంటారా.. ఏమో వారే చెప్పాలి. కుర్రోళ్లూ.. జరభద్రం ఈ మధ్యన ఓ పోలీసు అధికారి వద్దకు ఒక యువతి తల్లిదండ్రులు వెళ్లారు. ‘సార్.. మా అమ్మాయిని ఎవరో యువకుడు ఫోన్లో వేధిస్తున్నాడు.. గట్టిగా వార్నింగ్ ఇప్పించండి..’ అని వేడుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన కానిస్టేబుళ్లను పిలిచి ‘ఎవడో వీళ్లమ్మాయిని వేధిస్తున్నాడట. వాడి నంబర్ ఇదిగో. ట్రేస్ చేసి పట్టుకోండి. దొరకంగానే గట్టిగా వాయించేసి ఆ తర్వాతే మాట్లాడండి’ అని అప్పటికప్పుడు వీరావేశంతో దేశాలిచ్చేశారు. ‘ఓకే సర్..’ అంటూ పోలీసులు ఆ పనిలో పడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే. దొరకంగానే సదరు యువకుడు అతనా కాదా.. అలా వేధిస్తున్నది నిజమా కాదా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని పోలీసు కోటింగ్ ఇవ్వొచ్చు. కానీ.. నాలుగు ‘తగిలించిన’ తర్వాత అతను అతను కాదని అని తెలిస్తే ఏం చేస్తారు. పోలీస్ బాస్ చెప్పారు కాబట్టి అదే కరెక్టు అనుకోవాలా.. ఏమో.. యువకులూ జరభద్రం. ముల్లు వెళ్లి ఆకు మీదపడ్డా.. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. విరిగేది యువకుల ఎముకలే. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
నేడు జిల్లాలో పవన్ పర్యటన
కరీంనగర్, న్యూస్లైన్ : జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్కళ్యాణ్ శనివా రం జిల్లాలోని గో దావరిఖని, హుస్నాబాద్లో పర్యటించనున్నారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. గోదావరిఖనిలో ఉదయం 11 గంటల కు సభలో బీజేపీ రామగుండం అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డికి, పెద్దపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ శరత్బాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో జరిగే బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సిరిసిల్లలో జరగనున్న బహిరంగ సభను వాయిదా వేశారు. -
'పవన్ ఇజం' మోడీ ఇజంలా ఉంది
ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రజల కోసం వస్తుందనుకుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు వచ్చినట్లు ఉందని ఆయన ఆరోపించారు. పవన్ ఇజం ప్రజల కోసం ఉంటుందనుకోంటే అది మోడీ ఇజంలా ఉందంటూ రాఘవులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. తెలంగాణలో కూడా పలు పార్టీల నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అంటు గెంతుతున్నారు.ఈ నేపథ్యంలో రాఘవులు పై విధంగా స్పందించారు. -
వైజాగ్ లో జనసేన వేదిక దృశ్యాలు
-
'మతతత్వ బీజేపీతో జనసేన... ఆశ్చర్యం'
మతతత్వ భారతీయ జనతాపార్టీ (బీజేపీ)తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల స్థాపించిన జనసేన పార్టీ కలవడం ఆశ్చర్యంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విస్మయం వ్యక్తం చేశారు. జనసేనకు తోడు టీడీపీ, లోక్సత్తా పార్టీలు కూడా బీజేపీతో పొత్తుకు తహతహలాడటం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో బీవీ రాఘవులు మాట్లాడుతూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో మతతత్వ బీజేపీ బలపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే తాము సీపీఐకి దూరంకాక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము పొత్తుకు సిద్దమని రాఘవులు స్పష్టం చేశారు. -
పవన్ వెనుక ఎవరున్నారో బయటపెడతాం: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు, నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం, ఆయన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని ఎంచుకోవడం వెనుక ఎవరున్నారనేదీ త్వరలోనే బయటపెడతామని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పవన్ కల్యాణే కాదు కాంగ్రెస్ ను వ్యతిరేకించే వారంతా తమకు ప్రత్యర్థులేనని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని ఇంది రాభవన్లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్యలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం గా జనసేన ప్రస్తావన వచ్చినప్పుడు రఘువీరా పక్కనే కూర్చున్న చిరంజీవి ఒకింత అసహనానికి గురయ్యారు. ఆయన మాట్లాడకపోవడంతో రఘువీరారెడ్డే స్పందిస్తూ ‘‘కాంగ్రెస్ను కాదనే వారు ఎవరైనా మాకు సమాన దూరమే. పనిగ టు ్టకొని తప్పుడు విమర్శలు చేస్తే వాటి బ్యాక్ గ్రౌండ్ ఏమిటనేది బయటపెడతాం. ఎవరు ఎవరితో ఒప్పం దాలు కుదుర్చుకుంటున్నారు? ఎవరు కుమ్మక్కవుతున్నారో అన్నీ బయట పెడతాం’’ అని చెప్పారు. జనసేన వల్ల కాంగ్రెస్కు ఇబ్బంది లేదన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు, వాటికి జనసేన మద్దతు గురించి వస్తున్న వార్తలను విలేకరులు ప్రస్తావించ గా ‘‘టీడీపీ, బీజీపీయే కాదు అన్ని పార్టీలు కలసినా కాంగ్రెస్కు ఏమీ కాదు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన ఇవన్నీ ఏకమైనా మాకు ఏమీకాదు. ఎన్నికలను ఎదుర్కొనడం మాకు కొత్త కాదు’’ అని సమాధానమిచ్చా రు. పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు ఉన్నారని, వారితోనే పార్టీని పునర్నిర్మిస్తామని రఘువీరా ధీమా వ్యక్తం చేశారు. -
'పవన్ కల్యాణ్ మద్దతిస్తానంటే ఆహ్వానిస్తాం'
విజయవాడ : సినీనటుడు పవన్ కల్యాణ్ ....భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానంటే ఆహ్వానిస్తామని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కాగా కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ సోమవారం (నేడు) సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు. ఇక కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో బీజేపీది ఏ తప్పులేదని అన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదని వెంకయ్య పేర్కొన్నారు. విభజన జరగాలని మేము కోరుకున్నామని... అయితే విభజన జరిగిన తీరు సిగ్గుచేటు అన్నారు. భారతీయ జనతా పార్టీ హయాంలో బీసీలకు ప్రధాన్యత ఇస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి సోనియా చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. మోడీపై కేజ్రీవాల్ తో పాటు ఎవరైనా పోటీ చేయవచ్చని వెంకయ్య పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు. -
మార్చి 17న నరేంద్ర మోడీతో పవన్ భేటి?
'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ మార్చి 17 తేదిన సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు. మార్చి 14 తేదిన 'జనసేన పార్టీ' ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన పవన్ కళ్యాణ్.. బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కూడా మోడీతో పవన్ భేటి కావొచ్చనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ మోడీ ప్రచారం చేస్తుండటం, అదే నినాదాన్ని పవన్ ఎత్తుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల పొత్తు దాదాపు ఖారారైనట్టు వస్తున్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై ఓ రకమైన పవన్ సానుకూలతను తెలుగుదేశం, బీజేపీ నేతలు అనుకూలంగా మార్చుకోనే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇంకా రాకపోవడం, కామన్ సింబల్ సమస్య జనసేన పార్టీకి ఎన్నికల్లో పోటికి ఆటకం కలిగించే అవకాశాలున్నాయి. దాంతో పవన్ బీజేపీ వైపు దృష్టిసారించారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి జనసేన సిద్దాంతాలకు సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మోడీ, పవన్ ల భేటి వార్త రాజకీయాల్లో కొంత ఆసక్తి రేకేత్తిస్తోంది. -
పవ‘నిజానిజాలు!’
సంపాదకీయం: గత కొన్నిరోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ సినీనటుడు పవన్కల్యాణ్ ‘జనసేన’ పేరిట పార్టీని ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల ఆవిర్భావం అసాధారణమేమీకాదు. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. భవిష్యత్తులోనూ అవి వస్తాయి. కేరళ వంటి చిన్న రాష్ట్రంలో 20కి పైగా పార్టీలున్నప్పుడు ఇక్కడ మరో పార్టీ రంగప్రవేశం ఆశ్చర్యం కలిగించదు. పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగాలతో నిండివున్నది. అందులో ఆవేశం, ఆగ్రహం, వ్యంగ్య వ్యాఖ్యలు వంటివన్నీ ఉన్నాయి. ఆయన మంచి నటుడు కూడా కనుక వాటిని రక్తికట్టించగలిగారు. అయితే, భావోద్వేగాలు వాటికవే ఏ పార్టీనైనా నిలబెట్టలేవు. వర్తమాన రాజకీయరంగంలో తన అవసరమేమిటో, తన ఔచిత్యమేమిటో చెప్పవలసిందీ...ప్రజలను ఒప్పించవలసిందీ కొత్తగా ఏర్పడే పార్టీయే. ‘జనసేన’ ఆ విషయంలో స్పష్టతనివ్వగలిగిందా? పార్టీ విధివిధానాలేమిటో, విజన్ ఏమిటో, సిద్ధాంతాలేమిటో పవన్కల్యాణ్ చెప్పగలిగారా? అసలు వాటికి సంబంధించిన కసరత్తు జరిగిందా? ఆయన ప్రసంగంనుంచి వీటికి జవాబులు లభించలేదు. అసలు పార్టీ ఏర్పాటు విషయమై ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయి. ఎందుక ంటే... పవన్కల్యాణ్ సినీ కాల్పనిక జగత్తులో వేలాదిమంది ఆరాధించే హీరో మాత్రమే కాదు, మూడు దశాబ్దాలపాటు తెరవేల్పుగా వెలిగిన మరో హీరో చిరంజీవికి స్వయానా సోదరుడు. ఆయన అయిదేళ్లక్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్ల తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రతిఫలంగా రాజ్యసభ సీటు, కేంద్రమంత్రిని పదవి పొందారు. ప్రజారాజ్యంలో పవన్ సాధారణస్థాయి కార్యకర్త కాదు...ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడు. పైగా, 2009 ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్వాళ్లను పంచెలూడదీసి కొట్టండి’ అని పిలుపునిచ్చిన ఆవేశపరుడు. అలాంటి తమ్ముడు అన్నగారు చేసిన పనిపై ఏమనుకున్నారన్న సందేహాలు జనంలో ఎప్పటినుంచో ఉన్నాయి. నిన్నటి ప్రసంగంలో పవన్ ఈ విషయాలేమీ తడమలేదు. అలాగని ఆయన కాంగ్రెస్ను ఉపేక్షించనూలేదు. ‘కాంగ్రెస్ హటావో...దేశ్ బచావో’ అని ఎలుగెత్తారు. దేశంనుంచి ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులంతా ‘నీ బాంచెన్, కాల్మొక్తా’ అని బానిసల్లా ఢిల్లీ పెద్దలముందు సాగిలబడితే వారు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. అలాంటి కాంగ్రెస్ నాయకుల్లో చిరంజీవి ఉన్నారో, లేదో పవన్ చెప్పలేదు. ‘తండ్రి తరువాత తండ్రిలాంటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను? ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ హైకమాండే దీనికి కారణం’ అన్నారు తప్ప ప్రజారాజ్యం విలీనంపైగానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చిరంజీవి రక్షించిన వైనంపైగానీ తన మనోభావాలను అభిమానులతో పంచుకోలేదు. మరికొన్ని రోజుల్లో జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారబాధ్యతలను చిరంజీవి నెత్తికెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఏ స్థితిలో ఉన్నదో అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు రాష్ట్ర విభజనతో మాత్రమే ఏర్పడ్డ పరిణామం కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి అంకితభావంతో కొనసాగించిన అనేకానేక సంక్షేమ పథకాలను ఆయన కనుమరుగయ్యాక అటకెక్కించిన తీరునూ, ఆయన కుటుంబంపై కక్షసాధింపుతో వ్యవహరించిన వైనాన్నీ గమనించాక ప్రజలు కాంగ్రెస్కు దూరమయ్యారు. పలు ఉప ఎన్నికల్లో ఈ సంగతి పదే పదే రుజువైంది. ‘సీమాంధ్రలో ఎటూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది... తెలంగాణలోనైనా నాలుగు స్థానాలు రావాలంటే రాష్ట్ర విభజన తప్ప దారిలే’దని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో పార్టీ హైకమాండ్కు విన్నవించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే...దేశంలో ఇంతకన్నా కనాకష్టమైన స్థితి ఉంది. ఇలా శవప్రాయమైన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండని, దేశాన్ని రక్షించండని పిలుపునివ్వడంతోపాటు అందుకు ఎవరితోనైనా కలుస్తానని పవన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా పిలుపునిస్తూనే... జయరాం రమేష్నుంచి షిండే వరకూ, దిగ్విజయ్నుంచి అహ్మద్ పటేల్ వరకూ అందరినీ విమర్శిస్తూనే...కాంగ్రెస్లో కీలకస్థానంలో ఉన్న చిరంజీవి గురించి పవన్కల్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు. అన్నయ్యగా ఆయనపై భక్తిప్రపత్తులుండవచ్చుగానీ ఆయన రాజకీయ వైఖరిని గురించి, ఆయన తీసుకున్న నిర్ణయాలగురించి విమర్శించడానికి అవి అడ్డురావలసిన అవసరంలేదు. వీటన్నిటి సంగతి అలావుంచి, పవన్ కల్యాణ్ ఎంచుకున్న సమయమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత...ఒక పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశంలేని స్థితి ఏర్పడ్డాక దాన్ని ప్రకటించి ఉపయోగమేమిటన్న సంశయం అందరిలోనూ ఉంది. కొన్ని ఓట్లు చీల్చడమో, మురగబెట్టడమో, వీలైతే ఎవరినైనా ఓడగొట్టడమో మాత్రమే ఆయన చర్యలోని పరమార్థమనుకునేవారూ ఉన్నారు. ఎవరికో పావుగానో, మరెవరి ప్రయోజనమో నెరవేర్చడానికో ఆయన హడావుడిగా రంగ ప్రవేశం చేశారన్న అభిప్రాయమూ ఉంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రశ్నించడానికే తానొచ్చానని పవన్కల్యాణ్ చెబుతున్నారు. మంచిదే. అయితే... ‘వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం/పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి మాటలను ఆయన మననం చేసుకోవాలి. తన ప్రతి మాటా, పలుకూ, కార్యాచరణా...ఇకపై జనం గమనిస్తుంటారని, అన్నిటినీ బేరీజువేసుకుని సూటిగా ప్రశ్నిస్తారని గ్రహించాలి. -
కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో: పవన్ కల్యాణ్
* జన సేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పిలుపు * ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో ఇప్పుడే చెప్పలేను * కాంగ్రెస్ తప్ప ఏ పార్టీతోనైనా కలసి పనిచేయడానికి సిద్ధం * చట్టం అందరికీ సమానంగా పనిచేయాలన్నదే మా సిద్ధాంతం * కాంగ్రెస్ హైకమాండ్ వల్లనే అన్నయ్యకు ఎదురెళ్లాల్సి వస్తుంది * తలుపులు మూసి విభజన దారుణం * వ్యక్తిగత విమర్శలు చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా * ఎకరాకు కోటి ఎలా సంపాదిస్తారో అందరికీ చెప్పాలి * జాగృతికోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయి? సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరు ‘‘జనసేన’’గా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని దేశంనుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో’ అంటూ తన ఎజెండాను వేదిక నుంచి నినదించారు. కానీ ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో పోటీ చేసే విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ముఖ్యమైన అభిమానుల మధ్య పవన్ కల్యాణ్ రాజకీయ ప్రకటన చేశారు. తెల్లటి ప్యాంట్, లేత గోధుమ రంగు చొక్కా, గడ్డంతో సాయంత్రం ఏడు గంటల సమయంలో సభా వేదికపైకి వచ్చి తొమ్మిది గంటల వరకు తన ప్రసంగం కొనసాగించారు. ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠం కాగితాలను మధ్యమధ్యలో చూస్తూ హావభావాలను ప్రదర్శించారు. ఆవేశం... అనుభవాలు... నవ్వు... రంగరించి ప్రసంగం ఆసాంతం నాటకీయతను రక్తికట్టించారు. వాడివేడి మాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని.. వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్తో తప్ప ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సినిమాలను పూర్తి చేస్తానని, ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... పార్టీ ఎందుకు పెట్టానంటే... తండ్రిలాంటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను? ఢిల్లీలో కూర్చొన్న కాంగ్రెస్ హైకమాండే దీనికి కారణం. నేనేదో సినిమాల్లో వచ్చీరాని డ్యాన్సులు చేసుకుంటుంటే.. పార్టీ పెట్టేలా చేశారు. నిర్దిష్ట ఆలోచనలతో, పాతికేళ్ల లక్ష్యంతో మీ ముందుకు వచ్చా. పార్టీ పెట్టాను. దానిపేరు ‘జనసేన’. గతంలో నేను ఏర్పాటుచేసిన సీపీఎఫ్ (కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్)నుంచే జనసేన ఆవిర్భవించింది. చట్టం అందరికీ సమానంగా పనిచేయాలన్నదే జనసేన పార్టీ సిద్ధాంతం. ఎలాంటి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉన్నా నిర్మూలిస్తాం. స్త్రీ రాత్రి వేళ కాకపోయినా కనీసం పట్టపగలు అయినా క్షేమంగా బయటకు వచ్చి తిరిగి వెళ్లేలా వచ్చే సమాజాన్ని స్థాపిస్తా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. జంపింగ్ జోకర్స్కు నా దగ్గర చోటులేదు. వాళ్లంటే నాకు చిరాకు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన టీఆర్ఎస్ నాయకుల మీద గౌరవం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన వెళ్లిపోయాక మరోలా మాట్లాడే కాంగ్రెస్ నేతలు నచ్చరు. వాళ్లను క్షమించను. కొందరు కాపు నాయకులు రాజకీయంగా నాకు మద్దతు ఉండదని ప్రకటనలు చేశారు. మీరెవరు ఆ మాట చెప్పడానికి? నేనొచ్చి మిమ్మల్ని మద్దతు అడిగానా? నాకు కులం, మతం. ప్రాంతం లేదు. నేను భారతీయుడ్ని. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవ రితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలున్నాయి. ప్రతీ ఒక్కరితో సంప్రదించిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తా. రాష్ట్ర విభజనపై... రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చారు. టీఆర్ఎస్ లేవనెత్తిన న్యాయపరమైన అంశాలను ముందే అర్థం చేసుకొని ఉండుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేదికాదు. 2009 తర్వాత రాజకీయ నేతల నీచపు పనుల వల్ల సామాన్యులు కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. ఐదేళ్లు మిన్నకుండి పార్లమెంటు ఆఖరి సమావేశాల్లో హడావుడిగా కేవలం 23 నిమిషాల్లో సభ తలుపులు మూసేసి విభజన చేయడం దారుణం. సోనియాగాంధీగానీ, కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ, పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన బొత్స సత్యనారాయణనైనా సొంత జిల్లాకు వచ్చి విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పగలరా? కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు ఆ పార్టీ నేత జైరాం రమేష్ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. విభజనపై ఆయన సీమాంధ్రలో ఒకలా.. తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారు. నిలకడలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమే దిగ్విజయ్సింగ్. కాంగ్రెస్ పెద్దలైన జైరాం, దిగ్విజయ్, షిండే, చిదంబరం తదితరులంతా జనసేన వచ్చిందని గుర్తించాలి. పవన్ మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నాడనీ, మా రాహుల్ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ నాపై వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ పెళ్లి చేసుకోలేదన్నాడు కానీ బ్రహ్మచారని మాత్రం చెప్పలేదు. ఏ పరిస్థితుల్లో నేను మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వారికేం తెలుసు. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవర్నీ వదలను. రాహుల్ నుంచి ప్రతి ఒక్కరి బాగోతాలు బయట పెడతాను. కేసీఆర్ కుటుంబంపై విసుర్లు... తగలబెట్టండి, నాలుకలు కోస్తాం, అడ్డంగా నరికేయండి అనే పదజాలం తెలంగాణ మాండలికం కాదు. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే అది ప్యూడలిస్టు భావజాలం. ఎకరాకు కోటి రూపాయలు ఎలా సంపాదించారో (కేసీఆర్నుద్దేశించి) ప్రతి ఒక్కరికీ చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. నన్నయ్య ఎక్కువా? సోమనాథుడు ఎక్కువా? అన్నది మనకొద్దు. ఎవరి ప్రాంత అభివృద్ధిపై వారు దృష్టి పెట్టండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాపై విమర్శలు చేశారు. పార్టీ పెట్టి తెలంగాణకు క్షమాపణ చెప్పాలంట.. తెలంగాణ ప్రజలే నా వాళ్లయినపుడు వారికి నేను క్షమాపణ చెప్పేదేంటి? అమ్మా... కవితా.. నీవు నా చెల్లెలులాంటి దానివి. నీ వేదనను అన్నయ్యలా అర్థం చేసుకున్నా. తెలంగాణ జాగృతికోసం దేశ విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయో వెల్లడించు. ఆర్నెల్ల కిందే ‘జనసేన’ కోసం దరఖాస్తు: బాల్రాజ్ హైదరాబాద్, న్యూస్లైన్: సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటుకు ఆరు నెలల క్రితమే ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేశామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.బాల్రాజ్ ముదిరాజ్ వెల్లడించారు. తాము దరఖాస్తు చేసుకున్న విషయంపై ఎలాంటి సమాచారం తీసుకోకుండా సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీలకు సహకరించేందుకే.. పవన్ పార్టీపై రాఘవులు వ్యాఖ్య సాక్షి, తిరుపతి: కాంగ్రెస్, బీజేపీలకు సహకరించేందుకే పవన్ పార్టీ పెడుతున్నట్లు సందేహాలున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పెట్టేవారికి ప్రజాసంక్షేమ దృక్పథం ఉండాలన్నారు. ఇంత తొందరగా పవన్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. -
తోపులాట
పవన్కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో లాఠీ చార్జీ గచ్చిబౌలి, న్యూస్లైన్: మాదాపూర్లోని హెచ్ఐసీసీలో హీరో పవన్కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు పాస్లు లేక అగచాట్లు పడ్డారు. మాదాపూర్లోని న్యాక్ ప్రధాన ద్వారం వద్ద బారులుదీరారు. సాయంత్రం 4.30 సమయంలో అభిమానులు పాస్లు కావాలని నినదిస్తూ ఒక్కసారిగా న్యాక్ గేట్ వైపు దూసుకు రావడంతో తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసు లు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. సా.గం.6కు పాస్లు లేకపోయినా అభిమానులను లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడిన బౌన్సర్ను అభిమానులు తొక్కుకొంటూ వెళ్లిపోయారు. అతని కాలు విరిగిం ది. ఓ అభిమాని కాలుకు గాయమైంది. ఉదయం నుంచే మాదాపూర్ ఇమేజ్ గార్డెన్కు అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీసులు న్యాక్ ప్రధాన ద్వారం వద్ద లోపలికి అనుమతించారు. సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని థియేటర్లలో కూడా దీన్ని ప్రసారం చేశారు. సైబరాబాద్ పోలీసులు దాదాపు 200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాక్ ప్రధాన ద్వారం, నొవాటెల్ హోటల్ చెక్ పాయింట్, హెచ్సీసీ ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేశారు. ‘నాకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే అభిమానం. పవన్ ప్రసంగం వినేందుకు నల్లగొండ నూతకల్లు నుంచి వచ్చా’నని 70 ఏళ్ల వృద్ధుడు రాజిరెడ్డి చెప్పారు. ‘పవన్ అంటే ఎంతో ఇష్టం. జనసేన పార్టీలో చేరతా’నని కడప జిల్లాకు చెందిన మోహన్రెడ్డి సంతోషంగా చెప్పారు. -
పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సోషల్ మీడియాలో కామెంట్స్
జన సేన పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై స్పందించిన వారిలో ... i dont believe God but Pawan sure appeared like one nd if telugu ppl have any brains thy shud leave Balaji,saibaba etc nd just follow Pawan — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2014 i hate pawan kalyan but the way his satires on kcr liked — bharath (@bharathv444) March 14, 2014 Hats off Pawan Kalyan! Your speech echoed the feelings of millions of Telugus. — Sekhar Kammula FC (@SekharKammulaFC) March 14, 2014 Dear Pawan Kalyan, there is no point in crying now. All the mess in the AP state was created by your own big brother Chiranjeevi. Good luck! — Mad Lad (@truelymadish) March 14, 2014 I luvd the dress the look the demeanour nd the clarity of Pawan Kalyan — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2014 Pawan Kalyan reminded all of us Telugu people to feel responsible for each other. — Chaitanya Dantuluri (@chaitanyahead) March 14, 2014 Pawan Kalyan's speech was heart felt. Wish him all the best. — Lakshmi Manchu (@LakshmiManchu) March 14, 2014 AP state went through a turmoil in the last 5 yrs, out of 8cr population, only 1 person questioned it with integrity..PawanKalyan! #JanaSena — Shooting_straight (@Direct_Shooter) March 14, 2014 Every single feeling in me was brought out today by Pawan Kalyan... Historic Speech by him... I believe in him and support idea of Jana Sena — Nikhil Siddhartha (@actor_Nikhil) March 14, 2014 Loved what #PawanKalyan said. He spoke a common man's heart. I feel exactly the same way. — Smita (@smitapop) March 14, 2014 #PawanKalyan Rocking his Speech! Is this the New Dawn? I pray for Change !! — suresh (@sureshactor) March 14, 2014 I am an Indian; I don't have caste, religion or region, says #powerstar #pawan kalyan; don't divide us on those lines, he warns politicians — Uma Sudhir (@umasudhir) March 14, 2014 Pawan Kalyan didn't attack 3 prominent people in today's speech. @ncbn , @JP_LOKSATTA and @narendramodi He kept his options open. Strategy! — Ravindra (@ravindranath_a) March 14, 2014 Pawan Kalyan questioning about the diff between PROVOCATIVE statements issued by MIM & KCR is such a valid point....... #JanaSena — Andhrawala (@andhrawala) March 14, 2014 Not Modi, not Kejriwal, the most explosive political prospect today is Pawan Kalyan. National media will notice him soon. — Kartik Dayanand (@KartikDayanand) March 14, 2014 "I'm not going 2 spare any 1 including Sonia Gandhi. No matter what they r. who they r. I'm not going 2 give a damn. I'll fight #PawanKalyan — Santosh Kumar Panda (@ThisIsSKP) March 14, 2014 After nearly 17 years, After our legend Late Sri NTR demise,I could see emotion in Pawan Kalyan. It's inspire for... http://t.co/MFO9IfPwnX — venkateswar sunkara (@vrsunkara) March 14, 2014 Pawan Kalyan in Politics to kill Congress!... http://t.co/VTFO2SaLm4 — Bhanu Laxman (@kumarworld2) March 14, 2014 "People say he is still single, but they don't claim that he's a 'Brahmachari'" - Pawan Kalyan on Rahul Gandhi. LOLWoot! — Hemanth Kumar C R (@crhemanth) March 14, 2014 i dont think all the powerstar fans will step forward with pawankalyan to clean the politics! If it happens then i say it is definatly revol — Krishna Haranath (@iamharnad) March 14, 2014 Input just received from a TV channel friend: None of the TRS leaders was ready to react to Pawan Kalyan's speech. They only shied away! — SURYA (@foolscool) March 14, 2014 Hats off Pawan Kalyan! Your speech echoed the feelings of millions of Telugus. - Sekhar Kammula — Sridath (@DathuRulz) March 14, 2014 That was Blockbuster speech by Mr.Pawan Kalyan. — Jalapathy Gudelli (@JalapathyG) March 14, 2014 -
జనసేన పార్టీ నమోదు కాలేదు : ఈసీ