kodanda ram
-
జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్ మార్కులు వచ్చినా జనరల్గా కాకుండా, రిజర్వేషన్గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. యూపీఎస్సీ అమలు చేస్తున్నా.. ఆ విధానాన్ని టీజీపీఎస్సీ ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేశారని పేర్కొన్నా రు. శనివారం సిద్దిపేటలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని సదస్సులు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి రా జ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనం వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని అడిగితే భట్టి విక్రమార్క పరిశీలిస్తామన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డిని నిలదీసి బలహీన వర్గాల హక్కులను కాపాడాలి.విద్యార్థులు, నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్నగర్ ప్రాంతం మార్మోగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కితే వారిని కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. వారేమైనా టెర్రరిస్టులు, హంతకులు, గూండాలా? లాఠీలు, ఇనుప కంచెలను రేవంత్రెడ్డి నమ్ముకున్నారు. అవి అణచేయవు. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్నగర్కు వెళ్లాలి. కోదండరాం స్పందించడం లేదేం? కాంగ్రెస్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ప్రకటించినవి ఒక్కటైనా అమలు చేశారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పది నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ లేదు. కేసీఆర్ ప్రభుత్వమే ప్రక్రియ అంతా పూర్తిచేసిన ఉద్యోగాలకు కాగితాలు పంచి.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిరుద్యోగుల ఎజెండా.. నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, నవీన్, ఆకునూరి మురళిలకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు రాలేదు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు గ్రూప్–1 అభ్యర్థుల నిరసన సాక్షిగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోమారు బట్టబయలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరసన తెలుపుతుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. జీవో 29 రద్దు చేసి గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జూలై 29న నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ప్రభుత్వం మొండిపట్టు వీడి ఉంటే ఇప్పుడు విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి..’’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ ప్రమాణం
-
కోదండరామ్కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
‘ఓయూ’లో ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) చేపట్టిన చలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలికొంది. ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్కుమార్ యాదవ్తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం 7.30 నిమిషాలకు హాస్టల్ అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్ తరలించి సాయంత్రం 6 గంటలకు విడిచి పెట్టారు. అనంతరం అశోక్కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సీఎం రేవంత్రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, కోదండరాం మౌనం వహించడం దారుణమని చెప్పారు.ఈ నెల 20వ తేదీలోగా వీసీలను నియమించకుంటే 10 విశ్వవిద్యాలయాల బంద్ చేపడుతామని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయూ అధికారుల అనుమతి లేకుండా హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మూడో రోజుకు చేరిన డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మూడో రోజు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డీఎస్సీ అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన్నట్టు సీఐ రాజేందర్ తెలిపారు. మీడియా వర్గాలపై దాడి డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ శ్రీ చరణ్, కెమెరామెన్ సాగర్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ధర్నా విరమించారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ, ఎస్ఎఫ్ఐ నేత రవినాయక్, పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వర్రావు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండిచారు. -
భద్రాద్రి పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కష్టమే: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ జన సమతి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయన్నారు. కేంద్రం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలుపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు అందజేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.అనంతరం, కోదండరాం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది. విద్యుత్ శాఖను రూ.80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకున్నారు.వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గఢ్తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకుంది. ఒప్పందం రద్దు కారణంగా ప్రభుత్వంపై రూ.250కోట్ల అదనపు భారం పడింది. విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధం. విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు విద్యుత్ శాఖ అధికారి రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై మా వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కమిషన్ ముందు పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒప్పందం ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్కు ఎందుకు వెళ్లారనే సమాచారం ఇచ్చాం. ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఈ ఒప్పందం వల్ల రూ.2600 కోట్ల నష్టం జరిగింది. వెయ్యి మెగావాట్ల ఒప్పందం జరిగితే సప్లై చేయలేదు. అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారు. తర్వాత తప్పు తెలుసుకుని రద్దు చేసుకోవాలనుకుంటే కుదరలేదు.ఇరు రాష్ట్రాల డిస్కంల ఒప్పందాల ద్వారా ఎంఓయూ చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై సబ్జెక్టుకల్ టెక్నాలజీని రుద్దారు. 2010లో తయారు చేసుకున్న పలు యంత్రాలను టెక్నాలజీని బీహెచ్ఈఎల్.. ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బలవంతంగా రుద్దారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావు అని మా అభిప్రాయం. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాదు.. సరైన లొకేషన్ కూడా కాదు.యాద్రాద్రీ పవర్ ప్లాంట్ లోకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుంది. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం అలా చెయ్యలేదు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేళ్లుగా చెయ్యలేదు. ఈ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. రూ.635 కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్ సరిగ్గా సరఫరా చేయనందుకు భద్రాద్రి ప్లాంట్ 25 ఏళ్లలో తొమ్మిది వేలు, యాదాద్రి రవాణా వల్ల రూ.1600 కోట్లకు పైగా నష్టం జరుగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్
ఆదిలాబాద్: దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పట్ట ణంలోని జేకే ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు తిలక్రావు అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి నిలు వెత్తు నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచాయన్నారు. కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయస్థాయిలోని స్వతంత్ర సంస్థ ఆడిటింగ్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, అమలు సరిగాలేదని, నిధుల వినియోగం సక్రమంగా లేదని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ నుంచి కేసీఆర్ అందినకాడికి దండుకున్నారని విమర్శించారు. అవసరానికంటే అదనంగా ఖర్చు చేసి పనులు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం కట్టారని అవన్నీ నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పనులు మాత్రం ఆదిలోనే పునాదులు కదులుతున్నాయన్నారు. కోట్లాడి తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీజేఎస్ శ్రేణులు పనిచేయాలని కోదండరామ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసి పోడు భూములు, డీ 27, డీ28 కాలువల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకముందు నాయకులు కోదండరామ్ను సన్మానించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు సర్దార్ వినోద్, దుర్ము, గోనె శ్రీనివాస్, బెనహర్ సిరాజ్, రాజేశ్వర్రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. నిర్వహణ లేకనే ‘కడెం’కు ప్రమాదం.. కడెం ప్రాజెక్ట్ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం నెలకొందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కడెం ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వరద గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ఇంజినీర్లు మొదట కట్టిన ప్రాజెక్టుల్లో కడెం ఒకటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కడెంను పట్టించుకోకపోవడంతో డేంజర్ జోన్లోకి వెళ్లిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మరమ్మతు చేయిస్తోందని తెలిపారు. కడెం ప్రాజెక్ట్కు బ్యాలెన్సింగ్ రిజర్వార్గా ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే ఆయకట్టును స్థిరీకరించవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తిలక్రావు ఉన్నారు. ఇవి చదవండి: సార్.. గిరాకీల్లేవ్! -
కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్లో చర్చ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చి గెలుపులో భాగమయ్యారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. కోదండరాంను రాజ్యసభకు పంపేందకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ దండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఇది కూడా చదవండి: పొన్నాల వాట్సాప్ స్టేటస్పై ఎర్రబెల్లి ఫైర్ -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్కు కోదండరామ్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కోదండరాం మద్దతు తెలిపారు. కేసీఆర్ను గద్దె దించడానికి కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి తెలంగాణ జనసమితి పార్టీ సిద్ధమైంది. అంతేకాకుండా... విశాల ప్రయోజనాల దృష్టా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పోటీకి దూరంగా ఉండనుంది. కాగా నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయానికి సోమవారం కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆ పార్టీ అధినేత కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి జోసురాజు, తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజేఎస్కు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికి కలిసి పనిచేద్దామని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా కోదండరామ్ను కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు. భవిష్యత్లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా టీజేఎస్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్న రేవంత్ రెడ్డి.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్కు కీలక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష్యం గొప్పది దాని కోసం కలిసి పని చేస్తామని, నియంతను గద్దె దించాలనేది ప్రధాన అజెండాగా తెలిపారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని చెప్పారు. -
మీకోసం ఢిల్లీలో సైనికుడిలా ఉంటా: రాహుల్ గాంధీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడూ ఒక్కటే. వీరంతా కలిసి పనిచేస్తారు. ఢిల్లీలో, లోక్సభలో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో బీజేపీ, ఎంఐఎంలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచి్చనా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి సాయపడుతోంది. ఈ ముగ్గురి లక్ష్యం కేవలం ప్రజాధనం దోచుకోవడం మాత్రమే. నేను బీజేపీతో పోరాటం చేస్తున్నందుకు నాపై కేసులు పెడుతున్నారు. నా లోక్సభ సభ్యత్వం రద్దు చేసి నా ఇంటిని లాక్కున్నారు. నేను సంతోషంగా ఇంటిని అప్పగించాను. అసలు నాకు ఇల్లే అక్కర్లేదు. మొత్తం ఇండియానే నా ఇల్లు. తెలంగాణలో ప్రతి పల్లె, పట్టణం నా ఇల్లే. కోట్లాది ప్రజల హృదయాల నుంచి నన్ను దూరం చేయలేరు. ఢిల్లీలో, కేంద్రంలో ఇందిర, రాజీవ్, సోనియాల తరహాలోనే రాహుల్ గాంధీ అనే మీ సైనికుడు అక్కడ ఉంటాడు. మీకు ఎప్పుడు అవసరమైనా వెంటనే వచ్చేస్తాడు..’ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు కులగణన తొలి అడుగు అని పేర్కొన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు మద్దతు ధర రూ.15 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో ఇసుక, భూ, లిక్కర్ మాఫియాలను కేసీఆర్ కుటుంబమే నడుపుతోందన్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర మూడోరోజు శుక్రవారం.. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటించారు. జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్ పట్టణాల్లో జరిగిన కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. మోదీ రహస్య ఒప్పందం.. ‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోంది. ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించుకుందాం. సోనియాగాంధీ ప్రజా తెలంగాణను ఆకాంక్షించి రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వనరులను, ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటోంది. దేశంలో ప్రతిపక్ష సీఎంలను వెంటాడుతున్న మోదీ.. కేసీఆర్ విషయంలో మాత్రం రహస్య ఒప్పందంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తనకు తెలియకుండానే దెబ్బతింది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు వరుస కడుతున్నారు. బీఆర్ఎస్ కారు టైరు వారికి తెలియకుండానే పగిలింది. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజా తెలంగాణ సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల తలుపులు ప్రజల కోసం నిరంతరం తెరిచి ఉంటాయి. రైతాంగానికి అండగా నిలబడతాం. నిజాం షుగర్స్ తెరిపిస్తాం. వరి తరహాలోనే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు అదనంగా రూ.500 చెల్లింపు విషయాన్ని ఆలోచిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో ప్రజలకు పంచుతాం..’అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ బెబ్బులి పులుల సర్కారు ఏర్పడబోతోంది.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. నేను పార్లమెంటులో కులగణన ప్రస్తావన తెస్తే.. ప్రధాని సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక్కడ సీఎం కూడా కులగణనపై ఆసక్తి చూపడం లేదు. దేశంలో శ్రామిక శక్తి ఓబీసీలే. దామాషా ప్రకారం ఓబీసీలకు ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. దేశ జనాభాలో 50% ఓబీసీలే. కానీ కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఓబీసీల చేతుల్లో ఉంది. ఈ నిజాన్ని దాచి మీ జేబుల్లోనుంచి డబ్బులు కొట్టేసి అదాని లాంటి వ్యక్తులకు వెళ్లేలా చేస్తున్నారు. కులగణన ఎక్స్రే లాంటిది. గాయం ఎక్కడ తగిలిందో ఎక్స్రే చెబుతుంది..’అని రాహుల్ అన్నారు. తెలంగాణలో ప్రజల సర్కారు, కాంగ్రెస్ బెబ్బులి పులుల (కార్యకర్తలు) సర్కారు ఏర్పడబోతోందని చెప్పారు. జీవన్రెడ్డి అనువాదం బాగుందంటూ..జగిత్యాల నుంచి జీవన్రెడ్డిని, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను అసెంబ్లీకి పంపాలని కోరారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి తదితరులున్నారు. టీ తాగి..దోశెలు వేసి..తిని మల్యాలలోని వేల్పూర్ మండలం పడిగెల్ క్రాస్రోడ్డులోని ఓ హోటల్ వద్ద టీ తాగుతూ రాహుల్ స్థానికులతో మాట్లాడారు. టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను తెలుసుకున్నారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్ను వృద్ధ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. అక్కడి చిన్నారులతో సరదాగా సంభాషించిన రాహుల్ వారికి చాక్లెట్లు ఇచ్చారు. కాగా పర్యటన షెడ్యూలులో మార్పుల కారణంగా రాహుల్ గంగాధర, కొండగట్టు పర్యటన రద్దయ్యింది. దీంతో నేరుగా జగిత్యాల వెళుతూ మధ్యలో రాజారంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగారు. దోశెలు ఎలా వేయాలో యజమానిని అడిగి తెలుసుకున్నారు. దోశెలు వేసి కస్టమర్లకు ఇచ్చారు. తాను కూడా రుచి చూసి అద్భుతంగా ఉంది తమ్ముడూ అని అభినందించారు. అక్కడి పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చారు. టిఫిన్ తినేందుకు వచి్చన వారితో ముచ్చటించారు. రాహుల్ రాకతో రోడ్డుపై వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. మరిచిపోలేని అనుభూతి వెనుక నుండి వచ్చి, భుజంపై చేయి వేసి, తమ్ముడూ ఎలా ఉన్నావు? అంటూ రాహుల్ గాంధీ పలుకరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిలిచిందని పోతారం గ్రామానికి చెందిన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వావిలాల శివగౌడ్ చెప్పాడు. తాను దోశెలు వేసి తినడంతో పాటు తనకు తినిపించారని అన్నాడు. రాహుల్ గాందీని టీవీలో తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు అయినా చాలా సాదాసీదాగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాస్వామిక తెలంగాణపై చర్చించాం: కోదండరాం ఓ హోటల్లో బస చేసిన రాహుల్ గాందీని శుక్రవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తమకు ఉన్న సమాచారాన్ని రాహుల్తో పంచుకున్నామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి హైదరాబాద్లో ప్రకటన విడుదల చేస్తామని, సీట్లు, పొత్తుల విషయం రాహుల్తో మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి అన్న విషయంపై చర్చించామని, ఈ క్రమంలో తమ మద్దతు అడిగారని వివరించారు. రాజకీయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం పెంచాలని, అందుకోసం కలిసి రావాలని అన్నారని చెప్పారు. -
చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రోఫెసర్ కోదండరాం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాము విభజన హామీలు, కృష్ణ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సుమారు 150 మందితో గంటపాటు మౌనదీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసమితి అధినేత కోదండరాం జనవరి 30న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. జనవరి 31వ తేదిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్ క్లబ్లో సెమినార్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: మోదీ సర్కారే టార్గెట్.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్) -
వీరికి సడన్గా ఏపీపై ఎందుకంత ప్రేమ?
కొద్ది రోజుల క్రితం విజయవాడలో రాజధాని అమరావతిపై ఒక సమావేశం జరిగింది. రాజధాని ఉద్యమం 900 రోజుకు చేరిందంటూ ఆ సమావేశం పెట్టారు. అందులో మాట్లాడిన కొందరు వక్తలు చాలా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అందులోను రిటైర్డ్ న్యాయమూర్తి గోపాలగౌడ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, పౌరహక్కుల నేత ఫ్రొఫెసర్ హరగోపాల్ ప్రభృతులు ఉన్నారు. సీపీఐ నారాయణ వంటివారు ఈ సమావేశంలో పాల్గొన్నా, వారు ఎప్పుడూ చెప్పే విషయాలు చెబుతుంటారు కాబట్టి, వారు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా ఏమీ అననవసరం లేదు. కాకపోతే గోపాలగౌడ గతంలో రాజధాని భూముల సమీకరణకు వ్యతిరేకంగా కూడా వచ్చి మాట్లాడి వెళ్లినట్లు గుర్తు. అప్పట్లో ఆ రకమైన సమీకరణ రైతులకుఅన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పారు. కాని ఇప్పుడే అదే గౌడ వచ్చి రాజధానిలో మార్పులు ఉండరాదని, మొత్తం లక్షన్నర కోట్లు అయినా అక్కడే వ్యయం చేయాలని చెప్పి అందరిని విస్తుపరిచారు. వీరు సామాజిక బాధ్యతతోనే మాట్లాడారా?లేక అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు వ్యాపారులు తీసుకు వచ్చారు కనుక వారికి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మాట్లాడారో అర్ధం కాదు. రాజధాని పై హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా తీర్పు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. ఒక న్యాయ కోవిదుడు ఇలా మాట్లాడడమా? అసలు శాసనసభకు చట్టం చేసే హక్కే లేదని గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తే దానిని ఇలాంటి మాజీ న్యాయమూర్తులు సమర్దించడమా? పైగా అమలు చేయకపోతే కేసులు పెట్టాలని అనడమా? ఎంత దారుణం. హైకోర్టు తీర్పుపై ఏపీ శాసనసభలో క్షుణ్ణంగా చర్చించి, హైకోర్టు కాని, శాసన వ్యవస్థ కాని ఎవరి పరిధులలో వారు ఉండాలని పేర్కొనడం గురించి గౌడ మాట్లాడరా? కాకపోతే జడ్జిలకు బంగ్లాలు నిర్మించలేదని బాదపడ్డారు. మరి ఇదే సమయంలో రాజధాని భూ స్కామ్ కేసులు, వాటిని న్యాయ వ్యవస్థ హాండిల్ చేసిన తీరు గురించి కూడా గౌరవ న్యాయమూర్తి చర్చించి తన అబిప్రాయాలు చెబితే బాగుండేది కదా? గౌరవ న్యాయమూర్తులు కొందరికి అమరావతిలో భూ ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబితే ,దానిని న్యాయ వ్యవస్థ ఎలా స్వీకరించాలో కూడా ఈయన వివరించి ఉండాల్సికదా. రాజధానిలో ఇప్పటివరకు చేసిన నిర్మాణాల గురించి, వాటిని అబివృద్ది చేయండని చెప్పడం తప్పుకాదు. కానీ ఇప్పటికే ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది కనుక మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అమరావతి ప్రాంతంలోనే వ్యయం చేయాలని అనడం మాత్రం గౌడ ది పూర్తిగా బాద్యతారాహిత్యం. కేవలం కొందరికి మేలు చేసేందుకే ఆయన అలా మాట్లాడారేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. వేరే రాష్ట్రానికి చెందిన ఈయనకు శ్రీ బాగ్ ఒడంబడిక, వికేంద్రీకరణ,తదితర అంశాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే శివరామకృష్ణన్ కమిటీ మూడు పంటలు పండే భూములలో రాజధాని పెట్టవద్దని చెప్పిన సంగతిని ఆయనకు ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. ఆయన మేధావి కావచ్చు. న్యాయ కోవిదుడు కావచ్చు.కాని ప్రజల మనిషి కాదని మాత్రం తనకు తాను రుజువు చేసుకున్నారేమో అని పిస్తుంది. ఇక మరో ప్రముఖుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితంగా ఉన్నాయనిపిస్తుంది. రాజధాని మార్చరాదని అభిప్రాయం ఉంటే ఆక్షేపణీయం కాదు. కానీ ఆయన విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సరసన కూర్చుని ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేం. ఆయనను ఎవరు మాయ చేసి తీసుకు వచ్చారో తెలియదు కానీ, ఎవరి ట్రాప్ లో పడి వచ్చారో తెలియదు కానీ ,పూర్తిగా పేదల ప్రయోజనాలను ఆయన విస్మరించడం విస్తుపరుస్తుంది. రాజధాని ప్రాంతంలో పేదలైన ఎస్.సి,ఎస్టి, బిసి వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని డిమాండ్ చేసేవారికి ఆయన మద్దతు ఇవ్వడమా? ఇలాగేనా పౌరహక్కులు కాపాడడం అంటే?ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదట. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమి ప్రచారం చేశారు. ఆంద్ర పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారని కదా? అలాంటి ఉద్యమానికి హరగోపాల్ కూడా మద్దతు ఇచ్చారు కదా? అంటే తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ చేయకూడదు. ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టారీతిన భూముల రేట్లు పెంచి దోపిడీ చేయవచ్చని హరగోపాల్ వంటివారు చెబుతున్నారా? రాజధానిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చితే దానికి ఆయన మద్దతు ఇవ్వడమా? హవ్వ! ఇదేనేమో కాలమహిమ! హరగోపాల్ వంటివారిని కూడా అప్రతిష్టపాలు చేయగల తెలివైన రాజకీయనేతలు ఎపిలో ఉండడం విశేషమే. హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక దానిని అమలు చేయకపోతే వ్యవస్థపై నమ్మకం పోతుందట. మరి ఇదే హరగోపాల్ ఎన్ని కోర్టు తీర్పులను విమర్శించలేదూ. అంతదాక ఎందుకు విప్లవకవి వరవరరావుకు బెయిల్ ఇవ్వరాదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్ధిస్తారా? కోర్టులను విమర్శించకూడదు. న్యాయమూర్తులకు ఆపాదించకూడదు అన్నది వాస్తవమే అయినా, తీర్పులపై విశ్లేషించుకోవచ్చు.. విమర్శించవచ్చన్న సంగతి మేధావి అయిన హరగోపాల్ కు తెలియకుండా ఉంటుందా? న్యాయ వ్యవస్థ లో ఏమి జరుగుతోందో తెలియనంత అమాయకంగా హరగోపాల్ ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో హైకోర్టు జడ్జిలనే నేరుగా కోర్టులలోనే దూషించిన ఘట్టాలు జరిగినప్పుడు , వారిపై దాడి చేసినంత పని చేసినప్పుడు హరగోపాల్ ఖండించారో ,లేదో గుర్తు లేదో కానీ, ఇప్పుడు ఆయనకు సడన్ గా న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం కలగడం మంచిదే అనుకోవాలా? మరో మేధావి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని ఉద్యమకారులు కొందరు దూషిస్తున్న సమయంలో ఎన్నడైనా వారించారా? ఆంధ్రులపై కొన్ని చోట్ల దాడులు జరిగినప్పుడు ఖండించారా? ఇప్పుడు సడన్ గా ఏపీపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది. దానికి కారణం టిడిపి అదినేత చంద్రబాబుతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలేనేనా? గత ఎన్నికల సమయంలో టిడిపి,కాంగ్రెస్, సిపిఐలతో కలిసి పోటీచేసిన కోదండరామ్ పార్టీకి మెజార్టీ చోట్ల డిపాజిట్ లు దక్కకపోయి ఉండవచ్చు. అయినా ఆనాడు కోదండరామ్ పార్టీకి అవసరమైన వనరులు అన్నీ టీడీపీ నాయకత్వం సమకూర్చిందన్న కృతజ్ఞతతోనే వారు విజయవాడ వరకు వెళ్లి ,అమరావతికి మద్దతు ఇచ్చి వచ్చారా? ఒక టెంట్ కింద కూర్చుని, టీడీపీ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయేవారు మహోద్యమం చేసినట్లుగా వీరంతా గుర్తించారన్నమాట. వీరంతా అమరావతి రాజధాని ఒకే చోట ఉండాలని కోరదలిస్తే ,దానికి నిలదీయాల్సింది కేంద్రాన్ని కదా? లక్ష కోట్లా.?ఇంకా ఎక్కువ కోట్లా అన్నదానితో నిమిత్తం లేకుండా కేంద్రం నిధులు ఇవ్వాలని వీరు ఎందుకు డిమాండ్ చేయలేదో తెలియదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారరాదట. అలాగైతే 1956లొ సమైక్య రాష్ట్రానికి నాటి హైదరాబాద్ అసెంబ్లీ కూడా మద్దతు ఇచ్చింది కదా? మరి ఆ నిర్ణయం మారే వరకు ఎందుకు తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. పలు ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడం కుదరదని, హైదరాబాద్ చుట్టూరానే అనేక సంస్థలు ఏర్పాటు చేసినా, ఎందుకు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు? ఇప్పుడు కూడా ఏపీలో అయినా, మరెక్కడైనా ప్రభుత్వ అబిప్రాయాలను అంతా ఆమోదించనవసరం లేదు. నచ్చకపోతే నిరసనలకు దిగవచ్చు. తప్పు లేదు. కాకపోతే అవి హేతుబద్దమా?కాదా? ప్రజలంతా ఆమోదిస్తారా?లేదా అన్నది ఎన్నికలలో తేలుతుంది. అంతవరకు ఎందుకు ఆగడం లేదు? ఏది ఏమైనా అసలు ఆంధ్రకు ఈ దుస్థితి ఏర్పడడానికి కారణమైనవారితో సుద్దులు చెప్పించడం వారికే చెల్లిందని అనుకోవాలి. తెలంగాణ వాదులుగా పచ్చి ఆంద్ర వ్యతిరేకులుగా ముద్ర పడ్డ నేతలను విజయవాడ తీసుకు వచ్చి అమరావతి గురించి మాట్లాడించడమే ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్వాహకుల చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుంది. ఆంద్రా బాగుపడాలని కోరుకునేవారిని పిలవాలి కాని, ఆంద్ర అంటే గిట్టనివారిని తీసుకు రావడం ద్వారా వారు ఏమి చెప్పదలిచారు? రాజదాని రైతుల భూములు పోయాయట .మరి వారు తీసుకుంటున్న పరిహారం మాటేమిటి. వారు భూములు అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించిన మాటేమిటి. రైతులు ఎవరికైనా అన్యాయం జరిగితే దాని గురించి ఎవరైనా అడగవచ్చు.కాని ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్ష్యాల కోసం పనిచేయడం సరికాదు .నిజాయితీ ఉంటే రియల్ ఎస్టేట్ వారికి నష్టం కలుగుతుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చప్పి ప్రభుత్వాన్ని పరిష్కారం కోరవచ్చు.కాని వారు అలా చేయడం లేదు. రైతుల పేరుతో డ్రామాలు నడుపుతున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ గురించి అందరికి తెలిసినా, అసలు ఏమి జరగనట్లు నటిస్తున్నారు.వేల ఎకరాల భూములు ఎలా చేతులు మారాయో తెలియదా? ఇలాంటి వాటికి హరగోపాల్, కోదండరామ్, గోపాలగౌడ వంటివారు మద్దతు ఇవ్వడమా?, ఇది ఒక విషాదం. ఇదే సమయంలో వీరు మరో మాట చెప్పారు. తీర్పు తర్వాత రాజధాని మారదన్న నమ్మకం రైతులలో వచ్చిందని, హైకోర్టు అన్ని కోణాలలో పరిశీలించి తీర్పు ఇచ్చిందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది మారదన్న భావన ఉన్నప్పుడు ఇక ఉద్యమం అవసరం ఏమి ఉంటుంది? తెలంగాణ నేతలను పిలుచుకు రావల్సిన అవసరం ఏమి ఉంటుంది?అయినా ఏపీ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో అభివృద్ది చేయబోమని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మొత్తం ఏపీ ప్రజల డబ్బు అంతా తెచ్చి కేవలం కొన్ని గ్రామాలలో వ్యయం చేయలేమని చెబుతోంది.అ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా పెట్టుబడిదారుల కోసమే తెలంగాణ నేతలు వచ్చి ప్రసంగాలు చేస్తే ఆంధ్ర ప్రజలు సమ్మతిస్తారా? -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీజేఎస్ నాయకులు
-
తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదు: ప్రొ.కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయట్లేదని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?
-
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?: కొండా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటలతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతులను కేసీఆర్ పాటించడం లేదని మండిపడ్డారు. అదే విధంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఈటలను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు. చదవండి: కమలం గూటి వైపు సంకేతాలు -
పట్టభద్రుల పోటీ... రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’తో పాటు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్ జోష్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్’స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి మళ్లీ టీఆర్ఎస్ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వంటి వారు టికెట్ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్నగర్’స్థానం నుంచి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్ శ్రీనివాస్, వికారాబాద్కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్ పటేల్ కూడా టీఆర్ఎస్ టికెటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్లోనూ పోటాపోటీ..! ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్ నగర్’ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్రెడ్డి, ఎస్.సంపత్కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్రెడ్డి కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోమారు బరిలోకి రాంచందర్రావు? ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.రాంచందర్రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్.రాంచందర్రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్రావు తదతరులు బీజేపీ టికెట్ను ఆశిస్తున్నారు. వరంగల్ బరిలో కోదండరాం ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
సీఎం స్పందించకపోతే ఉమ్మడి కార్యాచరణ ఉధృతం
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. కరోనా కట్టడి, చికిత్సతోపాటు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. అలాగే, నవంబర్ దాకా పేదలకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు, తొలగించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సీఎం సహాయనిధికి చేరిన నిధుల లెక్కలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై సీఎం కేసీఆర్ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీలివ్వకపోతే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ప్రొ.కోదండరాం, శ్రీశైల్రెడ్డి (టీజేఎస్), చాడ వెంకట్రెడ్డి (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), ఎల్.రమణ (టీటీడీపీ), కె.గోవర్ధన్, వెంకట్రాములు (న్యూ డెమోక్రసీ), సీహెచ్.మురారి (ఎస్యూసీఐ–సీ) మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆగస్ట్ 7న అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చే హామీలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
ప్రజలు అల్లాడుతుంటే పట్టదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కి ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగా ణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబు ల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో తీవ్రస్థాయిలో కోవిడ్ మరణాలు పెరి గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహా ర భద్రత, వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. 30న కలెక్టరేట్ల వద్ద నిరసన ఇక ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక (టీఎల్పీఎంఎఫ్) ద్వారా జిల్లాల కలెక్టరేట్లకు నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి వినతి పత్రం అందజేస్తామని అఖిల పక్ష నేతలు తెలిపారు. కోవిడ్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆగస్టు 2న వర్చురల్ రచ్చబండ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా రు. జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు (ఆగస్టు 2 మినహా) ప్రతిరోజూ ఒక అంశంపై వెబినార్/సెమినార్లు ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. జూలై 28న కోవిడ్పై ప్రభుత్వ నిర్లక్ష్యం–న్యాయపోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీలపై కోవిడ్ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కోవిడ్ ప్రభావం, ఆగస్టు 1న కోవిడ్ బాధితులు–సహాయక చర్య లు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కోవిడ్ ప్రజాందోళనపై ప్రభుత్వ నిర్బంధం, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు, నల్ల జెండాలతో, నల్ల బెలూన్లు ఎగరేసి మహానిరసన తెలుపుతామని వివరించారు. -
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
డబ్బు ప్రభావాన్ని తట్టుకోలేకపోయారు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు ప్రభావాన్ని తమ అభ్యర్థులు తట్టుకోలేకపోయారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండ రాం పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు బాగా పనిచేశారని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారన్నారు.ఎన్నికల్లో వివిధ కారణాలతో వారు గెలుపొందలేకపోయారని చెప్పారు. తమ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టలేదన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. -
ఉమ్మడిగా ఉద్యమిస్తాం
లక్డీకాపూల్: తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు ఐక్యతా రాగాన్ని ఆలపించాయి. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించేందుకు ఉమ్మడిగా పోరాడతామని ఆయా పార్టీ అధినేతలు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి లక్ష్యాల కోసం తాము కలిసి పోరాడనున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలకు పాలన, నిర్ణయాధికారం ద్వారా అసమానతలు లేని తెలంగాణ దిశగా ఉద్యమించనున్నట్లు పేర్కొ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కలుషితమైపోయిందని, ఎన్నికల్లో డబ్బే ప్రధానాంశంగా మారిందని కోదండరాం అన్నారు. ఈ తరుణంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఇంటి పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తమకు భేషజాలు లేవని, ఎవరితోనైనా కలిసి పనిచేస్తామ న్నారు. ప్రజాపక్షంగా సమస్యల పరిష్కారా నికి నిర్మాణాత్మక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఇందుకు టీజేఎస్, ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. -
లేఅవుట్ల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నియంత్రణలో భాగంగా పారదర్శక పాలనకు ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల కోసం పటిష్ట సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) తన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ ఎన్నికల ప్రణాళికలో అవినీతిరహిత ఆదర్శ మున్సిపాలిటీల కోసం పౌరసంఘాలతో నిఘా వ్యవస్థ (అంబుడ్స్మన్) ఏర్పాటు, రాజకీయ, అధికార యంత్రాంగం పనితీరుపై అన్ని కార్యాలయాల్లో పనితీరు పట్టిక, వారానికోసారి ‘ఇంటింటికీ కౌన్సిలర్’కార్యక్రమం, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల తొలగింపు, ఉల్లం ఘనులపై చర్యలు, టీజేఎస్ కౌన్సిలర్లు ఆక్రమణలు, అవినీతికి పాల్పడిన పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్ తదితర అంశాలను పొందుపరిచింది. శనివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు గెలిస్తే సంపాదనే లక్ష్యంగా ఉంటారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయినందున ప్రభుత్వం నిధులివ్వదని, మున్సిపాలిటీలను పనిచేయనివ్వరని, అక్రమార్జనకు మున్సిపాలిటీలను వాడుకుంటారని ఆరోపించారు. మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు... కాలుష్యరహిత పట్టణాల కోసం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు మురుగునీటి నిర్వహణ అమలు ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారణ పట్టణాల్లో సులభ్ తరహాలో మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు మున్సిపల్ స్కూళ్ల సమర్థ నిర్వహణ నిధులు, విధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పౌర సంఘాలకు పాత్ర నాణ్యమైన సత్వరమైన వైద్య సదుపాయాలతో బస్తీ క్లినిక్ల ఏర్పాటు పట్టణ పేదలకు గృహ వసతి, మురికి వాడలకు కనీస వసతులు -
రాష్ట్రంలో మావోలు ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్ట్లే లేరని శాసనసభలో ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా పంపిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇప్పుడేమో ఆర్టీసీ సమ్మెలో మావోయిస్ట్లు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారని ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. అని ప్రశ్నించారు. పోలీసులు ప్రతి అంశాన్ని శాంతి భద్రతల కోణంలోనే చూడటం సబబుకాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉండగా అది జరగడం లేదని ఆరోపించారు. నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని కమిషనర్ అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు హైదరాబాద్లో స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సోమవారం పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వరరావు, వెంకట్రెడ్డి, శ్రీశైల్రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చలో ట్యాంక్బండ్’ సందర్భంగా ప్రభుత్వమే ఎక్కడికక్కడ కంచెలు వేసి ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగేలా చేసిం దని విమర్శించారు. ఆర్టీసీని నడిపించడం ప్రభుత్వ బా« ధ్యత కాగా, ఇంకెన్ని రోజులు ఆర్టీసీకి సహాయం చేయాలనడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
మిలియన్ మార్చ్కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్బండ్పై నిర్వహించే మిలియన్ మార్చ్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్డౌన్ చేయాలని కోరుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్ కాలేదన్నారు. జాయిన్ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్ అయ్యారన్నారు. భయాందోళనకు గురికావద్దు మేడ్చల్ రూరల్: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ తదితరులు మేడ్చల్ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. -
‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్మీట్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్కు అండగా ఉన్నది పోటు రంగారావే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కేసీఆర్తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని కేసీఆర్ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు తెలంగాణ వచ్చాక హిట్లర్, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్నగర్ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ సమ్మె : అలా చెప్పడం సిగ్గుచేటు
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులను వాడుకొన్న ప్రభుత్వం, ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని, అందుకే ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యాలని చూస్తోందని విమర్శించారు. జిల్లాలో బుధవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆర్టీసీ గుండె కాయ వంటిదని కోదండరాం అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను పెట్టి బస్సులను నడపడం బాధాకరమని, ప్రగతి భవన్లో కూర్చున్న సీఎం కేసీఆర్కు కార్మికుల బాధలు పట్టవని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల మద్దతు ఉందని, న్యాయం జరిగే వరకు కార్మికులకు అండగా ఉంటామని ఆయన హామి ఇచ్చారు. -
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
సమైక్యాంధ్రలోనే మొదలు
హన్మకొండ: ‘సమైక్యాంధ్రప్రదేశ్లోనే ఆర్టీసీ విభజన ప్రక్రియ మొదలైంది. జీఓలు జారీ చేసే సమయానికి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచింది’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. హన్మకొండలో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ నాటి ఆంధ్రప్రదేశ్లోనే మొదలైందని, ఆ సమయంలో అప్పటి ఉద్యమ నేత గా ఉన్న కేసీఆర్తో పాటు నేతలంతా చెప్పినట్లుగానే స్వరాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారన్నారు. ఈ డిమాండ్ కొత్తగా వచ్చిందేమి కాదన్నారు. ఎట్లాగూ ఓట్లు వేసి గెలిపించారు.. ఇక తాను చెప్పినట్లే వినాలన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సంపదంతా తనకు, మెగా కృష్ణారెడ్డికి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తూ తన సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత టి.వెంకట్రాములు, సీపీఎం నేత జి.ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు పార్టీల మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ జనసమితితో సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం తెలంగాణ జనసమితి కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులు, కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు. కార్మికులకు తాము అండగా ఉంటామని, సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు ఎంతగానో తోడ్పడ్డారని, వారు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆర్టీసీని బలహీనపరుస్తోందని ఆరోపించారు. కార్మికులకోసం సంఘీభావ ఉద్యమాన్ని చేపట్టడంలో కీలక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు వివరించారు. అనంతరం సీపీఎం, సీపీఐ నేతలతోనూ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల డిమాండ్ల సాధనకు సహకరిస్తామని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను గౌరవించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని, కార్మికులపై కక్షపూరిత వైఖరిని విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. -
అమరుల స్మృతివనమేది?: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యే క తెలంగాణ రాష్టం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అమర వీరులకు స్మృతివనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేకపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అమరుల స్మృతివనాన్ని నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని అన్నారు. శనివారం అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన వారికి టీజేఎస్ నేతలతో కలిసి కోదండరాం నివాళులర్పించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వెళుతున్న సర్పంచ్లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం సరికాదని, ఈ విషయంలో సీఈవో రజత్కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు. -
పోరాటాలకు సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగ, ప్రజాస్వా మ్య పరిరక్షణకు వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాలు, రాష్ట్ర చరిత్ర వక్రీకరణకు మతోన్మాదశక్తులు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి హాల్లో తెలంగాణ అమరవీరుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన సాయుధపోరాట వార్షికో త్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా గార్లపాటి రఘుపతిరెడ్డి రచించిన ‘ఉరికంబం ఎక్కుతూ తిరిగొచి్చన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో పెరుగుతున్న ధరలు, ఇతర సమస్యలపై నేడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు లు సాయుధ పోరాటం నిర్వహించిన ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందే తప్ప సర్దార్పటేల్ వల్ల కాదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి చెప్పారు. సాయుధపోరులో నాలుగున్నర వేల మంది అమరులైన చరిత్ర నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం కోసం తెలంగాణ సమాజం పోరాడుతూనే ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో జైని మల్లయ్యగుప్తా, కందిమళ్ల ప్రతాపరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకటరెడ్డి్డ తదితరులు పాల్గొన్నారు. -
'మా నీళ్లు మాకే' : కోదండరాం
సాక్షి, మంచిర్యాల: మా నీళ్లు మాకే అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాదన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత నదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు తాగు, సాగు నీరందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ‘మా నీళ్లు మాకే’ అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాధన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టల నాయకులు, యువలకుతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రజా సంఘాల నాయకులతో కోదండరాం నాయకులు మాట్లాడుతూ.. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహితనదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు జిల్లాలకు నీరు రాకుండా పోయిందని వారు వాపోయారు. జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు సాగునీరు లేక కేవలం వర్షాధార పంటలు సాగుచేసుకుంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వారి పంటలకు నీరందుతుందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేశామని కానీ ఇప్పుడు రెండు జిల్లాలకు నీళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వంలో పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని కేవలం హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు నీటిని తరలించడానికే నిర్మించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద 25 వేల కోట్లతో 70 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు ప్రారంభించారని, మరో 30 కిలోమీటర్ల పనులు పనులు చేస్తే పూర్తయ్యే కాలువ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వివర్శించారు. కేవలం కమీషన్ల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చే సిందనే సాకుతో తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ఇక్కడి రైతులను మోసం చేసిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెకులో కలుపవచ్చన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా ముందుకు రావాలని రెండు జిల్లాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని తీర్మానించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘నల్లమల సందర్శనకు అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: యురేనియం మైనింగ్ ప్రతిపాదిత మండలాల్లో పర్యటనకు అనుమతించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్).. డీజీపీ మహేందర్రెడ్డికి విన్నవించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అధికార ప్రతినిధి వెంకట్రెడ్డిలు మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 3వ తేదీన మావోయిస్టు అమరుల వారోత్సవాల పేరిట, 14వ తేదీన అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించలేమన్న సాకుతో తమను, తమపార్టీ సభ్యుల్ని అడ్డుకుని సెక్షన్ 151 సీఆర్పీసీ కింద అరెస్టు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం మైనింగ్ నిక్షేపాలు గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో పర్యటించి, ప్రజలను కలుసుకునేందుకు అనుమతించాలని కోరారు. -
కోదండరాం అరెస్టు నిరసిస్తూ హైవేపై నిరసన
సాక్షి, కల్వకుర్తి: పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొనసాగనివ్వడం లేదని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తున్న వారిపై ఇంతటి నిర్బంధాలు ఎందుకని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అధ్యయనం చేయడానికి వెళ్తున్న బృందం సభ్యులను వెల్దండలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో వారు వాహనాలను అక్కడే ఆపి నిరసన తెలిపారు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యురేనియం తవ్వకాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ గతంలో నల్లమలకు వెళ్లే వారిని మావోయిస్టుల పేరుతో అడ్డుకునేవారని, ఇప్పుడు అడవిలో పులులు, జీవరాసులకు ప్రమాదం ఉందని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి నిర్బంధాలకు సంబంధించి ఏమైనా లిఖిత పూర్వకంగా రాసివ్వగలరా అని పోలీసులను అడిగారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకు వినియోగించాలన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎలాంటి నిరసన చేయనివ్వడం లేదన్నారు. అప్పట్లో మీరే వద్దన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలపై తవ్వకాలపై అనుమతులు రాగానే వద్దన్నారని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ అన్నారు. అధికారంలో లేనప్పుడు వద్దన్న వారు.. అధికారంలోకి రాగానే తవ్వకాలకు అనుకూలంగా మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం వెల్దండకు కల్వకుర్తి, అచ్చంపేట డీఎస్పీలు పుష్ప, నర్సింహులు, సీఐలు సురేందర్రెడ్డి, నాగరాజు, రామకృష్ణ, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నిరసనల అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో ఆయా పార్టీల నాయకులు రమేష్, మోహన్, విజయ్కుమార్రెడ్డి, పర్వత్రెడ్డి, తిరుపతిరెడ్డి, ద్రోణాచార్య, శ్యాంప్రసాద్రెడ్డి, రమేష్రెడ్డి, ప్రకాశ్గౌడ్, వెంకట్రెడ్డి, ధర్మరాజు, శ్రీధర్, ఖాదర్ పాషా, కృష్ణారెడ్డి, గగన్రాం, రమణ్సింగ్, సదానందంగౌడ్ తదితరులున్నారు. -
అంబేడ్కర్ విగ్రహం కోసం ఉద్యమిస్తాం: కోదండరాం
పెద్దపల్లి: దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ఆరాధిస్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో పడవేయడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి దానిని ఏర్పాటు చేయకపోగా ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పించడంలో విఫలమైం దని ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కోసం దళిత మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. విగ్రహాన్ని తరలించిన వ్యక్తుల రిమాండ్ హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో తరలించిన ఇద్దరు వ్యక్తులపై జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 13న పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిçస్తున్నారన్న సమాచారం అందుకుని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్త లారీలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ డప్పు రాజ (35), ఇటాచీ డ్రైవర్ భీంగుప్త(29)ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. యూసఫ్గూడ డంపింగ్యార్డు సూపర్వైజర్లు బాలరాజు, శ్రీకాంత్లతో పాటు జీఎహెచ్ఎంసీ అధికారులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
విలువల పెంపుకోసమే ఎన్నికల్లో పోటీ
దుగ్గొండి/నల్లబెల్లి: రాజకీయాల్లో విలువలు పెం చడానికి జనసమితి పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అరుణ్కుమార్ను పోటీలో ని లిపిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం అన్నారు. మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు.. ఎవరూ ఉండకూడదు..ప్రతిపక్షం పలకవద్దు.. అనే రీతిలో నేటి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఆదివాసీల ముద్దుబిడ్డ, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అరుణ్కుమార్ ట్రంకు పెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ జావిద్, మండల నాయకులు నామోజు మురళి, వరికెల బాబురావు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రం లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
‘రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు’
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..'రాజ్యాంగం రావటం అంటే.. రాజకీయ విప్లవం రావటమే. రాజ్యాంగ సమానతలు వచ్చాయి కానీ, సామాజిక సమానతలు మాత్రం రాలేదు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్. పాలకులు అధికారంలోకి వచ్చాము ఏదైనా చేయొచ్చు అనే భావన వదిలేయాలి. రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పాలన సాగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం రజత్ కుమార్కి లేదు. అడిగే హక్కు మాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉంది. భారత రత్నలో తెలంగాణకు అన్యాయం జరిగింది. బాధ కలిగింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి యోగెశ్వర రెడ్డి వెదిరె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దిన్లతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెప్పినా వినిపించుకోలేదు.. అందుకే ఓటమి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంపై పొలిటికల్ విశ్లేషణ జరగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సీట్ల సర్దుబాటు, ప్రచారం ఆలస్యం కావడం, ప్రచారవ్యూహం లేకపోవడం వల్లే కూటమి ఓడిపోయిందని పేర్కొన్నారు. తమ నాలుగేళ్ల శ్రమ వృథాగా పోయిం దన్నారు. ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారం చేయలేదని, మంచి ఎజెండా ఉన్నా ప్రజలకు చెప్పుకోలేక పోయామన్నారు. తాను కేసీఆర్తో పదేళ్లపాటు కలసి పని చేశానని, కేసీఆర్ ప్రచారశైలి గురించి ఎన్నిసార్లు కూటమి పార్టీ నేతలకు హెచ్చరించినా ఉత్తమ్, ఎల్.రమణ వినిపించుకోలేదన్నారు. కేసీఆర్ను ఎదుర్కోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం ఉండాలని తాను చెప్పానని, కానీ 15 రోజుల ప్రచా రం చాలని ఉత్తమ్, మూడు వారాలు సరిపోతుందని రమణ పేర్కొన్నారని వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కూటమిలోని కొంతమంది నేతల అతి ఆత్మవిశ్వాసం కారణంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఓటమికి ఈవీఎంల ను బూచిగా చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఈవీఎంలపై తప్పు నెట్టడంలో అర్థం లేదన్నారు. అసలు కారణాలను సమీక్షించకుండా ఉత్తుత్తి కారణాలను విశ్లేషిం చడం వల్ల లాభం లేదన్నారు. కూటమి ఓడిపోవడానికి కారణాలను జన సమితి విశ్లేషణ చేస్తుందన్నారు. సర్దుబాటు ఆలస్యంతోనే నష్టం రాజకీయపరమైన వైఫల్యాలను చర్చించకుండా సమీక్షలు జరపడం సరికాదన్నారు. సీట్ల సర్దుబాటులో ఆలస్యం కావడం నష్టం చేకూర్చిందని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనను, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో సరిగా ఎండగట్టలేకపోయామన్నారు. కేసీఆర్ రాజకీయ చతురతను అంచనా వేసి ఎదుర్కోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ తనపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను చల్లబరుచుకోగలిగారన్నారు. కేసీఆర్ చంద్రబాబు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అర్థం లేని పని అని, అది సక్సెస్ కాదని అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కావాలంటే రెండు కారణాలు ఉంటాయన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలని, నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ దగ్గర నిర్దిష్టమైన సమస్యలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఇంతవరకు ప్రధాన సమస్య ఇదంటూ కేసీఆర్ గుర్తించలేదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక ఎవరు ఉన్నారో చూస్తామన్నారు. లోక్సభకు తాను పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నానన్న వార్త అవాస్తవమని కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నిలకు మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి తాము సిగ్గుపడట్లేదని, ఓటమి వల్ల తాము విశ్వాసం కోల్పోలేదన్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి తెలంగాణ జనసమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని, రానున్న పార్లమెంటు ఎన్నికలపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని, కూటమి ఆ ఎన్నికల్లో కొనసాగుతుందని నమ్ముతున్నామన్నారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్నారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయస్థాయిలో కీలకం కానుందన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు 25 శాతం ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు. మొత్తం పంచాయతీల్లో బీసీలకు కల్పించింది 18.5 శాతం పంచాయతీలేనన్నారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనుగోలు, అమ్ముడు పోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. సొంతంగానేపంచాయతీ ఎన్నికల్లో పోటీ పంచాయతీ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పార్టీ పేరుతో కాకుండా అభ్యర్థులవారీగానే పోటీ ఉంటుంది కాబట్టి టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందని వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో పొత్తు నిర్ణయం ఉండదన్నారు. మంగళవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్న గ్రామపంచాయతీలను గుర్తించే పనిని ప్రారంభిస్తామన్నారు. పార్టీని ప్రారంభించిన సమయంలోనే అనేకమంది యువత వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చి పార్టీలో నేరుగా చేరడమే కాకుండా ఆన్లైన్ ద్వారా పార్టీలో చేరినవారు ఉన్నారన్నారు. ఇప్పుడు వాటినన్నింటిని క్రోడీకరించి, ఎక్కడెక్కడ తమ పార్టీ బలంగా ఉందో గుర్తించి ముందుకు సాగుతామన్నారు. గ్రామం కోసం పని చేసేవారిని, గ్రామాభివృద్ధికి పాటుపడేవారికి ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో నిలబెడతామన్నారు. యువత, రిటైర్డ్ ఉద్యోగులను ప్రోత్సహించి పార్టీ తరఫున పోటీలో నిలిపేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా, ఏదైనా గ్రామంలో పొత్తు అవసరం అనుకుంటే జిల్లా పార్టీ కమిటీలే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో అవసరమైన చోట పొత్తు పెట్టుకునే అంశాన్ని జిల్లా పార్టీ నేతలు చూసుకుంటారన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీల కంటే గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులనే ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. -
పంచాయతీ’ పోరుపై టీజేఎస్ గురి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడ్రోజుల్లో కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
రచనారెడ్డి, ఆదిత్యారెడ్డిపై వేటు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదని, మహాకూటమిలో రాజకీయ బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రచనారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఏకగ్రీవ తీర్మానం మేరకు టీజెఎస్ ప్రజాకూటమిలో భాగస్వామ్యం అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రచనా రెడ్డి, ఆదిత్యారెడ్డి ఎన్నికల్లో యెల్లారెడ్డి, తాండూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారని, వారి సీట్ల విషయంలో పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం వారికి బాగా తెలుసునని తెలిపారు. టీఆర్ఎస్కు ఎవరూ ప్రత్యామ్యాయం లేదని చెప్పడం వెనక వారు ఏ పార్టీతో అవగహన కుదుర్చుకుంటున్నారో స్పష్టమవుతోందని టీజేఎస్ ఆరోపించింది. సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. -
కూటమిలో ‘ట్విస్ట్’.. టీడీపీ స్థానంలో టీజేఎస్ బీఫారం
సాక్షి, హైదరాబాద్: కూటమిలో కొత్త ట్విస్ట్ మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూటమి పార్టీలు ముందుగా బీ–ఫారాలు ఇచ్చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు కావడంతో ముందు బీ–ఫారం ఇవ్వడం ద్వారా అభ్యర్థికి వెసులుబాటు కల్పించాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తుది నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాతో టీజేఎస్ ఆదివారం ఏడుగురు అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చింది. ఈ జాబితాలో సిద్దిపేట, మెదక్, దుబ్బాక, మల్కాజ్గిరి, మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్), మహబూబ్నగర్ స్థానాలున్నాయి. అయితే, టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చిన స్థానాల్లో నాలుగు చోట్ల ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మహబూబ్నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్ను ప్రకటించి బీ–ఫారం కూడా ఇచ్చింది. అలాగే మిర్యాలగూడ విషయం ఎటూ తేలలేదు. ఇక్కడ తన కుమారుడు రఘువీర్రెడ్డికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్నారు. టీజేఎస్ నుంచి ఆయన బంధువు విజయేందర్రెడ్డి పోటీ పడుతున్నారు. దీనిపై ఏమీ తేలకుండానే టీజేఎస్ విద్యాధర్రెడ్డికి బీ–ఫారం ఇచ్చేసింది. ఇక వరంగల్–ఈస్ట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఆశిస్తుండగా అక్కడ గాదె ఇన్నయ్యకు టీజేఎస్ బీ–ఫారం ఇచ్చేసింది. దుబ్బాక స్థానాన్ని చిందం విజయ్కుమార్కు టీజేఎస్ కేటాయించగా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూతలు ఆదివారం పిలిపించారు. ఆయనతో పాటు దుబ్బాక టికెట్ను కాంగ్రెస్ తరఫున ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని విజయ్ను కాంగ్రెస్ దూతలు కోరినట్టు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏమీ తేలకుండానే టీజేఎస్ బీ–ఫారాలు ఇచ్చేయడం గమనార్హం. ప్రకటించారు.. కానీ.. ఇక టీడీపీలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని సామ రంగారెడ్డికి ఆ పార్టీ ప్రకటించింది. అయితే, ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ–ఫారాలు ఇచ్చారు కానీ, రంగారెడ్డికి ఇవ్వలేదు. అభ్యర్థులందరితో ప్రమాణం చేయించినప్పుడు రంగారెడ్డి కూడా ప్రమాణం చేశారు కానీ, బీ–ఫారం మాత్రం ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రమాణం చేయించిన వ్యక్తికి బీ–ఫారం ఇవ్వలేదంటే ఆయన్ను అభ్యర్థిగా కొనసాగిస్తారా?.. కొనసాగిస్తే నియోజకవర్గాన్ని మారుస్తారా..? మారిస్తే ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. టీజేఎస్కు 9 స్థానాలు తెలంగాణ జన సమితి 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పినా 6 స్థానాలకే క్లియరెన్స్ ఇచ్చింది. అయితే టీజేఎస్ తాము 9 స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుం టోంది. దీంతోపాటు అదనంగా మరో ఎస్టీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ను కోరుతోంది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు ఆర్సీ కుంతియాతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశమై చర్చించారు. ఆదివారం స్పష్టత వస్తుందని భావించినా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టీజేఎస్ 7 స్థానాల్లో పోటీలో నిలుపనున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. మెదక్ నుంచి జనార్దన్రెడ్డి, సిద్దిపేట నుంచి భవానిరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్కుమార్, మల్కాజిగిరి నుంచి దిలీప్కుమార్, వరం గల్ ఈస్ట్ నుంచి ఇన్నయ్య, మిర్యాల్గూడ నుంచి విద్యాధర్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి రాజేందర్ రెడ్డికి బీ–ఫారాలను అందజేశారు. వర్ధన్నపేట, అంబర్పేట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసి, బీ–ఫారాలను అందజేయాలని నిర్ణయించింది. -
‘మహా’ కుదుపు కూటమికి
సాక్షి, వరంగల్: జట్టు కట్టక ముందే కూటమిలో మహా కుదుపు మొదలైంది. సీట్ల పంపకాల్లో పొత్తులు పొసగక పోవడంతో ఎవరికి వారుగా వేరు కుంపటికి సిద్ధమవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వాళ్లుగా విడిపోయి పోటీకి రెడీ అవుతున్నారు. పెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఐదు సీట్లను త్యాగం చేయాల్సి వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘పశ్చిమ’లో తిరుగుబాటు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు. కూటమి ఒడంబడికను పక్కనపెట్టి ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక టీజేఎస్ 12 సీట్లలో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించింది. అందులో నాలుగు సీట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహా కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, జనగామ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సింగపురం ఇందిరను ప్రకటించిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి దారితీసింది. జనగామ మాదే.. కాదు మాదే.. ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరాం సమీప బంధువులు నియోజకవర్గంలో మకాం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర నాయకులను కలుస్తున్నారు. మరోవైపు జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాల్లో సీటు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ కొందరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్పూర్లో గందరగోళం.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన స్టేషన్ఘన్పూర్లోనూ బరిలోకి దిగుతామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ సింగపురం ఇందిరకు టికెట్ కేటాయించింది. ఈమేరకు ఆమె నామినేషన్కు సిద్ధమవుతున్నారు. తాజాగా తాము ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు వర్ధన్నపేట టికెట్ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్ గాంధీ భవన్లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్కు సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు బుధవారం ప్రకటించారు. -
టీజేఎస్కు షాక్..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నాగేశ్ సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు సమక్షంలో నాగేశ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయుడైన నాగేశ్ తెలంగాణ జన సమితి ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్తో పాటు సంగారెడ్డి టికెట్ ఆశించిన నాగేశ్.. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో పక్షం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరడం టీజేఎస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. టీజేఎస్ వర్గాల్లో నిరాశ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీతో పాటు, టీజేఎస్ ఆవిర్భావం నుంచి ఇతర జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా పరి«ధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. టీఆర్ఎస్తో పాటు వివిధ సంఘాల్లో చురుగ్గా పనిచేసిన పలువురు నేతలు టీజేఎస్ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరారు. సంగారెడ్డి నుంచి బీరయ్య యాదవ్, ఆత్మకూరు నాగేశ్, జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి ఆశప్ప తదితరులు టికెట్ ఆశించారు. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీజేఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాలను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజేఎస్ ఆశిస్తున్న స్థానాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. బీసీ కోటాలో ఏదో ఒక స్థానం నుంచి తనకు పోటీ అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ ఉన్నారు. టీఆర్ఎస్లో నాగేశ్ చేరిక నేపథ్యంలో పార్టీలోని మిగతా శ్రేణుల ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్ జాబితా.. టీజేఎస్, సీపీఐలో లొల్లి
సాక్షి, హైదరాబాద్ : ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే అర్ధరాత్రి విడుదల చేసింది. కానీ ఈ జాబితానే మహాకూటమి మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలో చిచ్చుపెట్టింది. టీజేఎస్, సీపీఐలు ఆశించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆయా పార్టీల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీల నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసమ్మతి జెండా ఎగురేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆలేరు, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, తాండూరు స్థానాలను ఇవ్వాలని తొలి నుంచి టీజేఎస్ పట్టుబడుతుండగా.. కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించిన కాంగ్రెస్... టీజేఎస్ అడిగిన స్థానాల్లోను అభ్యర్థులను ప్రకటించింది. స్టేషన్ ఘన్పూర్ నుంచి సింగపూర్ ఇందిరను, ఆలేరు నుంచి బూడిద బిక్షమయ్యగౌడ్, ఆసిఫాబాద్లో అత్రం సక్కు, తాండూరు నుంచి పంజుగుల పైలట్ రోహిత్రెడ్డిల పేర్లను ఖారారు చేసింది. దీనికితోడు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన ఒక్క నకిరేకల్ స్థానంలో కూడా కాంగ్రెస్ చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మిత్రపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. మహాకూటమి ఒప్పందం ప్రకారం టీజెఎస్ 8, సీపీఐ 3, టీడీపీ 14, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక టికెట్ ఇస్తామన్నారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన మిత్రపక్షాలు.. తమకు అడిగిన చోట టికెట్లివ్వాలని విజ్ఞప్తి చేశాయి. కానీ కాంగ్రెస్ అవేవి పట్టించుకోకుండా ఆయా పార్టీలు అడిగిన చోటే అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాల్లో టీజేఎస్కు టికెట్లు ఇచ్చారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీజేఎస్ అధినేత కోదండరాంకు ఇస్తానన్న జనగాం స్థానాన్ని కూడా పెండింగ్లో పెట్టడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో టీజేఎస్ పార్టీ నేతలు రెబల్స్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆలేరు టీజేఎస్ నేత కల్లూరి రాంచంద్రారెడ్డి ఈ రోజు మధ్యాహ్నమే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయనున్నారు. మరికొందరు నేతలు కూడా అదే దారిని ఎంచుకోనున్నారు. స్టేషన్ ఘనపూర్ టీజేఎస్ నేత చింత స్వామి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కూటమిలో ఒక్క టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్ జాబితాపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రజల ఆకాంక్షల సాధనకే టీజేఎస్
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి(టీజేఎస్) లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేయూ క్యాంపస్: పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి (టీజేఎస్) లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలతో చర్చలు జరిగేవని, పోరా టాలగడ్డ వరంగల్లో కాళోజీ స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్రావు, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది వరంగల్లోనే జరిగిందని అన్నారు. కేసీఆర్ ఏం చేశాడు ? ఎంతోమంది యువత ఆత్మబలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణాలో గద్దెనెక్కిన కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి? తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉన్న ఇళ్లను కూలగొట్టగా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లో ధర్నా చౌక్ను ఎత్తివేశారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ధర్నాకు ఉపక్రమించితే వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారన్నారు. అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కుర్చీలో కూర్చుంటే అడిగే హక్కు వారికి ఉందన్నారు. తెలంగాణకు ఆదాయం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తోందని, మద్యం సీసాలు కూడా పంచుతున్నారంటా.. ఇదేం ప్రచారమని ప్రశ్నించారు. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి టీజేఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర బాధ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేశారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకుడు భద్రోద్రి మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ రూ.200కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్రెడ్డి, బొట్ల బిక్షపతి, మంద భాస్కర్, డాక్టర్ తిరుణహరిశేషు, పులిసత్యం, జి.రవీందర్, శైలేందర్రెడ్డి, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, పులి సత్యం, రాజేందర్, వినయ్కుమార్, లక్ష్మి, రమేష్, ఎ.రాజేందర్, శ్రవణ్ పాల్గొన్నారు. అలరించిన ధూంధాం.. ధూంధాం కార్యక్రమంలో కిషోర్, నాగరాజు, దేవేందర్, రవి, రమ కళాకారుల బృందం పాటలతో మాటలతో చైతన్యం కల్పించారు. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారంటూ.., జైబోలో తెలంగాణ, వందనం వీరులకు వందనం అమరులకు వందనం అంటూ పాటలు పాడి సాంస్కృతిక నృత్యాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. -
పాలన చేతగాని అసమర్ధుడు
స్టేషన్ఘన్పూర్: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. బడ్జెట్ రూ.40 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెంచారని, కేవలం కమీషన్ల కోసమే అడ్డగోలుగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీజేఎస్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ప్రజలకు పరిచయం చేసేందుకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే మన సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో ప్రజలు అధికారం అప్పగిస్తే.. పాలన చేతగాక అసమర్థుడైన కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. -
సంకీర్ణంపై స్పష్టత రాలేదు
సాక్షి, హైదరాబాద్: సంకీర్ణ భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం చెప్పారు. టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కలసి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటు అంశాన్ని పార్టీ సమావేశంలో ఇంకా చర్చించలేదని తెలిపారు. పార్టీ మేనిఫెస్టో, విస్తరణ, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపైనే చర్చించినట్టుగా కోదండరాం వెల్లడించారు. అయితే సీట్లు సర్దుబాటుపై చర్చను ఎక్కడోచోట ఆపాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటు సమస్యే కాదని.. సంకీర్ణాన్ని నడిపే కాంగ్రెస్పైనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి బాధ్యత ఉందన్నారు. కూటమి తరఫున నియమావళిని తయారుచేసుకుని ముందుకెళ్ళాలని సూచించారు. కూటమిలో పార్టీలు సమన్వయంతో నడిస్తే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించే విధానంపై స్పష్టత రావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు ఇది కీలకమని వెల్లడించారు. ప్రచారం నడుస్తోందని, మరింత వేగాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులు, మేనిఫెస్టోపై వివిధ కమిటీల ద్వారా చర్చించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటించారు. టీజేఎస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు... ♦ సామాజిక న్యాయ సాధికారత ♦ ఉచిత విద్య, వైద్యం ♦ ఉద్యోగ, ఉపాధి కల్పన చర్యలు ♦ వ్యవసాయం.. నైపుణ్య అభివృద్ధి ♦ జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, మండలానికో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, సర్టిఫికెట్ కోర్సులు ♦ వ్యవసాయ బడ్జెట్, మార్కెట్లో దోపిడీకి అడ్డుకట్ట ♦ రూ.2 లక్షల రుణమాఫీ.. సరైన పద్ధతిలో ఎరువుల పంపిణీ ♦ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు కుటీర పరిశ్రమల ఏర్పాటు ♦ వికలాంగులకు ప్రత్యేక శాఖ ♦ ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సబ్ప్లాన్ ఏర్పాటు, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ♦ సుధీర్ కమిషన్ నివేదిక అమలు ♦ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ♦ కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు చట్టం ♦ పట్టణాల అభివృద్ధిలో భాగంగా పబ్లిక్ స్థలాల పరిరక్షణ ♦ హైదరాబాద్కే పరిమితం కాకుండా మిగిలిన అన్ని జిల్లాలో కూడా అభివృద్ధి ♦ మద్యం నియంత్రణ.. బెల్ట్షాప్ల కట్టడి ♦ ఉద్యోగుల సంక్షేమం, పాత పెన్షన్ విధానం అమలు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ వారిని వెనక్కి తీసుకురావడం ♦ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్లు,హెల్త్కార్డులు ♦ ఉద్యమకారులందరికీ పెన్షన్లు.. ఉద్యమ కేసుల ఎత్తివేత ♦ ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత ♦ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్. కోదండరాం పోటీ చేయాల్సిందే ఈ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కచ్చితంగా పోటీచేయాలని పలువురు టీజేఎస్ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. పార్టీని అసెంబ్లీలోనూ, బయటా నడపడానికి కోదండరాం ముందుండాలని కోరారు. కాంగ్రెస్ లీకులను సమర్థంగా తిప్పికొట్టాలని కొందరు నేతలు సూచించారు. కూటమికి చైర్మన్గా కోదండరాం ఉండాలని, యువకులకు సీట్లివ్వాలని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా కోదండరాంను ప్రకటించాలని కొందరు నేతలు కోరారు. -
సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవడం లేదు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ జనసమితి, కాంగ్రెస్కి అల్టిమేటం ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి..కానీ సీట్ల కోసం మేం పొత్తులు పెట్టుకోవడం లేదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..‘ ఉమ్మడి కార్యాచరణ, ఆ కార్యాచరణ అమలు , జనసమితికి గౌరవప్రదమైన స్థానంపై మహా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రయోజనాల కోసమే మా పోరాటం. దాని కోసం మేం తొందరపడుతున్నది వాస్తమే. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. అందరం కలిసి ఒక బలమైన ఎజెండాని ముందుకు తీసుకెళ్లగలమ’ ని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ..‘ సీట్లకు సంబంధించిన గోప్యత ఉంటుంది. మేం ఏ రోజూ సీట్ల గురించి బహిరంగంగా మాట్లాడలేదు. మాకు ఒక స్పష్టత ఏర్పడింది. సీట్లు అడిగేటప్పుడు ఎలాంటి ప్రాతిపదికలు చూస్తారో మాకు తెలుసు. ఇన్ని సీట్లు ఇవ్వాలి అని మేం అధికారికంగా చెప్పలేదు. ఒకటి రెండు రోజుల్లో అన్నీ తేలనున్నాయి. కోదండరాం పోటీ చేయాలా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుంద’ని చెప్పారు. కోదండరాం సమక్షంలో తెలంగాణ జనసమితిలో ప్రముఖ న్యాయవాది ప్రహ్లాద్ చేరారు. గతంలో ప్రహ్లాద్ జేఏసీలో పనిచేశారు. కోదండరాంను విభేదించి బయటకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినాయకత్వం తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తామని ఆశ చూయించి కోదండరాంను విమర్శించమని చెప్పిందని వెల్లడించారు. -
సీట్లపై చర్చ జరగలేదు: ఉత్తమ్
హైదరాబాద్: ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్ అజెండా ఫైనల్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మ్యానిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని అన్నారు. వివిధ పార్టీలకు వివిధ మ్యానిఫెస్టోలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా కామన్ అజెండా ఉంటుందని వెల్లడించారు. ఈ కూటమి మహాకూటమి కాదని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. బీజేపీతో వెళతారన్న ప్రశ్నకి కోదండరాం సమాధానం దాటవేశారు. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అజెండా అమలు చేస్తామని వివరించారు. కోడ్ అమలులో ఉండగా మంత్రులు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఒక అవగాహనకు రాకుండా ఏ పార్టీ వాళ్లు ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారు..అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని విమర్శించారు. నష్టపోయిన అన్ని వర్గాల వారికి మ్యానిఫెస్టోలో న్యాయం చేస్తామని అన్నారు. తమది గ్రాండ్ అలయన్స్ అన వ్యాఖ్యానంచారు. -
సీట్ల కేటాయింపు పై ఎలంటి చర్చా జరగలేదు
-
పొత్తులు సరే.. ఆకాంక్షల సాధన ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకన్నా టీజేఎస్పైనే ఎక్కువగా ఉంటుం దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్చార్జిలు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలతో సమావేశమైన కోదండరాం.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ ఆకాం క్షలపై చర్చించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో పొత్తులకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పొత్తుల వల్ల తలెత్తబోయే సమస్యలను ప్రస్తావించారు. ఆకాంక్షలను కాపాడుకోడానికి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
టీఆర్ఎస్ అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తాం
హైదరాబాద్ : తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారాలని, అందరికీ విద్య, వైద్యం ఇవ్వాలని ఇవన్నీ చేయడం ఈ ప్రభుత్వంవల్ల కాదని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం ఎర్రమంజిల్లోని హోటల్ ఎన్కేఎం గ్రాండ్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్తో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కోదండరామ్ సమాధానం చెప్పారు..వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. తాము 14 ఏళ్లుగా ప్రజలతో కలసి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కుటుంబ పాలన సాగుతోందనీ, పూర్తిస్థాయిలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్ష ఒక్కటీ నెరవేరడంలేదన్నారు. మూడు నెలలనుండీ ఆసరా పింఛన్ ఇవ్వలేదని, ఉపాధి హామీ డబ్బులు కేంద్రం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. తమ పార్టీని గ్రామస్థాయి నుంచీ పటిష్టం చేస్తున్నామన్నారు. ఇప్పటికే విద్యార్ధి, యువజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలు ఏర్పాటు చేశామని, ఆరోగ్యం, విద్యపై వివిధ సదస్సులు జరిపి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. నిరుద్యోగులందరికీ 2,500 నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ, ఆసరా పింఛన్ 1,500, వికలాంగులకు 2వేలు పింఛన్ ఇస్తామన్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలకు సరిపడా మందులు ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందిస్తామని, అన్ని విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేసి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. -
ప్రొ. కోదండరాం అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్తో ములాకత్ అయ్యేందుకు వెళుతున్న కొదండరాంను అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. తాము ఆందోళనలు చేయడానికి వెళ్లడం లేదని రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం సరికాదని కోదండరాం అన్నారు. పోచంపాడు నుంచి కనీసం లీకేజి అవుతున్న నీటిని వాడుకుంటామన్న 21 గ్రామాలను పోలీస్ స్టేషన్లను తలపించేలా 144 సెక్షన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల సమస్యలపై అండగా ఉన్న రైతుసంఘం నాయకుడు, న్యూ డెమోక్రసీ నేత ప్రభాకర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించడం తగదన్నారు. కోదండరాంను హైదరాబాద్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ జన సమితి నేతలను ఉంచారు. శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపటినుంచి ఐదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆందోళనలకు అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలకులకే మేలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకంటే పాలకులకే ఎక్కువ మేలు జరుగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక కుటుంబం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆ కుటుంబం లాభం పొందడం కోసమే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ పరంగా ఏ మాత్రం మంచిది కాదన్నారు. కొంతమంది ప్రయోజనమే అందులో ప్రాధాన్య అంశంగా మారిందన్నారు. భారీగా పెరిగిన వ్యయంలో కమీషన్లు ఎవరికి పోతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దంటూ, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను పిలవాలని, ఎవరి వాదన తప్పో వారే తేల్చుతారన్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపితే నాయకులంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నివేదికను టీజేఏస్ సిద్ధంచేసి, చర్చకు పెట్టిందన్నారు. దానిని నీటిపారుదల శాఖ అధికారులకు పంపించామన్నారు. అయితే తాము లేవనెత్తిన అంశాల్లో ఒక్కదానికీ మంగళవారం మంత్రి హరీశ్రావు ప్రెస్ మీట్లో సమాధానం ఇవ్వలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్దకు నీళ్లు తెచ్చుకోవచ్చన్నారు. అక్కడ నీళ్లు లేవనే చర్చను ప్రభుత్వం అసంబద్ధంగా లేవనెత్తుతోందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కాకపోతే ఎల్లంపల్లితోపాటు ఇతర ప్రదేశాల్లో కట్టుకునేలా ప్రత్యామ్నాయం ఉందన్నారు. తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేకపోతే మేడిగడ్డకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వీలైనంత తక్కువ ఖర్చుతో లిఫ్ట్ల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి నీళ్లు తెస్తే రూ.40 వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. తద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉండేది కాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేవన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు తప్పదని, అది జరిగిన రోజు మాత్రం టీఆర్ఎస్ నాయకులు అంతా చంచల్గూడ జైలుకు వెళ్లడం ఖాయమని కోదండరాం అన్నారు. -
‘అది నా దృష్టిలో వికృతమైన చర్య’
సాక్షి, నల్గొండ : సవాళ్లు విసురుకోవటం అనేది తన దృష్టిలో వికృతమైన చర్యని, రాజకీయాల పట్ల వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియా కూరగాయల బేరంలాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మంత్రిగారు వ్యంగంగా 50 లక్షలు కావాలా అని వ్యాఖ్యానించటం చాలా దురదృష్టకరమన్నారు. ఎక్స్గ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, కనీసం 6లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆదివారం ట్రాక్టర్ మూసీ కాలువలో బోల్తాపడిన ఘటనలో వేములకొండకు చెందిన 15మంది మృతిచెందిన విషయం తెలిసిందే. -
పారదర్శకత కోసమే టీజేఎస్
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్లో చేరగా, టీచర్స్ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రాజేందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుపై కేసీఆర్ సవతి ప్రేమ మక్తల్ : సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్ కన్వీనర్ రాజేందర్రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్ పాల్గొన్నారు. భూములు లేకుండా చేయడమేనా? మాగనూర్ (మక్తల్) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్ ఉన్నారు. -
వారికి మా పార్టీ అండగా ఉంటుంది
నిజామాబాద్ జిల్లా : గ్రామాభివృద్ధిపై మక్కువ ఉన్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అలాంటి వారికి మా పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పార్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, భూ ప్రక్షాళన పథకాలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ 15,700 మంది రైతులకు రూ.లక్షా యాభై వేల చొప్పున సాయం అందగా..85 శాతం రైతులకు ఏడు వేల రూపాయలకు తక్కువగా సాయం అందిందని తెలిపారు. సాయం అవసరం అయిన వారికి తక్కువగా, భూములను పెట్టుబడి కోసం కొన్న వారికి ఎక్కువ సాయం దొరికిందని విమర్శించారు. ఇట్లాంటి వ్యత్యాసం ఉంటే వ్యవసాయంలో ఎలా ముందడుగు పడుతుందని సూటిగా ప్రశ్నించారు. పోలీసు రిక్రూట్మెంట్లో తగ్గించిన వయో పరిమితి పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని కోదండ రాం డిమాండ్ చేశారు. -
టీజేఎస్ టార్గెట్ 2019
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసుకొని ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాష్ట్రంలోనే గాక సొంత జిల్లా రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీ బలోపేతానికి కోదండరాం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ టీజేఎస్, తెలుగుదేశంతో పొత్తు ఆలోచనలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్–2019 పేరుతో నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్ ఇంట గెలిచేలా... మంచిర్యాల జిల్లా బెల్లింపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం జోగాపూర్ ప్రొఫెసర్ కోదండరాం స్వగ్రామం. ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ఉద్యమానికి అంకితమై హైదరాబాద్లో నివాసం ఉంటున్నా సొంత ఊరుతో సంబంధాలు కొనసాగుతున్నాయి. సింగరేణి ఓపెన్కాస్ట్ మైనింగ్కు వ్యతిరేకంగా ఆయన జిల్లాలో గతంలో కూడా ఆందోళనలు సాగించారు. ఆయన టీజేఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడి ప్రకారం పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు ధీటుగా టీజేఎస్ను నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా జేఏసీకి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కోదండరాంతో గతంలో సంబంధాలు కొనసాగించిన వారిని పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోదండరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్టు చివరి నిమిషంలో దక్కని వారు కూడా టీజేఎస్ ద్వారా రాజకీయ ప్రస్థానం సాగించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణ దశలో ఉన్నందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో ఆశావహులతో పాటు పార్టీ నేతలు కనిపిస్తున్నారు. ఈనెల 13న కోదండరాం బెల్లంపల్లికి వస్తుండడంతో ఆరోజు పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి కోదండరాం? వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించడం లేదు. ఇటీవలే మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా గురిజాల రవీందర్రావును టీజేఎస్ నియమించింది. రవీందర్రావుకు మంచిర్యాల నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఇక్కడి బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోదండరాం పోటీ చేయని పక్షంలో మంచిర్యాల నుంచి రవీందర్రావుకే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కూడా సింగరేణి ఓపెన్కాస్ట్ భూముల సమస్యపై పోరాటం సాగిస్తున్నారు. రవీందర్రావు కుమురం భీం జిల్లాకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అక్కడ ప్రస్తుతానికి అంతగా ప్రభావం లేదు. చెన్నూరులో టీజెఎస్ తరుపున పొడేటి సంజీవ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెల్లంపల్లిలో ఎన్నికల ముందు మారే సమీకరణాలను బట్టి బలమైన నాయకుడిని బరిలోకి దింపే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. సిర్పూరులో పాల్వాయి హరీష్? సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తన తండ్రి తరహాలోనే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. ఇప్పటికే బెజ్జూరు, పెంచికల్పేట మండలాల్లో 20 రోజుల పాటు పాదయాత్రలు జరిపారు. సిర్పూరు నుంచి హరీష్రావును టీజేఎస్ తరుపున పోటీ చేయించే ఆలోచనతో కోదండరాం పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే హరీష్తో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆయన వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్లో ఆశావహులు ఎక్కువే... ఆదిలాబాద్ జిల్లాలో టీజేఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. టీజేఏసీ ఆదిలాబాద్ చైర్మన్గా వ్యవహరించిన దుర్గం రాజేశ్వర్ ప్రస్తుతం పార్టలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే ఆలోచనతో ఉన్నారు. బీజేపీలో 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన గతంలో పార్టీ నుంచి టిక్కెట్ను ఆశించినప్పటికీ భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ కోదండరాం ఉమ్మడి జిల్లాలో స్ఫూర్తి యాత్ర చేపట్టినప్పుడు ఆయన వెంట నడిచారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే ఓ ఉపాధ్యాయ సంఘం నేత పార్టీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఓ అధికారి బోథ్ నుంచి టీజేఎస్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఎస్పీ మెస్రం నాగోరావు టిక్కెట్ను ఆశిస్తున్నారు. గతంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిలాబాద్ లోకసభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీజేఎస్ తరపున ఖానాపూర్ లేదా ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి అయినా పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నారు. ఖానాపూర్లో ఓ కీలక నేత కూడా టీజేఎస్ నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిర్మల్లో అంతంత మాత్రమే తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకపాత్ర పోషించిన వివిధ రంగాల వ్యక్తులు, నాయకులే ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన టీ జేఎస్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మల్కు ఇన్చార్జిగా నియమించిన శ్రీహరి బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డికి చెందిన గోపాల్శర్మకు నిర్మల్« బాధ్యతలు అప్పగించి పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో కోదండరాం ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో జేఏసీ జిల్లా కన్వీనర్గా ఉన్న విజయ్కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రస్తుతం నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి ప్రస్తుతం జిల్లాలో పెద్ద దిక్కుగా భైంసాకు చెందిన వైద్యుడు రామకృష్ణరెడ్డి కొనసాగుతున్నారు. ముందు నుంచీ ఆయన కోదండరాం వెంట నడుస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే సభ్యత్వాన్ని పెంచుకునే పనిలో పడుతున్నారు. విద్యావంతులు, పలు వర్గాలు పార్టీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొత్తుల ఎత్తుల్లోనూ కాంగ్రెస్,టీజేఎస్లే కీలకం.. అధికార టీఆర్ఎస్ను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటి పైకి వస్తే ఎన్నికల ముందు సమీకరణలు మారుతాయి. ఇప్పుడే అడుగులు వేస్తున్న టీజేఎస్తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే ఆలోచన కాంగ్రెస్కు ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్న. టీఆర్ఎస్, బీజేపీ యేతర∙ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పాటైనప్పటికీ... పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్, టీజేఎస్లే కీలకం కానున్నాయి. పొత్తులు కుదిరితే... సీపీఐ, టీడీపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉంది. టీజేఎస్ ఆవిర్భావ సభ దృశ్యం(ఫైల్) -
మాపార్టీ నుంచి పోటీ చేసేవారు సంప్రదించవచ్చు
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే మా పార్టీ నుంచి పోటీ చేసే వారు సంప్రదించవచ్చునని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. సోమాజీ గూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు మా ముందున్న లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించారు. వికాలాంగుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి.. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పార్టీకి సంబంధించి మహిళా విభాగాన్ని కూడా విస్తరిస్తామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. కేరళలో గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. జనసమితికి అప్లికేషన్ పెట్టుకోవచ్చునని, సభ్యత్వ నమోదు చేసుకోవచ్చునని, ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంచుతామని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లాల ఇంఛార్జుల ఎంపిక జరుగుతోందని, పార్టీ ప్రతీ పల్లెకు చేరాలనే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందని వివరించారు. -
ప్రధాన వేదికపై వెయ్యిమంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఆదివారం సాయంత్రం సరూర్నగర్ స్టేడియంలో జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై వెయ్యిమంది కూర్చునేవిధంగా ఏర్పాటు చేశారు. తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోనున్నారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూడా వేదికపై కూర్చోనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత కోదండరాంతోపాటు హరగోపాల్, నాగేశ్వర్ ప్రసంగించనున్నారు. -
జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కోదండరాం పోటీ..?
సాక్షి, జనగామ: తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలను ఏకం చేయడంతోపాటు ఉద్యోగులు, రాజకీయ పార్టీలను సమన్వయం చేసి ముందుకు నడిచిన ప్రొఫెసర్ కోదండరాం ఇటీవల స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ పోరుగడ్డలో జోరందుకుంది. ఉద్యమ సమయంలో కోదండరాం చూపిన పోరాట పటిమ, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలపై ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలు స్తోంది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఈనెల 2వ తేదీన ఆయన రాజకీయ పార్టీగా మార్చుతున్నట్లు ఆయన లాంఛనంగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ జనసమితి పేరును ప్రకటించి 4వ తేదీన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. అయితే టీజేఏసీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడంతోపాటు ప్రజలను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ముందుకుసాగుతోంది. టీజేఎస్.. సామాన్య ప్రజలతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తోంది. పోరుగడ్డలో పాగా కోసం యత్నాలు.. మార్పునకు ప్రతీకగా నిలిచే జనగామ పోరుగడ్డలో టీజేఎస్ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా జిల్లా కేంద్రంలో ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారు. తర్వాత జిల్లా సాధన ఉద్యమంలోనూ నాటి టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. ఇప్పటికీ కోదండరాం జనగామలో ప్రత్యేక కేడర్ను కలిగి ఉన్నారు. ఇదే ఊపులో జిల్లాలో తమ సత్తాను చాటేందుకు టీజేఎస్ వ్యూహాలు రచిస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తిలో తమ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను టీజేఎస్లో చేరే విధంగా స్థానిక నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు కోదండరాంతో నేరుగా టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి గుర్తింపు లేకుండా ఉన్న కొందరు నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్, మండల స్థాయి నాయకులు టీజేఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కోదండరాం పోటీపై ఒత్తిడి.. టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం రాబోయే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని స్థానిక నాయకులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో జనగామ ఉండడంతోపాటు రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కలిసి వస్తుందని అధినేతకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. జనగామను ఎంచుకుంటే రాజకీయ భవిష్యత్తోపాటు రాష్ట్ర రాజకీయాలపై పట్టుసాధించవచ్చని భావిస్తున్నారు. చైతన్య వంతమైన ఓటర్లు అండగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నామని టీజేఎస్ నాయకుడు ఒకరు చెబుతున్నారు. దూకుడు పెంచిన ‘టీజేఎస్’.. ఈనెల 29వ తేదీన హైదరాబాద్లోని సరూర్నగర్లో టీజేఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా టీజేఎస్ శ్రేణులు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఈ మేరకు టీజేఎస్ జిల్లా ఇన్చార్జి సతీష్, రైతు విభాగం నాయకుడు పాతూరి మల్లారెడ్డి, విద్యార్థి నాయకులు తీగల సిద్ధూగౌడ్, ఎండీ దస్తగిరి, మహిళ విభాగం నేతలు రజని, మహంకాళి పద్మ నేతృత్వంలో మండలాల వారీగా సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో పర్యటించి ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో టీజేఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
జన సత్వం ..!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలిదశ ఉద్యమం జిల్లాలో చరిత్రాత్మకం. ఇదే చైతన్య స్ఫూర్తితో తెలంగాణ మలి దశ ఉద్యమంలో జిల్లాలోని యువత, ఉద్యోగులు, సంఘాలు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఇదే వర్గాలను ఆకర్షించేందుకు తెలంగాణ జన సమితి రాజకీయ బాట పట్టింది. నాడు ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు, ప్రస్తుతం అన్ని పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలపై ఆపార్టీ నజర్ పెట్టింది. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే జేఏసీ పలుమార్లు ప్రజా సమస్యలపై ఉద్యమించింది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత పది సార్లు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానంగా మార్కెట్లలో ఇబ్బందులు, పంటలు పండని స్థితి పై ఆయన నేరుగా రైతులతో మాట్లాడారు. ఇలా పలు మార్లు జిల్లాలో ఆయన పర్యటించడం, కొత్తగా పార్టీ పెట్టడడంతో.. ఈ పార్టీ ఎలా ఉండబోతుందని జిల్లాలోని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే రాజధానిలో నిర్వహించే సభకు భారీ జన సమీకరణ చేసి తమ సత్తా ఏంటో చాటుతాం అంటూ ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 వేలకు పైగా జన సమీకరణే లక్ష్యంగా .. జిల్లాలో ఆపార్టీ నేతలు ఆవిర్భావ సభకు 5 వేలకు పైగా జన సమీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలతో ప్రచారం నిర్వహించారు. నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి నుంచి ఉద్యమంలో కోదండరాం బాటలో నడిచిన ధర్మార్జున్ హైదరాబాద్ సభకు ఉమ్మడి జిల్లానుంచి జన సమీకరణ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. ఇక ఈ పార్టీలో సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంగా ప్రభాకర్, తండు నాగరాజు, గట్ల రవిశంకర్, కోదాడలో పందిరి నాగిరెడ్డి, చిన్ని, గంధం బంగారు, పాష, హుజూర్నగర్లో దొంతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అంబటి నాగయ్య, ధనయ్యగౌడ్లు, తుంగతుర్తిలో పొన్నం మల్లేష్, సానాది వెంకట్రెడ్డి, నాగరాజులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా సభను సక్సెస్ చేయాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రచార బాట పట్టారు. పార్టీ ఆదేశాలతో ప్రధానంగా యువత, రైతాంగాన్ని ఎక్కువగా సభకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. అసమ్మతి నేతలపై నజర్ .. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల్లో అసమ్మతి నేతలపై తెలంగాణ జన సమతి దృష్టి పెట్టినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పరంగా పదవులు రాని నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండడంతో వీరితో జన సమితి నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు, జిల్లా నాయకులు, కోదండరాంతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ సభ రోజు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు జన సమితిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను జన సమితిలో చేర్చుకొని పల్లెపల్లెకు ‘జన సమితి’ కార్యాచరణను ప్రకటించేలా బహిరంభ సభను వేదికగా చేస్తున్నారు. ఈ సభ ముగియగానే ముందుగా జిల్లాలోని అన్ని మండలాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాను ఎగుర వేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బహిరంగ సభ చైతన్య స్ఫూర్తి, రానున్న ‘మే’ డే ఉత్సవాలతో పార్టీ కార్యక్రమాలను పల్లెబాట పట్టించాలని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే బహిరంగ సభ పైనే అన్ని పార్టీల దృష్టి నెలకొంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది జనం వస్తారని ఇతర పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. జన సమితి ఒంటరిగా పోటీ చేస్తుందా..? ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తుందా.. పోటీ చేస్తుందా..? సభలో పార్టీ కార్యాచరణ ఏం ఉంటుంది.. జిల్లాలో అనంతరం పరిస్థితి ఎలా ఉండబోతుందని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రభుత్వ బాధ్యత మరిచింది..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : నాయకులు పదవుల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేసి తర్వాత దాని విలువలు మర్చారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ఆయన బుధవారం మహబూబ్నగర్కు వచ్చారు. ఈ సందర్భంగా రిబ్బన్కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, కనీస బాధ్యతలను ప్రభుత్వాలు మరిచి, పూర్తిగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా సభలు ఏర్పాటు చేసుకోవడమనేది రాజ్యాంగ హక్కు, ఇందుకు 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా.. అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అయితే జన సమితి సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయం పట్టకుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఇలా ప్రారంభం నుంచి పోరాటాలతోనే ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను మాత్రమే మాట్లాడామన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఎన్నో త్యాగాలు చేసి కుర్చీ అప్పజెప్పారు.. మా ఇష్టం వచ్చినట్లు పాలిస్తామన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ఊరికే రాలేదు.. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయితే వచ్చింది.. వారిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ఒక స్థూపం కూడా నిర్మించకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ నెల 29న హైద్రాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే సభకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక ఇనుప ముక్కను వెంట తీసుకురావాలని, తెచ్చిన ముక్కను కరగదీసి అక్కడే అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టులు, పైరవీల కోసమే రాజకీయాలు ఎన్నో ఏళ్ల తర్వాత కనీస న్యాయం జరుగుతుందని కళలుగన్న తెలంగాణ ప్రజలకు నాయకులు కనీస న్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు. కాగా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసమే కుర్చీలు ఎక్కారని, ఎక్కడ భూ సెటిల్మెంట్లు చేయవచ్చు అనుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్లో బాలికలపై జరిగిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. శ్రీరెడ్డి అనే నటికి అవకాశాలు ఇవ్వకుండా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండక.. బోర్లు ఎండిపోయి.. వడగండ్ల వానపడి వేల ఎకరాళ్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం చూపిన తెగువ ఇక్కడి ప్రజలు మరిచి పోలేదని, అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్నామ్నాయ పార్టీలు అవసరమని, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది ముందే తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఒకేఒక్క కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీజేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి, నాయకులు బాల్కిషన్, మంత్రి నర్సింహయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాకు ప్రత్యర్థి కాదని, అలాగే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో టీఆర్ఎస్తో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని..పొత్తులకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. వాటి గురించి పీసీసీ చీఫ్ స్పందిస్తారని తెలిపారు. కోదండరాం గొప్ప వ్యక్తి అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మాదిరి అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, టీఆర్ఎస్ ఓడిపోతుందనే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, దీనికి కోసం చాలా మందితో ఉత్తమ్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్ను ఓడించేందుకు కాంగ్రెస్తో కలిసి రావాలని, త్వరలో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని, జూన్2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ వారం టీఆర్ఎస్, టీడీపీ నుంచి పలువురు ముఖ్యులు కాంగ్రెస్లో చేరతారని, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డిని వద్దని పార్టీలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, ప్రవాస గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. ఈ నెల 12 నుంచి కాంగ్రెస్ బృందం కువైట్లో పర్యటిస్తుందని, గల్ఫ్లో క్షమాబిక్ష (ఆమ్నెస్టీ )పథకంలో..ముప్పై వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని, ఆ కార్మికులకు ఫ్రీ టికెట్ లు అందించాలని కోరారు. గల్ఫ్ ఎన్నారైల భాదలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. కువైట్కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపించి..ఎన్నారై పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పట్టెడన్నం పెట్టే అన్నదాతల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సాగుకోసం చేసిన అప్పులను కూడా తీర్చలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘రైతు సమస్యలు– పరిష్కారాల సదస్సు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలను వివరించారు. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు నుంచి పంట చేజారిపోగానే అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వచ్చినది కాదని, కేవలం మానవ నిర్మితమైనదన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కల్తీమయమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాల మాదిరిగా వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని వనపర్తి జిల్లా జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. సాగుకు పెట్టుబడి లేక ఆవులు, దూడలను పెబ్బేర్ సంతలో అమ్ముకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఎలాంటి గిట్టుబాటు ఉండటం లేదన్నారు. విధిలేని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. రైతులకు తీరని నష్టం పత్తి విత్తనాల కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల మోసాల వల్ల గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా మోసపోతున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ నాగర్దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తంచేశారు. 20ఏళ్లుగా చేస్తున్న వారి అక్రమాలపై రైతులే స్వయంగా నడుంబిగించి పోరాటం చేయాల్సి వచ్చిందే తప్ప, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీడ్పంట ద్వారా ఎకరాకు రూ.5లక్షల దిగుబడి వస్తే కేవలం రైతుకు రూ.2లక్షలు అందజేసి, మిగతా మూడు లక్షలు కంపెనీలు, సీడ్ఆర్గనైజర్లు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. తుంగభద్రనది నుంచి న్యాయబద్దంగా రావాల్సిన వాటా 15.9టీఎంసీలను ఎందు కు రాబట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వివిధ మండలాల నుంచి పెద్దసంఖ్య లో రైతులు తరలివచ్చారు. ఆత్మç ßæత్య చేసుకున్న రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. క్రియాశీలకంగా టీజేఏసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మహబూబ్నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడంలో జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రభు త్వ వాగ్దానాలు అమలుచేయాలని జేఏసీ ఒక బాధ్యతతో డిమాండ్ చేస్తోం దని అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 45రోజుల పాటు జేఏసీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, ఆ నివేదికను కేంద్ర నాయకత్వానికి అందజేశామన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
'పవన్ గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేను'
సాక్షి, కరీంనగర్ : జనసేన పార్టీ నేత, హీరో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పవన్ యాత్రపై ఆయనను స్పందన కోరగా పై విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు నెట్టేసి ద్రోహులను తన దగ్గరకు చేర్చుకున్న ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ చెప్పారు. ప్రాంతీయ వనరులను సమకూర్చుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ కేసీఆర్ ప్రభుత్వ చర్యలు మాత్రం ఆంధ్రా వాళ్లకు లాభం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి రైతు సమస్యలపై అధ్యయనం చేశామని, జిల్లాల్లో సేకరించిన సమాచారాన్నంతా ఈ నెల (జనవరి) 31 లోగా క్రోడీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని కోదండరాం వెల్లడించారు. -
శత్రువులు మిత్రులయ్యారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలవడం, ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తడంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. నిన్నటి వరకు తిట్టుకున్న పవన్ కల్యాణ్, కేసీఆర్లను చూస్తుంటే శత్రువులు ఆప్తులైనట్లుగా, ఆప్తులు శత్రువులైనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే వారిలో నిలకడలేదని విమర్శించారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ విషయంలో గతంతో పోలిస్తే మార్పులేవీ జరగలేదని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్ను ఎక్కువగా కొంటోందని, దీనివల్ల స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు. బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నదంటే దాని వెనుక ఏదో మతలబు దాగి ఉందని కోదండరాం ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుండటం వల్ల కరెంటు అవసరంలేని సమయంలోనూ విద్యుత్ లైన్లకు డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు కోదండరాం నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిసింది. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఆర్టీ)లో 50% మార్కుల విధానాన్ని ఎత్తేసి పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరింది. -
కోదండరాంది పదవుల తండ్లాట:బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ నిర్వహించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట సభ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో కోదండరాం.. నేరుగా టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని కోదండరాం విమర్శించారు. -
‘కొలువుల కొట్లాట’పై రేపు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: 'కొలువులకై కొట్లాట' సభకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. తెలంగాణ జేఏసీ నేతలు సరూర్నగర్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 30 న నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తేదీని మార్చుకోవాలని పోలీసులు అంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 30 న అంతర్జాతీయ వ్యాపార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సందర్భంగా కొలువుల కొట్లాట సభకు భద్రత కల్పించ లేమని ప్రభుత్వం తరపు న్యాయవాది శరత్ కోర్టుకు తెలిపారు. 30 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 తర్వాత మరో తేదీ కోరితే అనుమతి ఇస్తామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ప్రభుత్వ నియంతృత్వంతోనే కోర్టుకు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ, చట్ట వ్యతిరేక విధానాలపై కోర్టుకు వెళ్లకతప్పడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఏర్పాటు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజానుకూలంగా, రాజ్యాంగానికి లోబడి పాలన ఉంటే కోర్టులో పోరాడాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుందన్నారు. అన్ని శాఖల్లోనూ జేఏసీలు ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. న్యాయ, చట్ట, రాజ్యాంగపరమైన అంశాలపై అడ్వొకేట్లకు ఉన్న అవగాహన మరెవరికీ ఉండదన్నారు. తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలి తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. దీంతోపాటు సీఆర్పీసీ 41ని రద్దు చేయాలని, న్యాయశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగానే అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్లుగా గోపాలశర్మ, కొండారెడ్డి, మల్లేశ్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్లుగా మహమూద్, హస్మ రహీమా, బాబురావు, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, ప్రసాద్ బాబు, ఉదయగిరి, వెంకటేశ్ యాదవ్, భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
నక్సల్స్, కాంగ్రెస్తో కోదండరాం కుమ్మక్కు
స్టేషన్ మహబూబ్నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు. పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం..
-
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం.. కోదండరాం అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ చైర్మెన్ను.. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోదండరాం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. హోం మంత్రిని కలిసిన అనంతరం జేఏసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని అన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీజేఏసీ శనివారం వరంగల్, జనగాం జిల్లాల్లో నిర్వహించతలపెట్టింది. ఇందుకుగాను సర్కారును అనుమతి కూడా కోరింది. అయితే యాత్రకు అనుమతి ఇచ్చే అంశంపై ఎటూ తేల్చని పోలీసులు.. ఆయా జిల్లాల్లో టీజేఏసీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన కోదండరామ్ ఉదయం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్పందన సరిగా లేదని, అయినా యాత్రను కొనసాగించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. జనగామలో ఉద్రిక్తత జనగామ: అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్పూర్, రఘునాధపల్లి, స్టేషన్ ఘన్ పూర్ పోలీస్టేషన్లకు తరలించారు. టీ జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్ ఫై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. -
ఆ జీవోలను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల అధికారాలను, రైతులకు భూమిపై హక్కును హరించేవిధంగా ఉన్న 39, 42 జీవోలను ఉపసంహరించుకోవాలని అఖిలపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు జేఏసీ హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి(టీపీసీసీ అధ్యక్షుడు), ఎం.కోదండరాం(టీజేఏసీ చైర్మన్), వెంకటరెడ్డి(సీపీఐ), గోలి మధుసూ దన్రెడ్డి(బీజేపీ), రావుల చంద్రశేఖర్రెడ్డి (టీడీపీ), కె.గోవర్ధన్ (న్యూ డెమొక్రసీ), రచనారెడ్డి(హైకోర్టు న్యాయవాది), వివిధ రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రైతుల హక్కులను కాలరాసేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అబ్బ సొత్తు, జాగీరు కాదు’ అని అన్నారు. భూవివా దాల్లో రైతు సమన్వయ సమితులు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. భూ రికార్డుల సవరణకు అధికారం ఇవ్వడం వల్ల రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుం దన్నారు. స్థానికసంస్థల అధికారాల కోసం అక్టోబర్ 3న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్ర మాలు చేపడతామని చెప్పారు. పట్టాదారులతో పాటు కౌలు రైతులందరికీ పెట్టుబడి కోసం రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం 1,000 కోట్లు కేటాయిస్తామని హామీ నిచ్చి అమలు చేయలేదని ఉత్తమ్ విమర్శిం చారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థకు తూట్లు పొడిచే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. గ్రామ పెత్తం దార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థలకు జీవంపోసి, వాటి ద్వారా గ్రామాల్లో దొరల పాలన తీసుకురావాలని కుట్రలు చేస్తు న్నారని విమర్శించారు. జీవో 39కి వ్యతిరేకంగా అక్టోబర్ 3న గ్రామ స్థానిక సంస్థల అధికారాల కోసం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. భూసమస్యను పరిష్కా రంæచేయాలంటే సమగ్ర భూసర్వే చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. రావుల చంద్రశే ఖర్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుసమన్వయ సమితి పేరుతో స్థానిక సంస్థల అధికారాలను హరించే కుట్రకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల సమ స్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కొత్త సమస్యలను తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. భూరికార్డుల సవరణ పేరుతో రెవెన్యూశాఖ ఆధీనంలో ఉండే భూములను టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో పెట్టే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ సమస్యలపై గవర్నరుకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కార్య క్రమానికి గవర్నర్ వెళ్లడాన్ని ఖండించారు. -
జీవో 39తో మళ్లీ పెత్తందారీ వ్యవస్థ
► ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలి: కోదండరాం ► అక్టోబర్ రెండో వారంలో నిరుద్యోగ సభ ► పార్టీ కోసం ఒత్తిడి ఉన్నా నిర్ణయం తీసుకోలేదు సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల్లాంటి సమాంతర వ్యవస్థతో మేలుకన్నా హాని ఎక్కువని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సమన్వయ సమితుల కోసం ఇచ్చిన జీవో 39లో లొసుగులున్నాయని, మళ్లీ పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రైతు సమన్యయ సమితులతో కౌలు రైతుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. రైతు సమితులను కేవలం అధికార పార్టీ కార్యకర్తలతో నామినేషన్ పద్ధతిలో నింపే ప్రమాదముందని, వీటి వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలహీనమయ్యే ముప్పుందని హెచ్చరించారు. సమగ్ర రైతాంగ విధానాన్ని ప్రకటించి, ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో దాటవేత ధోరణిని కోదండరాం తీవ్రంగా ఖండిం చారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని 2 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేలండర్ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో భూమి పుత్రులకు రిజర్వేషన్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయమై అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ విలీన దినంగా సెప్టెంబర్ 17 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు ఐదో దశ స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని కోదండరాం కోరారు. జేఏసీ నిర్మాణాన్ని మండల, గ్రామ స్థాయికి విస్తరిస్తామని, ప్రతినెలా జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా రాష్ట్రవ్యాప్తంగా పాటిస్తామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ మం జూరు చేయాలని, దీనిపై ఈ నెలలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. గాయకుడు ఏపూరి సోమన్నపై పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికమన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి ఉన్న మాట నిజమేనని.. ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికైనా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని కోదండరాం వ్యాఖ్యానించారు. -
తొలుత అనుమతి.. తర్వాత నిరాకరణ
కేయూలో చెట్టు కిందే మాట్లాడిన కోదండరాం కేయూ క్యాంపస్: కాక తీయ యూనివర్సిటీ లో ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనై జేషన్ (ఐఎస్ వో)మ ఆధ్వర్యంలో శని వారం ‘రిజెక్టింగ్ విక్టిమ్ హుడ్, రిక్లైమింగ్ డిగ్నిటీ ఆఫ్ అగనెస్ట్ హేట్’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశ నిర్వాహణకు అధికారులు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత నిరాకరించారు. సమావేశానికి వచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా పలువురు ఆపి ఇక్కడే మాట్లాడాలని పట్టుబట్టారు. ఆయనను చెట్టు కిందకు తీసుకొచ్చి గొడుగు పట్టారు. అందరికీ సమాన విలువలు అందించేలా రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. హ్యూమన్ డిగ్నిటీపై చర్చిం చేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. -
వాక్ స్వాతంత్ర్య హక్కును అణగదొక్కుతున్నారు
-
స్ఫూర్తి యాత్ర టెన్షన్.. టెన్షన్
-
స్ఫూర్తి యాత్ర టెన్షన్.. టెన్షన్
కోదండరాంను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ► భిక్కనూరులో అరెస్టు.. సాయంత్రం హైదరాబాద్కు తరలింపు ► కామారెడ్డిలో జేఏసీ వేదిక వద్ద రణరంగం ► అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అడ్డంకులు: కోదండరాం ► నేడు మళ్లీ యాత్ర కొనసాగిస్తానని స్పష్టీకరణ సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్ వద్దకు యాత్ర చేరుకోగానే అధికార పార్టీ నేతలు అడ్డు తగిలారు. అక్కడ్నుంచి కోదండరాంను పోలీసులు ముందుకు పంపించగా భిక్కనూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడిన తర్వాత కామారెడ్డి వైపు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు కోదండరాంతోపాటు జేఏసీ నేతలను అరెస్టు చేసి భిక్కనూరు పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోదండరాంను బలవంతంగా జీపులో ఎక్కించి హైదరాబాద్ తరలించారు. టెంట్ కూల్చివేత.. కామారెడ్డి మున్సిపాలిటీ ఎదుట జేఏసీ తలపెట్టిన సభావేదిక రణరంగమైంది. వేదిక వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ జేఏసీ నేతలపై దాడికి దిగారు. కొందరు వేదిక టెంట్ కూల్చివేయగా, మరికొందరు విద్యార్థి నాయకులను పట్టుకుని చితకబాదారు. ఇందులో పలువురు నాయకులతోపాటు ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ విద్యార్థి నాయకులు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నేతలు వారిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో జేఏసీ, విద్యార్థి నేతలు 15 మంది, టీఆర్ఎస్ నేతలు 15 మంది ఉన్నారు. సీపీఐ ఖండన టీజేఏసీ స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఐ–ఎంఎల్ న్యూ డెమో క్రసీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఖండించారు. ఇలాంటి నియంతృత్వ పోక డలు మంచివి కావని చాడ హెచ్చరించారు. అడ్డుకుంటే టీఆర్ఎస్కే ముప్పు: కోదండరాం దాడులకు భయపడేది లేదని, శనివారం కామారెడ్డి జిల్లాలో తన యాత్ర కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేతలు యాత్రకు అడ్డుపడుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. దాడికి గురైన వారినే అరెస్టు చేయడం, హైదరాబాద్ దాకా తీసుకురావడం అన్యాయమన్నారు. ఇలాంటి అప్ర జాస్వామిక వ్యవహార శైలి టీఆర్ఎస్కే ముప్పు అని హెచ్చరించారు. అంతకుముందు ఆయన భిక్కనూరు పోలీస్స్టేషన్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతలు యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బాన్సువాడలో జరిగిన మంజీర ఇసుక అవినీతిని ప్రశ్నిస్తానని మంత్రి పోచారం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే రవీందర్రెడ్డి, కామారెడ్డిలో భూ దందాలు, అక్రమాలపై ప్రశ్నిస్తానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు భయపడి టీఆర్ఎస్ గుండాలతో దాడులు చేయించారన్నారు. సీఎం ప్రారంభించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రీ ఇంజనీరింగ్ అని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినదాంట్లో ఈ ప్రాజెక్టు లేదని, ఇది పాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా లేదా కొత్త ప్రాజెక్టా అని ప్రశ్నించారు.