mahakutami
-
ఈసారి ఎవరిది పీఠం? ‘మహా’కూటముల్లో బీఎంసీ ఎన్ని‘కలవరం’
దాదర్: త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబిటీ)– శివసేనకు, కాంగ్రెస్కు పెద్ద సవాలుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయం చెందడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 288 స్ధానాలకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 23వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహా వికాస్ ఆఘాడి కూటమి అతి తక్కువ స్ధానాలతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ఎంవీఏలో కలవరం మొదలైంది. 2022లోనే ముగిసిన గడువు... బీఎంసీ కార్యనిర్వాహక వర్గం గడువు 2022, మార్చితో ముగిసింది. ఈమేరకు 2022, ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాలి. కానీ ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే నేతత్వంలోని ఏవీఏ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తరువాత మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ ఏడాది మేలో లోక్సభ ఎన్నికలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా వరుసగా ఏదో ఒక అడ్డంకులు ఎదురు కావడంతో బీఎంసీ ఎన్నికలు తరుచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండున్నరేళ్ల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయ ర్ ఇలా ప్రజాప్రతినిధులెవరు లేరు. దీంతో గత్యంతరం లేక అడ్మిన్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తికావడంతో జనవరి లేదా ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘార పరాజయాన్ని చవిచూసిన ఎంవీఏ కూటమిలో శివసేన(యూబీటీ)కి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు శివసేన(శిందే) వర్గంలో చేరేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. అదేవిధంగా మైనార్టీ వర్గాలు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కొందరు బీజేపీ లేదా శిందే వర్గంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎంవీయే, కాంగ్రెస్, శివసేన(యూబీటీ), మరోవైపు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఉద్ధవ్ సేనను గద్దె దించేందుకు బీజేపీ, శివసేన(శిందే)లు ఈసారి తీవ్రంగా శ్రమించాల్సిఉంటుంది. మళ్లీ ఫిరాయింపులు? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంవీఏను ముఖ్యంగా ఉద్ధవ్ సేనను గట్టి దెబ్బ తీశాయి. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత మరికొంత మంది శిందే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ లోక్సభ ఎనికల్లో మహాయుతికి ఆశించినంత మేర ఫలితాలు రాకపోవడం, ఏంవీఏకు ఊహించిన దానికంటే ఎక్కువ లోక్సభ స్ధానాలు సాధించడంతో జంపింగులు పూర్తిగా నిలిచిపోయా యి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏంవీఏ ఘోరంగా చతికిలపడటం, మహాయుతి విజయ ఢంకా మోగించడంతో మళ్లీ ఫిరాయింపులు మొదలేయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెన్నెస్.. అవకాశమే లేదు! 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9, ఎమ్మెన్నెస్–7, సమాజ్వాది పార్టీ–1, ఇండిపెండెంట్లు–14 మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరందరి సహకారంతో బీఎంసీ ఐదేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు సాగించింది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండున్నరేళ్ల కిందట ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న విభేదాల వల్ల బీఎంసీలో కూటమిగా ఉన్న శివసేన, బీజేపీ రెండుగా చీలిపోయాయి. దీంతో బీఎంసీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఆ తరువాత ఎమ్మెన్నెస్కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాక్కొవడంలో శివసేన సఫలీకృతమైంది. దీంతో ఎమ్మెన్నెస్కు ఒక్క కార్పొరేటర్ కూడా లేకుండా పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ ఒక్క సీటును కూడా సాధించలేదు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో జరి గే బీఎంసీ ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, మహాయుతి, శివసేన(యూబీటీ)ల మధ్యే ప్రధానపోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అంతంతమాత్రమే... కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో రెండున్నరేళ్లకే అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో అనేక మంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీ, శివసేన(శిందే)ల్లో చేరే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి బీఎంసీ ఎన్నికలకు సీట్ల పంపకంలో కాంగ్రెస్కు చాలా తక్కువ స్ధానాలు లభించే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారనున్నాయి. -
మహాకూటమి అభ్యర్థుల నామినేషన్లు
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్కు నామినేషన్లను సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ధైర్య శీల మోహితే పాటిల్ కూడా... మరోవైపు మాడా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్కు నామినేషన్ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు. -
బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. -
‘నా ఐదేళ్ల అనుభవం 50 ఏళ్లతో సమానం’
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాలక, విపక్ష కూటముల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను అనుభవం లేని నేతనే అయితే తనకు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తోందని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ నైరాశ్యంలో ఉందని దాని తీరుతెన్నులే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. నితీష్ కుమార్ ప్రతిష్ట మసకబారిందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి సీఎం అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. చదవండి : నితీష్కు డబుల్ ట్రబుల్..! తనకు అనుభవం లేదని బీజేపీ చెబుతోందని, తాను ఎమ్మెల్యేగా విపక్ష నేతగా వ్యవహరించడంతో పాటు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశానని చెప్పారు. తన అయిదేళ్ల అనుభవం 50 సంవత్సరాల అనుభవంతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం తనకు ఎలాంటి సవాల్ విసరబోదని స్పష్టం చేశారు. బిహార్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని జేడీయూ, బీజేపీకి అర్థమవడంతో వారు నిరాశలో కూరుకుపోయారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో నూతనోత్తేజం నెలకొంది. లోక్తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్రావు బుధవారం ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఎల్జేపీ నేత, మాజీ ఎంపీ కాళీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. తన తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా బిహార్లో మహాకూటమి తరపున పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చేపడతానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సుభాషిణి పేర్కొన్నారు. చదవండి : బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమిని బలోపేతం చేసి బిహార్ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్లో చేరిన సందర్భంగా సుభాషిణి చెప్పుకొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
మహాకూటమి : సీట్ల పంపకాలు ఖరారు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య సీట్ల సర్ధుబాట్లు కొలిక్కివస్తున్నాయి. మహాకూటమిలో పార్టీల సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు 30 స్ధానాల్లో తలపడనున్నాయని మహాకూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్కు 70 స్ధానాలు ఇచ్చేందుకు అంగీకరించిన ఆర్జేడీ ఆయా స్ధానాల ఎంపికను మాత్రం ఆ పార్టీకి విడిచిపెట్టేందుకు అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని పాలక ఎన్డీయే సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పట్నాలో కీలక భేటీ నిర్వహించింది. ఎన్డీయే తరపున సీట్ల పంపకాలను ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. 2015లో తన విజయానికి బాటలుపరిచిన ఏడు సూత్రాల కార్యక్రమం 2.0ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. ఓట్ల వేటలో ఈ పథకం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. కాషాయ కూటమితో జతకట్టిన నితీష్ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ముందుకొచ్చాయి. ఇక బిహార్లోని 71 స్ధానాలకు తొలి విడత పోలింగ్కు అప్పుడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్లో 243 అసెంబ్లీ స్ధానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం -
బిహార్ ఎన్నికలు : నితీష్ వ్యూహాత్మక ఎత్తుగత
పట్నా : రాజకీయాల్లో ఏ సమయంలో ఏం చేయాలనేదే కీలకం. ఆ ఒడుపులన్నింటినీ ఒడిసిపట్టడంలో దిట్టగా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల సమయంలో భారీ పథకంతో వేడిని రాజేశారు. సెప్టెంబర్ 25న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మూడు విడతల పోల్ షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణమే నితీష్ ఏడు సూత్రాల కార్యక్రమం -2ను ప్రకటించారు. 2015లో తన విజయానికి దోహదపడిన సాథ్ నిశ్చయ్ (ఏడు అంశాలు)కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను సమకూర్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నుంచి మహిళలోల వ్యాపార దక్షతను పెంచడం, వ్యవసాయ భూములకు సాగునీరు లభ్యత, ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగపరచడం వంటి పలు అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరించారు. వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి కలిగిన మహిళలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దళిత యువతీ, యువకులకూ ఈ తరహా పథకాన్ని నితీష్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. సాథ్ నిశ్చయ్ పథకం ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ను విజయతీరాలకు చేర్చింది. అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన రాం విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వహ, జితిన్ రాం మాంఝీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని నితీష్ జయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో నితీష్ ఆ ఎన్నికల్లో ఎదురీదుతారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సారథ్యంలోని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాకూటమి విజయం సాధించింది. చదవండి : బిహార్లో మహాకూటమికి షాక్ ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు కల్పించడంతో పాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామలో రహదారుల నిర్మాణం చేపడతామని ఆ ఎన్నికల్లో నితీష్ వాగ్ధానం చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. ఆ ఊపుతోనే నితీష్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాథ్ నిశ్చయ్-2ను తెరపైకి తీసుకువచ్చారు. మహాకూటమిని వీడి ఈసారి ఎన్డీయే పక్షాన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్న నితీష్ మరోసారి విజయం సాధిస్తే ఆయన రికార్డుస్ధాయిలో ఏడోసారి బిహార్ పాలనా పగ్గాలను చేపడతారు. ఇక ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. -
బిహార్లో మహాకూటమికి షాక్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ ఇప్పటికే తేల్చిచెప్పారు. కాగా బీఎస్పీతో కలిసి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్ మాజీ సీఎం నితిన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు.మహాకూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక పట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిన్న పార్టీలతో చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆర్ఎల్ఎస్పీ వర్గాలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు! -
‘అందుకే బలహీన అభ్యర్ధులను దింపాం’
లక్నో : యూపీలో బీజేపీ ఓటు బ్యాంక్కు గండికొట్టి ఎస్పీ-బీఎస్పీ కూటమికి మేలు చేసేందుకు పలు స్ధానాల్లో బలహీన అభ్యర్ధులను బరిలో దింపామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారు. బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి కాంగ్రెస్ లోపాయికారీగా సహకరిస్తుందనే వార్తలను ప్రియాంక నిర్ధారించడం గమనార్హం. యూపీలో ప్రచారం సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకొచ్చారు. తాము బలంగా ఉన్న స్ధానాల్లో గట్టిపోటీని ఇస్తూ బీజేపీని ఓడిస్తామని, తాము బలహీనంగా ఉన్న స్ధానాల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అభ్యర్ధులను ఎంపిక చేశామని చెప్పారు. కాగా బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో కలిసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రాహుల్, సోనియా పోటీచేస్తున్న అమేథి, రాయ్బరేలి స్ధానాల్లో ఎస్పీ-బీఎస్పీ తమ అభ్యర్ధులను బరిలో దింపలేదు. లోక్సభ ఎన్నికలు చరమాంకానికి చేరుకోవడంతో ఇక ఎన్నికల అనంతర పొత్తులపైనే ఆయా పార్టీలు దృష్టిసారించనున్నాయి. -
‘మహాకూటమి కాదు.. మహాకల్తీ గ్యాంగ్’
భాగల్పూర్/సిల్చార్: కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే తమ అవినీతి దుకాణాలు, వారసత్వ రాజకీయాలు మూతపడతాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. తనను అడ్డుకునేందుకు దేశంలోని విపక్షాలు ‘మహాకల్తీ గ్యాంగ్’గా మారాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్, అస్సాం రాష్ట్రాల్లో గురువారం జరిగిన బహిరంగ సభల్లో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై దుష్ప్రచారం.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పడ్డ మహాకూటమిని మోదీ మహాకల్తీ గ్యాంగ్గా అభివర్ణించారు. ‘‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవనీ, రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ప్రమాదంలో పడతాయనీ, రిజర్వేషన్లు ఎత్తివేస్తాడని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ డా.బీ.ఆర్.అంబేడ్కర్ తీసుకొచ్చిన కోటా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చౌకీదార్ (కాపలాదారు) అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇతరులకు నష్టం జరగకుండా ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూసీ)కు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. మోదీ మళ్లీ అధికారంలోకొస్తే తాము ఫినిష్ అయిపోతామని ఈ వేర్పాటువాద గ్యాంగ్ (ప్రతిపక్షాలు) భయపడుతోంది’ అని అన్నారు. నేటికీ పాక్లో వేధింపులు.. పౌరసత్వ చట్టాన్ని తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అస్సాంలోని సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఎన్డీయే అధికారంలోకిరాగానే సమాజంలోని అన్నివర్గాలతో చర్చించి పౌరసత్వ చట్టాన్ని తెస్తాం. అస్సాం ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ దేశవిభజన సమయంలో పాక్లోని మైనారిటీల గురించి ఆలోచించలేదు. పాక్లోని మతోన్మాదులు మన సోదరుల్ని, సోదరీమణుల్ని చిత్రహింసలు పెట్టారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ దోషి కాదా? మన కుమార్తెలు నేటికీ పాక్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వచ్చినవెంటనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తాం. మన ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. -
మాయావతి వ్యాఖ్యలపై ఈసీ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి వివాదంలో చిక్కుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కు ఓటు వేయవద్దని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిశీలిస్తోంది. యూపీలోని దియోబంద్లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ర్యాలీలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాయావతి ప్రసంగంపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. మహాకూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లలో చీలికకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీని ఓడించాలని భావించే ముస్లింలు యూపీలో మహాకూటమివైపే నిలవాలని సూచించారు. మాయావతి ఇంకా ఏమన్నారంటే..‘ బీజేపీని ఓడించే సామర్ధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు..మహాకూటమితోనే కాషాయ పార్టీని నిలువరించడం సాధ్యం..కాంగ్రెస్కు మాత్రం ఓటేయకండి..ఆ పార్టీ మహాకూటమి ఓటమిని కోరుకుంటోంద’ని మాయావతి అన్నారు. మాయావతి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆమె వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని స్ధానిక అధికారులను కోరింది. -
బీజేపీకి ఓటమి భయం
దియోబంద్(సహరాన్పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు. న్యాయ్ సరైన పరిష్కారం కాదు ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు. చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు. తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. -
నేడు మహాకూటమి తొలి ర్యాలీ
లక్నో : లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ప్రచారం కొద్దిరోజుల్లో ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు యూపీలో జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఆదివారం దియోబంద్లో తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీతో కేంద్రంలో మోదీ సర్కార్కు దీటుగా తమ కూటమి ఎదురొడ్డి నిలుస్తుందనే సంకేతాలను ఓటర్లకు పంపేందుకు ఈ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. 2014లో యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకున్న బీజేపీని దెబ్బతీసేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో పట్టు నిలుపుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. మరోవైపు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంకను తీసుకురావడంతో యూపీలో గౌరవప్రదమైన స్ధానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది -
బిహార్లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: బిహార్లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్ రాం మాంఝీ పార్టీ హెచ్ఏఎం మూడు చోట్ల, ముకేశ్ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. దర్భంగా టికెట్ను కీర్తికే ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాటలీపుత్ర నుంచి మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్ నేత అష్రఫ్ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్ హస్సన్నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది. పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ -
మహాకూటమికి మహిళా నేత షాక్..
రాంచీ : లోక్సభ ఎన్నికలకు జార్ఖండ్లో మహాకూటమి పార్టీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నపూర్ణదేవి పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. జార్ఖండ్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటును ఆదివారం పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్, జేఎంఎం, జేవీఎంలు వరసగా ఏడు, నాలుగు, రెండు స్ధానాల్లో పోటీ చేయనుండగా, ఆర్జేడీకి ఒక స్ధానం కేటాయించారు. సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే సోమవారం ఆర్జేడీ జార్ఖండ్ చీఫ్ అన్నపూర్ణదేవి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. దేశ రాజధానిలో ఆమె బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. కాగా ఆదివారం రాత్రి జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, ఇతర బీజేపీ నేతలతో అన్నపూర్ణదేవి భేటీ కావడంతో ఆమెను పార్టీ నుంచి ఆర్జేడీ సస్పెండ్ చేసింది. మరోవైపు చత్ర లేదా కొడెర్మా స్ధానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమెను బీజేపీ బరిలో దింపుతుందని భావిస్తున్నారు. -
కన్హయ్య కుమార్కు షాకిచ్చిన లూలూ ప్రసాద్..!
బిహార్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలన్ని కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లనున్నట్లు ఇటీవల ఆయా పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సీట్ల పంపకాలు శుక్రవారం పూర్తయ్యాయి. ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రకటించారు. కేంద్ర మాజీమంత్రి రాం విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. అంతేకాకుండా లోక్తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) పార్టీ నేత శరద్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ గుర్తుతో పోటీ చేస్తారని తెలిపారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఎల్జేడీ కూటమితో కలిసి పని చేస్తుందని మనోజ్ ఝా వివరించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్కు కూటమి షాకిచ్చింది. సీట్ల కేటాయింపులో కన్హయ్య పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్జేడీ పోటీ చేసే స్థానాల్లో ఒక సీటును మాత్రమే సీపీఐ(ఎంఎల్)కి కేటాయిస్తామని మనోజ్ ఝా వెల్లడించారు. కాగా ఆయన బెగుసరాయ్ లోక్సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కన్హయ్య అభ్యర్థిత్వానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి ఆర్డేడీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన తన్వీర్ హసన్ను అక్కడి నుంచి పోటీచేయించాలని లాలూ ప్రయత్నిస్తున్నారు. బెగూసరయ్లో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుందని, గ్రౌండ్లెవన్లో వామపక్షాలు అంత బలంగా లేరని ఆర్జేడీ భావిస్తోంది. ఇదిలావుండగా కన్హయ్య కుమార్ను సీపీఐ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన విషయ తెలిసిందే. -
మహాకూటమిలో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో..
పట్నా : రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. ఆర్జేడీ 20 స్ధానాల్లో, కాంగ్రెస్ 9 స్ధానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ నాలుగు స్దానాల్లో, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవాం మోర్చా మూడు స్ధానాల్లో, లోక్తాంత్రిక్ జనతాదళ్ రెండు స్ధానాల్లో, వికాషీల్ ఇన్సాన్ పార్టీ ఒక స్ధానంలో పోటీ చేస్తాయని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మహాకూటమి సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, ఆర్జేడీలు బుధవారం అధికారికంగా ప్రకటించనున్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ, జేడీ(యూ)లు చెరి 17 సీట్లలో పోటీ చేయనుండగా, రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఆరు సీట్లు కేటాయించారు. -
విపక్షాల రాజకీయం ఆగమాగం
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో విపక్షాలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ దూకుడుతో ఎన్నికల బరిలో దూసుకెళుతుంటే ప్రతిపక్షాలు ఇంకా వ్యూహాలను ఖరారు చేసుకునే పనిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు ఈ ఎన్ని కల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవ హరిస్తుండటం, కలిసేందుకు ప్రయత్నించినా.. కామ్రేడ్ల మధ్య సఖ్యత కుదరకపోవడంతో విపక్షాల రాజకీయం ఆగమాగంగా మారింది. కాంగ్రెస్ మినహా మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా రాలేదు. తాము పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నాయి. అధికార పక్షం ఎదురేలేకుండా దూసుకుపోతుంటే.. విపక్షాలు మాత్రం కనీస పోటీ ఇచ్చేందుకే విలవిల్లాడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే! అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఇతర ప్రతిపక్షాలతో జట్టుకట్టి పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే వెళ్తోంది. ఇప్పటికే ఖమ్మం లోక్సభ మినహా 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పార్టీలను ఈసారి కలుపుకునిపోయేందుకు కనీస ఆసక్తి చూపడం లేదు. టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సంప్రదింపులు జరపలేదు. జాతీయ పార్టీగా ఈ ఎన్నికల్లో లభించే మద్దతుతో పాటు.. ఇతర పక్షాల సహకారం కూడా తోడైతే కొంత ఫలితం ఉండే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండానే.. టీపీసీసీ నేతలు ఎన్నికల కసరత్తు పూర్తి చేసుకోవడం గమనార్హం. కామ్రేడ్ల ఐక్యత హుష్కాకి! రాష్ట్రంలో ఉనికి కోసం అష్టకష్టాలు పడుతున్న కామ్రేడ్లు కూడా లోక్సభ ఎన్నికలపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సీపీఐ, సీపీఎంలు ‘వామపక్షాల ఐక్యత’పేరుతో మళ్లీ కలవాలనుకున్నా సైద్ధాంతిక అంశాలు వారిని కలవనీయడం లేదు. ముఖ్యంగా బహుజన లెఫ్ట్ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు వారి ఐక్యతకు అవరోధాలుగా కనిపిస్తున్నాయి. సీపీఎంతో పాటు తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిఇస్తామని సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు సీపీఎం సుముఖంగా లేదు. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరికి కట్టుబడాలని మార్క్సిస్టులు కోరుతున్నా.. దీన్ని సీసీఐ అంగీకరించడం లేదు. ఇక, బీఎల్ఎఫ్ను కొనసాగిస్తామన్న సీపీఎం ప్రతిపాదన సీపీఐకి రుచించడం లేదు. దీంతో ఇరు పార్టీలు సమావేశాల మీద సమావేశాలు పెట్టుకుంటున్నాయి కానీ ఏమీ తేల్చడం లేదు. అయితే.. సీపీఐ మాత్రం భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ రూటే సెపరేటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా వ్యూహాలను రచించడంలో.. అభ్యర్థులను ఖరారుచేయడంలోనే మునిగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేయబోతోంది. అయితే.. అభ్యర్థుల ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. పోటీ ఉన్న చోట ఎక్కువ మంది ఆశావాహులుండడం, కొన్ని చోట్ల కనీస పోటీనిచ్చే నేతలు టికెట్ అడక్కపోవడంతో కమలంపార్టీ పరిస్థితి కూడా ఊగిసలాట దశలోనే ఉంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలోని ప్రతిపక్షాల కంగాళీ పరిస్థితులు అధికార పక్షానికి ఊతమిస్తాయనే చర్చ జరుగుతోంది. తేల్చుకోలేని టీజేఎస్, టీడీపీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన టీజేఎస్, టీడీపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీ చేయని చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే అంశాల్లో ఇంకా డోలాయమానంలోనే ఉన్నాయి. పోటీ చేయ డం ఖాయమని ఆయా పార్టీల నేతలు పైకి చెపుతున్నా.. ఏం చేస్తారన్నది అనుమానమే. మొదట్లో టీజేఎస్ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేయా లని నిర్ణయించినా కరీంనగర్, నిజామాబాద్ లకే పరిమితం కావాలనుకుంటున్నట్లు తెలి సింది. అయితే.. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయించింది. ఇక, తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవలే ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. అయితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీలో లేని చోట్ల ఎవరికి మద్దతివ్వాలన్నదానిపై మరోసారి సమావేశమై వెల్లడిస్తామని తెలిపింది. నామినేషన్ల ఘట్టం మొదలైనా.. ఇంకా భేటీ కాలేదు. -
మహాకూటమి ఓ నినాదం మాత్రమే..
సాక్షి, నిజామాబాద్: మహాకూటమి అనేది పేరు, నినా దం మాత్రమేనని, దేశంలో ఎక్కడ వ్యవహా రికంగా ఆ కూటమి లేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్రావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మురళీధర్రావు మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైందని, బీజేపీ, ఎన్డీఏ మోదీ నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో వేగం గా దూసుకెళ్తుందన్నారు. ఎన్డీఏలో మిత్రపక్షాలు తగ్గుముఖం పట్టాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, 2014 కంటే ఎన్డీఏ 2019 ఎన్నికల్లో బలంగా ముందుకెళ్తుందని తెలిపారు. పార్టీ బలం, పార్టీల సంఖ్య కూడా ఎన్డీఏలో పెరిగిం దన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన కూటమి మద్దతు ఉందన్నారు. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూపీఏకు సిద్ధాంతకర్తగా మా రారని ఆరోపించారు. కానీ రాహుల్ ప్రధాని కా వాలని కోరుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు మాత్రం సాహ సించడం లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లకు ఒక్కటి కూడా తక్కువ రాదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి నుంచి బీ జేపీ అభ్యర్థుల ప్రకటన అంచెల వారీగా ఉంటుందని, రాష్ట్ర శాఖ నేడు ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచనుందన్నారు. మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లనుందని మురళీధర్రావు ప్రకటించారు. ఐదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పథకాల అమలు, శత్రుదేశాలు, ఉగ్రవాదులు, సవాళ్లు, ఎదుర్కొనే సత్తా వంటి అంశాలను ప్రచారంలో ఉంచనున్నామన్నారు. దేశానికి స్థిర ప్రభుత్వం రావాలంటే మోదీకి ఓటేయ్యాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు వెంకటేష్, గజం ఎల్లప్ప, యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, మల్లేష్ యాదవ్, భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ
పాట్నా : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. బీహార్లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. అయితే దీనిపై ఆర్జేడీ ఇంకా స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. కన్హయ్య పోటీపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్), వికాస్షీల్ ఇసాన్ పార్టీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కన్నయ్య కుమార్పై 1200 పేజీల ఛార్జ్షీట్ కన్హయ్య కుమార్.. సీపీఐ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. బెగుసరాయ్ లోక్సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య పోటీ చేస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ పాండే మంగళవారం ప్రకటించారు. బిహార్లో సీట్లు పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ భేటీ కానుంది. వీరి సమావేశంలో కన్హయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2016లో కన్హయ్య కుమార్పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. చిక్కుల్లో కన్హయ్యకుమార్.. కేసు నమోదు! దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన తొలిసారి బరిలో నిలువనున్నారు. ఏప్రిల్ 29న బిహార్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఢిల్లీలోనూ మహాకూటమి కథ కంచీకే!
-
మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదు
-
‘కూటమి సర్కార్ను కోరుకోవడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదని, కూటమి నేతలు కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్కతా వేదికగా కలిసిన మహకూటమి సర్కార్ను దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 55 నెలల్లో చేసి చూపామన్నారు. గత యూపీఏ హయాంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ, బీజేపీ ఆలోచనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశానికి కీడు చేస్తోందని అన్నారు. లోక్సభలో గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ విపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజాలను వినే అలవాటు కాంగ్రెస్ లేదని, ఆ పార్టీ హయాంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, తాము న్యాయవ్యవస్ధ సహా వ్యవస్ధల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నామని, తొలిసారి ఓటు వేసే యువతను ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత సైన్యాన్ని అవమానించిందని, ఈసీ, సుప్రీం కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించిందని విమర్శించారు. -
అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం
ముంబై/ మర్గోవా: కోల్కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు. తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు. బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది. అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు. -
వారసత్వ పార్టీలు.. అవకాశ కూటములు
చెన్నై / న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి పేరుతో జతకట్టేందుకు యత్నిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విరుచుకుపడ్డారు. దేశానికి అన్నివిధాలుగా సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామనీ, ఓటు బ్యాంకు, విభజన రాజకీయాలు చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. ‘మేరా బూత్–సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులోని మైలదుతురై, శివగంగ, పెరంబలూర్, తేని, విరుధునగర్ పార్లమెంటరీ నియోజవర్గాల్లోని బీజేపీ బూత్స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ముచ్చటించారు. సరికొత్త శిఖరాలకు అభివృద్ధి.. ‘ఓవైపు అభివృద్ధి ఎజెండాతో మేం ఉంటే, మరోవైపు వారసత్వ పార్టీలు, అవకాశవాద పొత్తులు ఉన్నాయి. అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు 2019 లోక్సభ ఎన్నికలు మనకు గొప్ప అవకాశం. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ స్ఫూర్తితో మనం ప్రజలకు సాధికారత కల్పించేందుకు పనిచేస్తుంటే, వారసత్వ పార్టీలు మాత్రం అవకాశవాద పొత్తులతో సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి. బీజేపీలో ఎదుగుదలకు ఓ కుటుంబానికి విధేయత చూపడం, గొప్ప వంశంలో పుట్టడం, ధనవంతులుగా ఉండాల్సిన పనిలేదు. కేవలం పార్టీ కోసం కష్టపడగలిగితే చాలు’ అని మోదీ తెలిపారు. విపక్షాలవి తాత్కాలిక పొత్తులే.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బీజేపీ విజయం ప్రతీకూల రాజకీయాలు చేసే కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే వాళ్లు నన్ను, పార్టీని దూషిస్తున్నారు. మన విపక్ష మిత్రులు కూడా అయోమయంలో ఉన్నారు. అందుకే ‘మోదీ చెడ్డవాడు’ ‘ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదు’ ‘ప్రజలు బీజేపీని ఇష్టపడటం లేదు’ అని చెబుతున్నారు. కానీ మోదీ నిజంగానే చెడ్డవాడు అయితే, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకుంటే విపక్షాలు ఎందుకు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి?’ అని ప్రశ్నించారు. కర్తార్పూర్ విషయంలో కాంగ్రెస్ విఫలం దేశవిభజన సమయంలో సిక్కులకు పవిత్రమైన కర్తార్పూర్ సాహిబ్ను భారత్లో చేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన కర్తార్పూర్ కారిడార్ వల్ల వీసా అవసరం లేకుండానే భక్తులు పాకిస్తాన్లోని గురునానక్ అంతిమ విడిదిని సందర్శించుకోవచ్చని తెలిపారు. సిక్కుల 10వ గురువు గోబింద్ సింగ్ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రూ.350 విలువైన వెండి స్మారక నాణేన్ని మోదీ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురునానక్ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్తో పాటు పలువురు సిక్కు నేతలు హాజరయ్యారు. -
మజ్బూత్? మజ్బూర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్బూర్) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్బూత్) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు. అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే.. దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రైతులే నవభారత చోదక శక్తులు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాబోయే లోక్సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పేర్కొంది. స్థిరత్వమా? అస్థిరతా? రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. -
బీజేపీ, కాంగ్రెస్కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
మహాకూటమిలో చేరికపై ఒడిషా సీఎం వ్యాఖ్యలివే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరికపై తనకు మరికొంత సమయం కావాలని బీజేడీ నేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహాకూటమిలో చేరికకు సంబంధించి తాము ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరను రూ 2930కు పెంచాలనే డిమాండ్తో బీజేడీ ఆధ్వర్యంలో మంగళవారం దేశ రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దీని నుంచి కేంద్రం తప్పించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పలుసార్లు మద్దతు ధరపై విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఇప్పటివరకూ సమదూరం పాటిస్తున్న బీజేడీ మోదీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడటం గమనార్హం. గత నాలుగున్నరేళ్లుగా ఒడిషా ప్రభుత్వం వ్యవసాయంపై రూ 30,000 కోట్లు వెచ్చించిందన్నారు. -
పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి
-
పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి పొత్తులే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుంచి 45 స్థానాలైనా గెలిచేవాళ్లమని చెప్పారు. మహా కూటమి వద్దని ఎన్నికల ముందే అధిష్టానానికి చెప్పానని, అయినప్పటికీ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పొత్తుల కారణంగా టికెట ఎవరి వస్తుందోనని ప్రజలు అయోమయానికి గురైయ్యారన్నారు. దీనికి తోడు సీట్లే పంచుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రభావితం చూపాయన్నారు. ప్రజా కూటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారని టీఆర్ఎస్ ప్రచారం చేసిందన్నారు. తనలాంటి నాయకులు ఓడిపోవడానికి పొత్తులే కారణమని చెప్పారు. కేసీఆర్ తన నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు వద్దని పార్టీ సమీక్ష సమావేశంలో చెప్పానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకపోతే 7 లేదా 8 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అధిష్టానం టికెట్ ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ
న్యూఢిల్లీ : జాతీయ స్ధాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ల ఏర్పాటు ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం విఫలమైందని అన్నారు. తెలంగాణలో కూటమికి చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, అక్కడే కూటమికి తొలిదెబ్బ తగిలిందన్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారన్న విషయం తనకు తెలియదని మోదీ వ్యాఖ్యానించారు. -
హసీనా నాలుగోసారి
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా(71) నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలకు గానూ హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయదుందుభి మోగించాయి. తాజా ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు హసీనాకు మార్గం సుగమమైంది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్యూఎఫ్) కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి ఏకంగా 288 స్థానాలు కొల్లగొట్టి ఆ రికార్డును తిరగరాశారు. ఫలితాలను అంగీకరించబోం: విపక్షాలు బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్యూఎఫ్) ఆరోపించింది. ఈ ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఎన్నికలను రద్దుచేసి పారదర్శకంగా, తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) డిమాండ్ చేసింది. మళ్లీ ఎన్నికల ప్రసక్తే లేదు: ఈసీ బంగ్లాదేశ్లో పోలింగ్ సందర్భంగా భారీగా అవకతవకలు, రిగ్గింగ్ చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం చీఫ్(సీఈసీ) కె.ఎం.నూరల్ హుడా ఖండించారు. పోలింగ్కు ముందురోజు రాత్రే చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులు నిండిపోయాయన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నైరుతి గోపాల్గంజ్ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్యూఎఫ్ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయని తెలిపారు. హసీనాకు మోదీ ఫోన్.. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన షేక్ హసీనాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హసీనాకు సోమవారం ఫోన్చేసిన మోదీ.. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ అభివృద్ధి విషయంలో భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏక పార్టీ దిశగా అడుగులు సైనిక కుట్రలో చనిపోకముందు హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ దేశంలో ప్రతిపక్షాలను దెబ్బతీసి ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ముజీబుర్ తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జియావుర్ రెహమాన్, ఎర్షాద్లు సైన్యానికి చెందిన వ్యక్తులు. వీరూ తమ హయాంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోకుండా ప్రయత్నించారు. సైనిక పాలన ముగిశాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ చీఫ్ ఖలీదా వైఖరీ ఇదే. మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రతీసారి అవామీ లీగ్ను అణిచేందుకు యత్నించారు. హసీనా సైతం ప్రజాస్వామ్యం ఉనికిని చెరిపేసేలా వ్యవహరించడం గమనార్హం. ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలు శిక్షపడేలా హసీనా చేశారు. మొదటి నుంచి పెత్తందారీ ధోరణులే! 1996లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలను, పోటీదారులను హసీనా సహించిన దాఖలాలు లేవు. తన ప్రత్యర్థి ఖలీదా బాటలోనే పయనిస్తూ బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఆమె కారకులయ్యారు. బీఎన్పీ మిత్రపక్షమైన ముస్లిం ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు. 1971 యుద్ధ నేరాలపై ఈ సంస్థ నేతలపై విచారణ జరిపించి శిక్షలు అమలు చేశారు. కొందరిని ఉరితీసి, మరి కొందరిని జైళ్లకు పంపారు. జమాతే సంస్థను ఖలీదా వాడుకున్నట్టే మరో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిఫాజుతుల్ ఇస్లాంను హసీనా తనకు అనుగుణం గా వినియోగించుకుంటున్నారు. అవామీలీగ్కు ప్రతిపక్షమే లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె అధికారం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రచయితలను చంపిన వారిని పట్టుకునే విషయంలో హసీనా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నిరుపేద దేశంగా, బలహీన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బంగ్లాదేశ్ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం హసీనా విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, ఆతర్వాత రాజకీయా పరిస్థితుల నేపథ్యంలో హసీనా భారత్తో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. హసీనా చేపట్టిన అభివృద్ధి పనులకు బంగ్లా ప్రజలు పట్టం కట్టారని మోదీ ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే... బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాని హసీనా తీసుకున్న చర్యలే కారణమని ఆమె సన్నిహితులు చెబుతుంటే, ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. హసీనా.. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ కుమార్తె. తూర్పుపాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని తుంగిపరాలో 1947, సెప్టెంబర్ 28న జన్మించారు. ఢాకాలోని ఈడెన్ కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో హసీనా చురుగ్గా పాల్గొనేవారు. 1975, ఆగస్టు 15న ఆమె తండ్రి రెహమాన్, మిగిలిన కుటుంబ సభ్యులను ఆర్మీలోని ఓ వర్గం దాడిచేసి చంపేసింది. విదేశాల్లో ఉండటంతో హసీనా ప్రాణాలతో బతికిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు భారత్లోనే ప్రవాస జీవితం గడిపారు. 1981లో ఆమె అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. బంగ్లాదేశ్లో సైనిక పాలనను పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించడంతో హసీనాకు మద్దతుదారులు క్రమంగా పెరిగారు. ఇదే సమయంలో ఆమెను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ జియా ఖలీదాతో కలిసి హసీనా ప్రజాస్వామ్య పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చివరికి 1990, డిసెంబర్లో అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో సైనిక పాలనకు తెరపడింది. అయితే కాలక్రమంలో హసీనా, ఖలీదా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్ను హసీనా 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జోయ్, కుమార్తె సైమా ఉన్నారు. 2009లో హసీనా భర్త కన్నుమూశారు. హసీనా హయాంలోనే బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
మహాకూటమి ఆశలకు బీఎస్పీ చెక్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసి మహాకూటమిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండికొట్టింది. యూపీలో ఇప్పటికే కాంగ్రెస్ను దూరం చేస్తూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు సీట్ల సర్ధుబాటును పూర్తిచేశాయన్న వార్తలు ఆ పార్టీని నిరుత్సాహానికి లోనుచేశాయి. తాజాగా మధ్యప్రదేశ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తుందని బీఎస్పీ ప్రకటించి కూటమి ఆశలను ఆవిరి చేసింది. మధ్యప్రదేశ్లోని మొత్తం 29 లోక్సభ స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని బీఎస్పీ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసిన క్రమంలో బీఎస్పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా కాంగ్రెస్తో ప్రీ పోల్ అలయన్స్కు తాము సుముఖంగా లేమని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వంటి నేతల తీరుతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు నిజాయితీగా ఉన్నా స్ధానిక నేతల తీరుపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యప్రదేశ్లో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె సహకరించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించిందని ప్రకటించారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో మహాకూటమిలో భాగంగా అధిక సీట్లు కేటాయించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ యాదవ్ తెలిపారు. ఇక మహాకూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించడం సైతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరమే విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తామని పలు పార్టీలు వెల్లడించాయి. కూటమి కష్టాలు ఇలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో ఇప్పటికే భేటీలు జరిపి ఫెడరల్ ఫ్రంట్కు ఓ రూపు, ఊపు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద రానున్న లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ను ఢీ కొట్టేందుకు మహాకూటమి ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. -
కాంగ్రెస్కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
చంద్రబాబును ఏపీ క్షమించదు: నరేంద్ర మోదీ
తిరువళ్లూరు(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్తోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును ఎన్నటికీ క్షమించరని ఆయన విమర్శించారు. ‘నా పోలింగ్ బూత్ బలమైన పోలింగ్ బూత్’ పేరిట ప్రధాని మోదీ ఇటీవల పార్టీ బూత్ కమిటీల సభ్యులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా మోదీ వారికి వివరించారు. అనంతరం కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెబుతూనే, భవిషత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలకు గురి కావద్దన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి విజయం సాధించారన్నారు. అయితే, ఎన్టీఆర్ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆ«ంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించబోరన్నారు. అలాంటి అనైతిక పొత్తులకు బీజేపీ పాకులాడబోదని కార్యకర్తలకు హమీ ఇచ్చారు. ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతున్న నేతలకు స్వలాభం, పదవుల యావ తప్ప మరేమీ లేదని విమర్శించారు. ఈ కూటమి కులీన కుటుంబాల అపవిత్ర కూటమి అని నిప్పులు చెరిగారు. అందులో ఉన్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పోకడలతో భంగపడిన వారేనని అన్నారు. ‘సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలి. కూటమి నేతలు ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన వారే. సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ను అక్రమ కేసులతో కాంగ్రెస్ వేధించింది. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్.. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమీ లేదన్నారు. -
ఎన్టీఆర్ ఆశయాలకు టీడీపీ చెల్లుచీటీ : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ధాపించిన టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు అర్రులు చాస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులుచెరిగారు. విపక్షాలు తమ వ్యక్తిగత, రాజకీయ మనుగడ కోసమే రానున్న లోక్సభ ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ధ్వజమెత్తారు. మహాకూటమిని రాజవంశీకుల కూటమిగా ప్రధాని అభివర్ణించారు.ఈ పార్టీలు అధికారం కోసం అపవిత్ర కలయికకు పూనుకున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం తమిళనాడుకు చెందిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో కొన్ని పార్టీలు తమకు సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా ఆదర్శమని చెప్పుకుంటున్నాయని, అయితే తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్వయంగా రామ్ మనోహర్ లోహియా వెల్లడించారన్నారు. మహాకూటమి ప్రతిపాదన కేవలం వ్యక్తుల మనుగడ కోసమేనని, సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటయ్యేది కాదని మోదీ ఆరోపించారు. ఈ కూటమి ప్రజల కోసం కాదని అధికారం కోసమని, ప్రజా ఆకాంక్షల కోసం కాకుండా వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. మహాకూటమిలో పలు పార్టీల నేతలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు మహాకూటమితో ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
యూపీలో కాంగ్రెస్కు షాకిచ్చిన ఎస్పీ, బీఎస్పీ
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో కీలక రాష్ట్రమైన యూపీలో విపక్షాల పొత్తులు ఉత్కంఠ రేపుతున్నాయి. విపక్ష కూటమికి పెద్దన్నగా వ్యవహరించే కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడి సీట్ల పంపకం కసరత్తును కొలిక్కితెచ్చాయని చెబుతున్నారు. సీట్ల సర్ధుబాటుపై కసరత్తును పూర్తిచేసిన ఎస్పీ, బీఎస్పీలు ఇక దీనిపై ప్రకటన చేయడం లాంఛనప్రాయమేనని భావిస్తున్నారు. తక్కువ స్ధానాలతో సరిపెట్టుకుంటామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొనడంతో సీట్ల సర్దుబాటు సులభంగా పూర్తయిందని ఇరు పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్పీ కంటే ఒకటి రెండు స్ధానాల్లో అధికంగా బీఎస్పీ బరిలో ఉండేలా సీట్ల పంపకం జరిగిందని చెబుతున్నారు. కాగా, 39 స్ధానాల్లో బీఎస్పీ, 37 స్ధానాల్లో ఎస్పీ, రెండు స్ధానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు ఖరారైనట్టు సమాచారం. కాంగ్రెస్ కూటమిలో ఉన్నా, లేకున్నా అమేథి, రాయ్బరేలి స్ధానాలను కాంగ్రెస్కు వదిలివేసి మిగిలిన సీట్లలో సర్ధుబాటు పూర్తయిందని తెలిసింది. కూటమి ఏర్పాటు పూర్తయిందని, సీట్ల సర్ధుబాటును వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రకటిస్తామని ఎస్పీ ప్రతినిధి సునీల్ సజన్ వెల్లడించారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తేనే మహాకూటమికి అనుకూలమని ఎస్పీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. మరోవైపు యూపీలో ఈ తరహా పొత్తులపై కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. -
టీడీపీతో పొత్తు వల్లే ఘోరంగా ఓడాం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు... టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు అంశం కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీతో మైత్రి అంటే... తెలంగాణలో మనుగడ సాగించలేమని, పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడతాయని సీనియర్లు అంటు న్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలుసునని, తరువాత ఎన్నికలకు వ్యూహం ఎలా ఉండాలన్నది కూడా వారికి తెలియదని అనుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ పొత్తే మమ్మల్ని ముంచింది... అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని సమీక్షించుకుం టున్న టీపీసీసీ ముఖ్యులు టీడీపీతో పొత్తు తమ పుట్టి ముంచిందనే నిర్ధారణకు వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమపై ఉన్న సానుభూతి కూడా బాబుతో పొత్తు తర్వాత ఆగ్రహంగా మారిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని వారంటున్నారు. హైదరాబాద్ను తానే కట్టానని ఓసారి, తాను చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందని మరోసారి చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు... తన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం మాత్రం మర్చిపోయారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతోపాటు కూటమిలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినట్లు బహిర్గతం కావడమే తమ కొంప ముంచిందని వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రమేయాన్ని అంగీకరించే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదని ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమైందని, అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ వరకైనా టీడీపీతో పొత్తు నుంచి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు. ‘మంచో చెడో ఓసారి పొత్తు పెట్టుకున్నాం. దాని పర్యవసానాలు అనుభవించాం. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది’అని టీపీసీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పట్టణ ఓట్లూ గల్లంతు... టీఆర్ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సానుకూలత మొదటి నుంచి కనిపించినా, పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, ఉద్యోగ వర్గాలు తమవైపే ఉన్నారని ఎన్నికల ముందు వరకు ధీమాగా ఉన్నారు. ఈ ఓట్లు తమ విజయాన్ని సులభతరం చేస్తాయని ఆశించారు. కానీ చంద్రబాబు ప్రవేశంతోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి, యువత, ఉద్యోగ వర్గాలకు ఆ సమయంలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర గుర్తుకు వచ్చిందని... దీంతో ఉన్నట్లుండి తమవైపు నుంచి ప్రత్యామ్నాయం వైపు వారి ఆలోచన మళ్లిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుగా భావించిన వర్గాలన్నీ అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఎంచుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇక పల్లె ప్రాంతాల్లో అక్కడో, ఇక్కడో ఓట్లు లభిస్తాయని ఆశించినా చంద్రబాబు మళ్లీ వస్తున్నాడన్న టీఆర్ఎస్ ప్రచారం ఆ ఓట్లను కూడా గల్లంతు చేసిందని విశ్లేషిస్తున్నారు. బాబు రాక పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా, గ్రామీణ ప్రాంతాల్లో పాక్షికంగా తమ ఓటు బ్యాంకుకు నష్టం చేసిందనే అంచనాకు కాంగ్రెస్ వర్గాలు వచ్చాయి. ‘టీడీపీతో పొత్తు కారణంగా అర్బన్లో మేము బాగా దెబ్బతిన్నాం. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాలపైనా పడింది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. పొత్తు కొనసాగితే పోటీ చేయలేం... ఎన్నికల ఫలితాలు కొట్టిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ భవిష్యత్తుపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే లోక్సభ బరిలో దిగి పార్టీతోపాటు తమ సత్తా చాటాలనే నిర్ణయానికి వస్తున్నారు. అయితే అది కూడా టీడీపీతో పొత్తు వదిలితేనే తాము పోటీకి సిద్ధమవుతామనే మెలిక పెడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం మారకపోతే తాము ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని, టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్టను నష్టపోవడంకన్నా పోటీలో ఉండకుండా ఉండటమే మేలని, అనివార్యంగా పోటీలో ఉండాల్సిన పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొందరు నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా మరికొందరు అంతర్గత సమీక్షల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ‘శాసనసభ ఎన్నికల ఫలితాలు సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ‘పచ్చ’పార్టీని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయంపైనే చర్చ జరుగుతోంది. ‘టీడీపీతో పొత్తు కొనసాగితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనేక మంది పార్టీని వీడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అధిష్షానం సముచితమైన రీతిలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది’అని మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. -
గుట్టు తేల్చబోతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి.. హైదరాబాద్ గోషామహల్కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు. బాబు కోటరీయేనా? మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్లో ఉన్న కీర్తికుమార్ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
బాబుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు
కిర్లంపూడి(జగ్గంపేట): ‘‘సీఎం చంద్రబాబు ఒక గజదొంగ. రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నాడు. అది చాలక తెలంగాణలో ఉన్న వనరులను, ఆస్తులను కబళించి కబ్జా చేయాలని మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో వేలు పెట్టాడు. చంద్రబాబును కోలుకోలేని దెబ్బకొట్టి వెనక్కు పంపించిన తెలంగాణ ప్రజల చైతన్యానికిదే నా నమస్కారాలు’’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో జేఏసీ నాయకులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. లగడపాటితో గరుడ పురాణం చెప్పించి ప్రజల ఆస్తులను పందేల రూపంలో తగలేయించిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని ఆ దేవుడే కాపాడారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లోనూ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అప్పుడే రాష్ట్రానికి దరిద్రం వదిలిపోతుందని అన్నారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రానిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడన్నారు. తమ జాతికిచ్చిన హామీపై ప్రతిసారీ రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదంటూ వంకలు చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు చట్టాలు, రూల్స్ వంటివి గుర్తుకొస్తాయి కానీ.. మీ కుమారుడి విషయంలో అవి ఎందుకు వర్తించవని నిలదీశారు. ఇలాంటి గజదొంగ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ఈనెల 23న 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులతో సమావేశమై వారి సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, జీవీ రమణ, గౌతుస్వామి, శ్రీరామ్ పాల్గొన్నారు. -
కూటమికి చంద్ర'గ్రహణమే'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తేరుకోలేకపోతోంది. ‘అంతా బాగుందన్న పరి స్థితుల్లో.. ఎక్కడ దెబ్బతిన్నాం?’ అన్న ప్రశ్నే వారికి తొలిచివేస్తోంది. ‘ఎవరైనా ఓడించారా? ఒక తప్పుడు నిర్ణయంతో మనల్ని మనమే ఓడించుకున్నామా?’ అనే అంతర్మథనం సాగుతోంది. గట్టి పోటీ ఇవ్వడం నుంచి.. ఒక దశలో గెలుస్తామని భావించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినడమే వారి షాక్కి ప్రధాన కారణం. అయిదో వంతు కూడా రాని సీట్లతో.. సంఖ్యా పరంగానే కాకుండా ఎలా చూసినా ఇది మింగుడు పడని ఓటమే! ప్రాంతాలుగా గమ నించినా, జిల్లాలుగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా... ప్రజా కూటమిది మహాఓటమి. పాలకపక్షం టీఆర్ఎస్ జోరుకు విపక్ష కూటమి కకావికలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాల అన్వేషణ మొదలైంది. కూటమిని బలోపేతం చేస్తుందనుకున్న తెలుగుదేశంతో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర తమను నిలువునా ముంచిందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నా.. వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్ మహానగర్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం టు శేరిలింగంపల్లి ఆయన కట్టానని చెప్పుకున్న ‘సైబరాబాద్’ లోని సైబర్టవర్స్ ఉన్న శేరిలింగంపల్లితో సహా.. బాబు రోడ్షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అంతటా ఓటమే. ఇలాం టిదేదో జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్లోనూ కొందరికి ముందు నుంచే ఉంది. కానీ, బహిరంగంగా చెప్పలేక పోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి, రాహుల్గాంధీనే చంద్రబాబు బుట్టలో పడేయ డంతో.. కింది స్థాయిలో వ్యతిరే కత ఉన్నా బయ టకు చెప్పలేకపోయారు. టీడీపీతో మనం జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతా మనే బల మైన అభిప్రాయముండి కూడా తామేమీ చేయలేక పోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమౌతోంది. ముఖ్య నేతలు ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశలోకి నెట్టింది. బాబొక చెల్లని రూపాయి సమకాలీన రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిగా చంద్రబాబుకున్న పేరు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు వచ్చిన సానుకూలతను, కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసింది. ‘ఇంకా బాబు పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే’ అనే నిర్లిప్తత తెలంగాణ సగటు పౌరుల్లో ఈ పొత్తుతోనే మొదలైంది. బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్ ఉత్సా హంతో ఉన్న సమయంలో.. టీడీపీ వారితో జట్టు కట్టింది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయింది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, బద్ధ వ్యతిరేకులతో కలవడం ద్వారా కూటమికి ప్రచారం వచ్చినా.. ప్రతి కూలించిన అంశాలే ఎక్కువ. నిర్దిష్టంగా కాంగ్రెస్ను తిట్ట డానికి ఏమీ లేని స్థితిలో కేసీఆర్కు చంద్రబాబు ఒక గొప్ప అవకాశంలా దొరి కారు. తన ప్రసంగాల్లోనూ సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ‘బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు’, ‘కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండ’ంటూ కేసిఆర్ వేసిన ప్రశ్న జనంలో ఆలోచనల్ని రేకెత్తించింది. పరాకాష్టకు చేరింది.. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా విమర్శల నెదుర్కొంటున్న బాబుతో చేతులు కలపడం వల్లే కాంగ్రెస్ అవకాశాలు మరింత సన్నగిల్లాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, హైదరాబాద్ను తానే ప్రపంచ పటంలోకి తెచ్చానని, సైబర్సిటీ కట్టానని, చివరకు దివంగత సీఎం వైఎస్సార్ ఆలోచన అయిన ఔటర్ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పరాకాష్ట. ఏపీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని పార్టీ మార్పించి, అందులో కొందరికి మంత్రిపదవులిచ్చి ఎన్ని విమర్శలొచ్చినా కిమ్మనని బాబు, ఇక్కడ అలా పార్టీ మారినవారందరినీ ఓడించమని పిలుపునివ్వడం చూసి ప్రజలు కేసీఆర్ ఆరోపణల్ని గట్టిగా నమ్మి కూటమిని తిరస్కరించారు. ఒకటొకటిగా బయటపడ్డ కుట్రలు.. ‘ఏపీలో వ్యవస్థల్ని కుప్పకూల్చి, ప్రజల్ని వంచించి దోచుకొచ్చిన రూ. వందల కోట్ల ధనాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ ఇక్కడి అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అది నిజమే అనిపించేలా, ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తున్నట్టు, ప్రచారానికి హెలికాప్టర్లనూ తమ నేతే సమకూరుస్తున్నట్టు, కాంగ్రెస్లో కొందరు అభ్యర్థుల్నీ.. బాబే ఖరారు చేస్తు న్నట్టు ఆయన వర్గీయులు, అనుకూల మీడియా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వపు ఒంటెత్తుపోకడ నచ్చక, కాంగ్రెస్ వైపు ఏకీకృతం కావాలని భావించిన ఒకట్రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా బాబు ‘ఆధిపత్యం’ కారణంగా.. కూటమికి దూరమయ్యారు. సర్వేల పేరుతో కొందరు చేసిన నానా యాగీ, బాబుకు అనుకూలంగా పనిచేసే కొన్ని ప్రసారమాధ్యమాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజాక్షేత్రంలో సృష్టించిన ‘అయోమయం’ కాంగ్రెస్ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించింది. నందమూరి వంశీయుల్ని తన ఎదుగుదలకు వాడుకునే తత్వంతో చంద్రబాబు వేసిన ఓ చౌకబారు ఎత్తుగడ కూడా ఫలించలేదు. -
కూటమిని ఒక్కటిగా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న (హంగ్) అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లతో కూడిన ప్రజాకూటమి నేతలంతా సోమవారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. ఎన్నికలకు ముందే తాము ప్రజాకూటమి (పీపుల్స్ ఫ్రంట్)గా ఏర్పడినందున కూటమిపక్షాలను ఒకే జట్టుగా చూడాలని విన్నవించారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే తమ నాలుగు పార్టీలకు కలిపి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డితోపాటు కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, అజహరుద్దీన్, సంపత్కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్రెడ్డి, మండవ వెంకటేశ్వర్రావులతోపాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు గవర్నర్ను కలిశారు. ఎన్నికలకు ముందే ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన లేఖను అందజేశారు. ‘ఎన్నికలకు ముందే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. దీంతోపాటే కామన్ ఎజెండాను ఈసీకి సమర్పించిన కాపీని మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల్లో గెలిస్తే కూటమి సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.. కలసి పనిచేస్తుంది. ఈ అంశాన్ని మీ పరిశీలన, సమాచారం నిమిత్తం తెలియజేస్తున్నాం’ అని లేఖలో నేతలు పేర్కొన్నారు. లేఖతోపాటు ప్రజాకూటమి ఏర్పాటు, కామన్ మినిమం ప్రోగ్రాం, కొత్త ప్రభుత్వంలో ఫ్రంట్లోని పక్షాలకు న్యాయమైన భాగస్వామ్యం వంటి అంశాలపై గతంలో పార్టీలు చేసిన తీర్మాన కాపీలను గవర్నర్కు అందజేశారు. 80 సీట్లు మావే: ఉత్తమ్ గవర్నర్తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కూటమికి 80 స్థానాలు దక్కే అవకాశం ఉందని, అయినా ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగానే నరసింహన్ను కలిశామని స్పష్టం చేశారు. ‘ఎన్నికల ఫలితాలు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏ పార్టీని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డ కూటమిని ఒక్కటిగా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎన్నికలకు ముందే జట్టుగా కలసి పోటీ చేశాయి. ఆ డాక్యుమెంట్, కామన్ ఎజెం డాను గవర్నర్కు అందజేశాం. పెద్ద పార్టీని ప్రభు త్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే కూటమికి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించాలని చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు ఇతర పార్టీలతో కలిసే అవకాశం ఉందని, అయితే ఎన్నికలకు ముందు కలిసిన పార్టీలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరామన్నారు. -
ఆ ఓటు ఎవరిది?
-
మరో 24 గంటలు తప్పని ఉత్కంఠ
-
కూటమి ఓట్ల బదిలీ జరిగిందా?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇంతకాలం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగిన నేతలకు ఇపుడు కొత్త భయం వచ్చిపడింది. అధికార పార్టీని ఓడించడానికి ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి.. కూటమికి చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య అవగాహనతో ఎన్నికలకు వెళ్లాయి. అయితే.. ఈ అవగాహన క్షేత్రస్థాయిలో ఇరు పక్షాల్లో ఓట్లను బదిలీ చేసేందుకు ప్రభావితం చేసిందా అనేదే టీఆర్ఎస్, కాంగ్రెస్లను కలవరపెడుతోంది. ఓటరునాడి అర్థం అసలేమాత్రం అందకపోవడంతో.. ఫలితాలు వెల్లడయ్యే దాకా ఈ ఉత్కంఠ తప్పేట్లు లేదు. కూటమిలో టీజేఎస్కే అధిక భయం కాంగ్రెస్తో జతకలిసిన కోదండరాం పార్టీ టీజేఎస్కు కూటమి పార్టీల ఓట్ల బదిలీయే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పార్టీ పోటీ చేసిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ ఓట్లు బదిలీ అవుతాయా అన్న విషయంపై.. టీజేఎస్కూ అనుమానాలున్నాయి. మరోవైపు 14 స్థానాలకు పోటీ చేస్తానన్న టీడీపీ పటాన్చెరును కాంగ్రెస్కే వదిలేసింది. ఇబ్రహీంపట్నం టికెట్ను టీడీపీ తీసుకున్నా.. ఇక్కడ కాంగ్రెస్ రెబెల్ మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. పోలింగ్కు ఒక్కరోజు ముందు రంగారెడ్డికి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్న సామ రంగారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా ఓట్లు చీలిపోతాయన్న భయంతో కూటమి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖమ్మం, రంగారెడ్డికి మాత్రమే పరిమితం చేశారు. అధికార పక్షానికీ హడలే! పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికార టీఆర్ఎస్ కూడా ఓటు బదిలీపై ఆందోళనగానే ఉంది. టీఆర్ఎస్కే ఓటేయాలని అసదుద్దీన్ ముస్లింలకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో ఓటు బదిలీపై టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. అయితే.. ఈ ఓట్లు నిజంగానే తమకు బదిలీ అయ్యాయా అన్న కంగారు అధికార పార్టీలో కనబడుతోంది. రాజేంద్రనగర్లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నాయి. పాతబస్తీలో నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేసినా.. వీరి ఓట్లు కూడా మజ్లిస్ను కలవరపెడుతున్నాయి. చీలికపైనే బీజేపీ ఆశలు! ఈసారి నగరంలో ఉన్న 5 స్థానాలకు తోడుగా జిల్లాల నుంచి మరో 7 స్థానాలపై బీజేపీ కన్నేసింది. తాము లేకుండా రాబోయే ప్రభుత్వం ఏర్పడదంటూ చెప్పుకుంటున్న పార్టీ.. ఓట్ల చీలికపై గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ (అర్బన్), కల్వకుర్తి, మహబూబ్నగర్, భూపాలపల్లి, చొప్పదండి, రాజేంద్రనగర్లలో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రజాకూటమి, అధికార పక్షాల ఓట్లు చీలిపోగా.. ఈ స్థానాల్లో తమకున్న ప్రాబల్యంతో ఈసారి డబుల్ డిజిట్ చేరుకుంటామని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. ఈసారి 12 స్థానాల్లో గెలుస్తామని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీరాని పక్షంలో తామే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని ధీమాగా చెబుతోంది. -
పెరిగిన ఓటు ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఊహించని రీతిలో పెరిగిన పోలింగ్ శాతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 103 నియోజకవర్గాల్లో గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఆ ఓట్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం పెరుగుదల తమకంటే తమకే అనుకూలమని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్ఎస్ చెబుతోంది. అయితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. మరోవైపు బీజేపీ ఇతర చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉన్నందున టీఆర్ఎస్కే లబ్ధి కలగొచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే దీనిపై ఏ పార్టీకి స్పష్టత రావడం లేదు. అయితే ఎగ్జిట్పోల్స్ అంచనాల నేపథ్యంలో కొన్ని లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే సంస్థలు, వివిధ జాతీయ చానళ్లు జరిపిన సర్వేల ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సగటు తీసిన సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ.. కేసీఆర్కు 66 సీట్లు రావొచ్చని పేర్కొంది. విచిత్రంగా కేసీఆర్ లక్కీ నంబరు 6. దీంతో కేసీఆర్కు డబుల్ లక్కీ ఫిగర్ వస్తుందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇవీ టీఆర్ఎస్ లెక్కలు పెరిగిన పోలింగ్ శాతంపై టీఆర్ఎస్ విశ్లేషణను పరిశీలిస్తే.. రైతులు, రైతు కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తోంది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల లబ్ధిదారులంతా మూకుమ్మడిగా ప్రభుత్వానికి బాసటగా నిలిచారంటోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులకు తగినంత సమయం దొరికింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పాటు వారి బంధువులను సైతం ఆకట్టుకునే రీతిలో వీరి ప్రచారం సాగింది. గ్రామ గ్రామాన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను తెప్పించుకుని వారిని ప్రత్యక్షంగా కలిసి ఓట్లడిగేందుకు మూడు నెలల సమయం దొరకడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు సఫలీకృతయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పోలింగ్ పూర్తిగా తమకు అనుకూలంగానే జరిగిందనే ధీమాలో గులాబీదళం ఉంది. ఇక.. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావన ఎన్నికల ముందు కనిపించినప్పటికీ పోలింగ్ సమయానికి వివిధ కారణాలతో కొంత అనుకూలంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంమీద పోలింగ్ తమ పక్షానే జరిగిందని, మంగళవారం ఇదే నిర్ధారణ అవుతుందని కేసీఆర్తో సహా ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అది వ్యతిరేక ఓటే: కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే పెరిగిన ఓటింగ్ రూపంలో బయటపడిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. తెలంగాణ ఉద్యమ నినాదమైన నియామకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీంతో నిరుద్యోగ యువత పూర్తిగా తమకే ఓటేసిందని అంచనా వేస్తోంది. ఎన్నికలకు ముందు ఉద్యోగులు కూడా బహిరంగంగానే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడారని, విద్యావంతులకు కూడా ప్రభుత్వంపై సదాభిప్రాయం లేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఐక్యత కారణంగా కూడా పోలింగ్ ఎక్కువగా జరిగిందని, అన్ని పార్టీలు తమ కార్యకర్తల చేత ఓట్లు వేయించడంలో విజయవంతమైనందునే పోలింగ్ శాతం పెరిగిందని కూటమి అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలు, తమ మేనిఫెస్టో, కూటమి స్ఫూర్తి వెరసి.. ఓటింగ్ పెరుగుదలకు కారణమైందని ధీమా వ్యక్తం చేస్తోంది. త్రిముఖ పోటీ ఉన్నచోట.. టీఆర్ఎస్, కూటమితో పాటు బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రుల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. బోథ్, నిజామాబాద్ (అర్బన్), రామగుండం, చొప్పదండి, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, మేడ్చల్, నారాయణ్పేట, మహబూబ్నగర్, దేవరకొండ, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, వరంగల్ (ఈస్ట్), భద్రాచలం స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడంతో ఇక్కడ ప్రజాతీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బలమైన నేతలే పోటీదారులు ఉండడంతో ఎవరికి వారే తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాల కారణంగానే పోలింగ్ పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు.. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మధ్య చీలిపోయి అది టీఆర్ఎస్కు మేలు జరుగుతుందని విశ్లేషకులంటున్నారు. ఇక, బీజేపీ ప్రధాన పోటీలో ఉన్న నియోజకవర్గాలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ గణనీయంగా ఓట్లు చీల్చగలిగితే ఆ ప్రభావం కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. 10% కన్నా ఎక్కువే! పోలింగ్ శాతం ఏ నియోజకవర్గంలో ఏమేరకు పెరిగిందనే లెక్కల ఆధారంగా చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే 10% కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఇందులో పట్టణ నేపథ్యం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్, నల్లగొండ వంటి నియోజకవర్గాలతో పాటు పూర్తిగా గ్రామీణ ఓటర్లుండే కొడంగల్, నారాయణ్పేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, అచ్చంపేట వంటి స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా 17.8% పోలింగ్ పెరగడంతో ప్రజాపల్స్ను ఊహించడం రాజకీయ పార్టీల తరం కావడం లేదు. గత ఎన్నికల కన్నా సుమారు 35వేల ఓట్లు ఇక్కడ అధికంగా పోల్కావడంతో ఈ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయనేదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆ 41 నియోజకవర్గాల్లో.. 7% కన్నా ఎక్కువ పోలింగ్ 41 నియోజకవర్గాల్లో నమోదైంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), కోరుట్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్, మెదక్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కొడంగల్, నారాయణ్పేట, మహబూబ్నగర్, మక్తల్, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, షాద్నగర్, కొల్లాపూర్, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, స్టేషన్ ఘన్పూర్, కొత్తగూడెం స్థానాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే కనీసం 15వేలు ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో ఈ 41 స్థానాల్లో ఫలితాలే ప్రభుత్వంలో ఎవరుండాలని నిర్ణయిస్తాయని విశ్లేషకులంటున్నారు. -
రేపే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: నరాలుతెగే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటరు తన మనోభీష్టాన్ని దాచిన ఈవీఎంలు మంగళవారం తెరుచుకోనున్నాయి. విజయంపై అన్ని పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో టెన్షన్ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్య ర్థులతో పాటు కార్యకర్తలకు ఈ 24 గంటలు క్షణమొక యుగంలా మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో 69.5% మాత్రమే పోలింగ్ జరగగా, ఈసారి రికార్డు స్థాయిలో 73.2 శాతానికి పోలింగ్ పెరగడంపై సరైన అంచనాలు అంద డం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్లో ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమిం చనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇవ్వగా.. సోమవారం రెండో విడత శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌటింగ్ ఏజెంట్ను లెక్కింపు కేంద్రంలోపలకు అనుమతించనున్నారు. ఉదయం 8.30 నుంచి ఫలితాలు షురూ! ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటి కప్పుడు రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వీసు, పోస్టల్ బ్యాలెట్ను లెక్కించి తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. బ్యాలెట్ యూనిట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసి రిజల్ట్ మీటను నొక్కగానే సంబంధిత పోలింగ్ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది స్క్రీన్ మీద కనిపించనుంది. లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థుల ఏజెంట్లు తమకు అప్పగించిన దరఖాస్తుల్లో ఓట్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత సంబంధిత రౌండ్కు సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు. నాలుగైదు రౌండ్ల ఫలితాల సరళి ఆధారంగా ఉదయం 9.30 గంటల సమయానికే చాలాచోట్ల గెలుపోటములపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశముంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరుసగా ఒక్కో నియోజకవర్గం ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు బహిర్గతం కానున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలబడిన 1,821 అభ్యర్థుల్లో 119 మంది విజేతలెవరో తేలిపోనుంది. సీసీ టీవీ కెమెరాల నిఘాలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందన్న కూటమి నేతల అనుమానాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద సంబంధిత నాయకులు కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకులలోని స్ట్రాంగ్రూమ్లో 8 నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపర్చారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో వాహనాలు తనిఖీ చేసి పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. రెండో అంచెలో 500 మీటర్ల వరకు కేంద్రం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు గస్తీ కాస్తున్నాయి. మూడో అంచెలో సీసీ కెమెరాలు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. సుమారు వెయ్యి మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అనుమతితో ప్రజాకూటమి బృందాలు ఇక్కడ శనివారం సాయంత్రం నుంచి కాపలాగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి, పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్ రూంలు ఉన్న కేంద్రంపై నిఘా పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన పాసులతో రావాల్సి ఉంటుంది. సెల్ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతించరని.. కేవలం పాసులు ఉన్న వారినే లోనికి పంపిస్తారని అధికారులు వెల్లడించారు. -
టెన్షన్.. టెన్షన్.. కూటమిలో తీసి‘వెత’లు
సాక్షి, హైదరాబాద్: గెలిచేదెవరు... ఓడేదెవరు. అధికారం ఎవరికి, ప్రతిపక్షంలో ఎవరుంటారు? వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్ధుల్లోనే కాదు. సాధారణ ప్రజానీకంలోనూ ఇదే చర్చ. ఒకవైపు ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై నగరంలో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికలే చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు అభ్యర్థులు సైతం తమ తప్పొప్పులను, బలాబలాలను సమీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్లో నమోదైన ఓట్లను అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందనే అంశంపైన బూత్స్థాయి కార్యకర్తలతో జరుపుతున్న సంప్రదింపులు తారాస్థాయికి చేరాయి. ఫలితాలు వెలువడేందుకు మరో రెండు రోజుల గడువు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల పాటు ఒక్కో అభ్యర్ధి తన నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో కాలనీలు, బస్తీల వారీగా తమకు పట్టున్న ప్రాంతాలను, నమోదయ్యేందుకు అవకాశం ఉన్న ఓట్లను అంచనా వేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడం, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు బాగా ఆదరణ, పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్లు గల్లంతైపోవడంతో గెలుపుపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు, ప్రచార కార్యక్రమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. యథావిధిగా పోలింగ్ శాతం చాలా తక్కువగానే నమోదైంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ పోలింగ్ ఏ పార్టీలకు పట్టం కట్టగలదనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్లోని 24 నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు తమ గెలుపుపైన స్పష్టమైన ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అంతర్మథనంలో పడిపోయారు. కూటమిలో తీసి‘వెత’లు... ఉప్పల్ స్వరూప్నగర్కు చెందిన ఒక పోలింగ్ బూత్ వద్ద ఓ మహిళ తనకు నచ్చిన హస్తం గుర్తు కనిపించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అక్కడ ప్రజాకూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలనుకున్నవాళ్లు సైకిల్పై వేయాలి. కానీ ఆ మహిళ చేతి గుర్తుకు తప్ప మరో గుర్తుకు ఓటు వేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. ఒక్క ఉప్పల్లోనే కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపోటములపైన ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనుకున్న వాళ్లకు చేయి గుర్తు మాత్రమే కనిపించడం, కొన్ని చోట్ల టీజేఎస్ గుర్తు కనిపించడంతో ఓటర్లలో విముఖత వ్యక్తమైంది. ఇక ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు వెనుకడుగు వేశారు. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...) అలాగే తెలుగుదేశం వాళ్లు కూడా కాంగ్రెస్కు మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేకపోయారు. పై స్థాయిలో కూటమి పటిష్టంగానే ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ల స్థాయిలో ఈ లోపం ప్రస్ఫుటమైంది. టీజేఎస్కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఏ ఓటు ఏ అభ్యర్ధికి పడిందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితులన్నింటిపైనా అభ్యర్థులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్లోనే ఇదే తరహా అంతర్మథనం కొనసాగుతోంది. ప్రత్యర్ధులతో తాము పోటీపడగలిగామా లేదా అనే అంశంతో పాటు, ఆశించిన ఓట్లు తమ ఖాతాలోనే పడతాయా లేక, ప్రత్యర్థుల ఖాతాలో చేరతాయా అనే దిశగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్కంఠ ఇలాగే ఉండనుంది. ఓటు జారి గల్లంతయిందే.... గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతైపోవడం రాజకీయ పార్టీలకు ఆశనిపాతంగా మారింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్పురా, తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వరకు తరలివచ్చిన ఓటర్లు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు లక్షలాది మంది నగరవాసులు తమ సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్లారు. దీంతో అనేక చోట్ల అభ్యర్ధుల అంచనాలు తలకిందులయ్యాయి. కలిసొస్తాయనుకునున్న కాలనీలు, బస్తీల్లో ఓట్లు గల్లంతైపోవడం, కాదనుకున్న చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు నమోదుకావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులను ఆందోళనకు గురి చేసింది. దీంతో తాజాగా ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. వాటిలో తమకు దక్కేవెన్ని అనే కోణంలో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు తమ ప్రచార తీరుతెన్నులను సైతం సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థులతో ధీటుగా తమ ప్రచారం కొనసాగిందీ లేనిదీ కార్యకర్తలతో కలిసి చర్చిస్తున్నారు.లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అన్ని పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
ఎన్ని'కల' పందెం కాస్కో..!
సాక్షి, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 11న వెలువడే ఫలితాలపై రూ.లక్షల బెట్టింగ్ నడుస్తోంది. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్పోల్ సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా, ఒక్క లగడపాటి ఎగ్జిట్పోల్ సర్వే మాత్రం మహాకూటమికి సానుకూలంగా ఉందని చెప్పడం అందరిలోనూ ఉత్కంఠ రేపింది. గతంలో జరిపిన లగడపాటి సర్వేలు చాలా మేరకు విజయవంతమవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అలజడి నెలకొంది. దీంతో నేషనల్ ఎగ్జిట్పోల్స్పై నమ్మకం ఉంచుతూ కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో బెట్టింగు రాయుళ్లు సైతం ఫుల్ జోష్లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులకు మించిన స్థాయిలో ఓటింగ్ జరిగిన తీరునూ అంచనా వేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంతో పాటు దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పాటు మదనాపురం, మూసాపేట వంటి మారుమూల ప్రాంతాలకు ఈ జాఢ్యం అంటుకుంది. ఈ క్రమంలో కొందరు లాభపడటం.. మరికొందరు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితాలపై బెట్టింగ్ల తీరు ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు పందెం కాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. మహాకూటమి వస్తుందా.. లేక హంగ్ ఏర్పడనుందా.. అంటూ పందెం కాస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా.. లేక మహాకూటమి అభ్యర్థి గెలుస్తాడా.. బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారు. ఇవీ కాకుండా బెట్టింగ్ రాయళ్లు ఇంకొంచెం ముందుకెళ్లి ఆయా పట్టణాల్లో తమ నాయకుడికే అత్యధిక ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ మండలం ఎవరికి ఎంత లీడ్ ఇస్తుందో చెబుతున్నారు. పల్లెల్లో బెట్టింగ్ భూతం ఎన్నికలకు ముందు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో బెట్టింగ్ కాసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు, లగడపాటి సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో బెట్టింగ్ల స్థాయి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో ఆయా మండలాల్లో కీలక నేతలు ఉండే గ్రామాల్లో కార్యకర్తల బెట్టింగ్ల జోరు ఊపందుకుంది. బెటింగ్ రాయుళ్ల ఆశలు నెరవేరాలంటే ఈనెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. స్వేహపూర్వకంగా గెలుపోటములు ఏ పోటీలోనైనా గెలుపోటములు స్వేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని కొట్లాటలు, పోట్లాట వరకు వెళ్లకూడదు. ఫలితాలపై ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ ఈ నెపంతో పందెం కాసి డబ్బు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆయా పార్టీల వారిలో ఎవరి ధీమా వారికే ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేస్తున్నారు. వారి నాడి ఎవరికి అంతుచిక్కడం లేదు. – రవికాంత్రావు, ఎస్ఐ, కొత్తకోట -
మేమే.. కాదు మేము ! గెలుపుపై ఎవరి ధీమా వారిదే...
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రజలను అత్యంత ఆసక్తి, ఉత్కంఠతకు గురి చేస్తోంది. ముందస్తు రూపంలో వచ్చిన శాసనసభ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...పోలింగ్ జరిగే వరకు కూడా హోరాహోరీగా ప్రచారం సాగింది. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ జరగడం అన్ని రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. జిల్లాలో సరాసరిగా 79.7 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరికి వారు ఈ భారీ పోలింగ్ తమకే అనుకూలమంటూ పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే, పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ ఛానెళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ నివేదికలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇలా మొత్తం మీద తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్న పోలింగ్, 11వ తేదీన వెలువడనున్న ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీల మధ్య... ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల మీద హోరాహోరీ బెట్టింగ్ కొనసాగుతోంది. చర్చంతా భారీ పోలింగ్పైనే.. పాలమూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎక్కడా కూడా 70శాతానికి తగ్గకుండా పోలింగ్ జరిగింది. అంతేకాదు ఉమ్మడి జిల్లాలోనే దేవరకద్ర అత్యధికంగా 84.6 శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువ పోలింగ్ కూడా 73.5 శాతం మహబూబ్నగర్ నియోజకవర్గంలో నమోదు కావడం విశేసం. భారీ పోలింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నడుమ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ప్రజలు భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చని కారణంగా ప్రభుత్వంపై కోపంతో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని ప్రజాఫ్రంట్, ఇతర పార్టీల నేతలు పేర్కొంటున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ నుంచి మాత్రం ఇందుకు భిన్నమైన సమాధానం వస్తోంది. ఓటింగ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరగడం.. ప్రజలందరూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై సంతృప్తిగా ఉండడంతోనే ఇలా జరిగిందని ఉన్నారని పేర్కొంటుంది. ముఖ్యంగా వృద్దాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఆయా వర్గాల ఓట్లు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెబుతున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్, ప్రజాఫ్రంట్ పార్టీలకు చెందిన నేతలు పోలింగ్ సరళిని ఎవరికి వారు అనుకూలంగా భావిస్తున్నారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి ఎన్నికల ఫలితాల విషయంలో ఈసారి రాష్ట్రం మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. ఈ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం కావడంతో.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడంతో దృష్టి మొత్తం పాలమూరు మీదే ఉంది. టీఆర్ఎస్ కూడా ఈసారి పాలమూరు అత్యధిక స్థానాలు గెలవబోతున్నా మని ఘంటా పథకంగా చెబుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ జిల్లాలో జరిగిన ప్రతీ సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాకు టీఆర్ఎస్ హయాంలోనే లబ్ధి జరిగిందని పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు టీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీశ్రావు, కేటీఆర్ కూడా పలుమార్లు జిల్లా పర్యటనలు చేసి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్లోని ముఖ్యనేతలు డీకే.అరుణ, రేవంత్ రెడ్డిని కూడా ఈసారి ఓడిస్తామని శపథాలు చేశారు. మరోవైపు పాలమూరులో టీఆర్ఎస్ను మట్టి కరిపిస్తామని ప్ర జాఫ్రంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ ఊహిస్తున్న ఫలితాలకు పూర్తి భిన్నమైన తీర్పు రాబోతుందని పేర్కొంటుంది. ఇలా మొత్తం మీద ఎవరికి వారు చేస్తున్న ప్రకటనలు మరింత తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్నాయి. బెట్టింగ్లు షురూ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై ఈసారి భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు స్థానాలపై భారీగా బెట్టింగ్లు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న రేవంత్రెడ్డి గెలుపోటములతో పాటు మెజార్టీపై కూడా పలువురు బెట్టింగ్కు దిగినట్లు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్లో ఫైర్బ్రాండ్గా పేరొందిన డీకే.అరుణ విషయంలో కూడా జోరుగా బెట్టింగక్ష జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో డీకే అరుణను ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి పట్టుదలతో పనిచేసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వనపర్తిలో సభలోనూ ప్రస్తావించారు. దీంతో గద్వాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన అరుణ గెలుపోటములు, మె జార్టీపై బెట్టింగ్కు దిగినట్లు తెలుస్తోంది. అలాగే, మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. -
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ల జోరు
కోవెలకుంట్ల: పక్క రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పార్టీల గెలుపోటములపై బెట్టింగ్ల జోరు సాగుతోంది. కోవెలకుంట్ల కేంద్రంగా పోలింగ్ ముగిసినప్పటి నుంచి పందేలా జోరు ఊపందుకుంది. శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగియగా ఈ నెల 11న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్కు మరో రెండు రోజులు గడువు ఉండటంతో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు రూ. లక్షల్లో పందెం కాస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తరఫున పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు రూ.5 లక్షల వరకు బెట్ కట్టగా, మరికొంత మంది మహాకూటమి విజయం సాధిస్తుందని వారికి ధీటుగా బెట్టింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో పలుచోట్ల తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుండగా మరోవైపు బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల గెలుపుతోపాటు ఆయా పార్టీల్లో బలమైన అభ్యర్థుల గెలుపు, మెజార్టీపై పందేలు కాశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేటీఆర్, హరీష్రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వంటి ప్రధాన నాయకులకు ఎన్నికల్లో వచ్చే మెజార్టీపై బెట్టింగ్లు కడుతున్నట్లు సమాచారం. రూ.5వేల నుంచి రూ.లక్షల్లో పార్టీల గెలుపు, ఓటములపై పందేలు సాగుతున్నాయి. హైదరాబాదులో ఉన్న స్నేహితులు, తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ల ద్వారా ఎన్నికల సమాచారం రాబట్టుకోవడంతోపాటు పలు చానళ్లు, పత్రికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఆయా పార్టీల గెలుపు, ఓటములపై బెట్టింగ్లు నిర్వహిస్తుండటం గమనార్హం. పట్టణంతోపాటు డివిజన్లోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బెట్టింగ్ల్లో పాల్గొంటున్నారు. -
చచ్చినా సరే వదిలేది లేదు : వంటేరు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు గడుస్తున్నా పోలింగ్ ఎంత శాతం అయిందో ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని విమర్శించారు. గజ్వెల్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో సీఈఓను కలిశామని తెలిపారు. ‘వీవీ ప్యాట్లో వచ్చిన స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్ను కోరాం. అవసరమైతే ఈ విషయంపై హైకోర్టులో కేసు వేసే ఆలోచనలో కూడా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వీవీ ప్యాట్లో వచ్చిన స్లిప్పులను లెక్కించకపోతే ఆమరణ దీక్ష చేస్తాననీ, చచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ తన ఫోన్లన్నీ ట్యాప్ చేయిస్తున్నారనీ, ఫోన్లో మాట్లాడాలంటే కూడా భయంగా ఉందని వాపోయారు. ‘మా గురించి చెప్పే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక ఏదీ లేదు. గజ్వెల్లో లిక్కర్, డబ్బు విచ్చలవిడిగా పంచారు. పోలీసులు కూడా అధికార పార్టీ తో కుమ్మక్కయ్యారు. వారందరినీ సస్సెండ్ చేయాలి’ అని వంటేరు అన్నారు. నాలుగేళ్ల పాలనా కాలంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని వంటేరు నిప్పులు చెరిగారు. సీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. -
ఉద్వేగం.. ఉత్కంఠ..
సాక్షి, హైదరాబాద్: మొన్నటిదాకా స్థానికులంతా కేంద్రం నిర్ణయంతో స్థానికేతరులయ్యారు.. అయినా సరే విడిపోయామన్న ఉద్వేగం తో వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో నేతలంతా గుబులు చెందుతున్నారు. పోలింగ్ రోజు నుంచి ఫలితాలు వెల్లడయ్యేదాకా వీరి ఉత్కంఠ రెట్టింపు కానుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు ఇక్కడే ఉన్న వారంతా అనివార్య కారణాల వల్ల తెలంగాణలోని ఏడు మండలాల ప్రజలు ఏపీలో విలీనమయ్యారు. ఈ ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర ఓట్లున్నాయి. ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడంతో మూడు నియోజకవర్గాల్లో ప్రతీ ఓటు కీలకంగా మారింది. అభ్యర్థులు ప్రతీ ఓటరును వ్యక్తిగతం గా కలిసి మరీ ఓటేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో ఓట్లు 1.3 లక్షలే కావడంతో ఇక్కడ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇదీ నేపథ్యం.. ఏపీ అభ్యర్థన మేరకు అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేంద్రం ఏపీలో కలిపింది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలున్నాయి. మొత్తం 1.8 లక్షల ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. భద్రాచలంలో ప్రత్యేక ప్రచారం.. ఈ నియోజకవర్గాల్లో అన్నింటి కంటే ఎక్కువగా ఓటర్లను కోల్పోయింది భద్రాచలం. దాదాపు 1,35,000 ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. టీఆర్ఎస్, మహాకూటమితో పాటు, బీఎల్ఎఫ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న 1.37 లక్షల ఓట్లను ముగ్గురు అభ్యర్థులు పంచుకోగా విజేతకు ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై బెట్టింగులు కూడా మొదలయ్యాయి. సంఖ్య పరంగా చూస్తే ఇదే అతిచిన్న నియోజకవర్గం కావడం గమనార్హం. మరోవైపు అశ్వరావుపేటలో 1.6 లక్షల ఓట్లలో 42 వేల ఓట్లు ఏపీకి బదిలీ కాగా, ఈసారి కొత్త ఓటర్లతో కలిపి 1.4 లక్షలకు రావడం గమనార్హం. పినపాక దాదాపు 4 వేల ఓట్లు కోల్పోయింది. గట్టుదాటి ప్రచారం! గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి, ఓట్లు వేసిన ముంపు ప్రాంతాల ప్రజలు అనూహ్యంగా ఏపీలో కలిశారు. ఇందులో ప్రజలకు ఓటు వేసే వీలు లేకుం డా పోయింది. కానీ దాదాపు అన్ని పార్టీల నేతలూ అక్కడ ఉన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో వీరంతా ప్రచారం చేసేందుకు గట్టు దాటి వచ్చారు. దాదాపు అన్ని పార్టీల నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేశారు. తమ తమ పార్టీల విజయాల కోసం కష్టపడ్డారు. ఈ నెల 5న ప్రచార గడువు ముగియడంతో ఇక సెలవంటూ ఉద్వేగంతో తిరుగు పయనమయ్యారు. -
కేసీఆర్ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం టీఆర్ఎస్ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్ఎస్ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం ఎంబీభవన్లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకపార్టీకి ఈసీ వత్తాసు అధికార టీఆర్ఎస్కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
మోదీ, కేసీఆర్ దొందూ దొందే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట: టీఆర్ఎస్ అవినీతికి ఆలవాలంగా మారిందని, కేసీఆర్తోసహా ఆ పార్టీలో ఎవరివద్దా మచ్చుకైనా నీతి నిజాయితీ కనపడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో బుధవారం జరిగిన ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో మోదీగా వ్యవహరిస్తున్నారని, ఈ రెండు ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నావని తనను అడిగే హక్కు కేసీఆర్కు ఎంతమాత్రం లేదని, ఇక్కడి ప్రజలను దోపిడీ నుంచి రక్షించడానికే తాను వచ్చానని ఆయన పేర్కొన్నారు. మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సీబీఐ, ఈడీ, ఐబీ లను దుర్వినియోగం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి అని అన్నారు. పేదలు దాచుకున్న డబ్బు లు సైతం బ్యాంకుల నుంచి తీసుకోలేని దురదృష్ట పరిస్థితులు నరేంద్రమోదీ కాలంలోనే ప్రారంభమయ్యాయని విమర్శించారు. అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయని, ధరలు పెరిగి, రూపాయి విలువ పడిపోయిందన్నారు. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్తో 37 ఏళ్లపాటు ఉన్న విభేదాలను పక్కన పెట్టామన్నారు. కేసీఆర్ అహంకార ధోరణితో ముందుకు పోతున్నారని, అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే విధంగా వ్యవహరించడం ఆయనకే చెల్లు అని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలను తానెప్పుడూ తప్పుపట్టనని, అయితే కేసీఆర్ బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్కు ఇవే చివరి ఎన్నికలు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లగడపాటి సర్వేలో 90 సీట్లు వస్తాయంటే ఆనందపడ్డ కేసీఆర్, ఇప్పుడు రావంటే వారిపై దాడికి పూనుకున్నారని, ఇది హుందాతనం కాదన్నారు. సభల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట టీడీ పీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మం త్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి గులాంలా.. తెలంగాణ గులాబీలా?
సాక్షి, సిరిసిల్ల : కారు పెట్టే కూతతో కూటమి గూబ గుయ్యిమనాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాములు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలో తేల్చుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలో ప్రచా రానికి చివరిరోజైన బుధవారం నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణలో ఎన్నికల ఫలితం బట్టే రేపు ఢిల్లీ గద్దె మీద కూర్చునే వ్యక్తి కూడా ఇక్కడి నుంచే నిర్ణయమవుతుంది. ఈ ఫలితానికి రాహుల్, చంద్రబాబు, మోదీలు గజగజ వణకాలి’అని పేర్కొన్నారు. ‘ఒక్క కేసీఆర్ను ఎదుర్కోవడానికి నలుగురైదురు ఒక్కటై వస్తున్నరు. ప్రధాని మోదీ పచ్చి ఝూటా మనిషి. రాహుల్ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతుండు. ఎమర్జెన్సీ పెట్టినోళ్లు మనకు ప్రజాస్వామ్యం మీద పాఠాలు చెబుతుండ్రు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ వీణ, బాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే’అన్నారు. కేసీఆర్ నన్ను మం త్రిని చేసి చేనేత, జౌళి శాఖ తనకే అప్పగించార ని తెలిపారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నా రు. సర్వేలతో ఆగం జేస్తుండ్రు కాంగ్రేసోళ్ల డైలాగుల్లో కొత్తదనం ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘పేపరు చూడంగనే పాసిపోయిన ముఖాలే కనబడుతున్నయి. రాహుల్ సీట్లు, బాబు నోట్లిచ్చినా ఓట్లు మాత్రం టీఆర్ఎస్కే’అని చెప్పారు. ‘జానారెడ్డి, ఉత్తమ్, రేవంత్, అరుణ వారి నియోజవర్గాల గడప కూడా దాటుతలేరు. కాంగ్రెస్లో పోటుగాళ్లనుకునేటోళ్లకే దిక్కులేదు. ఈ మధ్యకాలం లో సర్వేలని అందర్నీ ఆగం జేస్తున్నరు. నేను కూడా 70 నియోజకవర్గాలు తిరిగిన, సెంచరీ కొట్టుడు ఖాయం. అందరూ తట్ట, బుట్టా కట్టుకుని పోవుడు పక్కా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ వైపే
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మహాకూటమి నేతలు చిల్లర వ్యూహాలకు తెరలేపుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని తెలిసి చివరగా సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. ‘లగడపాటి రాజగోపాల్, నేను వాట్సాప్లో ఎన్నికలపై మెసెజ్లు పంపుకున్నాం. నవంబర్ 20న టీఆర్ఎస్కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. అదే విషయాన్ని చంద్రబాబుకు పంపానని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పాను. నవంబర్ 20 తర్వాత రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయలేదు. రెండు పత్రికలతో కలసి మైండ్గేమ్ ఆడుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో ఇలాంటివే చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. గోబెల్స్కు చంద్రబాబు తమ్ముడిలాంటి వారు. ఓటమి భయంతో సర్వేల పేరుతో ఏదో చేయాలని చూస్తున్నారు. రాజగోపాల్ చిలకజోస్యాలు చెల్లవు. ఆయన జోస్యం చెప్పాలనుకుంటే రెండు చిలుకలు పంపిస్తాం. ఇప్పటికైనా ఆయన చిల్లర పనులు ఆపాలి. ప్రచారాన్ని అడ్డుకుంటారా..? కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన దాన్ని ఎవరూ సమర్థించొద్దు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రకటించారు. రాహుల్గాంధీ విషయంలో మేం అలాగే ప్రకటిస్తే ఎలా ఉంటుంది. ఆ అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ అంశంతో సంబంధం లేదు. హైకోర్టు వ్యాఖ్యలు న్యాయస్థానం అభిప్రాయం. రాహుల్గాంధీకి ఏ విషయంపైనా అవగాహన లేదు. కుంజలాన్ ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అంటున్నారు. నేను కేసీఆర్ కొడుకుగానే రాజకీయాల్లోకి వచ్చినా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి దాకా చేరుకున్నా. రాహుల్ పేరులో గాంధీ అనే తోక తీసేస్తే ఆయన ఏంటి? ప్రజలు, దేశం కోసం ఆయన ఏ ఉద్యమాలు చేశారు. ఎన్నికల్లో మహాకూటమి, రాహుల్ ఇచ్చిన హామీలు విచిత్రంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఓసారి ఉచి త సాయం అంటారు.. మళ్లీ రుణం అంటారు. రూ.2 లక్షల రుణమాఫీ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్లో ఎందుకు చేయట్లేదు. బీజేపీకి ఒక్క సీటు రాదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీని మేం సమర్థించాం. నోట్ల రద్దుతో ప్రజలకు మేలు జరుగుతుందని భావించాం. అదేమీ జరగలేదు. రాజ్యసభ చైర్మన్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టే బీజేడీకి మద్దతిచ్చాం. తెలుగు వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపాం. అంతేతప్ప బీజేపీతో మాకు ఎలాంటి సంబంధంలేదు. రాష్ట్రంలో బీజేపీ లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని మా రాజకీయ వ్యూహం ఉంటోంది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాదు. డిసెంబర్ 11 తర్వాత ఏదైనా జరగొచ్చు. లోక్సభ ఎన్నికలకు సమయం ఉంది. మా వ్యూహం మాకు ఉంది. దేశ రాజకీయాల్లో ఏన్నో మార్పులు వస్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోక్సభ ఎన్నికలకు 3 నెలల సమయం ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుందనేది చూడొచ్చు. కేసీఆర్ వెంటే పేదలు.. స్వీయ అస్థిత్వం కోసం ఏర్పడ్డ తెలంగాణ.. అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సాగునీరు, కరెంటు, సంక్షేమంలో అత్యుత్తమ విజయాలను నమోదు చేశాం. పేదలు కేసీఆర్ వెంటే ఉన్నారు. మహాకూటమి, ఇతర ప్రత్యర్థి పార్టీలకు ఇవి కన్పించట్లేదు. కేసీఆర్ శరీరంపై, భాషపై, శరీరభాషపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ఏంటో ప్రజలకు తెలుసు. డిసెంబర్ 11న ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. చంద్రబాబు అవకాశవాది.. చంద్రబాబు ఒక్క వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశారు. అవసరం కోసం ఏ పార్టీతో అయినా కలుస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ను విలన్గా చూపి బీజేపీతో జతకట్టారు. నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు బీజేపీని విలన్గా చూపిస్తూ కాంగ్రెస్తో కలిశారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్రెడ్డి, ఆర్.కృష్ణయ్య చంద్రబాబు కాంగ్రెస్లో చేరారు. ఏపీలో 24 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అవకాశవాది. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ను కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏపీని లోకేశ్కు వదిలి ఇక్కడికి వస్తారేమో. టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. మొదటి వరుసలో ఉండే 10 మంది ఓడిపోతున్నారు. కొడంగల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది. -
ఒక్కకేసీఆర్... వందతుపాకులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరంలో ప్రచార ఘట్టం ముగిసింది. హోరెత్తించిన మైకులన్నీ మూగబోయాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఫుల్స్టాప్ పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగింది. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రచార బాధ్యతలు తనపైనే వేసుకుని రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. 87 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తోడ్పాటునందించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో ఏర్పాటైన ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అతిరథులంతా తరలి వచ్చారు. 80 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఎన్నడూ లేని స్థాయిలో నగదు ఏరులై పారింది. కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు రంగప్రవేశం చేయడంతో అది తారాస్థాయికి చేరింది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో రూ.129.46 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటేనే ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.10.87 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రూ.వందల కోట్లు ఖర్చు చేయడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి నుంచే డబ్బు పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. జోరుగా కాంగ్రెస్ ప్రచారం... గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతోపాటు పలువురు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల గెలు పునకు తీవ్రంగా శ్రమించారు. రాహుల్ అక్టోబర్ 20న రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించారు. ఆరోజున బైంసా, కామారెడ్డి సభల్లో పాల్గొన్నారు. అనంతరం సోనియా, రాహుల్ ఇద్దరూ కలిసి 23న మేడ్చల్లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. 28న రాహుల్గాంధీ ఖమ్మంలో తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి రోడ్షోల్లో ప్రచారం చేశారు. 29న పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 3న రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. పరిగి, గద్వాల, తాండూరు సభల్లో మాట్లాడారు. ప్రచారానికి చివరిరోజైన బుధవారం కోదాడ బహిరంగ సభకు చంద్రబాబుతో కలిసి హాజరయ్యారు. మొత్తంమీద 6 సార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. 26 నియోజకవర్గాలకు సంబంధించి 17 సభల్లో పాల్గొన్నారు. సోనియా, రాహుల్తోపాటు ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం ప్రచారంలో పాలుపంచుకుంది. అహ్మద్ పటేల్, జైరాంరమేశ్, జైపాల్రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్ చాందీ, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్లతోపాటు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు మినహా మిగిలిన రాష్ట్ర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితయ్యారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేయగా.. టీజేఎస్ పక్షాన కోదండరాం, సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం నిర్వహించారు. కీలక భూమిక పోషించే లక్ష్యంతో బీజేపీ... కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న యోచనతో బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్సింగ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గతనెల 27న నిజామాబాద్, మహబూబ్నగర్ సభల్లో.. ఈ నెల 3న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక అమిత్షా 3 రోజులు పాటు ప్రచారం చేశారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇక బీఎల్ఎఫ్ తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆ పార్టీ నేతలు బృందా కారత్, బి.వి.రాఘవులు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఒకేఒక్కడు.. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం మొత్తం సింగిల్గా చుట్టేశారు. గత ఎన్నికల్లో 110 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈసారి ఏకంగా 116 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరుతో సెప్టెంబర్ 7న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేసీఆర్.. ఇదే జిల్లాలోని సొంత నియోజకవర్గం గజ్వేల్లో నవంబర్ 5న ముగించారు. తొలుత సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. తర్వాత నాలుగు రోజులకు సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసి, 7న ప్రచారం ప్రారంభించారు. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్, మహబూబ్నగర్(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్ 24, నవంబర్ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్ చేశారు. నల్లగొండ, వనపర్తిలో రెండుసార్లు ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధంచేశారు. వాటిని అమలుచేసే బాధ్యతను కేటీఆర్, హరీశ్లకు అప్పగించారు. సభల నిర్వ హణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ముఖ్యనేతల కు, అభ్యర్థులకు ప్రయాణంలోనే ఆదేశాలు ఇచ్చారు. -
ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి : రాహుల్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్దిని నిర్ణయిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. కేసీఆర్ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశల్ని నీరుగార్చిందని, ప్రజలు కేసీఆర్పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపించారు. రైతులకు అందుబాటులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా బుధవారం సాయంత్రం ప్రజాకూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు. దేశ రాజకీయాల్లో మలుపు.. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇదే ఆరంభమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా వెలుగొందాలన్నారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి : కోదండరాం తెలంగాణలో నియంత పోకడలను అనుసరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ స్ధానంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపుఇచ్చారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదని, ప్రజల మద్దతుతో కుటుంబ పాలనను గద్దెదించుతామన్నారు. కూటమిలో సామాజిక న్యాయం : గద్దర్ ప్రజాకూటమిలో సామాజిక న్యాయం ఉందని గద్దర్ అన్నారు. తెలంగాణలో నియంతృత్వ సర్కార్ను కూల్చి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణలో అహంకారపూరిత ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. -
కూటమి వస్తే సీఎం రేవంత్ రెడ్డేనా?
సాక్షి, హైదరాబాద్ : సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్ ఉన్నారు. రేపు అదే కుర్చీలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు’ అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. దీనిపై పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డెనా? ఎన్నికల కీలక దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీశాయి. ఆయన వ్యూహత్మకంగా అన్నారా లేక, ఆయాచితంగా అన్నారా? అనే ప్రశ్న సీనియర్ నేతలను వెంటాడుతోంది. కాగా సీఎం రేసులో ఇదివరకే జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగిన రేవంత్.. ఆయన పరిచయాలతోనే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పలువురు నేతలకు టికెట్లు దక్కించుకోగలిగారు. కొడంగల్లోని రేవంత్ నివాసంలో ఆయనను పరామర్శించిడానికి వెళ్లిన ఆజాద్ సీఎం పీఠంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఇంట గెలవలేకే.. బాబు రచ్చరచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఇంట గెలిచి రచ్చ గెలవాల న్నది ఓ నానుడి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాంటివి వర్తించవు. సొంత రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న ఆయన.. పొరుగు రాష్ట్రంలో మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా ఎవరితోనైనా జతకట్టడం.. అవసరం తీరాక వారికి చేయివ్వడంలో ఆయన్ను మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో అవినీతి, అక్రమాలు ఎక్కువ కావడంతో అక్కడ అన్ని వర్గాల్లోనూ చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. ఈ సంగతిని ముందుగానే పసిగట్టిన ఆయన తన వైఫల్యాలను, తప్పిదాలను తెలివిగా ఎన్డీఏపై నెట్టేసి బయటకు వచ్చేశారు. (నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా) గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగేళ్ల తర్వాత వారికి చెయ్యిచ్చి, ప్రస్తుతం కాంగ్రెస్ చేయి అందుకున్నారు. ఏ కూటమిలో ఉన్నా తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేసే టీడీపీ అధినేత.. ఇప్పుడు అదే కోవలో తెలంగాణ ఎన్నికలను తన సొంత ఎజెండా కోసం ఉపయోగించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్న దానిపై బయట కు ఏం చెబుతున్నా.. తన సన్నిహితుల వద్ద సీఎంను నిర్ణయించేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. డబ్బులిస్తున్నామన్న ధీమాయే కారణమా? టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్కు ముందే తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తుండగా, కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది తన అభీష్టం మేరకు జరుగుతుందని బాబు ప్రచారం చేసుకుంటుండడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే సీఎంగా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్న టీపీసీసీ ముఖ్య నేతలు ఈ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు. కూటమి అభ్యర్థుల కోసం భారీగా డబ్బులిస్తున్నామన్న ధీమాతో తాను చెప్పినట్టే జరుగుతుందన్న భావన మేరకే చంద్రబాబు ఆ ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ ముఖ్య నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. 13 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ నాయకుడు సీఎంగా నిర్ణయించాల్సిన పరిస్థితులు వస్తే అది నిజంగా మా స్వయంకృతాపరాధమే అవుతుంది. చంద్రబాబుతో డేంజర్ అని తెలిసినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసి వెళుతున్నాం. ఏం జరుగుతుందో.. ఈ బాబు ఏం చేస్తాడో అనే అనుమానం మాకు లేకపోలేదు. మా జాగ్రత్తలో మేముంటున్నాం. అయినా బాబు ఏదైనా చేయగలడు’అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉన్నప్పుడూ తప్పుడు ప్రచారమే... రాజకీయాల్లో అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందిన చంద్రబాబు గత ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి పనిచేశారు. ఏడాది క్రితం వరకు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తన అవసరాలను తీర్చుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను çపణంగా పెట్టిన బాబు.. ఎన్డీఏలో ఉన్నప్పుడే బీజేపీపై అబద్ధపు ప్రచారానికి తెరతీశారు. ఈ అబద్ధాలకు తెరలేపుతూనే కాంగ్రెస్తో స్నేహానికి బాటలు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో బీజేపీని నాలుగేళ్లపాటు వెనుకేసుకొచ్చిన బాబు అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను గమనించి ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. హోదా ఏమైనా సంజీవనా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. హోదా ఇవ్వకుండా బీజేపీ తమను మోసం చేసిందని బిల్డప్ ఇచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీయేకు గుడ్బై చెప్పడానికి ముందే కాంగ్రెస్తో బేరం కుదుర్చుకున్న బాబు.. ఎన్నికల ఖర్చును భరిస్తానని చెప్పి ఆ పార్టీతో కలిసిపోయారనే చర్చ హస్తిన వర్గాల్లో అప్పట్లోనే జరిగింది. వాస్తవానికి, ఈ ఏడాది జనవరిలోనే కాంగ్రెస్, టీడీపీల స్నేహబంధం కుదిరిందని సమాచారం. ఇందుకు సంబంధించి చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎన్డీయేలో భాగంగా ఉన్నప్పుడే ‘సాక్షి’బయటపెట్టింది. ఆ రెండింటి కోసమే... దేశం కోసమే కాంగ్రెస్తో కలిశామని చెప్పుకుంటున్న చంద్రబాబు.. నిజంగా దేశం కోసం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమేమీ ఈ నిర్ణయం తీసుకోలేదని జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో ఉండి ఇంకా బీజేపీకి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురై శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందనే అంచనా మేరకే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినా.. కాంగ్రెస్తో కలిసేందుకు మాత్రం రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్లో పాలన అవినీతిలో కూరుకుపోయింది. జాతీయ స్థాయిలో ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతు లేకపోతే బాబు వ్యవహారాలపై విచారణ ఖాయం. అందుకే బీజేపీ వ్యతిరేక గూటికి చేరారు. ఇప్పుడు విచారణ జరిపినా తాను ఎన్డీఏను వీడి కాంగ్రెస్తో చేతులు కలిపినందుకే వేధిస్తున్నారని ప్రజలకు చెప్పుకోవాలనేది ఆయన ఆలోచన. ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’అని ఓ రాజకీయ విశ్లేషకుడు వివరించారు. ఇది కాకుండా కాంగ్రెస్తో తెలంగాణలో కలిసి కూటమికి బాటలు వేసుకునేందుకు మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. అదే ఓటుకు కోట్లు కేసు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసుపై టీఆర్ఎస్ ఎక్కడ విచారణ జరుపుతుందోననే భయంతోనే కాంగ్రెస్తో చేతులు కలిపి టీఆర్ఎస్ ఓటమికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్ను మేనేజ్ చేసుకుని ఓటుకు కోట్లు కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఆలోచన, వ్యూహం ఇందులో దాగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు కారణాలతోనే ఆయన బీజేపీని వదిలి కాంగ్రెస్ పంచన చేరారని, రేపు మళ్లీ ఇదే కాంగ్రెస్ను విమర్శించి.. లేదంటే నట్టేట ముంచి బీజేపీతోనో, ఇంకో పార్టీతోనే జతకట్టేందుకు బాబుకు రెండు సెకన్ల సమయం కూడా పట్టదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్ ఓటమే «ధ్యేయంగా బాబు తెలంగాణ ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. -
తారస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం
-
నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా
సాక్షి నెట్వర్క్: ‘‘హైదరాబాద్ నా మానస పుత్రిక. ఇక్కడి అభివృద్ధిలో అడుగడుగునా నా కృషి ఉంది. ఈ నగరం ముందుకు పోతే చూసి ఆనందిద్దామనుకున్నా. కానీ ప్రగతి కుంటుపడింది. నేను చేసిన అభివృద్ధి ఫలాలు తెలుగుజాతికి అందకుండా పోవడం తో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టా. నేను డైరెక్టుగా ఇక్కడికి వచ్చి పాలన చేయలేను.. కాబట్టి ప్రజా కూటమి ద్వారా అభివృద్ధి ఫలితాలను మీకందించాలని వచ్చా’’అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం, కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ అంటే.. ఖావో కమీషన్ రావు అని, టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ ఆరెస్సెస్ అని ఎద్దేవా చేశారు. సోమవారం ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులతో కలసి రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు, జూబ్లీహిల్స్, కూకట్పల్లి రోడ్షోల్లో రాహుల్తో కలసి పాల్గొన్నారు. అంతా నేనే... ముషీరాబాద్, ఖైరతాబాద్ రోడ్షోల్లో చంద్రబాబు ప్రసంగించారు. మోదీ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేస్తూ ప్రజాప్రతినిధులపై, పత్రికలపై దాడు లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ని ప్రపంచ పటం లో పెట్టింది టీడీపీయేనని, నగరంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఎయిర్ పోర్టు వంటి అనేక ప్రాజెక్టులను ప్రారంభించానన్నారు. ముషీరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం, అధునాతన గాంధీ ఆసుపత్రిని నిర్మించానన్నారు. హైదరాబాద్తోనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందన్నారు. తాను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లిందని, కానీ ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్పితే అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. 37 ఏళ్లపాటు తాను కాంగ్రెస్తో పోరాడనని ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడటం కోసం అదే పార్టీతో కలసి పనిచేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్తో కలిసింది తన స్వార్థం కోసం కాదని, జాతి ప్రయోజనాల కోసమన్నారు. మాయమాటలు చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, పెత్తనం చేయడానికి ఇక్కడికి రాలేదని తెలిపా రు. తాను ఇక్కడ సీఎంగా ఉండటానికి అవకాశం లేదని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ కూటమి మేనిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం రహస్య స్నేహం రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐ ఎం రహస్య స్నేహం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ అవివేకంగా చేసిన నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. సీబీఐ సహా అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ కంట్రోల్గా మారిపోయరన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమానికి, అవినీతి రహిత పాలన కోసం మహా కూటమికి పట్టం కట్టాలని కోరారు. కేసీఆర్... జూనియర్ మోదీ.. టీఆర్ఎస్, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని బాబు అన్నారు. కేసీఆర్ను జూనియర్ మోదీగా అభివర్ణించారు. కేంద్రంలో, రాష్ట్రంలో దారితప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం తనకు ఉందన్నారు. ప్రత్యామ్నా య రాజకీయ వ్యవస్థ రావాలని అందుకే ప్రజా కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాకూటమి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ట్యాంక్బండ్పై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను ఆలోచిస్తుంటే కేసీఆర్ మాత్రం తెలుగువారి మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శిం చారు. తనకు ఇక్కడేం పని అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని. తాను లేకుంటే కేసీఆర్ ఎక్కడని ప్రశ్నిం చారు. రాజకీయాల్లో కేసీఆర్ను పెంచి పోషిం చింది తానేనన్నారు. ఫామ్హౌస్లో కూర్చుంటే పనులు కావని జనంలోకి వస్తేనే పనులవుతాయన్నారు. హైదరాబాద్లో అన్ని సీట్లు ప్రజాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తనను ఎన్ని తిట్లుతిడితే ప్రజల నుంచి తనకు అంతగా ఆదరణ లభిస్తుందన్నారు. -
టీఆర్ఎస్కే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లోని రాయలసీమ వాసులు డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే తమ ఓటేసి గెలిపించుకోవాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (గ్రాట్) ఆధ్వర్యంలో ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో స్థిరపడిన రాయలసీమ వాసుల నేటి కర్తవ్యం’పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన హైదరాబాద్లో నివసిస్తున్న రాయలసీమ ప్రజల అవసరాలు, అభీష్టాలకు పెద్దపీట వేసేలా సాగిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ వాసుల పట్ల ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. టీఎస్ఎస్ సింగిల్ పార్టీ అని, నిర్ణయాలు కూడా కేసీఆర్ వెంటనే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఆర్ఎస్కు ఒక ఎజెండా ఉంటుందని తెలిపారు. అదే మహాకూటమిలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. కాంగ్రెస్ది అంతా సీల్డ్ కవర్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వారు ఓటుకు కోట్లు కేసులో దొరికిన వారిని సీఎంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్కే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై దృష్టిసారించారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార వికేంద్రీకరణ అంటూ ప్రకటించి ఆచరణలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. చివరికి హైకోర్టు కూడా అమరావతికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇవ్వాలని జీవోలో ఎక్కడా లేదన్నారు. ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్సార్ పరుగులు పెట్టించారన్నారు. వైఎస్ఆర్ మరణంతో ఆగిన గుండెలను పరామర్శించేందుకు వెళ్తానన్న వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. గాలేరు – నగరి ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగమే మహాకూటమి అని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన టీడీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మహాకూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. మన తీర్పు చంద్రబాబుకు ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పారు. గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ కల్పించలేని చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్న రాయలసీమ వాసులకు అండగా ఉంటానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఏదిఏమైనా అందరం ఏకమై మహాకూటమి అభ్యర్థులను ఓడిద్దామన్నారు. కార్యక్రమంలో గ్రాట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు శ్యామలారెడ్డి, గ్రాట్ అధ్యక్షుడు ఎం ఓబుళరెడ్డి, సభ్యులు బి రాఘవేంద్రరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం.. సిగ్గు లేదా?
లింగాలఘణపురం: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ద్రోహుల పార్టీ అని.. నేడు అదే పార్టీతో దోస్తీ ఎలా చేస్తున్నావ్..! కోదండరాం నీకు సిగ్గు లేదా? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యతో కలసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఉన్న చంద్రబాబును హైదరాబాద్కు తీసుకొచ్చి.. టీడీపీతో మహా కూటమిని ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి గెలిస్తే చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారని అన్నారు. -
‘కూటమి వెనుక కుట్రలు, కుతంత్రాలు’
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి వెనుక అత్యంత దురదృష్టకరమైన సమీకరణలు చోటుచేసుకుంటున్నాయని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కేవలం ఎన్నికలు మాత్రమే జరగడం లేదని అంతకుమించి కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనే అంశంపై ఎన్నికలు జరగాలికానీ.. తెలంగాణలో అలా జరగడంలేదన్నారు. స్వరాష్ట్రాం కోసం పోరాటం చేసిన వారు ఓవైపు, తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డవారు, వ్యతిరేకంగా మాట్లాడినవారు మరోవైపు పోటీలో ఉన్నారన్నారు. ఎవరిచేతిలో రాష్ట్రం పదిలంగా ఉంటదో ప్రజలంతా ఆలోచన చేయాలని హరీష్ కోరారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండకపోతే మన మనుగడకే ముప్పువాటిల్లే అవకాశం ఉందని, అసలుకే మోసం వస్తుందని అనువానం వ్యక్తం చేశారు. మహాకూటమి ఏర్పాటు బయటకు కనిపించినట్లు కేవలం అధికారం హస్తగతం చేసుకోవడానికి కాదని, దాని లక్ష్యం వేరేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉనికిని కబలించే కూటమని మండిపడ్డారు. తానే కేవలం రాజకీయాల కోసం మాట్లాడటంలేదని, గత అనుభవాలు, పక్కా ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు పోటీచేయాలి? ఎవరి మధ్య పోటీ ఉండాలి? ఎవరు ప్రచారం చేయ్యాలి? అని ప్రశ్నించారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటో ప్రజలంతా గమనించాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ పుట్టిన బిడ్డలే పోటీచేయాలని హరీష్ పేర్కొన్నారు. -
‘చేతి’ చాటు చంద్రుడు చేటేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ ఒక వైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కూడిన ప్రజాఫ్రంట్ మరో వైపు హోరా హోరీ యుద్ధం మాదిరి ప్రచారం సాగిస్తున్నాయి. ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేయగలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా పోయిందో మరేమో తెలియదు కాని..ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా అత్యధికంగా కాంగ్రెస్ ప్రచారమే హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ వెనుకాడడం లేదు. ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఇంతవరకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్లు కనిపించలేదు. బహుశా చివరి మూడు రోజులు ఏమైనా ఇస్తుందేమో తెలియదు. కాంగ్రెస్కు అయినా, టీఆర్ఎస్ కు అయినా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలే. బీజేపీ కూడా ప్రచారంలో దూకి రకరకాల టీవీ యాడ్స్, పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఆరంభించింది. ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రచారం విషయంలో కాంగ్రెస్ దూకుడు ముందు ఆగడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్ గత ఐదేళ్లుగా తెలంగాణలోను, ఆంధ్రలోను అధికారంలో లేదు. కాంగ్రెస్కు లాభమా..నష్టమా! తెలంగాణ ఇచ్చినా ఇక్కడ అధికారం రాకపోవడంతో ఆ సెంటిమెంటును ప్రయోగించి ఏమైనా లాభం పొందే అవకాశం ఉందా అన్నదానిపై కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి టీడీపీని కలుపుకోవడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్కు నష్టమా? లాభమా అన్నది ఆ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మొదట ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను వాడుకున్న కాంగ్రెస్ , తన సొంత ముఖ్యమంత్రులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కాంగ్రెస్ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కూడా అవసరం లేదని భావించిందో ఏమో తెలియదు కాని చంద్రబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగాలలో వారి ప్రస్తావన తేలేదు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో ఎక్కడా కాంగ్రెస్ పదేళ్ల పాలన గురించి చెప్పడం లేదు. పదిహేనేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ అభివృద్ధి అంతా తనదే అంటూ తన ఖాతాలో క్రెడిట్ వేసుకుంటుంటే, కాంగ్రెస్ నేతలు తెల్లబోవడం తప్ప ఏమీ మాట్లాడడం లేదు. ఒకరకంగా చేష్టలుడిగినట్లుగా వారి పరిస్థితి మారింది. కేసీఆర్ ఆత్మగౌరవ సమస్యను ప్రస్తావిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఫామ్హౌస్లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని చెబుతున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉన్న ఇల్లు పడగొట్టి పెద్ద ప్యాలెస్ను నిర్మించుకున్నారు కాని విజయవాడ అనండి..అమరావతి అనండి ఆ ప్రాంతంలో ఎక్కడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభావం లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదానిపై కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారకుండా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కాని, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రసంగాలలో ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజంగానే ఆత్మగౌరవ సమస్యను ప్రజలందరు తీసుకుంటారా అంటే చెప్పలేం. కొంత మేర ఉండవచ్చు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కొంత చర్చ జరుగుతోంది. పథకాలపై టీఆర్ఎస్ ఆశలు... స్థూలంగా చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది వోకల్ సెక్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. కింది స్థాయి వర్గాలలో అది అంతగాఉన్నట్లు అనిపించదు. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల వారికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని చెప్పాలి. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెలు, చేపపిల్లల పంపణీ తదితర స్కీములపై టీఆర్ఎస్ ఎక్కువ ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ స్కీముల గురించి ఎక్కువగా చెప్పకుండా కేసీఆర్ దొరల పాలన అని, నియంతృత్వం అని, సెక్రటేరియట్కు వెళ్లడం లేదని, ఇలాంటి విమర్శలను ఎక్కువగా చేస్తోంది. అదే సమయంలో రెండు లక్షల రూపాయల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కేసీఆర్ చేపట్టిన వివిధ స్కీములను పెద్దగా విమర్శించకుండా, తాము మరింతగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వపరంగా పెద్దగా విఫలం అయినట్లు కనిపించదు. కాకపోతే యాటిట్యూడ్ లో కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ కు మరింంత పోటీ ఎదురై ఉండేది. కాని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ వారు కేసీఆర్కు ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. తేడా వస్తే... ఎంఐఎం అండ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి అయితే చంద్రబాబో, ఎవరో ఒకరు తమకు గెలిచే విధంగా ఆర్థిక వనరులు సాయం చేస్తే చాలన్నట్లుగా సర్దుకుంటున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు కాంగ్రెస్కు నష్టం చేయవచ్చు. అందువల్లే లగడపాటి రాజగోపాల్ పది మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొందరు టీఆర్ఎస్కు ఇబ్బంది అని ప్రచారం చేస్తున్నా, కాంగ్రెస్ కు ఇబ్బందే ఎదురు అవుతుందనిపిస్తుంది..ఎందుకంటే టీఆర్ఎస్కు ఒకవేళ 50 సీట్లు వచ్చినా, ఎంఐఎం అండ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లను ఆకట్టుకున్నా సరిపోతుంది. టీఆర్ఎస్ మాత్రం తమకు పూర్తి మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ తన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కూడా ఐదు నుంచి పది సీట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కూటమికి పూర్తి మెజార్టీ వస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాని టీఆర్ఎస్కు 50 సీట్లు వచ్చినా అధికారం పొందే అవకాశం ఉండవచ్చు. ఇక డబ్బు ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల ఎదురవుతున్న ఆత్మగౌరవ సమస్య పనిచేస్తే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. ఆయన ప్రభుత్వ విధానాలు కాకుండా, కేసీఆర్ వైఖరి , సెక్రటేరియట్కు వెళ్లకపోవడం వంటి విమర్శలు అధికంగా పనిచేస్తే కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరగవచ్చు. ఇప్పటికైతే కేసీఆర్ది పై చేయిగానే కనిపిస్తోంది. అలా అని చెప్పి ప్రజా కూటమి పూర్తిగా వెనుకబడిందని చెప్పలేం. - కొమ్మినేని శ్రీనివాసరావు -
తెలంగాణలో ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ ధన ప్రలోభాలకు తెరతీసింది. ఖమ్మం మహాకూటమి అభ్యర్థి తరఫున ఓటుకు నోటు స్కీంతో టీడీపీ శ్రేణులు రంగంలో దిగాయి. వారు ఇందుకోసం సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా జనాలకు ఓటరు స్లిప్తో పాటు 10 రూపాయల నోటు జతచేసి అందజేస్తున్నారు. ఆ నోట్ తిరిగి ఇస్తే రెండువేల రూపాయలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఓటర్ స్లిప్తో పాటు అందజేసే 10 రూపాయల నోట్పై ప్రత్యేక నంబర్ సిరీస్తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రలోభాలకు పాల్పడుతున్న మహాకూటమి శ్రేణులను టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో టీఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మహాకూటమి అభ్యర్థుల ప్రలోభాలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. ప్రజా బలంతో గెలవడానికి ప్రయత్నించాలని మహాకూటమి అభ్యర్థులకు సూచించారు. నంద్యాలలో మాదిరి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. -
అయ్యా.. చంద్రబాబు నీకో నమస్కారం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘అయ్యా చంద్రబాబు నాయుడు నీకో నమస్కారం! తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అనవసరంగా మీరు.. మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారు’ అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇంకా ఎమన్నారంటే.. ‘ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు.. ప్రజలు గెలవాలి. అలా అయితేనే ప్రజల అజెండా అమలై వారికి మేలు జరుగుతోంది. గత పాలకులు నగరాన్ని నాశనం చేశారు. వర్షం నీళ్లను తీసుకుపోయే కాలువలను కూడా ధ్వంసం చేశారు. కనీసం టాయిలెట్లు నిర్మించలేదు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది. అధికారంలోకి రాగానే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోని పని మొదలుపెట్టాం. పేదల అభ్యున్నతికి కృషి చేశాం. గుడిసేలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చాం. రూపాయికి నీటి కనెక్షన్ ఇచ్చాం. కరెంట్ బకాయిలను మాఫీ చేశాం. ఎల్ఈడీ వెలుగుల కింద నగరం ఇప్పుడు మెరుస్తుంది. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగున్నరేళ్లలో ఒక్క మతకల్లోలం లేదు. కర్ఫ్యూలు లేవు. గుడుంబా అమ్మకాలు.. గుండాలు.. పేకాట క్లబ్బులు లేవు. 12 మున్సిపాలిటీల్లో నీటికి చాలా కటకట ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో 500 పైచిలుకు బస్తీ దవాఖానాలు పెట్టే యోచనలో ఉన్నాం. నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ విశ్వనగరం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. సర్వమతాలకు నిలయం. ప్రతి రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అనేక అపోహలు సృష్టించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు అనవసరంగా స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారికి జీహెచ్ఎంసీలో టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లినా గర్వంగా హైదరాబాదీలమని చెప్పండి. మేం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డాం. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలెందుకు. ప్రేమ ఉంటే చిచ్చు పెడ్తరా? రేపు మాపో డూప్లికేట్ సర్వే వెల్లడిస్తారు. ఇదంతా ఓ మీడియా సంస్థ, కాంగ్రెసోళ్లు కలిసి కుట్ర చేస్తున్నారు. 100 సభలనంతరం తిరుగొచ్చిన నేను కచ్చితంగా 100 సీట్లపై గెలుస్తామని చెబుతున్నా. జీహెచ్ఎంసీ తీర్పే రిపీట్ కాబోతుంది. ఈ ఎన్నికలనంతరం ఫెడరల్ ఫ్రంట్కు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మతసామరస్యంతో అభివృద్దిలో దూసుకుపోతున్న తెలంగాణకు బాసటగా నిలుస్తూ.. తమ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలి’ అని కేసీఆర్ ప్రజలను కోరారు. -
కాంగ్రెస్ను ఓడించండి : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : గత 35 ఏళ్లుగా చెప్పిచెప్పి అలవాటైన మాట.. ‘కాంగ్రెస్ను ఓడించండి.. తరమికొట్టండి’ అని.. కొన్ని వేల సభలో చెప్పి ఉంటారు. ఇప్పుడు ఉన్న పలానా ఆ మాట మార్చాలంటే.. ఆ నాలుక సహకరించాలి కదా!.. ఎంత జాగ్రత్తపడినా ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ఎంత దూరమైన వెళ్లడానికి సిద్దపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైగా ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జతకట్టి.. కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. వారి పక్కనే నిల్చొని టీఆర్ఎస్, బీజేపీలను పొట్టు పొట్టు తిడుతున్నారు. అనూహ్యంగా నందమూరి కుటుంబాన్ని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు.. కూకట్పల్లి టికెట్ను దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కేటాయించారు. ఆమెను గెలిపించడానికి.. బావా, బామ్మర్ధులు (చంద్రబాబు.. బాలయ్య) తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటూ.. సుహాసిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే శనివారం కూకట్పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు.. కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, మహాకూటమి నేతలంతా షాక్కు గురయ్యారు. వెంటనే నాలుక కర్చుకున్న చంద్రబాబు బీజేపీ అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం చేవేళ్ల ప్రజాశీర్వాద సభలో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. -
మహాకూటమి కాదు.. పెద్ద దొంగల కూటమి
సాక్షి, విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
మహా కూటమి.. ఇంత మోసమా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, మిగతా వర్గాల పేదలకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. సరిగ్గా పోలింగ్కు ముందు ఇప్పుడు మాట మార్చిందన్నారు. మొన్నటి వరకు డబ్బులిస్తామని చెప్పి.. ఇప్పుడు అది రుణమని ప్రకటనలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఆదివారం దినపత్రికల్లో వచ్చిన మహాకూటమి వాణిజ్య ప్రకటనల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ.. కూటమి మోసాన్ని ట్విటర్ వేదికగా ఎండగట్టారు. లగడపాటి సర్వే ఓ జోక్.. తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ప్రకారం 10 మంది స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అదో పెద్ద జోక్ అని, అవన్నీ నకిలీ సర్వేలని, వాటిని విశ్వసించవద్దని సూచించారు. ఆదివారం నెటిజన్లతో ట్విటర్ వేదికగా చిట్చాట్ చేసిన కేటీఆర్.. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శంకర్ 2.0, రాజమౌళి బాహుబలి చిత్రాల గ్రాఫిక్స్లకన్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సూపర్ అని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. దీనికి కేటీఆర్ సైతం అంగీకరించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు విద్యుత్త్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ 24 గంటల కరెంట్ ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు అంశాన్ని టీఆర్ఎస్ సరిగ్గా ప్రచారానికి వాడుకోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సమాధానమిచ్చారు. మరో నెటిజన్ కేసీఆర్ మిమ్మల్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. రాము అని పిలుస్తారని, అది తన నిక్నేమ్ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు మొబైల్ కనిపెట్టానని చెప్పారని, దీనిపై అభిప్రాయం ఏమనగా.. ఆయన చందమామను కూడా కనిపెట్టారని సెటైర్ వేశారు. వీళ్లు చేసే వాగ్ధానాలు ఎంత మోసపూరితమో, ఇదే మంచి ఉదాహరణ. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మొదలుచెప్పి, ఇప్పుడు రుణం ఇస్తామని మాటమార్చిన కాంగ్రెస్. pic.twitter.com/vNSWPUqRae — KTR (@KTRTRS) December 2, 2018 Be careful Babu Garu. Telangana is ‘powerful’ https://t.co/8AU9x5d1Ds — KTR (@KTRTRS) December 2, 2018 -
చంద్రబాబు ఇంట్లో కూటమి నేతల కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో మహాకూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో చంద్రబాబు నివాసం వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క, కర్టాటక మంత్రి డీకే శివకుమార్, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్లు హాజరయ్యారు. ప్రచార అనంతరం ఉన్న రెండు రోజుల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్మేనేజ్మెంట్పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండగా.. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్ కీలక నేత రచనా రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేయడంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇక కర్ణాటక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహాకూటమి ఒప్పందం ప్రకారం చంద్రబాబు ఇస్తానన్న.. డబ్బులపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తమతో జతకట్టినందుకు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇస్తానని ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
కూటమిపై ప్రజలకు విశ్వాసం లేదు..
సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిపై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే కూటమిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టాడని విమర్శించారు. ఉప్పల్ రింగ్రోడ్డులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలిసి ఆదివారం రోడ్డుషోలో పాల్గొన్న గడ్కరీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలని ధ్వజమెత్తారు.నిన్నటి వరకూ తమతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రత్యేక ప్రణాళికలతో బీజేపీ ముందుకొస్తుందని హామీ ఇచ్చారు. ఛాయ్వాలా ప్రధాని అయ్యాడంటే అది బీజేపీ గొప్పతనమని చెప్పుకొచ్చారు. -
ఫైనల్ టచ్..! అతిరథులు సుడిగాలి పర్యటనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్నికల ప్రచారం ముగిసే సమయం సమీపిస్తుండ డంతో అన్ని పార్టీల అతిరథ నేతలందరూ మరోసారి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 5తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అగ్రనేతల షె డ్యూళ్లు ఖరారయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ముఖ్యనేతలపైనే ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారు మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను అ త్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అ తిథుల రాకకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఆదివారం నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా ఇప్పటికే రెండుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. నాగర్కర్నూల్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 4న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ప్రచారసభలు నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం మరోసారి ఉమ్మ డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే కొడం గల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన సభలో పాల్గొనగా... ఈసారి గద్వాలలో నిర్వహిం చే సభలో రాహుల్గాంధీ పాల్గొననున్నారు. ఆశలన్నీ కేసీఆర్పైనే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఎట్టి పరిస్థితిలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బరిలో నిలిచిన నేతలందరూ ఆశలన్నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదే పెట్టుకున్నారు. దీంతో ఆయన కూడా ప్రతీ నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేశాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత జడ్చర్లలో జరిగిన సభకు హాజరైన కేసీఆర్.. మరోమారు దేవరకద్ర, నారాయణపేట సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా ఒకేరోజు మహబూబ్నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట సభకు హాజరయ్యారు. ఇప్పుడు ఆదివారం నాగర్కర్నూల్లో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 4న ఒకే రోజు ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, కొండగల్లో జరిగే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితుల చోట్ల సభలు నిర్వహించి.. కేడర్ను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి, మక్తల్, అచ్చంపేటలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట్ల.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన మంత్రి హరీశ్రావును నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా నియమించారు. అలంపూర్, గద్వాల్, మక్తల్, కొడంగల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు నడిపించేందుకు హరీశ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటించిన హరీశ్.. కొందరిని నియోజకవర్గంలో నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వ్యూహాత్మకంగా ప్రజాఫ్రంట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలందరూ కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్నిచోట్ల కూడా కూటమి నాయకులుకలిసి బరిలో నిలిచిన అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలు, టీ పీసీసీ ముఖ్యనేతలందరూ విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. గత నవంబర్ 28న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలపై రాహుల్ ధీటైన విమర్శలు చేస్తున్నారు. రాహుల్ సభల ద్వారా కాంగ్రెస్ కేడర్లో జోష్ నెలకొనడంతో.. ఈనెల 3న గద్వాలలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కమలం ‘గురి’ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సైతం తన పట్టును నిలుపుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లా కొన్ని స్థానాలైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తోంది. పలు సర్వేల్లో కల్వకుర్తి, నారాయణపేటల్లో పార్టీ అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కనీసం ఈ రెండు స్థా నాలను గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు సభ ద్వారా కేడర్లో జోష్ నింపారు. మరోవైపు మంచి వాగ్దాటి ఉన్న స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా ఆయా నియోజకవర్గాల్లో ప ర్యటించారు. హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో పా టు జె.పి.నడ్డా తదితరులు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో వ్యూహకర్తగా పేరున్న జాతీయ అధ్యక్షుడు అమిత్షా వ్యూ హాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పాలమూరు నుంచే ప్రా రంభించిన నేపథ్యంలో... తాజాగా ఆయన మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నారా యణపేట, కల్వకుర్తి(ఆమనగల్)ల్లో ఆదివారం జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. -
మోసాలకు అంబాసిడర్గా కేసీఆర్
మధిర/ఏటూరునాగారం: గత ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. శనివారం ఆమె ఖమ్మం జిల్లా మధిర మం డలం సిరిపురంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. దొర ఒక వైపు, కాంగ్రెస్ మరోవైపు అని.. దొర కావాలో, ప్రజా సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమాలతో దోచుకోవడం, దాచుకోవడం చేశారన్నారు. ఈ విషయంలో కేసీఆర్ మోసాలకు అంబాసిడర్గా మారారని ఆరోపించారు. నాడు మహాత్మాగాంధీ సింపుల్గా ఉండేవారని, కేసీఆర్ మాత్రం పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గాంధీ నాడు తన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదని, కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారని విమర్శించారు. డిసెంబర్ 11 తర్వాత రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక మోసాలతో వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఖమ్మం జిల్లా చారిత్రాత్మకమైందని, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాటలతో ఆయన అలరించారు. కీలక స్థానంలో ఉంటా: భట్టి త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో తాను కీలక స్థానంలో ఉంటానని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70 నుంచి 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇస్తున్న హామీలు సంక్షేమ పథకాల ను వెంటనే అమలు చేస్తామన్నారు. నిధులను నలుగురి కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైం దన్నారు. దొరల పాలన కావాలో, ప్రజాపాలన కావా లో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరు: రాజగోపాల్రెడ్డి మునుగోడు: లేచింది మొద లు కొని పడుకునే వరకు అబద్ధాలు ఆడే సీఎం కేసీఆర్ ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల, కిష్టాపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అమలుకు వీలుకాని హామీలిచ్చి గద్దెనెక్కాడన్నారు. అయితే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఈ ఎన్నికల్లో అబద్ధాలు ఆడే అవకాశం లేకుండా పోయిందన్నారు. 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని కేసీఆర్ గ్రహించారని, అందుకే తాను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
80 స్థానాల్లో విజయం మాదే
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 80కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ, ధర్మగంట మోగే తెలంగాణ, వెలుగుల తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్ గద్దె దిగాల్సిందేనని, ఓటర్లందరూ ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం కీలకదశకు చేరుకున్న సమయంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్య విశేషాలు.. సాక్షి: ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మీ ప్రచారం ఎలా సాగుతోంది? ఉత్తమ్: అద్భుతంగా సాగుతోంది. ఇంటింటి ప్రచారంతో పాటు బహిరంగసభలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా మా పార్టీ, పీపుల్స్ ఫ్రంట్ సందేశం ప్రతి ఓటరుకు చేరేలా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా మా కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యంగా జరిగింది కదా..? ఇది తప్పు. అభ్యర్థుల ఎంపిక సరైన సమయంలోనే జరిగింది. మరీ ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసినా అనేక రకాల ఇబ్బందులుంటాయి. అభ్యర్థులతో పాటు పార్టీ ప్రచారం పకడ్బందీగా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలోకి వస్తే మేం చేయబోతున్న పనుల గురించి పోలింగ్ రోజు కంటే ముందే ప్రతి ఓటరుకు మూడు నాలుగు సార్లు చేరవేసేలా ముందుకెళుతున్నాం. ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు జరుగుతుందంటున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? అవినీతితో దోచుకున్న సొమ్ము, మద్యం ఉపయోగించి తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. కానీ, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా డబ్బు, మద్యం, గోబెల్స్ ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనం. దీన్ని ఓటింగ్లో తెలంగాణ సమాజం సహించదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మాటల మాంత్రికుడిగా పేరున్న ఆయన ఎన్నికల ప్రచారంపై మీ అభిప్రాయం? కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. 2014 ఎన్నికల సమయంలో ఆయన మాటలు విని మోసపోయామనే భావన తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల్లో ఉంది. మళ్లీ మోసపోం అని కూడా తెలంగాణ ప్రజల అనుకుంటున్నారు. అందుకోసమే కేసీఆర్ సభలు కానీ, టీఆర్ఎస్ ఇతర ప్రచార కార్యక్రమాలు కానీ అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో మా ప్రచార సభలకు పెద్ద ఎత్తున జనస్పందన కనిపిస్తోంది. కేసీఆర్ సభలకు సరైన సంఖ్యలో జనం రావడంలేదు. వచ్చినవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొనడంలేదు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టీడీపీ పొత్తును సంపూర్ణంగా స్వీకరించారు. ఇందుకు నిదర్శనంగానే మా పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ అంశంలో మేం సర్వే కూడా చేశాం. ఇందులో పాల్గొన్న 90–95 శాతం మంది మా పొత్తును ఆమోదించారు. ఇది ఒక చారిత్రక అవసరం. దేశ, రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత పాలకుల నిరంకుశ, నియంతృత్వ ధోరణి, ఫాసిస్టు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న రాజకీయ, రాజకీయేతర శక్తులు కలిసి ఈ ప్రజావ్యతిరేక దుర్మార్గపు పాలకులను గద్దె దింపాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ, సీబీఐ, న్యాయ, పార్లమెంటరీ, మీడియా వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సర్వనాశనం చేస్తున్నాయి. అదే పోకడతో తెలంగాణలో కూడా కేసీఆర్ శాసన, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జరిగిన రాజకీయ పునరేకీకరణలో రాజకీయ, రాజకీయేతర శక్తులు చేతులు కలపడం అవసరం. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదిలీ జరిగే పరిస్థితులు లేవంటున్నారు? ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేం క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. నూటికి నూరుశాతం ఓట్ల బదిలీ జరగబోతున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం ఉంది. అన్నీ బయటకు చెప్పలేం కానీ.. ఇందుకోసం మేం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సూట్కేసులు రాలేదనే సోనియా కడుపు తరుక్కుపోతుందా అన్న కేసీఆర్ కామెంట్స్పై మీరేమంటారు? కేసీఆర్ అత్యంత దిగజారుడు వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. తన జీవితం మొత్తం సూట్కేసులు తీసుకునే అలవాటున్న కేసీఆర్కు త్యాగస్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేసే వారి వ్యక్తిత్వం అర్థం కాదు. ఒకనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆన్రికార్డ్ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఓడిపోతున్నాననే ఆందోళనతోనే సోనియాను విమర్శిస్తున్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అవినీతికి నిలువెత్తు నిదర్శనమైన అవకాశవాది, అబద్ధాలకోరు, మోసగాడు మాట్లాడడమా..? దీన్ని గమనించిన తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మీ విజయావకాశాలను దెబ్బతీసేట్టు ఉన్నారు? బీజేపీ, ఎంఐఎంలకు గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు కూడా రావు. అదో విచిత్ర కలయిక. బీజేపీతో రహస్య ఒప్పందం, ఎంఐఎంతో బహిరంగ ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్ ఎన్నికలకు వెళుతోంది. గత నాలుగేళ్లుగా అనేక సందర్భాల్లో కేసీఆర్ బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు. జీఎస్టీ, నోట్లరద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయాల్లో కేసీఆర్ ఏం చేశాడనేది తెలంగాణలోని మైనార్టీలు గమనిస్తున్నారు. ఇంత పచ్చిగా బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్ఎస్కు ఎంఐఎం ఎందుకు మద్దతిస్తోందో ఓవైసీ ఇంతవరకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెప్పలేదు. తక్కువ ధరకు భూముల కేటాయింపు, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వ్యక్తిగత లబ్ధి కోసం ఓవైసీ టీఆర్ఎస్కు మద్దతు పలకడం ముస్లిం సమాజంలో ఎవరికీ రుచించడం లేదు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కానీ, వక్ఫ్బోర్డు ఆస్తులు, భూముల రక్షణలో కానీ, ఉర్దూ అకాడమీని బలపర్చడంలో కానీ ముస్లింలకు కేసీఆర్ సాయపడలేదు. ఆలేరు ఎన్కౌంటర్, మక్కామసీదు పేలుళ్ల నిందితులను కిందికోర్టు దోషులుగా ప్రకటించినప్పుడు పైకోర్టుకు అప్పీల్కు వెళ్లకపోవడం కానీ, ముస్లిం పర్సనల్ లాలో బీజేపీ తలదూర్చినప్పుడు కేసీఆర్ మద్దతు పలకడంపై ముస్లిం సమాజం ఆగ్రహంతో ఉంది. ఈ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? కచ్చితంగా 80 స్థానాల కంటే ఎక్కువగానే గెలవబోతున్నాం. ఎవరికైనా సందేహాలున్నా డిసెంబర్ 11న నివృత్తి అయిపోతుంది. అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? మా మేనిఫెస్టో ఇప్పటికే విడుదల చేశాం. ఒకే దఫాలో రూ.2లక్షల రైతు రుణమాఫీ, 2009 తర్వాత తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, 17 పంటలకు గిట్టుబాటు ధరలు, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతుబంధు పథకం విస్తరణ, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు లబ్ధి కలిగేలా పెట్టుబడి సాయం, ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంపు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల భృతి, 20వేల పోస్టులతో మెగా డీఎస్సీ, పాతపద్ధతిలోనే డీఎస్సీ నిర్వహణ, మైనార్టీలకు సబ్ప్లాన్, ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5లక్షల వర్తింపు, ప్రతి మండలానికి 20–30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాతబకాయిల చెల్లింపు, పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2లక్షలు, వివాహాలకు ఆర్థిక సాయంగా రూ.1,50,116, తెల్లరేషన్కార్డు ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలెండర్లు, మహిళా సంఘాల రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు, రూ.50వేల వరకు రుణాల మాఫీ, రూ.లక్షకు తగ్గకుండా నగదు రూపంలో గ్రాంటు, సీసీఎస్ విధానం రద్దు, కొత్త పీఆర్సీ ద్వారా 01–07–2018 నుంచి ఆర్థిక ప్రయోజనాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి, కోటి ఎకరాలకు సాగునీరు, అన్ని ప్రాజెక్టులకు తగిన నిధుల కేటాయింపు వంటి హామీలిస్తున్నాం. మీరు సీఎం అవుతాననుకుంటున్నారా? నేను సీఎం అవుతానా కాదా అన్నది ప్రధానాంశం కాదు. మూడున్నరేళ్ల క్రితం నేను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులున్నాయి. ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కోల్పోవాల్సిన పరిస్థితి. సీఎంగా కేసీఆర్ 20 ఏళ్ల పాటు ఉంటాడని, పోటీనే లేదనే భావన చాలా మందిలో ఉండేది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తున్న ఓ అద్భుత స్థితికి పార్టీ వచ్చింది. ఇందులో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఎన్నికలతో పార్టీ అధ్యక్షుడిగా నా పాత్ర పూర్తవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలిసి ఎవరిని సీఎంగా ఎన్నుకున్నా నాకు ఆమోదయోగ్యమే. మీరు, మీ భార్య పద్మావతి ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? మీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది? ఇద్దరం సునాయాసంగా భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యేలు కాబోతున్నాం. మాకు పిల్లల్లేరు. తెలంగాణ ప్రజల కోసమే మా జీవితాలు అంకితం చేశాం. ఇదే విధంగా నిరంతరం నిస్వార్థంగా, నిజాయితీతో ప్రజా జీవితంలో కొనసాగుతాం. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే ఎన్నికల సందేశం ఏంటి? తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో తిరిగి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఏ త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధమై పూర్తి స్వేచ్ఛతో దేనికీ ప్రలోభపడకుండా, ప్రభావితం కాకుండా ఓటేయాలని విజ్ఞప్తి. తెలంగాణ అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లకు నా సవినయ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఉద్దేశం నెరవేరలేదు. తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, నిరుపేద వర్గాలకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరగలేదు. అవినీతి మితిమీరిపోయింది. మార్పు కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం, ధర్మగంట మోగే తెలంగాణ కోసం మనం ఓటేద్దాం. ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించండి. టీఆర్ఎస్ను గద్దె దింపండి.