Nagarjuna University
-
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్కుమార్, నాయకుడు పి.రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో విజయసాయిరెడ్డి
-
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్యూ -
నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం
ఏఎన్యూ: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకు ఉందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ సందేశం ఇస్తూ మానవాళి ప్రయోజనాలు పరిరక్షించే నూతన ఆవిష్కరణలకు యువత కృషిచేయాలని సూచించారు. చదువు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైతికత, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు. యువత నేర్చుకునే సాంకేతిక, నైపుణ్యం కేవలం తమ సొంతానికి మాత్రమే కాకుండా సమాజ హితం కోసం వాడాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సంక్షోభాలకు పరిష్కారం చూపే వైవిధ్యభరితమైన ఆవిష్కరణలు చేయడంతోపాటు వాటి ద్వారా అపారమైన అవకాశాలు సృష్టించాలని సూచించారు. ప్రపంచానికి స్టార్టప్ హబ్గా భారత్ నిలిచిందని, ఇది మంచి పరిణామమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే నిరుద్యోగంతోపాటు అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం నుంచి బయోటెక్నాలజీ వరకు ప్రతి అంశం మానవాళికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఏఎన్యూ అభివృద్ధి నివేదికను సమర్పించారు. అనంతరం ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. పలువురు విద్యార్థులకు పీహెచ్డీలు, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందించారు. అడిషనల్ డీజీ రవిశంకర్కు డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్కు డాక్టరేట్ పట్టాను గవర్నర్, వీసీ అందించారు. ఏఎన్యూ కామర్స్ విభాగంలో ఆచార్య జీఎన్ బ్రహా్మనందం పర్యవేక్షణలో రవిశంకర్ అయ్యన్నార్ పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏఎన్యూ రెక్టార్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఏపీ : సాయినాథ్ వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఏఎన్యూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యలపై తాను 2001–2002 కాలంలో అధ్యయనం చేశానని చెప్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీ సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి నిశితంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. ఆ సేవలకు దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్ను భావిస్తానని సాయినాథ్ తెలిపారు. -
నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీహెచ్డీ స్కాలర్స్కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ నజీర్ ప్రదానం చేశారు. -
నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
మరోసారి తన తీరుతో వార్తలో నిలిచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బుధవారం(మార్చి 15న) గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్కు వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చదవండి: క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ? అదే విధంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ ఏం లేకపోతే ఎలా.. అందుకే ఆ చాన్స్ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా’ అన్నాడు. ఒకవేళ స్వర్గంలో రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఇక తాను చనిపోయిన తర్వాత ప్రపంచమంత మరో క్షణంలో అంతమైన తాను లెక్కయనన్నాడు. ఎందుకంటే తాను కేవలం తన కోసమే బ్రతుకుతానన్నాడు. మీ భవిష్యత్తు ఏంటీ? మీరు ఎంత బాగా చదువుతున్నారనేది తాను కేర్ కూడా చేయనన్నాడు. చదవండి: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే తనకు మోక్షం కలుగుతుందంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో వర్మ కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా నిలిచాయి. ఇక వర్మ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న మహిళా లెక్చరర్లు షాక్ అయ్యారు. అయితే ఆర్జీవీ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అంతా గట్టి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయారు. -
ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలి: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు జిల్లా: దిశా యాప్తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రతీ మహిళ దిశా యాప్ను వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్లో జరిగిన ఘటనను చూసి ఏపీలో దిశ చట్టం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఆమె అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశిష్ట పురస్కారం అందుకోవడం తన అదృష్టమని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి రోజా అన్నారు. ‘‘నేను ఎంచుకున్న రెండు రంగాలు సవాళ్లతో కూడుకున్నవి. పురుషాధిక్యత ఉన్న ఈ రంగాల్లో రాణించేందుకు నా తండ్రి, సోదరులు, భర్త అండగా నిలిచారు. నాకు తోడబుట్టకపోయినా నేనున్నానని భరోసా కల్పించిన అన్న సీఎం జగన్. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు సక్సెస్ వచ్చి తీరుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లంటే చిన్నచూపు ఉంటుంది. మగ పిల్లాడిని ఒకలా.. ఆడ పిల్లను మరోలా చూస్తారు. ఇల్లు, బడి, ఉద్యోగం అన్ని చోట్లా మహిళలను గౌరవించాలి’’ అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
నాగార్జున వర్సిటీకి ప్రతిష్ఠాత్మక యూఐ గ్రీన్ మెట్రిక్ అవార్డు
-
ఏఎన్యూకి హరిత వర్సిటీ ర్యాంకు
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్యూ ఆంధ్రప్రదేశ్లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్ను అభినందించారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
సీఎం జగన్ గుండె ధైర్యం ఎంతో గొప్పది
ఏఎన్యూ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం ఎంతో గొప్పదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రశంసించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఎస్ఆర్ఏ) ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఏపీ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఏఎన్యూలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవీందర్రెడ్డి ప్రసంగిస్తూ భూములు రీ సర్వే చేయించాలంటే ఆ ముఖ్యమంత్రికి ఎంతో దమ్ముండాలని చెప్పారు. ఏపీలో భూముల రీ సర్వే ప్రారంభించిన సీఎం ఎంతో ధైర్యవంతుడన్నారు. రెవెన్యూకి సంబంధించిన సంస్కరణలు, సేవల్లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోందని, ఎన్నో అంశాలలో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.గౌతంకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూకి పూర్వవైభవం తెచ్చిన మహోన్నత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు, పాలకులు రెవెన్యూని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టినా.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కొత్త ఉద్యోగాలు కల్పించడం, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వంటి ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూకి జీవం పోశారని చెప్పారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రెవెన్యూలో ఆదర్శవంతమైన సంస్కరణలు తెస్తున్నారని ప్రశంసించారు. -
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
బయటి ప్రపంచాన్ని చూడండి
సాక్షి, అమరావతి: విద్యార్థులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచాన్ని చూడాలని.. సామాజిక ఉద్యమాల్లో సైతం పాలుపంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పిలుపునిచ్చారు. తామంతా కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అలాంటి ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. గతంలో విశ్వ విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలపై చర్చలు జరిపే వారని, ఇప్పుడు అలాంటి సమావేశాలేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే అసలైన సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా బోధన ఉండాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ తదితరుల సమక్షంలో జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ చేతుల మీద గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు భిన్నత్వానికి చిరునామాలని, తాను చదివిన విశ్వవిద్యాలయం నుంచే ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాముఖ్యతను కోల్పోతుండటం భయం కలిగిస్తోందని చెప్పారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యా సంస్థలు పాఠాలు నేర్పే ఫ్యాక్టరీలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఎవరిని, ఎందుకు నిందించాలో అర్థం కావడం లేదని, విద్యార్థులు సామాజిక సంబంధాలపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని సూచించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అనేక సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం చూపగలమని తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చని స్పష్టం చేశారు. సీజేఐ ఇంకా ఏమన్నారంటే.. పాఠాలొక్కటే ప్రధానం కాదు ► విద్యాలయాలు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల ఆలోచనలకు, ఆశయాలకు పరిచయ వేదికలుగా ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి గత నాలుగు దశాబ్దాల్లో వివిధ కోర్సులు అందించే 450 అనుబంధ కాలేజీలు ఏర్పడ్డాయి. ► మన దేశంలో వృత్తి విద్య విషయానికొస్తే.. ఎక్కువ జీతాలు, లాభదాయకమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు వచ్చే కోర్సులనే బోధిస్తున్నారు. హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, చరిత్ర, అర్థశాస్త్రం, భాషలు తదితర కోర్సులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రొఫెషనల్ యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదిలో పాఠాలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప, బయట ప్రపంచాన్ని చూడటం లేదు. ► అసలు విద్య ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వ్యక్తి కోసమా? సమాజం కోసమా? వాస్తవానికి ఈ రెండూ ముఖ్యమైనవే. విద్య ద్వారా వ్యక్తులు దార్శనికులుగా, నాయకులుగా మారుతారు. ఇదే సమయంలో విద్య మనల్ని సమాజ అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. నా మూలాలు మర్చిపోలేదు.. ► నాలుగు దశాబ్దాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చెట్ల కింద, క్యాంటీన్, డైనింగ్ హాల్లో మా ఆలోచనలు, సిద్ధాంతాలు, రాజకీయాలు, సమాజ సమస్యలపై చర్చించే వాళ్లం. ఆ చర్చలు, మా క్రియాశీలత ప్రపంచం పట్ల మా అభిప్రాయాలను మార్చాయి. ► అప్పట్లో ఈ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉండేవి. వాటిపై వర్సిటీ ఉద్యోగ సంఘం పోరాడేది. వారి వల్లే నేను అప్పట్లో ఈ వర్సిటీలో చేరాను. ఓ వ్యక్తి గొంతుక, అభిప్రాయాల తాలుక విలువ అప్పుడు మాకు తెలిసింది. ఈ రోజుకీ నేను నా మూలాలను మర్చిపోలేదు. ► మన విద్యా వ్యవస్థ రూపాంతరీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక సంబంధాలు, పౌర హక్కుల విలువలను నేర్పించేలా విద్యా వ్యవస్థ ఉండాలి. ఆర్థిక పురోగతి లక్ష్య సాధనలో మన సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతలను విస్మరించకూడదు. మమ్మల్ని దాటి ఆలోచించండి. సామాజిక అవసరాల పట్ల స్పృహ కలిగి ఉండండి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విద్యా శాఖ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలలను సాకారం చేసుకోండి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకునేంత వరకు వాటిని వెంటాడాలి. ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపొద్దు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జ్ఞాన కేంద్రాలుగా భాసిలుతున్నాయి. మన జీవితంలో చూస్తున్న చాలా ఆవిష్కరణలు యూనివర్సిటీల్లోనే పుట్టాయి. పరిశోధన, బోధన సమాంతరంగా సాగినప్పుడే విశ్వవిద్యాలయాలు విజయం సాధించగలుగుతాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ పోటీని తట్టుకునేలా విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. కార్యదీక్షతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని ఆయన నిరూపించారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
గుంటూరు (వేమూరు) నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని గోవాడకు చెందిన కనపర్తి దినేష్ ఈనెల 9న వైఎస్సార్ సీపీ ప్లీనరీకి వెళ్లి వస్తూ నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పార్టీ తరఫున వలంటీర్ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం.. మంత్రి మేరుగ నాగార్జున బుధవారం సాయం అందించారు. జగనన్న బీమా పథకం ద్వారా కూడా లబ్ధి వచ్చేటట్టు చూస్తామన్నారు. దినేష్ తల్లిదండ్రులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
తుది దశకు వైఎస్సార్సీపీ ప్లీనరీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017 జూలై 8, 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది. ప్లీనరీకి ప్రతినిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ 20 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 20 కమిటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, హోం మంత్రి తానేటి వనతి, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐటీ త్రివిక్రమ వర్మతో కలిసి బందోబస్తును, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ప్రతి ఊరికీ ప్రాతినిధ్యం ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు వైఎస్సార్సీపీ ఆహ్వానాలు పంపింది. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. తమను ప్లీనరీకి ఆహ్వానిస్తూ సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విస్తృతంగా శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి చూసినా స్పష్టంగా కన్పించేలా వంద అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 మీటర్ల ఎత్తుతో అత్యంత భారీ వేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా ఏ ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ నిర్మించారు. టిఫిన్లు, భోజనాల తయారీ కోసం భారీ ఎత్తున వంట శాలల ఏర్పాట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కసారి ఎనిమిది వేల మందికిపైగా టిఫిన్లు, భోజనాలు చేయడానికి వీలుగా భారీ టెంట్ను నిర్మించారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో సమాధి వద్ద మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ► ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భాంచాక తొలి సారిగా 2011 జూలై 8–9న ఇడుపులపాయలో ప్లీనరీ నిర్వహించింది. 2017 జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అదే వేదికపై నుంచి చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రకటించారు. ► ప్లీనరీ వేదికగా ఇచ్చిన భరోసాకు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చాక ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారు. మూడేళ్లలో ఏ దశలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఘన విజయాలు కట్టబెట్టారు. ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు ► రెండో ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం వల్ల ఈ మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటాన్ని మదింపు చేసి.. ప్లీనరీలో వివరించనున్నారు. ► విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, పారిశ్రామికాభివృద్ధి–ఉపాధి కల్పనకు చేపట్టిన చర్యలు, సామాజిక న్యాయం–సాధికారత, మహిళా సాధికారత–భద్రతలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా తీసుకున్న చర్యలు, నవరత్నాలు–డీబీటీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన తీరుపై చర్చించనున్నారు. ► ప్రజలు మెచ్చేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పిలుపునివ్వనున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
YSRCP Plenary 2022: ప్రజాభ్యుదయమే అజెండా
సాక్షి, అమరావతి: గతాన్ని మననం చేసుకుని.. వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడమే అజెండాగా ప్లీనరీ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. పార్టీ ఆవిర్భవించాక 2011, జూలై 8, 9న ఇడుపులపాయలో నిర్వహించిన తొలి ప్లీనరీ.. 2017, జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన రెండో ప్లీనరీలోనూ ప్రజాభ్యుదయమే అజెండాగా చేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చాక నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేవరకూ సుమారు పదేళ్లపాటు దేశ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, అటుపోట్లు, దాడులను వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొంది. ప్రజల తరఫున నిలబడి పోరాడింది. ప్రజల హృదయాలను గెలుచుకుని 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదేళ్ల పోరాటంలో ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతం అమలుచేసింది. ప్రజాభ్యుదయం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ప్లీనరీలో ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ముడిపడిన విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం–సామాజిక సాధికారత, మహిళా సాధికారత–రక్షణ, నవరత్నాలు–డీబీటీలు, పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పనపై చర్చించి.. వాటిని మరింత మెరుగ్గా అమలుచేయడంపై తీర్మానాలు చేయనున్నారు. జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించి పేదరికం నుంచి ప్రజలను గటెక్కించడం.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికార, సామాజిక సాధికారత సాధించడం ద్వారా రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలపడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడేళ్లలో పలు రంగాల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా.. విద్యారంగం.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆధునీకరించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన, గోరుముద్ద, నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంలో రూ.52,676.98 కోట్లను ఖర్చుచేశారు. ప్రపంచ విద్యార్థులతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటా రూ.24 వేల వరకు ఖర్చయ్యే.. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేయనుంది. వైద్యరంగం.. ప్రజలకు వైద్య సేవలను మెరుగ్గా అందించడానికి ప్రభుత్వాస్పత్రులను కూడా నాడు–నేడు కింద సీఎం వైఎస్ జగన్ ఆధునీకరిస్తున్నారు. వీటిల్లో 40,180 ఉద్యోగాలను భర్తీచేసి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఓ వైద్య కళాశాల ఏర్పాటుచేయాలనే లక్ష్యంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయం.. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు తోడునీడగా నిలవడం ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఉచితంగా పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ.. అధిక దిగుబడులు సాధించడానికి బాటలు వేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. పంటల బీమా కింద రైతులకు పరిహారం అందిస్తూ పంట పండినా.. ఎండినా.. తడిసినా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టారు. సామాజిక న్యాయం–సాధికారత.. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం చేయడం ద్వారా ఆ వర్గాలు సాధికారత సాధించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. తొలిసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి, సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. అలాగే, దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ అమలుచేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశమిచ్చారు. శాసనమండలి చైర్మన్గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి.. డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ మహిళకు ఇచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే సింహభాగం అవకాశమిచ్చి.. సామాజిక న్యాయం, సాధికారతలో వైఎస్ జగన్ దేశానికి రోల్మోడల్గా నిలిచారు. మహిళా సాధికారత–రక్షణ.. మహిళా సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నావడ్డీ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. తొలి కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో నలుగురికి అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారు. ఇక 30.56 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను మహిళల పేర్లతోనే ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పన.. పారిశ్రామికరంగ ప్రోత్సాహకానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, పర్యావరణ హిత గ్రీన్ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వారు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రిస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలతో కలిపి రూ.2,086 కోట్లు వరుసగా రెండేళ్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది కూడా ఆగస్టులో చెల్లించనున్నట్లు సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో.. పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రాంరంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశలో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.126 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది. చరిత్ర మెచ్చేలా మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,21,518 మందికి ప్రభుత్వ కొలువులిచ్చి సొంత ఊరిలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించింది. నవరత్నాలు–డీబీటీ.. పేదరికం నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నవరత్నాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా మూడేళ్లలో రూ.1,41,247.94 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.43,682.65 కోట్లను పేదల కోసం ఖర్చుచేశారు. దుష్టచుతుష్టంపై సమరభేరి ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా.. సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం.. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే అధిక మెజార్టీ వైఎస్సార్సీపీకి రావడమే అందుకు తార్కాణం. ఇది చూసి ఓర్వలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మూకుమ్మడిగా అవాస్తవాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఈ దుష్టచతుష్టయంపై యుద్ధంచేసి.. దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా పిలుపునివ్వనున్నారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా లక్షలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి వేలాది వాహనాల్లో శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ముఖ్యమంత్రి అధికారిక విధులు నిర్వర్తించడానికి వేదిక వెనుకవైపు తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ వంటకాలతో విందు ప్లీనరీకి హాజరయ్యే లక్షలాది పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సంప్రదాయ వంటకాలతో జూలై 8, 9న టిఫిన్, విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల బాధ్యతను దేశంలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాఇందుపల్లి వాసులకు అప్పగించారు. దీనికి సమీపంలోనే విశాలమైన భోజనశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ వేడి వేడిగా ఫలహారాలు, కాఫీలు, భోజనాలు వడ్డిస్తారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7 నాటికి ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని రఘురాం చెప్పారు. -
పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్యూ
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ.. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ సిమ్యులేటర్ ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్ ఏఎన్యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్లు టార్గెట్ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీడీఎంఏ ట్రాన్స్ రిసీవర్ ఈ ప్రాజెక్టును డీఆర్డీఓ (డిఫెన్స్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఏఎన్యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్ చేయకుండా ఈ రిసీవర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్లో సాఫ్ట్వేర్కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. శాటిలైట్ డేటా ఎనాలసిస్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్ సిమ్యులేటర్ అనే ప్రత్యేక లైసెన్స్డ్ సాఫ్ట్వేర్పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్యూలోనే అందుబాటులో ఉంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఫ్రాన్స్కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్యూలో రూ.5 కోట్ల వ్యయంతో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్యూ రాష్ట్ర స్థాయి నోడల్ సెంటర్గా కూడా కొనసాగుతోంది. వీఎల్ఎస్ఐలో పేటెంట్ స్థాయి పరిశోధనలు ఇంజినీరింగ్ కళాశాలలోని వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్లెన్సీ సెంటర్)ను ఇన్టెల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో ఏఎన్యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్ కూడా లభించింది. ఈ సెంటర్కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్, పరికరాలను ఓ కంప్యూటర్ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది. -
ఏఎన్యూలో ఉర్దూ ప్రత్యేక విభాగం ఏర్పాటు
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేలు బాటలు వేస్తోంది. మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తించింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉర్దూ కోర్సు విభాగం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి మరో ముందడుగు వేసింది. అంతేగాకుండా అరబిక్ కోర్సును ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్యూ(గుంటూరు): ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం, యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. ముస్లిం యువతీయువకులు అధికంగా అరబిక్, ఉర్దూ భాషల్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అరబిక్, ఉర్దూ భాషల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ప్రత్యేకంగా విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ముస్లిం యువతీయువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు చేపడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. పదేళ్లుగా ముస్లిం సంఘాలు వినతి రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం ముస్లిం వర్గాల వినతులను పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంఘాల వినతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కలిసి విన్నవించుకోగా ఏఎన్యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్యూ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్యూలో ఉర్దూ కోర్సు నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా కార్యాచరణ పూర్తి చేసింది. పరిశీలనలో అరబిక్ కోర్సు వినతులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేసి అరబిక్ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను విన్నవించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చింది రాష్ట్రంలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉర్దూ, అరబిక్ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రంలో ఈ కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల ముస్లిం యువతీయువకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. – డాక్టర్ మస్తాన్ ఆలీ, ముస్లిం సంఘాల జేఏసీ సభ్యుడు ముస్లిం సంఘాల హర్షం ఏఎన్యూలో ఉర్దూ విభాగం ప్రారంభించడం, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అరబిక్ విభాగ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, ఉర్దూ భాషను ఐచ్చిక ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మదరసాలలో ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థులతోపాటు, అరబిక్, ఉర్దూ బోధకులుగా స్థిరపడాలనుకునే వారికి, ధార్మిక పండితులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా
సాక్షి, ఏఎన్యూ: జన క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్ సీపీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఆ పార్టీ యువతరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు నాందిపలికింది. నిరుద్యోగులతోపాటు కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో పలు రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారికి అవకాశాలను చేరువచేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది. భారీ స్పందన ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి 90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాబ్మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్ అడ్రస్కు రెజ్యూమ్ పంపవచ్చు. కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జాబ్మేళా నిర్వహణకు ఏఎన్యూలోని డాక్టర్ వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్ బ్లాక్ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్మీడియెట్ చదివిన వారికి ఒక బ్లాక్లోనూ, డిగ్రీ, పీజీ కోర్సులకు మరో భవనంలోనూ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల వారికి ఇంకో భవనంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీనికోసం ఈ భవనాల్లోని 100కుపైగా గదులను ఇప్పటికే సిద్దం చేశారు. 500 మంది వలంటీర్ల నియామకం మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులకు సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్కు ఆన్లైన్ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు. చదవండి:‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’ విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. యువత కోసమే.. నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కారుమూరి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసమే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో విజయవంతం చేస్తాం... జాబ్మేళా ఏర్పాట్లకు సహకారం అందించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖలూ పూర్తి సహకారం అందిస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరి సహకారంతో జాబ్మేళాను విజయవంతం చేస్తాం. – ఎ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జాబ్మేళా పర్యవేక్షకులు -
అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తేనే సమాజాభివృద్ధి
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు చేయూతనందించి.. వారిని తీర్చిదిద్దితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సాంఘిక సంక్షేమ పథకాల అమలు’పై గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలు, తదితర అట్టడుగు వర్గాలు తమకు కావాల్సినవాటిని హక్కుగా అడిగేలా.. అవసరమైతే ప్రశ్నించేలా వారిని తీర్చిదిద్దినప్పుడే మెరుగైన సమాజం సాధ్యమన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా సాధించుకోలేని స్థితిలో తరతరాలుగా అట్టడుగు వర్గాలు అలక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సంక్షేమ ఫలాలు అందించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ మహాయజ్ఞాన్ని సీఎం జగన్ మరింత వేగంగా చేపట్టారని చెప్పారు. వైఎస్ ఆశయాలు, సీఎం వైఎస్ జగన్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా ఎస్సీలు అభివృద్ధి పథంలో నడిచేలా మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరైనా చనిపోతే ఆ ఖాళీలోనే కొత్త పెన్షన్ ఇచ్చేవారని సజ్జల గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోటా, వాటా అనే మాటలకు తావులేకుండా.. పరిమితి, కాలపరిమితి చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వానికి నిధుల అడ్డంకి లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎస్సీ కుటుంబం సగర్వంగా తలెత్తుకుని జీవించేలా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల స్థితిగతులను మార్చేందుకు సీఎం చేపడుతున్న కార్యక్రమాలను దేశంలో మరే రాష్ట్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, తదితరులు మాట్లాడారు. -
మే 1, 2 తేదీల్లో వైఎస్సార్సీపీ మెగా జాబ్మేళా
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) ఇంజినీరింగ్ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్మేళా పోస్టర్ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఏఎస్ఎన్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ జాబ్మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు) -
గుంటూరు: 30న, మే 1న మెగా జాబ్మేళా
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న, వచ్చే నెల 1న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడ్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. జాబ్మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
అన్నీ రంగాల్లో మహిళకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు
-
కోవిడ్ కారణంగా పరీక్షల వాయిదా కుదరదు
సాక్షి, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 20 నుంచి జరగాల్సిన బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను కోవిడ్ కారణంతో వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నాగార్జున వర్సిటీ బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా కోరుతూ ఒడిశా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఏవీ శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఒడిశా విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరవుతున్నారని, కోవిడ్ వల్ల రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ తరఫు న్యాయవాది కొప్పినీడు రాంబాబు వాదనలు వినిపిస్తూ.. పరీక్షల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్ను అమలు చేస్తూ విశ్వవిద్యాలయం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ, కోవిడ్ మన జీవితాల్లో భాగమైపోయిందన్నారు. కోవిడ్ను కారణంగా చూపుతూ ఎంత కాలం వేచి చూడగలమని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు చేసినందున, పరీక్షల వాయిదా సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పరీక్షల వాయిదా కోసం దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. -
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
ఏఎన్యూలో టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ).. టీచింగ్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–03, నాన్ టీచింగ్ పోస్టులు–04. ► టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్. అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్–01, నర్సు(ఏఎన్ఎం)–02, కౌన్సిలర్– 03, డేటాఎంట్రీ ఆపరేటర్–01, వార్డ్బాయ్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్(ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి. ► వయసు: 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021 ► వెబ్సైట్: ananthapuramu.ap.gov.in గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► పోస్టుల వివరాలు: వాచ్మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02. ► అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: spsnellore.ap.gov.in -
నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా
సాక్షి, గుంటూరు: ‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి’ అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ చరిత్రకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని నాగార్జున కొండ, అనుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా.. ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తోంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన సామాన్య శక పూర్వం (క్రీస్తు పూర్వం) 2వ శతాబ్దం నాటి బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శన శాలలో భద్రపరిచారు. ఇది ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శన శాలలు అన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల. బుద్ధునిదిగా చెప్పబడుతున్న దంతావశేషం ఇందులో చూడదగ్గవి. బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, స్థూపాలు కొండపై గల ఐలండ్ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని అనుపులో దర్శనమిస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు దేశ, విదేశాల బౌద్ధ ఆరాధకులు, పర్యాటకులతో ఈ ప్రాంతాలు కళకళలాడుతుండేవి. కరోనా వ్యాప్తి కారణంగా ఏడాది కాలంగా ఇక్కడ పర్యాటక శోభ తగ్గింది. 144 ఎకరాల విస్తీర్ణంలో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జున కొండ. ఈ కొండపై 1966లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలండ్ మ్యూజియం ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అనుపులో పదిలంగా ఉన్నాయి. విజయపురి సౌత్కు 8 కిలోమీటర్ల దూరంలోని అనుపులో విశ్వవిద్యాలయం ఉంది. మహాయాన బౌద్ధమత ప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కృష్ణా నది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తాయి. విశ్వవిద్యాలయ ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు కృష్ణా నది లోయలో విద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు. రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్టు ఆధారాలున్నాయి. చరిత్రకారులు పాహియాన్, హ్యుయాన్త్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది. నాగార్జునుని మరణానంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్టు ఆధారాలున్నాయి. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, శ్రీలంక, మలేషియా, టిబెట్, భూటాన్, థాయ్లాండ్, బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ, అనుపు సందర్శనకు వస్తారు. ఆర్థికంగా నష్టపోయాం కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి పర్యాటకుల తాకిడి లేదు. దీంతో వ్యాపారాలు లేవు. ఆర్థికంగా చితికిపోయాం. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వాలు పర్యాటకంగా మా ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలి. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరచాలి. – వెంకట్రావు, హోటల్ నిర్వాహకుడు, విజయపురి సౌత్ -
‘అనంత’లో చూచిరాత బాగోతం..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మీకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలా! అయితే, మా సెంటర్లో చేరండి.. కచ్చితంగా పాస్’’ తరహా ప్రకటనలతో దూరవిద్య కేంద్రాలు డబ్బు పోగేసుకుంటున్నాయి. జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది విద్యార్థుల వరకూ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, పరీక్షల్లో పాస్ చేస్తామని ముందుగానే అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లు .. పరీక్షల సమయంలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాపిస్తామంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. ఈ విధంగా వసూలు చేసి.. ఇందులో యూనివర్సిటీ అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఎన్యూకు అనుబంధంగా అనంతపురంతో పాటు తాడిపత్రి, ధర్మవరం, పామిడిల్లో కేంద్రాలుండగా..ఆయా చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగానే ఆయా సెంటర్లలో ఎవరు కూడా నేరుగా రాకుండా గేట్లు వేసి మరీ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తున్నట్టు తెలిస్తే లోపల ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. తద్వారా ఆ సమయంలో కాపీయింగ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా తమ పని కానిస్తున్నారు. మొత్తంగా దూరవిద్య పేరుతో కొన్ని సెంటర్లు డబ్బుల దందాకు తెరలేపి చదువుకు మరీ విలువ లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.60 లక్షలకు పైమాటే.. జిల్లాలో మొత్తం 3వేల మంది వరకూ ఏఎన్యూ దూర విద్యకు హాజరువుతున్నారు. వీరికి కనీసం పుస్తకాలు కూడా సకాలంలో అందించలేదు. దీంతో పరీక్షకు ఎవ్వరూ సిద్ధమయ్యే పరిస్థితి లేదు. తీరా పరీక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షల్లో పాసు కావాలన్నా.. చూసి రాయలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇవ్వాలని సదరు దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరీక్షలు రాస్తున్న 3వేల మంది విద్యార్థులు కాస్తా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారు చూచి రాసేందుకు అనుమతించడం లేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టి చూసిరాసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 వేల మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున లెక్కిస్తే రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో యూనివర్సిటీ దూరవిద్య అధికారులకు కూడా భారీగానే ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పరిశీలకులు ఎక్కడ?.. వాస్తవానికి దూరవిద్య పరీక్షలు జరిగే సమయంలో సదరు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది పరిశీలకులుగా వస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అక్కడే మకాం వేసి కట్టుదిట్టంగా పరీక్షలు జరిగేలా చూడాలి. అయితే, ఏఎన్యూ దూర విద్యలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశీలకులు ఎక్కడా కనిపించని పరిస్థితి. కనీసం సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
పరీక్ష రాస్తుండగా పేపర్ లాగేశారు
ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది. మారని అధికారుల తీరు.. జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు. కనిపించని సమన్వయం.. జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్) 18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. – ఎఎన్యూ పరీక్షల విభాగం -
ఏబీకే ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశిష్ట కార్యక్రమానికి గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ చాన్స్లర్ హోదాలో హాజరయ్యారు.యూనివర్శిటీ డైక్మెన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వీసీ రాజశేఖర్, రిజిస్ట్రార్ రోశయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.180 మంది స్కాలర్స్కు వివిధ విభాగాల్లో డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశారు. పరిశోధన, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అద్భుత ప్రతిభ చూపిన 249 విద్యార్థులకు గవర్నర్ హరిచందన్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. -
ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?
సాక్షి, కృష్ణా : ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం శిథిలాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి వైభవాన్ని ఈ శిథిలాలు చాటిచెబుతున్నాయి. నాగార్జునసాగర్లోని విజయపురిసౌత్కు 8కిలోమీటర్ల దూరంలోని అనుపులో ఈ విశ్వ విద్యాలయం ఉంది. ప్రతి రోజూ నాగార్జున సాగర్కు వందలమంది సందర్శకులు వస్తున్నా ఈ ఆనవాళ్ల గురించి ఎవరికీ తెలియదు. కనీసం లాంచీ స్టేషన్ సమీపంలో నైనా దీనిగురించి వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం విచారకరం. సాగర్ నుంచి బెల్లంకొండవారిపాలెం మీదుగా మాచర్ల వైపునకు ఉన్న రహదారికి కిలోమీటరు దూరం లోపల ఈ ప్రదేశం ఉంది. ఇదే శ్రీపర్వత విహారంగా ప్రసిద్ధి పొందింది. ఈ విద్యాపీఠంలో ఆనాడు వివిధ దేశాల విద్యార్థులు విద్యనభ్యసించారు. మహాయాన బౌద్ధమత ప్రచారంలో ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భూమిక నిర్వహించింది. కృష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో ఈ విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. 1976కు ముందు ఈ పాత అనుపు నుంచే పర్యాటకశాఖ లాంచీ సర్వీసులు నాగార్జునకొండకు నడిపేవారు. దీంతో అనుపును పర్యాటకులు సందర్శించటానికి సౌకర్యంగా ఉండేది. ఆ తరువాత విజయపురిసౌత్(రైట్బ్యాంక్)కి లాంచీస్టేషన్ను మార్చటంతో పాత అనుపు వద్దకు పర్యాటకులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. దీంతో ఆ ప్రదేశం నిరాదరణకు గురైంది. దీనిని సందర్శించాలనే ఆపేక్ష ఉన్నా తగిన ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో సాగర్కు వచ్చిన పర్యాటకులు దీనిని చూడకుండానే వెళ్లిపోతున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు క్రీ.శ.3వ శతాబ్దంలో ఇక్కడ కృష్ణానదీ లోయలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ విహారం ఐదు అంతస్తులు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. బౌద్ధమతానికి చెందిన అనేక గ్రంథాలు రెండవ అంతస్తులో ఉండేవి. చైనా, జపాన్, శ్రీలంక, భూటాన్ తదితర వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించేవారు. ఇక్కడ రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ.7వ శతాబ్దంలో హ్యూయాన్స్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంత కాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర పుటలు చెబుతున్నాయి. నాగార్జునుడి మరణానంతరం కూడా ఈ విశ్వ విద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్లు ఆదారాలున్నాయి. ఇంత ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయం ఆనవాళ్లను సందర్శించేందుకు రవాణా సౌకర్యం లేకపోవటం విచారకరం. కనీసం శని, ఆదివారాల్లోనైనా మాచర్ల డిపో బస్సులను అనుపు ప్రాంతానికి నడిపితే పర్యాటకులు దీనిని సందర్శించటానికి వీలవుతుందని విహార యాత్రికులు కోరుతున్నారు. కనీసం టూరిజం పరిధిలో ఉన్న మినీ బస్సులనైనా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. -
రూసా నిధుల్లో చేతివాటం!
సాక్షి, ఏఎన్యూ(కృష్ణా) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూసా(రాష్ట్రీయ ఉచ్చాతర్ శిక్షా అభియాన్) పథకం కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మంజూరైన నిధుల వినియోగంలో గందరగోళం నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని, అన్న(మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు) అండదండలను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వర్సిటీ లైబ్రేరియన్ కోడెల వెంకటరావు రూసా పథకం కింద పుస్తకాలు కొనుగోలు విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూసా నిధుల కింద పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు సమర్పించిన బిల్లులకు చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండగా, వీటిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా ఈ అంశం పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. పుస్తకాల కొనుగోలుపై అభ్యంతరాలు: రూసా పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు నిధుల కోసం ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లో రూ.18 లక్షలు పుస్తకాల కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపారు. రూసా నుంచి ఏఎన్యూకి 2018లో ఈ నిధులు వచ్చాయి. దీంతో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదించిన రూ.18 లక్షల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో ప్రతిపాదిత సంవత్సరాల్లో తాను రూ.11.90 లక్షలకు పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు వర్సిటీకి బిల్లులు సమర్పించారు. బిల్లులు పరిశీలించిన రూసా అధికారులు పుస్తకాలు అవసరమంటూ విభాగాధిపతులు, సబ్జెక్ట్ ఎక్స్ఫర్ట్స్, అధ్యాపకులు, బీఓఎస్ చైర్మన్లు, విద్యార్థులు ఎవరైనా కోరినట్లు లేఖలు ఉండాలని, ఎవరూ కోరకుండా ఎలా పుస్తకాలు కొనుగోలు చేశారో స్పష్టం చేయాలని కోరినట్లు సమాచారం. చెల్లింపులపై ఒత్తిడి పుస్తకాల కొనుగోలుకు సమర్పించిన రూ.11.90 లక్షల బిల్లులకు రూసా నిధుల నుంచి చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులు చేయాలంటూ ఉన్నతాధికారులు సంబంధిత ఫైలుపై లిఖిత పూర్వకంగా రాస్తే తమకు అభ్యంతరం లేదని కూడా రూసా అధికారులు పేర్కొన్నారు. ఏ విధంగానైనా పని జరగాలని చూసిన కొందరు అధికారులు రూసాకు ప్రతిపాదనలు పంపిన సంవత్సరాలకు గాను పుస్తకాల కొనుగోలుకు దాదాపు రూ.7 లక్షలకు యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లింపులు చేశామని, ఈ మొత్తాన్ని రూసా ఫండ్ నుంచి యూనివర్సిటీ జనరల్ ఫండ్ ఎకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎకౌంట్స్ విభాగం కోరినట్లు తెలిసింది. తీరా ఆ బిల్లులను పరిశీలిస్తే వాటిలో రూ.3 లక్షలు పుస్తకాల బైండింగ్కు చెల్లింపులు చేశామని పేర్కొన్నట్లు సమాచారం. ఏఎన్యూ లైబ్రరీలో బైడింగ్ విభాగం, దానిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండగా, బయట వ్యక్తులతో బైండింగ్ చేయించినట్లు బిల్లులు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కొన్ని పుస్తకాలకు 28 శాతం వరకు డిస్కౌంట్, కొన్ని పుస్తకాలకు 20 వరకు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణాలతోనే చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. కోడెల తీరుపై విమర్శలు లైబ్రరీకి పుస్తకాల కొనుగోలు విషయంలో లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తకాల కొనుగోలు చేయాలని కొందరు కోరారని చెబుతూ తన సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు అధ్యాపకులు, తనకు అనుకూలంగా నడుచుకునే ఓ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి లేఖలు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ ఆంజనేయులును వివరణ కోరగా, రూసా నిధుల పుస్తకాల కొనుగోలు బిల్లుల చెల్లింపు విషయం కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. బిల్లులపై ఆరోపణల విషయం తనకు తెలియదని తెలిపారు. చెల్లింపులు చేయమని ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా ఆదేశాలిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని వివరించారు. -
క్యాంపస్ కోడెల అధికార దుర్వినియోగం
సాక్షి, ఏఎన్యూ(గుంటూరు) : గౌరవ ప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన బంధువుగా చెప్పుకునే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు యూనివర్సిటీలో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డారనే అంశం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో చక్రం తిప్పారు. కే–ట్యాక్స్ల పేరుతో అమాయక జనాన్ని పట్టిపీడించారు. పశువుల గడ్డి నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ వరకూ దేన్ని వదలకుండా దోచేశారు. అన్న కుటుంబం రాష్ట్రంలో దోచేస్తోంది. నేనెందుకు ఊరికే ఉండాలి అనుకున్నాడే ఏమో మరి ఏఎన్యూలోని లైబ్రేరియన్ కోడెల వెంకట్రావు. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. విలువలు, సిద్ధాంతాల్లో సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన యూనివర్సిటీని సొంత సామ్రాజ్యంలా మార్చుకుని పలు అక్రమాలకు తెరతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా.. యూనివర్సిటీలో లైబ్రేరియన్ అయిన కోడెల వెంకట్రావు కోడెల శివప్రసాదరావుకు వరుసకు తమ్ముడు. ఈయన యూనివర్సిటీలో పలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు యూనివర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం, మాజీ స్పీకర్ కోడెల నుంచి పూర్తి సహకారం అందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లైబ్రేరియన్ల డిజిగ్నేషన్స్ను ప్రొఫెసర్గా మార్చుతూ రీ డిజిగ్నేషన్స్ కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడెలకు ప్రొఫెసర్గా రీ డిజిగ్నేషన్ కల్పిస్తూ 2011లో అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఆయన వేతనం, సర్వీస్ కండీషన్స్లో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొన్నారు. కాని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పాలకమండలి(ఈసీ)లో యూనివర్సిటీ టీచర్ల కోటాలో కోడెలను సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. టీచర్ కాని వ్యక్తిని టీచర్ల కోటాలో ఈసీ మెంబర్గా నియమించడంపై అప్పట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డాక్టర్ కోడెల వెంకటరావు అధ్యాపకుడా కాదా అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతుంటే మూడున్నరేళ్ల కిందట ఆయనకు అధ్యాపకుడి కోటాలో ఈసీ సభ్యత్వం ఇవ్వడం, అప్పటి యూనివర్సిటీ పాలకులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. ఈ అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగానే మిగిలింది. ఎప్పుడో మూసేసిన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని తాను ఈసీ మెంబర్గా నియమితుడైన తర్వాత 2017లో మరలా ప్రారంభించేందుకు పాలకమండలిలో ఆమోదింపజేసుకున్నాడు. తాను అధ్యాపకుడిని అనిపించుకునేందుకే ఆయన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని ప్రారంభించాడనే విమర్శలూ ఉన్నాయి. సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్గా.. పాలకమండలి సభ్యుడిగా చక్రం తిప్పి ఎంఎల్ఐఎస్సీ విభాగానికి అనుమతి తెచ్చుకున్న డాక్టర్ కోడెల వెంకటరావు ఆ విభాగానికి మూడేళ్లకు పైగా సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్(స్వయం ప్రకటిత విభాగాధిపతి)గా చక్రం తిప్పాడు. ఏ విభాగంలోనైనా రెగ్యులర్ అధ్యాపకుడు మాత్రమే ఆ విభాగానికి అధిపతిగా వ్యవహరించే నిబంధనలు ఉన్నాయి. కాని లైబ్రేరియన్న్డాక్టర్ కోడెల ఎంఎల్ఐఎస్సీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడు)గా పనిచేస్తూ రెమ్యునరేషన్ తీసుకుంటూ అదే విభాగానికి హెడ్గా వ్యవహరించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రెగ్యులర్ అధ్యాపకులు లేని విభాగానికి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ను విభాగాధిపతిగా నియమించాల్సిన ఉన్నతాధికారులు ఏ విధమైన ఉత్తర్వులు లేకుండానే ఆ విభాగాన్ని పాలించుకోమన్నట్లు అప్పజెప్పారు. దీంతో ఎంఎల్ఐఎస్సీలో అతిథి అధ్యాపకుల నియామకంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. నేటికీ అదే తీరు.. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల వెంకట్రావు చేసిన అధికార దుర్వినియోగానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అండదండలు అందించిందని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు మాత్రం నేటికీ ఆయనకు పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నారని విమర్శలూ ఉన్నాయి. కేవలం ప్రొఫెసర్ హోదా మాత్రమే ఉన్న ఈయనకు సర్వీస్ విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదని, నిబంధనల్లో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం, రీ డిజిగ్నేషన్స్ తర్వాత కూడా అధ్యాపకేతర ఉద్యోగులు తీసుకునే సరెండర్ లీవ్స్ను ఎన్క్యాష్ మెంట్ చేసుకోవడం వంటివి జరిగినా న్యాయస్థానాల్లో వాటిని యూనివర్సిటీ బలంగా చూపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. కోడెల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఇప్పటికే కొందరు లోకాయుక్తను ఆశ్రయించగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై డాక్టర్ కోడెల వెంకటరావును వివరణ కోరగా నేను దీనిపై స్పందించనని స్పష్టం చేశారు. -
డార్లింగ్ గారు
అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్మెట్లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. ఇన్స్టిట్యూట్కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు. డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!! నవ్వుల కెమిస్ట్రీ! అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు! – డి.వి.తులసి, విజయవాడ – నక్కా రాజశేఖర్, కఠెవరం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. -
‘అరుదైన’ పదవిలో తెలుగుతేజం
తెనాలి: ఆచార్య నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడు, బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ ‘వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్’ (వార్మ్స్) ఎడిటర్గా నియమితులయ్యారు. భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో డేటాబేస్ నిర్వహణ ‘వార్మ్స్’ సంస్థ ప్రధాన కార్యక్రమం. 2008లో ఏర్పాటైన ఈ ప్రపంచ సంస్థ, బెల్జియంలోని ఓస్టెండ్ నగరంలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ జాబితా తయారీకోసం 40 దేశాలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలతో కూడిన సంపాదక బృందం నిరంతరం కృషిచేస్తోంది. ఈ బృందంలో భారతదేశం నుంచి ఎంపికైన తొలి శాస్త్రవేత్తను తానేనని డాక్టర్ షాబుద్దీన్ సోమవారం వెల్లడించారు. ‘బేథినిల్లేసియా’ అనే నీటి కీటక జాతికి ప్రాతినిథ్యం వహిస్తూ, కొత్త జాతులు, అధికారిక సమాచారం, ఆసక్తికరమైన ప్రాంతీయ జాతుల కొరత, వాటి ఆవాసాలు వంటి అదనపు సమాచారాన్ని పొందుపరిచేందుకు ‘వారŠమ్స్’ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ షాబుద్దీన్ వివరించారు. మెకానిక్ కొడుకుగా.. షాబుద్దీన్ షేక్ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్. తల్లి రహమతూమ్ గృహిణి. షాబుద్దీన్ చిన్నతనంనుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్ మొహిద్దీన్ బాచ్చా దగ్గర పెరిగాడు. ఇంటర్ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. జువాలజీలో బంగారుపతకం సాధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ‘వార్మ్స్’ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా షాబుద్దీన్కు అవకాశం లభించింది. డాక్టర్ రంగారెడ్డి నేతృత్వంలో షాబుద్దీన్ ప్రకృతి సహజ గుహల్లో కటిక చీకటి మాటున దాగున్న జీవరాశులను అన్వేషిస్తూ డాక్టర్ షాబుద్దీన్, ఆంధ్రాలోని బెలూమ్, బొర్రా, గుత్తికొండ గుహలు, మేఘాలయాలోని భారీ గుహల్లో పరిశోధన సాగించారు. ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు. అందులో ఒక జీవికి ‘ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్’గా నామకరణం చేశారు. 18 జీవుల గురించి అంతర్జాతీయ ప్రీ రివ్యూ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. గుహలలోని జీవవైవిధ్యంపై షాబుద్దీన్ చేసిన పరిశోధనకు నాగార్జున యూనివర్సిటీ 2017లో పీహెచ్డీ ప్రదానం చేసింది. ఆ థీసిస్ను అధ్యయనం చేసిన ‘ఎడ్యుడికేటర్స్’, ఉత్తమ థీసిస్ అవార్డుకు సిఫార్సు చేయటం మరో విశేషం. జాతీయస్థాయిలో ప్రతిష్టాకరమైన డాక్టర్ కేవీరావ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2016), డాక్టర్ నాగరాజు మెమోరియల్ రీసెర్చ్ అవార్డును షాబుద్దీన్ అందుకున్నారు. విశాఖలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ సభల్లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు స్వీకరించారు. ఈ యువశాస్త్రవేత్తకు వివిధ అంతర్జాతీయ శాస్త్ర సంస్థలోనూ సభ్యత్వముంది.ఇటీవలే ఆయనకు జువాలజీ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ లభించింది. -
తనఖా భూములనూ మింగేస్తున్న లింగమనేని
-
14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ నెల 14న గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షు డు పవన్కల్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మహాసభను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 14న మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
తాత్కాలిక హైకోర్టుకు వసతుల పరిశీలన
ఏఎన్యూ (పొన్నూరు)/తుళ్లూరు రూరల్/ ఇబ్రహీంపట్నం (మైలవరం) : తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనాలను పరిశీలించింది.ఈ బృందంలో న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఉన్నారు. -
నాగార్జున వర్సిటీలో హైకోర్టు జడ్జిల బృందం
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి శనివారం హైకోర్టు జడ్జిల బృందం చేరుకుంది. రాష్ట్ర హైకోర్టు ను ఏపీ రాజధానిలో ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఏఎన్యూలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ఉన్న మౌలిక వసతులు, పరిస్థితులను జడ్జిల బృందం పరిశీలిస్తోంది. జిల్లా కలెక్టర్ శశిధర్ తో కలసి జడ్జిలు యూనివర్సిటీ పరిశీలన చేస్తున్నారు. అనంతరం వర్సిటీ ఉన్నతాధికారులతో జడ్జిల బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించనుంది. మరోవైపు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాధన కమిటీ వినత పత్రం అందజేసింది. -
ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదా లు ఉన్నాయని ప్రకృతి శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ వద్ద ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసా యం’పై రైతులకు ఇస్తున్న రాష్ట్ర శిక్షణ సదస్సులో సోమవారం రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ విదేశీ వానపాములు, వర్మికంపోస్టు దుష్ఫలితాల గురించి, స్వదేశీ వానపాముల వలన లాభాలను వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నాలుగు అంశాలు వివరించారు. ముఖ్యంగా పంటకయ్యే ఖర్చు అంతర్ పంటల ఆదాయంతో భర్తీ చేయవచ్చని తెలిపారు. మొక్కల పెంపుదలకు కావాల్సిన ఏ ముడిపదార్ధాలు కొనుగోలు చేయకుండానే తయారు చేసుకోవచ్చని వివరించారు. యోగ వ్యవసాయ గురించి, దీనివల్ల కలిగే మోసాలు, అగ్నిహోత్ర గురించి ప్రత్యేకంగా తెలిపారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, జాయింట్ కలెక్టర్ –2 ముంగా వెంకటేశ్వరరావు, జేడీ విజయభారతితోపాటు రైతులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్ పాలేకర్ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్ మేనేజర్గా మారి దాన్ని ప్రమోట్ చేస్తానని బాబు వివరించారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతే నా ధ్యాస రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఐఈఏ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి
సాక్షి, గుంటూరు: ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ధి ఉత్సవాలను బుధవారం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ' భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు' పేరిట నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగునుంది. ఈ కార్యక్రమంలో గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దేశ , విదేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చిన ఆర్థిక వేత్తలు 7 ప్యానళ్లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చిస్తారు. కీలకమైన 16 అంశాలపై ప్రముఖ ఆర్థిక వేత్తలు కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా, అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో నాగార్జున వర్సిటీకి చేరుకున్నారు. ఐఈఏ సదస్సు అనంతరం సచివాలయంలో ఫైబర్గిడ్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. -
రెండేళ్లైనా.. మాయని మచ్చ!
► రిషితేశ్వరి కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటులో జాప్యం ► అమలుకు నోచుకోని చంద్రబాబు హామీ ► ఇప్పటివరకు ర్యాగింగ్ దోషులకు పడని శిక్ష సాక్షి, వరంగల్: ర్యాగింగ్ పేరిట వేధించి తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తులు ఏవేని కారణాలతో శిక్ష నుంచి తప్పించు కుం టారేమోనని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూలై 14తో రిషితే శ్వరి మరణించి రెండేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆవేదనను రిషితేశ్వరి తల్లి దం డ్రులు ఎం.మురళికృష్ణ, దుర్గాబాయి ‘సాక్షి’కి తెలిపారు. ఆవేదన వారి మాటల్లోనే.. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నాగా ర్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి 2015 జూలై 14న క్యాంపస్లో ఆత్మహత్య చేసుకుంది. జూలై 30న ఏపీ సీఎం చంద్రబాబును కలి శాం. ‘దోషులకు శిక్ష పడాలి. మరొకరు ర్యా గింగ్ పేరుతో జూనియ ర్లను వేధించకూడదు. క్యాంపస్లో తొలి ఏడాది విద్యార్థులు నవ్వుతూ చదువుకోవాలి’ అని మేం చంద్ర బాబుకు చెప్పాం. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసు నీరుగారిపోతోంది రిషితేశ్వరి కేసులో ముగ్గురు సీనియర్లు ముద్దాయిలుగా ఉన్నారు. ఆమె స్నేహితులు సాక్షులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మూడో ఏడాది రెండో సెమిస్టర్లో ఉన్నారు. మరో రెండునెలల్లో ఫైనల్ ఇయర్లోకి వెళ్తారు. సాధారణంగా బీఆర్క్ చేసిన విద్యా ర్థులు విదేశాల్లో ఎంఆర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు విదే శాలకు వెళితే కోర్టు విచారణకు హజరు కావడం కష్టం. సాక్షులు లేకపోతే ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి. మిడిల్ మేనేజ్మెంట్తో సమస్య రిషితేశ్వరి మరణం తర్వాత నాగార్జున క్యాంపస్లో సీసీ కెమెరాలు పెట్టారు, ర్యాగింగ్ నిరోధానికి టోల్ఫ్రీ నంబరు అందు బాటులోకి తెచ్చారు. పై స్థాయిలో ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలంటే మిడిల్ మేనేజ్మెంట్ సరిగా ఉండాలి. రిషితేశ్వరి చనిపోయాక తొలి వర్దంతికి నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్కు వ్యతిరేకంగా సదస్సు పెడతామని కోరాం. అధికారులు కేవలం బ్యా చిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ విద్యార్థుల (200)తో సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. రిషితేశ్వరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు సంతోషంగా తిరుగుతున్నారు. మేం అనాథల్లా బతుకుతున్నాం. నిన్న విజయ వాడలో ర్యాగింగ్ వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయిందన్న వార్త టీవీల్లో చూసి తల్లడిల్లిపోయాం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాం. మా రిషితేశ్వరి కళ్ల ముందు కని పించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడే ఇతరుల్లో మార్పు వస్తుంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చులే అనే భావన సమాజంలో పెరగడం మంచిది కాదు. -
‘ఏఎన్యూ’లో పీఎఫ్ ఉఫ్!
► ఈపీఎఫ్ వ్యవహారాలపై పర్యవేక్షణ శూన్యం ► గతంలో ఖాతాల అంకెలు మార్చి లోన్ పొందిన ఉద్యోగులు ► గత ఏడాది వెలుగు చూసిన మరో పీఎఫ్ కుంభకోణం ► తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిధులు స్వాహా చేసిన నిర్వాహకుడు ► కమిటీలతో కాలక్షేపం చేస్తున్న ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్రమాలకు ఏఎన్యూ నిలయంగా మారుతోంది. ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన పీఎఫ్ నిధులను కొందరు అక్రమార్కులు చేతివాటంతో అడ్డదారిన తమ జేబులు నింపేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఏఎన్యూలో వరసగా పీఎఫ్ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఎన్యూ : ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పీఎఫ్ ఖాతాల నిర్వహణను పగడ్బందీగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండటంతో కుంభకోణాలు వరుసగా జరుగుతున్నాయి. గతంలో పలు కుంభకోణాలు.. యూనివర్సిటీలో పీఎఫ్ ఖాతాలకు సంబంధించి పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ ఎకౌంట్స్ విభాగంలో పీఎఫ్ వ్యవహారాలు చూసే ఇద్దరు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో అంకెలు మార్పు చేసి అధిక మొత్తంలో లోన్ పొందిన ఘటన ఆరేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చింది. తమ ఖాతాలో వేలాది రూపాయలను లక్షల్లో చూపి ఆ ఇద్దరు లోన్ పొందటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన అప్పటి వీసీ విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. కానీ పీఎఫ్ ఖాతాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోలేదు. దీంతో గత ఏడాది మరో పీఎఫ్ ఘటన వెలుగులోకి వచ్చింది.దీనిపై అతి కష్టంగా స్పందించిన ఉన్నతాధికారులు కుంభకోణంపై విచారణ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల నుంచి పీఎఫ్ మొత్తాలను వసూలు చేస్తూ ఏజెన్సీ నిర్వాహకుడు సకాలంలో వారి ఖాతాల్లో జమ చేయని ఘటనలూ గతంలో జరిగాయి. ఉద్యోగులు నిలదీయటంతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను జమ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి.. ఈపీఎఫ్కు సంబంధించిన మరో భారీ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. యూనివర్సిటీ వాటర్ వర్క్స్ విభాగంలో పనులను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించేందుకు అనుమతి పొందిన తెనాలికి చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ఏళ్ళ తరబడి ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయకుండా భారీగా నిధులు మింగేశాడు. తమ పీఎఫ్ మొత్తాలను జమ చేయకుండా నిర్వాహకుడు మింగేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్లో విధులు నిర్వహిస్తున్న 12 మంది గత నెల 21న గుంటూరులోని ఈపీఎఫ్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎఫ్ కమిషనర్ వచ్చి పరిశీలించి కుంభకోణం నిజమేనని తేల్చే వరకు యూనివర్సిటీ అధికారులు మిన్నకుండటం విశేషం. కుంభకోణం వెలుగులోకి రావటంతో గత నెల 24న ఏజెన్సీ నిర్వాహకుడు తన తప్పును పీఎఫ్ కమిషనర్ వద్ద లేఖ రూపంలో అంగీకరించాడు. ఫిబ్రవరి 28 లోగా జమ చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో జమ చేయలేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. వరసగా చోటు చేసుకుంటున్న ఈపీఎఫ్ కుంభకోణాలకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యయే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది చోటు చేసుకున్న పీఎఫ్ ఘటనపై విచారణ కమిటీని నియమించి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు గత నెలలోని కుంభకోణంపై కనీసం స్పందించకపోవటం దీన్ని తేటతెల్లం చేస్తోంది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు పీఎఫ్ ఖాతాల నిర్వహణలో పారదర్శకతను పెంచి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగులు కోరుతున్నారు. -
నాగార్జున వర్సిటీలో దూరవిద్య కోర్సులు
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కో-ఆర్టినేటర్ వై జయపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 2017లో జరిగే వార్షిక పరీక్షలు రాయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, బీయస్సీ, బీకామ్, బీఏ, బ్యాచ్లర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరదల్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98491 44925, 99599 74064 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఉన్నత విద్యామండలి చైర్మన్గా విజయరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఏఎన్యూ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ ఎస్ విజయరాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితమే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పదవీకాలం పూరైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చివరకు విజయరాజును చైర్మన్గా నియమించింది. విజయరాజు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలల కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. 1979లో ఏఎన్యూలో అధ్యాపకునిగా విధుల్లో చేరారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పటి వరకు 24కు పైగా పీహెచ్డీలు, నాలుగు ఎంఫిల్ డిగ్రీలు పరిశోధకులకు ప్రదానం చేశారు. -
అంతా చూచిరాతే..
నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బీఈడీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓపెన్ పీజీ, డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. శనివారం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలు చూచిరాతలను తలపిస్తు న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’బృందం శనివారం పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బృందం అక్కడి వెళ్లగానే పరీక్ష రాస్తున్న అభ్యర్థులు చిట్టీలు బయటపడేశారు. పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ ఏజెంట్లు విద్యార్థులకు చెప్పి గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రంలో ప్రవే శాలు ఇప్పిస్తున్నారు. పరీక్షకు హాజరైతే ఒక రేటు.. హాజరు కాకుంటే మరోరేటు అం టూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పరీక్షల ను ఉద్యోగులు ప్రమోషన్ల కోసం డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అవసర మున్నందున డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు రాస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ డంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు చాలామందికి రానున్నాయి. ఇటీవల మహబూబాబాద్ తహసీల్దార్ విజయ్కుమార్ తనిఖీలకు వెళ్లి ముగ్గురు అభ్యర్థులను డిబార్ చేశారు. -
'నాగార్జున' లో మరోసారి ర్యాగింగ్
-ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ నాగార్జున యూనివర్సిటీ : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వివరాలు.. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం సివిల్ స్టూడెంట్ జయంత్ను గురువారం రాత్రి ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆచార్య పి. సిద్ధయ్య ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన శంకర్, నవీన్, వెంకట కృష్ణ, కల్యాణ్, మనోజ్ కుమార్ లను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జయ్యారంలో ఆదిమానవుల ఆనవాళ్లు
మరిపెడ : మండలంలోని జయ్యారంలో ఆదిమానవులు జీవించినట్లుగా భావిస్తున్నా రు. ఈ మేరకు సమాధులు బయటపడినట్లు చెబుతుండ గా.. ఆచార్య నాగార్జున యూ నివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఇస్లావత్ సుధాకర్ ఆదివారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తన పరిశోధనలో భా గంగా గతంలోనూ పలుచోట్ల ఆదిమ మానవుల సమా«ధులను గుర్తించానన్నారు. ప్రస్తుతం జయ్యారంలో గుర్తించినవి కూడా మూడు వేల ఏళ్ల క్రితం నాటివన్నారు. అప్పట్లో ఓ వ్యక్తి మృతి చెందితే గొయ్యి తవ్వి మృతదేహాన్ని నాలుగు రాళ్ల మధ్య ఉంచి చుట్టూ బండలు ఏర్పాటు చేసేవారని, మృతుల ఆయుధాలు, పరికరాలు సమాధిలో పూడ్చేవారన్నారు. వీటిని ఇనుపయుగం సమాధులుగా పిలుస్తారన్నారు. ఇలాంటి సమాధులు జయ్యారం శివారులో వంద వరకు ఉండగా.. పలువురు రైతులు వ్యవసాయం చేయడంతో యాభై వరకు మిగిలాయి. -
అనర్హతతోనే ఫిరాయింపులకు చెక్
- జనచైతన్య వేదిక సదస్సులో మేధావుల స్పష్టీకరణ - చర్య తీసుకునేందుకు స్పీకర్కు నిర్దిష్ట గడువు విధించాలి - వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఇవ్వాలి - ప్రజలు ప్రశ్నించేలా చైతన్యం పెంపొందిస్తూ ఉద్యమం చేపట్టాలి - పార్టీ ఫిరాయించిన వారిని సంఘ బహిష్కరణ చేయాలి సాక్షి, విశాఖపట్నం: ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అనర్హులుగా చేయడం ద్వారానే పార్టీ ఫిరాయింపులను నిరోధించవచ్చని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ఫిరాయించిన వారిని ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా చేయాలన్నారు. ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు కాకుండా ఎన్నికల కమిషన్కు ఉండాలని స్పష్టం చేశారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్రెడ్డి అధ్యక్షతన విశాఖ పౌర గ్రంథాలయంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం సాయంత్రం జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యార్థి సంఘాల నేతలు, రిటైర్డు ఉద్యోగులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా ఉద్యమం చేపట్టాలి ఫిరాయింపుదార్లపై ప్రజా ఉద్యమం చే పట్టాలని ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్కు నిర్దిష్టమైన గడువు విధించేలా చట్టంలో మార్పు తేవాలని నాగార్జున వర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్దాస్ తెలిపారు. ఫిరాయింపుదార్లను మూడు నెలల పాటు జైలులో పెడితే భవిష్యత్లో ఇలాంటి చర్యలకు పాల్పడరని సీనియర్ న్యాయవాది అప్పారావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులను చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తేవాలని రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు సూచించారు. ప్రజా చైతన్యం ద్వారా వీటిని అరికట్టవచ్చని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ అన్నారు. ప్రజలు ప్రశ్నించకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయని ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ రఫీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల నుంచి తెలంగాణ పునర్నిర్మాణం పేరిట టీఆర్ఎస్లోకి, ఏపీలో అభివృద్ధి పేరిట టీడీపీలోకి ఎమ్మెల్యేలు మారుతున్నట్టు సమర్థించుకుంటున్నారు. ఈ కారణాలు చూస్తే వాటి వెనక ఏ ప్రభావం ఉందో అందరికీ అర్థమవుతుంది. -ప్రొఫెసర్ జి.హరగోపాల్, పౌరహక్కుల సంఘం నేత సుప్రీంకోర్టుకు లేఖ రాశా డబ్బు, మద్యం, హామీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఐదేళ్లూ తమనేమీ చేయలేరన్న భావనతో ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై జోక్యం చేసుకోవాలని, ఫిరాయింపులను నిలువరించాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టుకు లేఖ రాశాను. కానీ అటు నుంచి స్పందన లేదు. - ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరిఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలి. ప్రభుత్వం నుంచి వారికి వచ్చే అన్ని ప్రయోజనాలు, నిధులూ నిలిపేయాలి. ప్రతి మూడు నెలలకోసారైనా తమ గ్రామాలకు ఏం చేశారని ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలను నిలదీయాలి. -ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు స్పీకర్లు కీలు బొమ్మలుగా మారడం వల్లే ఈ దుస్థితి అధికార పార్టీ చేతిలో స్పీకర్లు కీలుబొమ్మలుగా మారడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. మేధావులు మౌనంగా ఉండకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా చూడాలి. బలమైన పౌర సమాజం ద్వారా ఫిరాయింపులను నిరోధించవచ్చు. -వి. లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, జనచైతన్య వేదిక ఎన్నికల కమిషన్కు అధికారం ఇవ్వాలి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై చర్య తీసు కునే అధికారం స్పీకర్కు కాకుండా ఎన్నికల కమిషన్కు ఉండాలి. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుంది. ఫిరాయింపుదార్లను సంఘ బహిష్కరణ చేయాలి. అలాంటి వారికి పాలు, నీరు అందకుండా గృహ నిర్బంధం చేయాలి. -వి.వి.రమణమూర్తి, అధ్యక్షుడు, రైటర్స్ అకాడమీ -
'పైసలిస్తే పాస్ చేయిస్తా'
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.ఎస్.ఆర్.చంద్రమూర్తి డబ్బులిస్తేనే పాస్ చేయిస్తానని చెబుతున్నారని విద్యార్థులు సోమవారం ప్రిన్సిపాల్కు, వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ సెల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్బులు చెల్లించనివారిని చెప్పి మరీ ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో ఎంటెక్ ఈవెనింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇటీవల పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ పరీక్షల్లో మిమ్మల్ని పాస్ చేయిస్తానంటూ ఆయన ట్రిపుల్ ఈ బ్రాంచ్ విద్యార్థుల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేశారని ఆరోపించారు. 13 మంది సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష రాశారని, ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లిస్తే పాస్ చేయిస్తానని ఆయన బేరమాడారని తెలిపారు. ముడుపులు చెల్లించని ఎనిమిదిమంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. ఇక్కడ చదివే ఇరాక్ విద్యార్థుల నుంచి కూడా ఆయనకు బహుమతులు అందినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయాలను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. -
ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు
నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయనను అరెస్టు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి ఇండియాకు వచ్చిన ఆయనను గుంటూరులోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని రెండు వారాల రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
28లోగా కళాశాలల డేటా అప్లోడ్ చేయాలి
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలన్నీ ఈనెల 28లోగా వెబ్సైట్లో తమ కళాశాలల డేటాను అప్లోడ్ చేయాలని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్చెర్మైన్ ఆచార్య పి.నరసింహారావు సూచించారు. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వేకు అవసరమైన సమాచారాని కళాశాలలు అందించే అంశంపై గురువారం ఆచార్య నాగార్జున యూనివర్సిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, డీన్ సీడీసీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కళాశాలలు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కళాశాలలు 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలకు సంబంధించిన డేటాను ఠీఠీఠీ.్చజీటజ్ఛి.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. సమాచారం అప్లోడ్ చేయని కళాశాలపై యూజీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయని విద్యాసంస్థలకు యూజీసీ ఇచ్చే నిధుల్లో 25 శాతం కోత విధించటంతోపాటు పలు శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయటానికి ప్రతి కళాశాలకు మూడు వేల రూపాయల ఆర్దిక ప్రోత్సాహకం ఇస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలు పారదర్శకమైన పూర్తి సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఏఎన్యూ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, కేఎల్యూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, కృష్ణా, విక్రమసింహపురి యూనివర్సిటీల డీన్సీడీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థిని స్నానం చేస్తుండగా.. చిత్రించిన వ్యక్తి అరెస్ట్
నాగార్జున యూనివర్సిటీ అతిథి గృహంలో స్నానం చేస్తున్న విద్యార్థినిని ఓ యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గుర్తించిన యువతి బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘జెర్మి ట్రైన్ ద ట్రైనీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఛత్తిస్గఢ్ రాయ్పూర్ నుంచి విద్యార్థినుల బృందం నాగార్జున యూనివర్సిటీకి వచ్చింది. వీరికి యూనివర్సిటీ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఓ విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తుండగా.. తలుపు పై భాగం నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యలను తన సెల్ఫోన్లో బంధించాడు. ఇది గుర్తించిన విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. దీంతో అతిథిగృహ సిబ్బంది యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియల్ టూర్ కోసం వచ్చిన ఓ కళాశాలకు చెందిన బీబీఏ విద్యార్థులు ఈ ఘటనకు ప్పాలడి ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనుమానం వచ్చిన అందరి సెల్ఫోన్లను సేకరించి అందులోని చిత్రాలను పరిశీలించారు. ఈ దర్యాప్తులో సాయి శ్రీకర్ అనే విద్యార్థి ఈ చర్యకు పల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీకర్ అనంతపురం జిల్లా పామిడి కి చెందిన వాడిగా గుర్తించారు. -
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
నాగార్జున యూనివర్సిటీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. -
నేటి నుంచి 78వ బైబిల్మిషన్ మహోత్సవాలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నుంచి 78వ బైబిల్ మిషన్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు ఈ మహోత్సవాలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. -
కీచకుడికే గురువులు!
♦ మసకబారుతున్న ఎస్వీయూ ప్రతిష్ట ♦ కనువిప్పు కలిగించని నాగార్జున యూనివర్సిటీ ఘటన ♦ విద్యార్థులను వేధిస్తున్న ఆచార్యులు ♦ రోజుకో విభాగంలో ఆరోపణలు గురు సాక్షాత్ పరబ్రహ్మ.. అంటూ గురువులను కీర్తిస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత వారికి ఇస్తాం. ఇపుడు గురుదేవుల పాత్రలో విద్యార్థుల భవితకు మార్గదర్శనం చేయాల్సిన కొందరు కీచకుడి అవతారమెత్తుతున్నారు. వారి వెకిలి చేష్టలను భరించలేని విద్యార్థినులు, సహోద్యోగులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తే వీరు కీచకుడికే గురువులనాల్సిన దుర్గతి పడుతోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. సాక్షి, ప్రతినిధి తిరుపతి: విద్యార్థినులను వేధిస్తున్న గురువుల ఉదంతాలు తరచూ ఎస్వీ యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయి. వివిధ విభాగాల్లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు గురుదేవుల పాత్రపై నీలినీడలు కమ్ముకుంటూ, సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. బాధితులు పోలీసులు, మీడియాను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏడు విశ్వవిద్యాలయాలు, 146 డిగ్రీ కళాశాలలు, 35 ఇంజినీరింగ్ కళాశాలలు, 32 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దీనికితోడు నర్సింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర కళాశాలలతో పాటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. ఘన చరిత్ర ఉన్న ఎస్వీయూలో.. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఎస్వీ యూనివర్సిటీలో విచారకర ఘటనలు జరుగుతుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రిషితేశ్వరి ఘటనను మరువకముందే ఎస్వీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. కొన్ని ఉదాహరణలు.. - 2012లో జువాలజీ విభాగానికి ప్రొఫెసర్ రాజేశ్వరరావు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. - 2013లో ఆక్వాకల్చర్కు చెందిన ఓ విద్యార్థిని రిటైర్డ్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. - ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ నరేంద్ర వ్యవహార శైలిపై అక్కడి పోస్టు డాక్టోరల్ ఫెలో ఒకరు సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. - సాంఖ్యకశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ రాజశేఖర్రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని పీజీ విద్యార్థిని నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రొఫెసర్ డి.ఉషారాణి ఆధ్వర్యంలో 15 మందితో కమి టీ వేసింది. ఈనెల 19వ తేదీన విచారణ జరగనుంది. - రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసులు తనను వేధిస్తున్నారని పరిశోధక విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో మూడురోజుల క్రితం ఎస్వీయూ క్యాంపస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు మానసికంగా వేధిస్తున్నారని గత నవంబర్ 9న నలుగురు పరిశోధక విద్యార్థులు ఎస్వీయూ వీసీకి ఫిర్యాదు చేశారు. ఇతర ఫిర్యాదులూ.. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఘటనలే కాకుండా ఇతర కేసులు కూడా ఎక్కువయ్యాయి. గతనెల 17న ఎస్జీఎస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రెడ్డెప్పరెడ్డి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి రూ.31వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఏడాది జూన్లో తెలుగు విభాగంలో అధ్యాపకులు, పోస్టు డాక్టోరల్ ఫెలోలు పరస్పరం రూం కేటాయింపులో ఎస్వీయూ క్యాంపస్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇలాంటి విషయాలు పోలీస్స్టేషన్ వరకు వస్తున్నా.. చాలా విషయాలు సద్దుమణిగిపోతున్నాయి. వెలుగులోకి రాని ఘటనలు మరిన్ని ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనల వల్ల ఎస్వీ యూ ప్రతిష్ట మసకబారుతోంది. భవిష్యత్తులో ఎస్వీయూకు ఎలాంటి మచ్చ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. -
రిషితేశ్వరి కేసు విచారణకు ద్విసభ్య కమిటీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఏఎన్యూ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజయలక్ష్మిలతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి ఘటనకు దారితీసిన కారణాలు, రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై గతంలో విచారణ జరిపిన కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యంను కూడా వీరిద్దరితోపాటు ఏఎన్యూలో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఏఎన్యూతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. పూర్తిస్థాయి వీసీ, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం 50శాతం భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కొత్త విద్యాలయాలు ప్రారంభమైయ్యాని.. వచ్చేఏడాది మరో 3 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేఏడాది ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తున్నామని అన్నారు. -
NUలో మరోసారి ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్ధులు సస్పెన్షన్
-
నాగార్జున మహిళా హాస్టల్ వద్ద ఆగంతకుడి కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ మహిళా హాస్టల్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కలకలం రేపాడు. మహిళా హాస్టల్ సమీపంలోని కరెంటు స్తంభంపైన రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉండటం హాస్టల్ లోపల ఉన్న విద్యార్థినులు గమనించారు. వారు వెంటనే ఆవిషయాన్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ అప్రమత్తమయ్యేలోగానే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెంటనే దిగి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కాగా, హాస్టల్ ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ ఉందని సమాచారం. -
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
-
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తికాగా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్గా ఉన్నారు. గతంలో వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు పలుమార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. 77 రోజుల తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
నాగార్జున యూనివర్సిటీని పరిశీలించిన మంత్రి గంటా
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్లలోని రిషితేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు. ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
నాగార్జున యూనివర్సిటిలో మళ్లీ ర్యాగింగ్
-
నాగార్జున యూనివర్సిటీలో కలకలం!
-
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ విద్యార్థి బాలయ్య ఈవ్ టీజింగ్కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. గత వారం రోజులుగా తనను ప్రేమించాలంటూ బాలయ్య వేధిస్తున్నాడని రత్నమంజరి గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
-
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం కులగజ్జితో కుళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీ కులానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బాబురావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో సమయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక నారాయణ కాలేజీలో దాదాపు పదిహేనుమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇవి చదువులకు నిలయాలా చావులకు కర్మాగారాల అని ఆమె నిలదీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో మరో టీచర్ను కొడతారా అని నిలదీశారు. సహచర టీచర్ మీద కనీస గౌరవం లేకుండా చెప్పుతో కొట్టారంటే ఆమె సంస్కారమేమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రిషితేశ్వరిది ఆత్మహత్యకాదని ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. -
రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్- 88888 17666, హైదరాబాద్లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్కు బయల్దేరాం. రవళి బుక్స్ను ఆమె క్లాస్రూమ్లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్ఫొటో) -
నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి
నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ కొత్త ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఉదయలక్ష్మి గురువారం మధ్యాహ్నం వర్సిటీలో పర్యటించారు. ముందుగా ఆమె డీన్లు, వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. వర్సిటీ గురించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యపై ఆమె ఆరా తీయగా.. అధికారులెవరూ స్పష్టంగా చెప్పలేకపోవటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాస్టళ్లలో పురుష సిబ్బంది పనిచేస్తుండటాన్ని గమనించారు. వారిని వెంటనే బదిలీ చేయాలని చెప్పారు. కొందరు విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్న సమస్యలు ఏకరువు పెట్టడంతో అందుకు కారకులైన సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. -
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
-
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన రితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ఆయన స్థానంలో నియమించనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముంది. ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో విఫలమయ్యారని సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సాంబశివరావు స్థానంలో ప్రొఫెసర్ సింహాద్రిని వీసీగా నియమిస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం అందజేసింది. -
ఎఎన్ యూలో మద్యం బాటిళ్ల కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో కొంతమంది సీనియర్ విద్యార్థులు మద్యం బాటిళ్లతో హల్ చల్ చేశారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ, సాయి చరణ్, అబ్బాస్ లు బుధవారం రాత్రి క్యాంపస్ హాస్టల్లోకి మద్యం సీసాలు తెచ్చేందుకు యత్నించారు. అయితే వీరిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. గురువారం ఉదయం వర్సిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల సంజాయిషీ, తల్లిదండ్రుల హామీ ఉంటేనే వారిని తిరిగి కళాశాలలోకి అనుమతించే విషయం పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.