pregnant women
-
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
లగ్న జననం!
ఒకప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మావోడు ఏ ముహూర్తంలో పుట్టాడో చెప్పండి అని పండితులు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు పుట్టకముందే జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి డెలివరీకి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. ముహూర్తం చూసుకుని శుభ ఘడియల్లో అమ్మ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు. ఎక్కువ మంది రెండో బిడ్డ ప్రసవానికి ఈ లగ్నం పెడుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే, రెండో కాన్పు ఎలాగూ సిజేరియనే కదా అని నెలలు నిండక ముందే తేదీ నిర్ణయించేస్తున్నారు. రెండు మూడు రోజుల ముందు, మరి కొందరైతే వారం, పక్షం రోజుల ముందే బిడ్డను బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రసవం తరువాత తల్లికి బిడ్డకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. కాణిపాకం: సిజేరియన్ పేరు చెబితే ఒకప్పుడు గర్భిణులంతా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదు. సహజ కాన్పులో వేదన తప్ప కలిగే ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్కు వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లు ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్లపై జిల్లావాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయించు కుంటున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. ఎలాగూ డబ్బులు వస్తాయి కదా అని వారికి అవగాహన కల్పించకుండా ఆపరేషన్ చేయడానికి సిద్ధమై పోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం వినిపించుకోకపోవడం విడ్డూరం. పండుగల్లో ప్రత్యేకం శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బిడ్డపైన ప్రభావం » బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. » అసహజ రీతిలో చేసే కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. » బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్పై ప్రభావం చూపుతాయి. ఇదీ వ్యాపారమే! ఒక సిజేరియన్కు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.40వేల నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును. ముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఎప్పుడు చేస్తారంటే.. » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం » గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు. అది భగవంతుడి నిర్ణయంపుట్టుక అనేది భగవంతుడు నిర్ణయించింది. ఆ సమ యంలోనే జననం జరగాలి. డెలివరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతు న్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకెళుతున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం మంచిరోజు చూసుకునే సిజేరియన్ చేసుకుంటున్నారు. – సుధాకర్ గురుక్కల్, అర్చకులు, చిత్తూరు కడుపు కోత మంచిది కాదు చాలా మంది ముహూ ర్తం పెట్టి సిజేరియన్కు సిద్ధమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసర మైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
Paris Olympics 2024: అమ్మతనం ఆటకు అడ్డు కాలేదు
గర్భిణి స్త్రీలు ప్రతి విషయంలో ఆచితూచి ఉండాలి. అయితే కొన్ని సందర్భాలు సవాళ్లు విసురుతాయి. దేశం కోసం నిలబడమంటాయి. పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఇద్దరు మహిళలు గర్భంతో పోటీల్లో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫెజ్ ఆరునెలల గర్భంతో, అజర్బైజాన్ ఆర్చర్ యయలాగుల్ రమజనోవా ఐదున్నర నెలల గర్భంతో ప్రత్యర్థులతో పోరాడారు. గెలుపు ఓటముల కంటే కూడా వాళ్లు పాల్గొనడమే పెద్ద గెలుపు. వీరు మాత్రమే కాదు, గర్భిణులుగా బరిలోకి దిగిన అథ్లెట్స్ గత ఒలింపిక్స్ లోనూ ఎంతోమంది ఉన్నారు.పదహారవ రౌండ్లో ఓటమి తరువాత తాను ఏడు నెలల గర్భిణిని అని ప్రకటించింది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్. ఆమె ప్రకటన సంచలనం కలిగించింది. నిజానికి గర్భిణిగా ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు, ఒలింపిక్స్లోకి అడుగు పెట్టిన తరువాత గర్భిణి అని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు....ఎలినార్ బర్కర్: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ సైకిలింగ్ స్టార్ ఎలినార్ బర్కర్ మూడు నెలల గర్భిణి. ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న ఎలినార్ ఆ తరువాతే తాను గర్భిణిని అనే విషయం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘రేసుకు కొద్దిరోజుల ముందు టోక్యోలో నేను గర్భవతినని తెలుసుకున్నాను. ఇది నేను ఊహించని విషయం. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యాను’ ఆరోజును గుర్తు చేసుకుంటుంది ఎలినార్. ఎలినార్ బార్కర్ ఎండోమెట్రియోసిస్తో బాధపడుతుండేది. దీని వల్ల గర్భిణులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండడం ఆమె ఒత్తిడికి కారణం. కొద్దిరోజుల్లో ఆట, మరో వైపు కొండంత ఒత్తిడి. టీమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్ను సంప్రదించి సలహాలు తీసుకుంది. ధైర్యం తెచ్చుకుంది. మెడల్ గెలుచుకుంది.ఆంకీ వాన్ గ్రన్సె్వన్: డచ్ డ్రెస్సేజ్ ఛాంపియన్ ఆంకీ వాన్ గ్రన్సె్వన్ అయిదు నెలల గర్భిణిగా ఒలింపిక్స్ బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది.క్రిస్టీ మూర్: అయిదు నెలల గర్భిణిగా 2010 ఒలింపిక్స్ బరిలోకి అడుగు పెట్టింది కెనడియన్ కర్లర్ క్రిస్టీ మూర్. కాస్త వెనక్కి వెళితే...ఒకరోజు కర్లింగ్ టీమ్ నుంచి క్రిస్టీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఐయామ్ ప్రెగ్నెంట్’ అని చెప్పింది క్రిస్టీ. ‘ఆడడం మీకు కష్టమవుతుందా’ అవతలి గొంతు.ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఆ సమయంలో తన టీమ్మెట్ ఒకరు.... ‘నువ్వు ప్రెగ్నెంట్ మాత్రమే. చనిపోలేదు’ అన్నది. దీని అర్థం ‘నీలో పోరాడే సత్తా’ ఉంది అని. దీంతో మరో ఆలోచన చేయకుండా ఒలింపిక్ బరిలోకి దిగింది క్రిస్టీ మూర్.‘ఒలింపిక్స్లో పాల్గొనడం, మాతృత్వం... రెండూ అపురూపమే. పెద్ద సవాలు అని తెలిసినా ముందుకు వెళ్లాను’ ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది క్రిస్టీ మూర్.మరి కొందరి విషయానికి వస్తే....అమెరికన్ ఐస్–హాకీ ప్లేయర్ లీసా బ్రౌన్ మిల్లర్ 1998 వింటర్ ఒలింపిక్స్లో పాల్గొంది, అక్కడికి వెళ్లాకే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అమెరికన్ సాఫ్ట్బాల్ ప్లేయర్ మిషల్ గ్రెంజర్ మూడు నెలల గర్భిణిగా 1996 ఒలింపిక్స్లోకి అడుగు పెట్టింది. జర్మన్ ఆర్చర్ కర్నోలియ ఏడు నెలల గర్భిణిగా 2004 ఒలింపిక్స్లోకి అడుగుపెట్టింది... ఈ జాబితా ఇంకా ఉంది. వీరిలో స్వర్ణాలు గెలుచుకున్నవారు ఉన్నారు. గెలవకపోయినా సత్తా చాటిన వారు ఉన్నారు.‘వీడు కడుపులో ఉన్నప్పుడే నాతో పాటు ఒలింపిక్స్ ఆడాడు’ అని తమ బిడ్డల గురించి గర్వంగా చెబుతుంటారు ఆ అథ్లెట్ తల్లులు.ఆ సమయంలో...రక్తస్రావంలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్ప సాధారణంగా తేలికపాటి వ్యాయామాలను గర్భిణి అథ్లెట్లకు సూచిస్తాం. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో రొటీన్ ఎక్సర్సైజ్లు చేసినా ఫరవాలేదు. ఎక్కువగా చేయడానికి ప్రయత్నించవద్దు. మితంగా చేస్తే చాలు అని చెబుతుంటాం. బ్యాడ్మింటన్, టెన్నిస్లాంటి ఆటలు ఆడాలనుకునేవారికి మాత్రం సాధ్యమైనంత వరకు వద్దనే చెబుతాం.– డా. ఆశా దలాల్, సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్స్ ఉమెన్ సెంటర్ డైరెక్టర్ -
‘ఈనాడు’ అవాస్తవ ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
ఆర్సీహెచ్తో గర్భిణుల అభా ఐడీ మ్యాపింగ్
గర్భిణులు, బాలింతలు, పుట్టిన బిడ్డలకు అందించేవైద్య సేవలన్నింటినీ డిజిటలైజేషన్ చేయడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గర్భిణుల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (అభా)ను రీప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ (ఆర్సీహెచ్) పోర్టల్తో మ్యాపింగ్ చేస్తోంది. రాష్ట్రంలో 2022–23లో 8.71 లక్షలు, 2023–24లో ఇప్పటి వరకు 2.34 లక్షల మంది గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారు. ప్రతి గర్భిణికి ప్రత్యేక రిజి్రస్టేషన్ ఐడీ ఉంటుంది. అభా నంబర్ను ఈ ఐడీతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల మంది గర్భిణుల అభా ఐడీలను ఆర్సీహెచ్తో అనుసంధానించారు. మరో 5.95 లక్షల మంది ఐడీల అనుసంధానం కొనసాగుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 శాతం గర్భిణుల మ్యాపింగ్ పూర్తయింది. తూర్పు గోదావరిలో 68.71 శాతం, అనకాపల్లిలో 59.25 శాతం మ్యాపింగ్ చేశారు. ఆర్సీహెచ్ పోర్టల్తో అభాను మ్యాపింగ్ చేస్తే గర్భం దాల్చిన నాటి నుంచి ఆ మహిళకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, టీకాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదు చేస్తారు. అవన్నీ అభాలో నిక్షిప్తం అవుతాయి. ప్రసవానంతరం బాలింత వైద్య పరీక్షల వివరాలు కూడా ఇందులో నమోదవుతాయి. మరోవైపు చిన్నపిల్లలకు సార్వత్రిక టీకాల నమోదు కోసం కోవిన్ తరహాలో యూవిన్ పోర్టల్ను కేంద్ర వైద్య శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. ఈ యూవిన్ పోర్టల్కు తల్లి అభా ఐడీని మ్యాప్ చేయడం ద్వారా చిన్నారుల టీకా వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పుడైనా సార్వత్రిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను పొందవచ్చు. 79.95 శాతం మందికి అభా ఐడీ ప్రజలకు డిజిటల్ వైద్య సేవలపై వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) అమలులో తొలి నుంచి రాష్ట్ర వైద్య శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి అభా ఐడీ సృష్టించాల్సి ఉంది. ఇప్పటివరకు 3.84 కోట్ల మందికి అంటే.. 79.95 శాతం మందికి వైద్య శాఖ ఐడీలు సృష్టించింది. ఎన్సీడీ–సీడీ నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరికీ అభా ఐడీ సృష్టిస్తున్నారు. దీంతో పాటు బీపీ, సుగర్, ఇతర వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. టీబీ, డయాలసిస్, సికిల్ సెల్ అనీమియా రోగులకు కేటాయించిన ప్రత్యేక ఐడీలను అభాతో అనుసంధానిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
ఒక్క ప్రసవం చేస్తే ఒట్టు... రెండు పీహెచ్సీలు ఉన్నా జరగని కాన్పులు
బషీరాబాద్: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ప్రసవాలు మాత్రం చేయడం లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రికి 25కి.మీ. దూరంలో మండలం ఉండడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే సంకల్పంతో బషీరాబాద్, నవల్గా గ్రామాల్లో పీహెచ్సీలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్లో 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడి సిబ్బంది ఉదయం10కి వచ్చి సాయంత్రం 5గంటలకు ఇళ్లకు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళ గర్భిణులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు, పాము కాటు కేసు బాధితులను తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇన్ పేషెంట్లు వస్తే సాయంత్రం వరకు వైద్యం చేసి రాత్రికి ఇంటికి పంపుతున్నారు. లేబర్ రూమ్ సరిగ్గా లేకపోవడంతో మూడు నెలలుగా ప్రసవాలు నిలిచిపోయాయి. కొంతమంది గర్భిణులు తాండూరు పీహెచ్సీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు. నవల్గ్గాలో మరీ దారుణం నవల్గ్గా పీహెచ్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పీహెచ్సీ పరిధిలో మూడు గ్రామాలు ఉండగా ఒక్క కాన్పు కూడా జరగలేదు. అడపాదడపా వచ్చే రోగులకు ఓపీ చూసి సాయంత్రం కాగానే ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైన ప్రమాదం జరిగితే తాండూరు వెళుతున్నారు కానీ, పీహెచ్సీకి రావడం లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. బషీరాబాద్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న వైద్యుడు గోపాల్ ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు. స్కానింగ్కు ప్రైవేటు సెంటర్లకు మండలంలోని రెండు పీహెచ్సీల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో గర్భిణులు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఒకే కేంద్రం ఉండడంతో అక్కడ స్కానింగ్కు సమయం పడుతోంది. దీంతో గర్భిణులు బయట కేంద్రాల బాట పడుతున్నారు. పీహెచ్సీల్లో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు బషీరాబాద్ పీహెచ్సీలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బంది ఆరేడు గంటలు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసవాల కోసం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గతంలో పాము కాటుకు గురైన యువకుడు ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఇచ్చేవారు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి మృతి చెందాడు. – లక్ష్మణ్, యువజన సంఘం నాయకుడు, బషీరాబాద్ -
డాక్టరైన మహిళా కండక్టర్
బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ డాక్టర్గా మారి సురక్షితంగా కాన్పు చేసింది. చిక్కమగళూరు డిపోకు చెందిన కేఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తోంది. బెంగళూరు నుంచి బేలూరుకు ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ప్రసవ వేదన ఆరంభమైంది. బస్సు వెళ్లే మార్గంలో అటు ఇటు 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఆసుపత్రి లేదు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ ఎస్.వసంతమ్మ బస్సును నిలిపి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆమె గర్భిణికి కాన్పు చేయగా ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.మహిళ నిరుపేద కావడంతో చేతిలో ఖర్చులకు కూడా డబ్బులు లేవు, ఆమె పరిస్థితిని గమనించి కండక్టర్, డ్రైవరు ప్రయాణికులు కలిసి రూ.1,500 సేకరించి బాలింతకు అందజేశారు. తరువాత అంబులెన్స్ ద్వారా శాంతిగ్రామ ఆసుపత్రిలో చేర్చారు. మహిళా కండక్టర్ను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్
సాక్షి, అమరావతి: గర్భిణులు, తల్లీ బిడ్డల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష దోహద పడుతుంది. ఖరీదైన ఈ స్కాన్ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఒక్కో టిఫా స్కాన్కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ లోపాలున్న వారికి టిఫా స్కాన్ మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు (మెంటల్ డిజెబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి లోపాలన్నింటినీ టిఫా స్కాన్తో గుర్తించే అవకాశం ఉంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉంది? జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి, శిశువులో ఇతరత్రా లోపాలను దీని ద్వారా గుర్తించి, వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ/సిజేరియన్ ప్రసవం అవసరం అవుతుందా అన్నది కూడా అంచనా వేయవచ్చు. 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తారు. ఇప్పటికే పలు రకాలుగా అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తల్లీ బిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేంత వరకు అండగా ఉంటోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా గ్రామాల్లోనే గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు చేయిస్తోంది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు చేరుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సేవలు పొందిన మహిళలకు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారిలో గర్భిణులు రెండో స్థానంలో ఉన్నారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవం సేవలు పొందారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం గర్భిణులను వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ టిఫా స్కాన్ను ఉచితంగా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ను సైతం ఏర్పాటు చేశాం. హై రిస్క్ గర్భిణులను డెలివరీ డేట్కు ముందే ఆస్పత్రికి తరలిస్తున్నాం. తద్వారా వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించి తల్లి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రసవానికి అవకాశం ఉంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శిక్షణ పూర్తయింది గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా ప్రొసీజర్లను ఆన్లైన్లో పొందుపరిచాం. ఏ విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలనే విషయంపై నెట్వర్క్ ఆస్పత్రుల మెడికోలు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది. అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది. నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్లైన్లో షేర్చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది. మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. (చదవండి: మిస్టరీగా కొత్త వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!) -
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..
రష్యాలో గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వెళ్లిపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారట. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది దాక రష్యన్ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు అర్జెంటీనాకు వచ్చినట్లు తెలిపారు. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లు సమాచారం. అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదీగాక ఒక రష్యాన్ వెబ్సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం
విజయనగరం టౌన్: బిహార్ రాష్ట్రం ఆనందపూర్కి చెందిన బిందుకుమారి అనే గర్భిణి ‘అలెప్పీ–ధనబాద్ రైలు (13352)లో కేరళ నుంచి ధనబాద్కు పుట్టింటికి వెళ్తోంది. విశాఖ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికుల సాయంతో కదులుతోన్న రైలులోనే విజయనగరం సమీపంలో వాష్ రూంలో మగబిడ్డను ప్రసవించింది. విజయనగరం రైల్వే స్టేషన్లో మెడికల్, ఆర్పీఎఫ్, కమర్షియల్, ఆపరేటింగ్ ఉద్యోగులు, సిబ్బంది జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమె వద్దకు చేరుకున్నారు. రైల్వే వైద్యురాలు జ్యోతిప్రియ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కేఎస్ రత్నం, హెచ్సీ వి.అరుణ, కానిస్టేబుల్ ఎ.నాయుడు, సీటీఐ రెడ్డి, అప్పలరాజు, టీపీ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
Telangana: గర్భిణీ పోలీసు అభ్యర్థులకు గుడ్న్యూస్! నేరుగా మెయిన్స్కు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్ ఈవెంట్స్లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్ఎల్పీఆర్బీకి రాతపూర్వకంగా అండర్టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్టేకింగ్ ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు పూర్తైన వెంటనే తుది రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మరో 8 నుంచి 9 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. పెరిగిన ‘అర్హత’శాతం: ఫిజికల్ ఈవెంట్స్లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్టు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్మెంట్ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఫిజికల్ ఈవెంట్స్ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్జంప్, షార్ట్పుట్)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నారు. 70% మందికి పరీక్షలు పూర్తి ఈ నెల 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గత 18 పనిదినాల్లో 70 శాతం మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ల్లో ఈవెంట్స్ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది. -
సురక్షిత మాతృత్వం.. ఖర్చు లేని కాన్పు
మాతృత్వం అనేది ఓ వరం. ప్రసవ ఘట్టం మహిళకు పునర్జన్మ వంటింది. దీనిని కొందరు స్వార్థపరులు తమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత మాతృత్వాన్ని ఉచితంగా ప్రసాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకు అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రధానంగా ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలపై ప్రధాన దృష్టి సారించింది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వైద్యశాలలు, ఏరియా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడంతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డాక్టర్లు లేక మందుల కొరతతో ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించారు. తాజాగా పరిస్థితి మారింది. నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం ఏర్పడింది. జిల్లాలో మొత్తం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 12 వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో మార్కాపురంలో జిల్లా వైద్యశాల, ఒంగోలులో మాతాశిశు వైద్యశాల ఉన్నాయి. కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, పామూరు, దోర్నాల, కంభం, కొండపి ఉండగా గిద్దలూరు, యర్రగొండపాలెంలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 9 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఇవన్నీ వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ పరిధిలో ఉండగా, డీఎంహెచ్ఓ పరిధిలో 64 పీహెచ్సీలు ఉన్నాయి. జిల్లాలో బేస్తవారిపేటలో అత్యధికంగా నాలుగు పీహెచ్సీలు ఉన్నాయి. వీటిల్లో కాన్పులు చేస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు రావడంతో ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్యశాలలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు సర్జన్లతో పాటు అనస్థీషియన్ (మత్తు డాక్టరు), నిపుణులైన నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. నెలకు సుమారు 180 నుంచి 200 మ«ధ్య కాన్పులు జరుగుతున్నాయి. ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్, ఐసీయూ బెడ్లు, అందుబాటులో ఉండడంతో సమీప మండలాల్లోని గ్రామాల గర్భిణులు కాన్పుల నిమిత్తం జిల్లా వైద్యశాలలకు వస్తున్నారు. మొత్తంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 2,500 వరకు ప్రసవాలు జరిగాయి. ప్రోత్సాహకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్నిస్తోంది. పీహెచ్సీల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద రూ.4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి ఇస్తోంది. మొత్తంగా రూ.ఐదు వేలు ఇస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే రూ.4600 ఇస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తోంది. సురక్షితంగా ఇంటికి... ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతాశిశు సంరక్షణ పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. మంచి వైద్య సేవలు అందాయి కాన్పు కోసం జిల్లా వైద్యశాలకు వచ్చాను. డాక్టర్లు, నర్స్లు మంచి వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు చేశారు. పాప పుట్టింది. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మంచి మందులు ఇచ్చారు. డాక్టర్లకు ధన్యవాదాలు. – నాగలక్ష్మి, రాగసముద్రం, తర్లుపాడు మండలం మంచి సేవలందిస్తున్నాం జిల్లా వైద్యశాలలో గైనకాలజిస్టులు, సర్జన్లు, మంచి సేవా భావం కలిగిన వైద్య సిబ్బంది ఉన్నారు. నార్మల్ డెలివరీలు చేస్తారు. తక్షణ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. హైరిస్క్ పేషెంట్లకు కూడా మా డాక్టర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోగులకు భరోసా ఇస్తాం. మందుల కొరత లేదు. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం -
తల్లికి ‘సంపూర్ణ’ పోషణ.. ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం
కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల అందిస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్ జగన్ సర్కార్ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. (చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!) పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు అనుగుణంగా.. ఫోర్టిఫైడ్ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్ ఏ, విటమిన్ బీ 12, ఫొలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల మేరకు జగన్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. (చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు) రక్తహీనతను తగ్గిస్తుంది ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గర్భిణుల్లో పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవ ంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను అందుబాటులో కి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకు ని బతుకమ్మ కానుకగా ఈ కిట్లను లబ్ధిదా రులకు అందిస్తున్నట్లు తెలిపారు. శనివారం కోఠిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రో గ్రాం మేనేజ్మెంట్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కా మారెడ్డి, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నా రు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు కిట్లు.. ఒక్కో కిట్ ధర రూ.2వేల వరకు ఉంటుందని, ఇందులో నెయ్యి, ఖజూర్, హార్లిక్స్ తదితర పౌష్టిక పదార్థాలుంటాయని మంత్రి హరీశ్ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఇందులోభాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు. మందుల కొనుగో లుకు సీఎం కేసీఆర్ రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారని, ఇందులో రూ.100 కోట్లను ఆస్పత్రుల సూపరింటెండెంట్ల దగ్గర అందుబాటులో ఉంచామని వివరించారు. -
అమ్మకు పోషకాల కానుక..
సాక్షి, హైదరాబాద్: గర్భిణీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ను అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కిట్లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు ఖరారయ్యాక న్యూ ట్రీషన్ కిట్లను మహిళలకు పంపిణీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. పోషకాహార కిట్లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్లో ఒక ప్లాస్టిక్ కప్ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్ ఇవ్వాలా లేక కేసీఆర్ కిట్ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్ను కూడా తెప్పించి పరిశీలించారు. ముందుగా తొమ్మిది జిల్లాల్లో అమలు.. కేసీఆర్ కిట్ లాగానే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార కిట్ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా జూన్ 2, 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్ కిట్తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. -
సురక్షితంగా.. సౌకర్యవంతంగా...
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది. సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. రోజుకు 700 మంది.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది. ఫిర్యాదుల స్వీకారం.. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా ఏప్రిల్కు ముందు వరకు.. ► 279 వాహనాలు ► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం ► ఏసీ సౌకర్యం ఉండదు ► ట్రిప్కు ఇద్దరు బాలింతల తరలింపు ఏప్రిల్ నెల నుంచి.. ► 500 వాహనాలు ► విశాలమైన మారుతీ ఈకో వాహనం ► ఏసీ సౌకర్యం ఉంటుంది ► ట్రిప్కు ఒక బాలింత మాత్రమే తరలింపు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తొమ్మిదో తేదీ కేజీహెచ్లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు. – సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా -
గర్భిణులకు ముందస్తు వైద్య సేవలు
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ ముందస్తు జాగ్రత్తగా వినూత్న నిర్ణయం తీసుకుంది. నిండు గర్భిణులు వానల, వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ప్రసవానికి ఇంకా వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలిస్తోంది. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపుగా 10వేల మంది గర్భిణులను తరలించి ముందస్తు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక వాహనం తో పాటు అన్నీ సిద్ధం చేసినట్టు కూ యాప్ వేదికగా వివరాలు వెల్లడించారు. Koo App గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. View attached media content - TRS Party (@trspartyonline) 14 July 2022 -
బర్త్ కంపానియన్.. భర్త సమక్షంలో పురుడు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలో ఓ గర్భిణీకి భర్త సమక్షంలో ‘బర్త్ కంపానియన్’విధానంలో కాన్పు చేశారు వైద్యులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెచ్వోడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి, గాయత్రి, స్టాఫ్నర్స్ అరుణ నూతన విధానంలో శ్రీలత(23) అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ సమయంలో ఆమె భర్తను లేబర్రూం లోనికి పిలిపించారు. ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో గర్భిణీలో భయం, ఒత్తిడి, ఆందోళన ఉంటుందని, ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదని వైద్యసిబ్బంది తెలిపారు. అందుకే భర్తగానీ, మనసుకు దగ్గరైనవారుగానీ ఆమె చెయ్యి పట్టుకోవడం, తల నిమరడం వంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్ త్వరగా విడుదలై నొప్పులు ఎక్కువగా వచ్చి త్వరగా సుఖప్రసవం అవుతుందని వివరించారు. ఈ విధానంలో శిశువు బొడ్డుతాడును తండ్రితో కత్తిరించడం ద్వారా అతడు గొప్ప అనుభూతిని పొందడమే కాకుండా భార్య ప్రసవవేదనను దగ్గరుండి చూస్తే, ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పుగదిలోకి గర్భిణులు తమ భర్త, అమ్మ, అత్త, చెల్లి.. ఇలా ఇష్టమైనవారిలో ఒకరిని అనుమతిస్తామని చెబుతున్నారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉండగా, మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తున్నారు. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
వైద్యులూ.. వెల్డన్
కోల్సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్ అర్బన్: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు. రిస్క్ కేస్ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్ కల్యాణి, అనస్తీషియా డాక్టర్ మోహన్రావు, స్టాఫ్నర్స్ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్ స్వామి సూచనల మేరకు డాక్టర్ నవీద్, స్టాఫ్ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్లు ధరించి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్గా తేలడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో మహబూబ్నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో గర్భిణికి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్లో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు పీహెచ్సీలు, సీహెచ్సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు. -
గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
మహిళకు తల్లి కావడం ఓ పెద్ద వరం అంటారు. ప్రెగ్నెన్సీతో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ తల్లి అయిన ప్రతి స్త్రీ తన గర్భధారణను ఆనందిస్తుంది. కానీ అందరు స్త్రీలు అదృష్టవంతులు కాదు. ప్రపంచంలోని చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక తాజాగా ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు. సదరు మహిళ కాలేయంలో ఎక్టోపిక్ గర్భం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫెలోపియన్ ట్యూబ్లలో గుడ్డు తప్పు దిశలో ప్రయాణించడం ప్రారంభించినప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. దీని కారణంగా గర్భం సరిగ్గా జరగదు. ఇది కడుపులో చాలాసార్లు కనిపిస్తుంది, కానీ మొదటిసారిగా ఇది కాలేయంలో కనిపించింది. అది గమనించిన వైద్యులు వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేయగా తన ప్రాణం రక్షించబడింది. కానీ పిండం మాత్రం అప్పటికే కాలేయంలో చనిపోయింది. అటువంటి పరిస్థితిలో వైద్యులు కాలేయం నుండి చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు. కెనడియన్ శిశు వైద్యుడు డాక్టర్ మైఖేల్ తన టిక్టాక్ ఖాతాలో వీడియో ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనే 2012లో ఓ మహిళ కాలేయంలో 18 వారాల పిండం కనిపించింది. దీంతో తనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స సమయంలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. -
ఆపరేషన్ తారుమారు.. మాకే ఎందుకు కడుపు‘కోత’?
సాక్షి, వీణవంక(కరీంనగర్): తమ కుటుంబంలోకి కవల పిల్లలు రాబోతున్నారని తెలిసి, ఇంటిల్లిపాది ఆనందపడ్డారు.. కుటుంబసభ్యులు ఆ గర్భిణికి పౌష్టికాహారం అందిస్తూ కంటికిరెప్పలా చూసుకున్నారు.. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల తర్వాత జరగాల్సిన ఆపరేషన్ 7వ నెలలో జరగడంతో పాప మృతిచెందింది.. బాబు అతి తక్కువ బరువుతో పుట్టి, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు.. దీంతో బాధిత కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు కడుపుకోత మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారిని ‘సాక్షి’ పలకరించగా కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాలిలా ఉన్నాయి.. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి–మాలతిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. మాలతి గర్భం దాల్చడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. తర్వాత స్కానింగ్లో కవల పిల్ల లు అని వైద్యులు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమెకు ఆహారం మొదలు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మాలతికి 7వ నెలలో జూన్ 16న కడుపునొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు 21 వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. చదవండి: టీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారు: ఈటల రాజేందర్ అదేరోజు మరో గర్భిణికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంతో మాలతి పొట్ట కోశారు. బాధితురాలు తాను ఆపరేషన్ కోసం రాలేదని మొత్తుకుంది. దీంతో అలర్ట్ అయిన వైద్యులు కేస్షీట్లు పరిశీలించారు. వేరొకరికి చేయాల్సిన ఆపరేషన్ ఈమెకు చేశామని తెలుసుకొని వెంటనే కుట్లు వేసి, తమ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు జూన్ 25న డీఎంహెచ్వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో అదే నెల 26న ఆపరేషన్ చేయగా పాప మృతిచెందింది. బాబు కేవలం 1,300 గ్రాముల బరువుతో పుట్టాడు. కలెక్టర్కు ఫిర్యాదుతో విచారణ మాలతికి ఆపరేషన్ తారుమారు ఘటనపై వైద్యాధికారులు స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే తగిన న్యాయం జరగకపోవడంతో బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కానీ విచారణ చేపడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాలతి భర్త నరోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పుడు బాబుకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ వైద్యాధికారులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి అనారోగ్య సమస్యలు కవలల్లో ఒకరు మృతి చెందగా బాబు పుట్టినప్పటి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాలతి కుటుంబానికి కడుపుకోత మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో మహిళకు జరగకూడదు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పుట్టిన బాబు ఆరోగ్యంగా లేడు. అధికారులు నీలోఫర్లో చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు చూపించలేదు. మాతా శిశు కేంద్రంలో మంగళవారం విచారణ జరిపారని తెలిసింది. మాకు సమాచారం లేదు. నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. – మాలతి, బాధితురాలు -
Harish Rao: గోలీలు ఇస్తున్నరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు/బాలింతలకు అందుతున్న వైద్య సేవల తీరుతెన్నుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్వయంగా ఫోన్ చేసి వారినే అడిగి తెలుసుకోనున్నారు. వైద్యులు నెలనెలా చెకప్లు చేస్తున్నారా? మందులు ఏ మేరకు ఇస్తున్నారు? ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు ఏమైనా ఉంటున్నాయా? కేసీఆర్ కిట్ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయం అందిందా? వంటి ప్రశ్నలు వేయనున్నారు. రోజుకో ఉమ్మడి జిల్లా చొప్పున పలువురితో టెలికాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణుల ఫోన్ నంబర్ల ప్రకారం టెలికాన్ఫరెన్స్లోకి తీసుకోనున్నట్లు చెప్పారు. గర్భిణులు వారి ఇళ్ల నుంచే మంత్రితో మాట్లాడవచ్చని వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కేసీఆర్ కిట్లో మార్పులు చేయాలా?..: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం గురించి మంత్రి హరీశ్రావు టెలికాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందరికీ అందుతోందో లేదో తెలుసుకోనున్నారు. అలాగే మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం ఏ మేరకు అందుతోందన్న విషయాన్నీ ఆయన తెలుసుకోనున్నారు. ఈ పథకం కింద గర్భిణులు/బాలింతలకు వివిధ దశల్లో రూ. 1,073.94 కోట్ల ఆర్థిక సాయాన్ని, 10.80 లక్షల కిట్లను ఇప్పటివరకు అందించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు మంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ పథకంపై లబ్ధిదారులు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? కేసీఆర్ కిట్లో మార్పుచేర్పులు చేయాలా? అని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకొనే అవకాశముంది. అలాగే ఆర్థిక సాయం అందని వారికి తక్షణమే విడుదల చేయొచ్చని తెలిసింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లేబర్ రూమ్లు పరిశుభ్రంగా ఉండట్లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మంత్రి హరీశ్ అధికారులను వివరణ కోరే అవకాశముంది. -
గర్భిణులకు దన్నుగా 108
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 అంబులెన్సుల ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. గతంలో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్సు ఉంటే.. రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2020 జులై నుంచి ప్రతి 74,609 మందికీ ఒక అంబులెన్సు నడుస్తోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 జులై నుంచి 2021 ఆగస్టు వరకూ అంటే 14 నెలల్లో 10.77 లక్షల మంది ‘108’ ద్వారా లబ్ధిపొందారు. వీరిలో కోవిడ్ బాధితులు, గర్భిణులే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త అంబులెన్సులు రాకమునుపు ఏడాదికి సగటున 6.33 లక్షల ఎమర్జెన్సీ సర్వీసులు నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య 10.77 లక్షలకు పెరిగింది. వీరిలో 54 శాతం మంది పురుషులు కాగా, 46 శాతం మంది మహిళలున్నారు. అలాగే, 1.10 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాద బాధితులు అంబులెన్సుల్లో ఆస్పత్రులకు వెళ్లారు. 6.62 లక్షల మందికి ఆక్సిజన్ ఇక 108 అంబులెన్సులో వెళ్తున్నారంటేనే ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుందని ఒక భావన. అలా గడిచిన 14 నెలల్లో 6.62 లక్షల మంది ఆక్సిజన్ సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 72 వేల మందికి పైగా ఈ సౌకర్యం పొందారు. అనంతపురం జిల్లాలో 67 వేల మందికి పైగా ఆక్సిజన్ సాయంతో ‘108’లో ఆస్పత్రులకు వెళ్లారు. లబ్ధిదారుల్లో గర్భిణులే ఎక్కువ మొత్తం 10.77 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు మహిళలకు బిడ్డలు కనే వయసు కాబట్టి ఎక్కువమంది గర్భిణులు 108 వాహనాలను వినియోగించుకున్నారు. ఒక్క 21 నుంచి 30 ఏళ్లలోపు కేటగిరీలోనే 2.43 లక్షల మంది మహిళలు ‘108’లో వచ్చినట్లు వెల్లడైంది. అంబులెన్సుల్లో లబ్ధిపొందిన వారిలో 21.7 శాతం మంది అంటే 2.34 లక్షల మంది గర్భిణులే ఉన్నారు. అత్యధికంగా 22.4 శాతం మంది (2.41 లక్షలు) కోవిడ్ బాధితులున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అలాగే, 1.10 లక్షల మంది ప్రమాద బాధితులు, 32 వేల మందికి పైగా హృద్రోగులు, 63వేల మందికి పైగా పక్షవాతం బాధితులు తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) ఆస్పత్రులకు వెళ్లగలిగారు. -
రెండు గంటలు గర్భిణి నరకయాతన
కొత్తగూడ: గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యంలేక ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో పురిటి నొప్పులతో ఓ మహిళ రెండు గంటలు నరకయాతన పడింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కర్నెగండిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నెగండి గ్రామానికి చెందిన పూనెం సుజాతకు పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు సరిగా లేనందున మెయిన్ రోడ్డువరకు వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్తామని అంబులెన్స్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు టాటా మ్యాజిక్ వాహనం మాట్లాడుకుని తీసుకువస్తుండగా అది మార్గమధ్యలో చెడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మరో వాహనాన్ని తీసుకు వచ్చి టాటా మ్యాజిక్కు తాడు కట్టి మెయిన్ రోడ్డువరకు లాక్కుని వచ్చారు. ఇదంతా అయ్యేసరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటివరకు నొప్పులతో సుజాత నరకయాతన అనుభవించింది. అక్కడినుంచి ఆమెను అంబులెన్స్లో కొత్తగూడ పీహెచ్సీకి తరలించగా అక్కడి వైద్యులు, సహజ ప్రసవం అయ్యే పరిస్థితి లేదని చెప్పడంతో మహబూబాబాద్ జిల్లా అస్పత్రికి తరలించారు. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు!
భువనగిరి: ప్రసవం కోసం ఆపరేషన్ చేసిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో కాటన్ పెట్టి మరిచిపోయారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ మహిళ మంగళవారం మృతి చెందింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన చింతపల్లి ప్రవీణ్ భార్య మమత (21) మొదటి కాన్పు కోసం సంవత్సరం క్రితం భువనగిరి పట్టణంలోని కేకే నర్సింగ్ హోంలో చేరింది. ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా ఆ మహిళ పాపకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. ప్రతి నెలా చికిత్స కోసం అదే నర్సింగ్హోంకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమెకు 6వ నెల. 15 రోజుల క్రితం కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు. అయితే నొప్పి తిరగబెట్టడంతో మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే హైదరాబాద్కు వెళ్లగా అక్కడ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేయలేమని చెప్పడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. మమత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు ఈ విధంగా మూడు నాలుగు ఆస్పత్రులు తిరగడంతో ఆమెకు గర్భస్రావమైంది. ఈ సమయంలో సన్ఫ్లవర్ ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు బతిమిలాడటంతో పరిస్థితి విషమించిందని తెలిపి, కుటుంబ సభ్యుల వద్ద హామీ తీసుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె గర్భంలో కాటన్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రసవం కోసం నిర్వహించిన ఆపరేషన్ సమయంలో రక్తస్రావాన్ని నిరోధించేందుకు ఉంచిన కాటన్ కడుపులోనే మర్చిపోయి కుట్లు వేశారని, ఆ కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణానికి ముప్పుగా మారిందని చెప్పారు. అయితే చికిత్స పొందుతూ ఆ గర్భిణి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మమత మృతదేహంతో పట్టణంలోని కేకే నర్సింగ్హోం వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
గర్భిణిలపై కరోనా అధిక ప్రభావం
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్ సోకితే ఎన్నో రకాల ఇతర వ్యాధులు కూడా వారిలో విజృంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. దాని ప్రకారం కరోనా సోకిన గర్భిణుల్లో తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోవిడ్–19తో మహిళలు ప్రసవిస్తే వారిలో ఎనీమియా, డయాబెటీస్ వంటివి పెరిగిపోయి తల్లుల మరణానికి దారి తీసే అవకాశాలున్నాయి. -
Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో..
టోక్యో: సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టరు. అలాంటిది 35 ఏళ్ల లోరా వెబ్స్టర్(అమెరికా) 5 నెలల గర్భంతో విశ్వవేదికపై(సిట్టింగ్ వాలీబాల్) దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐదో పతకం వేటలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్లో, మరోసారి ఓ అంతర్జాతీయ వేదికపై గర్భంతోనే పోటీల్లో పాల్గొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లోరా.. నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, లోరా ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఇవాళ బ్రెజిల్తో సెమీస్ పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గితే లోరా ఖాతాలో 5వ పతకం చేరడం ఖాయం. లోరా తొలిసారి ఏథెన్స్లో కాంస్య పతకం సాధించింది. ఆతర్వాత 2008, 2012 పారాలింపిక్స్లో రజతాలు గెలుచుకుంది. గత రియో పారాలింపిక్స్లో ఈ అమెరికన్ ధీర వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఏకంగా స్వర్ణం నెగ్గింది. కాగా, లోరాకు 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్ కారణంగా ఎడమ కాలు దెబ్బతింది. చదవండి: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్కు మరో పతకం -
గర్భిణి ప్రసవ వేదన
వేమనపల్లి (బెల్లంపల్లి): సుఖ ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి. ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్ కమిటీ అంబులెన్స్లో వేమనపల్లి పీహెచ్సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్ వర్కర్ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు. దీంతో అంబులెన్స్లో ఉన్న గర్భిణిని డ్రైవర్ నరేష్, మరో డ్రైవర్ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున శిరీష ఆడశిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సిబ్బంది లేకపోవడంతోనే ఆమె పరిస్థితిని చూసి అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించామని వైద్యాధికారి కృష్ణ తెలిపారు. -
3 కి.మీ. మోసుకెళ్లినా దక్కని గర్భిణి ప్రాణం
నార్నూర్(గాదిగూడ): కాన్పు కోసం ఆదివారం ఉదయమే పుట్టింటికి వచ్చింది. నెల రోజులైతే చాలు పండంటి బిడ్డకు జన్మనిస్తాననే ఆలోచనలోనే ఉంది. అనుకోకుండా ఆ గర్భిణికి సాయంత్రం ఫిట్స్ వచ్చాయి. 108కు ఫోన్ చేసినా.. ఊళ్లోకి వచ్చే పరిస్థితిలేదు. దీంతో 3 కిలోమీటర్లు గర్భిణిని మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాదిగూడ మండలం కునికాస కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప రాజుబాయి(22)కి రెండేళ్ల క్రితం మండలంలోని పరస్వాడ(బి) గ్రామానికి చెందిన యువకుడు భీంరావుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఇన్ని రోజులు అత్తగారింట్లో ఉన్న రాజుబాయి కాన్పు కోసం ఆదివారం ఉదయం భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. చేతులపై మోస్తూ.. కునికాస కొలాంగూడ గ్రామ శివారులో వాగు ఉంది. అంబులెన్స్ గ్రామంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాజుబాయిని 3 కిలోమీటర్ల దూరం చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లారు. జాగ్రత్తగా వాగు దాటించారు. అప్పటికే అక్కడికి 108 చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్లో గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్సీలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఝరి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని స్టాఫ్నర్సు కాంతాబాయి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అదే అంబులెన్స్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాజుబాయి మృతిచెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి ప్రాణం పోయిందని కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. -
ఏమీ కాదని మమతే భర్తకు ధైర్యం చెప్పింది.. కానీ అంతలోనే
తుమకూరు/కర్ణాటక: ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని తిపటూరు పట్టణంలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాలు.. కుందూరు గ్రామానికి చెందిన వ్యాపారి చేతన్ భార్య మమత (34)కు నెలలు నిండాయి. కాన్పు కోసం శనివారం ఉదయం జేనుకల్ నర్సింగ్హోంలో అడ్మిట్ చేశారు. సాధారణ కాన్పు అవుతుందని వైద్యులు చెబుతూ వచ్చారు. చివరకు సిజేరియన్ చేయాలని హడావుడిగా భర్త నుంచి సంతకాలు తీసుకుని శనివారం రాత్రి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని మమత భర్త, బంధువులకు ధైర్యం కూడా చెప్పింది. తల్లి మృత్యువాత గంట తరువాత నర్సులు మగబిడ్డను తండ్రి చేతిలో పెట్టి మీరు కింది అంతస్తులోకి వెళ్లండి అని చెప్పారు. కొంతసేపటికి మమత మృతదేహాన్ని అప్పగించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టిన క్షణమే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. వైద్యులు ఉదయాన్నే స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని భర్త, బంధువులు విలపించారు. సిజేరియన్ వికటించి రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ఆదివారం ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యుల నిర్లక్ష్యంపై తిపటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
పురిటిపాట్లు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం గ్రామం.. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలం వస్తే మధ్యలో ఉన్న ఉడుముల (వట్టె)వాగు దాటి వెళ్లాలి. గత 4 రోజుల కింద గ్రామానికి చెందిన తోట రవీందర్ అనే యువకుడు వాగు దాటే ప్రయత్నం చేసి నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. యువకుడే వాగు దాటలేక మరణిస్తే.. ఇక మహిళలు, గర్భిణుల పరిస్థితి ఎలా ఉంటుందో..! ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతపెట్టిగూడెం గ్రామం నుంచి బయటకు రావాలంటే మధ్యలో ఉన్న పారేటి వాగు దాటాలి. ఈ వాగు కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది. దీంతో ఇటీవల ఆ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎడ్లబండిపై వాగు దాటించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారుచెలక, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి, మహబూబాబాద్: వానాకాలం వస్తే చాలు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గర్భిణులకు వణుకు మొదలవు తుంది. వాగులు, వంకలు దాటి ప్రసవం కోసం ఆస్పత్రుల కు వెళ్లాలంటే కత్తిమీద సాములా మారుతోంది. నిండుచూ లాలికి నొప్పులు వస్తే వారిని ఆస్పత్రికి తరలించడం ఎంత కష్టమో చెప్పలేం. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం, ఇతర అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే ముందుగా గిరిజన గ్రామాల రహదారిపై ఉన్న వాగులు దాటితేనే వైద్యం అందుతుంది. ఇక ఆ వాగు దాటాలంటే ఎడ్లబండ్లు, జోలెలే శరణ్యం. ఇలా రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గిరిజనులు ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో నెలలు నిండిన మొత్తం గర్భిణులు దాదాపు 3,869 మంది ఉన్నట్లు అంచనా. ►మహబూబాబాద్ జిల్లా గంగారం, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్లతో పాటు నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. ఉన్నా మధ్యలో వాగులు దాటాల్సి ఉంటుంది. దీంతో ఊట్ల మట్టెవాడ, మొట్ల తిమ్మాపురం, ముస్మి, దొరవారి తిమ్మాపురం గ్రామాలతో పాటు ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి. ►నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంత మండలం ముల్గర నుంచి కల్వకుర్తికి వెళ్లాలంటే దుందభివాగు దాటాలి. అమ్రాబాద్ మండలం కుమ్మరంపల్లి నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న మందవాగు దాటాలి. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మేడికుంట–మిట్టపల్లి మధ్య మస్మివాగు, రాఘబోయినగూడెం చెరువు అలుగు పడి ముల్కలపల్లి, బోటితండా మధ్య, ఇల్లెందు, తొడిదెలగూడెం మ«ధ్య చెరువు అలుగు పడటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా యి. టేకులపల్లి మండలం రోళ్లపాడు, మురుట్ల, సాయ మ్మ, గడ్డిచెరువు ముర్రేడు వాగుల్లోకి వరద నీరు భారీగా చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముత్యాలంపాడు, తావుర్యాతండా, రాజుతండా, జండాలతండా, పెట్రాంచెలక సమీపంలోని వాగుల ఉధృతితో ఈ గ్రామాల రాకపోకలకు బ్రేక్ పడింది. సోములగూడెం, బిక్కుతండాపై లో లెవల్ బ్రిడ్జి ఉంది. బూడిదవాగు పొంగితే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభిస్తాయి. గుండాల మండలంలో కిన్నెరసాని వాగుపై ఉన్న లో లెవల్ చప్టాల కారణంగా వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశ్వాపురం–గొందిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తే గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం గ్రామ పంచాయతీల్లోని 8 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, తుమ్మపహాడ్, సిరికొండ, రాజులగూడ, నారాయణపూర్ గ్రామా లు. నేరేడుగండి, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ►ములుగు జిల్లాలో వాజేడు మండలంలో కొంగలవాగుల దాటితే పెనుగోడు గ్రామానికి, చాకలివాగు దాటితే వాజేడు మండల కేంద్రానికి వెళ్తారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, వెంకటాపురం–కె మండలంలో కర్రవానిగుంపు, మల్లారం గ్రామాలకు వెళ్లాంటే మద్యంలో కంకలవాగును దాటివెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని జలగవంచతో పాటు జిల్లావ్యాప్తంగా ఇరువై గ్రామాలకు వర్షాకాలం వస్తే రోడ్డు మార్గం కూడా ఉండదు. బయ్యారం–మొట్లతిమ్మాపురం మధ్యలో ఉన్న ఉడుము వాగును దాటుతున్న మహిళలు -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. గర్భిణి ఫిర్యాదు
లక్నో: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్నగర్కు చెందిన అమిత్ మౌర్యతో 2019లో ఆమెకు పరిచయం ఏర్పడగా, కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి వారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటట్లు తెలిపింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన మౌర్య కొన్నాళ్లుగా తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో అతను ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని, పెళ్లి విషయమై గట్టిగా అడిగేసరికి చేసుకోనని తెగేసి చెప్పినట్లు ఆరోపించింది. అంతేగాక ఓ యువతి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించిన మౌర్య తన అభ్యంతకరమైన చిత్రాలను కూడా అందులో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది -
Coronavirus: గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నా వయసు 36 ఏళ్లు. పెళ్లయిన పన్నెండేళ్లకు గర్భం ధరించాను. ఇప్పుడు నాకు నాలుగో నెల. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లంతా కరోనా వాక్సీన్ తీసుకోవాలంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు వాక్సీన్ తీసుకోవచ్చా? – ఎన్. ప్రసన్న (ఇ మెయిల్ ద్వారా అందిన ప్రశ్న) ఈ కొత్త కరోనా వైరస్ ప్రపంచానిఇ తెలిసి ఒకటిన్నర సంవత్సరాలు అవుతోంది. దీనికి వ్యతిరేకంగా యాంటిబాడీస్ తయారయ్యి దాని మీద దాడి చేసే వైరస్ శరీరంలో పెరగకుండా ఉండటానికి కరోనా వ్యా క్సిన్ తయారు చేయ్యడం జరిగింది. కానీ, మిగితా వ్యాక్సన్లాగా మెల్లగా అనేక మంది మీద అన్ని రకాలుగా ఎక్కువ సంవత్సరాలు పరిశోధనలు జరగకుండాకే అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఇది కూడా ఒక ఫ్లూ వైరస్ జాతికి సంబంధించిదిగా పరిగణించి, తక్కువ కాంలో ట్రయల్స జరిపి తయారు చేశారు. అలాగే అత్యవసరంగా ప్రజలకు ఇవ్వడానికి ఆమెదింపబడినది. కానీ, ఈ పరిశోధనలు గర్భం దాల్చిన వారి మీద చేయ్యలేదు. కాబట్టి, దాని ఫలితాలు దుష్ఫలితాలు గర్భిణీల మీద కడుపులో ఉన్న బిడ్డపైన ఎలా ఉంటాయి అనేది కచ్చితంగా చెప్పటం కష్టం. కాబటి ఐసీఎమ్ఆర్ గర్భీణీలలో కరోనావైరస్ ఇవ్వవచ్చు అనే మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటీ వరకూ చూసిన అనుభవాల మేరకు గర్భీణీలు వ్యాక్సిన్ తీసుకోవడటం వలన మంచి, చెడు, తీసుకోకపోవడం వలన వచ్చే సమస్యలతో పోలిస్తే మంచి జరిగేది ఎక్కువ అని, చెడు తక్కువ అని తెలుపుతున్నారు. సీడీసీ, ఎఫ్డీఏ, ఏ సీఓజీ, ఆర్సీఓజీ, ఎఫ్ఓజీఎస్ఐ వంటి సంస్థలు గర్భంతో ఉన్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్ను తీసుకోవడమే మంచిది అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే, కరోనా వైరస్సంక్రమించి దాని వలన ముప్పుకంటే, వ్యాక్సిన్ వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువ అని. ఇప్పటి దాకా వ్యాక్సిన్ తీసుకోవడం వలన వచ్చే చిన్నచిన్న ఇబ్బందులే అంటే, జర్వం, ఒళ్లునొప్పులు, వంటివే గర్భవతులకు కూడా రావచ్చు. దానికి పారసిటబాలు మాత్ర వేసుకోవచ్చు. ఎవరిలోనైనా అరుదుగా ఏ వ్యాక్సిన్కైనా వచ్చే తీవ్రమైన రియాక్షన్లు, దీనిలో కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన యాంటిబాడీస్ తయారయ్యి అవి పిండంలోని బిడ్డకు కూడా చేరతాయి. దీంతో తల్లిబిడ్డల క్షేమంగా ఉండేటట్లు చేయడం జరిగింది. మొదటి దశతో పోలిస్తే, ఈ సెకండ్ వేవ్లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ గర్భీణీలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదృష్టం కొద్ది మొదట్లోనే దీనిని గుర్తించి పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా బయట పడుతున్నారు. ఇక దీర్షకాల వ్యాధులు ఉన్న గర్భవతులు, అధిక వయసు, అధిక బరువు ఉన్న వారిలో కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీరు కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువగా జాగ్రత్తలు, ముందుగానే వ్యాక్సిన్ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గర్భవతులైన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. మనదేశంలో గర్భీణీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చుననే ఖచ్చితమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగి చూడాల్సి ఉంటుంది. ఈ లోపల ఒకవేళ వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వస్తే గర్భీణీలు వారి డాక్టర్తో సంప్రదించి కొంత రిస్క్పైన వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ వేసుకోవటం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం కొనసాగించవలసిందే. ఎందుకంటే వ్యాక్సిన్ నూటికి నూరుశాతం కరోనా వైరస్ను అరికడుతుంది అని నిర్ధారణ కాలేదు. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మళ్లీ కరోనా వచ్చినా, వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుండా చాలా వరకు సురక్షితంగా బయటపడుతుండటం గమనించాలి. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?.. నిరూపించిన హైదరాబాద్ డాక్టర్ -
ఏపీ: పోలీస్ శాఖలో గర్భిణులకు ‘వర్క్ ఫ్రం హోమ్’
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖలో గర్భిణులు ఇంటి నుంచే పనిచేసేలా (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్సవాంగ్ శనివారం రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది, వారిలో గర్భిణుల వివరాలను రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెంటనే పంపాలని ఆయన ఆదేశించారు. గర్భిణులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలపై పోలీస్ హెల్ప్డెస్క్నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహకారం అందించాలని ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని గర్భిణులు, మహిళల పట్ల కోవిడ్ సమయంలో శ్రద్ధ వహించాలని డీజీపీ స్పష్టం చేశారు. చదవండి: కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు -
దుష్టశక్తుల నుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే
ఈ సంస్కారాన్ని కూడా గర్భిణీస్త్రీకే జరుపుతారు. సీమంతోన్నయనం అనగా కేశాలని ఎత్తికట్టడం. పాపటను ఏర్పరచడం. దీనికే ఫలస్నపనమని ఇంకొకపేరు కూడా వుంది. గర్భిణీస్త్రీని ఆవహించుకుని వుండే దుష్టశక్తుల బారినుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే ఈ సంస్కారం చేయాలని శాస్త్రం. పుంసవనమూ, సీమంతోన్నయనమూ ఈరెండు సంస్కారాలూ గర్భరక్షణ కోసం చేస్తారు. ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలనే దానిమీద భిన్న వాదనలున్నా, తొలిచూలులో నాలుగు/ ఆరు/ ఎనిమిదవ మాసంలో ఈ సంస్కారం జరిపించాలని శాస్త్ర వచనం. ఒకవేళ తొలిచూలులో వీలుకాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం. ఈ సంస్కారాన్ని ఆ మాసంలోని శుక్లపక్షంలో, పురుష నక్షత్రాలలో అనగా అశ్వని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర అను నక్షత్రాలలో జరిపించాలి. సంస్కార విధానం: శుభదినాన, ఉదయాన్నే, గణపతి పూజ, పుణ్యహవాచనాలను జరిపించి, సంకల్పం చెప్పుకుని రక్షాబంధనము చేసి, సంతాన ప్రదాతలగు విష్ణువుకీ, త్వష్ట ప్రజాపతికీ, ఇతర దేవతలకూ హవిస్సులర్పించి, హోమగుండానికి పడమరవైపు తూర్పుముఖంగా గర్భిణీస్త్రీని కూర్చుండబెట్టి, అత్తిపండ్లగుత్తులు, ఇతర సమిధలు కలిపి ఆమె పాపటిని రేపాలి. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుట్టాలి. ఆ తరువాత పాపిటను కుంకుమతో అలంకరించి, తూర్పు లేక ఉత్తరదిశగా దంపతులిద్దరూ నడచి అక్కడవున్న కోడెదూడను తాకి నమస్కరించాలి. తరువాత, ఒక రాగిపాత్రలో వడ్లనుగానీ, యవధాన్యాన్నిగానీ వుంచి, విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపింశతు మొదలైన ఏడు ఋగ్వేదమంత్రాలను పఠిస్తూ, భర్త, గర్భిణీస్త్రీకి ఏడు దోసిళ్ళతో ఆ నీరు తాగించాలి. తర్వాత కుటుంబాచారాలను ఆచరించి, అందరి ఆశీర్వచనాలను తీసుకుని అందరికీ యథాశక్తి భోజనాదులనో లేక ఫలతాంబూలాదులనో సమర్పించాలి. (సశేషం) -
కరోనా లక్షణాలుంటే టీకా వేయొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా అనుమానిత లక్షణాలపై శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న పిల్లలు, గర్భిణులకు టీకాలు వేయొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. టీకాల కోసం రావొద్దని వారికి సూచించాలని కోరింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం వారికి టీకాలు ఇవ్వకూడదని తెలిపింది. అయితే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా ఇతర ప్రాంతాల్లో ఇతర గర్భిణులు, చిన్న పిల్లలకు రెగ్యులర్ వ్యాక్సిన్లు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలైనప్పుడు దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది. అత్యవసర సేవలు మినహా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది మొత్తం కరోనా విధుల్లోనే నిమగ్నమైపోయారు. సడలింపులు ఇచ్చినందున తిరిగి వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కేంద్రం కోరింది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్లను నిర్ణీత çసమయంలో కేంద్రం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని మాత్రమే వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం పేర్కొంది. అయితే పుట్టినప్పుడు వేసే టీకాలు మాత్రం జోన్లతో సంబంధం లేకుండా అందరికీ వేస్తారు. వివిధ మండలాల ప్రకారం టీకాల కార్యక్రమాన్ని, అందుకు సంబంధించిన వ్యూహాన్ని అమలు చేస్తారు. కేంద్ర మార్గదర్శకాలు ఇవి.. ► గర్భిణులు, పిల్లలకు టీకాలు వేసేటప్పుడు ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి. ► ప్రతి ఒక్కరి మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరం ఉండాలి. మాస్క్లు ధరించాలి. ► వ్యాక్సిన్లు వేసే చోట ఐదుగురి కంటే ఎక్కువగా ఉండకూడదు. ► భౌతిక దూరం పాటించేలా అవసరమైన స్థలాన్ని పంచాయతీ లేక పట్టణ స్థానిక సంస్థలను కోరాలి. ► ప్రసవ కేంద్రాల్లో టీకాలు కొనసాగించాలి. ► టీకాలు వేసే సిబ్బంది మూడు లేయర్ల సర్జికల్ మాస్క్, గ్లౌజులు ధరించాలి. ► ప్రతి బిడ్డకు టీకాలు వేసిన తర్వాత సిబ్బంది చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలి. ► గర్భిణులకు, వారి వెంట వచ్చే వారికి సీట్లు ఏర్పాటు చేయాలి. ► ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్ శానిటైజర్ లేదా హ్యాండ్ వాషింగ్ యూనిట్లు అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత కూర్చునే స్థలాన్ని క్రిమిసంహారకం చేయాలి. ► నిర్ణీత జాబితాలో ఉన్న పిల్లలు, గర్భిణులకు స్లాట్ల ప్రకారం సమయం కేటాయించాలి. ► వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో ప్రతి నెలా సరాసరి 25–30 మంది టీకా వేయించుకునేవారు ఉంటారు. ఆ ప్రకారం వేయాలి. ► అంగన్వాడీ కేంద్రం కాకుండా ఇతర ప్రదేశాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను గుర్తించాలి. ► ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఉన్న సిబ్బంది సరిపోకపోతే, రిటైర్ అయిన ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు తదితర వైద్య సిబ్బందిని నియమించుకోవాలి. ► పట్టణ ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించేందుకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ సెంటర్లు, మ్యారేజ్ హాళ్లు, స్కూళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ► టీకాలు వేయడం, అవగాహన కల్పిం చడం, టీకాలు వేయించుకోని పిల్లలను గుర్తించడం తప్పనిసరి. ► ఇచ్చిన స్లాట్ ప్రకారం వచ్చేలా ఒక రోజు ముందే ఫోన్ చేసి రావాలని కోరాలి. ► ఇంట్లో తయారుచేసిన మాస్క్లను ఉపయోగించాలని సలహా ఇవ్వాలి. -
ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం
సాక్షి, హైదరాబాద్: గద్వాలకు చెందిన గర్భిణి జనీలాకు వైద్యం అందించని ఆస్పత్రుల యాజమాన్యాల నుంచే ఆమె కుటుంబానికి పరిహారం అందించాల్సి ఉంటుందని హై కోర్టు పేర్కొంది. కరోనా వైరస్ నివారణ వైద్యం చేయని ఆస్పత్రులు గర్భిణులకు, ఇతర అత్యవసర వైద్య సేవలను అంద జేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. వైద్యం అందించని ఏడు ఆస్పత్రుల వైఖరి క్షమించరానిదని వ్యాఖ్యానించింది. ప్రసవ వేదనతో బాధపడుతూ పలు ఆస్పత్రులకు తిరిగి చివరికి హైదరాబాద్లో పసికందుకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని న్యాయవాదులు కిశోర్కుమార్, శ్రీనిత పూజారి రాసిన లేఖలను హైకోర్టు పిల్స్గా పరిగణించింది. వీటిని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. -
అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ అనసూయ భరధ్వాజ్ను రాచకొండ పోలీసులు అభినందించారు. నేడు తన పుట్టినరోజు సందర్భగా.. కీసర మండలంలోని పలువురు గర్భిణి స్త్రీలకు అనసూయ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. గర్భిణిలకు సాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ భర్త సుశాంక్ భరధ్వాజ్ కూడా పాల్గొన్నారు. ఇందకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. అనసూయను అభినందించారు. (చదవండి : హిజ్రాలకు శేఖర్ కమ్ముల చేయూత) గర్బిణీ స్రీలకు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పోషకాలను అందించి.. వారిలో ధైర్యం నింపేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. నేడు (మే 15) కీసర పీహెచ్సీ పరిధిలోని గర్భిణిలకు తన బర్త్ డే సందర్భంగా అనసూయ న్యూట్రిషన్ కిట్లను అందజేశారని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ అనసూయ గొప్ప మనసును అభినందించారు. అలాగే ప్రస్తుత పిరిస్థితుల్లో గర్భిణిలు బయటకు రావొద్దని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని.. ఏదైనా సాయం కావాలంటే పోలీసు కోవిడ్ కంట్రోల్ నెంబర్ 9490617234కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి డీసీపి రక్షిత మూర్తి.. లాక్డౌన్ సమయంలో మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు అనసూయకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు బుల్లితెరపై యాంకర్గా కొనసాగుతూనే.. వెండితెరపై కూడా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమె క్రేజ్ను మరింతగా పెంచింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటించనున్నట్టుగా తెలుస్తోంది. (ఫొటోలు : యాంకర్ అనసూయ భరధ్వాజ్ అదిరే స్టిల్స్) #HelpingHands Anchor Anusuya has sponsored a Healthy kits article for 100 pregnant ladies at Keesara on the occasion of her birthday. #CP_Rachakonda, @DcpMalkajgiri, @AcpKushaiguda, SHO @Keesaraps have distributed.@anusuyakhasba @TelanganaDGP @TelanganaCOPs @TelanganaCMO pic.twitter.com/lPDQC1RZN1 — Rachakonda Police (@RachakondaCop) May 15, 2020 -
108 వాహనాల్లోనే ప్రసవాలు
కొత్తచెరువు/తనకల్లు: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఇరువురు గర్భిణిలు 108 వాహనాల్లోనే ప్రసవించారు. కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన గర్భిణి అపర్ణకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో 108కి ఫోన్ చేయగా వెంటనే వచ్చింది. అపర్ణను పుట్టపర్తి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొత్తచెరువు వద్ద వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేవిధంగా తనకల్లు మండల పరిధిలోని బాబేనాయక్తండాకు చెందిన రోజా శుక్రవారం 108 వాహనంలో పండంటి పాపకు జన్మనిచ్చింది. రోజాకు ఉదయం పురిటినొప్పులు అధికం కావడంతో కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టంగా మారే అవకాశం ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో తరలిస్తుండగా బత్తలపల్లి సమీపంలోకి రాగానే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 ఈఎంటీ మౌలాలి, పైలెట్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
జనతా కర్ఫ్యూ; నడిరోడ్డుపైనే కాన్పు
కర్నూలు,కౌతాళం: కౌతాళంలో ఆదివారం సాయంత్రం ఓ మహిళ నడిరోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు స్థానికంగా ఉన్న మహిళలు సహాయం చేశారు. బాపురం గ్రామానికి చెందిన ఉసేనమ్మ ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆటోలో మండల కేంద్రమైన కౌతాళం ప్రాథమిక వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అక్కడున్న వైద్య సిబ్బంది పరీక్షించి కాన్పు కష్టంగా ఉందని, వెంటనే ఆదోనికి తీసుకుపోవాలని సూచించారు. జనతా కర్ఫ్యూతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అది ఎంతసేపటికీ రాకపోవడంతో తాము వచ్చిన ఆటోలోనే ఆదోనికి తరలిస్తుండగా.. వైద్యశాల నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లకుండానే నొప్పులు అధికమయ్యాయి. ఆటోను అక్కడే నిలిపివేయగా స్థానిక మహిళలు వచ్చి ఉసేనమ్మకు సహాయం చేశారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో అధికంగా రక్తస్రావం జరగడంతో ఉసేనమ్మను చికిత్స కోసం ఆదోనికి తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
చెన్నై , పళ్లిపట్టు: గర్భిణీ అనుమానాస్పద మృతి సంబంధించి ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆర్డీఓ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పళ్లిపట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని నెడియం దళితవాడకు చెందిన వరప్రసాద్(24) ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ నడిపే సమయంలో చెంగల్పట్టులో డిగ్రీ తొలి ఏడాది చదివే అదూ ఊరికి చెందిన కార్తిక(21)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబీకుల సమ్మతంతో రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. దంపతులు నెడియం దళితవాడలో కాపురం ఉన్నారు. ఐదు నెలల గర్భిణీ అయిన కార్తిక ఆరోగ్యం విషమించిందని పేర్కొంటూ ఆమె భర్త శనివారం కోనేటంపేటలోని మండల ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. మృతిపై కార్తిక తండ్రి ఫిర్యాదు తమ కూతురు మృతిపై అనుమానం ఉందని కార్తిక తండ్రి పళ్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త వరప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా వివాహం జరిగిన రెండేళ్లలోనే మృతి చెందిన ఘటనకు సంబంధించి తిరుత్తణి ఆర్డీఓ దర్యాప్తు చేపట్టారు. -
గర్భిణీని 6 కి.మీ. మోసిన జవాన్లు
రాయ్పూర్: నిండు గర్భిణీని సీఆర్పీఎఫ్ జవాన్లు సుమారు 6 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని మూరుమూల పల్లె పడెడలో మంగళవారం జరిగింది. 85వ బెటాలియన్కు చెందిన జవాన్లు ఆమెను మంచంపై మోసుకుంటూ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్లో భాగంగా ఆ గ్రామనికి వెళ్లిన జవాన్లకు.. గ్రామస్తులు ఆమె గురించి చెప్పారు. వెంటనే వైద్య సహాయం అవసరం అని చెప్పడంతో ఆమెను మంచంపై మోసుకుంటూ బిజాపూర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వైద్య పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు. -
బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ
సాక్షి, కందుకూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం ముచ్చర్లకు చెందిన షాబాద్ పరమేశ్కు ధన్నారం గ్రామానికి చెందిన శివాని (28)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. శివాని రెండోసారి గర్భం దాల్చిన క్రమంలో ప్రతి నెలా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకుంటుంది. నెలలు నిండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు శివానిని పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వెంకటమ్మ ఆదివారం తెల్లవారుజామున శివానికి పురుడు పోయగా..బాబు జన్మించాడు. గంట అనంతరం ఇడ్లీ తినిపించా లని నర్సు చెప్పడంతో కుటుంబీకులు ఇడ్లీ తెప్పించారు. అయితే ఆ ఇడ్లీలను శివానికి కూర్చోబెట్టకుండా మంచంపై పడుకున్న బాలింతకు అలాగే తినిపించింది. దీంతో ఇడ్లీ శివాని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను 108 అంబులెన్స్లో హైదరాబాద్ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పీహెచ్సీ ఎదుట ఆందోళన.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహాన్ని కందుకూరు పీహెచ్సీకి తరలించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యాధికారులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇడ్లీ ఇరుక్కోవడంతోనే మృతిచెందినట్లు అంగీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. -
మిసెస్ మామ్ పోటీలు
-
ప్రసవాల సంఖ్య పెంచాలి
సాక్షి, మెదక్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చొరవ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల విషయంలో పాపన్నపేట వైద్య సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మండల కేంద్రమైన పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు 19 ప్రసవాలు పాపన్నపేట ఆరోగ్య కేంద్రంలో జరపడంపై వైద్య సిబ్బంది పనితీరును ప్రశంసించారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు గర్భిణులు ప్రైవేటును ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చోరవ తీసుకోవాలని పేర్కొన్నారు. తమ ఆస్పత్రిలో ప్రçసవాలు బాగా జరుగుతున్నాయని సిబ్బంది కొరతవల్ల కొంత ఇబ్బంది పడుతున్నామని, మరో స్టాప్ నర్సును ఇవ్వాలని పీహెచ్సీ వైద్యుడు హరిప్రసాద్ కోరారు. జిల్లా వైద్యధికారికి సానుకూలంగా స్పందించారు. డెలివరీ రూం, సంపు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. అలాగే అస్పత్రికి వచ్చే రోగులు కూర్చోవడానికి ముందు భాగంలో దాతల సహయంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుధవారం డెలివరీ జరిగిన ఇద్దరు మహిళలకు కేసీఆర్ కిట్స్ను అందించారు. వీరి వెంట డాక్టర్ హరిప్రసాద్, సీహెచ్ఓ చందర్, మేరీ, అలీ, పద్మ ఉన్నారు. -
గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం!
సాక్షి, హైదరాబాద్: మిసెస్ మామ్ రెండో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్లో మంగళవారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్ మామ్లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్లోని స్నాట్ స్పోర్ట్స్లో డిసెంబర్ 8న సాయంత్రం గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్ స్మైల్, మిసెస్ ఫ్యాషనిస్టా, మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బ్యూటీఫుల్ హెయిర్, మిసెస్ ఫిట్నెస్ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు 8897993265 నంబర్కు ఫోన్ చేసి డిసెంబర్ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్లో చిట్కాలు, డెంటల్, హెల్త్ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియజేయడమేగాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్ మామ్ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమా ఆర్య, మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పురుడు పోసిన పోలీసు
సాక్షి, చెన్నై: పురిటి నొప్పులతో తల్లడిల్లిన మహిళకు నడిరోడ్డుపై ప్రసవం చేసి న్యాయ రక్షణకే కాదు, ప్రాణ రక్షణకు తాము ముందుం టామని నిరూపించింది ఓ మహిళా ఇన్స్పెక్టర్. వివరాల్లోకి వెళితే.. చూలైమేడు సౌరాష్ట్రానగర్ ఎనిమిదవ వీధికి చెందిన మహిళ భానుమతి నిండు గర్భిణి. ఈమె భర్త రాత్రి పనికి వెళ్లాడు. ఇంటిలో భానుమతి మాత్రమే ఒం టరిగా ఉన్నది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి 2.45 గంటలకు భానుమతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నొప్పులు తట్టుకోలేక ఆమె ఆటో ఎక్కి ఆస్పత్రికి వెళ్లాలని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఒక్క ఆటో కూడా రాకపోగా నొప్పులు అధికంగా కావడంతో భానుమతి చూలైమేడు హైవే రోడ్డుపై పడుకొని తల్లడిల్లింది. అదే సమయంలో రాత్రి గస్తీ పనుల్లో ఉన్న చూలైమేడు నేరవిభాగ ఇన్స్పెక్టర్ చిత్ర భానుమతిని గమనించి వాహనం ఆపింది. తర్వాత భానుమతిని తన జీప్లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని భావించింది. అయితే భానుమతికి అధికంగా రక్తస్రా వం అవుతుండడంతో వాహనంలోకి ఎక్కించలేకపోయారు. వెంటనే తన వాహనాన్ని అడ్డుగాపెట్టి, సహాయకురాలు, అక్కడ పారిశుధ్ద్య పనుల్లో ఉన్న ఇద్దరు మహిళల సాయంతో భానుమతికి ప్రసవం చేశారు. కాన్పులో భానుమతికి పండంటి మగ బిడ్డ జన్మించా డు. తర్వాత 108 అంబులెన్స్ను రప్పించి తల్లిని, బిడ్డను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ సాహసాన్ని కొనియాడుతూ స్థానికులు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. కాళ్లు, చేతులు వణికాయి.. భానుమతికి ప్రసవం చేసిన మహిళా ఇన్స్పెక్టర్ చిత్ర మాట్లాడుతూ.. ‘‘చూలైమేడు హైరోడ్డులో గస్తీ చేపట్టిన సమయంలో వేకువజామున 3 గంటకు రోడ్డుపై పురిటి నొప్పులతో మహిళ అల్లాడుతుండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను వెంటనే వాహనాన్ని నిలిపి దగ్గరకు వెళ్లి ఆ మహిళను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించాను. అయితే అప్పటికే రక్తస్రావం అధికంగా ఉండడం వలన జీపు ఎక్కించే సమయంలోనే బిడ్డ బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో హుటాహుటిన ఆ మహిళపై ఉన్న దుప్పట్టాను మరుగుగా కప్పుకుని ప్రసవం చేశాను. ఆ సమయంలో నా చేతులు కాళ్లు వణికాయి. అయిప్పటికీ ధైర్యం తెచ్చుకుని బిడ్డను బయటకు తీశాను. సమీపంలో ఉన్న పారిశుద్ధ్య కార్మిక మహిళలు సాయంతో ప్రసవం విజ యవంతమైంది. బొడ్డు తాడు కోయడానికి నా జీప్లో ఉన్న చిన్న కత్తిని ఉపయోగించాను. ఇలా రెండు నిండు ప్రాణాలను కాపాడగలిగాను. కాగా ఇన్స్పెక్టర్ చిత్ర సొంత ఊరు వేలూరు సమీపంలోని కావేరిపాక్కం. ఆమె భర్త బీఎస్ఎన్ఎల్ సంస్థలో అధి కారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అరవింద్, సింధుజా అనే పిల్లలు ఉన్నారు. ఇన్స్పెక్టర్గా విధులు చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతుండడం గమనార్హం. -
అయ్యో.. పాపం!
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆ తల్లి కన్న కలలు ఆవిరయ్యాయి. భూమి మీద పడకుండానే.. లోకాన్ని చూడకుండానే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తొమ్మిది నెలలు మోసిన మాతృమూర్తి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘోరం పాడేరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. రహదారి లేని కారణంగా కాలినడకన ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నంలో బిడ్డ చనిపోయి జన్మించాడు. ఇలాంటి సంఘటనలు మన్యంలో తరచూ జరుగుతున్న పాపానికి గత పాలకుల నిర్వాకమే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, పాడేరు రూరల్ : మన్యంలో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు నేటికీ కష్టాలను అనుభవిస్తున్నారు. కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వీరికి శాపంగా మారింది. దీంతో కొన్నాళ్లుగా మన్యంలో మాతాశిశు మరణాలు ఆగటం లేదు. తాజాగా పాడేరు మండలం వై.సంపలలో గర్భిణి వంతాల జ్యోతి ప్రసవ వేదనకి గురై ప్రసవ సమయంలో తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. వంతాల జ్యోతి నాలుగోసారి గర్భం దాల్చింది. నెలలు నిండడం శనివారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మినుములూరు పీహెచ్సీ, ఏఎన్ఎం పద్మకు సమాచారం ఇచ్చారు. అయితే వై.సంపల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదు. దీంతో జ్యోతిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. డోలిలో తరలించేందుకు కూడా రహదారి సరిగ్గా లేదు. అలాగే చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు నిండు గర్భిణి జ్యోతిని అడవి మార్గం మీదుగా కాలినడకన పాడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మగబిడ్డను ప్రసవించింది. కానీ కాలినడకన సుమారు 5 కిలోమీటర్ల మేర నడవడంతో బిడ్డ చనిపోయి పుట్టాడు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ కూడా సగం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఏఎన్ఎం పద్మ అక్కడకు వెళ్లి వైద్య సేవలందించారు. గత పాలకులు తమ గ్రామానికి రోడ్డు నిర్మంచలేదని వై.సంపల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో మాతాశిశు మరణాల్లో కొన్ని... - అనంతగిరి మండలంలో గత ఐదు రోజుల వ్యవధిలో ఐదుగురు శిశులు, ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. -రెండు రోజుల క్రితం పాడేరు మండలం లగిసపల్లి గ్రామానికి చెందిన మూడు నెలల శిశువు మృతి చెందింది. -గత 10 రోజుల వ్యవధిలో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరి, మండలాల్లో తొమ్మిది మంది శిశువులు, ఐదుగురు గర్భిణులు మృత్యువాత పడ్డారు. -
టీచర్ ప్రాణం తీసిన శిక్షణ!
కర్నూలు సిటీ: ఆరోగ్యం సరిగా లేదు...శిక్షణకు రాలేనని ఓ ప్రైవేటు ఉపాధ్యాయిని యాజమాన్యా నికి విన్నవించింది. ఆమె గర్భిణి అయినా యాజమాన్యం కనికరించలేదు. దీంతో అనారోగ్యంతోనే ఎండలో శిక్షణ హాజరై ప్రాణాలు కోల్పోయింది. నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవే టు టీచర్స్ అసోసియేషన్ నాయకుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థ తమ ఉపాధ్యాయులకు నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న సుధారాణి (28) హాజరైంది. ఆమె మూడు నెలల గర్భిణి. దీనికితోడు అనారోగ్యంగా ఉండడంతో తాను శిక్షణకు రాలేనని చెప్పినా నిర్వాహకులు వినలేదు. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో చేసేది లేక శిక్షణకు వచ్చారు. బుధవా రం రాత్రి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అబార్షన్ అయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం శిక్షణ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో శిక్షణ ఎ లా నిర్వహిస్తారని సంఘం రాష్ట్ర కన్వీనర్ చాంద్బాషా ప్రశ్నించారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా దుర్మార్గంగా వ్యవహరించిన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. అడ్మిషన్లు, వర్క్షాప్ పేరుతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో నాయకులు చక్రపాణిరెడ్డి, నాగరాజు, మహేష్, ప్రసాద్, వీరేష్, హనుమంతురెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ప్రైవేటు టీచర్ల సంఘం నాయకులు -
గర్భిణికి నరక వేదన
తిరువళ్లూరు: ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన మహిళకు గర్భసంచి తొలగించిన సంఘటన తిరువళ్లూరు జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. కాంచీపురం జిల్లా పిచ్చువాక్కం గ్రామానికి చెందిన రాజేష్ (22), ఓరత్తూరు గ్రామానికి చెందిన స్నేహ(19)కు 2018 మార్చిలో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లా రామంజేరిలోని బంధువుల వద్ద ఆశ్రయం పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న స్నేహను బుధవారం సాయంత్రం ఏడు గంటలకు పట్రపెరంబుదూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలో ప్రసవం కోసం చేర్పించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే చికిత్స అందించారు. స్నేహకు నార్మల్ డెలీవరి ఆయ్యే అవకాశం ఉందని, అపరేషన్ వద్దని సూచించిన నర్సులు గురువారం సాయంత్రం వరకు ఎలాంటి చిక్సిత చేయకుండానే కాలయాపన చేశారు. తీరా 8 గంటలకు స్నేహకు నార్మల్ డెలీవరి కాగా, శిశువు మృతి చెందింది. అయితే శిశువు మృతి చెందిన నేపథ్యంలో డెలీవరీ అయిన మహిళను పట్టించుకోకపోవడంతో పాటు డాక్టర్ వైద్యశాలకు రాకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలిసింది. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో పాటు ఎంత శ్రమించినా బ్లీడింగ్ ఆగకపోవడంతో ఆమెను మెరుగైన చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి పది గంటలకు రెఫర్ చేశారు. అయితే తిరువళ్లూరు వైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ కృష్ణరాజ్ నేతృత్వంలోని ఐదు మంది ప్రత్యేక డాక్టర్లు మూడు గంటల పాటు శ్రమించినా బ్లీడింగ్ ఆగకపోవడంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అనంతరం భర్త అనుమతితో అపరేషన్ చేసి గర్భసంచిని తొలగించి మెరుగైన చిక్సిత కోసం చెన్నై వైద్యశాలకు తరలించారు. అర్ధరాత్రి ఆందోళనలు:యువతికి గర్భసంచి తొలగించారన్న విషయం బంధువులకు తెలియడంతో అర్దరాత్రి 1 గంటకు తిరువళ్లూరు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రసవం కోసం చేరిన యువతికి పట్రపెరంబుదూరులో చిక్సిత సరిగ్గా అందించక పోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించిన బంధువులు, గర్భసంచి తొలగించి యువతి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. వైద్యశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అర్ధరాత్రి బంధువుల ఆందోళనతో తిరువళ్లూరు వైద్యశాల వద్ద కలకలం రేగింది. ఇద్దరు నర్సుల బదిలీ–విచారణకు రావాలని డాక్టర్కు ఆదేశం: శిశువు మృతి, మహిళకు గర్భసంచి తొలగింపు వ్యవహరం తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో పట్రపెరంబుదూరులో పని చేస్తున్న ఇద్దరు నర్సులను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. విధులకు హాజరుకానీ డాక్టర్ను విచారణకు హజరు కావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. -
గర్భిణి బలవన్మరణం
జీడిమెట్ల: మొదటి కాన్పులో ఆడపిల్లే పుట్టడంతో పాటు రెండో కాన్పులోను ఆడపిల్లే పుడుతుందని అత్తింటి వారి సూటిపోటి మాటలు భరించలేక ఓ గర్భిణి బలవన్మరణాన్ని పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాజులరామారం డివిజన్ వివేకానంద కాలనీకి చెందిన శశిలేఖ కుమారుడు శేరి అనిల్రెడ్డి తో అదే ప్రాంతానికి చెందిన ఈదులకంటి మధుసూదన్రెడ్డి, వనజల కుమార్తె రేఖ(26)కి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.20 లక్షలు కట్నకానుకల కింద అందజేశారు. అనిల్రెడ్డి చింతల్లోని శివసాయి కంప్యూటర్స్ ఇనిస్టిట్యూషన్ నిర్వహిస్తుండగా రేఖ గృహిణి. వీరికి మోక్ష (15 నెలలు)పాప ఉంది. ప్రస్తుతం రేఖ ఆరు నెలల గర్భిణి. పెళ్లైన కొద్ది నెలల వరకు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి ఆడపిల్లే పుడుతుందని అత్తింటి వారు నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రేఖ తన తల్లికి ఫోన్చేసి ఇంట్లో గొడవ జరిగిందని, తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. వెంటనే తల్లి వనజ కూతురి ఇంటికి వెళ్లగా ఇంట్లో అందరూ ఉన్నారు. రేఖ గది లోపల నుంచి గడియ పెట్టి ఉండగా స్థానికుల సహాయంతో పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించింది. భర్త అనీల్రెడ్డితో పాటు అత్త శశిలేఖ, ఆడపడుచు వనిత వేధింపుల కారణంగానే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతున్న గర్భిణి మృతి
చైతన్యపురి: చికిత్స పొందుతూ ఓ గర్భిణి మృతి చెందిన సంఘటన చైతన్య పురిలో ఉద్రిక్తతకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మిర్యాలగూడకు చెందిన అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(29)కు నాలుగు నెలల క్రితం కూకట్పల్లికి చెందిన వెంకట్తో వివాహం జరిగింది. ఆమె గర్భం దాల్చడంతో నగరంలోని ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే అమెకు గుండె సంబంద వ్యాధి ఉన్నందున గర్బం దాల్చితే ప్రమాదని, అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె వాసవి కాలనీలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ చైతన్యపురిలోని స్వప్న ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. దివ్యను ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు మూడు రోజుల క్రితం అబార్షన్ అయ్యేందుకు మందులు ఇచ్చి ఇంటికి పంపారు. అధిక రక్తస్రావం అవుతుండటంతో గురువారం మరోసారి ఆసుపత్రికి రాగా పూర్తిగా అబార్షన్ కాలేదని, డీఎన్సి చేయాలని చెప్పడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. రక్తం తక్కువగా ఉందని చెప్పిన వైద్యులు రక్తం ఎక్కించకుండానే డీఎన్ఏ చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఓమ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని స్వప్న ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చిన ఆమె బంధువులు వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యం కారణంగా దివ్య మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి బంధువులతో మాట్లాడించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా డాక్టర్ స్వప్నకుమారి అందుకు అంగీకరించక పోవటంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మద్యాహ్నం నుంచి రాత్రి 7.30 వరకు ఆందోళన కొనసాగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యంలో ఎటువంటి తప్పు జరగలేదని, తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నకుమారి పేర్కొంది. -
సాధారణమే మేలు
మానవ శరీరం 45 డెల్స్ యూనిట్స్ నొప్పిని మాత్రమే భరించగదు. కానీ గర్భిణి ప్రసవించే సమయంలో 57 డెల్స్ యూనిట్స్ బాధను భరిస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే... ఒకేసారి 20 ఎముకలు పటపటా విరిగిపోతుంటే ఎంత బాధ వస్తుందో...అంత బాధను ఆ మాతృమూర్తి ఆ సమయంలో భరించాలి. అందుకే పురిటినొప్పులా...ఇంకేముంది సిజేరియన్ చేసేద్దాం. వైద్యుల నోటి నుంచి వచ్చే మొదటి మాట అదే... గర్భి ణులు, వారి బంధువుల మనసులో మాట కూడా అదే. కానీ గత ఐదేళ్లుగా కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కౌన్సెలింగ్ ఫలితంగా గర్భిణులు కూడా సానుకూలంగా స్పందించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. కాకినాడ : సాధారణ ప్రసవమే పదికాలాల పాటు పదిలమని అన్నారు పెద్దలు. సిజేరియన్ల కంటే సాధారణ ప్రసవాలే మేలంటున్నారు వైద్యాధికారులు. ఆ సూచనలకు సానుకూల స్పందన వస్తుండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రి ప్రసూతి వార్డులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సాధారణ కాన్పుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్స కాన్పులు అధికంగా జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించడానికి వివిధ పథకాలు రూపొందించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగింది. సమస్యాత్మకమైతేనే శస్త్ర చికిత్స... జిల్లా కేంద్రమైన కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణుల ప్రసవం కోసం వచ్చినా, జిల్లాలోని వివిధ పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి జీజీహెచ్కు గర్భిణులను తీసుకొచ్చినా సాధారణ కాన్పులు చేయడానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కాన్పు సమస్యాత్మకమైతే వెంటనే సమీపంలోని కాకినాడ జీజీహెచ్కు పంపిస్తున్నారు. ఇలాంటివారికి సైతం వైద్యం అందిస్తూ సాధారణ కాన్పులు చేయడానికే జీజీహెచ్ వైద్యులు ప్రాధాన్యతనిస్తున్నారు. నొప్పులు భరించలేని గర్భిణులు, లేదా విధి లేని పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్స వైపు ఆలోచిస్తున్నారు. అందువల్లే జిల్లాలో కోత కాన్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత మూడేళ్లుగా కాకినాడ జీజీహెచ్లో 80 శాతం మందికి పైగా సాధారణ డెలివరీల వైపు మొగ్గు చూపించడం గమనార్హం. సాధారణ కాన్పులతోనేప్రయోజనాలు... సాధారణ ప్రసవాల్లో మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలానే తమ పనులను తాము చేసుకోడానికి వీలుంటుంది. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. గర్భసంచికి కూడా ఏ ప్రమాదం ఉండదు.గర్భాశయానికి ఎటువంటి వ్యాధులూ సోకవు. భవిష్యత్తులో ఎటువంటి రుగ్మతలకు గురికాకుండా ఆరోగ్యం గా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స కాన్పులతోనే ప్రమాదాలు ♦ శస్త్ర చికిత్స చేసుకున్నవారిలో రెండో కాన్పు సమయంలో కుట్లు విడిపోయే ప్రమాదం ఉంటుంది. ♦ గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో భవిష్యత్తులో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి. రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో గర్భసంచి తొలగించే పరిస్థితి తలెత్తవచ్చు. ♦ తరచూ విరేచనాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. గర్భసంచి పక్కన ఉండే మూత్రాశయానికి కూడా ఇబ్బందులు ఏర్పడొచ్చు. దీంతో రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు.దాదాపు ఆరు నెలలపాటు బరువైన పనులు చేయడానికి వీళ్లేని పరిస్థితి. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కేసులు వస్తుంటాయి. ప్రతి కాన్పును సాధారణంగా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ ఆసుపత్రికి ఆందోళనకరంగా ఉండే కేసులే అధికంగా వస్తుంటాయి. పోషకాహారలోపంతో ఉన్న హైరిస్క్ కేసులు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ వైద్య పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతోంది. హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉండి అంటే 3, 4 శాతం ఉన్న హైరిస్క్ కేసులు, మొదటి ఆపరేషన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకుని, రెండో కాన్పుకు జీజీహెచ్కు వస్తున్నాయి. ఇటువంటి హైరిస్క్ కేసులకు కూడా సాధారణ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సాధారణంగా ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటే రెండోసారి సాధారణ డెలివరీ అయ్యేవారి శాతం తక్కువగా ఉంటుంది. గత మూడేళ్లుగా భారీగా శస్త్ర చికిత్సలు తగ్గాయి. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు వైద్య ఆరోగ్య సిబ్బందితో అవగాహన కల్పిస్తూ సాధారణ డెలివరీలను ప్రోత్సహిస్తున్నాం.– డాక్టర్ లావణ్య కుమారి,హెచ్వోడీ, ప్రసూతి విభాగం, కాకినాడ జీజీహెచ్ -
కోత కాన్పుల బాధ్యత అందరిదీ
సాక్షి, హైదరాబాద్: కోత కాన్పులు (సిజేరియన్) పెరగడానికి వైద్యులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారు బాధ్యులే అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్సె స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఐకాగ్) అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.శాంతకుమారి స్పష్టం చేశారు. గర్భిణులు ప్రసవ నొప్పులు పడేందుకు ఇష్టపడక పోవడం, లేటు వయసులో గర్భం దాల్చడం, మధుమేహం, ఒత్తిడి, ఫలానా ముహూర్తంలోనే బిడ్డను కనాలన్న కోరికలు వంటి అనేక కారణాలు ఇందుకు కారణమని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఫాగ్సీ) వార్షిక సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బ్రెజిల్ తదితర దేశాల్లో 60–70 శాతం కాన్పులు ఈ రకంగా జరుగుతుంటే..భారత్లో అది 20 శాతం మాత్రమే అని తెలిపారు. ఫాగ్సీ సదస్సు గురించి వివరిస్తూ ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడం ఎలా అన్న అంశంతోపాటు వంధ్యత్వం, అత్యవసర సేవలు వంటి మూడు అంశాలపై గైనకాలజిస్టులకు వర్క్షాపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐకాగ్ ఉపాధ్యక్షుడు పరాగ్ బిన్నీ వాలా పాల్గొన్నారు. -
కన్నతండ్రి కర్కశత్వం
మదనపల్లె క్రైం: కన్న కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. తాగిన మైకంలో గర్భవతి అని కూడా చూడకుండా దాడిచేసి కొట్టాడు. దీంతో పొట్టమీద బలమైన దెబ్బ తగిలి గర్భంలోని కవల శిశువులు మృత్యువాతపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించి మృతశిశువులను బయటికి తీశారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన నరసింహులు, రమణయ్య కుమార్తె లక్ష్మీదేవికి గత ఏడాది మండలంలోని ఓబులరెడ్డిపల్లె శివకుమార్తో వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం గర్భవతి. భర్త తాగుడుకు బానిసై వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. తాగుబోతు భర్త మరో వివాహం చేసుకుని, మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులపైనే ఆధారపడి కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం ఆమె తండ్రి నరసింహులు మద్యం తాగి వచ్చి తల్లి రమణమ్మను కొడుతుండగా లక్ష్మీదేవి అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి గర్భిణి అని చూడకుండా పొట్టపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. రుయాలో పరీక్షించిన వైద్యులు కడుపులోని కవలలు చనిపోయారని నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు బాధితురాలి తల్లి రమణమ్మ తెలిపింది. -
ప్రాణం నిలిపేదెలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రక్తం కొరత వేధిస్తోంది. ఆపత్సమయంలో అవసరమైన రక్తం లభించక రోగులు, వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తం నిల్వలు క్రమంగా తగ్గిపోతుండడంతో బ్లడ్ బ్యాంకులు సైతం చేతులెత్తేశాయి. ప్రధానంగా ప్రమాద బాధితులు, గర్భిణిలు సమయానికి అవసరమైన రక్తం లభించక విలవిలలాడుతున్నారు. మీ బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి రక్తమిస్తే తప్ప తామేమి చేయలేమంటూ డాక్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉంది. ఏటా రాష్ట్రంలో 8 లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 4.80 లక్షల మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీళ్లు ప్రసవానికి వచ్చినప్పుడు రక్తం ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల యూనిట్లు అవసరమైతే 3.7 లక్షల యూనిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. వేసవిలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. మిగతా రోజుల్లో కళాశాలల విద్యార్థులు తరచూ రక్తదాన శిబిరాల్లో రక్తం ఇస్తుంటారు. అయితే సెలవులు కావడం, శిబిరాల నిర్వహణ తగ్గిపోవడంతో రక్తం నిల్వలు మరింతగా అడుగంటి పోతున్నాయి. ప్రమాద బాధితుల ఆవేదన వర్ణనాతీతం ప్రమాదాల సంఖ్యలో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెలకు సగటున 30 వేలకు పైగా ప్రమాదాలు జరుగుతుండగా ఏడాదికి సగటున 9 వేల మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. సమయానికి రక్తం లభ్యమయితే ఇందులో కొంతమందినైనా కాపాడవచ్చు. ఇక రక్తహీనత జబ్బుతో బాధపడుతున్న గర్భిణులు ప్రసవానికి వస్తే విధిగా రక్తం ఉండాలి. ఒక్కో మహిళకు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. హెచ్ఐవీ బాధితులు, తలసేమియా బాధితులు హెచ్ఐవీ బాధితులు ఏకంగా రక్తం కొరతతో మృతి చెందుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో రక్తం దొరకక ఇద్దరు హెచ్ఐవీ పేషెంట్లు మృతి చెందారు. సాధారణంగా హెచ్ఐవీ బాధితులు జడ్ఎల్ఎన్ (జుడోవిడిన్ లామిడివిడిన్ నెవరపిన్) మందులు వాడతారు. వీటి ప్రభావంతో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. ఎంతగా అంటే రక్తం శాతం 4కు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో విధిగా రక్తం ఎక్కించాలి. కానీ వీరికి రక్తం దొరకడం లేదు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన తలసేమియా బాధితుల పరిస్థితి నరకంగా ఉంటోంది. ఆయా బాధితుల తల్లిదండ్రులు పల్లెల్లో రక్త దాతలను బ్రతిమలాడుకోవాల్సి వస్తోంది. రక్తం ఎవరు ఇవ్వచ్చు - రక్తం ఇవ్వడానికి 21– 60 మధ్య వయస్సు వారు ఎవరైనా ఇవ్వవచ్చు - ఆరోగ్యవంతులై ఉండాలి... హెచ్ఐవీ, బీపీ, మధుమేహ వ్యాధి గ్రస్థులై ఉండకూడదు - ఒక్కసారి 300 మిల్లీలీటర్ల (యూనిట్) రక్తాన్ని సేకరించవచ్చు - మళ్లీ మూడు నెలల తర్వాతే రక్తం ఇవ్వాలి - ఒకసారి రక్తం తీసిన తర్వాత 15 రోజుల్లోగా ఆ రక్తాన్ని వాడుకోవాలి పరీక్షించే అవకాశమూ లేదు రక్తం తీసుకోవాలంటే దాతలను పరీక్షించాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఉందని రక్త దాతలకు తెలియదు. రక్తం తీసుకుంటున్నప్పుడు చెక్ చేసినా అందులో తేలదు. దీన్నే రోగికి విండో పీరియడ్ అంటారు. అంటే 15 రోజుల నుంచి 3 నెలల లోగా ఎప్పుడైనా హెచ్ఐవీ బయటపడచ్చు. దీంతో ఆ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించడం వారికి హెచ్ఐవీ రావడం ఇటీవల పలు చోట్ల జరిగింది. దీనికి సంబంధించి సరిగ్గా పరీక్షలు నిర్వహించాలంటే మెషీన్ ఖరీదు రూ.48 లక్షలు అవుతుంది. కానీ ఈ మెషీన్లు ఎక్కడా లేవు. -
అమ్మకు అభయం
పటాన్చెరు టౌన్: మాతా శిశు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్ కిట్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం కొనసాగుతుండగా గర్భిణులకు మరిన్ని సేవలందిస్తూ తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేందుకు 108 తరహాలో 102 నంబర్తో ‘అమ్మఒడి’ పేరిట వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలు అమ్మకు ఆత్మీయత, బిడ్డకు ప్రేమను పంచుతున్నాయి. మొదటి విడతగా జిల్లాకు ఇప్పటికే 14 వాహనాలు రాగా నియోజకవర్గానికి రెండు చొప్పున కేటాయించారు. ఒక్క ఫోన్కాల్తో.. మారుమూల గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం లేని దుస్థితిలో ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తల్లీ బిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్కు పోన్ చేస్తే చాలు. ఇంటికి వచ్చి వాహనంలో వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్దకు చేరవేస్తారు. జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలు, సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. జిల్లా పరిధిలో ఏఏ ఆస్పత్రిలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయించారు. నారాయణఖేడ్కు 4, సంగారెడ్డికి 3 మూడు, మిగతా నియోజకవర్గాలకు రెండు చొప్పున వాహనాలు చేరాయి. సేవలు ఇలా.. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వచ్చేంత వరకు సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. గర్భిణులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా 102 వాహనానికి సమాచారం అందించి సేవలు వినియోగించుకోవచ్చు. గర్భిణి ఇంటి వద్దకు వచ్చి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వైద్యసేవలు అందించిన తర్వాత తిరిగి ఇంటికి చేరుస్తారు. డెలివరీ అయిన మూడు నెలల వర కు కూడా ఈ 102 వాహనం సేవలు వినియోగించునే అవకాశం ఉంది. 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే తరలిస్తారు.ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించరు. ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలిస్తారు. వాహనాల సేవలు వినియోగించుకోవాలి జిల్లాకు 102 వాహనాలు 14 వచ్చాయి. వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో గర్భిణులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. – సురేష్ 102,108,1962 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ -
భర్త, సొంత మరిదే హంతకులు!
-
గర్భిణి హత్య: భర్త, సొంత మరిదే హంతకులు!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బొటానికల్ గార్డెన్ సమీపంలో గర్భిణి దారుణ హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్లోని ఒక బార్లో పనిచేసే అమర్కాంత్ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్ కాంత్, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు. నిందితుల తల్లిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతురాలి భర్త, మరిది అమర్కాంత్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమర్కాంత్ గత 10 రోజులుగా నగరంలోని లేడని వారు అద్దెకుంటున్న యజమాని సాక్షికి తెలిపారు. గత మూడు నెలలుగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు. జనవరి 28న రాత్రి గర్భిణీని హత్య చేసి ఉంటారని, తెల్లవారుజామున శ్రీరాంనగర్లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం స్టోన్ కటింగ్ యంత్రంతో కాళ్లు, చేతులు, తల కోసి ఉంటారని భావిస్తున్నారు. -
అమ్మకు అభయం
పాలమూరు : ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పుట్టిన బిడ్డ, బాలింతతో పాటు గర్భిణులకు మెరుగైన వైద్యం అందేలా ‘అమ్మ ఒడి’ పేరిట వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ వాహనాల ద్వారా తల్లీబిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్కు ఫోన్ చేస్తే చాలు.. ఇంటికి వచ్చి వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్ద దిగబెడుతారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 22 వాహనాలు శుక్రవారం ఇక్కడకు చేరుకున్నాయి. వీటిని మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఆవరణలో ఉంచగా, వారం రోజుల్లో ప్రారంభించే అవకాశముంది. కిట్తో కిటకిట కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ఉన్న ఊరు నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చుల సైతం లేని దుస్థితిలో బాధను పంటి బిగువున భరిస్తున్న మహిళల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. గర్భిణిగా నమోదైన నాటి నుంచి ప్రసవం అనంతరం చిన్నారికి పరీక్షల నిర్వహణ వరకు ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఈ పథకం ద్వారా వాహనాలు కేటాయించారు. 22 వాహనాలు అందుబాటులోకి.. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, షాద్నగర్ నియోజకవర్గాలు మినహా మిగత 12 నియోజకవర్గాలకు కలిపి 22 వాహనాలు అందుబాటులోకి రానున్నా యి. కాగా, ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఆ రు అమ్మ ఒడి వాహనాలు ఉండడం విశేషం. ఈ మేరకు ఏయే జిల్లా, ఏయే ఆస్పత్రి పరిధిలో పరిధిలో ఎక్కువగా ప్రసవాలు గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయిస్తారు. వాహనాల కోసం 102 ఫోన్ నంబర్ కేటాయించారు. వైద్యపరీక్షలు అవసరమైన గర్భిణులు, బాలింతలు ఈ నంబర్కు ఫోన్ చేసి న వెంటనే వారి ఇళ్ల వద్దకు చేరేలా చర్యలు తీసుకుం టోంది. అయితే, ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచారు. ఇదేకాకుండా ప్రయాణ సమయంలో వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఆడియోను వినిపిస్తారు. మాతాశిశు మరణాలు తగ్గింపే లక్ష్యం మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు, ఆరు తొమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రసవించాక చిన్నారికి నిర్ణీత సమయంలో టీకాలు ఇప్పించాలి. వీటిని కొందరు పాటిస్తున్నా.. మరికొందరు రకరకాల కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నివారణ కోసం ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. -
ఆస్పత్రి డ్రైనేజిలో ప్రసవించిన మహిళ
కొరాపుట్ : ఓ ఆదివాసీ మహిళ అత్యంత దయనీయ స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో ప్రసవించిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా దస్మంత్పూర్ బ్లాక్, జానిగూడకు చెందిన మహిళ.. తన తల్లి, సోదరితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎస్ఎల్ఎన్ఎంసీహెచ్)కు వచ్చారు. జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తన భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి... కుటుంబీకులు ఆమెను గైనకాలజీ వార్డుకు తీసుకెళ్లగా.. చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. నొప్పులను దిగమింగుతూ ఆస్పత్రి బయటికి వచ్చేసిన ఆ మహిళ.. పక్కనున్న డ్రైనేజీలో పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సిబ్బంది స్పందించి, వారిని లోనికి తీసుకెళ్లారు. ‘‘పిల్లకు నొప్పులుస్తున్నాయని ఎంత ప్రాధేయపడినా వాళ్లు వినలేదు. ఇంతకుముందు డాక్టర్ దగ్గర చూపించుకున్న కాగితాలు తెమ్మని అడిగారు. మా ఊరు చాలా దూరం అప్పటికప్పుడు తేలేమన్నా వినిపించుకోలేదు’’ అని బాధిత మహిళ తల్లి మీడియాతో చెప్పారు. మూత్రవిసర్జనకు వెళ్లి.. : కాగా, డ్రైనేజీలో ప్రసవం ఘటనపై ఉన్నతాధికారులు భిన్నంగా స్పందించారు. వారసలు గైనకాలజీ వార్డుకే రాలేదని, మూత్రవిసర్జన కోసం వెళ్లి డ్రైనేజీలో బిడ్డను కన్నారని కొరాట్పూర్ జిల్లా వైద్య అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రసవం తర్వాత మహిళను ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న సిబ్బంది -
గర్భిణీని హత్య చేసి పూడ్చిపెట్టిన ప్రియుడు
-
డాక్టరంటే అతడే..!
సాక్షి, మల్కన్గిరి (ఒడిశా): మానవత్వానికి పరీక్షగా ఒడిశా మారింది. మంచాల మీద గర్భవతులును, భుజాల మీద మృతదేహాలను మోసుకెళ్లడం ఈ ప్రాంతంలో అత్యంత సహజంగా మారింది. ఇక్కడి గిరిపుత్రులకు రహదారి వంటి కనీస మౌలిక సౌకర్యాలుకూడా అందుబాటులేవు అని చెప్పే మరో ఘటన ఇది. మల్కన్గిరి జిల్లాలోని సరిగెట గ్రామం. విద్య, వైద్యం, రహదారి వంటి కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం. ఆ గ్రమంలో ఒక గర్భిణికి నెలలు పూర్తయ్యాయి. సరిగెట గ్రామంలో వైద్య విధులు నిర్వహించేందుకు కొత్తగా చేరనిన వైద్యుడు ఆమెకు సుఖ ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో.. తల్లీబిడ్డ ఇద్దరికి ప్రమాదం అని తెలిసి సమీపంలో ఉన్న పెద్దాసుపత్రికి ఆమెను తరిలించాని సూచించారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో.. నెలలు నిండిన గర్భిణిని యువకుడైన వైద్యుడు, ఆమె భర్త, మంచంతో సహా 8 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రయాణంలో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగింది. అయితే ఆలస్యం చేయకుండా ఆమెను ఆసుపత్రికి తరిలించడంతో.. ముగ్గురు వైద్యులు కలిసి ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
‘ఆరోగ్యలక్ష్మి’ అంతంతే!
భారీగా తగ్గిన లబ్ధిదారులు ఆగస్టులో పౌష్టికాహారం తీసుకుంది 20 శాతమే గర్భిణులు 20.17 శాతం, పాలిచ్చే తల్లులు 18.69 శాతం హాజరు గాడి తప్పిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తలపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం లబ్ధిదారులకు రుచించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహకుల ఉదాసీనత... దానికి తోడు స్పాట్ ఫీడింగ్ నిబంధన విధించడంతో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత నెలలో ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారాన్ని తీసుకున్న లబ్ధిదారులు కేవలం 20 శాతమే. నెలవారీ నివేదికల్లో లబ్ధిదారుల సంఖ్య పతనమవుతుండటం ఆధికారవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీలు, 3,989 మినీ అంగన్వాడీలున్నాయి. వీటి పరిధిలో 5,12,374 మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు నమోదయ్యారు. వీరికి ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు తదితరాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలి. వారంలో ఒక రోజు 200 మిల్లీలీటర్ల పెరుగు, కోడిగుడ్డు కూరని పంపిణీ చేయాలి. ప్రతి రోజూ లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి హాజరై పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. 20 శాతం దాటని పంపిణీ.. ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. స్పాట్ఫీడింగ్ (అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరి హాజరు) నిబంధనను ఆ శాఖ కట్టుదిట్టం చేసింది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ గాడితప్పింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకు కేంద్రాలను తెరవడం లేదు. మరికొన్ని కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల హాజరుపై తీవ్ర ప్రభావంపడుతోంది. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆగస్టు గణాంకాలను పరిశీలిస్తే... రాష్ట్రవ్యాప్తంగా 2,88,634 మంది గర్భిణులకుగాను కేవలం 58,229 మంది హాజరయ్యారు. 2,23,700 మంది పాలిచ్చే తల్లులకుగాను కేవలం 41,815 మంది హాజరయ్యారు. గర్భిణులు 20.17 శాతం, పాలిచ్చే తల్లులు 18.69 శాతం హాజరయ్యారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గుదలపై కారణాలను అధికారవర్గాలు అన్వేశిస్తున్నాయి. -
ఆమె వేదన.. అరణ్య రోదన.!
► మంటగలిసిన మానవత్వం ► నిస్సహాయ స్థితిలో ప్రసవించిన అభాగ్యురాలు ► కులజాడ్యంతో సహాయానికి రాని గ్రామస్తులు, బంధువులు సాటి మనుషులు, బంధువులే ఆమె పరిస్థితిని చూసి చలించకపోతే.. ఆ అభాగ్యురాలి ఆవేదన ఏ దూరతీరాలకు చేరగలదు. ఆ దీనురాలు ఏ భగవంతునికి నివేదించు కోగలదు. మానవత్వం మంట గలిసిన సమాజంలో కన్నీటి బాధను పంటి బిగువున భరించడం తప్ప ఆమె సమాజాన్ని ఏమని ప్రశ్నించగలదు. ప్రసవ వేదన అనుభవిస్తున్న ఓ యువతి ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ సాయమందించక పోవడంతో చివరికి ఆమె ఏం చేసిందంటే.. జయపురం, మల్కన్గిరి(ఒడిశా): మానవులందరి జననం ఒకటే అయితే.. కొంతమంది తమ స్వార్థం కోసం మతాలు, కులాలు, జాతులు, సృష్టించి మానవజాతిని ముక్కముక్కలుగా విభజించారు. ఆ జాడ్యం నేడు సమాజంలో మానవత్వాన్ని మంటగలుపుతోంది. అటువంటి సంఘటనే సోమవారం సాయంత్రం కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగింది. రెండు కులాలకు చెందిన ప్రేమికుల జంటను గ్రామస్తులు ఊరినుంచి వెలివేసి సహాయ నిరాకరణ అమలు చేయడంతో నిండు గర్భిణి అయిన యువతి పురిటినొప్పులకు ఓర్వలేక సహాయం కోసం హృదయవిదారకంగా ఏడ్చినా ఆమె గోడును గ్రామస్తులు, బంధువులు పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదాన్ని విన్నప్పటికీ తమను కూడా వెలివేస్తారన్న భయంతో సాయం చేసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఆ యువతి ప్రసవనొప్పులు తాళలేక సమీప అడవిలోకి పరుగులు తీసింది. ఎట్టకేలకు ఆ అడవిలోనే కవల పిల్లలను ప్రసవించింది. ఆఖరికి బిడ్డలు బొడ్డులు కోసేందుకు కూడా ఎవరూ దరి చేరలేదు. ఈ అమానుష సంఘటన అవిభక్త కొరాపుట్ జిల్లా మత్తిలి సమితి దొలపొడిగుడ పంచాయతీ కెందుగుడ గ్రామంలో జరిగింది. ఊరికి దూరంగా బతికిన ప్రేమికులు గ్రామానికి చెందిన త్రిలోచన హరిజన్ అనే యువకుడు రెండేళ్ల కిందట మత్తిలిలోని కమరవీధికి చెందిన రతన్కమార్ కుమార్తె గౌరీకమార్ (19)తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరివీ వేర్వేరు కులాలు కావడం వల్ల గౌరి తమ కులం కన్నా తక్కువ కులానికి చెందినదని భావించిన త్రిలోచన హరిజన్ తల్లిదండ్రులు, ఆ గ్రామస్తులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకాకుండా ఆ ప్రేమికుల జంటను ఊరినుంచి వెలివేశారు. వారితో కలవకూడదని ఎటువంటి సహాయం చేయకూడదని ఆలా చేసిన వారికి కూడా అదేగతి పడుతుందని గ్రామ ప్రజలను హెచ్చరించారు. కులం కన్నా తమ ప్రేమ గొప్పదని..ప్రేమను బతికించుకుని కలిసి జీవిస్తామన్న పట్టుదలతో ఆ ప్రేమ జంట ఊరికి దూరంగా ఒక పాక వేసుకుని అందులో కాపురం పెట్టారు. కాలం గడుస్తోంది. గౌరి గర్భం దాల్చింది. గర్భిణిగా ఆమె ఎటువంటి సౌకర్యాలకు నోచుకోలేదు. బిడ్డను కంటానన్న తృప్తి, పట్టుదల ఆమెలో ఉండేది. నవమాసాలు నిండాయి. సోమవారం మధ్యాహ్నం ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తన ప్రసవానికి సమయం అయిందని ఆమె గ్రహించింది.అటువంటి సమయంలో ఎవరో ఒకరైనా తనకు సహాయం ఉండాలన్న ఆశ ఆమెలో పొడసూపింది. కానీ వెలికి గురైన ఆమెకు ఎవరు సహకరిస్తారు? సోమవారం సాయంత్రం ఆమెకు నొప్పులు ఎక్కవయ్యాయి. ఆ సమయంలో భర్త ఇంటిలో లేడు, కూలి పనులకు బయటకు వెళ్లాడు. సహాయం అర్ధించేందుకు రోడ్డుపైకి వచ్చి తనకు సహాయం చేయండని కనిపించిన కెందుగుడ గ్రామ ప్రజలను వేడుకుంది. బతిమాలింది. విలపించింది. అర్ధించింది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆమె పడుతున్న ప్రసవ వేదన చూసిన కొంతమందికి సహాయం చేయాలని ఉన్నా వెలివేత భయం వారి మానవత్వాన్ని మంట గలిపింది. చివరికి ఎవరి సహాయం అందకపోవడంతో ఆమె సమీప అడవిలోకి వెళ్లింది. అప్పటికే నొప్పులు తీవ్రమయ్యాయి ఇక భరించలేని ఆమె అడవిలో ఓ వస్త్రం పరిచి దానిపై పడిపోయి అతికష్టంపై ప్రసవించింది. ఆస్పత్రిలో కోలుకుంటున్న తల్లీబిడ్డలు అంత బాధలోనూ ఆమె ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే బిడ్డల బొడ్డు కోసేందుకు ఎవరూ లేరు. అలా ఆమె మూడు గంటల పాçటు అడవిలో పసికందులతో నిస్సహాయ స్థితిలో పడి ఉంది. ఈ విషయం తెలిసిన కెందుగుడ గ్రామంలోని ఆశావర్కర్ విజయ లక్ష్మి త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పిల్లల బొడ్డు కోసి అంబులెన్స్కు ఫోన్ చేయగా 108 అంబులెన్స్ వచ్చి గౌరిని, బిడ్డలను మత్తిలి ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో తల్లీబిడ్డలు కోలుకుంటున్నారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఆ‘పరేషన్.. జీజీహెచ్’
సాక్షి ఎఫెక్ట్... సర్వజనాస్పత్రి ప్రక్షాళనకు శ్రీకారం గర్భిణుల కోసం అదనపు గదులు నూతన భవనంలోకి పీడియాట్రిక్ వార్డు గైనిక్, పీడియాట్రిక్ వైద్యులతో సమీక్ష మాతాశిశుమరణాలపై అడిషనల్ డీఎంహెచ్ఓ ఆరా అనంతపురం మెడికల్: ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు.. ప్రసవం తర్వాత బాలింతలు పడుతున్న కష్టాలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు చోటు చేసుకోవడం.. ఆస్పత్రి ఆవరణల్లోనే ప్రసవాలు జరుగుతుండడాన్ని సీరియస్గా పరిగణించింది. ఆపరేషన్ జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజనాస్పత్రి) చేపట్టి సర్వజనాస్పత్రి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్దాస్పత్రిని నమ్ముకుని వచ్చిన వారికి ‘నిర్లక్ష్య వైద్యం’ అందుతుండడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ వీరపాండియన్ అసలేం జరుగుతోందంటూ అధికారులను వివరణ కోరారు. తాజాగా డెలి‘వర్రీ’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం రంగంలోకి దిగారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ను అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే గర్భిణులకు ప్రసవాలు చేసే అవకాశం ఉన్నా అందరూ సర్వజనాస్పత్రికే వస్తున్నారని డాక్టర్ జగన్నాథ్ అన్నారు. దీన్ని కొంత వరకైనా నివారించగలిగితే పరిస్థితి ఇంతలా ఉండబోదని తెలిపారు. అసలే ఇక్కడ పడకల సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్సీ స్థాయిలో వైద్య సేవల్ని బలోపేతం చేయాలని కోరారు. శిశువు మృతి, ఆరుబయట ప్రసవంపై ఆరా సర్వజనాస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున పెద్దవడుగూరుకు చెందిన అమీన్ ఆరుబయట ప్రసవం కావడం, ఉదయాన్నే కర్నూలు జిల్లాకు చెందిన జయలక్ష్మి ప్రసవించిన అనంతరం బిడ్డను కోల్పోయిన ఘటనలపై అధికారులు ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓ విజయమ్మ లేబర్, గైనిక్ వార్డులకు వెళ్లి రెండు గంటలకు పైగా వైద్యులు, సిబ్బందితో చర్చించారు. ఎందుకింత నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ప్రత్యేకంగా గైనిక్ విభాగం హెచ్ఓడీ షంషాద్బేగం, గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చే కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నూతన భవనంలోకి పీడియాట్రిక్ వార్డు సర్వజనాస్పత్రిలో కొత్తగా నిర్మించిన భవనంలోకి చిన్న పిల్లల విభాగాన్ని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పీడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరి, వైద్యులు రాంకిశోర్, ప్రవీణ్దీన్కుమార్, సుల్తానాతో సూపరింటెండెంట్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పీడియాట్రిక్ వార్డును గర్భిణులు, బాలింతల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. కొత్త భవనంలోకి పీడియాట్రిక్ వార్డు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన భవనం మొత్తం పీడియాట్రిక్కే కేటాయించాలని వారు తెలుపగా సూపరింటెండెంట్ ఒప్పుకోలేదు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల సమస్య ఉందని, ప్రస్తుతానికి 50 పడకలు ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. -
ఆస్పత్రిలో ‘అమ్మల’ వేదన..!
- పురిటినొప్పులతో వస్తే.. కాదు పొమ్మన్నారు.. - సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సిబ్బంది తీరు సిరిసిల్ల టౌన్: ఇద్దరు నిండు గర్భిణులు ప్రసవ వేదనతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు.. బెడ్స్ ఖాళీలేవని, అసలు గైనకాలజిస్టే అందుబాటులో లేరని వైద్యసిబ్బంది చెప్పి వారిని బయటకు పంపించారు.. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్కారు ఏరియా ఆస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గంభీరావుపేటకి చెందిన గంధాడపు మానస, తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గాదగోని నవ్య పురిటినొప్పులతో బాధపడుతూ శనివారం రాత్రి 10 గంటలకు స్థానిక ఏరియా ఆస్పత్రికి వచ్చారు. రాత్రి 12 గంటల వరకూ వైద్యసేవలు అందించలేదు. బాధితుల బంధువులు ఇదేమిటని వైద్యసిబ్బందిని ప్రశ్నించగా.. ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేవని, ఎటైనా వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం మీడియాకు తెలియడంతో సూపరింటెండెంట్ తిరుపతి ఆస్పత్రికి చేరుకుని బాధితులను సముదాయించారు. దవాఖానాలో డెలివరీల సంఖ్య పెరిగి మంచాలు ఖాళీలేవని, గైనకాలజిస్టు కూడా ఒక్కరే ఉన్నారని, ఆమె సైతం ప్రస్తుతం విధుల్లో లేరన్నారు. చేసేదిలేక గర్భిణులను స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం రాలేనన్న వైద్యురాలు ఆస్పత్రి ఎదుట నిండు చూలాలి విలవిల పర్వతగిరి(వర్ధన్నపేట): ఓ పక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు చేస్తున్న సూచనలు కొందరు వైద్యులకు పట్టడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనను దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పర్వతగిరికి చెందిన మిడుతూరి స్వప్న నిండు గర్భవతి. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు రాగా బంధువులు పర్వతగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో వైద్యురాలు ప్రశాంతి లేకపోవడంతో సిబ్బంది ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు. అయితే, ఆదివారం సెలవు కావడంతో తనకు రావడం కుదరదని వైద్యురాలు స్పష్టం చేసింది. దీంతో గర్భిణిని 108 వాహనంలో స్వప్నను ప్రసవం కోసం వరంగల్లోని సీకేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. -
గర్భిణీలకు సీఎం బంపర్ ఆఫర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింగనిర్ధారణ పరిక్షలు జరిపే కేంద్రాల సమాచారం ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతిని ప్రకటించారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి కేంద్రాలను పట్టి ఇచ్చిన గర్భిణులకు రూ. లక్ష నగదు నజరానా ప్రకటించారు. రాష్ట్రంలో ఆందోళన రేపుతున్న సెక్స్ రేషియో నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ద్వివేది నిన్న (జూన్ 23) అన్ని జిల్లా అధికారులకు ఒక లేఖ రాశారు. జూలై1 నుంచి రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ సహాయంతో ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.2లక్షల అవార్డును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కేంద్రాల గురించి సమాచారం అందించినవారికి రూ.60వేలు, నిఘా ఆపరేషన్ ద్వారా సహకరించిన గర్భిణీకి రూ. లక్ష ఇస్తారు. దీంతోపాటుగా ఈ ఆపరేషన్లో ప్రెగ్నెంట్ మహిళకు తోడుగా వెళ్లిన వ్యక్తికి (భర్త, లేదా ఇతర కుటుంబ సభ్యులు) మరో రూ.40వేలు బహుమతిగా అందించనున్నారు. అయితే వీరు ఈ కేసు విచారణ సమయంలో స్వతంత్ర సాక్షిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరో కీలక అంశం ఏమిటంటే ఈ నజరానాను మూడు విడతలుగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ విజయవంతం చేసినపుడు మొదటి విడత, కోర్టులో సాక్ష్యం చెప్పినపుడు రెండవ విడత, శిక్ష పడినపుడు మూడవ విడతగా అందజేస్తారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో 1,000 బాలురు ఉండగా బాలికలసంఖ్య 902కి పడిపోయిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. 2001 లో 916గా నమోదైందనీ, ఈ తగ్గుదల కొనసాగుతోందన్నారు. -
కేసీఆర్ కిట్లోనే ‘అమ్మ ఒడి’
ఈ పథకం కిందే గర్భిణులకు 12 వేలు,15 రకాల వస్తువులు ► కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేలు కలిపి అందజేత ► నగదు బదిలీ పద్ధతిలో నాలుగు దశల్లో లబ్ధిదారు ఖాతాకు సొమ్ము ► ఇద్దరు పిల్లలకే పథకం వర్తింపు, మూడో ప్రసవానికి నో ► మార్గదర్శకాలు విడుదల ► కరీంనగర్ లేదా హైదరాబాద్లో 25న ప్రారంభించనున్న సీఎం? సాక్షి, హైదరాబాద్: ఇక అమ్మ ఒడి పేరుతో పథకం ఉండదు. దాని బదులుగా కేసీఆర్ కిట్ పథకం కిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇవ్వనున్న రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేలు కలిపి కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణులకు అందజేస్తారు. దీనికి సంబం ధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మ ఒడి పథకం కింద గర్భిణులకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ పథకం కింద బాలింతలు, శిశువులకు అవసరమైన 15 రకాల వస్తువులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రెండు పథకాలకు బదులు ఒకే పథకం కింద వీటిని అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆ మేరకు కేసీఆర్ కిట్ పథకం కిందే ఈ రెండింటినీ అమలుచేస్తారు. నాలుగు దశల్లో నేరుగా ఖాతాకు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం, అనవసర సిజేరియన్ ఆపరేషన్లు జరగకుండా చేయడం, తల్లీబిడ్డల క్షేమం తదితర లక్ష్యాలతో ప్రభుత్వం కేసీఆర్ కిట్ను ప్రారంభించిన సం గతి తెలిసిందే. ఇందులో భాగంగా గర్భిణులకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే అదనంగా రూ.వెయ్యి ఇస్తారు. ఆ సొమ్మును నాలుగు విడతల్లో గర్భిణుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నప్పుడు మొదటి దశలో రూ.3 వేలు ఇస్తారు. మెడికల్ ఆఫీసర్ ద్వారా కనీసం రెం డు పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే మొదటి సొమ్ము అందజేస్తారు. రెండో దశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న సమయంలో రూ.4 వేలు ఇస్తారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అప్పుడే తల్లీబిడ్డలకు 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ను అందజేస్తారు. ఇక మూడో దశలో శిశువుకు పెంటావాలెంట్, ఓపీ వీ వంటి డోసులు అందజేసినప్పుడు రూ.2 వేలు ఇస్తారు. నాలుగో దశలో బిడ్డకు 9 నెలలు వచ్చినప్పుడు మీజిల్స్ వ్యాక్సిన్ వేసే సమయంలో రూ.3 వేలు ఇస్తారు. ఇద్దరు పిల్లలకే.. గర్భిణుల వివరాలను సేకరించే బాధ్యత పూర్తిగా ఏఎన్ఎంలపైనే ప్రభుత్వం ఉంచింది. గర్భి ణులు తప్పనిసరిగా ఆధార్ సహా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఇద్దరు పిల్లలు పుట్టే వరకే ఈ ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తారు. మూడో బిడ్డకు వర్తించదు. ఒకవేళ కవలలైతే ఒక్కసారికే ఆర్థిక సాయం చేస్తారు. రెండో కాన్పుకు డబ్బు ఇవ్వరు. కవలలిద్దరికీ రెండు కేసీఆర్ కిట్లు అందజేస్తారు. తల్లీ బిడ్డలు చనిపోయినా కుటుంబ సభ్యులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఈనెల 25న హైదరాబాద్ లేదా కరీంనగర్లలో ఎక్కడో ఒక చోట ప్రారంభించే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
‘అమ్మ’కు ఆర్థిక సాయం
-
‘అమ్మ’కు ఆర్థిక సాయం
ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్ ఆమోదం - తొలికాన్పుకు ఆరువేలు - విద్యుత్ రంగానికి ఇంధన సరఫరాపై కొత్త విధానం - 10 దేశీయ అణువిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా న్యూఢిల్లీ: గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. భేటీ నిర్ణయాలను విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘పాలిచ్చే తల్లికి (మొదటి కాన్పు) రూ. 6వేలు అందిస్తాం. ఇందులో రూ.5వేలను మూడు విడతల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ నేరుగా తల్లి అకౌంట్లోకి వేస్తుంది’అని మంత్రి వెల్లడించారు. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్–బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు. మిగిలిన ప్రసూతి లాభాలు ప్రస్తుతమున్నట్లుగానే వర్తిస్తాయి. మొత్తంగా కలుపుకుని తల్లుల ఖాతాలో రూ.6వేలు చేరతాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. అయితే రెండో కాన్పుకు ఈ ప్రసూతి ప్రయోజన ప్రథకాన్ని వర్తింపజేయకపోవటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 7వేల మెగావాట్ల అణువిద్యుత్ ప్లాంట్లు దేశీయ అణువిద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు స్వదేశీ తయారీ 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ‘ఒకసారి వీటి నిర్మాణం పూర్తయితే.. ఒక్కోటి 700 మెగావాట్ల చొప్పున మొత్తం 7వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది’ అని పీయుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021–22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని గోయల్ తెలిపారు. విద్యుత్ రంగానికి ఇంధన సరఫరాపై.. విద్యుదుత్పత్తి రంగానికి ఇంధన సరఫరా చేసే కొత్త విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. వేలం ద్వారా లేదా పోటీ బిడ్డింగ్ టారిఫ్ల ఒప్పందాల ద్వారానైనా బొగ్గు సరఫరా జరగాలని నిర్ణయించింది. ‘దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో ఉండే పరిస్థితి నుంచి.. అవసరానికి పరిపోయేంతగా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త విధానం బొగ్గు కేటాయింపుపై పాత విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి.. పారదర్శకంగా సరికొత్తగా కేటాయింపులు జరిపేందుకు ఉపయోగపడుతుంది. సహజవనరుల సరైన వినియోగానికి కూడా మార్గం సుగమం అవుతుంది’ అని బొగ్గు శాఖ తెలిపింది. లెటర్ ఆఫ్ అస్యూరెన్స్తోపాటుగా నూతన ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ)కు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. చారిత్రక కట్టడాలపై... చారిత్రక కట్టడాల సమీపంలో నిర్మాణాలకు సంబంధించిన విధివిధానాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. చారిత్రక ప్రాముఖ్యమున్న కట్టడాలకు వందమీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు జరపరాదంది. అయితే కేవలం గతంలో ఉన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయించుకోవచ్చని సూచిం చింది. ఈ కట్టడాల రక్షణకు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని తెలిపింది. మూడురోజుల్లో ఖాళీ చేయాల్సిందే! చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకని కేంద్ర ప్రభుత్వ నివాస గృహాల్లో ఎంపీలు, అధికారులు ఎక్కువకాలం నివసించలేరని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల (అనధికారంగా ఉన్నవారిని ఖాళీ చేయటం) చట్టం, 1971కి చేసిన సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీకాలం ముగిసిన మూడు రోజుల్లో వారి నివాసాలను ఖాళీ చేయించేలా ఎస్టేట్ అధికారులకు మరిన్ని అధికారాలిచ్చింది. ఖాళీ చేయని పక్షంలో పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారాలు కల్పించారు. -
గర్భిణీలను కాపాడే ‘గాజులు’
న్యూఢిల్లీ: గర్భవతులైన స్త్రీలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి కంటికి రెప్పలా కాపాడుకునే సాంకేతిక గాజులు వస్తున్నాయి. ఇవి కూడా సాధారణ గాజుల్లాగా రంగు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్పోజర్ లిమిటర్ (కోయల్), అంటే వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సహకరిస్తుందికనుక వీటిని కోయల్ గాజులని వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక ప్లాస్టిక్తోని తయారు చేసిన ఈ గాజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకు నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని గుర్తించే అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి. వీటిని ధరించిన గర్భిణీ స్త్రీలను తగిన విధంగా అవి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాయి. మోతాదుకు మించిన కార్బన్ మోనాక్సైడ్ గుర్తించిన వెంటనే ఈ గాజులు ఎర్ర రంగులో వెలుగుతూ బీప్ శబ్ధాన్ని విడుదల చేస్తాయి. ఆ తర్వాత బయటకు పొమ్మని, సురక్షిత ప్రాంతానికి వెళ్లుమంటూ స్థానిక భాషలో హెచ్చరికలు జారీ చేస్తాయి. అంతేకాకుండా రెండు నెలల గర్భం అప్పటి నుంచి ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ వారంలో ఏ ఆహారం తీసుకోవాలో, ఏ నెలలో డాక్టర్ వద్దకు వెళ్లాలో, ప్రసవం కోసం ఎప్పుడూ ఆస్పత్రులో చేరాలో కూడా మాటల రూపంలో ఈ గాజులు సందేశాలు ఇస్తుంటాయి. గ్రామీన్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ (జీఐఎస్బీ) కంపెనీ బంగ్లాదేశ్ స్థానిక భాషను ఉపయోగించి ఈ గాజులను తయారు చేసింది. కార్బన్ మోనాక్సైడ్కు దూరంగా ఉండడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఏటా 830 మంది, సంవత్సరానికి దాదాపు మూడు లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఇంటెల్ కార్పొరేషన్, గ్రామీన్ ట్రస్ట్లో కలసి ఈ సాంకేతిక గాజులను అభివృద్ధి చేసింది. ఇప్పటికే బంగ్లాదేశ్తోపాటు భారత్లో కూడా ఐదువేల మంది గర్భిణీ స్త్రీలకు ఈ గాజులను పంపిణీచేసి ప్రయోగాత్మకంగా పనితీరును పరిశీలించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. పనితీరు బాగున్నట్లు ఫలితాలు వచ్చాయని, మరో రెండు నెలల్లో ఈ రెండు దేశాల్లో వీటి విక్రయాలు చేపడతామని, ఆ తర్వాత వివిధ దేశాల భాషల్లోకి హెచ్చరికలు, సందేశాలను తర్జుమా చేశాక ఆయా దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్లో ఈ గాజుల విలువ సుమారు 800 రూపాయలు ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. -
‘అమ్మ ఒడి’ ఏర్పాట్లు పూర్తి చేయండి
లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. జూన్ 2 కల్లా గర్భిణిల పూర్తి సమాచారం సేకరణ, కంప్యూటరీకరణ కచ్చితంగా జరగా లని సూచించారు. కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జరుగుతున్న హెల్త్ ఎడ్యుకేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం సందర్శించారు. ఆయన మా ట్లాడుతూ... అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న గర్భిణిల వివరాలను నమోదు చేయాలని, చిన్న పొరపాట్లకు కూడా తావీ యవద్దని సూచించారు. పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరులో కేసీఆర్ బేబీ కిట్లు కేసీఆర్ బేబీ కిట్ను ఈ నెలాఖ రులో ప్రవేశపెడుతున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రెడ్హిల్స్ లోని నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పెరగాలనే లక్ష్యంతో కిట్ను అందజేస్తున్నట్లు వివరించారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం ఆడ శిశువుకు రూ.13 వేలు, మగ శిశువుకు రూ.12 వేల చొప్పున పలు విడతలుగా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు నేరుగా బాలింత ఖాతాలోకి చేరేలా సాఫ్ట్వేర్ను రూపొందిం చామని చెప్పారు. హైరిస్క్ కేసులే మరణాలకు దారితీస్తున్నాయని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లక్ష్మారెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే మరణాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ అన్నారు. -
జూన్ నుంచి గర్భిణులకు రూ.12 వేలు
వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గర్భిణీలకు ప్రోత్సాహకపు సొమ్మును వచ్చే నెల నుంచి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించిం ది. బాలింతలు, శిశువుల కోసం కేసీఆర్ కిట్లను కూడా అదే నెల నుంచి అందజేయాల ని యోచిస్తోంది. ఈ ప్రోత్సాహక నగదు దుర్వినియోగం కాకుండా బ్యాంకు ఖాతాలను గర్భిణుల పేరున తీస్తారు. మూడు విడతల్లో సొమ్ము జమ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరగడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. గర్భిణులు ఎందరు న్నారు? ఇది తొలి కాన్పా.. కాదా తదితర వివరాలను సేకరిస్తారు. పీహెచ్సీ, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా గర్భిణుల సమాచార సేకరణ మొత్తం నమోదు చేస్తారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం సమాచారాన్ని సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గర్భిణులకు రూ.12 వేలు.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో పరీక్షలు చేసే సమయంలో రూ.4వేలు, ప్రసవం సమయంలో రూ.4 వేలు, అనంతరం బిడ్డ టీకాలు వగైరా వాటి కోసం రూ.4వేల చొప్పున ఇస్తారు. ఆడ బిడ్డ పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద బాలింత, పుట్టిన శిశువుకు కేసీఆర్ కిట్ అందిజేస్తారు. ఏటా 6.30 లక్షల ప్రసవాలు.. రాష్ట్రంలో ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని అంచనా. 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించుకుంటున్నారు. మిగిలిన వారికి ఇళ్ల వద్ద ఏఎన్ఎంలు, ఇతరుల సమక్షంలో కాన్పులు జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లోని కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాతిపాదికన తాజా సమాచారాన్ని సేకరించి గర్భిణులను గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు. ప్రోత్సాహకపు సొమ్ము పథకాన్ని, కేసీఆర్ కిట్లను వచ్చే నెలలో ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
మరో పరువు హత్య
♦ గర్భిణిని కడతేర్చారు ♦ అరియలూరులో ఘటన సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రియుడితో కలిసి ఉడాయించి న కూతుర్ని వెతికి పట్టి మరీ తల్లిదండ్రులు హతమార్చారు. అరియలూరు జిల్లా సెందురైలో ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కులాం తర వివాహాలు, ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా కోర్టు పలు సూచనల్ని ఇవ్వడమే కాకుండా, ప్రేమికులకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి భద్రత కల్పించే ఆదేశాలు జారీ చేసింది. అయినా, పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. మరో పరువు హత్య : అరియలూరు జిల్లా సెందురై సమీపంలోని పొన్ పరప్పి గ్రామానికి చెందిన తంగరాజ్, భవానీల కుమార్తె షర్మిల. సమీపంలోని మరో గ్రామానికి చెందిన కలై రాజన్ను ప్రేమించింది. వీరిద్దరూ 2008లో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. అయితే, షర్మిల కుటుంబీకులు ఆ ఇద్దర్ని వెతికి పట్టి మరి విడదీశారు. 2009లో తమ బంధువు అన్భుమణికి ఇచ్చి బలవంతంగా షర్మిలకు వివాహం చేశారు. అన్బుమణితో సాగిన బలవంతపు కాపురంలో ఓ ఆడబిడ్డకు షర్మిల జన్మను ఇచ్చింది. అయితే, తనకు అన్బుమణితో జీవితం ఇష్టం లేదని తేల్చి 2013లో ఉడాయించింది. ఆ జిల్లాను వదలి పెట్టి ఎవరికీ తెలియని ఊర్లో ప్రియుడు కలై రాజన్తో కలిసి సహజీవనం సాగిస్తూ, చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ జీవన పయనం సాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో గర్బం దాల్చిన షర్మిల ఫిబ్రవరిలో కలైరాజన్ను వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుమార్తె ఎక్కడున్నదో అన్న విషయాన్ని కుటుంబీకులు పసిగట్టారు. గుట్టు చప్పుడు కాకుండా హత్య ఏడు నెలల గర్భిణిగా ఉన్న తమ కుమార్తెను ఈ సారి నమ్మ బలికి మరీ స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామ పెద్దల సమక్షంలో కలైరాజన్ను అల్లుడిగా స్వీకరిస్తామన్న ఆశ చూపించారు. తల్లిదండ్రుల వెంట వెళ్లిన షర్మిల ఆదివారం రాత్రి విగత జీవిగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. అయితే, పోలీసులు విచారణలో గుట్టు రట్టు అయింది. పరువు హత్య జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. సెందురైలోని బం«ధువుల ఇంటికి షర్మిలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు గర్భం తొలగించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. లేదంటే కలైరాజన్నూ హతమారుస్తామని బెదిరించారు. తమ మాట వినని ఆమెను కొట్టి చంపి, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని బయట పడింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పరువు హత్య గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చినా, ఆ గ్రామంలో సాగుతున్న అగ్రవర్ణాల ఆధిపత్యం వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యమే అభిమతం
♦ మహిళా అధికారులతో ప్రత్యేక కమిటీ ♦ గర్భిణుల ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్స్పై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: గర్భిణులకు ప్రసవ సమయంలో ప్రభు త్వం అందించే ఆర్థిక సాయం, నవజాత శిశువులకు బçహూక రించే కేసీఆర్ కిట్స్ ద్వారా తల్లీబిడ్డలకు ఆరోగ్య అలవాట్లను అందించాలన్నదే తమ అభిమతమని సీఎం కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతా నికి పడిపోవాలని, భావితరం ఆరోగ్యంగా ఎదగాలని ఆకాం క్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకిచ్చే రూ. 12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్ పథకాల అమలుపై గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీ క్షించారు. ‘కేసీఆర్ కిట్’ ద్వారా అందించే వస్తువులను పరిశీ లించారు. మస్కిటో మెష్, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే కిట్స్ సరఫరా కు టెండర్లు పిలిచామని, మే నుంచి కిట్స్ అందిస్తామని ఆరో గ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చెప్పారు. రూ.12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి కార్యక్ర మాల అమలుకు కార్యాచరణ రూపొందించేందుకు అధికారు లతో ప్రత్యేక కమిటీని నియమించారు. దీనిలో శాంతి కుమారి, వాకాటి కరుణ, స్మితా సబర్వాల్, యోగితా రాణా, ప్రియాంక వర్గీస్ సభ్యులుగా ఉండనున్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు... ‘‘నెలలు నిండాక కూడా పేద గర్భిణులు కుటుంబం గడవ డానికి పనులు చేస్తూనే ఉన్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తినటంతోపాటు పుట్టే పిల్లలపైనా ప్రభావం పడుతుంది. అందుకే గర్భిణులు నెలలు నిండినప్పటి నుంచి శిశువులకు జన్మనిచ్చి వారికి 2, 3 నెలల వయసు వచ్చే వరకు కూలి పనులకు వెళ్లకుండా కుటుంబ అవసరాలు తీరాలనే ఉద్దేశం తో సాయం అందించాలని నిర్ణయించాం. ప్రభు త్వాస్ప త్రుల్లో కాన్పు అయిన పేద మహిళలందరికీ రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే మరో రూ. వెయ్యి అదనంగా ఇస్తాం. ఈ సాయం ఎన్ని విడతల్లో అందించాలి, గర్భిణులకు ఏ నెల నుంచి ఇవ్వాలనేది అధికారులు నిర్ణయిస్తారు. గర్భిణుల పేర్లను నమోదు చేయించాలి. వారికి అవసరమైన మందులు అందించాలి. గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలున్నారు. ఈ పనులకు ఎవరిని ఉపయోగించు కుంటే బాగుంటుందో నిర్ణయించాలి. శిశువులకు కేసీఆర్ కిట్స్తో ఆరోగ్యవంతమైన సంరక్షణ ప్రారంభమవుతుంది. ప్రసవ మరణాలు తగ్గుతాయి. తల్లీబిడ్డలు క్రమం తప్పకుం డా ఆస్పత్రులకు వస్తే టీకాలు, మందులు సకాలంలో అం దుతాయి’’ అని సీఎం చెప్పారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి భృతి అందించాలని నిర్ణయించినందున.. ఒంటరి మహిళలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయంతో వారి పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి కూడా ఊరటగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
కడుపు‘కోత’
రాష్ట్రంలో అడ్డగోలుగా కాన్పుల దందా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాన్పుల దందా పరాకాష్టకు చేరుతోంది. కాసులకు కక్కుర్తిపడి ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేకున్నా గర్భిణులకు ఎడాపెడా సిజేరియన్ చేసేస్తున్నాయి. ఈ ఆసుపత్రుల దోపిడీ ప్రపంచ స్థాయికి చేరింది. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్న ఆందోళనకర ప్రాంతంగా తెలంగాణ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ రికార్డుల్లోకెక్కింది. బ్రెజిల్లో 82 నుంచి 85 శాతం సిజేరియన్ కాన్పులు జరుగుతున్నాయి. మనదేశంలో సగటున 15.4 శాతం శస్త్ర చికిత్స ప్రసవాలు జరుగుతుండగా... తెలంగాణలో మాత్రం అత్యధికంగా 58 శాతం సిజేరియన్ కాన్పులు జరుగుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 40.1 శాతంతో రెండోస్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ శాతం 10–15 మధ్య ఉండాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వంద మంది గర్భిణుల్లో 74 మందికి ఆపరేషన్లు చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే గర్భిణుల్లో 40 శాతం మందికి ఆపరేషన్లు జరుగుతుండగా.. 60 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతుండటం గమనార్హం. యునిసెఫ్తోపాటు సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఇటీవల వివిధ రాష్ట్రాల్లో సంయుక్తంగా సర్వేలు నిర్వహించాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. వీటన్నింటా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నట్లు సెస్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏకంగా 80 శాతానికిపైగా సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయి. తర్వాత స్థానాల్లో నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలున్నాయి. అక్కర లేకున్నా... తొమ్మిది నెలలు నిండి, తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉన్న సమయంలోనే శస్త్ర చికిత్సలు అనివార్యమవుతాయి. రక్తపోటు ఎక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం, బిడ్డ అడ్డం తిరగడం, అధిక బరువుతో ఉండటం తదితర పది క్లిష్టమైన పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్స ప్రసవాలు చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ అక్కర్లేకుండానే శస్త్ర చికిత్సలు చేసే ధోరణి పెరుగుతోందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన సర్వేల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో సంక్లిష్ట ప్రసవాలుగా నమోదవుతున్న కేసులు కేవలం అయిదు శాతం లోపు ఉంటున్నాయి. కానీ అంతకు పది రెట్లు శస్త్ర చికిత్సలు జరుగుతుండటం విస్మయం కలిగిస్తోంది. కమీషన్ల వ్యాపారం గర్భిణులను తమ ఆసుపత్రికి పంపిస్తే కమీషన్లు ఇస్తామంటూ గ్రామస్థాయిలో ఉండే ఆశా వర్కర్లు మొదలు ఏఎన్ఎంలు, ఆర్ఎంపీ వైద్యులను సైతం ప్రైవేటు ఆసుపత్రులు ఈ దందాలో భాగస్వాములుగా చేశాయి. సాధారణ ప్రసవమే కష్టసాధ్యమని.. గంటల కొద్దీ పురిటి నొప్పుల కంటే సిజేరియన్ డెలివరీ సుఖవంతమైందని, క్షణాల్లో అయిపోతుందంటూ గర్భిణులకు సైతం చెప్పి డబ్బులు మూటగట్టుకుంటున్నారు. కొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించటం కంటే వారంతట వారే సిజేరియన్లు చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. తొలి ప్రసవానికి సిజేరియన్ చేస్తే.. ఆ తల్లి రెండో డెలివరీ సైతం విధిగా సిజేరియన్ చేయించుకోవాల్సి వస్తుంది. శస్త్ర చికిత్స ప్రసవాలతో భవిష్యత్తులో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, శస్త్రచికిత్స సమయంలో సరైన పద్ధతులు పాటించకపోతే ఇన్ఫెక్షన్లు సోకుతాయని, ఇతర అవయవాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రులు కోట్లు సంపాదించుకుంటుంటే ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారు. దృష్టి సారించిన సర్కారు సిజేరియన్ కాన్పులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కర లేకున్నా ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. మరోవైపు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నియమించిన యునిసెఫ్ ప్రతినిధులు ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో సిజేరియన్ కాన్పుల శాతాన్ని తగ్గించటంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలీవరిల శాతం పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో నెలరోజులుగా సాధారణ ప్రసవాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులపై గర్భిణులకు అవగాహన కల్పించే దిశగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు విధిగా తమ గ్రామాల్లోని గర్భిణులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి, జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెంట తీసుకెళ్లాలని మెదక్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాలో నెలరోజుల్లో సాధారణ ప్రసవాల శాతం 65 నుంచి 80 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏటా 1,500 కోట్ల దందా ప్రైవేటు ఆసుపత్రులు తమ ధనదాహంతో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్టు సర్వేల్లోని గణాంకాలు రూఢీ చేస్తున్నాయి. ఒక్కో ప్రసవానికి కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల బిల్లు రాబట్టుకునే దురాలోచనతోనే ప్రైవేటు ఆసుపత్రులు సిజేరియన్ డెలివరీలను వ్యాపారం గా మార్చేశాయి. కార్పొరేట్ ఆసుపత్రు ల్లో అయితే ఈ బిల్లు రూ.లక్ష దాటుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిలో 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటున్నారు. సిజేరియన్ కాన్పుల ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లపైనే దండుకుంటున్నాయని అంచనా. -
రూ.9,306 కోట్లు కేటాయించండి
సర్కార్కు ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో అందుకోసం 2017–18 రాష్ట్ర బడ్జెట్లో రూ.650 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపా దించింది. అమ్మఒడి పద్దు కింద కొత్తగా ఈ ప్రతిపాదన చేసింది. మొత్తంగా 2017–18 బడ్జెట్లో రూ.9,306 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించి నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 834 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.484 కోట్లు కేటాయించగా... వచ్చే బడ్జెట్లో రూ.740 కోట్లు కేటాయించాలని కోరారు. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి కొత్తగా రూ.834 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్లో నిర్మించబోయే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. -
ఒకే రోజు మూడు ప్రసవాలు
రూరల్ జిల్లాలో రికార్డు సృష్టించిన సంగెం పీహెచ్సీ జన్మించిన వారిలో ముగ్గురూ మగ శిశువులే! సంగెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వైద్యులు ప్రసవాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఒకేరోజు మూడు ప్రసవాలు జరగడం జిల్లాలో రికార్డు కాగా, వైద్యాధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. గర్భిణులైన గాంధీనగర్ గ్రామానికి చెందిన చిర్రబోయిన రాధిక, గవిచర్ల గ్రామానికి చెందిన కెనసాలపు మమత శుక్రవారం సాయంత్రం పీహెచ్సీలో చేరారు. వీరిలో మమత రాత్రి 12.05కు, రాత్రి 2.15 గంటలకు రాధిక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తెల్లవారుజామున తీగరాజుపల్లికి చెందిన అజ్మీరా కవిత మొదటి కాన్పు కోసం రాగా ఉదయం 8.05కు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్ శంకేసి శిరీష్కుమార్, స్టాఫ్ నర్సులు సునిత, అనిల్ చికిత్స చేయగా.. వైద్యాధికారి డాక్టర్ సుధీర్బాబు అభినందించారు. ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సంగెం పీహెచ్సీలో 37 ప్రసవాలు జరిగాయని వైద్యాధికారులు తెలిపారు. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచండి
పెద్దపల్లి: గర్భిణులకు ఆరోగ్య పరీక్షల పేరిట చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. బ్రూణ హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో స్కానింగ్ సెంటర్ల పూర్తి వివరాలను సేకరించి భద్రంగా ఉంచాలని సూచించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహణపై అనుమానం కలిగితే పోలీసుల సహకారంతో ఆ సెంటర్లను తనిఖీ చేయాల్సిందిగా డీఎంఅండ్హెచ్ఓ భిక్షపతిని కోరారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లో ఎంతమంది గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారికి సంబంధించిన వివరాలను సేకరించాలన్నారు. ప్రసవం తర్వాత కూడా విధిగా మహిళల వివరాలు నమోదు చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్ యజమాని విధిగా ట్రాకింగ్ చిప్ టెక్నాలజీ విధానాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక జేసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి జిల్లాలోని వైద్యాధికారులు అబ్ధుల్బాబా, వై. సూర్యశ్రీరావు, బి. మల్లేశం, న్యాయసలహాదారు శంతన్ కుమార్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, స్థానిక ఎంపీపీ సందనవేని సునిత, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడులో.. అంతకుమించి!
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ఇస్తామన్న మోదీ - చాలా కాలంగా రూ.12 వేలు ఇస్తున్న తమిళనాడు! - ఆ రాష్ట్రంలో తెలంగాణ మహిళా ఐఏఎస్ల బృందం పర్యటన - వైద్య సౌకర్యాలపై అధ్యయనం - అక్కడ 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే.. - తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31 శాతమే సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ప్రోత్సా హకం ఇస్తామని ప్రధాని మోదీ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో చాలా కాలం నుంచే రూ.12 వేలు ఇస్తుండటం గమనార్హం. ఈ విషయంలో దేశానికే తమిళనాడు ఆదర్శంగా నిలిచింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 80 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం 31 శాతమే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడం, నరకప్రాయమైన గదులే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో తమిళనాడులో గర్భిణులు ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి గల కారణాలు, వసతులపై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్.. సీనియర్ మహిళా ఐఏఎస్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపారు. సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ వాకాటి కరుణ, నిజా మాబాద్ కలెక్టర్ యోగితా రాణా, వికారాబాద్ కలెక్టర్ దివ్య ఆ బృందం లో ఉన్నారు. 2 రోజులపాటు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన ఈ బృందం.. తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు చెకప్లు, తర్వాత కాన్పు, బిడ్డకు టీకా వంటివి చేయించుకుంటే సదరు మహిళకు ప్రభుత్వం రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు గమ నించింది. తెలంగాణలో గర్భిణులకు రూ.వెయ్యి ప్రోత్సాహకం మాత్రమే ఇస్తుండటం గమనార్హం. 50 శాతానికి తీసుకురావాలనే... రాష్ట్రంలో ఏటా 6.3 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మిగిలినవి ఇళ్ల వద్ద ఏఎన్ఎంలు, ఇతరుల సమక్షంలో జరుగుతు న్నాయి. ఇక ఆస్పత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే జనని సురక్ష, జనని శిశు సురక్ష పథకాల కింద రూ.వెయ్యి ప్రోత్సాహకం, భోజనం కోసం ప్రతిరోజూ రూ.100, ఉచిత పరీక్షలు, మందులు అందజేస్తారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయితే ఐదు రోజులు ఉంచి రూ.500 చెల్లిస్తారు. సాధారణ ప్రసవమైతే మూడు రోజులు ఉంచి రూ.300 ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావడానికి గర్భిణులు భయపడుతున్నారని రాష్ట్ర సర్కారు భావించింది. దీంతో పరిస్థితిని మార్చాల ని నిర్ణయించిన కేసీఆర్.. రాష్ట్రంలో 50 శాతానికి పైగా కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. సిజేరియన్ పేరుతో ప్రైవేటు దోపిడీ.. రాష్ట్రంలో ఏకంగా 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 74 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. తెలంగాణలో సిజేరి యన్ కాన్పుల ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లు ఆర్జి స్తున్నట్లు అంచనా. సిజేరియన్ కోసం రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. -
గర్భవతులకు ఆకర్షణీయ పథకం
-
గర్భవతులకు ఆకర్షణీయ పథకం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగానే దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కోసం ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రణాళికలు వెల్లడించారు. దేశంలో మహిళలు, ఉద్యోగినులు, పేదలు, బాగుపడినపుడే దేశం బాగుపడిందని ప్రకటించిన ప్రధాని గర్భవతులకు శుభవార్త అందించారు. ముఖ్యంగా గర్భవతి మహిళల కోసం దేశ వ్యాప్త పథకాన్ని ప్రకటించారు. గర్భవతులకు చికిత్స, ప్రసవం, టీకాలు, పౌష్టికాహారం తదితర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.6 వేల ఇవ్వనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ గా ఆయా మహిళల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్టు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి ఈ పథకం బాగా ఉపయోగనుందన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 650 జిల్లాలో ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం గృహనిర్మాణాలను పెంచనున్నామని మోదీ చెప్పారు. గ్రామీణులకు ఇంటి నిర్మించుకునేవారికి ప్రోత్సాహకాలందించిన మోదీ కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటిలో కొత్త నిర్మాణాలు కోసం రుణ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ఇందుకు గాను రూ. 2 లక్షల రూపాయల రుణాన్ని అందించనున్నారు. అలాగే ప్రధాని ఆవాస యోజన పథకం కింద గ్రామీణులకు రూ.9 లక్షలపైన రుణాలపై 4శాతం వడ్డీ మాఫీ,రూ.12లక్షలపై రుణాలపై 3శాతం వడ్డీమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. -
జైళ్లలో గర్భిణులకు సౌకర్యాలు లేవు!
►వైద్య సదుపాయాలు, ప్రసవ ఏర్పాట్లూ లేనే లేవు ►హైకోర్టుకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ నివేదిక ►ఆ నివేదికను బట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయండి ►సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయండి ►ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ మహిళా ఖైదీ లు, వారి పిల్లలు, గర్భిణులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నివేదించారు. అత్యధిక శాతం జైళ్లలో వైద్య సదుపాయాలు లేవని, రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు కూడా లేరని, చాలా చోట్ల ఈ పోస్టు ఖాళీగా ఉందన్నారు. జైళ్లలో ఉన్న గర్భిణులను చెకప్లు, ప్రసవా ల నిమిత్తం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతు న్నారని, ఏ జైలులో కూడా ప్రసవ ఏర్పాట్లు లేవని వివరించారు. పుట్టి న పిల్లలను తల్లితోనే ఉండేందుకు అను మతినిస్తున్న జైలు అధికారులు, ఆ పిల్లలకు వాతావరణ పరిస్థి తులకు తగినట్లుగా దుస్తుల సౌకర్యం కల్పించడం లేదన్నారు. అత్యధిక జైళ్లలో అంతర్గత విద్య, వినోద ఏర్పాట్లు లేవని తెలిపారు. ‘రాష్ట్రంలోని జైళ్లలో నలుగురు గర్భిణులు, తల్లులతో పాటు 35 మంది పిల్లలు ఉన్నారు. చాలా జైళ్లలో పిల్లలకు వండిపెట్టేందుకు ఏర్పాట్లేవీ లేవు. పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో జైళ్లలో ఎటువంటి రికార్డులను నిర్వహించ డం లేదు. దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో వాక్సిన్లు వేస్తున్నారు. ఖైదీలకు దూరంగా పిల్లలు ఉండేందుకు అత్యధిక జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో మానసిక వైకల్యంతో బాధప డుతున్న 112 మంది ఉన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం మినహా మిగిలిన జైళ్లలో ఎక్కడా మానసిక వైకల్యంతో బాధపడు తున్న వారికి ప్రత్యేక వసతి ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని అన్నిజిల్లాల న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శులు 4 కేంద్ర కారా గారాలను, ఒక ఓపెన్ ఎయిర్ జైల్, 3 ప్రత్యేక మహిళా జైళ్లు, 8 జిల్లా జైళ్లు, 4 స్పెషల్ సబ్జైళ్లు, 66 సబ్జైళ్లు సందర్శిం చారు. వారి వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాం’ అని సభ్య కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి కూడా ఓ నివేదికను సమర్పించారు. గురువారం ఈ నివేదికల్ని న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఈ నివేదికలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరి శీలన చేసి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలతో నివేదికలు సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బాల నేరస్తులు, మహిళా ఖైదీల హక్కుల కోసం రాష్ట్రాలేం చర్యలు తీసుకుంటు న్నాయో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల్ని∙గతం లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే. -
తల్లీ పిల్లల కోసం ‘అమ్మ ఒడి’
• గర్భిణులు, తల్లీ పిల్లల ఉచిత తరలింపు • వారం రోజుల్లో రంగంలోకి 41 కొత్త వాహనాలు • ఏజెన్సీల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీల్లో గర్భిణీలు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలన్నా, ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లాలన్నా అనేక కష్టనష్టాలకు గురికావాల్సి వస్తోంది. ‘108’వాహనాలున్నా అవి పెద్దగా సేవలు అందించడంలేదన్న విమర్శలున్నారుు. దీంతో గర్భిణీలు, ప్రసవం తర్వాత తల్లీ పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా సరిగా రోడ్లు లేకపోవడంతో బస్సుల్లో ప్రయాణం గర్భిణీలకు ఇబ్బందిగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యమూ లేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గర్భిణీలను ఆస్పత్రులకు క్షేమంగా తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడం కోసం ‘అమ్మ ఒడి’కార్యక్రమం ద్వారా ప్రత్యేక వాహన సదుపాయం కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణరుుంచింది. ‘102’కు ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలున్న వాహనం వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 41 వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వాహనంలో తీసుకురావడం, తీసుకెళ్లడం పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వాహనాల్లో ప్రత్యేక సదుపాయాలు గర్భిణీలను తరలించడానికి బొలెరో వాహనాలను ఉపయోగిస్తారు. అందుకోసం ఆయా వాహనాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. కూర్చోడానికి, నీరసంగా ఉంటే పడుకోవడానికి వీలుగా వాటిని తీర్చిదిద్దుతారు. గతుకుల రోడ్లలో క్షేమంగా తీసుకెళ్లేలా డ్రైవర్లకు ప్రత్యేక హెచ్చరికలు ఉంటారుు. గర్భిణీలు ప్రతి మూడు నెలలకోసారి చెకప్ల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా ఈ ఉచిత వాహన సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ‘102’కు ఫోన్ చేస్తే మనం కోరుకున్న చోటుకు వాహనాలు వస్తారుు. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, నాగర్ కర్నూల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వాహనాలను అందుబాటులోకి తేనున్నారు. -
‘గాంధీ’కి పోటెత్తుతున్న గర్భిణీలు..
పాలనా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గాంధీ ఆస్పత్రి : సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిలిపివేసిన నేపధ్యంలో గాంధీ ఆస్పత్రికి గర్భిణీలు పోటెత్తుతున్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు మంచాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్ల్లో 160 మంచాలుండగా సుమారు 250 మందికి సర్ధుబాటు చేస్తున్నారు. సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడంతో నిరుపేదలు గాంధీ దారిపట్టడంతో ఓపీకి వచ్చేవారి సంఖ్య అమాంతంగా 350కి పెరిగింది. బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేస్తున్నారు. వార్డుల బయట మంచాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గైనకాలజీ విభాగానికి రద్ధీ పెరిగినందున రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. సుల్తాన్బజార్ ఆస్పత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది ఇక్కడికే వచ్చి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదు ఆపరేషన్ థియేటర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచామన్నారు. -
మీకూ సానియా, సింధూ పుట్టొచ్చు కదా!
హైదరాబాద్ : "ఆడ పిల్లలని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా... ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు..ఏమో..! మీ కడుపులో ఒక సానియా...మరో సింధు లేదా సాక్షినో పుట్టొచ్చు కదా.! ఆడపిల్లల్ని రక్షించుకుందాం...చదివించుకుందాం...!'' అంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా గర్భిణిలకు లేఖ రాశారు. "బేటీ బచావో...బేటీ పడావో'' ప్రచారంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి పథకం లబ్దిదారులైన సుమారు ఆరువేల మంది గర్భిణిలకు ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ లో ఆడపిల్లల జనాభా తక్కువగా ఉందని, 2001 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 918మంది ఆడపిల్లలే ఉన్నారన్నారు. నిజానికి వెయ్యి మంది ఆడపిల్లలు పుట్టి ఉండాలి కదా..! కానీ పుట్టడం లేదని, కాదు...మనమే పుట్టనివ్వడం లేదని, స్కానింగ్ ద్వారా గర్భంలో ఉన్నది ఆడపిండమా? మగ పిండమా..? అని తెలుసుకుని ఆడపిల్లలను అబార్షన్ ద్వారా చంపేస్తున్నామని, గర్భస్థ ఆడపిండాన్ని హత్య చేయడం చట్టప్రకారం నేరమన్నారు. అవకాశం ఇస్తే ఆడపిల్లలు అన్నింటా రాణిస్తారని, అందుకు మన హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జానే ఒక నిదర్శనమన్నారు. అదేవిధంగా రియో ఒలింపిక్స్ లో సింధు, సాక్షి, దీప అనే ముగ్గురు అమ్మాయిలు పతకాలు గెలుచుకుని దేశానికి కీర్తితో పాటు ప్రపంచస్థాయికి తీసుకెళ్లి అందరితో జేజేలు పలికించారన్నారు. మీ కడుపులో కూడా అలాంటి ఆణిముత్యాలు పుట్టొచ్చు కదా...! ఆలోచించండి అంటూ కలెక్టర్ లేఖ రాశారు. -
పురుడు కోసం వస్తే..
కేజీహెచ్లో గర్భిణులకు అష్టకష్టాలు ఒకే మంచంపై ముగ్గురేసి బాలింతలు కేజీహెచ్ : ‘బాలింతలు కష్టాలు పడనక్కర్లేదు. మాతా శిశు మరణాలు అదుపులోకి వచ్చారుు. గర్భిణీలకు ప్రభుత్వం తరఫున ఎన్నో ప్రోత్సహకాలు. గర్భిణీగా ఆస్పత్రికి వస్తే డెలివరీతో పాటు తల్లి, పిల్లను ఇంటికి చేర్చే బాధ్యత కూడా మాదే’ లాంటి ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆయా ప్రకటనలు..ప్రకటనలుగానే మిగిలిపోతున్నారుు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్గడ్, గోదావరి జిల్లాల నుంచి కేజీహెచ్కు వస్తున్న గర్భిణీలు, బాలింతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయినా ఇక్కడ వారికి కష్టాలు తప్పడం లేదు. ఒకే బెడ్పై ఇద్దరేసి, ముగ్గురేసి చొప్పున చికిత్స పొందడం, డెలీవరీ అయిన తరువాత నలుగురైదుగుర్ని తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో కుక్కేయడం, బాలింతలకు బెడ్లు లేక కిందనే కూర్చోవడం ఇక్కడి కేజీహెచ్తో నిత్యకృత్యమైపోతోంది. సాధారణ కాన్పు, సిజేరియన్ కాన్పు బాలింతలు ప్రసూతి వార్డుల్లో పడుతున్న కష్టాలు చూస్తుంటే 9నెలలపాటు బిడ్డను మోసే కష్టాల కంటే ఇవే ఎక్కువంటూ ఆడపడుచులు రోధిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకుంటే తల్లి, పిల్ల ఇద్దరూ క్షేమం అంటూ సూచనలిస్తున్న ప్రభుత్వం ప్రసూతి, లేబర్ రూం. ఎన్ఐసీయూ, తల్లి, బిడ్డను ఇంటికి చేర్చడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదన్న ఘటనలతో బుధవారం కేజీహెచ్లో సాక్షికి చిక్కిన ఈ దృశ్యాలే ఉదాహారణ. -
గర్భిణుల ఆందోళనపై డీసీహెచ్ఓ విచారణ
కదిరి టౌన్ : ప్రసవం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినందుకు నిరసిస్తూ ఇటీవల గర్భిణులు ఆందోళ చేపట్టిన నేపథ్యంలో విచారించడానికి శనివారం జిల్లా కమ్యూనిటీ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ (డీసీహెచ్ఓ) డా.రమేష్ కదిరికి వచ్చారు. శనివారం సాయంత్రం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజిస్ట్ డా.విజయలక్ష్మిని, ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా.రామక్రిష్ణయ్య, శెలవులో ఉన్న డా.బాషా, లేబర్ వార్డులోని వైద్యసిబ్బందిని పిలిపించి విచారించారు. మత్తు డాక్టరు సెలవు పెడితే ప్రైవేటు మత్తు డాక్టరును పిలిపించి సిజేరియన్లు చేసే అవకాశం ఉండీ ఎందుకు ఆ విధంగా చేయలేదని మందలించారు. రోగులు ప్రభుత్వాసుత్రికి ఎంతో నమ్మకంతో వస్తారని, అలాంటిది వారి ఆశలు ఆడియాశలు చేయకండని ఆగ్రహించారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు ఎందుకు ఆశించారో వివరణ ఇవ్వాలని వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. తాము ప్రసవం కోసం గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పగా అంతలోనే పాత్రికేయులు కల్పించుకుని సార్, ఇక్కడ మగ బిడ్డకు ఒక రేటు, ఆడబిడ్డ ప్రసవిస్తే మరో రేటు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. దీంతో డీసీహెచ్ఓ అక్కడే ఉన్న వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటిది అని ప్రశ్నించగా వారు నీళ్లు న మిలారు. ఏది ఏమైనా ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వసూలు చేసినా డబ్బు డిమాండ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చినా కఠిన చర్యలు తప్పవన్నారు. -
కడుపులోని బిడ్డ ఎలా ఉందో చెప్పేస్తుంది!
కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందోనన్న ఆతృత, ఆందోళన గర్భిణులకు ఉంటుంది. అయితే ఆ విషయాలు తెలుసుకోవాలంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి, స్కానింగ్ తీయించుకోవాలి. ఇప్పుడు అదంతా అవసరం లేకుండా గర్భిణులు తమంతట తామే శిశువు ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి వీలుగా ఉండే ఒక పోర్టబుల్ పరికరాన్ని పోలండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. లోపలున్న శిశువు గుండె ఎలా కొట్టుకుంటోంది, ఉమ్మనీరు తగినంత ఉందా లేదా అనే వివరాలతో పాటు బిడ్డ మెడకు పేగు చుట్టుకుందా అనే విషయం కూడా ఈ పరికరంతో తెలిసిపోతుంది. ప్రెగ్నాబిట్ అనే ఈ పరికరం సాయంతో గర్భిణులకు వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి, నివారించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గర్భస్థ శిశువులకు వచ్చే సమస్యలను ముందే గుర్తించి వాటికి తగిన చికిత్సలు చేయొచ్చని, దానివల్ల శిశువు ప్రాణాలను కూడా కాపాడొచ్చని ఈ పరికరం రూపకల్పనలో పాల్గొన్న పాట్రీషియా విజిన్స్కా సోచా అనే పరిశోధకురాలు చెప్పారు. ఒక ప్రత్యేకమైన బెల్టు సాయంతో ఈ పరికరాన్ని కడుపు వద్ద కడతారు. అరగంట పాటు అలా ఉంచి పరీక్ష పూర్తిచేస్తారు. అనంతరం మెడికల్ టెలిమానిటరింగ్ కేంద్రంలో ఉండే నిపుణులు ఈ డేటాను విశ్లేషిస్తారు. ఈ ఏడాదే ఈ పరికరం మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. -
స్ట్ట్రాబెర్రీలతో ఎన్నెన్నో ప్రయోజనాలు!
పరిపరి శోధన కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలని తెలుసు. గర్భవతులకు పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మేలు కలిగిస్తుందని తెలుసు. అలాంటి మేళ్లు ఎన్నో కలగలసి ఒక్క స్ట్రాబెర్రీ పండ్లలోనే ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తెలిసింది. స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇవే... మంచి చూపు కోసం వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను సాధారణంగా ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాలిక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. కానీ ఇలా వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గే సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లలో ఉండే విటమిన్-సి వల్ల చూపు తగ్గే సమస్య నివారితమవుతుంది. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఈ సమస్యను దాదాపు 36 శాతానికి పైగా నివారించవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు. క్యాన్సర్ నివారణ కోసం స్ట్రాబెర్రీలలో ఉండే యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఇదే విషయాన్ని ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురించారు. స్ట్రాబెర్రీలు తినేవారిలో ఊపిరితిత్తులు, ఈసోఫేగస్, రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనంలో తెలిసింది. గర్భవతుల కోసం గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. దాంతో అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం దీని నుంచి దూరంగా ఉండాలి. -
జికా భయంతో గర్భస్రావాలు
లండన్: జికా వైరస్ భయంతో లాటిన్ అమెరికా దేశాల్లో అనేక మంది గర్భిణులు గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. అయితే అక్కడి చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధమైనందున వారు ఇందుకోసం సురక్షితం కాని మార్గాలను ఎంచుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే గర్భస్రావానికి కారణమయ్యే మందులను వాడుతున్నారు. ఆనక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. జికా వైరస్ ప్రభావం మనుషులపైన కన్నా, గర్భంలో ఉన్న శిశువుపై అధికంగా ఉంటుందని అమెరికా ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. -
ఆ సమయంలో అలర్ట్గా లేకుంటే ఇక అంతే!
వాషింగ్టన్: గర్భిణీ స్త్రీలు సరైన అహారం తీసుకోనట్లయితే పుట్టబోయే పిల్లలు అనారోగ్యానికి గురవుతారన్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం పుట్టబోయే పిల్లలకు మాత్రమే పరిమితం కాదు.. రాబోయే మూడు తరాలకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫాస్ట్ఫుడ్, ఎక్కువ కొలెస్ట్రాల్తో కూడిన అహారాన్ని అధికంగా తీసుకున్న వారి సంతానంలో మూడు తరాల పాటు స్థూలకాయత్వం ముప్పు ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అందుకే గర్భిణీ స్త్రీలు అహారం విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అహారపు అలవాట్లు పిల్లల్లో డయబెటిస్, హృదయ సంబంధ సమస్యలపై అత్యధికంగా ప్రభావం చూపుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కెల్లీ మోలీ తెలిపారు. ఇక ప్రెగ్నెన్సీకి ముందు మహిళల శరీర బరువు కూడా జన్యుపరంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. -
‘102’ వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘102’ అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణులకు ఉచిత సేవలందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన అమ్మ ఒడి వాహనాలను, మార్చురీ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘102’ వాహనాల ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా తరలిస్తామన్నారు. ప్రస్తుతం‘102’ వాహనాలు 41 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే మార్చురీకి మరో 50 కొత్త అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిని గాంధీ, ఉస్మానియా, జిల్లా ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, పేదల ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రి ఎదుట గర్భిణీ స్త్రీల ఆందోళన
నల్గొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద పేషెంట్లు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి... కాన్పు చేయించుకునేందుకు ముగ్గురు గర్భిణీలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వ వైద్యుడు వాళ్లకు వైద్యం చేసేందుకు నిరాకరించాడు. తాను ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నానని... ఆ ఆసుపత్రిలో చేరితేనే వైద్యం చేస్తానని కరఖండిగా చెప్పాడు. దీంతో ఆసుపత్రికి వచ్చిన మహిళలు వైద్యుడితో వాగ్వివాదానికి దిగారు. వైద్యుడి వైఖరికి నిరసనగా... ఆసుపత్రి ఎదుట గర్భిణీ స్త్రీలతోపాటు వారి బంధువులు ఆందోళకు దిగారు. -
కాబోయే తల్లుల ర్యాంప్ వాక్
సాక్షి,బెంగళూరు: మదర్స్డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్వాక్ చేసి అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సంస్థ సీఈఓ నీరజ్గార్గ్ బహుమతులను అందజేశారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. -
ఆ టైమ్లో ఆరోగ్యకరంగా తినండి... ఇద్దరి కోసం వద్దు..!
పరి పరిశోధన గర్భవతులుగా ఉన్నవారు తమ న్యూట్రిషనిస్ట్ చెప్పిన మేరకు ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోవాలి తప్ప... కడుపులో ఉన్న బిడ్డ కోసం అంటూ రెండింతలు తినకూడదని సలహా ఇస్తున్నారు నిపుణులు. గర్భవతులు ఉన్న ఇండ్లలోని కొందరు ‘ఇద్దరి కోసం తినాలి’ అంటూ సలహా ఇస్తుండటం సాధారణంగా కనిపించే అంశం. నిజానికి గర్భం దాల్చిన వారు ఇలా ఇద్దరి కోసం అంటూ రెట్టింపు తినడం అంత మంచిది కూడా కాదని పేర్కొంటున్నారు పరిశోధకులు. ఇలా అధికంగా తినడం తల్లికీ, బిడ్డకూ అనర్థం తెస్తుందని తెలుపుతున్నారు వారు. ఇలా ఇద్దరి కోసం అని తినే తల్లుల తాలూకు బిడ్డలకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. ఒకటీ, రెండేళ్లు కాదు... పిల్లలకు దాదాపు పదేళ్లు వచ్చే వరకూ ఈ ప్రమాదం వెంటాడుతూ ఉంటుందట. గర్భం సమయంలో వచ్చే ‘జెస్టేషనల్ డయాబెటిస్’తో బాధపడ్డ తల్లుల తాలూకు పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు 30 శాతం ఎక్కువ అని ఈ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. ఇక మిగతా తల్లుల్లోనూ ఒకవేళ వారు గర్భవతులుగా ఉన్నప్పుడు దాదాపు 18 కిలోల కంటే ఎక్కువ బరువును సంతరించుకుంటే వారికి పుట్టే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చే అవకాశాలు 15 శాతం ఎక్కువట. ఈ పిల్లలకు రెండు నుంచి పదేళ్ల వచ్చే వరకు ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయని అమెరికాలోని ‘కెయిజర్ పర్మనెంట్ సెంటర్ ఫర్ హెల్త్ రీసెర్చ్’ సంస్థ పేర్కొంది. దాదాపు 24,000 పైగా మంది తల్లులూ, వారి బిడ్డలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. పదేళ్లకు పైగా కొనసాగిన ఈ అధ్యయన బృందానికి చెందిన డాక్టర్ థెరెసా హిల్లియర్ అనే ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడుతూ... ‘‘సాధారణంగా గర్భవతులలో బరువు పెరుగుతున్న కొద్దీ వాళ్ల రక్తంలో చక్కెరపాళ్లు పెరగడమే గాక, అది వాళ్ల బిడ్డలలోని జీవక్రియల వేగం పెంచవచ్చు. ఇలా వాళ్ల మెటబాలిజంలోని పెరుగుదల ఆ తర్వాత పిల్లల్లో ఊబకాయానికి దారితీయవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘అయితే ఈ ఒక్క అంశమే గాక... పరిసరాలు, బిడ్డ పుట్టాక తల్లిపాలపై పెరగకపోవడం, పిల్లల్లో తగినంత వ్యాయామం కొరవడటం వంటి అనేక అంశాలు సైతం వారిలో ఊబకాయానికి దారితీస్తాయ’’ని తెలిపారు డాక్టర్ హిల్లియర్. ఈ అధ్యయన ఫలితాలు ‘మెటర్నల్ అండ్ ఛైల్డ్ హెల్త్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. -
‘గర్భ’ గోస
♦ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల అవస్థలు ♦ గంటల తరబడి పడిగాపులు ♦ రోజంతా 20 మందికే స్కానింగ్ ♦ వందల మంది వెనుతిరుగుతున్న వైనం ♦ ఒక రోజు ముందే వస్తున్న మహిళలు ♦ రోడ్డు మీదే పడుకుంటున్న తీరు ♦ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, డాక్టర్లు సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల గోస అరణ్యరోదనను తలపిస్తోంది. వారి ఇక్కట్లు ఎవరికీ పట్టడం లేదు. స్కానింగ్ కోసం వచ్చిన వందలాది మంది పేదలు నిందించుకుంటూ తిరిగి వెళుతున్నారు. తమ తలరాతలు ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రతి సోమ, గురువారాల్లో గర్భిణులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు స్కానింగ్ తీస్తున్నారు. ఈ సమయంలో ముందు వరుసలో ఉన్న 30 మందికి స్కానింగ్ ఫారాలు ఇస్తున్నారు. దాంతో వందలాది గర్భిణులు వెనుతిరుగుతున్నారు. రాత్రి వచ్చి వరుసలో నిల్చున వారందరూ నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. ఇలా ఒక్కొక్కరు నెల, రెండు నెలల నుంచి స్కానింగ్ కోసం ఆసుపత్రి చుట్టు ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. రాత్రంతా పడిగాపులు.. ఆసుపత్రి సిబ్బంది 35 మందికి స్కానింగ్ చేస్తున్నామని చెబుతున్నా అస లు 20 మందికి కూడా ఫారాలు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా స్కానింగ్ చేసుకోవాలని తలంచిన పేదలు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు ఒక రోజు ముందే వస్తున్నారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్ బిల్డింగ్ ముందు ఉన్న రోడ్డుపైనే నిద్రపోతున్నారు. ఉదయాన్నే తమ వరుస రావాలని గేటుకు (దేవుని గుడిలో మొక్కులు కట్టినట్టు) గుర్తుగా గుడ్డలు కడుతున్నారు. ఉదయం తమకు స్కానిం గ్ అవుతుందో లేదో అని రాత్రంతా వారు పడే వేదన అంతాఇంతా కాదు. నిండు గర్భిణులు రాత్రంతా అవస్థలు పడుతున్న తీరు వర్ణణాతీతం. ఈ సమస్య చాలా కాలంగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. స్కానింగ్ తీసే సరికి ప్రసవం అయిపోతోంది.. 8, 9 నెలల గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారు స్కానింగ్ కోసం నెల, రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో వారి ప్రసవం సమయం కూడా అయిపోతున్నదని పలువురు తెలిపారు. ఈ విషయంపై డాక్టర్లు ఏమి సమాధానం చెప్పడం లేదు. ఏ దారి లేక కొందరు పేదలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ స్కానింగ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే ‘ స్కానింగ్ మిషిన్ ఒక్కటే ఉంది, డాక ్టర్ల కొరత ఉంద’ని ఆసుపత్రి అధికారులు దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి నివేదించామని బుకాయిస్తున్నారు. నలుగురే డాక్టర్లు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. అందులో ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి ఇన్చార్జి పర్యవేక్షకులు రెగ్యులర్ డాక్టరుగా ఉన్నారు. దాంతో ఆయన సేవలు ప్రసూతి వార్డుకు సరిగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు తెలిపారు. అంతే కాకుండా ఇన్చార్జి డీఎంహెచ్ఓకు డీసీహెచ్ఎస్గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయన నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. -
గర్భిణులకు హజ్ యాత్ర నిషేధం!
బారెల్లీ: సెంట్రల్ హజ్ కమిటీ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. హజ్ యాత్రకు నాలుగు నెలలు దాటిన గర్భిణిలు రాకూడదంటూ నిషేధం విధించింది. దరఖాస్తులు పెట్టుకునే సమయానికి గర్భం ధరించి ఉన్నవారు యాత్రను కొనసాగించేముందు ఆలోచించి అడుగు వెయ్యాలని హెచ్చరించింది. వాస్తవాన్ని దాచిపెట్టి హజ్ యాత్రను కొనసాగించినవారిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించేది లేదని, అయితే విమానంలో మహిళలపై ఎటువంటి తనిఖీలు జరుపుతారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదని హజ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది హజ్ యాత్ర సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని బారెల్లీ హజ్ సేవా సమితి సెక్రెటరీ నజీమ్ బేగ్ తెలిపారు. అయితే కొత్తగా తీసుకున్న నిర్ణయాల మేరకు గర్భం దాల్చి నాలుగు నెలలు నిండిన వారిని తీర్థయాత్రకు అనుమతించేది లేదని, ఆ విషయాన్ని ధరఖాస్తు చేసుకునే ముందే మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ విషయం తెలియక యాత్రకు బయల్దేరినా వారు తనిఖీల్లో పట్టుబడితే వెనక్కు పంపించేస్తామని, ఎట్టిపరిస్థితిలో తీర్థయాత్రకు అనుమతించేంది లేదని స్సష్టం చేశారు. అంతేకాక వారి సీట్లను రద్దు చేసి డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని హజ్ కమిటి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెహ్మాన్ తెలిపారు. హజ్ యాత్రలోని మొదటి ఐదు రోజులు మనుషుల్లో సహన శక్తికి, ఓర్పుకు పరీక్షలాంటిదని, వారిని ఒకచోటనుంచి మరోచోటకు త్వరితగతిన తరలించడం జరుగుతుంటుందని, యాత్రలో భాగంగా అక్కడి పుణ్య స్థలాల్లో ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని, అటువంటి సమయంలో గర్భిణుల ఆరోగ్యం, భద్రత కోసమే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు హజ్ కమిటి సెక్రెటరీ బేగ్ తెలిపారు. మరోవైపు యాత్రలో ఉండగా గర్భిణులకు నొప్పులు వస్తే హజ్ కమిటి ఆస్పత్రిలో చేర్పించి తమ ఖర్చులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, అందుకే అటువంటి మహిళల యాత్రపై నిషేధం విధించాల్సి వచ్చిందని, దీంతో వారిని ముందుగానే పరీక్షించేందుకు కోరుతున్నామని బేరెల్లీ హజ్ సేవా సమితి ప్రెసిడెంట్, బహేరీ ఎమ్మెల్యే అతౌర్ రెహ్మాన్ తెలిపారు. -
రేడియాలజీ... సో లేజీ..!
► జీజీహెచ్లో అందుబాటులో ఉండని వైద్యులు ► పీజీ వైద్య విద్యార్థులతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ► స్కానింగ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి సాక్షి, గుంటూరు : అక్కడ వ్యాధి నిర్ధారణ చేయాలంటే గర్భిణులు, రోగులైనా రోజుల తరబడి స్కానింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిందే.. వైద్యుల సిఫార్సు లెటర్లు తీసుకెళ్లినా అక్కడి వారికి లెక్కలేదు.. మధ్యాహ్నం దాటిందంటే వైద్యులు అందుబాటులో ఉండరు.. సొంత క్లీనిక్లకు వెళ్లిపోతుంటారు... ఇక రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటే పీజీ విద్యార్థులే దిక్కు. గుంటూరు జీజీహెచ్లోని రేడియాలజీ విభాగంలో నిత్యం జరుగుతున్న తంతు. గుంటూరు జీజీహెచ్కు నవ్యాంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల నుంచి రోగులు పరీక్షలు, వైద్య సేవల కోసం వస్తుంటారు. ముందుగా వైద్యుల వద్ద చూపించుకుని వ్యాధి నిర్ధారణ కోసం ఆల్ట్రాసౌండ్స్కాన్, సిటీస్కాన్ల వద్దకు రోగులు బారులు తీరుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చే రోగులకు స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడకు వచ్చే రోగులకు మూడు నుంచి ఐదు రోజులు గడువు విధిస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గడువు తేదీకి వచ్చి స్కానింగ్ చేయించుకున్న మళ్లి ఆ రిపోర్టు వారికందాలంటే మరో రెండురోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి వైద్యాధికారులు స్థానికంగా ఉండకపోవడంతో వారు వచ్చి రిపోర్టులు ఇచ్చే వరకు వీరు వేచి ఉండాల్సిందే. జీజీహెచ్లో అనేక సందర్భాల్లో దీనిపై రోగులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓపీ సమయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉండే రేడియాలజీ విభాగం వైద్యులు మధ్యాహ్నం తరువాత కంటికి కనిపించరు. స్కానింగ్ సెంటర్లో పీజీ వైద్యులు, సిబ్బంది మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల వద్ద ప్రసవ వేదనలు ఓ పక్క ప్రభుత్వం ఆస్పత్రి ప్రసవాల రేటును పెంచాలని ప్రయత్నాలు సాగిస్తుంటే జీజీహెచ్లో కొన్ని విభాగాల వైద్యుల నిర్లక్ష్యం వలన ఇది నీరుగారుతోంది. జీజీహెచ్లో ప్రస వం కోసం వచ్చే గర్భిణులు ప్రసూతి విభాగంలో వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు ఆల్ట్రాస్కాన్ చేయించుకునేందుకు రేడియాలజీ విభాగానికి వెళ్లడం అక్కడ గంటల తరబడి వైద్యుల కోసం వేచి చూడడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది మేలో పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణి దోమరవరపు లావణ్య, ప్రసూతి విభాగంలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోమని ప్రసూతివిభాగం వైద్యులు ఆమెకు సూచిం చారు. అక్కడకు లావణ్య గంటల పాటు వైద్యుల కోసం వేచి చూసి నొప్పులు అధికమై స్కానింగ్ గది ముందు నేలపై ప్రసవించింది. తాజాగా గుంటూరు నగరంలోని అరండల్పేటకు చెందిన సంధ్యారాణి స్కానింగ్ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు స్కానింగ్ సెంటర్ వద్ద పడిగాపులు కాసి వైద్యుల నిర్లక్ష్యంపై జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు జీజీహెచ్ అధికారులు కమిటీని నియమించారు. ఇప్పటికైనా రేడియాలజీ విభాగం వైద్యులు నిర్లక్ష్యం వీడి వ్యాధి నిర్ధారణ పరీక్షలను త్వరితగతిన నిర్వహించి రోగులకు ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
పర్యవేక్షణ ఖాళీ
► ఐసీడీఎస్లో సూపర్వైజర్ల కొరత ► అంగన్వాడీ కేంద్రాల ప్రగతిపై ప్రభావం ► జిల్లాలో 61 పోస్టులు ఖాళీ మందమర్రి రూరల్ : గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ.. పిల్లలకు ఆటపాటలు నేర్పిస్తూ వారిలో ృసజనాత్మక శక్తిని పెంపొందించి క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు పునాది వేసే అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆయూ కేంద్రాల ప్రగతి కుంటుపడుతోంది. జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,558 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,558 మంది కార్యకర్తలు, ఆయాలు పని చేస్తున్నారు. కేంద్రాల పర్యవేక్షణకు సరిపడా సూపర్వైజర్లు లేరు. జిల్లాకు గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు 84 మంజూరు ఉండగా.. 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 పోస్టులు 81 మంజూరు ఉండగా.. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 61 పోస్టులు ఖాళీలున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో సూపర్వైజర్కు పర్యవేక్షణ కోసం 20 అంగన్వాడీ కేంద్రాలు కేటాయించాల్సి ఉండగా.. కొన్ని మండలాల్లో ఒక్కొక్కరికి 20 నుంచి 70 కేంద్రాలను కేటాయించారు. వీరు రోజుకో అంగన్వాడీ కేంద్రం చొప్పున తనిఖీ చేసి వాటి ప్రగతిని పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లాలో తగినంత మంది సూపర్వైజర్లు లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. తనిఖీలు సక్రమంగా జరగకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. 30 కేంద్రాలను ఒకే సూపర్వైజరు తనిఖీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల, అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణుల నమోదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలు తయూరు చేయూలి. అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి వివరాలను కూడా సేకరించాలి. ఎంతమంది గర్భిణులకు సంపూర్ణ భోజనం అందుతుంది, అందుకు సంబంధించిన సరుకుల వివరాలు, ఖర్చులు, మిగులు వంటి అంశాలను క్రోడికరించి ప్రగతి నివేదికలు ప్రతినెలా జిల్లా ఉన్నతాధికారులకు పంపించాలి. 30 కేంద్రాల నివేదికలు తయూరు చేయడం సూపర్వైజర్లకు భారంగా మారుతోంది. దీంతో కొన్ని మండలాల్లో సీనియర్ అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని నివేదికలు తయారు చేయూల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్థానికంగా ఉండని సూపర్వైజర్లు చాలామంది సూపర్వైజర్లు వారికి కేటాయించిన మండలంలో ఉండడం లేదు. దీంతో పర్యవేక్షణ కష్టసాధ్యమవుతోంది. సూపర్వైజర్ల పోస్టులు జోనల్కు సంబంధించినవి కావడంతో ఒక్క జిల్లా వారికి మరో జిల్లాలో పోస్టింగులు ఇచ్చారు. దీంతో వారు ఇక్కడికి రాలేక దూర ప్రాంతాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వారి రాకపోకలకే సమయం సరిపోతోంది. అంగన్వాడీలను ప్రటిష్టం చేసేందుకు ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకువస్తోంది. దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ బడులకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలో భాగంగా సూపర్వైజర్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం 10 నుంచి 15 సెంటర్లు మాత్రమే కే టాయిస్తే పర్యవేక్షణ సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్వైజర్ల నియామకం జిల్లా పరిధిలోనే జరగాలని, ఇక్కడి అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలకే పరీక్షలు లేకుండా పదోన్నతి కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమే నియమించాలి జిల్లాలో సూపర్వైజర్ల సంఖ్య తక్కువగా ఉన్న మాట నిజమే. ఈ పోస్టులను ప్రభుత్వమే భర్తీ చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 61 గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ అంగన్వాడీలపై పర్యవేక్షణ లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం - ఎ.వెంకటేశ్వరమ్మ, పీడీ, ఐసీడీఏస్, ఆదిలాబాద్ -
తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష
పాలకోడేరు రూరల్ : తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు పాటిస్తే పుట్టే/పుట్టిన బిడ్డతోపాటు వారూ ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలనూ నియంత్రించగలుగుతారు. ఈ నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు ఓ సారి తెలుసుకుందాం.. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణి అని తెలియగానే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. అక్కడ ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రోజులో కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. రక్తహీనత నివారణకు ఐ.ఎఫ్.ఎ. వూత్రలు వాడాలి. ధనుర్వాత నివారణకు రెండు టీటీ ఇంజక్షన్లు చేయించుకోవాలి. గర్భిణిగా ఉన్న సమయంలో కనీసం ఐదుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. , రక్తపోటు, రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఎలాంటి బరువు పనులూ చేయురాదు. ఆఖరి మూడు నెలలు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుటికప్పుడు స్కానింగ్ చేయించుకుని శిశువు బరువు తెలుసుకోవాలి. ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి. పాలు, గుడ్లు రోజూ తీసుకోవాలి. పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. వేరుశేనగ, బెల్లం ఉండలు తీసుకుంటే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. -
ప్రసవ సమయంలో తోడుగా భర్త!
న్యూఢిల్లీ: గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయంలో తోబుట్టువులు లేదా భర్త తోడుగా ఉండేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకుగాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లోకి స్త్రీ బంధువును అనుమతించడం వల్ల ప్రసవ సమయంలో ఆమెకు ధైర్యంగా ఉంటుందని, దీనివల్ల ప్రసూతి, శిశు మరణాలు సంభవించే రేటు తక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లలో గర్భిణి భర్త ఉండేందుకు అనుమతిస్తున్నాయి. -
'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు
బొగోటా: గతేడాది బ్రెజిల్ ను వణికించిన ప్రమాదకర జికా వైరస్ ఇప్పుడు కొలంబియా వాసులను హడలెత్తిస్తోంది. 3వేల మందికి పైగా గర్భిణులకు జికా వైరస్ వ్యాపించిందని కొలంబియా ప్రభుత్వ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 25,645 జికా కేసులు నమోదైనట్లు అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ వెల్లడించారు. అమెరికాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్యులకు జికా నిర్మూలనపై ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా అక్కడ ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, గర్భనిరోధక విధానాలను పాటించాలని అధికారులకు సూచించింది. జికాను అరికట్టడానికి ఎలాంటి వ్యాక్సిన్ గాని, నిర్మూలనకు మందులు గానీ ఇప్పటికీ కనిపెట్టలేదు. దీంతో ప్రత్యామ్నాయ విధానాలవైపు దృష్టిసారించాలని కొలంబియా భావిస్తోంది. -
గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు...
బ్రసీలియా: జికా వైరస్ లాటిన్ అమెరికా దేశాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ పై జికా మహమ్మారి గతేడాది తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్షురాలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బ్రెజిల్ లోని రియోడిజనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరగున్నాయి. అయితే, గర్భిణులు ఒలింపిక్ గేమ్స్ చూసేందుకు బ్రెజిల్ రావద్దని ఆ దేశ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చరించారు. అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిర్ణయం మేరకు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. జికా వైరస్ గర్భిణులకు వ్యాపించినట్లయితే వారికి పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడం, ఇతర ప్రమాదకర వ్యాధులు చిన్నారులకు సంక్రమిస్తాయని తెలిపారు. దోమల కారణంగా వ్యాపిస్తున్న జికా వైరస్ పెను సవాలుగా మారిందని భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ఎమర్జెన్సీ ప్రకటించింది. 1947లో ఆఫ్రికాలో కనుగొన్న జికా వైరస్ ఇటీవల కాలంలో వైద్యశాస్త్రానికి ఓ ప్రశ్నగా మిగిలింది. 2014లో 147 కేసులు నమోదవ్వగా, 2015లో 4000 వేల మంది జికా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జికా వ్యాప్తిని అరికట్టడానికి, ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒలింపిక్స్ కోసం ఇక్కడకు రావద్దంటూ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చిరికలు జారీచేశారు. -
2 వేల మంది గర్భిణులపై 'జికా' ప్రభావం
బోగొటా: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం కొలంబియాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో జికా ప్రభావం చాలా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొలంబియాలోనే 2000 మందికి పైగా గర్భిణిలకు జికా వైరస్ బారిన పడ్డారని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతోంది. గతేడాది 15 లక్షల మంది బ్రెజిల్ వాసులు జికా బారిన పడ్డ విషయం విదితమే. పుట్టబోయే పిల్లలపై జికా ప్రభావం ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లులపై జికా ప్రభావం చూపితే పుట్టే పిల్లల్లో బ్రెయిన్ సంబంధ వ్యాధులు వస్తాయి. తల చిన్న పరిమాణంలో ఉన్న పిల్లలు పుడతారు. మొత్తంగా 20, 297 జికా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 1,050 మందికి జికా ఉన్నట్లు నిర్ధారించగా, మరో 17,115 మంది శాంపిల్స్ ఇంకా ల్యాబోరేటరీలలో ఉన్నాయని వాటిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. బ్రెజిల్ తర్వాత జికా ప్రభావం ఎక్కువగా దేశం కొలంబియా అని అధికారులు చెబుతున్నారు. -
గర్భిణి మృతికేసులో గుమస్తాల అరెస్ట్
-
గర్భవతులకు అది నిజంగానే ‘తలనొప్పి’!
పరిపరి శోధన గర్భవతుల్లో వచ్చే తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు నెలలు, ఏడు నుంచి తొమ్మిది నెలల గర్భం (సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్) సమయంలో వచ్చే తలనొప్పులను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇక ఒకవేళ గర్భంతో ఉన్నవారికి రక్తపోటు గనక పెరిగితే దాన్ని ఆ విషయాన్ని కాస్తంత తీవ్రంగానే పరిగణించాలంటున్నారు నిపుణులు. గతంలో తలనొప్పిగానీ, హైబీపీగాని లేని మహిళల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది గర్భవతుల్లో ఫిట్స్ (కన్వల్షన్స్)కు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్లో తమ అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ తలనొప్పుల్లో చాలావరకు మైగ్రేన్ కావచ్చనీ, అయితే 51 శాతం మందిలో గర్భధారణకు సంబంధించిన కాంప్లికేషన్స్తో వచ్చిన తలనొప్పిగా గుర్తించినట్లు వివరించారు. గర్భం ధరించిన వారిలో కనిపించే హైబీపీ, మూత్రంలో అధికప్రోటీన్ (ప్రీ-ఎక్లాంప్సియా) వల్ల వచ్చే తలనొప్పి కూడా కావచ్చనీ, అందుకే నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్నారు. -
కాన్పుకు వచ్చిన గర్భిణిపై అసభ్య ప్రవర్తన
-
గిరిజన గర్భిణుల్లో రక్తహీనత
గిరిజన గర్భవతుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారిణి దేవకీ వెంకట లక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు పరీశీలించారు. సింబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
నర్సులే దిక్కు!
పేరుకే 24 గంటల ఆస్పత్రులు వైద్యులు అందుబాటులో ఉండని వైనం కరెంటుపోతే పేషెంట్లకు కష్టాలే మచిలీపట్నం : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల పాటు పనిచేసే ఆస్పత్రులు 24 ఉన్నాయి. 90 శాతం ఆస్పత్రుల్లో సాయంత్రం 6 గంటల నుంచి వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. 24 గంటల ఆస్పత్రుల వద్ద అంబులెన్స్ అందుబాటులో ఉంచాలి. అయితే 108 వాహనాలే దిక్కవుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లోకరెంటుపోతే గర్భిణులు, బాలింతలు, శిశువులు దోమలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 గంటల ఆస్పత్రులను సాక్షి బృందం శనివారం రాత్రి 9 నుంచి 12 గంటల వరకు విజిట్ చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలు వెలుగుచూశాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. పామర్రు నుంచి ఇక్కడకు వైద్యులు వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. శనివారం రాత్రి ప్రసూతి కోసం ఓ మహిళ ఆస్పత్రికి రాగా నర్సులే వైద్యం చేశారు. శనివారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య వాంతులు, జ్వరంతో వచ్చిన స్థానిక బాలిక రీమాసేన్కు నర్సులే వైద్యసేవలు చేశారు. ఈ సమయంలో చల్లపల్లిలో ఆరోగ్య కేంద్రంలో ఒక పాయిజన్ తీసుకున్న కేసు, కొట్లాట కేసు, పాముకాటు కేసులు వస్తే రాత్రి డ్యూటీ డాక్టర్ సాంబశివరావు వైద్యసేవలు అందించారు. కైకలూరు ఆస్పత్రిలో రాత్రివేళ కుక్కల బెడద అధికంగా ఉంది. నైట్వాచ్మన్ లేరు. గుడ్లవల్లేరు 24 గంటల ఆస్పత్రిలో గైనకాల జిస్టు, చిన్నపిల్లల డాక్టర్లు అందుబాటులో లేరు. ఆపరేషన్ థియేటర్ తలుపులు తీసి 45 రోజులైనట్లు సిబ్బంది చెబుతున్నారు. డాక్టర్ గుంటూరు నుంచి వచ్చివెళ్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి డాక్టర్ ఉండరు.నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు, చాట్రాయి ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్నర్సులు ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైల వరం, రెడ్డిగూడెం, వెలగలేరు, ఇబ్రహీంపట్నం ఆసుపత్రుల్లో అంబులెన్సులు లేవు. సాయంత్రం 5గంటలైతే వైద్యులు అందుబాటులో ఉండరు. స్టాఫ్నర్సులే రోగులకు వైద్యసేవలు అందించారు. జగ్గయ్యపేట ఆస్పత్రికి రాత్రి సమయంలో ఎవరైనా పేషంట్లు వచ్చి డాక్టర్కు తెలిపితే ఆయన వస్తారు. పెనుగంచిప్రోలులో డాక్టర్ అందుబాటులో లేరు. వత్సవాయిలో వాచ్మన్ ఒక్కరే ఉన్నారు. సాక్షి బృందం వచ్చిం దని తెలుసుకుని స్టాఫ్ నర్సు వచ్చారు. పెడన నియోజకవర్గంలో గూడూరు, చినపాండ్రాకలో 24 గంటల ఆస్పత్రులు ఉన్నాయి. గూడూరులో ఆరుగురు వైద్యులకు ముగ్గురే ఉన్నారు. గూడూరు ఆస్పత్రిలో ఇరువురు ఏఎన్ఎంలు ఉన్నారు. చినపాండ్రాక ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. నందిగామ నియోజకవర్గంలోని కంచి కచర్ల ఆస్పత్రిలో శనివారం రాత్రి వైద్యులు, నర్సులు అందుబాటులో లేరు. నందిగామ ఆస్పత్రి ఆవరణలో నీరు నిలిచి ఉంది. -
గర్భిణులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి
రేగోడ్ (మహబూబ్నగర్ జిల్లా) : బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని స్థానిక డాక్టర్ శంకర్ గర్భిణులకు సూచించారు. మండల కేంద్రమైన రేగోడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి 50 మంది గర్భిణులు హాజరయ్యారు. వీరందరికీ పూలు, గాజులు, స్వీట్లు, బొట్టు పెట్టి సీమంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ సమయానికి మందులు వేసుకోవాలని తెలిపారు. అనంతరం గర్భిణులకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మమత శ్రీశైలం, సర్పంచ్ సునీత, డాక్టర్ శ్వేతప్రియ, సూపర్వైజర్ మాసమ్మ, సిబ్బంది, ఏఎన్ఎంలు, జోగిపేట క్లస్టర్ సీహెచ్ఓ సుదర్శన్ పాల్గొన్నారు. -
పెరుగుతున్న గర్భిణీ మరణాలు
- ఐదేళ్లలో 270 మంది మృతి పింప్రి: గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వారి మరణాలను మాత్రం అరికట్టలేకపోతోంది. స్థానిక సంస్థల ద్వారా అనేక పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పుణేలో 2010-11లో 37, 2011-12లో 45, 2012-13లో 64, 2013-14లో 53, ఏప్రిల్1వ తేదీ 2014 నుంచి మార్చి 2015 వరకు 66 గర్భిణీ మరణాలు సంభవించినట్లు కార్పోరేషన్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. గత ఐదేళ్లలో 66 మంది గర్భిణీలు మరణించడం ఆదోళనకు గురి చేస్తుంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా గర్భిణీ మహిళలు, శిశువుల సంరక్షణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్, ఆరోగ్య సేవలు, సలహాలు, సందేహాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాలెంటీర్లను ఆరోగ్య విభాగం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంగా కార్పొరేషన్ సహాయక ఆరోగ్య అధికారి డాక్టర్ వైశాలీ సాబణే మాట్లాడుతూ.. సమయానికి ఆరోగ్య సదుపాయాలు అందకపోవడం, రక్త పోటు, వికారం, డెంగీ లాంటి వ్యాధుల వల్ల మృతుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులోలేక పోవడం లాంటి కారణాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. గర్భిణీ మృతుల వివరాలను సేకరించి ఆయా ప్రాంతాలలో జన జాగృతి, ఆరోగ్య వైద్య సదుపాయాలను కార్పొరేషన్ కల్పించాల్సినఅవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
గర్భిణులకు ఎనిమా ఇచ్చి వదిలేసిన డాక్టర్లు !
ఇబ్బందులు పడిన బాధితులు నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో ఘటన నర్సంపేట : డెలివరీ కోసం వచ్చిన గర్భిణీలకు వైద్యులు ఎనివూ ఇచ్చి వదిలేయుడంతో వారు ఇబ్బందులుపడిన సంఘటన పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోవువారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన వుద్ది అనూష, గుడికందుల రజిత ఆదివారం రాత్రి ప్రసవం కోసం ఏరియూ ఆస్పత్రి వచ్చారు. పరీక్షించిన వైద్యులు సోవువారం ఉదయుం రావాలని తెలిపారు. దీంతో తెల్లవారుజామున 4 గంటల సవుయూనికి ఆస్పత్రికి చేరుకున్నారు. వారికి ఆపరేషన్లు చేయుడానికి వైద్యులు ఎనివూ ఎక్కించారు. ఇంతలోనే వుత్తు డాక్టర్ కిషన్ పని ఉందంటూ మళ్లీ వస్తానని వెళ్లిపోయూరు. ఆపరేషన్కు సిద్ధమైన సదరు గర్భిణీలు వైద్యుడు కిషన్ కోసం ఎదురు చూడసాగారు. అతడు ఎంతకీ రాకపోవడంతో ఎప్పుడు వస్తాడని వారు నిలదీశారు. ఇంతలో విషయుం తెలుసుకున్న నగర పంచాయుతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్ ఆస్పత్రికి వచ్చి ఆస్పత్రిలోని వైద్యులతో వూట్లాడారు. అలాగే రికార్డులను పరిశీలించడంతో కేవలం డాక్టర్ జగదీశ్వర్ వూత్రమే విధుల్లో ఉండగా మిగతా వైద్యులు ఎవరూ విధుల్లో లేకున్నా సంతకాలు చేసినట్లు ఉంది. దీంతో చైర్మన్ రాంచంద్రయ్యు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయుమై డీఎంఅండ్హెచ్ఓకు ఫిర్యాదు చేయుడానికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో కలెక్టర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి విషయూన్ని తెలిపారు. ఆస్పత్రికి ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి చేరుకుని వైద్యులతో వూట్లాడారు. గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆస్పత్రిలోని వైద్యులకు సూచిం చారు. ఎనివూ ఎక్కించిన వైద్యులను వెంటనే వరంగల్లోని సీకేఎం ఆస్పత్రికి తరలించారు. -
సూర్యకాంతితో ప్రసూతి చాలా తేలిక...!
సన్ ప్రివెంట్స్ ద పెయిన్ గర్భవతుల్లో విటమిన్ డీ లోపం ఉంటే వారిలో ప్రసూతి చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గర్భవతుల్లో విటమిన్-డి లోపం రావడం చాలా సాధారణమైన విషయం. ప్రత్యేకంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారికీ, ఎండలో ఎక్కువగా తిరగని వారికి ప్రసవం కష్టమవుతుంది. దీనికి కారణం - విటమిన్ ‘డి’ లోపమే. అందుకే ఇలాంటి వారికి ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించే ‘ఎపిడ్యూరల్’ ప్రొసిజర్స్ అవసరమవుతాయి. ఇటీవలే నిర్వహించిన అనస్థీషియాలజిస్టుల వార్షిక సమావేశంలో కొందరు పరిశోధకులు దాదాపు 100 మంది గర్భవతులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని అధ్యయన వేత్తలు తెలిపారు. అందుకే మహిళలు గర్భం దాల్చాక తగినంతగా ఎండపొడకు తిరగాలని వారు పేర్కొంటున్నారు. -
కాబోయే తల్లులకు కష్టాలు మిగిల్చిన విలయం
కఠ్మాండు: నేపాల్ ను ఛిన్నాభిన్నం చేసిన భూకంపంతో కాబోయే తల్లులు అష్టకష్టాలు పడ్డారు. భూకంపం సృష్టించిన విలయంతో దాదాపు 50 వేల మంది గర్భిణులు, బాలికలు బాధలు పడ్డారని ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్(యూఎన్ఎఫ్ పీఏ) తెలిపింది. భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో సుమారు 50 వేల మంది గర్భిణీలు, బాలికలు ఉన్నారని వెల్లడించింది. ప్రసవ సంబంధ వైద్య సేవలు అందక గర్భిణులు అవస్థ పడుతున్నారని తెలిపింది. సుఖ ప్రసవానికి అనువైన పరిస్థితులు లేక కాబోయే తల్లులు కాటికి చేరుతున్నారని వాపోయింది. ప్రకృతి విపత్తులోనూ మహిళలు, బాలికల పట్ల వివక్ష కొనసాగుతుండడం పట్ల యూఎన్ఎఫ్ పీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకృతి ఉత్పతాలు సంభవించినప్పడు గర్భిణులు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరింది. -
మురిగిన గుడ్లు.. ముద్ద దిగదు..
‘అంగన్వాడీ’లకు ఛీగుడ్ల సరఫరా ఇనుగుర్తిలో వెలుగు చూసిన వైనం తినలేకపోతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేసముద్రం : అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు అధ్వానంగా ఉన్నారుు. ఉడకబెట్టిన తర్వాత సొన కారడం, దుర్వాసన రావడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు వాటివైపు చూడడంలేదు. మండలంలోని ఇనుగుర్తి అంగన్వాడీ కేంద్రంలో గురువారం మురిగిపోరుున గుడ్లు దర్శనమిచ్చారుు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో 12 మంది గర్భిణులు, 20 మంది 6 నెలల నుంచి మూడేళ్లలోపు, 19 మంది 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఉన్నారు. అరుుతే కొద్ది రోజులుగా ఈ కేంద్రంలో ఉడకబెడుతున్న గుడ్లు పగిలిపోతుండటం, ఉడికిన గుడ్లన్నీ దుర్వాసన రావడంతో తినలేకపోతున్నారు. నిత్యం కేంద్రంలో భోజనం తినేందుకు వచ్చే గర్భిణులు, పిల్లలు, బాలింతలు గుడ్లు తినడానికి జంకుతున్నారు. కాగా, కేంద్రంలోని గుడ్లు తిన్న ఒకరు అస్వస్థతకు గురై తేరుకున్నట్లు సమాచారం. గుడ్ల పరిస్థితి అన్ని కేంద్రాల్లో ఇలాగే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నెల రోజుల ముందే సరఫరా.. పది రోజులకోసారి కోడిగుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ నెలరోజుల ముందే ఒక్కసారిగా గుడ్లను దిగుమతి చేసి వెళ్లిపోతున్నాడు. ఎక్కువ రోజులు కావడం వల్లే గుడ్లు ఇలా చెడిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క కేంద్రంలో 52 మంది ఉండగా.. ఒకేసారి 1,228 గుడ్లు దిగుమతి చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, అరుుతే చెప్పినా వినకుండా దిగుమతి చే స్తున్నాడని అంగన్వాడీ కార్యకర్త కళావతి తెలిపారు. రవా ణా ఖర్చుల మిగులుబాటు కోసం కాంట్రాక్టర్ ఇలా చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంగన్వాడీ కేం ద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరుతున్నారు. -
ఆ ‘అమ్మ’కు సెలవొద్దా?
ముంబై: అద్దె గర్భం (సరోగసీ) ద్వారా బిడ్డను కంటే ప్రసూతి సెలవుకు అర్హులు కారా? పిండాన్ని మోయనంత మాత్రాన పసిగుడ్డును సాకేందుకు అలాంటి అమ్మకు సెలవు అక్కర్లేదా? ఇవ్వకపోవడం న్యాయమా? ఎందుకొచ్చిందీ ప్రశ్న: సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఓ నర్సుకు ఎదురైంది ఇలాంటి పరిస్థితి. 2004లో ఆమెకు పెళ్లయింది. 2007లో రెండుసార్లు ఐవీఎఫ్ చేయించుకుంటే... గర్భం దాల్చింది. అయితే 2008లో ఆరునెలల గర్భం పోయింది. మళ్లీ రాకపోవడంతో సరోగసీ ఉత్తమమని డాక్టర్లు ఆమెకు సూచించారు. దాంతో ఆమె (తాను గర్భం దాల్చే అవకాశం లేనపుడు తన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరించి... పిండాన్ని అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అద్దెతల్లి నవమాసాలు ఆ పిండాన్ని మోసి శిశువుకు జన్మనిస్తుంది) సరోగసీ ద్వారా బిడ్డకు కనేందుకు ఒకామెతో ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా... గర్భం (అద్దె అమ్మ) దాల్చిన మూడునెలల నుంచే తనకు మెటర్నిటీ సెలవు (పూర్తిజీతంతో 180 రోజులు), శిశు సంరక్షణ సెలవు (పూర్తి జీతంతో 180) రోజులు ఇవ్వాలని సదరు నర్సు ఏడాది సెలవుకు దరఖాస్తు చేసుకోగా... రైల్వే నిరాకరించింది. కావాలంటే సెలవులో వెళ్లొచ్చని... అంతిమంగా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాకపోతే ‘జీతం లేని సెలవు’ (లాస్ ఆఫ్ పే)గా పరిగణిస్తామని సెంట్రల్ రైల్వే సమాధానమిచ్చింది. ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తుండగానే ఆమెకు జనవరి 29న కవలలు జన్మించారు. ఇద్దరు బిడ్డల ఆలనాపాలనా చూసుకునేందుకు ఈ అమ్మకు సెలవు అక్కర్లేదా? ఏం చేసింది: సదరు నర్సు కోర్టుకెక్కింది. తనకు సెలవు ఇవ్వకపోవడం అన్యాయమని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని బాంబే హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం, రైల్వేకు నోటీసులు జారీచేసింది. చట్టాలను పునఃసమీక్షించాల్సిందే: ఇలాంటి ఉదంతాలెన్నో మన చట్టాలను పునఃసమీక్షించాల్సిన అవసరాలను నొక్కిచెబుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలను మార్చుకుంటే... ఇలా ఓ అమ్మ సెలవు కోసం సుదీర్ఘంగా పోరాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు. -
ప్రెగ్నెన్సీలో ‘పైకా’తో జాగ్రత్త!
ఆహారంగా పరిగణించని పదార్థాలను తినే రుగ్మతను పైకా అంటారు. సాధారణంగా పిల్లల్లో ఏదో ఒక దశలో కనిపించే ఈ విపరీత ప్రవర్తన పెద్దలలో తక్కువే. అయితే గర్భవతుల్లో మాత్రం కాస్త తరచుగా కనిపిస్తుంటుంది. ఈ రుగ్మత ఉన్నవాళ్లు మట్టి, బియ్యంలో మట్టి గడ్డలు, ఇసుక, పిండి, పెన్సిల్-ఎరేజర్ ముక్కలు, పేపర్, బొగ్గు, చాక్పీసులు, కాల్చేసిన అగ్గిపుల్లలు.. ఇలా అనేక రకాల వస్తువులు తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనడానికి కారణాలు నిర్దిష్టంగా చెప్పలేం. అయితే కొన్ని పరిశీలనలు, అధ్యయనాల ప్రకారం... ఐరన్, క్యాల్షియం, జింక్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-డి లోపాలు ఉన్న ప్పుడు, కొన్ని ఖనిజ లవణాల లోపాలు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది. సమస్యలు: ఈ రుగ్మత వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, పొట్టలో పురుగులు రావడం (ఇన్ఫెస్టేషన్స్) వంటివి జరగొచ్చు. వెంట్రుకలు, ప్లాస్టిక్ వస్తువులు తినేవారిలో అవి పేగుల్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొన్ని సందర్భాల్లో లెడ్ లాంటి విష పూరితమైన పదార్థాలు కడుపులోకి చేరవచ్చు. చికిత్స : ఇలాంటి రుగ్మత ఉన్నవారికి మొదట రక్తహీనత (అనీమియా) ఉందా అని పరీక్షించాలి. అలాగే పొట్టలో పురుగులు పోయేలా డీ-వార్మింగ్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఐరన్, ఇతర విటమిన్లు ఉండే పోషకాహారపు సప్లి మెంట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొందరిలో అరుదుగా మానసిక చికిత్స కూడా అవసరం కావొచ్చు. -
గర్భవతులు డ్రైవింగ్ చేయవచ్చా?
గర్భధారణకు పట్టే తొమ్మిది నెలల వ్యవధిని మూడు భాగాలుగా విభజించి వాడుకలో మూడు త్రైమాసికాలుగా (ట్రైమిస్టర్స్)గా పేర్కొంటుంటారు నిపుణులు. మొదటి మూడు నెలల వ్యవధి అయిన మొదటి ట్రైమిస్టర్లో పొట్ట అంతగా కనిపించదు. కానీ రెండో ట్రైమిస్టర్ అయిన నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు పొట్ట కనిపించడం మొదలవుతుంది. ఇక మూడో ట్రైమిస్టర్ అయిన ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు అది గరిష్ఠంగా పెరుగుతుంది. పొట్ట పెరగడం జరిగే రెండో ట్రైమిస్టర్లో గర్భవతులైన మహిళలు కారు నడపడం అంత మంచిది కాదని పేర్కొంటున్నారు కెనడాకు చెందిన వైద్య నిపుణులు. కెనడా పరిశోధకులు ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 5,07,262 మంది గర్భవతులపై వివిధ అధ్యయనాలు చేశారు. యాక్సిడెంట్ జరిగిన సందర్భాల్లో గర్భం లేని మహిళలకూ, మొదటి ట్రైమిస్టర్ మహిళలకు ప్రమాదాల గణాంకాల్లో పెద్ద తేడా ఏమీ లేదనీ, అయితే రెండో ట్రైమిస్టర్లో ఉన్న మహిళలకు మాత్రం... ప్రమాదాలు జరిగే అవకాశాలు 42 శాతం ఎక్కువని తేల్చారు.ఈ అధ్యయన సారాంశమంతా ‘కెనెడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్’లో చోటు చేసుకుంది. అయితే కారు నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ... ఈ సీట్ బెల్ట్ను పొట్ట కింది నుంచి సౌకర్యంగా ఉండేలా ధరించేట్లుగా చూసుకోవాలి. ద్విచక్రవాహనాలు నడిపే మహిళలకోసం... ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని సందేహపడుతుంటారు. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏమిటంటే... కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా స్కూటీ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా ఉన్న గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటివి జరగకుండా చూసుకోవాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. -
ఇక రోజూ గుడ్డు
⇒ గర్భిణులు, బాలింతలు, శిశువులకు ⇒ 15 నుంచి అమలు కానున్న ‘వన్ ఫుల్ మీల్’ పథకం ⇒ మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ⇒ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి ⇒ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట సూచన ఇందూరు : మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం ద్వారా ‘వన్ ఫుల్ మీల్’ను ప్రవేశ పెడుతున్నా మని ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. నిర్లక్ష్యం చేయకుం డా క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీడీపీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు లక్షల, కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఐసీడీఎస్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్నారు. మొన్నటి వరకు జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఆరింట ‘అమృతహస్తం’ అమలైందని, ఇకపై అన్ని ప్రాజెక్టులలో అమలవుతుందన్నారు. దీనిని పకడ్బందీగా చేపట్టేలా అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గతంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నెలలో 25 రోజులు మాత్రమే గుడ్లు అందజేసేవారని, ప్రస్తుతం పౌష్టికాహార పరిమాణం పెరిగిందన్నా రు. రోజూ గుడ్డుతోపాటు బాలింతలు, గర్భిణులకు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ఇస్తామన్నారు. వీటికోసం అంగన్ వాడీ కార్యకర్తల ఖాతాలోకే నేరుగా ముందస్తు నిధులను జమచేస్తామని చెప్పారు. శిశువులు మూడు కిలోల బరువుతో, రక్తహీనత లేకుం డా జన్మించేలా చూడాలని సూచించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించి, కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు తీరును నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఆర్జేడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ ఫుల్ మీల్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. గ్రేడింగ్ విధానంతో పని తీరు పరిశీలన ఇక ముందు అంగన్వాడీల పనితీరును మెరుగు పరచడానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తల పనితీరు మెరుగుపడటమే కాకుండా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందన్నారు. ప్రతీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రంలో ఆరు నుంచి ఏడు గంటల సేపు పిల్లలతో గడపాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. గర్భిణులకు పౌష్టికాహారం సమృద్ధిగా అంది స్తే బిడ్డలు మూడు కిలోల బరువుకు తగ్గకుండా పుడతారన్నారు. ఈ నెల 15 నుంచి అమలయ్యే ‘వన్ ఫుల్ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, స్వరూ పా న్ని హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు. -
పూర్తవుతాయా!
గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు, మూడేళ్లలోపు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటికి సొ ంత గూడు కల్పించడంలో మాత్రం విఫలమైంది. దశలవారీగా విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోకపోవడంతో చాలా వరకు భవనాల నిర్మాణా లు సగంలోనే ఆగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు. ఇందూరు: అంగన్వాడీలు ఇక ముందు అద్దె ఇండ్లలో ఉండకూదని భావించిన ప్రభుత్వం సొంత భవనాలు కట్టివ్వాలని నిర్ణయించింది. కానీ, నిధులు సకాలంలో రాకపోవడం, అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలకు సొంత భవనాల కల ఇప్పటిలో నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు వివిధ పథకాల ద్వారా 2012-13, 2013-14 సంవత్సరాలలో 632 అంగన్వాడీలకు భవనాలు మం జూరయ్యాయి. ఒక్కో భవనానికి ఆరు లక్షల రూపాయల చొప్పున రూ. 38 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. దశలవారీగా నిధులు విడుదలయినా నిర్మాణాలను ప్రారంభించడంలో, ప్రారంభించినవాటిని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. కారణమడిగితే, విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని చెబుతున్నారు. లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయంటున్నారు. ముందుకు రాని కాంట్రాక్టర్లు 632 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించిన అధికారులు అందులో 58 భవనాలను మాత్రమే పూర్తి చేయగలిగారు.164 భవనాలు వివిధ దశలలో ఉండగా, 410 భవనాలు ప్రారంభానికే నోచుకోలేదు. టెం డర్లు నిర్వహించిన సమయంలో వీటి కోసం కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు. అధికారులు మళ్లీ టెం డర్లు నిర్వహించలేదు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున అంచనా నిధులకన్నా, ఎక్కు వే ఖర్చు అవుతుందని ఇంజనీర్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి కొత్త ఎస్ఎస్ఆర్ వస్తే తప్ప టెండర్లు పూర్తి కావంటున్నారు. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న భవనాలకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లులు చెల్లిస్తేనే మిగతా నిర్మాణాలు పూర్తి చేస్తామని భీ ష్మించుక్కూర్చున్నారు. మరుగుదొడ్ల విషయంలో నూ అదే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ సొంత భ వనాలలో టాయిలెట్ల నిర్మాణం అంతంత మాత్రం గానే జరిగింది. ఆర్డబ్ల్యూస్ అధికారులు తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే నిర్మించి చేతులు దులుపుకు న్నారు. నాణ్యత లేని సామాగ్రిని ఉపయోగిం చారనే ఆరోపణలూ ఉన్నాయి. నేడు ఉన్నతాధికారుల సమీక్ష ఈ నెల 15 నుంచి అమలు కాబోతున్న ‘ఇందిరమ్మ అమృత హస్తం వన్ ఫుల్ మీల్’ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట, ఆర్జేడీ రాజ్యలక్ష్మి సోమవారం జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమావేశం కానున్నారు. అంగన్వాడీల పరిస్థితులపై ఆరా తీయనున్నారు. పూర్తి కాకుండా, ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న అంగన్వాడీ భవనాల గురించి చర్చించే అవకాశాలున్నా యని భావిస్తున్నారు. జడ్పీ కార్యాలయంలో ఉద యం 9.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి సీడీపీఓలు, సూపర్వైజర్లు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఐసీడీఎస్ పీడీ రాములు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనైనా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. -
అద్దె భవనాలే దిక్కు..
* అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు కరువు * అరకొర వసతులతో చిన్నారుల చిక్కులు * ఏళ్లు గడిచినా నిర్మాణ దశలోనే భవనాలు * పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్ టౌన్ : భావిపౌరుల భవిష్యత్కు అంధకారం పట్టుకుంది. బంధీఖానాలను తలపిస్తున్న భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం.. వెరసి ఏళ్ల తరబడి వేదన మిగులుతోంది. ఏళ్లుగా అంగన్వాడీలకు అద్దె భవనాలే దిక్కవడంతో చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 3,281 ఉన్నాయి. ఇందులో 2,534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 747 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 2010లో నాబార్డ్ పథకం కింద 184 అంగన్వాడీ కేంద్రాలు, 2013 సంవత్సరంలో ఏపీఐపీ పథకం ద్వారా 133 కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధులు విడుదలై ఐదేళ్లు గడుస్తున్నా ఆ పనులు ఇప్పటివరకు నిర్మాణ దశలోనే మగ్గుతున్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు కరువు... సౌకర్యాలు లేమితో అంగన్వాడీలు నిర్వహిస్తుండడంతో గర్భిణులు, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం గాలి, వెలుతురు కూడా సరిగా లేని గదుల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రాలకు రూ.750, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.200 చొప్పున అద్దె చెల్లించేది. అయితే ఏప్రిల్ నుంచి పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామాల్లో రూ.750లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టణాల్లో కొంత మంది మంచి భవనాలనే అద్దెకు తీసుకున్నారు. మరికొంత మంది పాత భవనాల్లోనే కొనసాగిస్తూ కొత్తవాటిలోకి మారినట్లు చూపుతున్నారు. భవనాలకు అద్దె చెల్లింపు విషయంలో కూడా నెలనెలా సక్రమంగా అందించిన సందర్భాలు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 500-600 అడుగుల విస్తీర్ణంలో మూడు గదులు, తాగునీరు, ఫ్యాన్, మరుగుదొడ్లు, ఆటస్థలం ఉండాలి. చిన్నారులను ఒక గదిలో ఇరుకుగా కూర్చోబెట్టడం, వంటగది, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫ్యాన్, కరెంట్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో చిన్నారులతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. 13 నెలల నుంచి అద్దె బకాయి.. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేట్ భవనాలకు సకాలంలో అద్దె చెల్లించడం లేదు. నెలల తరబడి ప్రభుత్వం పెండింగ్లో పెడుతుండడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. యజ మానుల ఒత్తిడితో కొంత మంది అంగన్వాడీలు తమ వేతనం నుంచి అద్దె చెల్లిస్తున్నారు. తక్కువ అద్దెనే చెల్లించలేని ప్రభుత్వం కొత్తగా పెంచిన అద్దె ఎలా ఇస్తుందని అందరి మదిలో నెలకొన్న ప్రశ్న ఇది. అంగన్వాడీ కార్యకర్తకు రూ.3,700 ఉండగా అద్దె రూ.3 వేలు ఎలా చెల్లిస్తారని వారు వాపోతున్నారు. 13 నెలలుగా కేంద్రాల అద్దె బకాయి ఉండడంతో అవస్థలు పడుతున్నారు. అద్దెలు పెంచడంతో ఆనందంలో మునిగిన కార్యకర్తలు నిబంధనలు చూసి నివ్వెరపోతున్నారు. అందుకే ఏడాది గడిచినా చాలా మంది ముందుకు రావడం లేదు. అధికారులు అడిగినప్పుడల్లా అదిగో.. ఇదిగో అంటూ తప్పించుకుంటున్నారు. ఇదేమిటని వారు ప్రశ్నిస్తే ఈ అద్దెకు ఎక్కడా భవనాలు దొరకడం లేదని చెబుతున్నారు. కొందరైతే పెంచిన అద్దెను పాత వాటికే చెల్లిస్తారని భావించామని అంటున్నారు. ప్రతిపాదనలు పంపించాం... - నారాయణ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. 2010లో 184 కేంద్రాలకు, 2013లో 133 కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. వాటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,281 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 2,534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భవనాల అద్దె నిధులు వచ్చిన వెంటనే చెల్లిస్తాం. -
హై రిస్క్ కాదు.. నోరిస్క్!
మెదక్ మున్సిపాలిటీ: గర్భిణులకు ఎటువంటి వైద్య సేవలనైనా క్షణాల్లో అందించేందుకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రం వల్ల ఈ ప్రాంత మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో గర్భిణులను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పంపించకుండా ఇక్కడే వైద్య సేవలందిస్తామని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఈ హైరిస్క్ ఆస్పత్రి పనితీరు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఎవరైనా అధికారులు ఈ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు మాత్రం కేంద్రంలో రిస్క్చేసి ఆపరేషన్లు చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న వైద్యు లు అత్యవసర సమయాల్లో గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్ల్లో హైదరాబాద్కు తరలిస్తున్నారు. వీరిని 108లో పంపించాలంటే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్ల్లో తరలిస్తున్నారు. చీటికి మాటికి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇబ్బందులు హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో తప్పుతాయని భావించిన గర్భిణులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. సోమవారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తండాకు చెందిన మాలి అనే గర్భిణి మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆమెకు రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స చేశారు. నెలలు నిండటంతో ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ప్రైవేట్ అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. హైరిస్క్ కేంద్రంలో ఆపరేషన్ చేయాలని బంధువులు కోరినప్పటికీ రక్తం అందుబాటులో లేదంటూ వైద్యులు ఆమెను హైదరాబాద్కు రెఫర్ చేశారు. అదే విధంగా మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన పుష్ప అనే గర్భిణిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కాగా ఈమెకు షుగర్ లెవల్ అధికంగా ఉండటంతో ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇబ్బందులు తలె త్తుతాయని, అందుకని హైదరాబాద్కు రెఫర్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. హైరిస్క్ వస్తే గర్భిణులకు అవస్థలు తప్పుతాయని, చీటికి మాటికి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి రాదని భావించామని పలువురు గర్భిణులు వాపోతున్నారు. ఈ మాత్రం దానికే హైరిస్క్ అంటూ లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటం చేయడం దేనికని గర్భిణులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. వసతులు లేవు: సూపరింటెండెంట్ సెంటర్లో అన్ని వసతులు లేక పోవడంతోనే గర్భిణులను హైదరాబాద్కు రెఫర్ చేయాల్సి వస్తుందని మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పీసీ శేఖర్ తెలిపారు. ఆస్పత్రిలో ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు తదితర వసతులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. -
మెటర్నిటీ ఆస్పత్రి వైద్యుల ర్యాలీ
పీజీలు, హౌస్ సర్జన్లు విధులకు దూరం ఆస్పత్రి వద్ద గర్భిణీల ధర్నా తిరుపతి అర్బన్ : స్థానిక మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాన్ని స్విమ్స్కు కేటాయించడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ ర్లు, భవన నిర్మాణ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలు సోమవారం 6వ రోజుకు చేరా యి. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్లు డాక్టర్ పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో రుయా, మెటర్నిటీ వైద్యులతో పాటు పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్లు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ చేపట్టారు. మెటర్నిటీ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీని డాక్టర్ భారతి ప్రారంభించగా బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద ముగిసింది. రుయా, మెటర్నిటీల్లో పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులను బహిష్కరించడంతో వేలాది మంది రోగులు, గర్భిణీలు అవస్థలు పడ్డారు. ఇందుకు నిరసనగా మెటర్నిటీ హాస్పిటల్ ఎదుట పలువురు గర్భిణీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్లు మాట్లాడుతూ సుమారు రూ.100 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించుకున్న భవనాలను పేదలకు కాకుండా ప్రైవేటు చేతుల్లో నిర్వహిస్తున్న స్విమ్స్కు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, సురేష్బాబు, గోపీకృష్ణ, విష్ణుభరద్వాజ్, భానుప్రకాష్, ప్రమోద్, మెటర్నిటీ, రుయా వైద్యులు పాల్గొన్నారు. -
‘మార్పు’ ఎక్కడ..?
రెండేళ్లుగా జిల్లాలో అమలు అయినా.. తగ్గని మాతా శిశు మరణాలు జిల్లాలో భయపెడుతున్న దారుణాలు మూడు నెలల్లో 14మంది గర్భిణులు మృతి అధికారులూ.. మారాలి మరి.. విజయవాడ : గత మే నెలలో మొవ్వ మండలం వక్కలగడ్డకు చెందిన బండారు లక్ష్మి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమె తీవ్ర బలహీనంగా ఉండటంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించి ఆపరేషన్ చేశారు. అనంతరం పరిస్థితి విషమించి మృతిచెందింది. గర్భిణీ సమయంలో పౌష్టికాహారం తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని నిపుణుల వాదన. పదిరోజుల కిందట ముదినేపల్లి పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా పనిచేసే శైలజ ప్రసవం కోసం వెళ్లగా, ఆమెకు చేసిన సిజేరియన్ వికటించి మృతిచెందింది. ఈ ఘటనలో ఆపరేషన్ చేసింది ప్రభుత్వ వైద్యురాలే కావడం గమనార్హం. తాజాగా గుడివాడకు చెందిన పావని ఎనిమిది నెలల గర్భంతో ప్రభుత్వాస్పత్రికి రాగా, ఆమెకు సకాలంలో చికిత్స అందక మృతిచెందింది. ఆమెకు బ్లడ్ ప్రజర్ ఎక్కువగా ఉన్నా.. ఆరోగ్య కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం వీరే కాదు.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లాలో దాదాపు 14మంది గర్భిణులు ఇలాగే మృతిచెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు జిల్లాలో రెండేళ్లుగా ‘మార్పు’ పథకం అమలుచేస్తున్నా ఎటువంటి ప్రయోజనం కనిపించట్లేదు. ఈ పథకం నిబంధనలు కచ్చితంగా అమలుచేయాల్సిన అధికారులు కాకి లెక్కలు వేస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో మాతాశిశువు మరణాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. దక్షిణ భారతదేశంలోనే మన రాష్ట్రం శిశువుల మరణాల్లో మొదటి స్థానంలో, మాతా మరణాల్లో రెండో స్థానంలో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రక్తహీనతే పెను సమస్య.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తున్న గర్భిణులు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరూ హిమోగ్లోబిన్ ఐదు, ఆరు గ్రాముల శాతంతో వస్తున్నారని వైద్యులే చెబుతున్నారు. అటువంటి వారికి ప్రసవం చేయడం కష్టంగా మారుతోందని, ఒక్కొక్కరికీ నాలుగు, ఐదు రక్తం బ్యాగ్లు ఎక్కించాల్సి వస్తోందంటున్నారు. అలాంటి వారికి పుట్టే శిశువులు తక్కువ బరువుతో ఉంటున్నారని, కొన్ని సందర్భాల్లో శిశు మరణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గర్భిణీ సమయంలో సరైన పోషకాహారం అందకపోవడం వల్లే ఇలా జరుగుతోందని పేర్కొంటున్నారు. ‘మార్పు’ పథకం లక్ష్యమైన పౌష్టికాహారం అందజేత అసలు అమలు కావట్లేదు. ఇప్పటికైనా ఆ పథకాన్ని అమలుచేసి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చే యాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు. లక్ష్యం.. నిర్లక్ష్యం.. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా 2012 అక్టోబర్లో మన జిల్లాలో మార్పు పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ఈ పథకంలో భాగంగా జిల్లాలో గర్భిణులను గుర్తించి, వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రసవం ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలి. కానీ, ఇలాంటి చర్యలు జిల్లాలో ఎక్కడా అమలు కావట్లేదు. సగానికిపైగా ఆరోగ్య కేంద్రాల్లో నెలకు పది కూడా ప్రసవాలు జరగట్లేదు. అంతేకాదు.. రెండు, మూడు పీహెచ్సీల్లో నెలలో ఒక్క ప్రసవం కూడా జరగట్లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మాతా శిశు మరణాలను ఎలా అరికట్టగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
మార్పు ఎక్కడ..?
⇒ఏటా వేలసంఖ్యలో ప్రసవ మరణాలు ⇒అధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే.. ఆసుపత్రుల వివరాలు జిల్లాకేంద్ర ఆసుపత్రి 01 ఏరియా ఆసుపత్రులు 06 పీహెచ్సీలు 85 ఆరోగ్య ఉపకేంద్రాలు 675 క్లస్టర్లు 19 పాలమూరు: మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా.. ఆచరణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రతి ఏడాదీ పొత్తిళ్లలోనే వెయ్యిమంది శిశువులు చనిపోతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఏ మాత్రం ‘మార్పు’ కనిపించడం లేదు. గర్భిణులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రసవ మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ తేడాది ‘మార్పు’ పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకోసంఅంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు బలవర్థకమైన ఆహారం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నెలవారీ పరీక్షలు, టీకాలు ఇస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద 2007నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయినా మాతాశిశు మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో ఏటా వెయ్యి వరకు శిశుమరణాలు నమోదవుతున్నాయి. మాతృమరణాల్లో మాత్రం 30చొప్పున నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంలో వైద్యసిబ్బంది విఫలమవుతోంది. గర్భిణులకు, బాలింతలకు తగిన సూచనలు, సలహాలు కూడా అందడం లేదు. పీహెచ్సీలకు వస్తున్న వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ఒకరిద్దరు వచ్చినా రికార్డుల్లో పదుల సంఖ్యలో గర్భిణుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు 25శాతం మంది కూడా రావడంలేదు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ఎవ రూ రావడం లేదు. జిల్లాలో స్త్రీ వైద్య నిపుణుల కొరత! జిల్లావ్యాప్తంగా ఏటా 6.50లక్షల మంది గర్భవతులు.. బాలింతలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం ప్రతి 10వేల మందికి ఓ స్త్రీ వైద్య నిపుణులు ఉండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూస్తే జిల్లాలో స్త్రీ వైద్య నిపుణులు 65మంది ఉందాలి. కానీ, జిల్లా వ్యాప్తంగా కేవలం 25మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సర్కారు దవాఖానాల్లో మరో 40మంది స్త్రీ వైద్య నిపుణులను భర్తీ చేయాల్సి ఉంది. ‘మార్పు’పై మరింత దృష్టి మాతాశిశు మరణాలు తగ్గించడానికి మార్పు కార్యక్రమం అమలవుతోంది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉన్నవారికి లక్ష్యాలు నిర్ధేశిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్బిణీని తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచిస్తున్నాం. మాతాశిశు మరణాలను నివారించడానికి జిల్లా అధికారుల సూచనలను పాటిస్తున్నాం. - సరస్వతి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ మరణాలకు కారణాలివే.. ⇒జిల్లాలో గర్భిణులకు సేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్త్రీ వైద్యనిపుణులు లేకపోవడంతో సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. ⇒మాతాశిశు మరణాల్లో 50 శాతం రక్తహీనతతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యశాఖ అధికారుల అంచనా. ⇒బాల్యంలో పెళ్లిళ్లు, పౌష్టికాహార లోపం తదితర దుష్ర్పభావాలకు గురవుతున్నారు. ⇒ప్రసవ సమయంలో తల్లికి స్త్రీవైద్య నిపుణురాలు, బిడ్డకు పిల్లల వైద్యనిపుణుల సేవలు అవసరం. జిల్లాలో ఈ సేవలు సక్రమంగా ⇒అందటంలేదు. సర్కారు ఆస్పత్రుల్లో జన్మిం చిన శిశువులను నేరుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పిల్లల వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్తున్నారు. -
మాతృత్వంతోనే ఆడ జన్మ సార్థకం...
బెంగళూరు : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వివిధ సంస్థలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించాయి. అందులో భాగంగా బన్నేరుఘట్ట రోడ్డులోని ఫోర్టిస్ ఆస్పత్రిలో గల ‘ది నెస్ట్’ ప్రసూతి కేంద్రంలో మాతృత్వ సంబరాలను జరిపారు. ‘బెస్ట్ ఆఫ్ ది నెస్ట్’ పేరిట భావి తల్లులకు పోటీలను నిర్వహించారు. తమలోని ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించడం, ర్యాంప్ వాక్, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు హాస్యభరిత కార్యక్రమాలను నిర్వహించారు. ‘గర్భధారణ సమయంలో మహిళలు అనేక మానసిక, శారీరక, హార్మోన్ల మార్పులకు గురవుతుంటారు. బిడ్డ ఉత్తమ భవిష్యత్తు కోసం భావి తల్లి ఆరోగ్య, మానసిక స్థితి ఉత్తమంగా ఉండాలని అనేక పరిశోధనలు తేల్చాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల వారిలోని మానసిక ఒత్తిడిని బాగా తగ్గించవచ్చు. వారు సంతోషంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందించాం’ అని ఆస్పత్రి డెరైక్టర్ కార్తిక్ రాజగోపాల్ తెలిపారు. ఫ్యాషన్ షో, ప్రశ్నోత్తరాలతో పాటు ‘తమాషాగా ఉండే భావి తల్లి’, ‘తెలివైన భావి తల్లి’ లాంటి పోటీలను నిర్వహించారు. రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించి అందులో ఉపయోగించిన పదార్థాల పేర్లు, వాటి స్పెల్లింగ్ పోటీలను సైతం నిర్వహించారు. మొత్తానికి మహిళా దినోత్సవ సాయంత్రాన్ని కాబోయే తల్లులు ఆహ్లాదంగా గడిపారు. -
‘అధ్వాన’హస్తం
సాక్షి, కొత్తగూడెం: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం అభాసుపాలవుతోంది. ఈ పథకం అమలుతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా ఖమ్మం, కొత్తగూడెం పరిధిలో అర్బన్ ప్రాజెక్టులున్నాయి. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర రూరల్ తో పాటు ఏజెన్సీలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రాజెక్టుల పరిధిలోనే గత ఏడాది నుంచి అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 49,146 మందికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి. కానీ పథకంలో పేర్కొనట్లుగా ఏ అంగన్వాడీ కేంద్రంలోనూ పూర్తిస్థాయిలో మెనూ అమలు కాకపోవడం గమనార్హం. రోజుకు 200 మిల్లీలీటర్ల పాలు, వారానికి నాలుగు రోజులు గుడ్డు అందించాలని మెనూలో పేర్కొన్నారు. పథకం ప్రారంభం నుంచి చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు పంపిణీ చేయడం లేదు. కొన్ని కేంద్రాల్లో వారం, పదిరోజులు మాత్రమే పాల పంపిణీతో సరిపెడుతున్నారు. అసలు మెనూలో పాల పంపిణీ కూడా ఉందని గర్భిణులు, బాలింతలకే తెలియదు. స్థానికంగా పాల కొరత ఉందని అందుకే పంపిణీ చేయలేకపోతున్నామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. కోడి గుడ్డు వారానికి రెండు రోజులే ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలకు పదిహేను రోజులుగా గుడ్డు సరఫరానే లేదు. ఇదేమని బాలింతలు అడిగినా తమకే సరఫరా లేదని అంగన్వాడీ టీచర్లు చెబుతుండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు. ఏజెన్సీలో మరీ అధ్వానం... ఏజెన్సీలో ‘అమృతహస్తం’ అమలుతీరు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ గర్భిణులు, బాలింతలు 36,858 మంది వరకు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా అమృతహస్తం మెనూ అందడం లేదు. పోషకాహార లోపం వల్ల ఏజెన్సీలోని గిరిజన మహిళలకు రక్తహీనత వస్తోంది. అమృతహస్తం పథకం ప్రకారం పప్పు, పాలు, ఆకు కూరలు, ఆయిల్ తప్పకుండా ఇస్తేనే వీరి ఆరోగ్యం కొంతైనా మెరుగుపడేది. పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం నాసిరకం పప్పు, ముతక బియ్యం, వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. మెనూలో సూచించిన ప్రకారం కాకుండా తక్కువ మోతాదులో పప్పు, నూనె అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లోనే వీటిని వడ్డించి పెట్టాల్సి ఉండగా కొన్ని కేంద్రాల్లోనే వండి పెడుతుండగా మిగిలిన కేంద్రాల్లో కొద్ది మొత్తంలో పంపిణీ చేసి అంగన్వాడీ టీచర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి.. నాణ్యతకు తూట్లు.. అమృతహస్తం పథకంలో పప్పు, నూనె, గుడ్లు అంతా కాంట్రాక్టర్లే సరఫరా చేయాలి. కానీ వీరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని నాసిరకమైన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పప్పు పుచ్చిపోయి ఉండటంతో గర్భిణులు, బాలింతులు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నూనె పరిస్థితి కూడా ఇంతే. చిన్నగుడ్లు సరఫరా చేసి పెద్దగుడ్లకు బిల్లు చేస్తున్నట్లు సమాచారం. గుడ్లలోనూ నాణ్యత ఉండటం లేదని అంగన్వాడీ టీచర్లే చెబుతుండటం గమనార్హం. పథకం ప్రారంభంలో వస్తువుల్లో నాణ్యత ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలోపించడమే కాకుండా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. కోట్లు మంజూరు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకం లబ్ధి గర్భిణులు, బాలింతలకు అందకపోవడం శోచనీయం. -
ఆందోళనకర స్థాయిలో గర్భిణుల మరణాలు
పింప్రి, న్యూస్లైన్: గర్భిణుల మరణాల సంఖ్య పెరగడంపై పుణే నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అఖిల భారత ప్రసూతి విభాగం (ఎంఎంఆర్) గత నవంబర్ వరకు అందజేసిన వివరాలు ఆందోళనకర విషయాలను వెల్లడించాయి. సరైన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోకపోవడమే గర్భిణుల మరణాలకు ప్రధాన కారణమని తేలింది. గత ఏడాది పుణే జిల్లావ్యాప్తంగా 104 మంది గర్భిణులు మరణించారని వెల్లడయింది. పింప్రి-చించ్వాడ్లో 60 మంది గర్భిణులు మరణించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మృతుల సంఖ్య అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి మహిళలు గర్భం సమయంలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం, పోషకాహారానికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం ఈ దుస్థితికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. నిపుణులు సూచించిన మేరకు గర్భిణులు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోకపోవడంతో వారి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది. పింప్రిలోని యశ్వంత్రావ్ చవాన్ ఆస్పత్రిలో ఖేడ్, రాజ్గురునగర్, చకణ్ ప్రాంతాల్లో గర్భిణుల మరణాలను నిరోధించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ అనిల్ రాయ్ తెలిపారు. అయితే 2011-12తో పోల్చితే పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో 2012-13 నవంబర్ వరకు గర్భిణుల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2011-12లో 15 మంది గర్భిణులు మృతి చెందగా, 2012-13లో 28 మంది మరణించారు. పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్ పరిధిలో 27 ఆస్పత్రులు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని ఆస్పత్రుల్లో సమీప గ్రామాల గర్భిణులు చేరేందుకు చర్యలు తీసుకోవడం, వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని రాయ్ అన్నారు. రక్తస్రావం, రక్తపోటు, ఇన్ఫెక్షన్ల వల్ల వంటి సమస్యలు గర్భిణుల మరణాలకు కారణమవుతున్నట్టు అఖిల భారత ప్రసూతి విభాగం అధ్యయనంలో తేలింది. -
కలుషిత రక్తంతో బాలింతకు హెచ్ఐవీ
సాక్షి, హైదరాబాద్: కలుషిత రక్తం సరఫరా చేయటంతో హెచ్ఐవీ బారిన పడిన ఓ మహిళకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ను రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నాలుగు వారాల్లోపు బాధిత మహిళకు డబ్బు అందచేయాలని నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ను ఆదేశిస్తూ వినియోగదారుల ఫోరం ప్రిసైడింగ్ అధికారి ఆర్.లక్ష్మీనరసింహారావు, సభ్యులు భుజంగరావు, టి.అశోక్కుమార్లతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. కొంతకాలం కిందట నెల్లూరులో కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు నుంచి కొనుగోలు చేసిన రక్తం ఎక్కించగా.. దాని ద్వారా ఆమెకు హెచ్ఐవీ సోకింది. దీనిపై ఆమె ఫోరంను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయానికి రూ.95 లక్షల మేర పరిహారం చెల్లించాలని కోరింది. -
కాసులిస్తేనే..కాన్పు
గిద్దలూరు, న్యూస్లైన్: నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. గిద్దలూరు ఏరియా వైద్యశాలలో ఈ దందా మరీ ఎక్కువైంది. కాన్పు కోసం వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తే రూ. 3 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని వేధిస్తున్నారు. గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు వైద్యశాలకు వస్తే వారి వద్ద నుంచి వైద్యశాల మరమ్మతులంటూ డొనేషన్ల రూపంలో నగదు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రాచర్ల మండలం చినగానిపల్లెకు చెందిన నర్ల వెంకటేశ్వరరెడ్డి తన భార్య సుజాతను ఈనెల 6న కాన్పు చేయించేందుకు గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడ సాధారణ కాన్పు కాకపోవడంతో వైద్యుడు సూరిబాబు ఆపరేషన్ చేశారు. ఆ వెంటనే డాక్టర్ సాయి ప్రశాంతి కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేశారు. బుధవారం సుజాతను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇంటికెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ కోసం వైద్యుల వద్దకు వెళ్లగా, అందుకు వారు రూ. 3 వేలు ఇవ్వాలని చెప్పడంతో కంగుతింది. ఎందుకివ్వాలని ఆమె బంధువులు ప్రశ్నిస్తే డాక్టర్ గారికి స్టెతస్కోప్ కొనుగోలు చేయాలని సిబ్బంది చెప్పడం విశేషం. ఆపరేషన్ చేసే ముందు సిబ్బందికి ఎగ్పఫ్, స్ప్రైట్, 5 లీటర్ల డీజల్ తీసుకురావాలని వైద్యులు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇచ్చామని బాధితుడు వెంకటేశ్వరరెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపాడు. నగదు ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని చెప్పడంతో స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మధ్యాహ్నం వరకు ఉంచుకుని వారం తర్వాత రావాలని చెప్పి పంపారని బాధితులు తెలిపారు. ఈ సమస్య ఒక్క వెంకటేశ్వరరెడ్డి దంపతులదే కాదు..ఇక్కడికి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. వైద్యశాలలో రోజూ తమ నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకుంది. ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఒకరు రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఆమెకు లేని రోగం ఉందని అందరికీ చెప్పింది. దీంతో ఆ మహిళ నాలుగు రోజులుగా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. పేదల కోసం నిర్మించిన వైద్యశాలలో ఇలా నగదు దండుకోవడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసరం కోసం డీజిల్ తెప్పించాం... స్థానిక వైద్యశాల సూపరింటెండెంట్ సూరిబాబును నగదు వసూళ్ల గురించి ప్రశ్నించగా వైద్యశాలకు నిధుల కొరత ఉండటంతో అత్యవసరం కోసం డీజిల్ తెప్పించుకుంటున్నామని, నగదు తీసుకోవడం లేదని చెప్పారు. వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త దుర్గాప్రసాద్ను వివరణ కోరగా లేని రోగం ఉన్నట్లు చెప్పిన స్వీపర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు నగదు వసూలు గురించి తెలుపగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందితే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి
కొత్తూరు, న్యూస్లైన్: ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన కొత్తూరు మండలంలోని కర్లెమ్మ పంచాయతీ పరిధి నేతాజీ నగర్ కాలనీలో జరిగింది. పురిటినొప్పులు రావడంతో ఎన్ఎన్ కాలనీకి చెందిన గర్భిణి కుమ్మరి లక్ష్మి (26) నాన్నమ్మ పున్నమ్మతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీ వైద్యులు శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి వైద్యం అందించారు. సుమారు మూడు గంటలైనప్పటికీ ప్రసవం కాకపోవడంతో పాటు, ఒక్కసారి బీపీ తగ్గడంతో గర్భిణి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. అయితే మార్గ మధ్యం గొయిది సమీపంలో గర్భిణి చనిపోయినట్టు లక్ష్మి బంధువులు తెలిపారు. మృతి చెందిన లక్ష్మికి భర్త లక్ష్మినారాయణ, కుమారుడు ప్రసాద్లు ఉన్నారు. భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉపాధి కోసం చెన్నై వలస వెళ్లారు. లక్ష్మి గర్భిణి కావడంతో అత్త జడ్డమ్మతో ఇంటి వద్ద ఉంటుంది. అయితే స్థానిక ఆస్పత్రిలో స్త్రీవైద్య నిపుణులను నియమించక పోవడంతో ఈ ప్రాంతానికి చెందిన గర్భణిలకు సకాలంలో వైద్యం అందక పలు అవస్థులు పడుతున్నారు. ప్రసవాలు సమయంలో మెరుగైన వైద్యం కోసం 30 కిలో మీటర్ల దూరంలోని పాలకొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఐటీడీఏ పాలకవర్గం కూడా ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. మార్పు పేరుతో మాతా శిశుమరణలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నెలా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంది. కానీ అవసరమైన చోట స్త్రీవైద్య నిపుణులు నియమించకుండా మాతా శిశుమరణాలు తగ్గిచండ అసాధ్యమే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఆస్పత్రిలో స్త్రీవైద్య నిపుణులును నియమించాలని పలువురు కోరుతున్నారు. లక్ష్మి బీపీ ఒక్కసారి తగ్గడంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ పంపించినట్టు వైద్యుడు శ్రీనివాసరావు తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు, చిన్న పిల్లలు వైద్యల కోసం నోటిషికేషన్లు వేసినా అభ్యర్థులు ముందుకు రావడం లేదని ఆస్పత్రి పర్యవేక్షకులు కృష్ణమోహన్ తెలిపారు. -
వైద్యంపై వివాదం: కాన్పు కోసం వెళ్తే.. కాదుపొమ్మన్నారు
గద్వాల, న్యూస్లైన్: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం జరిగిందని చెబుతున్న ఓ సంఘటన వివాదస్పదమైంది. కాన్పు కోసం వెళితే వివక్షతో వైద్య సేవలను నిరాకరించారని బాధితులు పేర్కొనగా.. వారు ఆస్పత్రికే రాలేదని అధికారులు చెబుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, తిరుమలేష్ భార్యాభర్తలు. నిండు గర్భిణీ అయిన గోవిందమ్మ భర్తతో కలిసి సోమవారం ఆటోలో కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. ‘తెలంగాణ వారికి మేం వైద్యం చేయం. మీరు మీ ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లండి’అని పంపించారని గోవిం దమ్మ భర్త తిరుమలేష్ చెప్పాడు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కాళ్లావేళ్ల్లా పడినా కనికరించలేదని వాపోయారు. అనంతరం తాము అక్కడి నుంచి ప్యాసింజర్ రైలులో తిరిగి గద్వాలకు సాయంత్రం చేరుకున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో గోవిందమ్మ వైద్యసాయం పొందుతోంది. ఈ విషయం ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసిన స్థానిక న్యాయవాదులు చంద్రమోహన్, మౌలా, రమేష్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరును ఖండిం చారు. ఈ ఘటనపై కర్నూలు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్ను వివరణ కోరగా..గోవిందమ్మ పేరుతో సోమవారం గైనిక్ వార్డుకు ఎవరూ రాలేదని, ఓపీలో కూడా పేరు నమోదు కాలేదని వివరించారు. ఈ విషయమై అవసరమైతే మంగళవారం విచారణ చేయిస్తామని అన్నారు.