Preity zinta
-
రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?
ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్చాట్ (ఆస్క్ మీ ఎనీథింగ్) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.రాహుల్ తప్పు లేదుఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు. ఎవరో చేసిన పనికి రాహుల్ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలుకాగా ఇటీవల కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. కంగనాను నమ్ముతున్నానుఅలాగే మన దేశంలోని సోషల్ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్ ఐకాన్. ఇప్పటివరకు డైరెక్టర్గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. హిమాచల్ ప్రదేశ్వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది. I don’t think it’s fair to vilify anyone like that, as he is not responsible for someone else’s actions. I believe in handling problems or issues directly & not through proxy battles. I also have no problem with Rahul Gandhi, so let him live in peace & I will live in peace too 😀 https://t.co/LAAGOdOJri— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025 చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్కు ఆశ్చర్యపోయిన నటి -
నాపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు.. సిగ్గనిపించడం లేదా: ప్రీతి జింటా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్ అయ్యారు.'నా సోషల్మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్కు నేను రియాక్ట్ అవను. కానీ, భవిష్యత్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్లో ప్రితీ జింటా లోన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్లో జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్గా పనిచేస్తున్న హితేష్ మెహతా రూ.122 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది. -
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్స్టర్స్తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్ను అండర్వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్ఫోన్కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్వరల్డ్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్లో తన భర్త జీన్ గూడెనఫ్తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్కింగ్స్ కో ఓనర్గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్ఫుల్గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..) -
సల్మాన్తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా
ఆన్స్క్రీన్ జంటల్ని జనాలెంతగానో ఇష్టపడతారు. రియల్ లైఫ్లోనూ ఆ హీరోహీరోయిన్లు జంటగా ఉంటే బాగుంటుందని ఆశపడతారు. కొందరైతే వారి మధ్య స్నేహాన్ని కూడా ప్రేమ అని ప్రచారం చేస్తుంటారు. అలా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), హీరోయిన్ ప్రీతి జింటా కూడా లవ్లో ఉన్నారని అప్పట్లో బోలెడు రూమర్స్ వచ్చాయి. ఇన్నాళ్లకు దానిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్.ఎంతో ప్రేమిస్తున్నా..డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే సల్మాన్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫోటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్ చేస్తూ ఉంటాను అంటూ సల్మాన్తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అని అడిగాడు. హీరోతో లవ్?అందుకు ప్రీతి జింటా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపింది. అలాగే తన భర్తకు కూడా మంచి స్నేహితుడని, తనకు కుటుంబసభ్యుడిలాంటివాడని చెప్పింది. మీరెంత ఊహించుకున్నా ఇదే నిజం అని రిప్లై ఇచ్చింది. కాగా సల్మాన్- ప్రీతిజింటా.. హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్నే జిసే ఆప్నా కహా, జాన్ ఎ మన్, హీరోస్, ఇష్క్ ఇన్ పారిస్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రీతి తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్గా మెరిసింది. Happy Burrday @BeingSalmanKhan 🎂Just wanna say I love you the mostest 🥳 Rest will tell you when I speak to you ….. and yes we need more photos otherwise I will keep posting the same old ones ! Ting 💕 pic.twitter.com/XLVHxTIFY6— Preity G Zinta (@realpreityzinta) December 27, 2024 No not at all ! He is family & my closest friend and my husband’s friend too .. just in case you were wondering 🤣🤣 Sorry ! Couldn’t resist 👼— Preity G Zinta (@realpreityzinta) December 28, 2024 చదవండి: గేమ్ ఛేంజర్ టీమ్కు అభిమాని వార్నింగ్.. 'ఆ పని చేయకపోతే చస్తా!' -
ఇటు కావ్యా మారన్, ప్రీతి జింటా.. అటు నీతా అంబానీ, జూహీ చావ్లా.. వేరే లెవల్! (ఫొటోలు)
-
తగ్గేదేలే!.. అతడి కోసం.. పోటీ పడ్డ కావ్యా- ప్రీతి.. ట్విస్ట్ అదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 తొలిరోజు మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం నాటి వేలంపాటను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక మొదటి రోజు ఫ్రాంఛైజీలు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరికోసం తమ పర్సుల నుంచి ఓవరాల్గా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.ప్రత్యేక ఆకర్షణగా ఆ ముగ్గురుఇదిలా ఉంటే.. ఎప్పటిలాగానే ఈసారీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో తమ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టిపోటీనిచ్చారు.అందుకు కారణం మాత్రం కావ్యానే!ఈ నేపథ్యంలో కావ్యా మారన్- ప్రీతి జింటా ఓ ఆటగాడి కోసం తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా ధర పెంచుతూ పోవడం హైలైట్గా నిలిచింది. అయితే, ఆఖరికి కావ్యా తప్పుకోగా.. సదరు ప్లేయర్ ప్రీతి జట్టు పంజాబ్కు సొంతమయ్యాడు. కానీ.. పంజాబ్ ఇందుకోసం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. అందుకు కారణం మాత్రం కావ్యానే!ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరా అంటారా?.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్దీప్ సింగ్. నిజానికి ఈ పేస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సైతం రంగంలోకి దిగాయి.రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారాఅయితే, ఊహించని రీతిలో రేసులోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ అర్ష్దీప్ ధరను ఏకంగా రూ. 15.75 కోట్లకు పెంచింది. దీంతో మిగతా ఫ్రాంఛైజీలు పోటీ నుంచి తప్పుకోగా.. ఆక్షనీర్ మల్లికా సాగర్.. పంజాబ్ తమ పాత ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంటుందేమో అడిగారు.ఇందుకు సమ్మతించిన పంజాబ్ అర్ష్దీప్నకు అంతే మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అయినా కావ్యా మారన్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా రెండున్నర కోట్ల మేర పెంచింది. అయితే, పంజాబ్ మాత్రం అర్ష్దీప్ను వదులుకోలేకపోయింది. ఫలితంగా ఫైనల్గా సన్రైజర్స్ వేసిన బిడ్కు సమానంగా రూ. 18 కోట్లు చెల్లించి అర్ష్దీప్ను సొంతం చేసుకుంది.క్యాష్ రిచ్ లీగ్లో రూ. 18 కోట్ల భారీ ధరఫలితంగా అర్ష్దీప్నకు వేలంలో సరైన విలువ, తగిన జట్టు లభించాయి. వరుసగా ఆరు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్కే అతడు వచ్చే సీజన్లో ఆడనున్నాడు. అంతేకాదు.. క్యాష్ రిచ్ లీగ్లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత తొలి ఆటగాడిగా అర్ష్దీప్ నిలిచాడు. ఏదేమైనా కావ్యా.. ప్రీతితో పోటీపడటం వల్ల అర్ష్దీప్పై కోట్ల వర్షం కురిసిన మాట వాస్తవం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..! -
పిల్లల కోసం ఆ ట్రీట్మెంట్.. విపరీతమైన బాధ అనుభవించా : ప్రీతి జింటా
సినీ తారల జీవితం బయటకు చూడడానికి అద్దాల మేడలా కనిపిస్తుంది. ఒక్కసారి లోపలికి తొంగి చూస్తే కనిపించేదంతా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బయటకు చెప్పుకోలేని సమస్యలు తారలను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. అయితే ఇవేవి తమ అభిమానులకు తెలియజేయకుండా..తమ నటనతో వారిని అలరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి ప్రీతీ జింటా కూడా నిజ జీవితంలో చాలా కష్టాలు పడినా.. వెండితెరపై మాత్రం మహారాణిలా నవ్వుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయట. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయం గురించి వెల్లడిస్తూ..తల్లి అయ్యేందుకు పడిని బాధలను షేర్ చేసుకుంది. ‘అందరి జీవితాల్లో లాగే నా లైఫ్లో కూడా మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. నిజ జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాలా సార్లు కష్టపడ్డాను. ముఖ్యంగా పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పడు చాలా బాధను అనుభవించాను. కొన్నిసార్లు తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదాన్ని. కానీ ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. దీంతో చివరకు సరోగసి ద్వారా తల్లినయ్యాను’ అని ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ను ప్రీతి జింటా వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘లాహోర్: 1947’లో ప్రీతి కీలక పాత్రను పోషిస్తోంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ తన బ్యానర్లో నిర్మిస్తున్నాడు. -
పంజాబ్ కింగ్స్లో విభేదాలు.. కోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాంచైజీలో ముసలం చోటు చేసుకుంది. ఆ జట్టు యజమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్ పాల్ అనే వ్యాపారవేత్తకు ఉంది. అయితే అత్యధిక వాటా కలిగిన బర్మన్.. తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సహయాజమని అయిన బర్మన్ షేర్లను విక్రయించకుండా అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై ఆగస్టు 20న హైకోర్టులో విచారణ జరగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా అంతర్గత ఒప్పందాల ప్రకారం.. ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాల్సిందే. అయితే బర్మన్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కినట్లు వినికిడి. కాగా ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ ప్రతినిథులు నుంచి మాత్రం ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ మాత్రం కొట్టిపారేశాడు. "తన షేర్లను విక్రయించే ఆలోచన లేదు" అని క్రిక్బజ్తో బర్మన్ పేర్కొన్నాడు. -
25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న రాజకుమారుడు మూవీ..
-
నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది. 'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి నా షూటింగ్ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
కేన్స్ రెడ్కార్పెట్పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా!
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ రకాల సెలబ్రిటీలు, ప్రముఖులు విభిన్నమైన డిజైనర్వేర్ దుస్తులతో సందడి చేశారు. కానీ అస్సాం నటి, వ్యాపారవేత్త భారతీయ సంప్రదాయ చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి సరసన బాలీవుడ్ నటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా కూడా చేరింది ఆమె కూడా దేశీ ష్యాషన్ రూట్నే సెలక్ట్ చేసుకుంది. చాలా విరామం తర్వాత ఈ 77 ఫ్రాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై మెరిసింది. ఆమె ఈ చీరలుక్లో లేత గులాబీలా అందంగా కనిపించింది. డిజైనర్ సీమా గుజ్రాల్ చేతిలో రూపుదిద్దుకున్న ఓండ్రే పింక్ సీక్విన్ జార్జెట్ చీరలో అద్భుతంగా కనిపించింప్రీతి. ఈ చీరపై చక్కటి ముత్యాలు, సీక్విన్, బీడ్వర్క్ ఉన్నాయి. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్తో జత చేయబడింది. ఈ చీర ధర ఏకంగా రూ. 118,000/. ఈ వేడుకలో ప్రీతి జంటా తన అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది. ఈ స్టైలిష్ మిలీనియల్ చీరకు తగ్గట్టుగా స్లీవ్లెస్ వి నెక్ బ్లౌజ్ మంచి లుక్ తెచ్చిపెట్టింది ఆమెకు. వాటన్నింటకీ అనుగుణంగా కర్లీ హెయిర్ని వదులుగా ఉంచడం ఓ డిఫెరెంట్ లుక్ తెప్పించింది ప్రీతికి. అంతేగాదు ఆమె ఈ కేన్స్లో ఇంతలా సింప్లిసిటీగా రెడీ అయ్యి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసినా..ఆమె స్టన్నింగ్ లుక్ అందర్నీ చూపుతిప్పుకోనివ్వ లేదు. ఇద వేడుకలో మరో డిజైన డ్రెస్లో కూడా కనిపించింది. ఈ ఈవెంట్లో తొలి ప్రదర్శనలో పెళ్లి కూతురు మాదిరి నైరా బ్రైడల్ గౌనులో మెరిసింది. దీని ధర ఏకంగా రూ. 5,57,600/-. ఇక ప్రీతీ కేన్స్ వేడుకలో మాట్లాడుతూ..ఇది అద్భుతమైనది. ఈ కేన్స్ వేడుకలతో తనకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాను మళ్లీ మూవీస్లోకి రీ ఇంట్రీ ఇచ్చానని, ఇది తనకు సినీ జీవితంలో సెకండ్ లైఫ్ అని అన్నారు. అందువల్లే తాను సంతోష్తో కలిసి లాహోర్ 1947లో నటించానని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన అవార్డను రాజ్కుమార్ సంతోష్కి అందించే అవకాశం తరకు లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు కాదు, తొలి ఆసియా వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్పగా భావిస్తున్నానని అన్నారు ప్రీతి. కాగా, బాలువుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన ప్రీతి జింటా నటించిన తొలి చిత్రం దిల్ సే(1998) మూవీకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు రాజ్కుమార్ సంతోష్. ప్రేక్షకుల ముందుకు రానున్న పీరియాడికల్ డ్రామా లాహోర్ 1947 కోసం రాజ్కుమార్ సంతోషితో మరోసారి కలిసి పనిచేశారు.(చదవండి: ‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!) -
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
దిల్ చాహ్త హై సినిమాలో హీరో సైఫ్ అలీ ఖాన్ గర్ల్ఫ్రెండ్గా నటించి క్లిక్కయింది నటి సుచిత్ర పిళ్లై. హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె మొదట హాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. ఈమె గతంలో పవన్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తర్వాత లార్స్ జెల్డ్సెన్ను రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించింది.ప్రేమించిన మూడు రోజులకే'ఓ పెళ్లిలో పవన్ మాలిక్ను కలిశాను. అక్కడే ఇద్దరం ప్రేమించుకున్నాం.. మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చి అందరికీ తన గురించి చెప్పి ఒప్పించాడు. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 20 ఏళ్ల వయసులోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టాను. తనతో కలిసి లండన్లోనే ఉండేదాన్ని. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నామో అంతే త్వరగా విడిపోయాం. ఏడాది తిరిగేసరికి మా మధ్య గ్యాప్ వచ్చింది. పైకి మాత్రం బాగున్నట్లు కనిపించాం. పెళ్లయిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నాం.వేరేవాళ్ల ప్రియుడిని ఎత్తుకుపోతానా?నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాక ఆండ్రూ కోయిన్ను ప్రేమించాను. అతడికి అప్పటికే మోడల్ అచ్ల సచ్దేవ్తో బ్రేకప్ జరిగింది. దానికి నన్ను బాధ్యురాలిని చేశారు. వారి బ్రేకప్కు, నాకు సంబంధమే లేదు. అలాగే 2005లో లార్స్ జెల్డ్సెన్తో నా రెండో పెళ్లి జరిగింది. అప్పుడు నాపై బాయ్ఫ్రెండ్ స్నాచర్ అని ట్యాగ్ వేశారు. ఎవరినీ విడగొట్టలేదులార్స్ నాకు పరిచయమయ్యే సమయానికే అతడు, హీరోయిన్ ప్రీతిజింటా ప్రేమించుకున్నారు, బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. నేను వారిద్దరి మధ్యలోకి వెళ్లలేదు. అప్పటికే వాళ్లు ఏదో కారణంతో విడిపోయారు. ఆ తర్వాతే నాకు అతడు పరిచయమయ్యాడు, ప్రేమించుకున్నాం. అంతేకానీ నేనెవరినీ విడగొట్టలేదు' అని చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. ఫస్ట్లో.. -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రిలీ రొసోవ్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్ కింగ్స్కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 28 పరుగుల తేడాతో సామ్ కరన్ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా ఐపీఎల్లో వరుసగా ఆరోసారి సీఎస్కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్-2024లో మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్ మొదలుపెట్టిన తలా.. పంజాబ్తో పోరుకు ముందు ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్లో ఈ ఫీట్ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోని హర్షల్ పటేల్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్ కాగానే సీఎస్కే ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్కేతో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(21 బంతుల్లో 32), వన్డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్ సింగ్(30), సామ్ కరన్(7), అశుతోశ్ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్కే పంజాబ్ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’ పోరులో తామే ‘సూపర్’ అనిపించుకుంది.Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024 -
ప్రీతి ఈజ్ బ్యాక్
ఆరేళ్ల తర్వాత సినిమా సెట్స్లోకి అడుగుపెట్టారు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని లొకేషన్స్ లో ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు ప్రీతీ జింటా.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తుండటంతో ఆమె అభిమానులు ‘ప్రీతి ఈజ్ బ్యాక్’, ‘ప్రీతి రిటర్న్స్’ అంటూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..!
దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్కు లాక్ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్ఘడ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది. శశాంక్ను పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది. Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, పంజాబ్ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్ను 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్ వేలంలో శశాంక్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్ అయిపోయారు. -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్ఫామ్ ఇండెక్స్టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్మెంట్ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి, అతని భార్య షబానా బాజ్పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్తో ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్లను దక్కించుకుంది. -
ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్
ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్ పెట్టిన కండీషన్ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్కు చూపించుకో' అని కౌంటర్ ఇచ్చింది. సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది. (చదవండి: ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. పవన్ 'బ్రో'పై థమన్ సీరియస్ కామెంట్స్) -
ట్రాక్లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 56 పరుగులు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ పోరాటం 201 పరుగుల వద్ద ముగిసింది. అయితే పంజాబ్ తరపున 33 బంతుల్లో 66 పరుగులు చేసిన అథర్వ తైదే మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ఎడిషన్ నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) టైటిల్ కోరిక మాత్రం నెరవేరలేదు. మరి ఈసారైనా పంజాబ్ కింగ్స్ టైటిల్ కొట్టి ప్రీతి జింటా కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి. తాజాగా స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతి గతంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ జట్టు ప్లేయర్ల కోసం 120 పరోటాలు చేసినట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటారన్న విషయం తనకు అప్పుడే తెలిసిందని పేర్కొంది. 2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జరిగింది. అక్కడ తమ ప్లేయర్లకు మంచి పరోటాలు దొరకలేదని, పరోటాలు చేయడం మీకు నేర్పిస్తానని ప్రీతి అన్నారు. అయితే తమకు ఆలూ పరోటాలు కావాలని ప్లేయర్లు అడిగారని, వచ్చే మ్యాచ్ గెలిస్తే పరోటాలు చేసి ఇస్తానని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక పంజాబీ జట్టు ఆ మ్యాచ్ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వయంగా 120 పరోటాలు చేసిన ప్లేయర్లకు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన సమాధానం విన్న హర్భజన్.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరోటాలు తిన్నట్లు చెప్పాడు. చివర్లో మా జట్టు ట్రాక్లో పడాలంటే మళ్లీ ఆలు పరోటాలు చేయాలేమో అని ప్రీతి జింటా అనడంతో నవ్వులు విరపూశాయి. 🚨 Star Sports Exclusive 🚨 Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣 Tune-in to #PBKSvLSG at #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/XpeYglFUSf — Star Sports (@StarSportsIndia) April 28, 2023 చదవండి: పంజాబ్ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే? -
ప్రీతి జింటాతో షమీ ముచ్చట.. ఫోటో వైరల్
పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాకు ఈ ఏడాదైనా తన కల నెరవేరుతుందేమో చూడాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్గా ఐపీఎల్లో తమ ప్రస్థానం ఆరంభించి 2014లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ఫైనల్ మెట్టు ఎక్కలేదు. ఇక కింగ్స్ పంజాబ్ అని పేరును మార్చుకున్న తర్వాత కూడా జట్టుకు కలిసిరావడం లేదు. అందుకే ఈసారి శిఖర్ ధావన్ను కెప్టెన్గా ఎంచుకొని ఈ సీజన్లో రెండు వరుస విజయాలు నమోదు చేసింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్ల్లో మాత్రం ఓటమి పాలైంది. గురువారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి బంతికి ఓడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్ ముగిశాకా ప్రీతి జింటా.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీతో ముచ్చటించడం ఆసక్తిగా మారింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. వీరిద్దరు నవ్వుతున్న ఫోటోను కెమెరామన్ క్లిక్మనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ పాత స్నేహితుడిని కలిసిన ఆనందం అనుకుంటా అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మహ్మద్ షమీ 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్కు మెయిన్ బౌలర్గా వ్యవహరించాడు. POV: 𝘞𝘩𝘦𝘯 𝘺𝘰𝘶 𝘳𝘶𝘯 𝘪𝘯𝘵𝘰 𝘢𝘯 𝘰𝘭𝘥 𝘧𝘳𝘪𝘦𝘯𝘥! 😃#PBKSvGT | #TATAIPL 2023 | @MdShami11 @realpreityzinta pic.twitter.com/VKqAl36bH0 — Gujarat Titans (@gujarat_titans) April 13, 2023 చదవండి: కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా? -
గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్(67) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గుజరాత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్ సామ్ కర్రాన్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీసి గిల్కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే కర్రాన్ వేసిన అద్భుత బంతికి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్ నుంచి మ్యాచ్ను వీక్షిస్తున్న పంజాబ్ సహ యాజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి. గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్బాజ్ ఖాన్, సోనూ సూద్లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి రెండు బంతులు తర్వాత తెవాటియా ఫోరు బాది పంజాబ్కు ఓటమి మిగిలించాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2023: ఏంటి హార్దిక్.. ఎంత కెప్టెన్ అయితే? మరీ చెత్త బ్యాటింగ్! A last-over finish yet AGAIN! 👌 👌 It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏 Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtK — IndianPremierLeague (@IPL) April 13, 2023 #TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB — सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023 -
మేడమ్ ప్లీజ్ అంటూ భిక్షమడిగిన దివ్యాంగుడు.. పట్టించుకోని హీరోయిన్
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రీతి జింటా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది. ఎయిర్పోర్టుకు వెళ్లే బిజీలో ఉన్న ప్రీతి అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా తన దారిన తను వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్ కారు వైపే వీల్చైర్ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్ మేడమ్ ప్లీజ్ అంటూ ఆర్తిగా అభ్యర్థించాడు. అది గమనించని ప్రీతి కారులో రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. అయినా సరే ఆమె కారును అందుకుందామని ప్రయత్నించిన దివ్యాంగుడి ప్రయత్నం వృధా అయింది. ఇది చూసిన జనాలు ప్రీతిని తిట్టిపోస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత ఇవ్వాల్సింది, ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతడు ఎంత బాధపడి ఉంటాడో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 1998లో మణిరత్నం డైరెక్ట్ చేసిన 'దిల్ సే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతి జింటా. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అదే ఏడాది 'ప్రేమంటే ఇదేరా' చిత్రంతో టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది మహేశ్బాబుతో 'రాజకుమారుడు'లో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆమె బుల్లితెరపై ప్రసారమైన పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇకపోతే ప్రీతి జింటా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Punjab Kings: అనిల్ కుంబ్లేతో పంజాబ్ కటీఫ్! మయాంక్ విషయంలో మాత్రం..
మొహాలి: మూడు ఐపీఎల్ సీజన్లలో తమ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్ కుంబ్లేతో పంజాబ్ కింగ్స్ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్ యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్ల ఐపీఎల్లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్ కోచ్ పదవి ఎవరికీ కలిసి రాలేదు. 2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్. వరుసగా సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, మైక్ హెసన్ కోచ్గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలో పంజాబ్ 42 మ్యాచ్లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. ఓవరాల్గా కూడా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్ ప్లే ఆఫ్స్కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ వేలంలో బెయిర్స్టో, రబడ, లివింగ్స్టోన్, శిఖర్ ధావన్లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్ను తప్పించిన పంజాబ్ మరోవైపు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్పై పుజారా ప్రశంసల వర్షం -
వింత సెంటిమెంట్: విరాట్ చేతికి అవే గ్లోవ్స్. ఆ నటి కాళ్లు కడుక్కోవాల్సిందేట!
క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే టెక్నిక్, శారీరక శ్రమతో సాగే ఆటల మైదానాల్లోనూ ఈ అదృష్టమే గెలుస్తుందన్న అభిప్రాయమూ ఉంది.. అందుకే అక్కడా నమ్మకాలు పందెం వేసుకుంటూంటాయి. ఆ రెండు రంగాల్లోని ఘనాపాటీల సెంటిమెంట్ల పోటీ ఇది.. తీన్ పత్తీ మన దేశంలో.. ఆటల్లో క్రికెట్ మర్రి చెట్టులా వేళ్లూనుకుంది. ఇంకే ఆటకూ గ్రౌండ్ సరిపోనంతగా. అందుకే క్రికెట్ ప్లేయర్స్కున్నంత క్రేజ్.. గ్లామర్ మిగతా ఆటగాళ్లకు లేదు. వాళ్ల అలవాట్లు, ఆలోచనలూ వార్తలకెక్కలేదు. ఇక్కడ మాత్రం ఫుట్బాల్లో మన లెజెండ్ భైచుంగ్ భుటియా వింత అలవాటును ప్లేస్ చేద్దాం. అదేంటంటే.. తను ఫుట్బాల్ పిచ్లోకి ఎంటరయ్యే ముందు ‘తీన్ పత్తీ (మూడు ముక్కలాట)’ ఆడి మరీ వెళ్తాడట. దానివల్ల తన గేమ్.. తన టీమ్ విజయం సాధిస్తుందని భైచింగ్ విశ్వాసమట. కచ్చితంగా చెక్ చేసుకుంటుంది.. ప్రీతి జింటాకూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. పరాయి ఊరు, దేశం ఇలా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా హోటల్లో బస బుక్ చేసుకునే ముందు అక్కడి బాత్రూమ్స్ గురించి వాకబు చేస్తుందట. శుభ్రంగా ఉంటాయనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేస్తుందట. అంతేకాదు హోటల్లోకి చెకిన్ అయ్యేకంటే ముందు బాత్రూమ్ని నీట్గా కడిగించాకే ఆ స్వీట్లోకి ఎంటర్ అవుతుందట. అదీ ఆమె ఓసీడీ. కాళ్లు కడుక్కోవాల్సిందే నటి సన్నీ లియోనికి పదే పదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందిట. ‘అలవాటు అంటారేంటండీ బాబూ.. అదో పిచ్చి’ అంటూ గుర్రుమంటారు ఆమెతో పనిచేసే వాళ్లు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట. ‘ఆ పిచ్చి వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్నదానికన్నా ఎంతో ఆలస్యంగా పూర్తయింది. దాంతో నిర్మాతలే కాదు యూనిట్ అంతా సఫర్ అయింది తెలుసా?’ అంటూ కామెంట్ చేస్తారు ఆ యూనిట్ సభ్యులు సెలబ్రిటీల సెంటిమెంట్స్ చర్చకు వచ్చినప్పుడల్లా. ఇప్పటికీ? ఏమో మరి! సినిమా వాళ్లకెన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ స్టార్స్కూ అన్నే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్ క్రికెటర్ విరాట్ కొహ్లీకున్న సెంటిమెంట్ లేక నమ్మకం గురించి చెప్పుకుందాం. కెరీర్లో ఫస్ట్ టైమ్ మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే వేసుకున్నాడో.. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అవే గ్లోవ్స్ వేసుకోవడం మొదలుపెట్టాడట ఈ బాట్స్మన్. దాన్ని అలవాటుగా స్థిరపరచుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశాడని చెప్తారు అతని సన్నిహితులు. ‘ఇప్పటికీ అవే గ్లోవ్స్ వాడతాడా?’ ఏమో.. మరి! -
మెగావేలానికి ముందు పంజాబ్ కింగ్స్కు మరో బ్యాడ్న్యూస్..
ఐపీఎల్ మెగావేలానికి అంతా సిద్దమవుతున్న వేళ పంజాబ్ కింగ్స్కు ఒక బ్యాడ్న్యూస్. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా ఈసారి మెగావేలానికి అందుబాటులో ఉండదంట. ఇది బ్యాడ్న్యూస్ ఏంటని ఆశ్యర్యపోకండి. ఇంతకముందు ఎప్పుడు వేలం జరిగినా ప్రీతిజింటా ప్రత్యేక ఆకర్షణగా కనిపించేది. తనదైన చలాకీ నవ్వుతో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటే ఎంతో సందడిగా ఉండేది. మరి అలాంటి నవ్వులు మిస్సవుతున్నామంటే కచ్చితంగా అది బ్యాడ్న్యూసే కదా... ప్రీతిజింటా మెగావేలానికి దూరమైన కారణాన్ని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.'' ఈ ఏడాది ఐపీఎల్ మెగావేలానికి దూరం కాబోతున్నా. ఈ విషయం చెప్పడానికి కాస్త బాధగా ఉన్నప్పటికి తప్పదు. ఈ మధ్యనే మేం కవల పిల్లలకు జన్మనిచ్చాం. కాలిఫోర్నియాలో ఉంటున్న నేను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పిల్లలను వదిలి ఇండియాకు రాలేను. వాడి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి వేలానికి దూరంగా ఉండబోతున్నా. ఈసారి పంజాబ్ కింగ్స్ టీమ్ కొత్తగా ఉండబోతున్న సంగతి మాత్రం చెప్పగలను. అందుకు ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు సేకరించాం. మరి ఈసారి రెడ్ జెర్సీ వేసుకోనున్న ఆటగాళ్ల కోసం నేను ఎదురుచూస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈసారి మెగావేలంలో పాల్గొంటున్న పంజాబ్ కింగ్స్ పర్స్లో రూ.72 కోట్లు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ సహా మిగతా ఆటగాళ్లందరిని రిలీజ్ చేసింది. దీంతో ఈసారి వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టులో కొత్త ఆటగాళ్లు కనిపించడం ఖాయం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, శ్రేయాస్ అయ్యర్, డికాక్లతో పాటు మహ్మద్ షమీలను భారీ ధరకు సొంతం చేసుకోవాలని భావిస్తోంది. -
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం
Actress Preity Zinta And Her Husband Gene welcome Twins Jai and Gia: ప్రముఖ బాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా(46) గుడ్ న్యూస్ చెప్పింది. కవలలకు ఆమె తల్లైనట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సరోగసి(అద్దె గర్భం) పద్దతిలో తాను, జీన్ తల్లిదండ్రులైనట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఇక విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో ప్రకటిస్తూ పిల్లల పేర్లను కూడా వెల్లడించింది. భర్త జీన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను కవలలకు జన్మనిచ్చాం. చదవండి: రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..! ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అలాగే సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ప్రీతి జింటా కృతజ్ఞతలు తెలిపింది. కాగా అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్ను ప్రీతి జింటా 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. చదవండి: నయన్కు సర్ప్రైజ్: విక్కీ బర్త్డే బ్యాష్ మామూలుగా లేదుగా View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) -
ప్రీతితో రితేష్.. కోపంగా జెనీలియా.. అసలు నిజం ఇదేనా?
ఐఫా అవార్డ్స్ 2019 సందర్భంగా కలిసిన ప్రీతి జింటా చేతులపై రితేష్ దేశ్ముఖ్ ముద్దు పెట్డుకోవడం, ఆ సమయంలో ఆయన భార్య జెనీలియా డిసౌజా కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టడం తెలిసిందే. అనుకోకుండా క్యాప్చర్ అయిన ఆ వీడియో చాలాకాలం తర్వాత బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. దానిపై ఎన్నో మీమ్స్, జోకులు హల్చల్ చేశాయి. తాజాగా అలా కోపంగా ఉండడానికి కారణాన్ని తెలియజేసింది జెనీలియా. తాజాగా జెనీలియా తన భర్త రితేష్తో కలిసి అర్భాజ్ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ సీజన్ 2కి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి అడగగా.. ‘చాలా కాలం తర్వాత, నేను ఓ అవార్డు ఫంక్షన్కు హాజరయ్యాను. కొత్త డ్రెస్ వేసుకొని, హై హీల్స్ వేసుకొని వెళ్లాను. చాలా రోజుల అనంతరం వేసుకున్న హై హీల్స్ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుండగా అలా ఉన్నాను. అలా నేను ఇబ్బంది పడుతుంటే రితేష్, ప్రీతి చేతులపై ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్యామెరాలో బంధించారు. అంతేకానీ మరేం లేదని’ జెన్నీ తెలిపింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది ఈ నటి. అందులో ఇంటికి రాగానే ఈ భామ.. భర్త రితేష్ను కొడుతున్నట్లు, ఆయన వద్దని వేడుకుంటున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీనిపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందించారు. కాగా వీరిద్దరూ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
‘క్యా కెహ్నా’ షూటింగ్లో ప్రమాదం, సైఫ్ అలీఖాన్ గాయానికి 100 కుట్లు
సైఫ్ అలీ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన తొలి చిత్రం ‘క్యా కెహ్నా’. 2000 సంవత్సరం మే 19న విడుదలైన ఈ మూవీలో సైఫ్ ప్లేబాయ్గా కనిపించగా, ప్రీతి జింటా పెళ్లి కాకుండా టీనేజీలోనే తల్లి అవుతుంది. డైరెక్టర్ కుందన్ షా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో హీరో సైఫ్ ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందట. ఈ ప్రమాదంలో సైఫ్ తలకు గాయమవడంతో దాదాపు 100 కుట్లు పడినట్లు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ప్రీతి జింటా వెల్లడించింది. 2004లోని కాఫీ విత్ కరణ్ జోహార్ మొదటి సీజన్కు సైఫ్, ప్రీతిలు అతిథిలుగా హాజరయ్యారు. ఈ షోలో ‘క్యా కెహ్నా’ షూటింగ్లో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ.. ‘జూహులోని ఓ పార్కు సమీపంలో సీన్ రీహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు .‘ ప్రీతిని ఫ్లట్ చేసే సన్నివేశం అది. నా మోటరు సైకిల్తో స్టంట్స్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయాలి. అలా ఫస్ట్ టైం బాగానే వచ్చింది. ఇక రెండవ సారి ఫుల్ జోష్లో బైక్ను ర్యాంప్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయ్యింది. అయితే ఆ రోజు ఫుల్ వర్షం, నేలంతా బురదగా ఉండేసరికి ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ కాగానే నేను గాల్లోకి ఎగిరి నేరుగా ఓ రాతిపై పడ్డాను. అలా బౌన్స్ అవుతూ పలుమార్లు కింద పడ్డాను. ఈ క్రమంలో నా తలకు పెద్ద గాయమై రక్తస్రావం అవ్వడం చూశాను. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ప్రీతి జింటా మాట్లాడుతూ.. ‘ఆ రోజు డైరెక్టర్కు జ్వరంగా ఉండటంతో సెట్కి రాలేదు. సైఫ్ భార్య అమృత సింగ్ కూడా ఆ సమయంలో ముంబైలో లేరు. ఇక ప్రమాదం జరగానే ఆయన స్నేహితుడికి ఫోన్ చేశాను కానీ అతడు నమ్మలేదు, మేము జోక్ చేశామనుకుని ఫోన్ పెట్టేశాడు. నేను మాత్రమే అక్కడ ఉండటంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. హాస్పిటల్లో గార్డియన్గా నేను సంతకం చేశాను’ అని తెలిపింది. ఆ తర్వాత ఒకవేళ సైఫ్ మరణిస్తే ఏంటి పరిస్థితి అని తను పిచ్చిగా ఆలోచించానంటూ ఆమె చెప్పింది. -
పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నారు!
ముంబై: ఈ ఐపీఎల్ సీజస్లో కొత్త జెర్సీ, పేరులో స్వల్ప మార్పుతో బరిలోకి దిగిన జట్టు పంజాబ్ కింగ్స్. గత సీజన్ వరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్గా ఉన్న ఆ జట్టు.. ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్)గా మార్చుకుంది. 2020 సీజన్లో భారీ స్కోర్లు చేసినా ఆ జట్టు ఓటమి పాలవడం యాజమాన్యంలో ఆందోళన రేకెత్తించింది. దాంతో పేరు మార్చుకుని మరీ ఈ ఐపీఎల్కు సిద్ధమయ్యారు. కాగా, సోమవారం పంజాబ్ కింగ్స్ ఆడిన తొలి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. పంజాబ్ 221 పరుగులు చేసినా దాదాపు ఓడిపోయే స్థితి నుంచి బయటపడి చివరకు గెలుపుతో హమ్మయ్యా అనుకుంది. టీవీల ముందు కూర్చొన్న ప్రేక్షకుల్లో అక్కడ కామెంటరీ చెప్పేవాళ్లు కూడా పంజాబ్ పేరు మారినా రాత మారదా అంటూ చమత్కరించే పరిస్థితి నుంచి తేరుకుని విజయంతో శుభారంభం చేసింది. జట్టు కో-ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్ ఎటాక్లు తెప్పిస్తున్నారు అంటూ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో పంజాబ్ కింగ్స్ను ప్రశంసిస్తూనే.. ఇంకా హార్ట్ ఎటాక్ తెప్పిస్తూనే ఉంటారా? అని ప్రశ్నించారు. ‘ వాటే గేమ్. మేము కొత్త జెర్సీ-కొత్త పేరుతో ఈ ఐపీఎల్ను ఆరంభించాం. అయినా గేమ్ ద్వారా మాకు హార్ట్ ఎటాక్లు తెప్పించడం ఆపలేదు. ఇది కచ్చితంగా మాకు పర్ఫెక్ట్ గేమ్ కాదు. కానీ చివరి అంకంలో కాస్త ఫర్ఫెక్ట్గా అనిపించారు’ అని ట్వీట్ చేశారు. ఇక్కడ చదవండి: అత్యధిక సెంచరీ వీరులు వీరే.. సెహ్వాగ్ సరసన సామ్సన్ సకారియా సక్సెస్ వెనుక ఓ విషాద గాధ.. Yeah 👊What a game ! We have a New name & a New Jersey, still #saddapunjab won’t stop giving us heart attacks in a game. What to do ? Not a perfect game for us but in the end it was PERFECT🤩Wow @klrahul11 @iamdeepakhooda & all the boys @PunjabKingsIPL #RRvsPBKS #IPL2021 #Ting pic.twitter.com/UDwPlBlgl0 — Preity G Zinta (@realpreityzinta) April 12, 2021 -
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్కు కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
బొమ్మ పడితే యాక్ట్ చేస్తా.. లేదంటే
మొన్న జనవరి 31తో ప్రీతి జింటాకు 46 ఏళ్లు నిండాయి. బాలీవుడ్లో టాప్ స్టార్ అయి ఆ తర్వాత అంట్రప్రెన్యూర్గా మారిన ప్రీతి తను సినిమాల్లోకి వచ్చేందుకు కాయిన్ ఎగరేసి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ‘లిరిల్’ యాడ్ చేసి లిరిల్ గర్ల్గా క్రేజ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. తండ్రి చిన్నప్పుడే మరణించడం, కుటుంబానికి తనే ఆధారం కావడంతో ఈ సిమ్లా అమ్మాయి త్వరత్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (క్రిమినల్ సైకాలజీ) చేసి ముంబై చేరుకుంది. అక్కడ మోడల్గా కెరీర్ మొదలెడితే సహజంగానే బాలీవుడ్ కన్ను పడింది. ‘దర్శకుడు శేఖర్ కపూర్ నన్ను మొదటగా ‘తర రమ్ పమ్’ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ఆయనను నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద దర్శకుడు. కాని నాకు సినిమా కెరీర్ పట్ల అప్పటికి ఆలోచన లేదు. విధి నిర్ణయం అలాగే ఉంటే తప్పక నటిస్తాను అని ఆయనతో చెప్పి ఆయన దగ్గరే కాయిన్ ఎగరేశాను. బొమ్మ పడితే సినిమా చేస్తాను. బొరుసు పడితే చేయను అనుకున్నాను. బొమ్మ పడింది. సినిమా ఒప్పుకున్నాను’ అని అప్పటి సంగతి గుర్తు చేసుకుందామె. అయితే ఆ సినిమా కొన్నాళ్లకు మూలన పడింది. ప్రీతి జింటా మణిరత్నం ‘దిల్ సే’ తో మొదట పరిచయం అయ్యి స్టార్గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వేరే టీమ్ ‘తర రమ్ పమ్’ చేసింది సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో. ‘అది కూడా విధి నిర్ణయమే కావచ్చు’ అంటుంది ప్రీతి. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రీతి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా ఆమె ఎగరేసిన కాయిన్కు మనం థ్యాంక్స్ చెప్పాలి. అది బొమ్మ పడటం వల్లే కదా ఈ చక్కటి బొమ్మ తెర మీద కనిపించింది. -
ఏంటీ.. జింటా టీం గెలిచిందా..? అవును!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఆరంభంలో ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. తొలుత మ్యాచ్లన్నీ ఓడినా... ఆ తర్వాత గెలుపు బాటపట్టి సత్తా చాటింది. ఇక సోమవారం నాటి మ్యాచ్తో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న కేఎల్ సారథ్యంలోని కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు తీసి కేకేఆర్ను 149 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: ధోని ఫ్యాన్స్కు సీఎస్కే సీఈవో గుడ్న్యూస్! ) ఆ తర్వాత ఫోర్తో ఛేజింగ్ ప్రారంభించిన కింగ్స్.. హిట్టర్ క్రిస్గేల్, ఓపెనర్ మన్దీప్ సింగ్ల అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆరంభంలో ఒక్క మ్యాచ్ గెలవడానికే ఆపసోపాలు పడ్డ ఈ టీం.. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మీమ్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, 2014లో చేసిన ట్వీట్ను మరోసారి తెరమీదకు తెచ్చారు. ‘‘జింటా టీం గెలిచిందా?’’అన్న సల్మాన్ వ్యాఖ్యకు బదులుగా.. ‘‘హా అవును. అదే జరిగింది. మీరు చూడలేదా’’ అంటూ వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పంజాబ్ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తొలుత షేర్ చేసిన మీమ్కు అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. కాగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహయజమాని అన్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా ఆమె జట్టుతో ఉంటూ, ఆటగాళ్లను ఉత్సాహపరచడం సహా, ఓడిపోయిన సందర్భాల్లో విమర్శలకు ధీటుగా బదులిస్తూ కౌంటర్ వేస్తారన్న విషయం తెలిసిందే.(చదవండి: సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’) చదవండి: కేకేఆర్పై పంజాబ్ ప్రతాపం #KKRvKXIP https://t.co/QbQNUedxiN pic.twitter.com/KUQWWW4mSD — Wasim Jaffer (@WasimJaffer14) October 26, 2020 -
‘20 సార్లు కరోనా టెస్ట్.. కోవిడ్ పరీక్షలో క్వీన్ని’
కింగ్స్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులెవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లో తొలిసారి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం లేకుండా చూడటం కోసం బీసీసీఐ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆటగాళ్లందర్నీ బయో బబుల్లో ఉంచి కోవిడ్ బారిన పడకుండా చూస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీతి జింటా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. దీనిలో ఆమెకు జరిగిన స్వాబ్ టెస్ట్ని చూడవచ్చు. మెడికల్ సిబ్బంది ఒకరు ప్రీతి స్వాబ్ కలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రీతి ‘ఇది నా 20వ కోవిడ్ టెస్ట్. నేను కరోనా పరీక్షలు చేయించుకోవడంలో నేను క్వీన్ అయ్యాను’ అన్నారు. దాంతో పాటు బయో బబుల్ గురించి కూడా వివరించారు ప్రీతి జింటా. అయితే ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఓ యూజర్ ‘నేను ఐదు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఇంత ఈజీగా లేదు’ అని కామెంట్ చేయగా మరొక యూజర్.. ‘మీకు టెస్ట్ చేసే విధానం సరైంది కాదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: 4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..) View this post on Instagram Everyone asks me what does it mean being in the IPL team bio bubble. Well ! It’s starts with a 6 day quarantine, covid tests every 3-4 days and no going out - only ur room, designated #KXIP restaurant & gym & of course the stadium in ur car. The drivers, chefs etc are also in the bio bubble & quarantined so No food from outside & no people interaction. It’s tough if ur a free bird like me but then it’s 2020 & one must appreciate that #IPL is actually happening in the middle of a pandemic. I must thank #BCCI, the staff of KXIP & @sofiteldubaipalm for all their efforts in keep us safe & productive 🙏 #Grateful #pzipldiaries #Ipl2020 #Dream11 #Ting ❤️ @kxipofficial A post shared by Preity G Zinta (@realpz) on Oct 20, 2020 at 3:03am PDT ఇక దీంతో పాటుగా ‘బయో బబుల్’ అంటే ఏంటో కూడా వివరించారు ప్రీతి జింటా. ‘చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడమే బయో బబుల్. బీసీసీఐకి, కింగ్స్ పంజాబ్ స్టాఫ్కు చాలా థ్యాంక్స్. మమ్మల్ని సేఫ్గా ఉంచడం కోసం, ఐపీఎల్ కొనసాగడం కోసం వీరేంతో శ్రమిస్తున్నారు’ అని ప్రీతి జింటా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. -
మురిసిపోతూ ఎగిరి గంతులేసింది
దుబాయ్: క్రికెట్లో ఎలాంటి అద్భుతమైన జరగొచ్చు అనడానికి నిన్న కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధాన మ్యాచ్ టై అయితే.. సూపర్ ఓవర్ ఆడించారు. అది కూడా టై. మళ్లీ సూపర్ ఓవర్. ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు నరాలు తెగిపోయేంత టెన్షన్.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ చివరకు మంచి మజాను అందించడంతో సూపర్ సండేగా మారింది. అసలు సూపర్ ఓవర్కు వెళితేనే ఇరుజట్లు ఎంతలా పోరాడాయే అర్థమవుతుంది. సూపర్ ఓవర్లో సూపర్ ఓవర్ అంటే వారు పోరు అసాధారణమనే చెప్పాలి. కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్ల జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్.. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ను మరిచిపోయేలా చేసింది. నిన్న జరిగిన రెండు మ్యాచ్లు సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలితే, రాత్రి జరిగిన మ్యాచ్ మాత్రం డబుల్ ధమాకాను అందించింది. (ముంబైతో మ్యాచ్లో కేఎల్ రాహుల్ రికార్డ్) ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్ ఆడించారు. ఆ సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్ను విజయం వరించింది. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్లు బ్యాటింగ్కు దిగారు. బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్ పంజాబ్ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది. మురిసి మెరిసిన ప్రీతిజింటా ఈ మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ విజయం తర్వాత జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఆనందాని అవధుల్లేవు. పంజాబ్ గెలిచిన ప్రతీ సందర్భంలోనూ ఆటగాళ్లను ఉత్సాహపరిచే ప్రీతి జింటా.. రెండో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చే వరకూ ఉత్కంఠగా ఎదురుచూశారు. విజయం అంచుల వరకూ వచ్చి కొన్ని మ్యాచ్లను పంజాబ్ కోల్పోవడంతో ప్రీతి జింటా మళ్లీ ఏమి జరుగనుందో అని ఒత్తిడిలో కనిపించారు. చివరకు పంజాబ్ విజయం సాధించడంతో ఇక ఆమె మురిసిపోయారు. ఆ సంతోషంలో ఎగిరి గంతులేశారు. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్లో పంజాబ్ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్న ప్రీతి.. ‘ మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్ ఓవర్లు. ఓ మై గాడ్. నేను ఇంకా షేక్ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్ పంజాబ్ బాయ్స్ గెలుపు. వాటే గేమ్. వాటే నైట్.. వాటే ఫీలింగ్. టీమ్ ఎఫర్ట్కు థాంక్యూ. ఇక్కడ టీమ్ వర్క్ అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. Actions speak louder than words as words fail me completely. Two super overs ? OMG ! I’m still shaking. So proud of the #Kxip boys. What a game, what a night, what a feeling ❤️ Thank you @lionsdenkxip for this supreme team effort 👊 Team work at its best. #MIvsKXIP #Dream11IPL https://t.co/xvdEMmdDjF — Preity G Zinta (@realpreityzinta) October 18, 2020 -
4 ఏళ్ల నాటి సల్మాన్ ట్వీట్ వైరల్..
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఆ మ్యాచ్ ఆఖరి బంతి వరకూ వెళ్లడంతో ఉత్కంఠ ఏర్పడింది. ‘పాపం.. పంజాబ్. మళ్లీ ఓడిపోతుందా’ అనిపించింది. చహల్ వేసిన ఆఖరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ ఓవర్లో కింగ్స్ పంజాబ్కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్ రనౌట్ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. (కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) కానీ పూరన్ సిక్స్తో ఇన్నింగ్స్ను ఫినిష్ చేయడంతో కింగ్స్ పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్ పంజాబ్కు గేల్ ఓ మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్ ఆటతో పంజాబ్ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్ తర్వాత సిక్స్లతో మంచి జోష్ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్ రాహుల్(61 నాటౌట్; 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లు), మయాంక్ అగర్వాల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు)లు రాణించడంతో కింగ్స్ గెలిచింది. కాగా, కింగ్స్ పంజాబ్ గెలుపు తర్వాత నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 2014లో కింగ్స్ పంజాబ్ ఫైనల్లో ఓడిపోవడంపై అప్పుడు సల్మాన్ ట్వీట్ చేశాడు. ‘ప్రీతి జింటా జట్టు గెలిచిందా.. ఏమిటి?’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతోంది. నిన్న ఆర్సీబీతో మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంతో ఆనాటి సల్మాన్ ట్వీట్ను పంజాబ్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఇదిగో కింగ్స్ పంజాబ్ గెలిచింది సల్మాన్.. ఈ సీజన్లో ఆర్సీబీపై ఒకసారి కాదు.. రెండు సార్లు గెలిచింది పంజాబ్ ’ అంటూ సల్మాన్ ట్వీట్ను వైరల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కేకేఆర్తో జరిగిన ఆనాటి ఫైనల్లో కింగ్స్ పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ 199 పరుగులు చేయగా, దాన్ని కేకేఆర్ ఇంకా మూడు బంతులు ఉండగా ఛేదించి విజయం సాధించింది. అప్పుడు కేకేఆర్ జట్టులో ఉన్న మనీష్ పాండే 94 పరుగులు చేసి కేకేఆర్ ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, అప్పుడు ట్రోఫీ సాధించాలనుకున్న కింగ్స్ పంజాబ్ ఆశలు తీరలేదు. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఐపీఎల్ టైటిల్ను సాధించలేదు. ఆ జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతిజింటా సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. -
అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజా ఏంటో రుచి చూపించింది. సూపర్ ఓవర్దాకా వెళ్లిన మ్యాచ్లో రబాడా అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్(89) అసాధారణ ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది. (ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ) అయితే పంజాబ్ చేజింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్లో మూడవ బంతిని ఎక్స్ట్రా కవర్వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వాటిలో మొదటి పరుగు షార్ట్ రన్గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్ నిర్ణయంపై పంజాబ్ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్ అయ్యింది. (రైజింగ్కు వేళాయె...) ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్ చేసింది. -
ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తా ..!
హైదరాబాద్ : కింగ్స్ పంజాబ్ యజమాని చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్లో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. "కెప్టెన్ కూల్కి చాలామంది అభిమానులు ఉన్నారు. వారిలో నేనొకరిని. అయితే, ఈ మధ్య కాలంలో నేను ధోనితో పాటు ఆయన కూతురు జీవాకు కూడా ఫ్యాన్ని అయ్యా. నా దృష్టి ఆమెపై పడింది. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని ధోనీని హెచ్చరిస్తున్నా. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను" అని ట్విటర్లో సరదా వ్యాఖ్యలు చేశారు. కాగా, ధోని.. ప్రీతి మైదానంలో దిగిన ఫొటోకు ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలు, ట్విటర్లో 3.3 లక్షల లైకులు రావడం విశేషం. ఐపీఎల్ 12వ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్స్కు చేరుకోని సంగతి తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్తో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్రేట్ (-0.251) తక్కువగా ఉండటంతో కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఇంటిదారి పట్టింది. Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful - I may just kidnap her 😜 Now it's time for you guys to Caption THIS photo...#Ting pic.twitter.com/bD1ADSXopc — Preity G Zinta (@realpreityzinta) May 7, 2019 -
‘ఆ బ్యాగ్ ఖరీదుతో ఏడాది గడిపేస్తారు’
ముంబై : బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ స్టేటస్ స్టేట్మెంట్ కోసం రూ లక్షలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. హీరోయిన్లయితే యాక్సెసరీస్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. దుస్తులు, షూస్ నుంచి ఏ చిన్న వస్తువైనా తమ స్ధాయిని చాటేలా చూసుకుంటున్నారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా లంచ్ చేసేందుకు బయటికి వస్తూ స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకున్నారు. బ్లూ షర్ట్, మ్యాచింగ్ బాటమ్స్తో పాటు ఆమె ధరించిన బ్యాగ్ అందరినీ ఆకర్షించింది. ఈ బ్యాగ్ ఖరీదు రూ 3 లక్షలు కావడం గమనార్హం. అసలు ఆమె బ్యాగ్ కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఓ సాధారణ కుటుంబం ఏడాది పాటు బతికేయవచ్చు. -
డ్యాన్సింగ్ అంకుల్ను మించిపోయాడుగా!
ముంబై : ఉత్కంఠకర సమయంలో మమ్మల్ని ఉల్లాసరపరిచాడంటూ కింగ్స్ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతీ జింటా చేసిన ఓ ట్విట్ తెగహల్చల్ చేస్తోంది. ‘ ముంబైతో మ్యాచ్ ఉత్కంఠకరంగా సాగుతున్నసమయంలో ఓ అభిమాని వన్మ్యాన్ ఆర్మీలా మా అందరిని ఎంటర్టైన్ చేశాడు’ అని క్యాఫ్షన్గా ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో ఓ మధ్యవయసు గల వ్యక్తి చిందేస్తూ మ్యాచ్ను అస్వాదించాడు. అయితే ఆ వ్యక్తి డ్యాన్స్ చూస్తే మాత్రం ఎవ్వరికి నవ్వాగదు. అంతలా అదరగొట్టాడు. అయితే ఆ అంకుల్ డ్యాన్స్కు ముగ్ధులైన నెటిజన్లు ఫన్నీ క్యాప్షన్తో కామెంట్ చేస్తున్నారు. డ్యాన్సింగ్ అంకుల్ మించిపోయాడుగా! అని ఒకరంటే.. అంకుల్ సూపర్ అంటూ మరొకరు కితాబిచ్చారు. బుధవారం ముంబై-కింగ్స్పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ పంజాబ్ అభిమాని చిందేస్తూ ఇలా మ్యాచ్ను అస్వాదించాడు. కానీ పోలార్డ్ దెబ్బకు చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ముంబై వశమైంది. आजा नच ले 👏 This #funnyfriday is devoted to this fan & one man army who entertained us in Mumbai during a very tense and thrilling game. #ting #vivoipl2019 #MIvsKXIP @lionsdenkxip pic.twitter.com/QSghgZT4cs — Preity G Zinta (@realpreityzinta) April 12, 2019 -
‘కాలంతో పాటు మనమూ మారిపోతాం’
‘జీవితంలో కచ్చితంగా నిలకడగా ఉండేది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే. ఒకప్పుడు హాకీ నేర్చుకునేందుకు చాలా ఇష్టపడేదాన్ని.. ప్రస్తుతం క్రికెట్కు పిచ్చి అభిమానినయ్యాను. కాలంతో పాటు మనమూ మారిపోతాం కదా’ అంటూ బాలీవుడ్ స్టార్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘కాలం మారినా మీరు మాత్రం అలాగే ఉన్నారు. హాకీ అభిమానిగా ఉన్న మీరు క్రికెట్ను ఆరాధించడంతో పాటుగా ఐపీఎల్లో కింగ్స్ జట్టుతో మాకు వినోదాన్ని పంచుతున్నందుకు థాంక్స్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా దిల్ సే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి జింటా.. ఆ తర్వాత సక్సెస్ఫుల్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఐపీఎల్ జట్టు సహ యజమానిగా ఉన్న ఆమె.. తన కింగ్స్ గ్యాంగ్తో మైదానంలో సందడి చేస్తారు. జట్టు విజయం సాధించినపుడు భాంగ్రా స్టెప్పులేస్తూ ఉత్సాహపరచడంతో పాటు.. ఓడినపుడు కూడా ఆటగాళ్లకు అండగా నిలుస్తారు. కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ జట్టు ఇంతవరకు టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు. డ్యాషింగ్ హిట్లర్లు, స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రీతి టీమ్కు ఐపీఎల్ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. View this post on Instagram The only thing constant in life is change. एक वक़्त था जब मैं हॉकी सीख रही थी - आज मैं क्रिकेट की दीवानी हूँ ! वक़्त के साथ हम भी बदल जाते हैं 🤩 #throwbackthursday #tbt #ting #throwback #thursdaythoughts A post shared by Preity G Zinta (@realpz) on Apr 11, 2019 at 3:04am PDT -
రాహుల్ చాలా మంచి అబ్బాయి!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం సహచరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి టీవీ టాక్ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాదంలో భాగమయ్యాడు. అతను ప్రస్తుతం ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాడి గురించి పంజాబ్ టీమ్ యజమాని, సినీ నటి ప్రీతి జింటా సానుకూలంగా మాట్లాడింది. అతను చాలా మంచివాడంటూ కితాబిచ్చింది. ‘రాహుల్ చాలా చాలా మంచి వ్యక్తి. టీవీ షో వివాదమంతా ముగిసిన గతం. టీవీ షో వివాదాస్పదమైన తీరు బాధాకరం. నిజాయితీగా చెప్పాల ంటే రాహుల్కు మహిళలంటే ఎంతో గౌరవం ఉంది. కాబట్టి అసలు అదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి ఘటనలు జీవితంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తాయి’ అని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ఆర్థికపరంగా చూస్తే ఐపీఎల్లో తా ము పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తిరిగొచ్చిందని, ఇప్పుడు టైటిల్ సాధించడం ఒక్కటే తమ లక్ష్యమని ఈ సందర్భంగా జింటా చెప్పింది. ఐపీఎల్లో రాహుల్ వ్యాపారం... స్ట్రీట్వేర్ బ్రాండ్ ‘గల్లీ లివ్ ఫాస్ట్’ ఐపీఎల్లో రెండు జట్లతో జత కట్టింది. కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లకు ఈ బ్రాండ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ‘గల్లీ లివ్ ఫాస్ట్’కు కేఎల్ రాహుల్ సహయజమాని కావడం విశేషం. -
ప్రీతి జింటా మేడమ్.. ఇలా అయితే ఎలా?
ముంబై: ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ను సాధించిన భారత క్రికెట్ జట్టును అభినందించే క్రమంలో బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ‘తప్పు’లో కాలేశారు. టెస్టు సిరీస్ విజయం అని అనకుండా టెస్టు మ్యాచ్ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్ట్రేలియాపై ‘టెస్ట్ మ్యాచ్’ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు. టీమిండియా విజయంలో చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు’ అని ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు ప్రీతి జింటా. అలాగే, ‘బాయ్స్ ఇన్ బ్లూ’ అని వాడడంపైనా మండిపడ్డారు. టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే బ్లూ జెర్సీ ధరిస్తారని అది కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. సగం తెలివి చాలా ప్రమాదకరం అని దుమ్మెత్తిపోశారు. నెటిజన్ల కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి తన ట్వీట్ను డిలీట్ చేసింది. -
మన్నించండి!
‘మీటూ’ ఉద్యమంపై నటి ప్రీతీ జింతా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా... ‘మీరు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా?’ అన్న ప్రశ్నను ఆమెను అడిగినప్పుడు– ‘‘నా కెరీర్లో లైంగింక వేధింపులను ఎదుర్కొనలేదు. నాకూ అలా జరిగితే ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికేది. అయినా మన ప్రవర్తనను బట్టే ఇతరుల ప్రవర్తన ఉంటుంది. కొందరు మహిళలు పబ్లిసిటీ కోసం, మరికొందరు వ్యక్తిగత ప్రతీకారం కోసం ‘మీటూ’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని అర్థం వచ్చేలా మాట్లాడటంతో పాటు ‘మీటూ’ ఉద్యమం ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె నవ్వారట. దీంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన ప్రీతీ తాను ఇచ్చిన ఇంటర్వ్యూను సరిగ్గా ఎడిట్ చేయలేదని, తన మాటలను అపార్థం చేసుకున్నారని స్పందించారు. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఆమె ఓ లాంగ్ పోస్ట్ను షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘మీటూ’ ఉద్యమం గురించి బయటికి వచ్చి మాట్లాడిన మహిళల మనోభావాలు దెబ్బ తినేలా నా వ్యాఖ్యలు ఉంటే మన్నించండి. మొదట్నుంచి ‘మీటూ’ ఉద్యమానికి నేను మద్దతిస్తున్నాను. దురదృష్టవశాత్తు నా మాటలు తప్పుగా వినిపించాయి. వైరల్ అయిన ఇంటర్వ్యూలో ‘‘నాకు జరిగి ఉంటే చెప్పేదాన్ని అనే మాటకు అర్థం ఏంటంటే.. ‘నన్ను వేధించినట్లయితే వెంటనే రియాక్ట్ అయ్యుండేదాన్ని. వారి చెంప చెళ్లుమనిపించేదాన్ని’ అని. అలాగే నా నవ్వుకు కారణం అదొక ఇంటర్వ్యూ, నేనూ మూవీ ప్రమోషన్ చేస్తున్నాను. అందుకే నవ్వుతూ మాట్లాడాను. ఇక ‘మీటూ’ గురించి చెప్పాలంటే.. మహిళల హక్కుల గురించి చాలాసార్లు మాట్లాడిన నేను ఇప్పుడు ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. భవిష్యత్లో మహిళలు మరింత నమ్మకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే.. మహిళలు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోకపోతే అప్పుడు ఉద్యమం ఉండదు. ఈ ఉద్యమానికి పురుషులు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రీతీ జింతా పేర్కొన్నారు. -
#మీటూ : ‘అప్పుడు రాఖీ సావంత్.. ఇప్పుడు మీరు’
మీ నుంచి ఇలాంటి సమాధానాలు ఊహించలేదంటూ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హంగామా యూట్యూబ్ చానల్లో ప్రసారమైన ప్రీతి ఇంటర్వ్యూనే ఇందుకు కారణం. ఇంతకీ విషయమేమిటంటే... నవంబరు 16న రికార్డు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రీతి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మీకు అలాంటి అనుభవం ఎదురైందా అని ఆమెను ప్రశ్నించగా.. ‘లేదు.. ఒకవేళ ఉన్నా బాగుండేది. మీ ప్రశ్నకు జవాబు దొరికి ఉండేది’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా ‘మనం ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ మహిళలకు చాలా శ్రేయస్కరమైనది. కొంతమంది పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడేస్తున్నారు ’ అని ప్రీతి చెప్పుకొచ్చారు. దీంతో మరి నెస్వాడియా సంగతేంటి. అప్పుడు మీరు ఎందుకు అతడిపై కేసు పెట్టారు.. ఒక మహిళ అయి ఉండి మహిళల గురించి అలా ఎలా మాట్లాడతారు.. మొదట రాఖీ సావంత్.. ఇప్పుడు మీరు.. అసలు ఊహించలేదు ’ అంటూ ప్రీతిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తుండటంతో ప్రీతి దిద్దుబాటు చర్యలకు దిగారు. తన ఇంటర్వ్యూను ఎడిట్ చేసి, వాళ్లకు కావాల్సిన విధంగా మలచుకున్నారంటూ తనను ప్రశ్నించిన జర్నలిస్టుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయితే ప్రీతి ఆరోపణలపై సదరు జర్నలిస్టు ఇంతవరకు స్పందించలేదు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్ సందర్భంగా వ్యాపారవేత్త నెస్వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్పై చార్జిషీట్ దాఖలు చేశారు. గత నెలలో నెస్ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. I’m really suprised & upset that journalists like @iFaridoon take an interview & edit it to sound controversial for better traction. If I said “I wish someone had bothered me” - it meant I would have probable beaten them up if they had... Interviews taken out of context #Metoo — Preity G Zinta (@realpreityzinta) November 19, 2018 -
ఆట వెనుక ఆట
కనిపించే ఆట వెనుక కనిపించని ఆట.. ‘ఇన్సైడ్ ఎడ్జ్’స్వార్థమే ఆ ఇన్సైడ్ గేమ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!పంచ్లు ఉండవు. పవర్ ఉంటుంది. మాటలు ఉండవు. మనీ ఉంటుంది.ఎవరూ క్రిమినల్స్ కాదు.అలాగని ఎవరూ హీరోలు కాదు. చూడండి.. కళ్లు బైర్లు కమ్మే కుట్రలు కుహకాల ఐపీఎల్! ఇన్సైడ్ ఎడ్జ్అమెజాన్ (ప్రైమ్ వీడియో) ఇండియా నెట్వర్క్ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్: ఫర్హాన్ అఖ్తర్ డైరెక్టర్: కరణ్ అన్షుమన్ విడుదల: జూలై 10, 2017 జరీనా మాలిక్, విక్రాంత్ ధవన్ పాత్రలు ప్రీతి జింతా, నెస్ వాడియాలను జ్ఞప్తికి తెస్తాయి. అరవింద్ వశిష్ట్, వాయు రాఘవన్, దేవేంద్ర మిశ్రా, కేజీ రఘునాథ్ రోల్స్.. ధోనీ, విరాట్ కొహ్లీ, శ్రీశాంత్ క్యారెక్టర్స్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ముంబై మావరిక్స్, హరియాణా హరికేన్స్ తలపడ్తున్నాయి. ముంబై మావరిక్స్ బలమైన జట్టు..దేశంలో ఏ ఐపీఎల్ జట్టుతో పోల్చుకున్నా! కాని ఈ మ్యాచ్లో ముంబై మావరిక్స్కు గట్టి పోటీ ఇస్తోంది హరియాణా హరికేన్స్. ఫస్ట్ బ్యాటింగ్ ఆ జట్టుదే. ఏ బంతినైనా బౌండరీ దాటించేస్తున్నారు బాట్స్మెన్. బాక్స్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ముంబై మావరిక్స్ ఓనర్స్ జరీనా మాలిక్ (రీచా చద్దా), విక్రాంత్ «ధవన్ (వివేక్ ఆనంద్ ఒబేరాయ్) మొహాల్లో ఆందోళనేమీ లేదు. క్యాచ్ మిస్ అయినప్పుడు ‘‘షిట్’’ అని, బ్యాట్స్మన్ క్రీజ్లోకి వచ్చాక బాల్ వికెట్కి తగిలినప్పుడు ‘‘ప్చ్’’ అనే నిట్టూర్పులు తప్ప. ముంబై మావరిక్స్ పేలవమైన బౌలింగ్ మీద పెదవి విరిచేస్తున్నారు కామంటేటర్స్. గ్యాలరీలో ఉన్న మావరిక్స్ టీమ్ ఎనలిస్ట్ రోహిణీ రాఘవన్ (సయానీ గుప్తా) కలవర పడుతోంది. మాటిమాటికీ గ్రౌండ్లోకి వెళ్లి కెప్టెన్ వాయు రాఘవన్ (తనూజ్ విర్వాని)ని నిలదీస్తోంది.. ‘‘వాట్స్ గోయింగ్ ఆన్?’’అంటూ. యంగ్ బౌలర్, పందొమ్మిదేళ్ల ప్రశాంత్ కనౌజియా (సిద్ధాంత్ చతుర్వేది)నూ బెదిరిస్తోంది.. ‘‘ఎన్ని రన్స్ ఇస్తున్నావో అర్థమవుతోందా? ఏమైంది మీ అందరికీ?’ అంటూ. ఆమె ఆరాటం చూసి ఎద్దేవాగా నవ్వుతున్నాడు దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్). ఆఫ్టర్ ది బ్రేక్.. సెకండ్ ఇన్నింగ్స్.. ముంబై మావరిక్స్ బ్యాటింగ్కి దిగింది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ వాయు రాఘవన్ వచ్చేవరకు పెద్దగా స్కోర్ కాలేదు. వాయు రాఘవన్ బాక్స్లో ఉన్న తమ ఓనర్ జరీనా మాలిక్ను చూశాడు. పెదవులు విడివడకుండా నవ్వింది ఆమె. పక్కనే ఉన్న విక్రాంత్ని కూడా చూశాడు రాఘవన్. వంకరగా నవ్వాడు విక్రాంత్. ఆడటం మొదలుపెట్టాడు. అంతకుముందు హరియాణా హరికేన్స్ గెలుపు మీద లక్షల్లో పందెం కాసిన విక్రాంత్ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ముంబై మావరిక్స్ ఓటమి మీద కోట్లకు పెంచాడు పందెం పైకాన్ని. గ్యాలరీలో రోహిణీకి అయోమయం. వాయు తప్ప నెమ్మదినెమ్మదిగా మిగిలిన బాట్స్మెన్ అవుటవుతున్నారు. రెండు బంతుల్లో ఫోర్ రన్స్ చేయాలి. ఒక బంతి పడనే పడింది. నో రన్. రోహిణీ శ్వాస ఆగినంత పనైంది. బౌలర్ వ్యూహం పన్నాడు. ఫీల్డర్స్ అంతా దగ్గరగా వచ్చారు. వాయు బ్యాట్ ఎత్తాడు. రోహిణీ ఎనాలిసిస్ స్టార్ట్ చేసింది. పడబోయేది ఏ బాల్? వాయు అవుటవనున్నాడా.. రన్ తీయనున్నాడా అని. బౌలర్ పరిగెడుతున్నాడు పిచ్ వైపు. బ్యాట్ను నేలకు టచ్ చేస్తూ బౌలర్ కదలికలను గమనిస్తున్నాడు వాయు. ఉత్కంఠతతో శ్వాసను బిగబట్టిన రోహిణీ మొహంలో నవ్వు.. ఆమె మాట.. వాయూ బ్యాట్ ఒకేసారి పలికాయి.. ఫోర్.....!రోహిణీ ఆనందం పట్టలేక పిచ్లోకి పరిగెత్తుకొచ్చింది. జరీనా చప్పట్లలో గెలుపు ధ్వనించింది. విక్రాంత్ మొహం వాడిపోయింది. బెట్ కాసిన కోట్లు గంగలో కలిశాయి. ఆయన్ని నమ్మి డబ్బులు పెట్టిన వాళ్ల దవడలు, పిడికిళ్లు బిగుసుకున్నాయి. ప్రశాంత్, హమిష్ మెక్కాల్ (ఎడ్వర్డ్ సన్నేబ్లిక్) హై ఫైవ్ ఇచ్చుకున్నారు. ‘‘దిస్ ఈజ్ మై టీమ్ మిస్టర్ «ధవన్’’ అంటూ చిరుదరహాసంతో వెళ్లిపోయింది జరీనా. అప్పుడొచ్చొంది మిస్టరీ ఉమన్ (నటాషా సూరీ) విక్రాంత్ దగ్గరికి ‘‘నీ మీద భాయ్ చాలా కోపంగా ఉన్నాడు’’ అంటూ. ఎట్ ది ఎండ్ జరీనా తనను మోసం చేసిందన్న కోపం, అవమానంతో విక్రాంత్ ..జరీనా ప్రాణంలా చూసుకునే కుక్కను చంపేస్తాడు. ఆమెనూ చంపబోతుంటే అప్పటిదాకా విక్రాంత్కి కుడిభుజంగా ఉన్న వ్యక్తి వచ్చి జరీనాను కాపాడ్తాడు. ముంబై మావరిక్స్ టీమ్ మెంబర్స్ సంతకాలు చేసిన బ్యాట్ తీసుకుంటుంది జరీనా.. విక్రాంత్ను కొట్టడానికి. ఇక్కడితో ఇన్సైడ్ ఎడ్జ్ ఫస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ సీజన్లో విక్రాంత్ ఎంట్రీ, ఎగ్జిట్ మధ్య ఏం జరిగింది? అది తొమ్మిది ఎపిసోడ్ల కథ మనీ, పవర్, సెక్స్, అండర్ వరల్డ్ మాఫియా.. బిహైండ్ బౌండరీగా ఉన్న ఐపీఎల్ ప్లేని కళ్లకు కడ్తుంది ‘‘ఇన్సైడ్ ఎడ్జ్’’. కాని ఒక డిస్క›్లయిమర్.. కుటుంబమంతా కూర్చోని చూడదగ్గది కాదు. క్రికెట్ ఆట కన్నా ఒక వ్యాపారం. రాజకీయం కూడా. ఐపీఎల్ ట్రెండ్ క్రీజ్లోకి రాగానే ఆ సంస్కృతిని విస్తృతపరిచింది. ఐపీఎల్ మీద పెట్టుబడి పెట్టి.. క్రీడాకారుల గ్లామర్ను ఇంకో గ్రాఫ్కి మళ్లించింది. గెలిచినా డబ్బే. ఓడినా డబ్బే! బెట్టింగ్లు, అమ్మాయిలు, పార్టీలు.. ఫేమ్ కన్నా ఎక్కువ కిక్నిస్తాయనే క్యాచ్ విసిరింది. పట్టుకున్నవాడు పడిపోతాడు.మిస్ చేసినవాడు బాధ పడ్తాడు. వల అని తెలుసుకున్నవాడు అసల్లేకుండా పోతాడు. ఆటే ముఖ్యమని నమ్మినవాడు జట్టుకే దూరమవుతాడు. ఇదే ఇన్సైడ్ ఎడ్జ్ బాటమ్ లైన్. డిటైల్డ్గా.. హీరోయిన్గా అవకాశాలు అడుగంటుతున్న సమయంలో ఐపీఎల్ పగ్గాలు పట్టుకుంటుంది జరీనా మాలిక్. ముంబై మావరిక్స్కి కో ఓనర్గా. ప్రతి మ్యాచ్లో గ్యాలరీ నుంచి టీమ్ను ఉత్సాహపరుస్తుంటుంది. కెప్టెన్ అరవింద్ వశిష్ట్ (అంగద్ బేడీ). నిజాయితీ గల డిపెండబుల్ కెప్టెన్. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా ఆ ప్రభావం తన ఆట మీద, కెప్టెన్సీ పైనా పడనివ్వకుండా టీమ్ విజయం కోసం పాటుపడ్తుంటాడు. బెట్టింగ్స్కి లొంగక, తన యజమానికి వ్యతిరేకంగామారి చివరకు జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతాడు. కోచ్.. నిరంజన్ సూరి (సంజయ్ సూరి) ఒకప్పటి ఏస్ ప్లేయర్. ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీమ్లో ఆడుతున్నప్పుడు పడ్డ కక్కుర్తికి తర్వాత ఐపీఎల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. విక్రాంత్ ధవన్.. వరల్డ్స్ లీడింగ్ స్పోర్ట్స్మేనేజ్మెంట్కంపెనీకి యజమాని. ముంబై మావరిక్స్లోనూ పెట్టుబడి పెట్టి ఒక భాగస్వామిగా మారుతాడు. ఆయనతో ముందు అగ్రిమెంట్ చేసుకున్న జరీనా.. తర్వాత అతని ప్రవర్తనతో భీతిల్లి అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలనుకుంటుంది. అది గ్రహించిన విక్రాంత్ ఆమె చేతిలో ఉన్న అరకొరా సినిమా చాన్స్లనూ లాగేసి, ఫీల్డ్లో ఐసోలేట్ అయ్యేలా చేస్తానని భయపెట్టడమే కాక చిన్న ట్రయల్ కూడా వేస్తాడు. దాంతో అయిష్టంగానే అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేస్తుంది జరీనా. అండర్ వరల్డ్ డా¯Œ అండదండలతో ముంబై మావరిక్స్ను బెట్టింగ్ బరిలో పెడ్తాడు. డబ్బు యావ ఉన్న స్పిన ్నర్ దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్)ను ఎరగా మారుస్తాడు. వికెట్ కీపర్ కేఆర్ రఘునాథ్ (మనూజ్ శర్మ) ను గ్రిప్లో పెడ్తాడు. నిరంజన్ సూరీకీ కబురు పంపిస్తాడు. అలాంటి పనులు చేయనని నిక్కచ్చిగా చెప్పిన సూరీకి గతంలో అతను చేసిన తప్పును గుర్తు చేస్తాడు. చేసేది లేక విక్రాంత్తో చేతులు కలపాల్సి వస్తుంది సూరీకి. తర్వాత రియల్ మావరిక్స్, పరుగుల చీతా.. అనే ట్రాక్ రికార్డ్... మోస్ట్ ఇండిసిప్లీన్డ్, ఉమనైజర్, అన్ పంక్చువల్ అనే ఆఫ్ పిచ్ రిమార్క్స్ ఉన్న వాయు రాఘవన్ మీదా దృష్టిపెడ్తాడు. కాని వాయు దారికి రాడు. వదిలేసి జట్టులో అందరికన్నా చిన్నవాడు, ఫాస్ట్ బౌలర్, గ్రామీణ యువకుడు అయిన ప్రశాంత్ కనౌజియాను లాగాలనుకుంటాడు. ఆ పని దేవేంద్ర మిశ్రాకు అప్పగిస్తాడు. అప్పటికే ప్రశాంత్ను కులం పేరుతో వెక్కిరిస్తూ, అర్బన్ లైఫ్ స్టయిల్ లేదని విపరీతంగా వేధిస్తుంటాడు దేవేంద్ర మిశ్రా. అసలే ఇంగ్లిష్ రాదని ఆత్మన్యూనతతో కుంగిపోతున్న ప్రశాంత్కు దేవేంద్ర మిశ్రా ర్యాగింగ్ నరకాన్ని తలపిస్తుంటుంది. ఇవన్నీపడలేక ఊరెళ్లిపోవాలని ప్రశాంత్ అనుకుంటున్నప్పుడే దేవేంద్ర మిశ్రా బెట్టింగ్ గురించి చెప్పి.. జరగబోయే మ్యాచ్లో సరిగా ఆడొద్దని వార్న్ చేస్తాడు. విన్న ప్రశాంత్ అవాక్కవుతాడు. అందులో కోచ్ సూరీ సర్ కూడా షామిల్ అయ్యాడని తెలిసి ఖంగు తింటాడు. మొత్తమ్మీద ఆ మ్యాచ్ ఓడిపోతారు. ఇవేవీ తెలియని జరీనా.. తన జట్టు ఓడినందుకు బాధపడుతుంది. హరియాణా హరికేన్స్తో మ్యాచ్కంటే ముందు.. జట్టు ఓడిపోగానే కోచ్ సూరి అపరాధభావంతో కుమిలిపోతుంటాడు. ఏమైనా సరే ఇలాంటివి తన వల్ల కాదని చెప్పాలని విక్రాంత్ దగ్గరకు వెళ్తాడు. చెప్తాడు. అయినా బలవంతం చేస్తే మీడియా ముందు బయటపెట్టేస్తాననీ వార్నింగ్ ఇస్తాడు సూరి . అతని మాటను విన్నట్టే నటిస్తాడు. ఈ క్రమంలోనే జరీనా తన సినిమా ప్రివ్యూకి ముంబై మావరిక్స్ను పిలుస్తుంది. పార్టీ కూడా ఇస్తుంది. ఆ పార్టీకి కెప్టెన్ అరవింద్ రాడు. భార్యతో సమయం గడిపి, కాపురం నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండి. అదే విషయాన్ని ప్రివ్యూలో ఉన్న సూరీకి మెస్సేజ్ చేస్తాడు.. ‘‘అంతా బాగుంటుంది అన్నావ్.. ఏమీ బాగాలేదు. వస్తున్నాను.ఉండు’’ అని. కాసేపటికి సూరీ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ విక్రాంత్ ఉంటాడు. మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడి సూరీని పై నుంచి కిందకు తోసి చంపేస్తాడు. అది కెప్టెన్ అరవింద్ మీదకు వచ్చేలా.. వాయు అందులో భాగస్వామేమో అన్నట్టుగా.. నేపథ్యాన్ని పన్నుతాడు విక్రాంత్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఈలోపే హరియాణా హరికేన్స్తో మ్యాచ్ ఉంటుంది. అప్పుడే రోహిణీ, కెప్టెన్ అరవింద్, జరీనాకు.. విక్రాంత్ ముంబై మావరిక్స్ను బెట్టింగ్కి తాకట్టు పెట్టాడని అర్థమవుతుంది. వాయూకి ఉన్న బ్యాడ్ రిమార్క్స్తో బ్లాక్ మెయిల్ చేసి వాయూని బెట్టింగ్కి ఒప్పిస్తాడు విక్రాంత్. విక్రాంత్ను భరించాల్సిన అవసరం లేదని జరీనాకు ఎదురుతిరుగుతాడు అరవింద్. తనకు సపోర్ట్గా హమిష్, ప్రశాంత్ను కలుపుకుంటాడు. జరీనా మెదడులో వేరే ప్లాన్ ఉంటుంది. అందులో భాగంగానే చివరి క్షణంలో అరవింద్ మీద అటాక్ జరిగి అతను హోటల్ గదిలోనే స్పృహతప్పి పడిపోతాడు. అరవింద్ స్థానంలో వాయు రాఘవన్ కెప్టెన్ అవుతాడు. అతని సారథ్యంలో ప్రశాంత్, హమీష్లు జట్టు ఓనర్ విక్రాంత్ను, జతగాడు దేవేంద్ర మిశ్రాను నమ్మించి మోసం చేస్తారు.. హరియాణా హరికేన్స్ మీద ముంబై మావరిక్స్ విజయ డంకా మోగిస్తారు. ఇదంతా జరీనా ప్లాన్! పవర్ ప్లే, బన్నీ, ఇన్నర్ సర్కిల్, రాంగ్ ఫూట్, అవే గేమ్, ఓపెనింగ్ బిడ్, ఫో, కారిడార్ ఆప్ అన్సర్టెనిటీ, హ్యామర్ ప్రైజ్, మాగ్జిమమ్.. పేర్లతో పది ఎపిసోడ్స్గా సాగుతుంది ఇన్సైడ్ ఎడ్జ్. అమేజాన్ ప్రైమ్లో ఉంది. చూడొచ్చు. – సరస్వతి రమ -
వేధింపుల కేసులో నెస్ వాడియాకు ఊరట
ముంబై : బాలీవుడ్ నటి ప్రీతి జింటాను వేధించిన కేసులో పారిశ్రామిక వేత్త నెస్ వాడియాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నెస్ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా నెస్వాడియా క్షమాపణలు చెబితే ప్రీతి కేసు వాపసు తీసుకుంటారని ఆమె తరపు లాయరు పేర్కొనడంతో.. నెస్ వాడియా లాయరు మొదట అందుకు ఒప్పుకోలేదు. కానీ బుధవారం ఇరు వర్గాలు కోర్టుకు హాజరుకాగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నెస్ వాడియా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధపడటంతో కేసును కొట్టి వేస్తున్నట్లు జస్టిస్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్ సందర్భంగా నెస్వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్పై చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 354, 506, 509ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. -
చావు అంచులదాకా వెళ్లా : ప్రీతి జింటా
‘సునామీ సృష్టించిన బీభత్సానికి దాదాపు చావు అంచుల దాకా వెళ్లాను. ఆరోజు ఫుకెట్లో ఉన్నాం. నా కళ్ల ముందే నాతోపాటే వచ్చిన ఎంతో మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. నేనొక్కదాన్నే బతికి బయటపడ్డాను. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా అది చాలా దుర్దినం’ అంటూ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నటి ప్రీతి జింటా. ఇండియాటుడే కాన్క్లేవ్ ఈస్ట్ 2018 సమ్మిట్లో పాల్గొన్న ప్రీతి... 2004, డిసెంబరు 26 తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు. ‘ నిజంగా ఆరోజు చనిపోతానేమో అనుకున్నా. కానీ ఆ దేవుడి దీవెనలు నాకు ఉన్నాయి. నాతో పాటు తీర ప్రాంతాల అందాలను చూడటానికి వచ్చిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా బతికి బయటపడ్డానంటే ఏదో కారణం ఉంటుందని బలంగా నమ్మాను. పునర్జన్మ పొందినందుకు గుర్తుగా ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. ఐపీఎల్ ప్రాంఛైజీ ఓనర్గా, నటిగా ప్రస్తుతం ఇలా మీ ముందున్నాను’ అంటూ ప్రీతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా 2004, డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో సునామీ చెలరేగిన విషయం తెలిసిందే. 14 దేశాల్లోని దాదాపు 2 లక్షల ముప్పై వేల మందిని ఆ రాకాసి అలలు పొట్టనబెట్టుకున్నాయి. -
అతడిని నిజంగానే చంపేస్తానేమో అనుకున్నారు!!
సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా, నవాబ్ సైఫ్ అలీఖాన్ జంటగా తెరకెక్కిన ‘సలామ్ నమస్తే’ సినిమాకు నేటితో13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ప్రీతి జింటా గుర్తు చేసుకున్నారు. ‘ వావ్. సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. కెమెరా ముందు, వెనుక కూడా సైఫ్తో విపరీతంగా గొడవ పడేదాన్ని. ఒక్కోసారి నటించడం మానేసి జీవించేదాన్ని. దీంతో నేను సైఫ్ను నిజంగానే చంపేస్తానేమో అని సిబ్బంది కంగారుపడేవారు. అంతలా కొట్టుకునే వాళ్లం. సైఫ్ను మిస్సవుతున్నా. సలామ్ నమస్తేకు 13 ఏళ్లు పూర్తయ్యాయి’ అంటూ ప్రీతి ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా ఈ మధ్య సినిమాలు తగ్గించేశారు. కేవలం అతిథి పాత్రలకే పరిమితమయ్యారు. వ్యాపారవేత్తగా సెటిలైన ప్రీతి.. 2016లో తన స్నేహితుడు జీన్ గుడెనఫ్ను పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram Awwww !!! We had so much fun on this film it was insane. Saif and I fought so much on and off camera that the crew didn’t know if we were rehearsing our lines or really wanting to kill each other 🤩 I miss Saif! 😘 #13YearsOfSalaamNamaste #SaifAliKhan #Nick #Amber #Ting! A post shared by Preity G Zinta (@realpz) on Sep 9, 2018 at 1:39am PDT -
పైవాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త!
-
అడ్డంగా బుక్కయ్యాడు.. : నటి
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీలలో నటి ప్రీతి జింతా ఒకరు. ఆమె షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో వైరల్గా మారింది. గతంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూసినా.. నటి ప్రీతి జింతా ఓ సందేశాన్ని అందిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. బైక్ ట్రబుల్ ఇవ్వడంతో చెక్ చేస్తున్న వ్యక్తి ప్యాంటు వెనుక జేబులోంచి పర్సును ఓ దొంగ తీశాడు. ఆపై ఏం జరిగిందో ప్రీతి జింతా చెబుతూ.. పైవాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త అని, మైండ్ బ్లోయింగ్, కాట్ ఆన్ కెమెరా అనే హ్యాష్ట్యాగ్స్ జతచేసి పోస్ట్ చేయగా ఆమె ఫాలోయర్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దొంగ భలే బుక్కయ్యాడని కొందరు.. సీన్ రివర్సయిందంటూ మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియో మీరు వీక్షించండి.. Are you kidding me ? This thief takes the cake 🤪 after all Uper wala dekh raha hai 😘😜👏 ऊपर वाला देख रहा है ! #mindblowing #caughtoncamera #thief #bachaao #ting #apology #Roadside pic.twitter.com/OeMSOYPAv1 — Preity G Zinta (@realpreityzinta) 15 July 2018 -
ఇష్టమొచ్చినట్లు రాయకండి: ప్రీతి జింటా
పుణె: వివాదాస్పద వీడియో.. మీడియా కథనాలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మళ్లీ స్పందించారు. ముంబై ఓడిపోయినందుకు తానేం సంతోషపడలేదని, తమ జట్టు అవకాశం కోసమే అలా స్పందించానని మరోసారి స్పష్టం చేశారు. అనవసరంగా మీడియా ఆ విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తోందని ప్రీతి మండిపడ్డారు. లీగ్ మ్యాచ్ల్లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి చెంది ఇంటి ముఖం పట్టింది. దీంతో ప్రీతి ఆనందం వ్యక్తం చేసినట్లు ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. (వీడియో కోసం..) తమ జట్టు(పంజాబ్) ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, అందుకే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. సంచలనాల కోసం మీడియా అత్యుత్సాహంతో వార్తలు రాస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘మా జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎవరి జట్ల కోసం వాళ్లు ఆలోచించటంలో తప్పులేదు. వేరే జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తే నేను సంబరపడలేను కదా..! ముంబై ఓడి పోయినందుకు నేను ఆనంద పడలేదు.. మా జట్టు పరిస్థితిపై మాత్రమే ఆందోళన చెందాను పంజాబ్ నాకౌట్కి చేరుకోలేక పోవడం బాధాకరం’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘మా జట్టు ప్లేఆఫ్కు చేరుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. కానీ విజయమే వరించలేదు. ఫైనల్స్లో ఏ జట్టు గెలిచినా ఫర్వాలేదు. కానీ, ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’ని ఆమె పేర్కొన్నారు. Dear Media I will appreciate it if you dont create unnecessary controversy of me being happy that another team got knocked out so my team had a real chance. It could be any other team & the word “Finals” never featured in any conversation so stop misreporting as always 🙏 #fedup — Preity zinta (@realpreityzinta) May 22, 2018 -
అందుకే సంబరాలు: ప్రీతి జింటా క్లారిటీ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి చెందిన తర్వాత ఆనందం ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చిందో కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా వివరణ ఇచ్చారు. తమ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, దానిలో భాగంగానే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్పంజాబ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ప్రీతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమే కాకుండా వరుస పరాజయాలు తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని దెబ్బ తీశాయని ఆమె పేర్కొన్నారు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్కు వెళ్లకుండా లీగ్ దశతోనే సరిపెట్టుకోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించిన జట్టు ప్లేఆఫ్కు చేరకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇది తనను చాలా బాధించిందని తెలిపిన ప్రీతి.. కింగ్స్ పంజాబ్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. వచ్చే ఏడాది ఈ తరహా పరిస్థితి రాదని అనుకుంటున్నానని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై ఓటమిపై ప్రీతి సంబరం.. వైరల్!! -
ముంబై ఓడింది.. నాకు చాలా ఆనందంగా ఉంది!
అదే ఆనందమో తెలియదు కానీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిందని తెలియగానే ఆమె తెగ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్లో వైరల్ అయింది. కానీ, ఆ తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్లో ప్రితీ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే చెన్నైని కనీసం 53 పరుగుల తేడాతో ఓడించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన పంజాబ్ చివరకు పరాభవంతో ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ముంబై ఓడిపోగానే ప్రితీ సంబరపడటంపై నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేం ఆనందమోగానీ.. తన జట్టు గెలువకపోయినా పర్వాలేదు.. ముంబై మాత్రం ఓడిపోవడం ఆమెకు ఆనందంగా ఉన్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ.. తమకు ఏమీకాని ఫలితంతో ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. Did anyone else read those lips? @realpreityzinta just said "I'm still very happy #MumbaiIndians are out, very happy!" Just shows the spirit. Sigh! #PreityZinta #CSKvsKXIP #KXIPvCSK #MIvDD #DDvMI #IPL2018 #CSKvKXIP #Yellove #WhistlePodu #CSKvKXIP #Dhoni #IPL18 — Bhat (@ibhat26) 20 May 2018 -
ముంబై ఓటమితో ప్రీతి జింటా ఆనందం
-
సెహ్వాగ్–ప్రీతి మధ్య విభేదాలు?
ముంబై: రాజస్తాన్ రాయల్స్ చేతిలో మంగళవారం ఎదురైన పరాజయం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీలో విభేదాలకు కారణమైంది. ఈ మ్యాచ్లో 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. దీంతో జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యూహాలను ఫ్రాంచైజీ యజమాని ప్రీతి జింటా ప్రశ్నించింది. హిట్టర్లను కాదని కెప్టెన్ అశ్విన్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపడం ఏమిటంటూ ఆమె అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ జట్టు కూర్పు విషయమై ఇద్దరి మధ్యా విభేదాలు రావడం, ప్రీతి వైఖరితో నొచ్చుకున్న వీరూ... బాధ్యతల నుంచి తప్పుకొంటానంటూ ఫ్రాంచైజీ ఇతర యజమానులకు చెప్పినట్లు సమాచారం. కానీ, దీనిపై సెహ్వాగ్ నుంచి ఇంతవరకు ఎలాంటి వివరణ రాలేదు. జట్టు ప్లే ఆఫ్కు చేరువగా ఉన్న ఈ దశలో వివాదాల కారణంగా ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకూడదనే అతడు మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. మరోవైపు వారిద్దరి మధ్య సంభాషణ... ప్రతి మ్యాచ్ అనంతరం జరిగే చర్చలాంటిదేనని, ఫలితం పట్ల ప్రీతి నిరాశ చెందారని కొందరు పేర్కొంటున్నారు. తాను వారిద్దరితో మాట్లాడానని, సమస్యేమీ లేదని సహ యజమాని మోహిత్ బర్మన్ చెబుతున్నారు. ప్రీతి కూడా వివాదం జరుగలేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. -
ప్రీతి జింతా ఫైర్..
న్యూఢిల్లీ : కింగ్స్ పంజాబ్ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, యజమాని ప్రీతిజింతాల మధ్య వివాదం తలెత్తిందంటూ వచ్చిన వార్తలను ప్రీతి ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసత్య కథనాలను ప్రచురించొద్దంటూ మీడియాపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి సెహ్వాగ్ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తనకి సెహ్వాగ్కు మధ్య ఏదో వాగ్వాదం జరిగిందని, తనని విలన్ను చేసి చూపిస్తూ వార్తలు రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు. జింతా ట్వీట్ అనంతరం కింగ్స ఎలెవన్ పంజాబ్ సైతం ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రీతి జింతా-సెహ్వాగ్ల మధ్య వివాదం చెలరేగిందంటూ వచ్చిన వార్తలు సత్యదూరమని పేర్కొంది. ఎవరో కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. చదవండి : ప్రీతిజింతా అసహనం.. సెహ్వాగ్ సంచలన నిర్ణయం! -
ప్రీతిజింతా అసహనం.. సెహ్వాగ్ సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్ : కింగ్స్ పంజాబ్ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, యజమాని ప్రీతిజింతా మద్య వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి సెహ్వాగ్ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. రాజస్థాన్తో పంజాబ్ ఆడిన మ్యాచ్లో 158 పరుగులను ఛేజ్ చేయలేక చతికల పడి ఓటమి పాలైంది. ఛేదనలో తొలి వికెట్ పడిన అనంతరం కరుణ్ నాయర్, మనోజ్ తివారి వంటి ఆటగాళ్లు ఉన్నా అశ్విన్ను బ్యాటింగ్కు పంపించారు. అయితే కెప్టెన్ పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. అనంతరం ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓటమితో అసహనానికి గురైన ప్రీతిజింతా ఆవేశంతో కోచ్, మెంటర్గా ఉన్న వీరూపై మండిపడింది. సెహ్వాగ్ పలుసార్లు సహనంతో ఓటమికి కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయినా కూడా ప్రీతిజింతా పదేపదే విమర్శలకు దిగుతుంటడంతో వీరూ ఆలోచనలో పడినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. పంజాబ్కు ప్లేఆఫ్స్కు అవకాశం ఉండటంతో ఈ విషయంపై విరవణ ఇవ్వడానికి సెహ్వాగ్ నిరాకరించారు. ఈ వివాదాలు ఆటగాళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో అటు యాజమాన్యం, ఇటు సెహ్వాగ్ మౌనంగా ఉన్నారని సమాచారం. ఈ వివాదంపై ప్రీతిజింతా వివరణ కోసం ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. గతంలో సైతం ఇదే తీరుగా ప్రవర్తించారు. గత ఐదేళ్లుగా పంజాబ్కు కోచ్గా పనిచేస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, ప్రీతిజింతా మధ్య చాలాసార్లు వివాదాలు తలెత్తాయి. -
ప్రీతి జింటాకు బాగా కోపమొచ్చేసింది!
మొహాలి : ప్రీతి జింటాది నలుగురితో కలివిడిగా ఉండే తత్వం. మైదానంలో నవ్వులు రువ్వుతూ.. నిత్యం సంతోషంగా కనిపిస్తారామె. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ఆమె తమ జట్టు మ్యాచ్లు ఎక్కడ జరిగినా.. అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ జట్టు సభ్యులను ఉత్సాహ పరుస్తుంటారు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ వర్సెస్ చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ప్రీతి ఉత్సాహంగా కనిపించారు. ఈ మ్యాచ్లో ధోనీ అద్భుతంగా ఆడి ఐపీఎల్లో కెరీర్ బెస్ట్ అయిన 79 పరుగులు చేసి.. నాటౌట్గా ఉన్నప్పటికీ చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో ధోనీ వీరోచితంగా ఆడుతున్నంతసేపు మైదానంలో ప్రీతి ఒకింత డల్గా కనిపించారు. మొదట క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడి.. చెన్నైకి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ధోనీ ఆటతీరుతో చెన్నై జట్టు లక్ష్యం దిశగా సాగడం ఆమెలో కొంత టెన్షన్ రేపినట్టు కనిపించింది. కానీ, చివరకు పంజాబ్ జట్టు గెలుపొందడంతో ప్రీతి ఆనంద డొలికల్లో తేలియాడింది. గెలిచిన అనంతరం ఆమె మైదానంలోని అభిమానులకు కింగ్స్ ఎలెవన్ జట్టు టీ షర్ట్లను పంచింది. ఈ సందర్భంగా ప్రీతి ఒక్కసారిగా సహనం కోల్పోయినట్టు కనిపించింది. ప్రేక్షకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి. కోపంతో కొందరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం.. ప్రేక్షకులకు ఆమెకు మధ్య కొంత వాగ్వాదం నడవడం వీడియోలో కనిపించింది. వెంటనే నార్మల్ అయిపోయిన ప్రీతి మళ్లీ యథావిధిగా అభిమానులకు టీషర్ట్లు పంచింది. అయితే, టీషర్ట్ల కోసం అభిమానులు ఎగబడటంతో చిన్నారులు కిందపడి నలిగిపోయే పరిస్థితి ఎదురైందని, అందుకే చిన్నారులకు ఇబ్బంది కలుగకుండా చూడాలంటూ ప్రేక్షకులను ఉద్దేశించి పేర్కొన్నట్టు ప్రీతి ట్విటర్లో వివరణ ఇచ్చారు. -
తట్టుకోలేనంత సంతోషంలో ప్రీతి జింతా!
మొహాలి : ఐపీఎల్-11 సీజన్లో కింగ్స్ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేయడంతో ఆ జట్టు సహయజమాని ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీడేర్ డెవిల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డుకు తోడు కరుణ్ నాయర్ మెరవడంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రీతి జింతా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘నూతన సారథి అశ్విన్ నాయకత్వంలో కేఎల్ రాహుల్ రికార్డు నమోదు, ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్ ప్యాక్స్ పంచ్లతో మ్యాచ్ ఆసాంతం నా నవ్వును ఆపుకోలేకపోయాను’ టింగ్! అని ఈ స్టార్ ఆటగాళ్లతో దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ట్వీట్ పంజాబ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్తో పంజాబ్ ఆటగాళ్లు రెండు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దీంతో ఇప్పటివరకూ యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్ధలైంది. ఇక 17 ఏళ్ల 11 రోజుల వయసుతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముజీబ్ ఉర్ రహ్మాన్ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరిట ఉండేది. When @ashwinravi99 leads, @klrahul11 sets a new record, @Mujeeb_Zadran debuts at 17, @karun126 packs a punch & I can’t stop smiling 😃 #ting😘 pic.twitter.com/9DZZX9XwK0 — Preity zinta (@realpreityzinta) 9 April 2018 -
జైల్లో సల్మాన్ను కలిసిన ప్రీతీ జింతా
-
జైల్లో సల్మాన్ను కలిసిన హీరోయిన్..
జోధ్పూర్: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సల్మాన్ను కలిసేందుకు నటి ప్రీతీ జింతా శుక్రవారం జైలుకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం సల్మాన్కు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా తన ట్విటర్ ద్వారా స్పందించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా సోషల్మీడియాలో స్పందించారు. గతంలో కూడా ఇండియాలో వేల సంఖ్యలో కృష్ణ జింకలను చంపేశారు. మీకు అది ఏ మాత్రం పెద్ద విషయం కాదు. రోజూ మనం ఆవుల్ని, మేకల్ని, పందుల్ని చంపేస్తున్నాం. ఆ ప్రాణాలు మనకు లెక్క లేవా. అని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసులో సల్మాన్తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. -
ప్రీతితో చిందేయడానికి గేల్ రెడీ!
ముంబై : వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించేందుకు సిద్దమయ్యాడు. బ్యాట్తోనే కాకుండా తన ఆట పాటతో అలరించే గేల్ను కొనుగోలు చేసేందుకు తొలుత ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. రెండు సార్లు అతను ఆన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. చివర్లో కింగ్స్ పంజాబ్ సహా యజమాని ప్రీతిజింతా కనికరించడంతో ఈ విధ్వంసకర బ్యాట్స్మన్కు ఈ సీజన్ ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో పంజాబీ స్టైల్లో అలరించేందుకు గేల్ సిద్దమవుతున్నాడు. ఓ పంజాబీ సాంగ్కు డ్యాన్స్ చేసిన వీడియోను ‘భారత్కు వస్తున్నా.. పంజాబీ స్టైల్లో అలరిస్తా’ అనే క్యాప్షన్తో తన ఇన్స్టాగ్రమ్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్కు ప్రాతినిథ్యం వహించిన గేల్ గత సీజన్లో విఫలమయ్యాడు. దీంతో ఏ ఫ్రాంచైజీ గేల్పై ఆసక్తి కనబర్చలేదు. అయితే ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో ఈ జమైకన్ స్టార్ పరుగుల సునామీ సృష్టించి ఫామ్లోకి వచ్చాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 11 సిక్సులతో శతకం సాధించాడు. -
ప్రీతి జింతా.. ‘పేరు’ సమస్య
న్యూఢిల్లీ : ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్’ ఫ్రాంచైజీ పేరు మారబోతుందా?. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 10 సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడానికి జట్టు పేరే కారణమని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సహ యజమాని ప్రీతి జింతా ఫ్రాంచైజీ పేరు మార్పుకు బీసీసీఐను అభ్యర్థించినట్లు తెలిసింది. అమెరికాలో ఏటా జరిగే ఎన్బీఏ, బేస్బాల్ లీగ్లను ఇందుకు ఆమె ఉదాహరణగా పేర్కొన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఎన్బీఏ, బేస్బాల్ లీగ్లలో సీజన్ సీజన్కు పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరును మార్చేందుకు అవకాశం ఇవ్వాలని ప్రీతీ కోరినట్లు వెల్లడించారు. అయితే, ఫ్రాంచైజీ పేరు మార్పుపై బీసీసీఐ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వనట్లు సమాచారం. కాగా, ఈ సీజన్లో పలువురు స్టార్ ఆటగాళ్లను పంజాబ్ జట్టు వేలంలో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో కేఎల్ రాహుల్(రూ.11 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6 కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు), క్రిస్గేల్ (రూ.2 కోట్లు) పంజాబ్ కొనుగోలు చేసింది. మరి స్టార్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీ పేరు మార్పు పంజాబ్ దశను తిప్పుతాయేమో వేచి చూద్దాం. -
ఐపీఎల్ వేలంపై సెహ్వాగ్ సెటైర్
సాక్షి, బెంగళూరు : ట్వీటర్లో ప్రతివిషయంపై వ్యంగ్యంగా స్పందించే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ వేలంను సైతం విడిచిపెట్టలేదు. బెంగళూరు వేదికగా ఐపీఎల్-11 కోసం ఆటగాళ్ల వేలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకొనేందుకు కోట్లానుకోట్ల రూపాయలతో పోటీపడుతున్నాయి. ఈ వేలంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్కు మెంటర్గా పాల్గొన్న సెహ్వాగ్ ఫ్రాంచైజీ సహ యజమానైన ప్రితీజింతాపై సెటైరిక్ ట్వీట్ చేశాడు. ‘సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రీతి ఫుల్ షాపింగ్ మూడ్లో ఉంది. ఏదీ కనిపించినా కొనుగోలు చేస్తోంది.’ అని ట్వీట్ చేశాడు. ఇక ఆటగాళ్ల వేలంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘చిన్నప్పుడు మనం కూరగాయలు కొనేందుకు వెళితే.. అమ్మ ధర సరిగ్గా చూసి కొనమని చెప్పేది. ఇప్పుడు మేం ఆటగాళ్లను కొనడానికి వెళ్తున్నాం. తేడా ఏంటంటే.. ఇప్పుడు ఓనర్ చెబుతారు.. సరైన ధరకి కొనమని’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక కింగ్స్ఎలెవన్ పంజాబ్ రిటైన్ పద్దతిలో అక్సర్ పటేల్ను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వేలంలో కేఎల్ రాహుల్కు అత్యధికంగా రూ.11 కోట్లు వెచ్చించగా.. రవిచంద్రన్ అశ్విన్ను రూ.7.6 కోట్లతో కొనుగోలు చేసింది. కింగ్స్ పంజాబ్ దక్కించుకున్న ఆటగాళ్లు అరోన్ ఫించ్ - 6.2 కోట్లు మార్కస్ స్టోయినిస్ - 6.2 కోట్లు కరుణ్ నాయర్ - 5.6 కోట్లు డేవిడ్ మిల్లర్ - 3 కోట్లు యువరాజ్ సింగ్ - 2 కోట్లు మయాంక్ అగర్వాల్ - రూ. కోటి అంకిత్ రాజ్పుత్ - రూ. 3 కోట్లు -
దక్షిణాఫ్రికా లీగ్లో ప్రీతి జింటా
జట్టును కొన్న కింగ్స్ ఎలెవన్ యజమాని పార్ల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అత్యంత పేలవం. అయినా సరే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న గ్లోబల్ టి20 లీగ్లో కూడా ప్రీతి జింటా అడుగుపెట్టింది. ‘స్టెలెన్బాష్’ టీమ్ను కొనుగోలు చేసింది. కొన్నాళ్ల క్రితం జట్లను వేర్వేరు కంపెనీలు సొంతం చేసుకున్న సమయంలో స్టెలెన్బాష్ను దక్షిణాఫ్రికాకే చెందిన బ్రిమ్స్టోన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుక్కుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలతో బ్రిమ్స్టోన్ తాము లీగ్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా...ఆ స్థానంలో ఇప్పుడు ప్రీతి జింటా వచ్చింది. -
ల్యాక్మిలో బాలీవుడ్ అందాలు
-
మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి..
ముంబై: మాజీ ప్రేమికులు బాలీవుడ్ భామ ప్రీతి జింటా, వ్యాపారవేత్త నెస్ వాడియాలు గతంలో ఏర్పడ్డ విభేదాలను పక్కనపెట్టారు. ప్రేమ, వివాదాలను మరచిపోయి ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా కలసి పనిచేయనున్నారు. గతంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకుని కేసుల వరకు వెళ్లిన ప్రీతి, వాడియా.. తాజా ఐపీఎల్ సీజన్లో ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించిన సందర్భంగా ఇద్దరూ తమ జట్టు క్రికెటర్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీతి, వాడియా గతంలో దాదాపు 10 ఏళ్లు డేటింగ్ చేశారు. వ్యాపార భాగస్వాములుగా మారి 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ సహ యజమానులయ్యారు. కాగా ఆ మరుసటి ఏడాది నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఓ పార్టీలో ప్రీతిని వాడియా చెంపదెబ్బ కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇక 2014లో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. వాడియా తనను దూషించి, లైంగికంగా వేధించాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత ఇద్దరూ పూర్తిగా దూరమయ్యారు. గతేడాది ప్రీతి వ్యాపారవేత్త గుడెనఫ్ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రీతి, వాడియా గతాన్ని మరిచి వ్యాపార భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. -
మావారు చూసింది ఆ ఒక్క సినిమానే : ప్రీతీజింటా
ముంబై : తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా కొంచెం గ్యాప్ తర్వాత 'భయ్యాజీ సూపర్ హిట్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ సమ్మర్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్ర షూటింగ్ ముగియడంతో ప్రీతి ట్విట్టర్లో అభిమానులతో శుక్రవారం చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చింది. ప్ర- మీ అభిమాన క్రికెటర్ ఎవరు? స-వీరూ, యూవీ, విరాట్, ధోనీ, సచిన్ ప్ర- మీ జీవితంలో ఏదైనా సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? స-జీవితంలో జరిగే మంచి, చెడులనుంచి నేను ప్రతిసారి కొత్త విషయాలన్ని నేర్చుకుంటూనే ఉన్నా. గడచిన జీవితంలో తాలూకూ సంఘటనలను జరగకుండా ఉంటే బావుండు అని అనుకోవడం లేదు. మా తండ్రిని కోల్పోయిన విషయంలో మాత్రం చింతిస్తూనే ఉన్నా.. ప్ర-మీ ఆయనకు బాలీవుడ్ చిత్రాలంటే ఇష్టమేనా? స- ఆయన ఒక్క వీర్ జరా సినిమా మాత్రమే చూశారు. ప్ర-2016లో మీకు నచ్చిన చిత్రాలు.. స-దంగల్, సుల్తాన్, పింక్, నీరజ్, ఏ దిల్ హై ముష్కిల్ ప్ర- కాబిల్ సినిమా చూశారా ? స-కోయి మిల్ గయా తర్వాత హృతిక్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. యామీ గౌమి తన నటనతో నన్ను ఏడిపించింది. ప్ర- అక్షయ్ కుమార్ గురించి అడిగితే మీ మదిలోకొచ్చే సమాధానం స-కిలాడీ ప్ర- సమోసా, దోసల్లో ఏది ఇష్టం ? స-ముంబైలో ఉంటే సమోసా, లాస్ ఏంజెల్స్లో దోస ప్ర- మీ రోల్ మాడల్ ? స-మా అమ్మ ప్ర- పాడటం అంటే మీకిష్ణమా ? స-భూమ్మీదే కాదు విశ్వంలోనే నేనే బెస్ట్ బాత్రూం సింగర్ని..హహా ప్ర - మీరు బాలీవుడ్లో అందమైన నటిగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చెప్పారు..మీ స్పందన ? స-అయితే సల్మాన్కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే.. ప్ర- మీ ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ ? స-ఇండియాలోని పర్వతాలు, అమెరికాలోని సముద్రం... -
ప్రీతీజింతా సోదరుడి ఆత్మహత్య
సిమ్లా: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్లో సెట్ అయిన ప్రీతీజింతా సోదరుడు నితిన్ చౌహాన్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రీతిజింతా కజిన్ సోదరుడైన నితిన్ చౌహాన్ గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే భార్య, అత్త, మామల వేధింపులు తాళలేక శుక్రవారం సిమ్లాలో తన కారులో గన్తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు నితిన్ కారులోనూ, ఇంట్లో నాలుగు పేజీల రెండు సూసైడ్ నోట్లు లభించాయి. అందులో భార్య, అత్త, మామల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి కన్నకొడుకుని కూడా చూడనివ్వలేదని సూసైడ్ నోట్లో నితిన్ తెలిపాడు. దీంతో భార్య, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కోర్టులో దాఖలు చేసుకున్న విడాకుల కేసుకు సంబంధించి విచారణ శుక్రవారమే జరగాల్సి ఉంది. -
ప్రీతి జింతాకు షారూఖ్ సారీ ఎందుకు?
ముంబై: బాలీవుడ్ 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్.. హీరోయిన్ ప్రీతి జింతాకు క్షమాపణ చెప్పాడు. వీరిద్దరూ నటించిన 'దిల్ సే' సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా షారూఖ్ ప్రత్యేకంగా తయారు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 'మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడినప్పుడు వారిని ఎంతో ప్రేమిస్తాం. అయితే ఎల్లకాలం ఎక్కువగా ప్రేమించడం సాధ్యంకాకపోవచ్చు. కానీ నాకు ఎంతో ఇష్టమైన దిల్ సే సినిమాపై ప్రేమ కాస్త కూడా తగ్గలేద'ని ఇన్స్టాగ్రామ్ వీడియోకు మెసేజ్ పెట్టాడు. అయితే ఈ వీడియో హీరోయిన్ ప్రీతి జింతా ప్రస్తావన లేకపోవడంతో ఆమెకు షారూఖ్ క్షమాపణ చెప్పాడు. వీడియోలో ప్రీతి జింతాను కూడా చేర్చి మరోసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దిల్ సే' సినిమా 1998, ఆగస్టు 21న విడుదలైంది. ఇందులో షారూఖ్ సరసన మనీషా కొయిరాల, ప్రీతి జింతా నటించారు. తీవ్రవాదం నేపథ్యంలో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం, రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్, భరత్ షా సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రీతి జింతా బాలీవుడ్ ను పరిచయమైంది. -
కింగ్స్ పంజాబ్ ఓడితే నా పరువు పోదు!
ఆయనెవరో రాశాడు.. క్రికెట్ గురించి నాకేం తెలియదని! ఆయనే ఇంకో రహస్యం కూడా కనిపెట్టాడు. నా ట్వీటర్ స్టేటస్లో యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎంట్రప్రెన్యూర్, హ్యూమన్ బీయింగ్ అండ్ క్రికెట్ ఫ్యాన్ అని మాత్రమే ఉంటుంది కనుక క్రికెట్ గురించి నేనేం మాట్లాడ కూడదట. నా.. కో-ఓనర్లు నెస్ వాడియాని, మోహిత్ బర్మన్ని, కరణ్ పాల్ని అనగలడా ఆ మాట? పన్నెండు టెస్టులు ఆడినవాడిని, పదిహేను వన్డే ఇంటర్నేషనల్స్లో ఉన్నవాడిని, వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్ని, టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ని.. ది గ్రేట్ సంజయ్ బంగర్ని పట్టుకుని ప్రీతీ అంతమాట అంటుందా అని ఆయన ఎక్స్ప్రెషన్! ఏమన్నాను? బెహర్డియన్కి బదులుగా అక్షర్ని పంపి ఉండాల్సింది అనే కదా! అది కోచ్కి పాఠాలు నేర్పడం అవుతుందా? ఒక్క రన్లో ఓడిపోతే ఎవరికి మాత్రం కోపం రాదు? అయినా అది నాకు టీమ్ ఓనర్గా వచ్చిన కోపం కాదు. క్రికెట్ లవర్గా వచ్చిన కోపం. ఏం? ఆడవాళ్లకు కోపం రాకూడదా? కోపంలో ఆడవాళ్లు పెద్దగా అరవకూడదా? కోపాన్ని కూడా వాళ్లు చక్కటి చిరునవ్వుతోనే ప్రదర్శించాలా? హార్ట్ బ్రేక్ అయ్యాక ఆడేంటి? మగేంటి? లాస్ట్ మ్యాచ్లో అక్షర్ బాగా ఆడాడు. అందుకే అతన్ని పంపించి ఉండాల్సింది అన్నాను. కామన్సెన్స్ కదా! ఈ మాట చెప్పడానికి బ్యాట్ పట్టుకోవడం తెలిసుండాలా? బాల్ విసరడం తెలిసుండాలా? చావనిస్ట్ పిగ్స్. జెనెటిక్ ప్రాబ్లమేదో ఉన్నట్లుంది ఈ జర్నలిస్టులకి. ప్రెజెంటేషన్ సెరమనీకి నేను వెళ్లకుండా మా మదర్ని పంపానట. అదో ఇష్యూ! మ్యాచ్ని వదిలేసి, మ్యాచ్ అయిపోయాక స్టేడియంలో మిగిలిన చెత్తనంతా పోగేసుకుంటున్నారు! ‘మదర్స్ డే కదా. అందుకనే అలా చేశాం’ అని మా టీమ్ మేనేజర్ చెప్పాడు. ‘మదర్స్ డే తర్వాతి రోజు గదా మ్యాచ్ జరిగింది’ అని వాళ్ల పాయింట్. గొప్ప ఇన్వెస్టిగేషనే! ఐపీఎల్ అయ్యాక అవార్డు ఇవ్వాలి ఆ రిపోర్టర్కి. గొప్పవాళ్లు కొంతమంది ఉంటారు. దేనికీ రియాక్ట్ కారు. ముక్కులోంచి, మూతిలోంచి, కంటిలోంచి, ఒంటిలోంచి దేన్నీ బయటికి రానివ్వరు. నేను అంత గొప్పదాన్ని కాదు. కోపాన్ని దాచుకోలేను. సంతోషాన్ని ఆపుకోలేను. నాకు తెలీకుండా నా ఫీలింగ్స్ అన్నీ నా ముఖంలోంచి తన్నుకొచ్చేస్తాయి. మనకెంత అందమైన ముఖం ఉందని కాదు.. అందులో ఎంత నిజాయితీ ఉందనేది ముఖ్యం. ముఖంలో నిజాయితీ ఉన్నప్పుడు మాటలో మొహమాటం ఉండదు. ముఖస్తుతి ఉండదు. నచ్చంది నచ్చలేదని చెప్తాం. నమ్మింది ఎవరికి నచ్చకున్నా చేసేస్తాం. ఐపీఎల్లోకి నేను అలాగే వచ్చాను. విత్ మై హార్ట్ అండ్ సోల్. ఆడామా, ఓడామా అని కాదు. గెలిచేలా ఆడామా లేదా.. అదీ నా కన్సర్న్. కింగ్స్ ఎలెవన్ జట్టు ప్లే-ఆఫ్స్కి వెళ్లలేకపోవడం నాకు పరువు తక్కువేం కాదు. పూర్ పెర్ఫార్మర్ అనిపించుకోవడమే బాధ. ప్రేమ లేకపోతే బాధ కలుగుతుందా? బాధ లేకుండా కోపం వస్తుందా? ఐ లవ్ క్రికెట్. - మాధవ్ శింగరాజు -
వైభవంగా ప్రీతీ జింటా రిసెప్షన్
-
ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం
రెండు నెలల క్రితం లాస్ ఏంజిల్స్లో తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన పెళ్లి వేడుక తరువాత తన భర్తతో కలిసి ఇటీవలే ముంబై చేరుకుంది ప్రీతి. ఈ సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్ని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫారూక్ ఖాన్, షాహిద్ కపూర్, యువరాజ్ సింగ్, లారాదత్త, డినో మోరియా, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జూహీచావ్లా, ఫరాఖాన్, మహేష్ భూపతి, మాధవన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొద్ది రోజులుగా పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న బాలీవుడ్ లాంగ్ టైం బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లులియా తో కలిసి రావటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
వాహ్ తాజ్.. భర్తతో బాలీవుడ్ నటి
ముంబయి: పెళ్లి వార్తలతో కొన్ని నెలల కిందట వార్తల్లో కెక్కిన బాలీవుడ్ భామ ప్రీతిజింటా ఇప్పుడు జాలీగా ఉంది. ఆమె ఈ ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన బ్యూ జీనే గూడెనఫ్ ను లాస్ ఏంజెలిస్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అక్కడే కొన్ని రోజులు గడిపిన ప్రీతి... ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కు వచ్చేసింది. దీంతో భర్తతో తీరికగా గడిపే సమయం సొట్ట బుగ్గల సుందరికి దొరకనట్లు కనిపిస్తోంది. భర్త కుటుంబం అమెరికా నుంచి రావడంతో వారితో గడపాలని నిర్ణయించుకుంది. భర్త గూడెనఫ్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ కు వెళ్లింది. తాజ్ మహల్ ను సందర్శించిన సందర్భంగా తన కుటుంబంతో కలిసి సరదాగా దిగిన ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదివరకు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలితో అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చరిత్రకు చిహ్నం, సుందర కట్టడమైన తాజ్ దగ్గర ఉన్నామంటూ ప్రీతి పేర్కొంది. ఓ వైపు ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్ మహల్.. మరోవైపు ప్రియమైన భర్తతో ప్రీతి చాలా సంతోషంగా తీరిక సమయాన్ని ఎంజాయ్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతి బిజీబిజీగా ఉంటోంది. ప్రొఫెషన్ తో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయిస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. -
ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్
న్యూఢిల్లీ: బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా తనను తిట్టినట్లు వచ్చిన కథనాలను జట్టు కోచ్ సంజయ్ బంగర్ తోసిపుచ్చారు. మ్యాచ్ తర్వాత సహజంగా జరిగే చర్చలే తమ మధ్య జరిగినట్లు ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు. ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి తప్పుడు కథనాలు రాశారని ఆరోపించారు. మరోవైపు ప్రీతి కూడా ఈ కథనాలను ఖండించింది. ‘మా కోచ్ను తిట్టడం అవాస్తవం. నేను ఎలాంటి మాటలు అనలేదు. ఈ కథనాలు నిజం కాదు. నేను, సంజయ్ ఇద్దరమూ ఈ కథనాలు కొట్టిపారేసినా మళ్లీ పుడుతున్నాయి. ఈ వార్తలతో విసిగిపోయాను. కొంత మంది జర్నలిస్ట్లు సమయం చూసుకొని మరీ రాస్తున్నారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని ఇలా చేస్తున్నారు’ అని ప్రీతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. బెంగళూరుతో మ్యాచ్లో అక్షర్ పటేల్ను ముందుగా బ్యాటింగ్కు ఎందుకు పంపలేదంటూ ప్రీతి జింతా... బంగర్ను బూతులు తిట్టిందంటూ ఓ ఇంగ్లిష్ పత్రిక కథనం రాసింది. -
'నన్ను ఆమె తిట్టలేదు'
న్యూఢిల్లీ: ప్రీతి జింతా తనను ఏమీ అనలేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. తనను ఆమె దూషించిందని వచ్చిన వార్తలు కల్పితమని కొట్టిపారేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో బంగర్ పై ప్రీతి నోరు పారేసుకుందని, అతడిని కోచ్ పదవికి నుంచి పీకేస్తానని హెచ్చరించిందని ముంబైకి చెందిన దినపత్రిక ప్రచురించింది. 'మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్స్ టీమ్ యాజమానులతో మామూలుగానే మాట్లాడా. దీనికి మీడియా విపరీత అర్థాలు తీసి కల్పిత కథనాలు అల్లింది. అసభ్య, అగౌరవపరిచే మాటలు నన్ను అనలేదు. ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఓడిపోయినప్పటికీ మా టీమ్ బాగా క్రికెట్ ఆడింది. టోర్నమెంట్ లో చివరి వరకు నిలిచేందుకు పోరాటం కొనసాగిస్తామ'ని బంగర్ తెలిపారు. బంగర్ ను తాను తిట్టినట్టు వచ్చిన వార్తలను ప్రీతి జింతా తీవ్రంగా ఖండించింది. కల్పిత కథనాలు ప్రచురించిన పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. -
కోచ్ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా!
సొట్టబుగ్గల హీరోయిన్ ప్రితీ జింతా యాజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఈ ఐపీఎల్ కూడా ఏమాత్రం కలిసిరాలేదు. ఆడిన పది మ్యాచ్ల్లో ఏడింటిలో ఓడి.. మూడింటిని మాత్రమే గెలిచి.. గత ఐపీఎల్ మాదిరిగానే పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున మగ్గుతోంది. ఇక, ఫ్లే ఆఫ్ ఆ జట్టుకు దాదాపు అవకాశాలు లేనట్టే. ఈ నేపథ్యంలో సోమవారం మొహాలిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్- పంజాబ్ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా జట్టు కోచ్ సంజయ్ బంగర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ మ్యాచ్లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో పంజాబ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ బంగార్ తన ఇష్టానుసారం బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం.. అక్సర్ పటేల్ కన్నా ముందే ఫర్మాన్ బెహర్దీన్తో పంపించడం ప్రీతికి కోపం తెప్పించిందట. దీంతో జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముందే బంగార్ను కోపంలో ప్రీతి అనరాని మాటలు అన్నదని, తిట్టిపోసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా వివరణ ఇచ్చింది. ఈ కథనాలు రుజువైతే తాను దీనికైనా సిద్ధమేనని, ఒకవేళ రుజువు కాలేదని తేలితే ఈ కథనాలు రాసిన జర్నలిస్టులు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. తాను కోచ్పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. -
వివాదాల ప్రభావం పడుతోంది: ప్రీతి జింటా
ప్రతి ఏటా ఐపీఎల్ను ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం వల్ల ఫ్రాంచైజీలపై ప్రభావంపడుతోందని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.‘ఈ వివాదాల వల్ల జట్ల బ్రాండ్ దెబ్బతింటోంది. దీని ప్రభావం మా వ్యాపారంపై పడుతోంది’ అని వాపోయింది. ఐపీఎల్ వల్ల దేశంలో క్రీడల ముఖచిత్రం మారిపోయిందని, యువ క్రికెటర్లకు మేలు చేసే ఈ లీగ్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని పేర్కొంది. -
'ఐపీఎల్.. ప్రతి సీజన్లోనూ సమస్యలు'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి ఏడాది ఫ్రాంచైజీలకు ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాలీవుడ్ నటి , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. ప్రతి సీజన్లో ఆటగాళ్లపై, ఫ్రాంచైజీలపై వదంతులు వ్యాపిస్తున్నాయని అవి తమ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి మ్యాచ్ వేదికల తరలింపు అంశంపై ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ లో ప్రతి సీజన్ సమస్యలమయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కానీ లీగ్ నిర్వహణ సమస్యలతో తమ ఫ్రాంచైజీకి కలిసిరావడం లేదన్నారు. 2013 లో చూసినట్టయితే స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టించింది. అందులో ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ప్రీతీ జింటా ప్రస్తావించారు. 2014 సీజన్ విషయానికొస్తే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల దృష్టా ఐపీఎల్-7 తొలి అర్థభాగంలో మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 2015 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్లపాటు నిషేధించారు.గత సీజన్లో తమ బౌలింగ్ బలహీనంగా ఉందని, ప్రస్తుతం ఆ లోపాలను సరిచేసుకున్నామని ప్రీతీ జింటా పేర్కొన్నారు. -
మూడేళ్ల తర్వాత సూపర్ హిట్!
పెళ్లయ్యాక కథానాయికలు వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ, ఇటీవలే తన బాయ్ఫ్రెండ్ జీని గుడ్ ఇనఫ్ను పెళ్లి చేసుకున్న ప్రీతీ జింటా ఓ సినిమా ఒప్పుకున్నారు. దాన్నిబట్టి ఇంటి బాధ్యతలతో పాటు తన కెరీర్ను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. దాదాపు మూడేళ్ల క్రితం ‘ఇష్క్ ఇన్ పారిస్’ అనే చిత్రంలో క నిపించిన ప్రీతి ఆ తర్వాత వేరే సినిమాలు చేయలేదు. ఇప్పుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘భయ్యాజీ సూపర్హిట్’ అనే చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రీతి తన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాఠక్ దర్శకుడు. -
పెళ్లి ఫొటోలను వేలం వేయనున్న నటి
ఎట్టకేలకు 'అవును.. నేను పెళ్లి చేసుకున్నాను' అంటూ బయటపెట్టిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి ఫొటోలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం సరికొత్తగా ఉంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో తన స్నేహితుడైన జీని గూడెనఫ్ ను ప్రీతి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతి కొద్ మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహ తంతుకు సంబంధించి ఏ ఒక్క ఫొటో కూడా ఇప్పటి వరకు బయటకురాలేదు. మా పెళ్లి ఫొటోలను దయచేసి బయటపెట్టొందంటూ ప్రీతి వివాహానికి హాజరైన అతిథులను కోరినట్లు తెలిసింది. వారి పెళ్లి ఫొటోలను వేలం వేయాలని ప్రీతి దంపతులు ముందే నిర్ణయించుకున్నారట. ఆ వేలం ద్వారా వచ్చే డబ్బును ప్రీతి నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్ధకు అందజేయాలనేది ఈ నూతన వధూవరుల ఆలోచన. అందుకే పెళ్లి ఫొటోలను మీడియాకు చిక్కకుండా ముందు జాగ్రత్త వహించారు ప్రీతి. -
'అవును.. మా పెళ్లయింది నిజమే..'
ముంబయి: ఎట్టకేలకు అందరి సందేహాలకు తెరపడింది. తన పెళ్లయినట్లు బాలీవుడ్ నటి, పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రీతిజింటా స్పష్టం చేసింది. ఆమె తన భర్త ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఈ మంగళవారం కబీర్బేడీ ట్వీట్తో ప్రీతి పెళ్లి అయినట్లు అందరికీ తెలిసింది. కానీ, స్వయంగా ఆమె ఈ విషయం ముందు చెప్పలేదు. దీంతో అది నిజమా కాదా అని అందరూ సందేహంలో పడ్డారు. కానీ, ఈ సొట్ట బుగ్గల చిన్నది తాజాగా తన భర్త ఫొటోను పోస్ట్ చేసి తెరదించింది. ఆమె బ్యూ జీనే గూడెనఫ్ అనే అమెరికన్ను వివాహం చేసుకుంది. ఈ వివాహం లాస్ ఎంజెల్స్లో జరిగినట్లు తెలిపింది. ప్రీతీకి జీనే స్నేహితుడు కూడా. -
బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్లో ప్రీతి తన బాయ్ఫ్రెండ్ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్లో ముంబైకు రానుంది. ఈ దిల్ సే హీరోయిన్ ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. -
ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?
ముంబై : బాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. రీసెంట్గా నలభయ్యో పడిని దాటేసిన ఈ అమ్మడు ఎట్టకేలకు ఈ నెలలోనే పెళ్లికి రెడీ అవుతోందని సమాచారం. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అమెరికా బాయ్ఫ్రెండ్ జీనీ గుడేనఫ్తో కలిసి ఏడుఅడుగులు నడవనున్నట్టు తెలుస్తోంది. అదీ లాస్ ఏంజెల్స్లో.. ఒక వారం రోజుల్లోనే. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ప్రీతి జింతా షేర్ చేసుకుందిట. లాస్ ఏంజెల్స్లో జరిగే తన పెళ్లికి రావాలని ఆహ్వానించిందట. ఈ ఆనందమైన క్షణాల్లో తనతో పాటు వుండాలని బాలీవుడ్లో కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కోసం ఆమె ఫిబ్రవరి 12 నుండి 16 వరకు అయిదురోజుల పాటు అమెరికాలో ఉండనున్నట్టు సమాచారం. ఈ దిల్ సే హీరోయిన్, ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాతో ఎఫైర్, 2008లో ఐపిఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు, అనంతరం వారిద్దరి మధ్య వివాదం, పరస్పరం కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిన విషయాలే. కాగా ప్రీతి బర్త్ డే అయిన జనవరి 31న పెళ్లి కూతురు కాబోతున్నట్లు గత ఏడాది బిటౌన్లో వార్తలు గుప్పుమన్నాయి. అమెరికన్ బాయ్ఫ్రెండ్ జీనే కోసమే ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తోందనీ పుకార్లు షికారు చేశాయి. అప్పట్లో ఈ వార్తలను ప్రీతి ఖండించింది కూడా. ప్రీతి పెళ్లి వార్త దాదాపుగా కన్ఫర్మ్ అయినా... ఇది వాస్తవమా కాదా తేలాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు. -
'ప్రామిస్.. పెళ్లి చేసుకోవటం లేదు'
తన పెళ్లిపై వస్తున్న వార్తల విషయంలో ప్రీతీ జింతా నోరు విప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రీతి, తరువాత బిజినెస్ మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది. పంజాబ్ క్రికెట్ జట్టును సొంతం చేసుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి క్రికెట్ మ్యాచ్లకు హాజరవుతూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అదే సమయంలో ఆ టీం మెంబర్ యువరాజ్ సింగ్తో పాటు, తన సహయజమాని నెస్ వాడియాలతో ప్రేమాయణాలు కోనసాగించినట్టుగా వార్తలు వినిపించాయి. తన ప్రియుడు నెస్ వాడియా తనను వేదిస్తున్నాడంటూ వార్తల్లోకెక్కిన ప్రీతి ఆ తరువాత చాలా కాలం పాటు ఎవరికి కనిపించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ బ్యూటి. కొద్ది రోజులుగా గినె అనే అమెరికన్తో సన్నిహితంగా ఉంటున్న ఈ బ్యూటి 2016 జనవరిలో అతడిని పెళ్లాడుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయినట్టుగా చెప్పారు. ఈ వార్తలన్నింటిని తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఖండించింది ప్రీతి జింతా. 'నేను 2016 జనవరిలో పెళ్లి చేసుకోవటం లేదు. ప్రామిస్. అలాంటి వార్త ఏదైనా ఉంటే ముందు నేనే తెలియజేస్తా..' అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే గినెతో తన రిలేషన్పై మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో పెళ్లి విషయం నిజం కాకపోయినా గినెతో ప్రేమ విషయం మాత్రం నిజమే అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు. Also It's getting a bit wierd telling people that I'm not getting Married in January, I PROMISE I will TELL U ALL AS & WHEN I DO !!! Ting — Preity zinta (@realpreityzinta) November 27, 2015 -
జింతాక చితా చితా...
గాసిప్ బాలీవుడ్లో మరోసారి వెలిగిపోవాలని కలలు కంటోందట ప్రీతి జింటా. కాలం కలిసొస్తే... సూపర్స్టార్లు సల్మాన్, న్షారుక్ఖాల సరసన నటించాలని కూడా ఆశిస్తోందట. తన ఆశ నెరవేర్చుకోవడానికి ఈ సొట్టబుగ్గల సుందరి తాజాగా పొగడ్తల మంత్రం జపిస్తోంది. సల్మాన్ఖాన్ను ఎలా పొగిడిందో చూడండి... ‘‘నేను భయపడే ఏకైక హీరో సల్మాన్. అతడి ముందు నటించాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకో మాత్రం తెలియదు. బహుశా అది గౌరవంతో కూడిన భయం కావచ్చు. అతనితో కలిసి నటించడం ఎంత అదృష్టమో!’’ ఇక షారుక్ను ఇలా పొగుడుతోంది.... ‘‘భావోద్వేగాలతో ఏడిపించడంలో షారుక్లాంటి హీరోని నేనింత వరకు చూడలేదు. ఆయన నటనలో పడి ఎన్నిసార్లు ఏడ్చానో. గొప్ప నటుడు షారుక్’’. ‘పనిలో పనిగా అమీర్ఖాన్ను కూడా పొగడక పోయావా!’ అన్నారట ఎవరో వ్యంగ్యంగా. బాలీవుడ్లో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రీతి జింటా ఈ వ్యంగ్య బాణాలేవీ పట్టించుకునే మూడ్లో లేదు. చిన్నా చితకా సినిమాలు, టీవి కార్యక్రమాల్లో నటించడం కంటే అగ్రహీరోల సరసన నటించడం ద్వారా పూర్వపు పాపులారిటీ సంపాదించాలనేది ఆమె ప్లాన్ కావచ్చు. అందుకేనేమో సూపర్ స్టార్లతో మళ్లీ కలిసి నటించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది. ఆమె ప్రయత్నాలు ఓకే అయితే మాత్రం... అభిమానులు జింతాక చితా చితే! -
లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని సూచించా
ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే ఫిక్సింగ్కు తావుండదని సూచించినట్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని ప్రీతి జింతా తెలిపింది. ఇటీవల ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ ఫ్రాంచైజీలతో సమావేశమైన సందర్భంగా ఈ సూచన చేశానని, అంతే తప్ప తాను ఏ క్రికెటర్పై ఫిక్సింగ్ ఆరోపణలు చేయలేదని చెప్పింది. కొందరు పంజాబ్ ఆటగాళ్లు ఫిక్సింగ్కు పాల్పడి మ్యాచ్లను వదిలేశారని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ప్రీతి జింతా ఖండించింది. -
డబ్బు, స్టైలేకాదు.. ముందు విలువలుండాలి
ముంబయి: ఓ వ్యక్తి చూడ్డానికి చక్కగా కనిపించొచ్చు.. బాగా డబ్బు కలిగుండొచ్చు ఇంకా స్టైల్గా కూడా ఉండవచ్చు కానీ.. అలాంటి వ్యక్తికి మాత్రం మంచి ప్రవర్తన ఉండదని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా సరిగా తెలిసి ఉండదని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా అంది. తనది మంచి వ్యక్తిత్వం అనుకునే ప్రతి వ్యక్తి అది వాస్తవ జీవితంలోనూ, సామాజిక అనుసంధాన వేదికల్లోనూ ఒకే మాదిరిగా ఉండాలని చెప్పారు. ట్విట్టర్లో ఆమె ఆదివారం వాస్తవ జీవితంలో, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల ప్రవర్తనలు, నడుచుకునే తీరు అనే అంశంపై చర్చ జరిపారు. చూడ్డానికి గొప్పగా కనిపించేవారి ప్రవర్తన తీరు సరిగా లేకుంటే ఇంకే ఉన్నా వ్యర్థమే అని చెప్పారు. సాధారణంగా జీవిస్తూ దయాగుణంతో, ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా బతికేయాలని సెలవిచ్చింది ఈ అమ్మడు. అంతేకాకుండా చిన్నారులు కూడా విలువలు మర్చిపోతున్నారని, భారత్లో మెయిడ్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సింగిల్ సెలబ్స్...
బాలీవుడ్ బీట్ పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు చాలామంది హీరోయిన్లు ‘మాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు’ అని బుకాయిస్తారు. కెరీర్ ఇక చరమాంకంలో పడిన సూచనలు కనిపించగానే, చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని, తెరమరుగైపోతారు. కొందరు హీరోయిన్లు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. పెళ్లితో పనేముంది? సోలో బతుకే సో బెటరని డిసైడైపోయి, తమకు నచ్చినరీతిలో బతుకుబండిని బ్రహ్మాండంగా పూలతేరులా లాగిస్తుంటారు. బాలీవుడ్లో అలాంటి అరుదైన సింగిల్ సెలబ్రిటీల గురించి... ప్రీతీ జింటా సాటి హీరోయిన్లతో పోల్చుకుంటే సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా చేసిన సినిమాలు తక్కువే అయినా, వార్తల్లో ఆమె రేపిన కలకలం తక్కువేమీ కాదు. సైనికాధికారి కూతురైన ప్రీతీ 1997లో మణిరత్నం దర్శకత్వంలోని ‘దిల్ సే’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాల్లో నటించింది. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే ప్రీతి... కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ క్రికెట్ టీమ్ నిర్వహణతో సంతోషపడిపోతోంది. ఆ ధ్యాసలో పడి పెళ్లిని మర్చిపోయినట్లుంది. సుస్మితా సేన్.. విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకోవడమే తడవుగా సుస్మితా సేన్కు బాలీవుడ్ రెడ్కార్పెట్ పరిచింది. ‘దస్తక్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన సుస్మితా తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ తొలినాళ్లలోనే 2000 సంవత్సరంలో తన పాతికేళ్ల వయసులో రెనీ అనే పాపను దత్తత తీసుకుంది. ఈ దత్తత వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో న్యాయపోరాటం సాగించి మరీ బాంబే హైకోర్టు తీర్పుతో దత్తత హక్కులు సాధించుకుంది. మళ్లీ 2010లో అలీసా అనే మరో పాపను దత్తత తీసుకుంది. సింగిల్ మామ్గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే, సినీ రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. టబు నాలుగు పదులు నిండినా, వన్నెతరగని టబు విలక్షణ చిత్రాలతో ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటోంది. తొమ్మిదేళ్ల వయసులో బాలనటిగా 1980లో ‘బాజార్’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకు ‘హమ్ నౌజవాన్’లో దేవానంద్ కూతురిగా నటించింది. తెలుగులో ‘కూలీ నం-1’ చిత్రం ద్వారా 1987లో హీరోయిన్గా పరిచయమైంది. పలు భాషల్లో కమర్షియల్ బ్లాక్బస్టర్లతో పాటు పలు విలక్షణ చిత్రాల్లో సత్తా చాటుకుంటోంది. కానీ పెళ్లి మాటెత్తడం లేదు. రైమా సేన్ అమ్మమ్మ సుచిత్రా సేన్, తల్లి మూన్మూన్ సేన్ల నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రైమా సేన్, 1999లో ‘గాడ్మదర్’ చిత్రం ద్వారా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. తెలుగులో ‘ధైర్యం’ చిత్రంలో నటించింది. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అడపా దడపా నటిస్తూనే ఉన్నా, ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ బ్లాక్బస్టర్స్ పెద్దగా లేవు. రైమా చెల్లెలు రియా కూడా బాలీవుడ్లో రాణిస్తోంది. రైమాలో తల్లి పోలికల కంటే అమ్మమ్మ పోలికలే ఎక్కువ. ఈమె సోలో లైఫ్కు కారణాలైతే చెప్పనేలేదు. -
లబ్కి డబ్కి మధ్య జీవితకాలపు కథ
దేడ్ కహానీ - కల్ హో న హో 1999, డిసెంబర్ 31... అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైటుకె వచ్చి కంప్యూటర్ వ్యవస్థలన్నీ కొట్టుకుపోతాయి. ఇంక 2000 నంచి టెక్నాలజీ ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బాగా పెరిగింది. 2012... ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచమంతా కొట్టుకుపోతుంది అన్నారు. ఇంక మానవాళికి రేపన్నది ఉంటుందో, ఉండదో అన్నారు. కల్ హో న హో... ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఎదిగింది. 2003, నవంబర్ 28న షారుక్ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీఖాన్ లాంటి అగ్ర తారాగణంతో కరణ్ జోహార్ కథ, నిర్మాణంలో నిఖిల్ అద్వానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్ హో న హో... అన్నారు. ఆడింది. అద్భుతంగా ప్రజాదరణ పొందింది. లబ్... డబ్.. అనే గుండె చప్పుడులో లబ్కి డబ్కి మధ్య జీవితకాలపు కథ. ఇది ట్యాగ్లైన్కి తెలుగు అర్థం. ఎంత అద్భుతమైన ఆలోచన. ‘‘ఈ రోజు ఒక నవ్వు ఎక్కువ నవ్వు... ఈ రోజు ఒక ప్రార్థన ఎక్కువ చెయ్యి... ఈ రోజు ఒక కన్నీటి చుక్క ఎక్కువ త్రాగు... ఈ రోజు ఒక జీవితం ఎక్కువ జీవించు... ఈ రోజు ఒక కల ఎక్కువ కను... ఎవరికి తెలుసు... రేపుంటుందో, ఉండదో’’... కల్ హో న హో... ఈ చిత్రం అమన్ పాత్రధారి షారుక్ఖాన్, నైనా పాత్రధారి ప్రీతిజింతాతో అనే డైలాగ్... ఎంత అద్భుతమైన సంభాషణ. 1971లో వచ్చిన ‘ఆనంద్’ అనే హిందీ సినిమా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సుమితా శాన్యాల్ ప్రధాన పాత్రధారులుగా, హృషికేశ్ ముఖర్జీ రచన, దర్శకత్వం. ఈ ‘ఆనంద్’ కథనే స్ఫూర్తిగా తీసుకుని, 2003లో పూర్తిగా అమెరికా నేపథ్యంలో ఎన్నారైల మధ్య కథగా, భారతీయ ఆధునిక కుటుంబాల భావోద్వేగాలు కలగలిపి తీసిన చిత్రంలా ఉంటుంది ‘కల్ హో న హో’. సాధారణంగా సినిమాలలో కొన్ని అంశాలు చాలా బావుంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ప్రతి మూమెంట్ని మనం ఆస్వాదించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో ‘కల్ హో న హో’ ఒకటి. పాటలు వినగానే సినిమా చూడాలనిపించింది. సంగీత దర్శక త్రయం శంకర్-ఇషాన్-లాయ్ మహత్యం అది. పోస్టర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. కరణ్ జోహార్ ప్రతిభ అది. సినిమా చూడగానే మళ్లీ చూడాలనిపించింది. కొత్త దర్శకుడు నిఖిల్ అద్వానీ గొప్పదనం అది. అమన్ పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటన అమోఘం. కనీసం నాలుగైదుసార్లు కన్నీళ్లు పెట్టిస్తాడు. కొద్దిక్షణాల్లో చనిపోతాడనగా కూడా చిరునవ్వు నవ్విస్తాడు. ఈ సినిమా కచ్చితంగా చూసి తీరవలసిందే. ఇందులో ప్రీతిజింతా పాత్రకి ముందు కరీనా కపూర్ని ఎంచుకున్నార్ట. పారితోషికం దగ్గర తేడా వచ్చి, ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది. అది ప్రీతిజింతాని వరించింది. ఆమె చాలా తెలివిగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంది. రోహిత్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటన చాలా సహజంగా, ఉన్నతంగా, అంతకంటే ఎక్కువ సరదాగా ఉంటుంది. నైనా జీవితంలో చికాకులతో కోల్పోయిన చిరునవ్వుని వెలిగిస్తాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన అమన్. అతనితో ప్రేమలో పడుతుందామె. కానీ ఆమె స్నేహితుడు రోహిత్కి నైనా అంటే ప్రేమని తెలిసి, తనకు ఆల్రెడీ ప్రియ అనే అమ్మాయితో (సోనాలీ బింద్రే) పెళ్లయిపోయిందని చెప్తాడు. బాధగా వెళ్లిపోతుంది నైనా. అమన్ తల్లి అడుగుతుంది అమన్ని - ‘‘నువ్వు కూడా ప్రేమించావ్ కదరా నైనాని. అబద్ధం ఎందుకు చెప్పావ’’ని. ‘‘నిజం చెప్పాలా అమ్మా. నా గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉందని నిజం చెప్పాలా? నాకు తనంటే ఇష్టమున్నా, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో తెలీకుండా ప్రతిరోజూ గడుపుతున్నానని నిజం చెప్పాలా’’ అని ఆవేదనగా అడుగుతాడు. ఈ నిజం ప్రేక్షకుడికి తెలియడమే ఇంటర్వెల్. ఇంక ద్వితీయార్ధంలో నైనా, రోహిత్లని కలపడమనే ప్రహసనాన్ని వీలైనంత కామెడీ జొప్పించి మెప్పించారు రచయితలు, దర్శకుడు, నటీనటులు. చివరికి ప్రేక్షకుడికి తెలిసిన నిజాలన్నీ పాత్రలకి కూడా తెలియడం, బాధలు, ఆవేదనలు, అమన్ చనిపోవడం, నైనా, రోహిత్ ఒకటవ్వడం... ఇవన్నీను! ఎన్నారై మార్కెట్ని పెంచిన ‘కభీ కుషీ కభీ గమ్’ తర్వాత అదే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పైన కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నారై మార్కెట్ని కొత్త పుంతలు తొక్కించింది. క్షణ భంగురమైన మానవ జీవితానికి రేపన్నది ఉంటుందో లేదో తెలీదు కానీ, మంచి భారతీయ చలన చిత్రాల జాబితాలో ‘కల్ హో న హో’ ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవారం సినిమాలు తీసే ఆలోచనలని అన్నింటినీ కకావికలం చేసి ఇలా తీయాల్రా అని మెదళ్లకి రిపేర్లు చేసిన దర్శక శ్రేష్టుడు రాజ్కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో మళ్లీ కలుద్దాం. -వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
ఆ ముగ్గురు నటులపై బీహార్లోనూ కేసు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్పూర్ కోర్టు ఆదేశించింది. ఇక మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితం కాదని లాబ్ పరీక్షల్లో తేలినట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వీటిపై నిషేధం విధించారు. -
ఔను.. డేటింగ్ చేస్తున్నా!
గత ఏడాది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎంతగా మజా ఇచ్చాయో, వివాదాలు కూడా అంతే కిక్నిచ్చాయి. బాలీవుడ్ కథానాయిక ప్రీతీ జింటా, వ్యాపారవేత్త నెస్వాడియాల ప్రేమ జంట శాశ్వతంగా విడిపోవడానికి ఆ ఐపీఎల్ వేదికగా మారింది. ఆఖరికి ప్రీతీ జింటా పోలీస్ కేసు పెట్టేంత వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. ఈ వివాదం తర్వాత అమెరికా వెళ్లిపోయిన ప్రీతి ఈ ఏడాది ఐపీఎల్ కోసం మళ్లీ భారత్కు వచ్చారు. యూఎస్లో ఉన్నప్పుడు ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారన్న వార్త ప్రచారంలో ఉంది. దీని గురించి ప్రీతి స్పందిస్తూ - ‘‘అవును. డేటింగ్ చేస్తున్నా. ఆ వ్యక్తి ఎవరు? అతని హైట్ ఎంత? వెయిట్ ఎంత? ఏ రంగు లాంటి ప్రశ్నలు అడగొద్దు. అస్సలు చెప్పను. డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నా కదా.. ఇక అంతటితో చర్చలకు ఫుల్స్టాప్ పెడితే బాగుంటుంది’’ అని చెప్పారు. -
పంజాబ్ జట్టును అమ్మడం లేదు
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ లాభాల్లో ఉందని, తమ జట్టును అమ్ముతామని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతా స్పష్టం చేసింది. తమ జట్టు జెర్సీ వెనుక భాగంలో కండోమ్ కంపెనీ లోగోను ముద్రించడం పంజాబ్ క్రికెటర్లలో కొందరికి ఇష్టం లేదంటూ వచ్చిన వార్తలను కూడా ప్రీతి తోసిపుచ్చింది. -
ప్రీతి కళ్లలో ఆనందం కోసం..!
బ్యాట్స్మెన్ బౌండరీ కొడితే చప్పట్లతో హోరెత్తిస్తుంది.... ఇక సిక్సర్ బాదితే అమాంతం గాల్లోకి ఎగిరి గంతులు వేస్తుంది... మ్యాచ్ గెలిపిస్తే పరిగెడుతూ వెళ్లి అభినందిస్తుంది... ఐపీఎల్లో ఏ జట్టుకూ లేని ప్రత్యేక ఆకర్షణ ప్రీతి జింతా రూపంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఉంది. తొలి సీజన్ నుంచీ తన గ్లామర్తో ఐపీఎల్కు మరింత రంగులద్దిన ప్రీతి జింతాకు... పాపం టైటిల్ మాత్రం ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. ఏడేళ్లలో ఒక్కసారి కూడా ఆ జట్టు ట్రోఫీ గెలవలేదు. గత ఏడాది ఆ జట్టు సంచలనాత్మకంగా ఆడినా... నాకౌట్ ఒత్తిడిలో చిత్తయింది. మరి ఈసారైనా ప్రీతి కళ్లలో ఆనందం చూస్తామా..! సాక్షి క్రీడావిభాగం పంజాబ్ కింగ్స్ ఎలెవన్కు దాదాపు ప్రతి సీజన్లోనూ మంచి జట్టే ఉంది. కానీ ఏనాడూ టైటిల్ గెలవలేదు. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు... ఓనర్ల మధ్య గొడవలు కూడా ఈ జట్టును వార్తల్లో నిలబెట్టాయి. జట్టు సహ యజమానులు ప్రీతి జింతా, నెస్వాడియాల ప్రేమాయణం, ఆ తర్వాత విడిపోవడం... నెస్ తనను వేధిస్తున్నాడంటూ గత ఏడాది ప్రీతి జింతా ఏకంగా పోలీస్కేసు దాకా వెళ్లడం... ఇందులో బీసీసీఐ పెద్దలు సాక్షులుగా ఉండటంతో ఆ జట్టుకు కావలసినంత ప్రచారం వచ్చింది. 2008లో తొలి సీజన్ను పంజాబ్ వరుస ఓటములతో మొదలుపెట్టింది. కానీ సంగక్కర, షాన్మార్ష్ల అనూహ్య ఆటతీరుతో సెమీస్ బెర్త్ను దక్కించుకంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకు సెమీస్లో కింగ్ కుదేలైంది. 2009లో జెరోమ్ టేలర్, యూసుఫ్ అబ్దుల్లాను తీసుకుని బౌలింగ్ను మరింత బలోపేతం చేసుకున్నా.. ఆసీస్ క్రికెటర్లు అందుబాటులో లేకపోవడం జట్టు ప్రదర్శనను దెబ్బతీసింది. తర్వాతి సీజన్లో బ్రెట్ లీ, మార్ష్లు విఫలం కావడంతో ఈ రెండుసార్లు గ్రూప్ దశకే పరిమితమైంది. 2011లో ఊహించని విధంగా లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోడి, బీసీసీఐల మధ్య గొడవలు పెరగడంతో పంజాబ్తో పాటు రాజస్తాన్ జట్లను ఐపీఎల్ నుంచి తొలగించాలని ప్రయత్నించారు. కానీ హైకోర్టు జోక్యంతో సమస్యను సావధానంగా పరిష్కరించుకున్న పంజాబ్ మైకేల్ బెవాన్ను కోచ్గా, గిల్క్రిస్ట్ను కెప్టెన్గా నియమించుకుని బరిలోకి దిగినా గ్రూప్ దశను దాటలేకపోయింది. 2012లో కేవలం 8 విజయాలే సాధించడం, 2013లో మిల్లర్ వీరోచిత ప్రదర్శన చేసినా కీలక మ్యాచ్ల్లో మిగతా ఆటగాళ్లు తడబడటంతో ఈ రెండు సీజన్లలో కూడా ప్లే ఆఫ్కు అర్హత సాధించలేకపోయింది. మ్యాక్స్వెల్ ఓ సంచలనం గతేడాది (2014) పంజాబ్ జట్టు ఊహించని విధంగా మార్పులు చేసింది. ఢిల్లీ జట్టు నుంచి డాషింగ్ బ్యాట్స్మన్ సెహ్వాగ్ను తీసుకుని బెయిలీని కెప్టెన్గా నియమించుకుంది. మ్యాక్స్వెల్, జాన్సన్లు చెలరేగడంతో తొలి ఐదు మ్యాచ్ల్లో వరుసగా నెగ్గి జోరు పెంచింది. మ్యాక్స్వెల్ విధ్వంసకర బ్యాటింగ్తో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించాడు. పవర్ఫుల్ హిట్టింగ్తో మూడు మ్యాచ్ల్లో 95, 89, 95 స్కోర్లు చేయడంతో లీగ్ మొత్తం మ్యాక్స్వెల్ మానియాతో ఊగిపోయింది. 14 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించి నాకౌట్కు చేరింది. కోల్కతా చేతిలో అనూహ్యంగా ఓడినా... చెన్నైని చిత్తు చేసి ఫైనల్కు చేరింది. కానీ ఫైనల్లోనూ కోల్కతా గండాన్ని దాటలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. కచ్చితంగా ైటె టిల్ గెలుస్తామని ధీమాగా ఉన్న ప్రీతి అండ్ కో నిరాశలో మునిగిపోయారు. స్వల్ప మార్పులు ఇప్పటికే జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఫిబ్రవరిలో జరిగిన వేలంపై పంజాబ్ పెద్దగా దృష్టిసారించలేదు. విదేశీ ఆటగాళ్లను ఎవర్ని తీసుకోలేదు. కేవలం స్థానిక ఆటగాళ్లలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. గతేడాది ఆడిన జట్టు నుంచి లక్ష్మీపతి బాలాజీ, మురళీ కార్తీక్, మన్దీప్ సింగ్, చతేశ్వర్ పుజారాను తప్పించింది. వీరి స్థానాల్లో యోగేశ్ గోవాల్కర్, నికిల్ నాయక్, మురళీ విజయ్లను జట్టులోకి తీసుకొచ్చింది. కీలక ఆటగాళ్లు ఆసీస్ వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో ఉన్న మ్యాక్స్వెల్, జాన్సన్లతో పాటు మిల్లర్, షాన్ మార్ష్, సెహ్వాగ్, మురళీ విజయ్లు కీలక ఆటగాళ్లు. నాణ్యమైన స్థానిక పేస్ బౌలర్లు లేకపోవడం జట్టుకు లోటుగా కనిపిస్తోంది. ప్రస్తుత జట్టులో ఆరుగురు ఆల్రౌండర్లు ఉండటం అదనపు బలం. ఓనర్లు: ప్రీతిజింతా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్ కెప్టెన్: బెయిలీ కోచ్: సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్: జో డేవ్స్ గతంలో ఉత్తమ ప్రదర్శన: 2008 సెమీస్, 2014 రన్నరప్ -
మీడియాపై ప్రీతీ జింటా రుసరుస..
మాజీ బాయ్ఫ్రెండ్ నెస్ వాడియాపై పెట్టిన కేసు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రీతీ జింటా రుసరుసలాడింది. ‘ఆ విషయాన్ని పోలీసులనే అడగండి’ అంటూ దూకుడుగా బదులిచ్చింది. నెస్ వాడియా తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ ప్రీతీజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ఆ కేసు విషయమై ప్రశ్నించడంతో సహనం కోల్పోయింది. అంతా తనను సెలిబ్రిటీగా పిలుస్తున్నా, తానూ మామూలు మనిషినేనని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పింది. -
యువకుడిని బయటకు తోసేసిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కోపం వచ్చింది. అది ఏ రేంజ్లో అంటే.....ఓ యువకుడిని సినియా థియేటర్ నుంచి బలవంతంగా బయటకు తోసేటంత. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ యువకుడు లేచి నిలబడేందుకు నిరాకరించటం ప్రీతి జింతాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే హృతిక్ రోషన్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా చూసేందుకు ప్రీతి మంగళవారం ఓ థియేటర్కు వెళ్లింది. ఈ సందర్భంగా సినిమా మొదలయ్యే ముందు జనగణమణ గీతం వస్తుండగా సినిమాకు వచ్చిన ఓ యువకుడు లేచి నిలబడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రీతికి అతడిని బలవంతంగా థియేటర్ నుంచి తోసేసింది. ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.మరోవైపు ప్రీతి చర్యపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు దేశభక్తి ఉండచ్చు కాని మరీ ఇంత తలబిరుసు తనం పనికిరాదని బాధితుడి తరపున వ్యాఖ్యలు చేశారు. -
‘అందాల’ ఆర్ట్ ఎగ్జిబిషన్!
హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్ల లీకైన నగ్న చిత్రాలు కనువిందు చేయుబోతున్నాయుట. అమెరికా సెరుుంట్ పీటర్స్బర్గ్లోని ‘కోరి అలెన్ కాంటెంపరరీ ఆర్ట్’లో వీటిని ప్రదర్శించనున్నారని ‘ఈఆన్లైన్.కామ్’ కథనం. త్వరలోనే వీటిని ప్రజల సందర్శనార్థం ఎగ్జిబిషన్లో పెట్టనున్నారు. ఈ ఇద్దరి సెలబ్రిటీలకు చెందిన ఏడేళ్ల ప్రైవేట్ వుూమెంట్స్ కలెక్షన్ ఈ ‘ది నో డిలీట్’ ప్రదర్శన అక్టోబర్ 30న ప్రారంభవువుతుంది. సో... వెరుుట్ ఫర్ ఏ ‘షో’కేస్. నెస్తో నో కాంప్రమైజ్..! సొట్ట బుగ్గల సుందరి ప్రీతీజింటా- ఆమె మాజీ ప్రియుుడు నెస్ వాడియూల రగడ ఇప్పట్లో సద్దువుణిగేలా లేదు. ఇటీవల ఈ ఇద్దరి వుధ్య సయోధ్యకు చేసిన ప్రయుత్నాలు బెడిసి కొట్టాయుని ‘వుుంబై మిర్రర్’ కథనం. నెస్ బేషరతుగా క్షవూపణ చెప్పేదాకా క్షమించేది లేదని తెగేసి చెబుతోంది ప్రీతి. సయోధ్యకు ఈ వుుద్దుగువ్ము ఐదు కండిషన్లు పెట్టిందట. అందులో అన్నింటికీ ఓకే అన్న నెస్... ‘సారీ’ షరతుకి వూత్రం సారీ చెప్పడంతో కథ మొదటికి వచ్చింది. ప్రీతి మాజీ ప్రియుుడిపై కేసు పెట్టిన నేపథ్యంలో... అతని కుటుంబ సభ్యులు ఈ రాజీ ప్రతిపాదనని తెరపైకి తెచ్చారని సవూచారం. రొవూన్స్... భలే చాన్స్..! కలల రాకువూరుడు సల్మాన్ఖాన్తో రొమాన్స్ చాన్స్ వస్తే ఏ అవ్మూరుు వూత్రం వదులుకొంటుంది! కరీనా అరుునా... కత్రినా అరుునా..! ఇప్పుడా అదృష్టం అందాల తార సోనమ్ కపూర్కు వచ్చింది. ఇంకేవుుంది... అవ్ముడు ఎగిరి గంతేసింది. అందర్నీ పిలిచి... చిలిపిగా చెప్పేసుకొంటోంది. ‘ప్రేమ్ (మైనే ప్యార్ కియూలో సల్మాన్ పాత్ర)ను చూస్తూ... ప్రేమిస్తూ పెరిగా. ఇప్పుడు అతడితో రొవూన్స్ చేయుబోతున్నానని తెలిసి నవ్ములేక నన్ను నేనే గిల్లుకున్నా’ అంటూ తెగ వుురిసిపోతోంది. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో కండల వీరుడితో కలసి చేయుబోతోంది సోనమ్. -
'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు'
ముంబై: బాలీవుడ్ తార ప్రీతి జింటా ఐదు షరతులు పెట్టినట్టు మీడియాలో వస్తున్న వార్తలను వాడియా గ్రూప్ ఖండించింది. జూన్ లో పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవడానికి ఐదు షరతులు పెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. మే 30 తేదిన వాంఖెడే స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో ప్రీతి జింటా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'మీడియాలో వస్తున్న వార్తలన్ని ఊహాజనితమైనవి. వాటిలో వాస్తవం లేదు. ఇరువర్గాల మధ్య అలాంటి చర్చలు జరగలేదు' అని వాడియా గ్రూప్ వెల్లడించింది. అయితే ఆరోజున నెస్ వాడియా, ప్రీతిజింటాల మధ్య ఎలాంటి వివాద ఛాయలు కనిపించలేదని ఈకేసులో నలుగురు సాక్ష్యులు చెప్పినట్టు తెలుస్తోంది. -
‘జై భారతి. వందే భారతి’
ఇదొక నిరంతర పరిణామం స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్ న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్ఘోష్, ఆనంద్రాయ్, దియామీర్జా, వీర్దాస్, షాహిద్కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఉన్నత విద్యావంతులు
పంచామృతం సినీ పరిశ్రమలో తారలుగా వెలుగొందాలంటే వ్యక్తిగత ప్రతిభే అర్హత. కొందరికి ప్రతిభకు కుటుంబ నేపథ్యం ప్లస్ అవుతుంది. సూపర్స్టార్లను చేసేస్తుంది. మరి ఇటువంటి రంగంలో తారలుగా వెలుగొందుతున్న వారిలో కొందరు ఉన్నత విద్యావంతులూ ఉన్నారు. తెరమీద గంతులేసే పాత్రలు చేసినా ఆ తెరమీదకు రాకముందు మాత్రం వారు ఏకాగ్రతతో, శ్రద్ధగా పెద్ద చదువులు చదివిన వారే! అకాడమీ డిగ్రీలతో ఉన్నతవిద్యావంతులైన అలాంటి వారిలో కొందరు.. సొహాఅలీఖాన్ కుటుంబ నేపథ్యానికి తగిన చదువులు చదివింది సొహా. పటౌడీల కుటుంబం నుంచి వచ్చిన సొహా లండన్స్కూల్ఆఫ్ ఎకనామిక్స్ లో ‘అంతర్జాతీయ సంబంధాల’ గురించి అధ్యయనం చేసింది. అదే వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని సాధించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రీతీజింతా ‘సొట్టబుగ్గల సుందరి’ అనే పదాన్ని ఒక బిరుదుగా, దాన్నే పెద్ద అర్హతగా ప్రీతీజింతా గురించి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ప్రీతీ స్కూల్ప్రోగ్రెస్ కార్డులను చూస్తే మాత్రం తన గురించి చెప్పడానికి చాలా అర్హతలున్నాయనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి విలియమ్ షేక్స్పియర్ కవిత్వం, నాటకాలపై ఆసక్తిని పెంచుకొన్న ప్రీతి సిమ్లాలోని సెయింట్ బెడెస్ కాలేజీలో ఇంగ్లిష్ ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసింది. తర్వాత క్రిమినల్ సైకాలజీలో మాస్టర్డిగ్రీ జాయిన్ అయ్యింది. అంతలోనే సినిమాల్లో అవకాశం రావడంతో చదువుకు ఫుల్స్టాప్పెట్టింది. సిద్ధార్థ నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడగల, రాయగల ప్రతిభావంతుడు సిద్ధూ. గాయకుడిగా కూడా ప్రతిభను చాటుకొన్న ఈ నటుడు సినిమాల్లోకి రాకముందు సిన్సియర్ స్టూడెంట్. ముంబయిలోని ఎస్పీ జైన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ విద్యాలయంలో ఎమ్బీఏ పూర్తి చేశాడు. అంతకన్నా ముందు ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ సబ్జెక్ట్తో ఆనర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అమీషాపటేల్ బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా చేసి దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకొన్న అమీషాపటేల్ విదేశీ వర్సిటీల్లో చదివింది. 90లలోనే అమెరికా వెళ్లి మసాచుసెట్స్లోని టఫ్ట్స్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం అభ్యసించింది. గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసింది. టాపర్గా నిలిచి గోల్డ్మెడల్ సాధించింది! మాధవన్ చదువుతో పాటు ఎన్సీసీలో కూడా యాక్టివ్గా ఉండేవాడట మాధవన్. ఎన్సీసీలో ఇతడి ప్రతిభను చూసి ఇంగ్లండ్ టూర్కు కూడా పంపించారట. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అటుపై రాయల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లలో శిక్షణ పొందాడు. ఈ అర్హతలతోనే కెనడాలో భారత కల్చరల్ అంబాసిడర్గా నియమితం అయ్యాడు. అనుకోకుండా సినిమాల వైపు వచ్చాడు. -
ముఖంపై కాలుతున్న సిగరెట్లు విసిరేవాడు
వాడియాపై ప్రీతి జింటా సంచలన ఆరోపణలు ముంబై: మాజీ ప్రియుడు, పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల చేసిన వేధింపుల ఆరోపణల్లో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మే 30న ముంబై స్టేడియంలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు ప్రీతి జింటా జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందే వాడియా తనను ఎన్నోసార్లు వేధింపులకు గురిచేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు జూన్ 30న (విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ) అందించిన లేఖలో ప్రీతి పేర్కొన్నారు. తన ముఖంపై వాడియా కాలుతున్న సిగరెట్లను విసరడం, గదిలోపెట్టి తాళం వేయడం వంటి దురాగతాలకు పాల్పడిన వైనాన్ని లేఖలో ప్రీతి ప్రస్తావించారు. తాను శాంతియుతంగా జీవించేందుకు వాడియాను తన నుంచి దూరంగా ఉంచాలని ప్రీతి పోలీసులను వేడుకున్నారు. లేకపోతే ఏదో ఒక రోజు వాడియా తనను చంపుతాడేమోనని భయపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాడియాకు హాని చేయాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ తన భద్రత దృష్ట్యా గత్యంతరం లేకే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లేఖలో చెప్పుకొచ్చారు. ప్రీతి జింటా ఆరోపణలను వాడియా గతంలోనే తోసిపుచ్చగా తాజాగా వెలుగు చూసిన ఆరోపణలపై స్పందించేందుకు వాడియా గ్రూపు ప్రతినిధులెవరూ అందుబాటులోకి రాలేదు. ప్రీతి జింటా, నెస్ వాడియాలు ఐపీఎల్ క్రికెట్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు సహ యజమానులుగా ఉన్న విషయం తెలిసిందే. -
నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. నెస్ వాడియా గతంలో తనను సిగరెట్లతో కాల్చాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెస్ వాడియా తనను గదిలో ఉంచి బంధించేవాడని ముంబై పోలీస్ కమిషనర్కు రాసిన లేఖలో ప్రీతి పేర్కొంది. కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తనను చంపేస్తాడేమోనని ఆందోళన చెందానని పేర్కింది. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యానని ప్రీతిజింటా చెప్పింది. ఐపీఎల్ సందర్భంగా నెస్ తనను దూషించి చేయి చేసుకున్నాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఐదేళ్ల పాటు కలసిమెలసి తిరిగిన ఈ జంట ఆనక విడిపోయింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్లో ప్రీతి, నెస్ ఇద్దరూ సహ భాగస్వాములు. -
మహిళను కావడమే నా తప్పు
నెస్వాడియాపై తన ఫిర్యాదు పనికిమాలిన లేదా అపరిపక్వ చర్య కాదని బాలీవుడ్ నటి ప్రీతీజింటా పేర్కొంది. కేవలం మహిళను కావడమే తన తప్పు అని, అనేకమార్లు అవమానాలు, బెదిరింపులు, వేధింపులకు గురైన మీదటనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ తన మాజీ ప్రియుడిపై ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ప్రజలు కాస్త ఓపిక పట్టాలని సూచించింది. తాను గతంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, ఇక ముందు కూడా చెప్పలేనని బుధవారం తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసింది. తాను ఈ దేశంలో బాధ్యతాయుతమైన పౌరురాలినని, కేవలం మహిళను కావడమే తన తప్పు అని పురుద్ఘాటించింది. ఒకప్పుడు తనకు సన్నిహితునిగా ఉన్న వ్యక్తి పని ప్రదేశంలో తనను తీవ్రంగా వేధింపులకు, అవమానాలకు గురిచేసినందునే ఈ స్థితికి చేరానని చెప్పింది. మహిళలపై హింస, ఆధిపత్యం సహించరానివని, అయినప్పటికీ ప్రజలు మహిళల వైపు వేలెత్తి చూపుతుంటారని వాపోయింది. వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని ‘పనికిమాలిన, దురుద్దేశ చర్య’గా అభివర్ణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది తనకోసం తాను జరుపుతున్న పోరాటమని, ఓ వ్యక్తికి లేదా కుటుంబానికి వ్యతిరేకంగా జరుపుతున్నది కాదని స్పష్టం చేసింది. తాను చేసిన ఫిర్యాదును మీడియా కనుగొని పెద్దదిగా చేస్తే తాను చేయగలిగిందేమిటని ప్రశ్నిం చింది. తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరికీ ఏమీ చెప్పలేదని పేర్కొంది. ఎవరికీ హాని చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తనను తాను రక్షించుకోవడమేనని మరోమారు ప్రీతీజింటా స్పష్టం చేసింది. -
మహిళను కావడమే నేను చేసిన తప్పు: ప్రీతి జింటా
ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై పోలీసుకేసు పెట్టడం అపరిపక్వత కాదని, తాను చేసిన తప్పల్లా.. మహిళను కావడమేనని సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా చెప్పింది. తరచుగా తనను తిట్టడం, బెదిరించడం, అవమానించడం లాంటివి అయిన తర్వాతే తాము విడిపోయే దశకు వచ్చామని తెలిపింది. నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడంటూ ప్రీతి ఇటీవలే ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జనం కాస్తంత ఓపిక పడితే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె తెలిపింది. తాను గతంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, అది తనకు నప్పని విషయమని ప్రీతి అంది. తాను బాధ్యతాయుతమైన పౌరురాలినని, కేవలం మహిళను అయినందుకే తనను ఇన్నాళ్లుగా వేధించాడని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. మహిళలను హింసించడం సరికాదని, ఇంత జరుగుతున్నా జనం మాత్రం మహిళలనే తప్పుబడుతున్నారని వాపోయింది. తాను తనకోసమే పోరాటం చేస్తున్నానని, ఇది ఏ ఒక్క కుటుంబంపై పోరాటం కాదని, కేవలం ఒక్క వ్యక్తిమీద చేస్తున్నదేనని ప్రీతి జింటా చెప్పింది. తానేమీ ప్రెస్మీట్లు పెట్టి ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని, పైపెచ్చు.. తన వ్యక్తిగత రహస్యాలను గౌరవించాలని కూడా కోరానని తెలిపింది. -
ప్రీతి జింటా.. ఓ బందిపోటు దొంగ!!
ఐపీఎల్లో తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాతో న్యాయవివాదం పెట్టుకుని.. చాలాకాలం పాటు పత్రికల ప్రధాన శీర్షికలలో నిలిచిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. మరోసారి ముఖానికి రంగేసుకుని వెండితెర మీదకు వస్తోంది. అయితే ఈసారి ఆమె అందాన్ని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లేదు. ఎందుకంటే.. నీరజ్ పాఠక్ తీస్తున్న 'భయ్యాజీ' అనే ఈ సినిమాలో ప్రీతి ఓ అరివీర భయంకరమైన బందిపోటు దొంగగా నటిస్తోంది. హీరో సన్నీ డియోల్ కూడా యూపీకి చెందిన ముఠానాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ప్రీతిజింటా ఓ గ్యాంగ్స్టర్ కుమార్తెగాను, సన్నీడియోల్ భార్యగాను చేస్తోందని దర్శకుడు నీరజ్ పాఠక్ చెప్పారు. ఈ సినిమాలో ప్రీతిని చూసి.. 'సోహ్ని మాహివాల్' చిత్రం రీమేక్లో సోహ్నికి పంజాబీ తల్లి పాత్ర ఆమే చేయాలని సన్నీ డియోల్ భావిస్తున్నాడు. ఆ సినిమాలో సన్నీ కొడుకు హీరోగా నటించబోతున్నాడు. ఈ ఫైర్ బ్రాండ్ పాత్రలో ప్రీతి అద్భుతంగా చేస్తోందని, ఇకమీదట ఆమెను కేవలం గ్లామర్ డాల్గానే చూడటం కుదరదని నీరజ్ అన్నారు. తమ షూటింగ్ ఇంకా 12 రోజులే మిగిలి ఉందని చెప్పారు. ఇంతకుముందు సోల్జర్, ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రాల్లో బాబీ డియోల్, సన్నీ డియోల్లతో ప్రీతి జింటా నటించింది. ఆ రెండు సినిమాలూ బ్రహ్మాండమైన హిట్లయ్యాయి. -
ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి ప్రీతిజింటా సోమవారం ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను కలిశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. కమిషనర్ వెంటనే ఆమెకు అనుమతియిచ్చారు. ఈ సందర్భంగా వేధింపుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కమిషనర్ కు తెలిపారు. ఈ కేసులో ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు ఇటీవల వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. -
ప్రీతి జింటా పోలీసులకు అంతా చెప్పేసింది!
ముంబై: తనకు, మాజీ బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి నస్ వాడియాకు తనకు మధ్య జరిగిన ఎపిసోడ్ ను బాలీవుడ్ నటి ప్రీతి జింటా పోలీసులకు వివరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండుగంటలకు పైగా సాగిన విచారణలో అన్ని వివరాలు ప్రీతి వెల్లడించిందని పోలీసు అధికారులు తెలిపారు. జూన్ 12 తేదిన నెస్ వాడియాపై దాఖలు చేసిన ఆరోపణలపై పోలీసులు స్టేట్ మెంట్ ను మంగళవారం రికార్డు చేశారు. తనను దూషించిన విధానాన్ని, తనపై ఎలా అరిచాడో, తనను నిందించిన వైనాన్ని, దాడి చేసిన తీరును పోలీసులకు వివరంగా ప్రీతి జింటా తెలిపినట్టు అధికారులు తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటనలో తనను పదే పదే హెచ్చరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్టు ప్రీతి చెప్పిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. 'స్పాట్ పంచనామా'లో భాగంగా వాంఖెడే స్టేడియంలో మే 30 తేదిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా నెస్ వాడియాతో కలిసి కూర్చున్న ప్రదేశాన్ని ప్రీతిజింటా పోలీసులకు చూపించారు. వాంఖెడే స్టేడియానికి తన సోదరుడితో కలిసి పోలీసులకు వివరాల్ని అందించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రీతి జింటా ఫిర్యాదులో పేర్కొన్న మరో 14 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. Follow @sakshinews -
ప్రీతి వాంగ్మూలం నమోదు
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. -
పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని పోలీసులు అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతీజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై మరోసారి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. -
నటి ప్రీతిజింటాపై దర్యాప్తు వేగవంతం!
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతిజింటా పెట్టిన వేధింపుల కేసులో దర్యాప్తు వేగవంతం కానుంది. ముంబై పోలీసులు సోమ లేదా మంగళవారాల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ నెల 12న వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రీతిజింటా అమెరికాకు వెళ్లింది. ఆ పర్యటన ముగించుకుని ఆదివారం ఆమె ముంబైకి తిరిగొచ్చింది. దీంతో ఈ కేసులో ప్రీతిజింటా అనుబంధ వాంగ్మూలాన్ని సోమ లేదా మంగళవారాల్లో నమోదు చేయనున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మే 30న వాంఖడే స్టేడియంలో కింగ్స్-11 పంజాబ్, చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలను ఆమె నుంచి తెలుసుకోవాలని అనకుంటున్నట్లు ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర షిశ్వే తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా మ్యాచ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన అనంతరం నెస్వాడియాను ప్రశ్నించనున్నట్లు షిశ్వే చెప్పారు. ఈ కేసులో ఐపీఎల్ సీవోవో సుందర్రామన్, బీసీసీఐ సెక్రటరీ సంజయ్పటేల్ సహా ఏడుగురు సాక్ష్యుల వాంగ్మూలాలను పోలీసులు ఇప్పటికే నమోదు చేశారు. మరోవైపు నెస్వాడియా తండ్రి నుస్లి వాడియా కార్యదర్శికి వచ్చిన బెదిరింపు కాల్స్పై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. -
ప్రీతి జింటాను విచారించనున్న పోలీసులు
ముంబై: మాజీ ప్రేయుడు నెస్ వాడియా తనపై దౌర్జన్యం చేసి చేయిచేసుకున్నాడంటూ బాలీవుడ్ భామ ప్రీతి జింటా దాఖలు చేసిన కేసులో పోలీసులు రెండు రోజుల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అమెరికా వెళ్లిన ప్రీతి ఆదివారం మధ్యాహ్నం ముంబై తిరిగొచ్చారు. ముంబై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రీతి నిరాకరించారు. ఈ కేసులో సోమ లేదా మంగళవారం ప్రీతిని విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మే 30న ముంబై వాంఖడే స్టేడియంలో నెస్ వాడియా తనను దూషించి, చేయిచేసుకున్నాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్ని నెస్ వాడియా ఖండించారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి విడిపోయిన ప్రీతి, నెస్ వాడియా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు సహ భాగస్వాములు. -
మీడియాపై ప్రీతి జింటా సెటైర్!
ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో తన వాటాను అమ్మడం లేదని బాలీవుడ్ తార ప్రీతిజింటా స్పష్టం చేశారు. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీలో సహ భాగస్వామి నెస్ వాడియాపై ప్రీతి జింటా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను యూఎస్ స్థిరపడనున్నట్టు మీడియాలో వస్తున్న రూమర్లను ప్రీతిజింటా తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ప్రీతి జింటా ఆసంతృప్తిని వ్యక్తం చేసింది. నేను నా వాటాను అమ్మడం లేదు. అమెరికాలో స్థిరపడటం లేదు అని ప్రీతిజింటా ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన జీవితం గురించి మీడియా ఊహజనిత కథనాలను రచించడం నచ్చడం లేదని ఆమె అన్నారు. వాస్తవాలకు దూరంగా ఉండే కథనాలతో వార్తలు అందించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో విషయాలకంటే.. భారతదేశంలో ఎన్నో అతిముఖ్యమైన అంశాలను రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అని మీడియాపై ఎద్దేవా చేశారు. లైంగికంగా వేధించారని తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై ప్రీతిజింటా జూన్ 12 తేదిన ఫిర్యాదు చేశారు. -
ప్రీతీ జింటా వెంట పడొద్దు!
మాఫియా డాన్ బెదిరించినట్లు వాడియా గ్రూప్ ఫిర్యాదు ముంబై: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్వాడియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రీతిని వేధింపులకు గురిచేస్తే తమ వ్యాపారం సజావుగా సాగదంటూ అజ్ఞాతంలో ఉన్న మాఫియా నేత రవి పూజారీ పేరుతో ఈ నెల 16న తమకు బెదింపు కాల్స్ వచ్చాయని నెస్వాడియా తండ్రి నుస్లీ వాడియాకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ముంబై పోలీసులకు తెలిపారు. -
జట్టు 'కట్టేశారు'!!
-
వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు. రవి పూజారి నుంచి బెదిరింపు మెసెజ్ వస్తున్నట్టు పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా కార్యదర్శి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసినట్టు మహేశ్ పటేల్ చెప్పారు. నెస్లీ వాడియా కార్యదర్శి పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నెస్లీ వాడియా ఫోన్ కు వచ్చాయా లేక కార్యదర్శి మొబైల్ వచ్చాయా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. నెస్లీవాడియా కుమారుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, మాజీ ప్రేయసి ప్రీతి జింటా మే 30 తేదిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో వాడియా కుటుంబ పేరు మీడియాలో వినిపిస్తోంది. నెస్ వాడియా, ప్రీతి జింటాలకు కేసు నేపథ్యంలో బెదిరింపులు వచ్చాయా అనే విషయంపై ఓ అవగాహనకు రాలేదని పోలీసులు తెలిపారు. తాజా ఫిర్యాదుపై వాడియా గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది. -
ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు!
మాజీ ప్రేమికులు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ భాగస్వాములు ప్రీతి జింటా, నెస్ వాడియాల వివాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతితో నెస్ వాడియా గొడవపడినప్పడు అక్కడే ఓ లెజండరీ క్రికెటర్ కొడుకు ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ సమయంలో రికార్డయిన సీసీటీవీ క్లిప్లను రెండింటిని సేకరించారు. మైనర్ అయిన ఆ అబ్బాయిని ఈ కేసులో సాక్షిగా చేర్చాలా వద్దా అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మాజీ ప్రియుడు నెస్ వాడియా దూషించడంతో పాటు తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాడియాకు సమన్లు జారీ చేసే ముందు పోలీసులు ప్రీతిని విచారించనున్నారు. ఈ సంఘటన జరిగినపుడు అక్కడే ఉన్న క్రికెటర్ కొడుకు జోక్యం చేసుకుని వాడియను వారించినట్టు పోలీసులు చెప్పారు. అయితే వాడియా ఆ అబ్బాయిపై కూడా చిందులేసినట్టు తెలిపారు. అయితే ఏ క్రికెటర్ కొడుకు, అతని పేరు ఏంటి అన్న వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే కేసులో అతన్ని సాక్షిగా చేర్చితే పేరు వెల్లడించనున్నారు. -
వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!
ప్రీతి జింటాతో డిష్యుం డిష్యుం అన్నట్లున్న నెస్ వాడియా.. ఇప్పటికీ ఆమె తనకు మంచి స్నేహితురాలే అని చెబుతున్నా, ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో మాత్రం అందరికీ తెలుసు. మాజీ ప్రియుడు తనను కొట్టాడని, వేధిస్తున్నాడని ప్రీతిజింటా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ప్రీతి - వాడియా స్నేహబంధం కొనసాగింది. దానికి ముందు, ఆ తర్వాత, మధ్యలో కూడా నెస్ వాడియా మరికొందరు బాలీవుడ్ భామలతో చెట్టపట్టాలు వేసుకునే తిరిగాడని ముంబై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రాక్స్టార్ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీ.. నెస్ వాడియాతో రాసుకు పూసుకుని తిరిగి, వార్తల్లో నిలిచింది. రాక్స్టార్ సినిమా ప్రీమియర్ షో ముగియగానే, కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీలో నర్గీస్ ఫక్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరో రణ్బీర్ కపూర్ రాకపోయినా.. నెస్ వాడియా రూపంలో ఆమెకు ఆ పార్టీలో మంచి కంపెనీయే దొరికింది. వాళ్లిద్దరూ దాదాపు గంట పాటు ఆ పార్టీలో ఒకరినొకరు అతుక్కుపోయి కనిపించారట. ప్రీతిజింటా కూడా ఆ పార్టీలో ఉన్నా, ఫక్రీ స్థాయిలో ఆమె వార్తల్లో నిలవలేకపోయింది. ఒకప్పుడు లారా దత్తాతోను, అంతకంటే ముందు మనీషా కొయిరాలాతో కూడా నెస్ వాడియా కాస్త సన్నిహితంగానే మెలిగాడట. అంతేనా, అమీషా పటేల్ అన్నా కూడా వాడియా చెవి కోసుకునేవాడని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడు వాళ్లంతా దూరంగా జరగడంతో.. తాజాగా బిజినెస్ టైకూన్ ఆయేషా థాపర్తో వాడియా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వినిస్తోంది. -
ఆది నుంచీ ఆడపులే..!
నటి, మహిళా వ్యాపారవేత్త ప్రీతి జింతాది మొదటి నుంచీ నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం ప్రదర్శించే మనస్తత్వమే. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మాజీ ప్రియుడు, వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై ప్రీతి చేసిన ఫిర్యా దు గత రెండ్రోజులుగా బాలీవుడ్ జనాలతోపాటు వ్యాపార వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. వ్యాపారం సంబంధాలు దెబ్బతినడంతోనే ప్రీతి ఆయనపై ఇటువంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసిందా? ఇంకా మరేవైనా కారణాలున్నాయా? అనే విషయాలు పక్కనబెడితే ప్రతి జింతాది ముందు నుంచీ ధైర్యంగా అడుగులు వేసే మనస్తత్వమేనని చెబుతున్నారు ఆమె సన్నిహితులు. అందుకు పలు ఉదాహరణలు కూడా చూపుతున్నారు. బాలీవుడ్లో ఆమె తెరంగేట్రమే వివాదాస్పద చిత్రంతో ప్రారంభమైంది. కుందన్ షా దర్శకత్వం వహించిన ‘క్యా కహెనా’ చిత్రంలో పెళ్లి కాకుండానే తల్లి అయిన పాత్రలో ప్రీతి కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర ద్వారా తెరంగేట్రం చేయాలని ప్రీతి నిర్ణయం తీసుకున్నప్పు డు వద్దని చాలా మంది వారించారట. అయినా ఆమె ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చిత్రం వాయిదా పడడం, మణి రత్నం సినిమా ‘దిల్ సే’తో బాలీవుడ్ జనాలకు ఆమె పరిచయం కావడం జరిగిపోయాయి. సిని మాలో తనతోపాటు కలిసి నటించిన షారుఖ్ను కూడా నిలదీసి అప్పట్లో వార్తల్లోకెక్కింది. ఇక 2001లో వేశ్యగా నటించింది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ పేరుతో అబ్బాస్-ముస్తాన్లు తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్ఖాన్ బిడ్డకు సరోగసి తల్లిగా, వేశ్యగా కనిపించినప్పుడు కెరీర్ను చేజేతులా నాశనం చేసుకుంటుందనే విమర్శలు వినిపించాయి. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. 2005లో ముంబైలోని ఓ వార్తా పత్రికపై పరువునష్టం దావా వేసి మీడియాకు వ్యతిరేకంగా పోరాటాం చేసినంత పనిచేసింది. బాలీ వుడ్ తారలను అండర్వరల్డ్ ప్రభావితం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసాన్ని కూడా ప్రీతి చేసింది. సుచిత్రా కృష్టమూర్తి తనపై ఆరోపణలు చేసినప్పుడు కూడా ధైర్యంగానే సమాధానమిచ్చి మళ్లీ వార్తల్లోకెక్కింది. -
'మా వైవాహిక జీవితానికి ప్రీతిజింటా తెరదించింది'
ముంబై: లైంగికంగా వేధిస్తున్నారని మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫ్రాంచైజీలో సహా భాగస్వామి నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటా ఫిర్యాదు చేయడం తాజాగా సంచలనం రేపింది. గతంలో కూడా ఎలాంటి బెదిరింపులకు తలవొగ్గకుండా పలుమార్లు ఫిర్యాదు చేసి జింటా అందర్నిఆకర్షించారు. ప్రీతి జింటా తన జీవితంలో సంచలనం రేపిన కొన్ని ఘటనలను, ప్రత్యేక సంఘటనలు, వివాదాలు, విశేషాలను ఓసారి పరిశీలిద్దాం. 1. 2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ కూడా మాఫియాకు భయకుండా ప్రీతిలా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. 2. 2005 లో తనపై అమర్యాదపూర్వకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గొంతుతో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన పత్రికపై పరువు నష్టం కేసును ప్రీతిజింటా నమోదు చేసింది. 3. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా అంటూ సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపణలు చేసింది. అయితే సుచిత్ర ఆరోపణలకు ధీటుగా స్పందించిన ప్రీతి.. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదు అని వ్యాఖ్యలు చేశారు. 4. ఐపీఎల్ క్రేజ్ కు ఆకర్షితురాలై.. బాలీవుడ్ కు దాదాపు గుడ్ బై చెప్పిందనే విమర్శలు వచ్చాయి. 5. 2001లో విడుదలైన 'చోరి చోరి చుప్కే చుప్పే' చిత్రంలో వ్యభిచారి పాత్రను పోషించడమే కాకుండా సర్రోగసి మదర్(అద్దె తల్లి)గా నటించి ప్రీతి జింటా సంచలనానికి తావిచ్చింది. 6. క్యా కహనా చిత్రంలో పెళ్లికాకుండానే తల్లైన పాత్రను పోషించి ప్రీతి జింటా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దిల్ సే' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతిజింటా ఆ చిత్ర హీరో షారుక్ ఖాన్ ను నీవు బ్రహ్మచారివేనా అంటూ ప్రశ్నించడం అనేక విమర్శలకు దారి తీసింది. -
ఇంతకీ వాళ్లు ఎక్కడ గొడవపడ్డారు?
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా, ఐపిఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యాజమాన్య భాగస్వామి, ప్రముఖ వ్యాపార వేత్త నెస్ వాడియా మధ్య గొడవ ఎక్కడ జరిగిందో తమకు స్పష్టంగా తెలియాలని ముంబై పోలీసులు అంటున్నారు. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారు ఎక్కడ గొడవపడ్డారో తెలుసుకునేందుకు మరోసారి ప్రీతిజింటా స్టేట్మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం లభించడంలేదని ముంబై పోలీసులు తెలిపారు. గ్యాలరీ ముందు భాగంలో ప్రీతిజింటా ఉన్నట్లు వారు తెలిపారు. ప్రీతితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని చెప్పారు. ఆమె లాయర్ను సంప్రదించినట్లు తెలిపారు. ప్రీతి చెప్పినట్లుగా పేర్కొన్న ఇద్దరు సాక్షులనూ సంప్రదించామని చెప్పారు. ఇవాళ లేదా రేపు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు. -
ప్రీతి జింటా ఫిర్యాదుతో నెస్వాడియాకు తిప్పలు!
ముంబై/న్యూఢిల్లీ: మాజీ ప్రియురాలు, వ్యాపార భాగస్వామి, బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ వ్యాపార వేత్త నెస్ వాడియాకు తిప్పలు మొదలయ్యాయి. ఐపిఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు యాజమాన్య భాగస్వాములైన వీరిద్దరూ సహజీవనం చేసినట్లు సమాచారం. దాదాపు అయిదు సంత్సరాలు కొనసాగిన వారి మధ్య సంబంధం రెండేళ్ల క్రితం దెబ్బతిన్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయినా ఇద్దరి మధ్యా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. సినీనటి ప్రీతిజింటా ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వాంఖడే స్టేడియం సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. పంజాబ్ ప్లేయర్ల నుంచీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెరైన్ డ్రైవ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అతనిపై 354,504,506,509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 39 సంవత్సరాల వయసున్న ప్రీతి ఫిర్యాదుతో మహారాష్ట్ర మహిళా కమిషన్ నెస్వాడియాకు అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా అతనిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) కూడా స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించాలని నిర్ణయించింది. ప్రీతిజింటాకు జరిగిన అవమాన ఘటనను సమగ్రంగా విచారించనున్నట్లు ఎన్సిడబ్ల్యూ చైర్పర్సన్ మమతా శర్మ చెప్పారు. -
మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా
-
మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా
ముంబాయి : బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
'మోడీ అభిమానిని, ప్రచారం అవసరం లేదు'
వారణాసి : బాలీవుడ్ నటి, ఐపిఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. దర్శనం అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ తాను నరేంద్ర మోడీ అభిమానినంటూ, ఆయన విజయాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను దేవుని దర్శనానికి వచ్చానంటూ.... మోడీ గెలుపుకు ప్రచారం అవసరం లేదన్నారు. ప్రజలు మోడీని అభిమానిస్తున్నారని ప్రీతి తెలిపింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యంగా మహిళలు, పేదలు ఓటు హక్కును వినియోగించుకుంటే అయిదేళ్ల పాటు సక్రమ పాలనకు దోహదం చేసిన వారవుతారని ఆమె పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా తనకు ఇష్టమేనని ప్రీతి తెలిపింది. కాగా అంతకు ముందు రోజు ప్రీతి తన వారణాసి ప్రయాణం, నగరంతో ఉన్న అనుబంధాన్ని ట్విట్ట్ చేసింది. నరేంద్ర మోడీ, ప్రీతి జింటా, వారణాసి, బీజేపీ, narendra modi, Preity Zinta, varanasi, bjp -
30 దాటినా ఇప్పటికీ ఒంటరే....
బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జీ ఎట్టకేలకు 36 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కింది. ఎప్పుడో 30 దాటిన ప్రీతీజింటా, ఊర్మిళా మతోంద్కర్, టబూ వంటి బ్యూటీలు మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్లుగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా, అమృతారావు వయసు కూడా మూడు పదులు దాటిపోయింది. హాలీవుడ్ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక, హర్మన్ బవేజా, షహీద్ కపూర్తో డేటింగ్ చేసినా ఎవరినీ మనువాడలేదు. లేటు వయసులోనూ హాట్గా నటించే బిపాసా బసు కూడా డినో మోరియా, జాన్ అబ్రహంతో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. జాన్కు 2011లో గుడ్బై చెప్పేసింది. తాను మళ్లీ ప్రేమలో పడ్డానంటూ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. అతడు ఎవరో కాదు.. ‘వాట్స్ యువర్ రాశి’ ఫేం హర్మన్ బవేజా! వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కునాల్ ఖేముతో పీకల లోతు ప్రేమలో ఉన్న సోహా అలీఖాన్కు 30 ఏళ్లు ఎప్పుడో దాటాయి. పెళ్లి గురించి ఈమె కూడా ఏమీ మాట్లాడడం లేదు. మరో బ్యూటీ నేహా ధూపియా కొన్నాళ్లు రిత్విక్ భట్టాచార్య అనే క్రీడాకారుడితో డేటింగ్ చేసింది. వెనెజులా నటుడు జేమ్స్ సిల్విస్టర్తోనూ చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు వార్తలు వచ్చాయి. క్రికెటర్ యువరాజ్ సింగ్తోనూ ఏదో ఉందంటూ కథనాలు వినిపించాయి. నేహ వీటి గురించి ఎప్పుడూ స్పందించలేదు. పెళ్లి గురించి కూడా మాట్లాడలేదు. 32 ఏళ్ల వయసున్న ఉన్న అమృతారావు మొదట పాక్ గాయకుడు ఫర్హాన్ సయీద్ను ప్రేమించింది. తరువాత ఒక ఎన్ఆర్ఐ డాక్టర్తోనూ సన్నిహితంగా ఉంది. అయితే వీరిలో ఎవరినీ అమృత పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. కహోనా ప్యార్ బ్యూటీ అమిషా పటేల్, మరో బెంగాలీ బ్యూటీ రైమాసేన్ కూడా లేడీ బ్యాచిలర్లే! -
ప్రియాదత్ పై పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా
రానున్న లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బాలీవుడ్ తార ప్రీతి జింటా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను జింటా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ పై భారతీయ జనతా పార్టీ తరపున పోటీకి సిద్దమవుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు. నార్త్, సెంట్రల్ ముంబై నియోజకవర్గంలో ప్రియా దత్ పై ప్రీతి జింటాను పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే వార్తలు మీడియాలో వచ్చాయి. ట్విటర్ లో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సీరియస్ గా స్పందించారు. ఆ వార్త ఎక్కడ చదివావు. ఆ కథనాన్ని ప్రింట్ చేసిన పేపర్ చింపేయ్. ఆవార్తలో వాస్తవం లేదు అని ప్రీతి ట్వీట్ చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ జట్టకు సహ భాగస్వామి ఉన్న ప్రీతి జింటా స్వంత బ్యానర్ పై ఇష్క ఇన్ పారిస్ అనే చిత్రాన్ని నిర్మించింది. -
చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హై కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం హజరవ్వడంలో విఫలమైన ప్రీతి జింటాకు అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జనవరి 27 తేదిన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను గురువారం కొట్టివేసింది. సినీ రచయిత అబ్బాస్ టైర్ వాలా దాఖలు చేసిన కేసులో పలు దఫాలు కోర్టుకు గైర్హాజరవ్వడంతో వారెంట్లు జారీ చేశారు. వారెంట్ల జారీని సవాల్ చేస్తూ జింటా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చెక్ బౌన్స్ కేసులో న్యాయవాది ద్వారా తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవచ్చనే ఉదహరిస్తూ హైకోర్టులో జింటా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జింటా పిటిషన్ నిరాకరించి ఫిబ్రవరి 10 తేదిన నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీచేశారు. జింటా కేసును మూడు నాలుగు వారాలు వాయిదా వేయడమే కాకుండా.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. -
'నేను ఇంకా వర్జిన్ నే'
బాలీవుడ్ లో నటుడిగానే కాకుండా.. మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్ గా సల్మాన్ ది అగ్రస్థానం. వయస్సు యాభై సంవత్సరాలు సమీపిస్తున్న కండలవీరుడికి ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదు. కెరీర్ ఆరంభం నుంచి బాలీవుడ్ తారలతో అఫైర్లు, లింకులు, డేటింగ్ లాంటి హాట్ హాట్ వార్తలతో అభిమానులను ఆకట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలో సంగీతా బ్రిజ్లానీతో సల్మాన్ అఫైర్ అప్పట్లో సంచలనమే. ఆ తర్వాత, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ సల్లూ భాయ్ అఫైర్ల జాబితాలో నిలిచారు. ఇక ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో నడిపిన ప్రేమాయణం చాలా సెన్సేషన్ గా నిలిచింది. పెళ్లిదాకా వచ్చిన వ్యవహారం ఆగిపోవడం వెనుక సల్మాన్ వ్యక్తిగత ప్రవర్తనే కారణమని చెప్పుకుంటారు. ఈ అఫైర్లన్ని బయటకు తెలిసినవి కాగా, తెలియని డేటింగ్, లింకులు చాలానే ఉంటాయనేది కాదనలేని వాస్తవం. ఇదంతా ఎందుకంటే ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ నాలుగవ సీజన్ లో కరణ్ జోహార్ తో మాట్లాడుతూ.. సల్మాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే జీవిత భాగస్వామి కోసం తనను తాను కాపాడుకుంటున్నాను అని సల్మాన్ అన్నారు. అందుకు ఇంకా నీవు వర్జిన్ వా అని కరణ్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ నవ్వుతూ అవును అంటూ తలాడించాడు. అందుకు ఎందరో బాలీవుడ్ తారలతో అఫైర్ ఉన్నాయని.. వారితో నీవు శృంగారంలో పాల్గొనలేదా అని కరణ్ అడిగిన మరో ప్రశ్నకు 'వాళ్లంతా నాకు స్నేహితులు మాత్రమే' అని సల్మాన్ జవాబిచ్చారు. అంతేకాకుండా బెడ్ పై తాను ఒంటరిగానే నిద్రించడం అలవాటు అని సల్మాన్ తెలిపాడు. ఒకవేళ తాను తెలిపిన ముగ్గురు హీరోయిన్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగిన మరో ప్రశ్నకు ప్రీతి జింటా అని ఠక్కున సమాధానమిచ్చాడు. -
బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్!
బాలీవుడ్ తార ప్రీతి జింటాకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. పలుమార్లు కోర్టు ఆదేశించినప్పటికి హాజరకాకపోవడంతో ప్రీతి జింటాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రితీ జింటా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టు హాజరుకాకపోవడంతో వారెంట్ ను చండీగడ్ కోర్టు జారీ చేసింది. ఇటీవల బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరమై.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు ప్రీతి జింటా ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే!