stock market rally
-
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 53 పాయింట్లు పెరిగి 23,101కు చేరింది. సెన్సెక్స్(Sensex) 188 పాయింట్లు ఎగబాకి 76,368 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు సెషన్లలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.83 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం పడిపోయింది. నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలిస్తే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చివరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?
భారత స్టాక్మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్రంగా పడిపోయిన మార్కెట్ సూచీల్లో ప్రధానంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లే అధికంగా ఉన్నాయి. అందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) శంకరన్ నరేన్ చేసిన కామెంట్లు కారణమని కొందరు భావిస్తున్నారు. అసలు ఆయన స్టాక్ మార్కెట్కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారో తెలుసుకుందాం. స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లు గత ఐదేళ్లలో సాధించిన లాభాలను కాపాడుకోవాలని నరేన్ సూచించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్లో ఉన్నాయని, రిస్క్లను నిర్వహించడానికి వైవిధ్యభరితంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.లాభాలు కాపాడుకోవడం: గత ఐదేళ్లలో ఆర్జించిన రాబడులను కాపాడుకోవాలని నరేన్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో ఈక్విటీలు లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు గణనీయమైన రాబడులను చూశారని ఆయన పేర్కొన్నారు.ఓవర్ వాల్యుయేషన్: లార్జ్ క్యాప్ స్టాక్స్తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక విలువను కలిగి ఉన్నాయని నరేన్ అన్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) లార్జ్ క్యాప్ స్టాక్స్ను విక్రయించడమే ఈ అసమానతలకు కారణమని, ఇది మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్స్ ధరలను పెంచేలా చేసిందన్నారు.డైవర్సిఫైడ్ స్ట్రాటజీ: ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్టాక్స్, బంగారం, వెండి వంటి పెట్టుబడులను సూచిస్తూ వైవిధ్యభరితంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులన్నీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టొద్దని తెలిపారు.మార్కెట్ అస్థిరత: 2008-2010 కాలం కంటే 2025 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు ఈ విభాగాల్లో తమ పెట్టుబడులను రిడీమ్ చేసుకోవాలని సూచించారు.ఇదీ చదవండి: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?వివరణనరేన్ చేసిన ఈ వ్యాఖ్యలను మార్కెట్ పరిగణలోకి తీసుకుని భారీగా నష్టపోయినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై నరేన్ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భారత మార్కెట్లో దీర్ఘకాలిక వృద్ధి తథ్యం. దానిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రస్తుత సవాలు డబ్బు సంపాదించడం కాదు. దాన్ని పరిరక్షించడం. ఇన్వెస్టర్లు తమ లాభాలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. ఎప్పటినుంచో చాలామంది అంచనా వేస్తున్నట్టుగానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ భారీగా పెరిగాయి. ఈ పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఈ వ్యవహారంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఒడిదొడుకులకు లోనుకావద్దని, దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. -
నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు నష్టపోయి 23,419కు చేరింది. సెన్సెక్స్(Sensex) 402 పాయింట్లు దిగజారి 77,442 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.41 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.95 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.36 శాతం దిగజారింది.ఈ ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత 11 సమావేశాల్లో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం నుంచి 6.25కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగ స్థాక్లకు కొంత ఊరట కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం గత సెషన్తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 23,696కు చేరింది. సెన్సెక్స్(Sensex) 30 పాయింట్లు పెరిగి 78,303 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.39 శాతం లాభపడింది. నాస్డాక్ 0.19 శాతం ఎగబాకింది.ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్ 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.9 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్డాక్ 1.35 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్తోనే కాల్ డ్రాప్స్అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నిన్నటి సెషన్లో అరశాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.76 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.2 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్ రోజున స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,576కు చేరింది. సెన్సెక్స్ 267 పాయింట్లు ఎగబాకి 77,755 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.5 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలుపార్లమెంట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో శనివారం మార్కెట్లో పూర్తిస్థాయిలో ఓపెన్లో ఉంటాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.56 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం దిగజారింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో ఫెడ్ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ(Nifty) 70 పాయింట్లు లాభపడి 23,021కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 పాయింట్లు ఎగబాకి 76,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.88 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.92 శాతం లాభపడింది. నాస్డాక్ 2.03 శాతం ఎగబాకింది.అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 22,904కు చేరింది. సెన్సెక్స్ 326 పాయింట్లు ఎగబాకి 75,692 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.46 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.07 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసంఅమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23 వేల మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు నష్టపోయి 22,993కు చేరింది. సెన్సెక్స్(Sensex) 305 పాయింట్లు దిగజారి 75,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.74 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.29 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది.డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు లాభపడి 23,241కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 పాయింట్లు ఎగబాకి 76,655 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: రోల్స్రాయిస్కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,100 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు నష్టపోయి 23,106కు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పడిపోయి 76,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.31 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.61 శాతం లాభపడింది. నాస్డాక్ 1.28 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,100 మార్కు వద్ద కదలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు లాభపడి 23,085కు చేరింది. సెన్సెక్స్(Sensex) 297 పాయింట్లు ఎగబాకి 76,139 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.11 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 79.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.88 శాతం లాభపడింది. నాస్డాక్ 0.64 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ నిన్నటి మార్కెట్లో అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు లాభపడి 23,416కు చేరింది. సెన్సెక్స్(Sensex) 92 పాయింట్లు ఎగబాకి 77,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 80.07 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే ఎలాంటి మార్పు చెందలేదు. నాస్డాక్ 1 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 454 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 77,073.44 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,584.84- 77,318.94 రేంజ్లో ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ (Nifty) నిఫ్టీ 50 కూడా 141 పాయింట్లు లేదా 0.61 శాతం లాభంతో 23,344.75 వద్ద గ్రీన్ జోన్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.10 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,170.65 వద్ద ఉంది.కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిపిసిఎల్ నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 29 సానుకూలంగా ముగిశాయి. దీనికి విరుద్ధంగా ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Crude Oil) ధర 80.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు నష్టపోయి 23,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 76,761 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 81.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 76,499.63 వద్ద, నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,207.60 వద్ద నిలిచాయి.అదానీ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు లాభపడి 23,221కు చేరింది. సెన్సెక్స్(Sensex) 418 పాయింట్లు ఎగబాకి 76,741 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.65 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.76 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.38 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఖాళీరూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులుఅధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. -
అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుసెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏది కొంటే ఎంత లాభం..?
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51 లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల మంది కేవలం ఆప్షన్స్(Options)లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.తొందరగా లాభాలు సంపాదించాలని..స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్లైన్లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్లో మనం ఆప్షన్స్కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.కాల్, పుట్ తీసుకోవడం తెలియాలి..తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.ఎట్ ది మనీ (ఏటీఎం)ఇన్ ది మనీ (ఐటీఎమ్)అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)ఎస్బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్) = రూ.15,750 అన్నమాట.B అనే వ్యక్తి షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!పైన తెలిపిన దానికి రివర్స్లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్లో తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
వరుస నష్టాలు.. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతమార్కెట్ రేటింగ్కు హెచ్ఎస్బీసీ కోత..అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ను ‘ఓవర్వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కి తగ్గించింది. కార్పొరేట్ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 77,620.21 వద్ద, నిఫ్టీ 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం నష్టంతో 23,526.50వద్ద నిలిచాయి.బజాజ్ ఆటో, నెస్లే ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 50.62 పాయింట్లు లేదా 0.065 శాతం నష్టంతో 78,148.49 వద్ద, నిఫ్టీ 18.95 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో 23,688.95 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటివి టాప్ గెయిన్ర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు నష్టపోయి 23,628కు చేరింది. సెన్సెక్స్(Sensex) 289 పాయింట్లు దిగజారి 77,910 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు(stock market) గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.1 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.69 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 177.70 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 78,142.69 పాయిట్ల వద్ద, నిఫ్టీ 81.20 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,697.25 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 157 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్(Sensex) 435 పాయింట్లు ఎగబాకి 78,414 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో వైరస్ సైరన్!
ముంబై: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసులు భారత్లో నమోదవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల అలజడి రేగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ విక్రయాలకు పాల్పడటంతో సోమవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా కుప్పకూలాయి. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపై ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఒత్తిడి పెంచాయి.సెన్సెక్స్(Sensex) 1,258 పాయింట్లు పతనమై 78వేల స్థాయి దిగువన 77,965 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(NIFTY) 24 వేల స్థాయిని కోల్పోయి 389 పాయింట్ల నష్టంతో 23,616 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. మెటల్, బ్యాంకులు, రియల్ ఎస్టేట్, ఆయిల్అండ్గ్యాస్, ఫైనాన్స్ షేర్లు భారీగా నస్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,441 పాయింట్లు క్షీణించి 77,782 వద్ద, నిఫ్టీ 453 పాయింట్లు పతనమై 23,552 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ 2.50 శాతం పతనాన్ని చవిచూశాయి. హెచ్ఎంపీవీ వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?నష్టాలు ఎందుకంటే... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజీ(డీఎంఏ) స్థాయిని కోల్పోవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సునామీ నెలకొంది. -
ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం!
గత వారం మార్కెట్లో బుల్స్(Market Bulls) హడావుడి కనిపించింది. వాస్తవానికి అంతక్రితం వారం రావాల్సిన షార్ట్ కవరింగ్ కిందటి వారం రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా గత గురువారం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 400 పాయింట్ల దాకా పెరిగాయి. మళ్లీ శుక్రవారం కొంతమేర నష్టాల్లో నడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు సానుకూలంగా ఉండటం... మరీ ముఖ్యంగా మారుతీ షేర్ల దూకుడు, ఐటీరంగం(IT Sector)లో మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు బావుండటం..వంటి కారణాలు మార్కెట్ను ముందుకు నడిపాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 79223, నిఫ్టీ 24004 పాయింట్ల వద్ద ముగిశాయి. అంత క్రితం వారంతో పోలిస్తే గత వారం మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 525 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సుమారు 191 పాయింట్లు పెరిగింది.ఈవారం ఇలా..తెలుగు వాళ్లకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్కు సంబంధించి అలాంటి పండగే రాబోతోంది. అదే ఆర్థిక ఫలితాలు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఈవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9న టీసీఎస్ ఫలితాలతో సందడి మొదలవుతుంది. ఇక ఈ ఫలితాలు మార్కెట్లకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఈసారి ఫలితాలు కొంత ప్రొత్సాహకారంగా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సానుకూల సంకేతం. మరోపక్క క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పలచబడ్డ విదేశీ మదుపర్ల లావాదేవీలు మళ్లీ జోరు అందుకుంటాయి. అయితే గత వారం చివర్లో కనిపించిన కొనుగోళ్ల ఉద్ధృతి కొనసాగడం అనేది ఆర్థిక ఫలితాలు, విదేశీ మదుపర్ల చర్య పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఎఫ్ఐఐల తీరువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16,982 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ మదుపర్లు రూ.34,194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది తొలి మూడు రోజుల్లోనూ విదేశీ మదుపర్లు రూ.4500 కోట్ల నికర విక్రయాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ.2500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్కు అండగా నిలిచారు. సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బుల్స్ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం. కొనుగోళ్ల జోరు కొనసాగితే నిఫ్టీ 24250 పాయింట్ల వరకు పరుగులు తీయొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 24600 వరకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఒకవేళ అమ్మకాలు పెరిగితే 23800 కీలక స్థాయిని మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే పతనం మరింత పెరిగి గతంలోని కనిష్టస్థాయులను టచ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత మద్దతు స్థాయి అయిన 23300 మార్కెకు పడిపోవచ్చు. ఆ స్థాయికి క్షీణించడానికి ముందు కొద్దిపాటి రికవరీకి ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమారంగాలవారీగా...ఆటోమొబైల్ రంగంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు ఈ కంపెనీలు ప్రకటించిన విక్రయ గణాంకాలు చాలావరకు మదుపర్లను మెప్పించాయి. మారుతీ షేర్లలో దూకుడు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్కు అవకాశం ఉంటుంది. గత కొద్దివారాలుగా లాభాల్లో సాగుతున్న ఫార్మా రంగం ర్యాలీ ఈవారం కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పుడు మదుపర్లు ముందుగా సురక్షితంగా భావించి కొనుగోళ్లు జరిపేది ఈ రంగంలోని షేర్లనే. ఇక టీసీఎస్ ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయి. అల్ట్రాటెక్, అంబుజా షేర్లకు మద్దతు దొరికే అవకాశం ఉన్నప్పటికీ సిమెంట్ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు. అలాగే ఎఫ్ఎంసిజీ, యంత్ర పరికరాల రంగానికి చెందిన షేర్లు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. టెలికం, ఆయిల్ రంగాల షేర్లలో స్థిరీకరణ జరగొచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఐటీ స్టాక్ల ర్యాలీ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఈ సమయం వరకు ఐటీ స్టాక్లు ఎక్కువగా ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 720.60 పాయింట్లు లేదా 0.90 శాతం క్షీణించి 79,223.11 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 80,072.99 నుండి 79,147.32 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ50 183.90 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 24,004.75 వద్ద రెడ్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,196.45 వద్ద, కనిష్ట స్థాయి 23,978.15 వద్ద నమోదైంది.నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 32 రెడ్లో ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ముగిసిన 18 స్టాక్లలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 24,064కు చేరింది. సెన్సెక్స్ 501 పాయింట్లు దిగజారి 79,454 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.16 శాతం దిగజారింది.బలహీన డిమాండ్కు భిన్నంగా డిసెంబర్లో అంచనాలకు మించి వాహన విక్రయాలు జరడంతో ఆటో రంగ షేర్లు నిన్నటి మార్కెట్ సెషన్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, సిటీ డిసెంబర్ క్వార్టర్తో పాటు 2025 ఏడాది మొత్తంగా ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి బలంగా ఉండొచ్చనే తాజాగా అంచనా వేశాయి. ఫలితంగా ఈ రంగంలోని షేర్లు రాణించాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొలిరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 కొత్త సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ బుధవారం 368.40 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 78,507.41 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 78,756.49 - 77,898.30 రేంజ్లో ట్రేడ్ అయింది.అదేవిధంగా నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 98.10 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 23,742.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 23,822.80 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,562.80 వద్ద ఉంది.మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, టాటా మోటార్స్ 3.01 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 37 గ్రీన్లో ముగిశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 మొదటి ట్రేడింగ్ రోజు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,617కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు దిగజారి 78,067 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.48 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.9 శాతం దిగజారింది.ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి(Rupee) బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.12 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 78,139.01 వద్ద, నిఫ్టీ 0.100 పాయింట్లు లేదా 0.00042 శాతం నష్టంతో 23,644.80 వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, కోల్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 23,545కు చేరింది. సెన్సెక్స్(Sensex) 425 పాయింట్లు దిగజారి 77,831 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.64 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.3 శాతం దిగజారింది.2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్–ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 450.94 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 78,248.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 168.50 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో.. 23,644.90 పాయింట్ల వద్ద నిలిచాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, టాటా మోటార్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 23,786కు చేరింది. సెన్సెక్స్(Sensex) 46 పాయింట్లు దిగజారి 78,649 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలు2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయని తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయన్నారు. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్ను గరిష్టాలకు చేర్చిందని చెప్పారు. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహ్వానించినట్లయిందని అభిప్రాయపడ్డారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప స్థాయిలోనే కదలికలు
విదేశీ మదుపర్లు గతవారం పెద్దగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు చేయనందున సూచీలు నత్తనడకన సాగాయి. బీఎస్ఈ(BSE) వారం మొత్తానికి దాదాపు 650 పాయింట్లు లాభపడి 78700 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ(Nifty) ఇంచుమించు 200 పాయింట్లు పెరిగి 23813 పాయింట్ల దరిదాపుల్లో క్లోజయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో కేవలం 0.8 శాతం లాభపడ్డాయన్నమాట.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారంలో విదేశీమదుపర్ల(FII) లావాదేవీలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం వీరు అధికశాతం ట్రేడింగ్పై పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికే మన మార్కెట్లో వీరి కొనుగోళ్లు బాగా పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే మన ఈక్విటీల్లో వీరి అమ్మకాలు 82 శాతానికి చేరాయి. నికర కొనుగోళ్లు కేవలం 18 శాతం స్థాయిలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వాస్తవానికి గతవారం షార్ట్కవరింగ్ లావాదేవీల రూపంలో కొనుగోళ్ల మద్దతు లభించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చోటుచేసుకోలేదు. పైగా గత శుక్రవారం ఆప్షన్స్ ట్రేడింగ్ను పరిశీలిస్తే భారీగా అమ్మకాలు ఒత్తిళ్లు ఉన్నాయి. ఎఫ్ఐఐలు మళ్లీ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అడుగుపెట్టేవరకు జోష్ తక్కువగానే ఉంటుంది. గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ.11,000 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.ఈవారం అంచనాలుఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. ఈ వారం నిఫ్టీకి 23650 పాయింట్లు తక్షణ మద్దతుగా కనిపిస్తోంది. ఆ స్థాయిని బ్రేక్ చేసిన పక్షంలో మాత్రమే 23500 దిగువకు వెళ్తుంది. అక్కడ మార్కెట్కు మద్దతు దొరికి సూచీలు బలంగా పుంజుకునే సూచనలు ఉన్నప్పటికీ అమ్మకాలు వెల్లువెత్తితే మాత్రం 23350 -23000 వరకు పతనం కొనసాగవచ్చు. అలాకాక ముందుకు కదిలితే 23940 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 24000 వద్ద ఉంది. దీన్నీదాటుకుని ముందుకెళ్తే 24200 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువస్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం ఉన్నప్పటికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇక బ్యాంకు నిఫ్టీ విషయానికొస్తే.. 51300 దిగువన కొనసాగితే మాత్రం 50500-50250 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే మొదటి దశలో 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. ఆపై 52500-52800 వరకు పరుగులు తీయొచ్చు.ఇదీ చదవండి: తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులుసెక్టార్ల విషయానికొస్తే..మిగతా రంగాలతో పోలిస్తే ఈవారం ఫార్మా రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. రూపాయి క్షీణత ఈ రంగానికి కలిసొచ్చే ప్రధానాంశంగా చెప్పవచ్చు. అలాగే ఐటీ షేర్లకూ రూపాయి క్షీణత సానుకూలమే అయినప్పటికీ, వచ్చే నెలారంభంలో వెలువడే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల ఫలితాలు ఈ రంగంలోని షేర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చు. యంత్ర పరికరాల రంగానికి సాధారణ స్థాయిలోనే మద్దతు లభిస్తుంది. ఈ షేర్లు పెరిగేది తక్కువే. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు బ్యాంకుల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఇన్వెస్టర్లు ఓ కన్నేయవచ్చు. టెలికాం, ఎఫ్ఎంసీజీ, లోహ , సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో కదలికలు స్వల్ప స్థాయికి పరిమితమవుతాయి. ఆటో మొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది.-బెహరా శ్రీనివాస రావు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన ఫార్మా, ఆటో షేర్లు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వారాంతపు ట్రేడింగ్ సెషన్ను సానుకూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 226 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 78,699.07 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 79,043.15 - 78,598.55 రేంజ్లో ట్రేడయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ( NSE Nifty 50 ) 63 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,813.40 వద్ద గ్రీన్లో స్థిరపడింది. నిఫ్టీ ఈరోజు గరిష్ట స్థాయి 23,938.85 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,800.60 వద్ద ఉంది.డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో 2.51 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీలోని 50 స్టాక్లలో 29 గ్రీన్లో ముగిశాయి. మరోవైపు హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఒఎన్జిసి, టాటా స్టీల్ 1.81 శాతం వరకు నష్టాలు మూటకట్టుకుని నష్టాలతో ముగిసిన 21 స్టాక్లలో ఉన్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 124 పాయింట్లు లాభపడి 23,877కు చేరింది. సెన్సెక్స్(Sensex) 397 పాయింట్లు పుంజుకుని 78,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 71.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.15 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.02 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో యూఎస్లో మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 31తో అమెరికాలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.92 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్మార్కెట్లు పని చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,176.45 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 78,041.59 వద్ద, నిఫ్టీ 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 23,587.50 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 23,911కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు దిగజారి 79,027 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.43 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.12 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి!
స్టాక్ మార్కెట్లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్గా పరిగణించింది.బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐరిలయన్స్ షేర్లు ఢమాల్..నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 843.16 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 82,133.12 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో 24,768.30 వద్ద నిలిచాయి.భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ కంపెనీ, హిందూస్తాన్ యూనీలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 24,382కు చేరింది. సెన్సెక్స్ 581 పాయింట్లు దిగజారి 80,688 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.66 శాతం దిగజారింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.స్టాక్ మార్కెట్ అద్భుత సాధనంస్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పెన్నీ స్టాక్స్తో జాగ్రత్తకొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.ఎవరో చెప్పారని..చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్లైన్లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిస్టాక్ మార్కెట్లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..దీర్ఘకాలిక దృక్పథం అవసరంట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్లోని స్టాక్లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.- బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్ నిపుణులు -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 53.82 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 81,563.87 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 24,614.15 ప్రారంభమయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 24,641 వద్దకు, సెన్సెక్స్ 16 పాయింట్లు పుంజుకుని 81,526 వద్దకు చేరింది.మార్కెట్ ముగింపు సమయానికి బ్యాంకింగ్ రంగ స్టాక్లు నష్టల్లోకి వెళ్లాయి. ఐటీ స్టాక్లు రాణించాయి. కెమికల్ స్టాక్లో ఒకే రేంజ్బౌండ్లో కదలాడాయి. స్టీల్ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా మార్కెట్ సూచీలు
మంగళవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1.59 పాయింట్లు లేదా 0.0019 శాతం లాభంతో 81,510.05 వద్ద, నిఫ్టీ 8.95 పాయింట్లు లేదా 0.036 శాతం నష్టంతో 24,610.05 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,599కు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 81,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.62 శాతం దిగజారింది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 200.66 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 81,508.46 వద్ద, నిఫ్టీ 58.80 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 24,619.00 వద్ద నిలిచాయి.విప్రో, లార్సెన్ & టూబ్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 24,674కు చేరింది. సెన్సెక్స్ 17 పాయింట్లు దిగజారి 81,682 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.97 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం లాభపడింది. నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో మొగిశాయి. సెన్సెక్స్ 87.03 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 81,678.83 వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,669.05 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేశాయి.ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటనకు ముందు భారత బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 81,874 వద్ద ఉంది. నిఫ్టీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టంతో 24,695 వద్ద ఉంది.గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలని చవి చూశాయి. సెన్సెక్స్ 950.06 పాయింట్లు లేదా 1.17 శాతం లాభంతో 81,906.39 వద్ద, నిఫ్టీ 271.30 పాయింట్లు లేదా 1.11 శాతం లాభంతో.. 24,738.75 వద్ద నిలిచాయి.టైటాన్ కంపెనీ, టీసీఎస్, ట్రెంట్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 24,524కు చేరింది. సెన్సెక్స్ 226 పాయింట్లు పుంజుకుని 81,186 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.6 శాతం లాభపడింది. నాస్డాక్ 1.3 శాతం పుంజుకుంది.గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 24,467 వద్దకు చేరింది. సెన్సెక్స్ 110 పాయింట్లు ఎగబాకి 80,956 వద్దకు చేరింది.ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) క్రమంగా అమ్మకాలను తగ్గిస్తున్నారు. అయితే ఈ నెల 6న జరగబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై మార్కెట్ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఆదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్గ్రిడ్, మారుతీ సుజుకీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్యూఎల్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ముందుకు సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 578.66 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 80,826.74 వద్ద, నిఫ్టీ 168.70 పాయింట్లు లేదా 0.69 శాతం లాభంతో 24,444.75 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, సన్ ఫార్మా వంటి కంపెనీలు నష్టాన్ని చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 24,328కు చేరింది. సెన్సెక్స్ 193 పాయింట్లు పుంజుకుని 80,431 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.44 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.97 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడినా దాని ప్రభావం సోమవారం మార్కెట్లపై పెద్దగా కనిపించలేదు. ఆర్బీఐ త్వరలో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు రెపోరేటును స్థిరంగా ఉంచి, సీఆర్ఆర్ వంటి సూచీల్లో మార్పులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 450.99 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 80,253.78 వద్ద, నిఫ్టీ 142.90 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 24,274.00 వద్ద నిలిచాయి.అల్ట్రా టెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,124కు చేరింది. సెన్సెక్స్ 108 పాయింట్లు దిగజారి 79,689 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ వారం అనిశ్చితులు కొనసాగుతాయా..?
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ గణాంకాలు మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు ఈ వారం కూడా అదే రీతిలో ఉన్నా కాస్తా నెమ్మదించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరుగుతున్నందున మార్కెట్లో ఆటుపోట్లు తప్పవు. జీడీపీ మందగమనంగత వారం చివర్లో జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఈ గణాంకాలు నమోదు కావడం మార్కెట్ను నిరుత్సాహపరుచనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కేవలం 5.4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతంతో పోల్చి చూసినా తక్కువే. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి మందగించడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత అంకెలు అంచనాలకు దూరంగా ఉండటం ఈవారం మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ముగింపు వరకు కాస్తా కోలుకోవచ్చని అంచనా.ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగే అవకాశం..అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా మార్కెట్ నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదార్లుగా నిలిచినప్పటికీ అది మూడు రోజులకే పరిమితమైంది. గత వారం చివరి రెండు రోజుల్లో ఏకంగా దాదాపు రూ.16000 కోట్ల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఐఐలు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతుండగా మరోపక్క దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) మాత్రం మార్కెట్కు తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐల అమ్మకాలు డిసెంబర్లోనూ కొనసాగే అవకాశం ఉంది.అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..గత వారాంతాన అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్కెట్లకు కొత్త శక్తినిస్తూ రికార్డుల వైపు పరుగు తీయిస్తున్నాయి. డోజోన్స్, ఎస్ & పీ ఇండెక్స్లు దూసుకెళుతుండగా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావంతో నాస్డాక్ సూచీ పడిపోయేందుకు కారణమవుతుంది. ఇది మన మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేస్తోంది. ఈవారం కూడా అమెరికా మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉన్నందుకు ఇది కొంతవరకు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపొచ్చు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. నిఫ్టీ గతవారం 24130 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఒక రకంగా అమ్మకాల స్థాయిని సూచిస్తోంది. సోమవారం నిఫ్టీ తొలి గంటలో 24150 స్థాయికి దిగువన ట్రేడ్ అయితే అమ్మకాల ఉద్ధృతి మరింత పెరుగుతుంది. ఇదే కొనసాగితే ఈవారం నిఫ్టీ 23800 మార్కును చేరవచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే తదుపరి మద్దతు స్థాయి 23300కు పడిపోయే అవకాశం ఉంది.- బెహరాశ్రీనివాసరావుమార్కెట్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ -
దలాల్ స్ట్రీట్పై బేర్ మెరుపు దాడి
ముంబై: దలాల్ స్ట్రీట్పై బేర్ మెరుపు దాడితో స్టాక్ సూచీలు గురువారం ఒకటిన్నర శాతం నష్టపోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, నెలవారీ ఎక్స్పైరీ రోజున లాభాల స్వీకరణతో సూచీలు రెండు నెలల్లో ఒకరోజులో అతిపెద్ద పతనాన్ని చూవిచూసింది. సెన్సెక్స్ 1,190 పాయింట్లు క్షీణించి 80వేల దిగువ 79,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 361 పాయింట్లు కోల్పోయి 24వేల స్థాయిని కోల్పోయి 23,914 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,315 పాయింట్లు, నిఫ్టీ 401 పాయింట్లు పతనమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణ పెరుగుదల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ట్రంప్ టారీఫ్ల పెంపు హెచ్చరికలకు తోడు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమై రికవరీ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులు ∙సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఎస్బీఐ (0.55%) మినహా అన్ని షేర్లూ నష్టాన్ని చవిచూశాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 3.50% – 2.50% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2.35% అత్యధికంగా నష్టపోయింది. → అధిక వెయిటేజీ షేర్లు ఇన్ఫోసిస్ (–3.50%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఎంఅండ్ఎం(–3.50%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి. → నష్టాల మార్కెట్లోనూ అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. అదానీ టోటల్ గ్యాస్ 16%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎనర్జీ గ్రీన్ 10%, అదానీ పవర్ 7%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2 శాతం లాభపడ్డాయి.నష్టాలకు నాలుగు కారణాలు అమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.→ డిసెంబర్లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి∙ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.→ అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరిలిపోతాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే అవకాశం ఉంది.→ దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ వారంలో వరుస మూడు రోజులు పాటు నికర కొనుగోలుదారులుగా నిలిచి ఎఫ్ఐఐలు తిరిగి అమ్మకాలకు పాల్పడ్డారు. గురువారం ఏకంగా రూ. 11,756 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఒక్కరోజులో మార్కెట్ క్యాప్ రూ.1.21 లక్షల కోట్లు ఆవిరై రూ. 443.27 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 237.61 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 80,241.67 వద్ద, నిఫ్టీ 78.50 పాయింట్లు లేదా 0.32 పాయింట్ల లాభంతో 24,273.00 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ట్రెంట్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) మొదలైన కంపెనీలు చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాన్ని చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్లు లేదా 0.2 శాతం లాభంతో 80,121 వద్ద ప్రారంభమైంది. కానీ వెంటనే 100 పాయింట్లకు పైగా క్షీణించి 79,879 కనిష్ట స్థాయికి దిగజారింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 20 పాయింట్లు క్షీణించి 24,170 స్థాయిల వద్ద కోట్ చేసింది.నిఫ్టీ 50 స్టాక్స్లో కోల్ ఇండియా దాదాపు 2 శాతం లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ కూడా 1 శాతంపైగా పురోగమించాయి. మరోవైపు, సిప్లా, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బీఎన్కే, టాటా కన్స్యూమర్ ఒక్కొక్కటి 1 శాతం క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 106.72 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద నిలిచాయి. సోమవారం ఉదయం నుంచి లాభాలబాట పట్టిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ (మంగళవారం) నష్టాల్లోనే ముగిశాయి.శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 24,249కు చేరింది. సెన్సెక్స్ 82 పాయింట్లు ఎగబాకి 80,175 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.81 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.3 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం పుంజుకుంది.ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్కవరింగ్తో పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,061.64 పాయింట్లు లేదా 1.34 శాతం లాభంతో 80,178.75 వద్ద, నిఫ్టీ 343.95 పాయింట్లు లేదా 1.44 శాతం లాభంతో 24,251.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ & టూబ్రో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు చేరగా.. జేఎస్డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 24,302కు చేరింది. సెన్సెక్స్ 1,253 పాయింట్లు ఎగబాకి 80,386 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.35 శాతం పెరిగింది. నాస్డాక్ 0.16 శాతం పుంజుకుంది.ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్కవరింగ్తో సోమవారం పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయి 23,294కు చేరింది. సెన్సెక్స్ 668 పాయింట్లు దిగజారి 76,931 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ క్రితం ముగింపు వద్దే కదలాడింది. నాస్డాక్ 0.11 శాతం దిగజారింది.విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరిస్తున్నారు. రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు పెద్దగా లాభాలు పోస్ట్ చేయకపోవడం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్ అస్థిరతకు కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా మందగించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి కూడా మార్కెట్ తిరోగమనానికి కారణమని చెబుతున్నారు.అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరింది. సెన్సెక్స్ 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం ఎగబాకింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్కవరింగ్కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం కొంత పెరుగుతుననట్లు తెలియజేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇప్పటికిప్పుడే వడ్డీరేట్లను తగ్గించే అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకులతో కదలాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 23,555కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు ఎగబాకి 77,631 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.32 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.24 శాతం దిగజారింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్కవరింగ్కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ.22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 78,507.87 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 23,820 వద్ద ఉన్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి.ఇక నిఫ్టీ 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల్లో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ ముందుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటోకో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టాల్లో ముందున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రసంగించనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల బలంతో బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో మొదలుపెట్టాయి.ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 79,746 వద్ద, నిఫ్టీ 84.5 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 24,225 వద్ద చలిస్తున్నాయి.డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్ను విక్రయించడం, యూఎస్ కొనుగోలు చేస్తుండటం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ సంస్థల పనితీరు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 24,066కు చేరింది. సెన్సెక్స్ 290 పాయింట్లు నష్టపోయి 79,196 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.75 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది. నాస్డాక్ 0.09 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్తో దోస్తీ ఇందుకేనా..?అక్టోబర్ నెలకు సంబంధించిన యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్లో ఇది 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్కు జపాన్ జీడీపీ గణాంకాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్లో 5.4 శాతం పురోగతి నమోదైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 24,451కు చేరింది. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 80,302 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.53 శాతం పెరిగింది. నాస్డాక్ 2.95 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టారిఫ్ వార్ 2.0!సుంకాల మోత ఖాయమనే అంచనాతో నష్టాలుఅమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ అనే నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్కాంగ్, థాయ్లాండ్, కొరియా సూచీలు బుధవారం 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు నిన్న డిమాండ్ లభించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్.. ‘ట్రంపె’ట్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో బుధవారం దలాల్ స్ట్రీట్ ఒకశాతానికిపైగా లాభపడింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 80,378 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు బలపడి 24,484 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రంప్ ఆధిక్యంతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,094 పాయింట్లు పెరిగి 80,570 వద్ద, నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 24,538 వద్ద గరిష్టాలు తాకాయి. బీఎస్ఈలో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2.28%, రెండుశాతం రాణించాయి. రంగాల వారీగా అత్యధికంగా బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 4% లాభపడింది. టెక్ 3%, రియల్టీ 3%, ఇండ్రస్టియల్ 3%, సరీ్వసెస్ ఇండెక్సులు 2.50% రాణించాయి.అమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. యూఎస్ డోజోన్స్ 3%, ఎస్అండ్పీ 2%, నాస్డాక్ 2.5% లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్కాంగ్, థాయ్లాండ్, కొరియా సూచీలు 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు డిమాండ్ లభించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ షేర్లు 4% లాభపడ్డాయి. సెన్సెక్స్లో అత్యధికంగా పెరిగిన షేర్లు ఇవే. పెర్సిస్టెంట్ 6%, ఎల్టీఐమైండ్టీ 5%, విప్రో షేర్లు 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ రెండురోజుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఎగసింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.10.47 లక్షల కోట్లు పెరిగి రూ.452 లక్షల కోట్లకు చేరింది.రూపాయి ఆల్టైమ్ కనిష్టండాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 22 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 84.31 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కు మార్గం సుగమం కావడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో యూఎస్ కరెన్సీ డాలర్ బలపడటం దేశీయ కరెన్సీ కోతకు కారణమైంది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడమూ ప్రతికూలంగా మారింది.జీవితకాల గరిష్టానికి బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమనే వార్తలతో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ 8% ఎగసి జీవితకాల 75,000 డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీలకు ట్రంప్ సానుకూలత కలిసొచి్చందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 77% ర్యాలీ చేసింది. ఎన్నికల సందర్భంగా అమెరికాను క్రిప్టోల రాజధానిగా మార్చడంతో పాటు వ్యూహాత్మక రిజర్వ్గా బిట్కాయిన్ను తీర్చిదిద్దుదామని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు తగ్గి 23,942కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు నష్టపోయి 78,607 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.92 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.33 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..సోమవారం మార్కెట్లో ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్అండ్గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది. ఈరోజు రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మార్కెట్లో కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పదేళ్లలో భారీగా మార్కెట్లు పడింది ఎప్పుడంటే..
గడిచిన పదేళ్లలో మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఈక్విటీ మార్కెట్లంటేనే ఒడిదొడుకులు సహజం. వాటికి దూరంగా ఉంటూ లాభాలు పొందాలంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడుతున్నప్పుడు దాన్నో అవకాశంగా మలుచుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మరింత ఎక్కవ రాబడులు పొందే వీలుంటుందని సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఏయే నెలలో భారీగా కుదేలయ్యాయో.. తర్వాత ఎంత పుంజుకున్నాయో కింద తెలియజేస్తున్నాం.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు? -
యూఎస్ ఎన్నికలు.. నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 24,107కు చేరింది. సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 79,022 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.28 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.8 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేపు (మంగళవారం 5వ తేదీ) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 తమ రెండు రోజుల విజయ పరంపరను ముగించాయి. ప్రపంచ మిశ్రమ సూచనల మధ్య బుధవారం నష్టాల్లో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 426.85 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 79,942.18 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 125.99 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి 24,340.85 వద్ద ముగిసింది.50 షేర్లలో 31 నష్టాల్లో ముగిశాయి.సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రెంట్ టాప్ లూజర్స్గా 4.03 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు తగ్గి 24,362కు చేరింది. సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 80,043 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.78 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్లో అదిరిపోయే ఫీచర్!దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 24,466 వద్దకు చేరింది. సెన్సెక్స్ 363 పాయింట్లు ఎగబాకి 80,369 వద్ద ముగిసింది.వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు గడిచిన రెండు సెషన్లలో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్మార్కెట్ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బారీగా పడిన మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా మారడంతో రిటైల్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 24,201కు చేరింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 79,616 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం లాభపడింది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్ పంజా.. నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 146 పాయింట్లు తగ్గి 24,251కు చేరింది. సెన్సెక్స్ 374 పాయింట్లు నష్టపోయి 79,697 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.02 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది. నాస్డాక్ 0.76 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుకార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.2%), డాలర్ ఇండెక్సు 104.02 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)