zoo
-
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు. (చదవండి: వామ్మో ఇదేం బిజినెస్? విలనీజం వ్యాపారమా..!) -
జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!
ఆరిలోవ : విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు. ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. » ఫ్లూయంట్ గ్రిడ్ లిమిటెడ్ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. » ఎన్క్లోజరు వద్ద ఐఓసీఎల్ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్ పేరుతో బోర్డును దాని ఎన్క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు. » ఆర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్(ఏఎన్/ఎంఎస్) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. » వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇక్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి దత్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఆదాయం పన్ను మినహాయింపు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు. దాతలు ముందుకు రావాలి జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు.ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. – మంగమ్మ, జూ క్యూరేటర్ ఆహారం ఇలా... సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
సింహాలకు హీటర్లు.. పాములకు కంబళ్లు
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్కులోని జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూపార్కులోని సింహాలు, పులులు వంటి భారీకాయం కలిగిన జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే వాటికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అవి ఉండేచోట హీటర్లను అమర్చారు. ఈ హీటర్లు రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇదేవిధంగా శీతాకాలంలో జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. పాముల వంటి సరీసృపాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కంబళ్లను వినియోగిస్తున్నారు.జింకలు, ఇతర చిన్న జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక గడ్డిని వాటి ఎన్క్లోజర్లలో ఉంచుతున్నారు. తద్వారా అవి వెచ్చదనంలో ఉండేలా చూస్తున్నారు. జలచరాలకు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూ పశువైద్యాధికారి యోగేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో ప్రతి జాతి జంతువుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది కూడా చదవండి: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్నగర్కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్కు చెందిన మావటి మైఖేల్తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
జూ కీపర్ను కొరికి చంపిన సింహం
అబూజా: నైజీరియాలోని ఓ జూలో ఆదమరిచి ఉన్న ఉద్యోగిని సింహం కొరికి చంపింది. ఒగున్ రాష్ట్రం అబియోకుటలో ఉన్న మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. బబజీ దౌలే(35) అనే సుశిక్షు తుడైన జూ కీపర్ అందులోని సంహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటారు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి దౌలే సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నారు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచే ఆహారం వేయడం ప్రారంభించారు. ఆ సింహం అనుకోకుండా ఆయనపై దాడి చేసి, మెడను నోట కరుచుకుంది. దీంతో, సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు. -
పాండాలకు బదులు..
బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని థాయ్జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది. ఆ ఎన్క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్క్లోజర్లో పెట్టారు. వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్లైన్లో 14 లక్షల మంది షేర్చేశారు. గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్క్లోజర్లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి. -
1000 ఎకరాల్లో కొత్త జూపార్క్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్లో ఉంచాలని చెప్పారు. జామ్నగర్లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్నెస్సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు. పర్యాటకంపై వేర్వేరు పాలసీలు టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో.. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండివేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలుసాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు. -
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
Video: టైగర్ ఎన్క్లోజర్లోకి దూకిన మహిళ.. జస్ట్ మిస్
అమెరికాలో ఓ మహిళా హల్చల్ చేసింది. న్యూజెర్సీలోని కోహన్జిక్ జూ వద్ద బెంగాల్ టైగర్ ఎన్క్లోజర్లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4 pic.twitter.com/DPRFi5xFg1— Steve Keeley (@KeeleyFox29) August 21, 2024 ఇదిలా ఉండగా కోహన్జిక్ జూలో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు. -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్క్లోజర్లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్క్లోజర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
వన్యప్రాణులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్లో అత్యధికులు లైక్ చేసిన రీల్కు రూ. 5000, తరువాత ఉన్న రీల్కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు. -
అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. తండ్రి నుంచి టాటా నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికి కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు. కంపెనీల విషయంలో లేదా వ్యాపారాల విషయంలో తన తండ్రి ముఖేష్ అంబానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారని. ప్రతి రోజూ వారి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉన్నానని అన్నారు. బిజినెస్ మాత్రమే కాకుండా తమ కుటుంబమంతా వన్య ప్రాణుల పట్ల ధరతో ఉంటామని వెల్లడిస్తూ.. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ కంపెనీ ఒక 'జూ' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ అభివృద్ధిలో కూడా తన తల్లినద్రులే స్ఫూర్తి అని చెప్పారు. ఏనుగుల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, అందులో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని చెప్పారు. ఏనుగులు మాత్రమే కాకుండా జూలో మొత్తం 100 జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని, అరుదైన లేదా అంతరించిపోతున్న జంతువులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ణి చూస్తున్నట్లు అనంత్ అంబానీ వివరించారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? జూలో సంరక్షులు సుమారు 3000 నుంచి 400 మంది ఉన్నారని, వారందరూ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు.. జూలో సౌరశక్తిని మాత్రం ఉపయోగిస్తున్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారు. మొత్తం మీద అంబానీ ఫ్యామిలీ జీవులను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Reliance Foundation announces Vantara - a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India. Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID...We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8 — ANI (@ANI) February 26, 2024 -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
అనంత్-రాధిక పెళ్లి: అంబానీ ఫ్యామిలీకి భారీ ఊరట
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి భారీ ఊరట లభించింది. గుజరాత్లోని రిలయన్స్ గ్రీన్స్లో చిన్నకుమారుడు అనంత్ వివాహాన్ని జరపడానికి వీల్లేందంటూ దాఖలైన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేవలం భయం ఆధారంగా స్వీకరించలేమంటూ ధర్మాసంన ఈ పిటిషన్ను కొట్టివేసింది. రాహుల్ నరులా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను పరిశాలించిన కోర్టు మేరకు తీర్పునిచ్చింది ఈ ఏడాది జూన్లో వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మెగా జూలో పెళ్లి అంటే ఇక్కడ జంతువులకు హాని కలిగిస్తుందనీ, ముఖేష్ అంబానీకి చెందిన మెగా జూ (గ్రీన్స్ జూలాజికల్, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ GZRRC)పై చర్యలు తీసుకునేలా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది, జంతు ప్రేమికుడు రాహుల్ నరులా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని పరిశీలించి న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, గిరీష్ కథ్పాలియాతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించలేమని పేర్కొంది. జంతు సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు త్రిపుర హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన హై-పవర్డ్ కమిటీ (HPC) ఈవెంట్ను పర్యవేక్షించేందుకు, జంతువులకు ఎలాంటి హానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. (టేస్టీగా..కూల్..కూల్గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!) ప్రైవేట్ ఈవెంట్లో జంతువులను ఉపయోగిస్తారనే ఆరోపణ నిరాధారమైందని సెంటర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా గుజరాత్లోని జామ్నగర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ ఖావ్డి గ్రామంలో280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్క్ ఉంది. అంతేకాదు దీన్ని అనంత్పె అంబానీ పెట్ ప్రాజెక్ట్గా, బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్గా భావిస్తారు. అటు అనంత్ -రాధిక పెళ్లిపై అధికారికర ధృవీకరణ ఏదీ రానప్పటికీ, ఈ గ్రాండ్ వెడ్డింగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి కార్డు ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. (అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!) -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
'మాలి' ఇక లేదు!
పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే... నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్క్లోజర్లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు. అంతేగాదు ఆ ఏనుగును థాయ్లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. ఎలా ఈ జూకి వచ్చిందంటే.. శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్క్లోజర్లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం. చనిపోవడానికి కారణం.. ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు. (చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది) -
విశాఖ జూ పార్క్లో దారుణం.. కేర్ టేకర్పై ఎలుగుబంటి దాడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు -
కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే మనుషులు, జంతువులు, చివరికి పక్షులు కూడా పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు. జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? #WATCH | Sprinkling of water done in Delhi's National Zoological Park, as a measure against the rise in Air Quality Index (AQI) in the national capital (04/11) pic.twitter.com/ufyMDFV4YU — ANI (@ANI) November 5, 2023 -
నల్లమలకు పులికూనలు
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు. పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే. ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు. దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్ఎస్టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు: నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి. అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్క్లోజర్లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి. అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్టాక్లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే.. విచిత్రమైన అనుభవం వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది. వచ్చేశాయి సింహాలు ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు. #ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍ ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt — Kanak News (@kanak_news) July 9, 2023 -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
ఏఆర్సీలో ఆడపులి కుమారి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ)లో ఆడ పులి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జూ పార్కు సమీపంలో ఉన్న ఏఆర్సీలో 23 సంవత్సరాల వయసు కలిగిన కుమారి అనే ఆడపులి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురై ఈ నెల 24వ తేదీ రాత్రి మృతి చెందినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఫేమస్ సర్కస్ కంపెనీకి చెందిన కుమారిని 2007లో ఏఆర్సీకి తీసుకొచ్చారని, కుమారి మృతితో ఏఆర్సీలో ప్రస్తుతం పులులు లేవని పేర్కొన్నారు. కాగా, కుమారి మృతి చెందిన రెండు రోజులు వరకు విషయం బయటపడకుండా జూ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. అదే రోజు ఉదయం జూలో జానకి అనే 22 ఏళ్ల ఆడ పెద్ద పులి మరణించిన విషయం బయటకు వెల్లడించిన జూ అధికారులు ఏఆర్సీలో మృతి చెందిన కుమారి విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
వైజాగ్ జూపార్క్లో "టైగర్ జానకి" మృతి
విశాఖపట్నం: జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది. జూలో ఎన్క్లోజర్లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను అలరించే జానకి కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురైంది. జూ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా ఆహారం కూడా తినలేదని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ప్రస్తుతం జూలో మూడు పెద్ద పులులున్నట్లు పేర్కొన్నారు. -
'గుడ్లను తాకితే తాటతీస్తా..!' జూ కీపర్పై కొండ చిలువ వీరంగం..
ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) ఓ పైథాన్ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్ను ఆటపట్టించాలనుకుంటాడు. అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్ను కరవడానికి వస్తుంది. అతను ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. ఇదీ చదవండి: ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో -
1996లో ఒకరోజు.. ఎన్క్లోజర్లో పడిపోయిన పిల్లాడిని గోరిల్లా ఏం చేసిందంటే..
గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది? 1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్లోని బ్రూక్ఫీల్డ్ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్క్లోజర్లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి బాలుడు ఎన్క్లోజర్లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్ స్టేటస్ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. In 1996, Binti Jua, an 8-year-old female Western lowland gorilla, tended to a 3-year-old boy who had fallen into her enclosure at the Brookfield Zoo in Illinois. On August 16, 1996, Binti Jua, who was eight years old at the time, witnessed a three-year-old boy climbing the wall… pic.twitter.com/OMFGmdRE4I — Historic Vids (@historyinmemes) June 22, 2023 في عام 1996، اهتمت بينتي خوا، وهي أنثى غوريلا الأراضي المنخفضة الغربية البالغة من العمر 8 سنوات، بصبي يبلغ من العمر 3 سنوات سقط في حظيرتها في حديقة حيوان بروكفيلد في إلينوي. في 16 أغسطس 1996، شهد بينتي خوا، الذي كان يبلغ من العمر ثماني سنوات في ذلك الوقت، صبيا يبلغ من العمر ثلاث… pic.twitter.com/dJnC16AFUn — ﮼الأعرابي القديم . (@radialonazi) June 22, 2023 -
పర్యాటకులను ఆకర్షించేలా జూ పార్క్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని జూ పార్క్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి అధ్యక్షతన జూ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖ, తిరుపతి జూ పార్క్లను తీర్చిదిద్దేందుకు.. దేశంలోని పలు జూ పార్క్ల అథారిటీలతో జంతువుల మారి్పడి కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్పై హేతుబద్ధత కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విశాఖ జూ పార్క్కు సంబంధించిన కొత్త లోగోను, జంతువులను పోలిన పలు వస్తువులను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. జంతువుల చిత్రాలతో రూపొందించిన టీషర్ట్లు, టోపీలు, గృహాలంకరణ వస్తువులను పరిశీలించారు. అటవీదళాల అధిపతి మధుసూదన్రెడ్డి, అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియపాండే, అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, విశాఖ క్యూరేటర్ నందినీ సలారియా, తిరుపతి క్యూరేటర్ సెల్వం, విశాఖ సర్కిల్ హెడ్ శ్రీకంఠనాథరెడ్డి, తిరుపతి సర్కిల్ హెడ్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
ప్రపంచంలోని టాప్ 10 జూలాజికల్ పార్కులు ఇవే!
-
ఆ కుక్క ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే! భలేగా పులిని, సింహాన్ని..
ఇంతవరకు జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాం. వన్యమృగాలు సాధారణంగా ట్రైయినర్ కంట్రోల్లో ఉంటాయి. ఐతే ఒక్కోసారి అవి వారి మాట కూడా వినవు. అంతేందుకు వారిపైనే దారుణంగా దాడి చేసి హతమార్చిన పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఓ కుక్క రెండు వన్యమృగాలను కంట్రోల్ చేస్తోందంటే..నమ్మబుద్ది కాదు కదా! కానీ ఇక్కడ అలానే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ పులి, సింహం జూలో దారుణంగా ఫైట్ చేసుకుంటున్నాయి. దీంతో అక్కడే ఉన్న కుక్క ఒక్కసారిగా ఆ రెండింటిని దెబ్బలాడుకోకుండా చేసింది. పైగా పులి చెవిని కరుస్తూ సింహంతో ఫైట్ చేయకుండా నిలవరించింది. ఆ కుక్క అవి ఫైట్ చేసుకోకుండా ఆపడంలో విజయం సాధించింది కూడా. కానీ ఏ మాత్రం తేడా వచ్చి.. పులి దాడి చేస్తే గనుక ఆ కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఆ కుక్క మాత్రం కుంచెం కూడా బెరుకు లేకుండా వాటి రగడను ఆపింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మిలియన్స్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Dog stops tiger and lion from fighting pic.twitter.com/O2qfgk9q4v — B&S (@_B___S) May 20, 2023 (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
అచ్చం మనిషిలానే తింటున్న ఏనుగు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది. ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు. -
పులి కూనలకు మూడేళ్లు జూ లోనే సంరక్షణ
-
తల్లి పులి ఒక చోట..పిల్లలు మరోచోట
-
తిరుపతి జూ పార్క్కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
Viral Video : సింహంతో వ్యక్తి పరాచకాలు..
-
బోనులోని సింహంతో వ్యక్తి పరాచకాలు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ప్రమాదం అని తెలిసినా కావాలనే కొంతమంది తమ పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ ఇందుకు సరిగ్గా సరిపోతుంది. ‘పులిని చూడలంటే చూస్కో.. దానితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చిందకదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఈ డైలాగ్లో పులి ప్లేస్లో సింహాన్ని రీప్లేస్ చేస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో.. అసలేం జరిగిందంటే.. ఓ జూలో రెండు సింహాలను బంధించి ఉండగా.. వాటిని చూసేందుకు సందర్శకులు చుట్టుముడతారు. వారిలో ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి సింహాన్ని మచ్చిక చేస్తున్నట్లు ప్రయత్నించాడు. కానీ ఆ సింహం స్పందించకుండా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. అతనిని గమనించిన పక్కనున్న వ్యక్తి బోనులోని మరో సింహం తలపై చేయి పెట్టాయి. దీంతో ఆగ్రహం చెందిన సింహం హఠాత్తుగా అతని చేతిని నోటిలోకి లాక్కుటుంది.. సింహం ఊహించని చర్యతో అక్కడున్న వారంతా షాక్కు గరయ్యారు. సింహం చేతిని కరవడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. సింహానికి భయపడి అక్కడున్న వారు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే భయం, బాధతో గట్టిగా అరవడంతో కాసేపటికి సింహం అతని చేతిని వదిలేసింది. దీంతో భయంతో అక్కడున్న వారంతా దాని నుంచి దూరంగా పారిపోయారు. Fook around............. pic.twitter.com/N8ETVsXQJr — Vicious Videos (@ViciousVideos) December 26, 2022 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ట్విటర్లోషేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారింది. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియరాలేదు. -
బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్లో ప్రజలు
బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు. బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది. దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H — Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా!
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని బోన్లోకి ఎక్కించి జూకి తరలించారు. కాగా చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. చిరుత రాకను గమనించిన ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టింది. కాజీపల్లి అటవీప్రాంతం నుంచి చిరుత వచ్చిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూపార్క్లను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్ లను తీర్చిదిద్దాలని కోరారు. దేశంలోని పలు జంతుసందర్శనశాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులను ఇతర జూలకు ఇచ్చి, వారి వద్ద ఉన్న జంతువులను మనం తెచ్చుకునే విధానం ఉందని, దీనిపై అధికారులు కసరత్తు చేయాలని కోరారు. అలాగే జామ్ నగర్లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, లేదా కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డిపిఆర్లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అటవీశాఖ నర్సరీల ద్వారా మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం లోని రీసెర్చ్ సెంటర్ల ద్వారా అధిక ఫలసాయం, కలపను అందించే మేలుజాతి మొక్కలను అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉందని, ప్రైవేటు నర్సరీలు ఎక్కువరేట్లకు మొక్కలను విక్రయిస్తున్నాయని చెప్పారు. అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెదురు, జీడిమామిడి, నేరేడు, ఉసిరి, చింత, యూకలిప్టస్ వంటి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తున్నామని, వీటిల్లో కూడా మరింత మేలైన జాతులను అభివృద్ధి చేయాలని సూచించారు. చదవండి: (సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు) రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా అటవీ అధికారుల శిక్షణకు అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిదని అన్నారు. ఈ అకాడమీ ద్వారా అటవీశాఖ ఉద్యోగులు, అధికారుల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందని, అకాడమీకి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అంతరించి పోతున్న అరుదైన జీవ, జంతుజాలంను పరిరక్షించుకునేందుకు బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నగరవనాల్లో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖతో సమన్యయం చేసుకుంటూ జీవవైవిధ్యం పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బోర్డ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ ద్వారా జిల్లా స్థాయిలో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విద్యార్ధులకు పర్యావరణం పట్ల అవగాహనను కల్పించడం, స్థానికంగా ప్రజల్లోనూ పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎస్ఎఫ్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, డాక్టర్ బిఎంకె రెడ్డి (ఎపి బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్), ఇఎస్ఎఫ్&టి స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, వన్యప్రాణి విభాగం అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియా పాండే, అడిషనల్ పిసిసిఎఫ్ (విజిలెన్స్) గోపీనాధ్, ఆర్పీ ఖజూరియా (పిసిసిఎఫ్- ప్రొడెక్షన్&అడ్మిన్), ఎకె నాయక్ (పిసిసిఎఫ్-ఐటి), పిఎవి ఉదయ్ భాస్కర్ (అకాడమీ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు. -
పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి.. సింగోజి చెరువులో..
సాక్షి, హైదరాబాద్: అది వన్యమృగాలు సంచరించే ప్రాంతం. పులులు, సింహాల సఫారీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రదేశంలో జన సంచారం నిషేధం. కానీ.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మాత్రం ఇక్కడ సంచరించేందుకు ఎలాంటి ఆంక్షల్లేవు. గతేడాది కురిసిన వర్షాలకు కూలిన జూ గోడను మళ్లీ కట్టకపోవడంతో జంతువులకే కాదు.. స్థానికులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ గోడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉన్న సింగోజి చెరువులో చేపలు వేట కోసం గోడ కూలిన ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. కాగా.. సింగోజి చెరువులో భారీగా మొసళ్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల ఓ మొసలి ఏకంగా గోడ కూలిన ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో బయటకు వచ్చి మూసీ నదిలో ప్రత్యక్షం కావడం గమనార్హం. జూ వెనుక భాగంలో.. ► గతేడాది భారీ వర్షాలకు జూ వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. గోడను పునర్ నిర్మించకుండా కేవలం వరద నీరు బయటకు వెళ్లేలా కొన్ని పైపులు వేసి.. కల్వర్టు నిర్మించారు. దీంతో జూలోకి సులువుగా వెళ్లడానికి స్థానికులకు అవకాశమేర్పడింది. వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జూలోని సింగోజి చెరువు నిండుకుండలా మారింది. ఇందులోకి చేపలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే జూ వెనుక కిషన్బాగ్, బహుదూర్పురా ప్రాంతాలకు చెందిన యువకులు ఈ చెరువులో చేపలు పట్టడానికి.. గోడ కూలిన వేసిన వేసిన పైపుల నుంచి జూలోకి ప్రవేశిస్తున్నారు. ► సింగోజి చెరువులో మొసళ్లు ఉన్న విషయాన్ని జూ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతం నుంచే లోపలికి ప్రవేశించిన ఒకరు పులిని చంపిన ఘటన నేర్పిన పాఠాలను కూడా జూ అధికారులు మరిచిపోవడం దారుణమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇదే జూలో ఎలుగుబంటి కూడా బయటకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. బయటి వ్యక్తులను అడ్డుకుంటాం.. గోడ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశాడు. గోడ కూలిన ప్రాంతం నుంచి వ్యక్తులను లోపలి రాకుండా నిఘా పెడతాం. – రాజశేఖర్, జూ క్యూరేటర్ -
పైథాన్తో ప్రేమలో..!
సాధారణంగా మనం పామును దూరం నుంచి చూస్తేనే హడలిపోతాం.. ఆమడదూరం పరిగెత్తుతాం.. కానీ అమెరికాకు చెందిన జే బ్య్రూవర్ అనే జూ కీపర్కు మాత్రం ఇలాంటి భయమేమీ లేదు. పైగా అన్ని సరీసృపాలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు. తాజాగా అతను ఇంధ్రదనుస్సు రంగుల్లో ఉన్న ఓ భారీ కొండచిలువ (రెటిక్యులేటెడ్ పైథాన్) తలను సుతారంగా నిమురుతూ దాన్ని హత్తుకుంటున్న వీడియో నెటిజన్లను అవాక్కు చేసింది. అయితే ఆ కొండచిలువను మచ్చిక చేసుకోవడం అంత వీజీగా ఏమీ జరగలేదని.. ఎన్నో ఏళ్లపాటు దాన్ని కంటికి రెప్పలా చూసుకున్నానని.. అందుకే తనతో కొండచిలువ ‘స్నేహం’ చేస్తోందని వీడియోలో అతను చెప్పుకొచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అతను పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పటివరకు 10 లక్షలసార్లకుపైగా నెటిజన్లు వీడియోను చూసి ఫిదా అయ్యారు. ఈ వీడియోను లక్ష మందికిపైగా ‘లైక్’ చేశారు. -
వామ్మో.. సప్తవర్ణాల పైథాన్తో సరదాగా...!
-
చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు: వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్క్లోజర్లో ఉన్న చిరుతలను చూపించారు. ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్తో పాలు పట్టించేందుకు దాని ఎన్క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు) -
వైరల్ వీడియో : జూ కీపర్పై దాడి చేసిన మొసలి
-
జూ కీపర్పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
రిలయన్స్ సపోర్టుతో ‘జూ’.. వ్యతిరేక పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఊరట లభించింది. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో నిర్మిస్తున్న జంతు ప్రదర్శనశాల(GZRRC)కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సపోర్టుతో జామ్నగర్లో గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ జూకు జంతువులను సేకరించడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్ను కొట్టివేసింది. ఇక, సెంట్రల్ జూ అథారిటీ ద్వారా జూ, రెస్క్యూ సెంటర్కు గుర్తింపు మంజూరులో ఎటువంటి చట్టపరం కానీ అంశం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లో లాజిల్ లేదంటూ వ్యాఖ్యలు చేసింది. కాగా, జూ ఏర్పాటును సవాలు చేస్తూ ఓ కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్ జూకు ఉన్న అనుభవం, సామర్థ్యం దృష్ట్యా జూ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. అలాగే, సదరు జూలోని భారత్లోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి జంతువులను తీసుకురావడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో GZRRC పిటిషన్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చింది. జూలో జంతువుల సంక్షేమం, రక్షణ, పునరావాసం కోసం కట్టుబడి ఉన్నట్టు సంస్థ హెడ్ ధన్రాజ్నత్వాని తెలిపారు. జూలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు, వైద్యులు, క్యూరేటర్లు, జీవశాస్త్రవేత్తలు, జంతుశాస్త్రజ్ఞులు, ఇతర నిపుణుల పనితీరు గురించి స్పష్టం చేశారు. దీంతో, GZRRC వివరణపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: కేజ్రీవాల్కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్ -
ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన
సాక్షి, బెంగళూరు(తుమకూరు): కొన్నిరోజుల క్రితం తమకు ఇష్టమైన రామచిలుకను పోగొట్టుకొని దానిని పట్టుకోవడం కోసం రూ.80 వేల నజరానా ప్రకటించిన తుమకూరు వాసి కథ తెలిసే ఉంటుంది. అర్జున్, రంజన దంపతులు కొన్నేళ్లుగా బూడిద రంగు రామచిలుకలను ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు. వాటికి రుస్తుమా, రియో అనే పేర్లు పెట్టి నిత్యం రకరకాల పండ్లతో పోషిస్తున్నారు. ఇటీవల రుస్తుమా ఎక్కడికో ఎగిరిపోయింది, దానిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పట్టించినవారికి రూ. 80 వేల బహుమానాన్ని ప్రకటించగా, ఓ వ్యక్తి దానిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఉదంతం దేశమంతటా వార్తల్లో నిలిచింది. ఇక వాటిని గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మృగాలయానికి ఇచ్చేస్తామని తెలిపారు. తరచూ ఎగిరిపోతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు. చదవండి: (లవర్తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య) -
జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?
ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్.. చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా.. జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట. -
గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా?
Lions at cheaper rates than buffaloes.. అక్కడ గేదె కంటే తక్కువ ధరలో సింహాలను కొనుగోలు చేయవచ్చు. సింహాలను కొనుక్కోవచ్చంటూ జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్లో ఒక గేదె ధర ఆన్లైన్ మార్కెట్లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి. .@SalmanSufi7 .@sherryrehman .@WWFPak This SALE must not take place, how is this practising conservation ? The Lahore Safari Zoo management hopes to sell as many as 12 of its lions in the first week of August to raise money. Pls Help https://t.co/FfrlVOh1oF — Anika 🐘🦍🦧🦒🐋🐬 (@anikasleem) July 28, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం -
రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది
కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా జూకు వెళ్తే.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని హెచ్చరిస్తుంటారు. అయినా కొంత మంది వినిపించుకోకుండా అతి చేస్తారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. వీడియోలో.. యువతి బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్ చేస్తుంది. దీంతో, కోతి తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మోత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి జారుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
హైదరాబాద్: జూపార్క్ సఫారీ జోన్లోకి పోటెత్తిన వరద నీరు
-
జూలోకి వరద నీరు.. లయన్ సఫారీ మూసివేత
సాక్షి, హైదరాబాద్: మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లో కారణంగా వరదనీరు జూపార్కులోకి ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో జూ అధికారులు వర్షపు నీరు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్ సఫారీలోని వన్యప్రాణులను నైట్ ఎన్క్లోజర్లోకి తరలించారు. సందర్శకులు లయన్ సఫారీ వైపు వెళ్లకుండా సందర్శనను పూర్తిగా మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. (క్లిక్: హుస్సేన్సాగర్కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్) మంచినీటి సరఫరా యథాతథం కృష్ణా ఫేజ్–1 జంక్షన్ మరమ్మతు పనులు వాయిదా వేయడంతో బుధవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటిసరఫరా జరగనుందని జలమండలి ప్రకటించింది. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించిన విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. (క్లిక్: హైదరాబాద్ లో అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?) -
వింత జీవి సంచారం.. టెన్షన్లో స్థానికులు!
ప్రపంచంలో మానవ కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా అని షాక్ అవుతుంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. టెక్సాస్లోని అమారిలో పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్లో వచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. What is it? Strange image caught on camera at Texas zoo. DETAILS >>> https://t.co/W3Xxgycw5Y pic.twitter.com/o9gGAk61kY — WFTV Channel 9 (@WFTV) June 9, 2022 ఇది కూడా చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్! -
గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...
ఇటీవల సందర్శకులు జూలకు వెళ్లి అక్కడ ఉన్న జంతువులతో లేనిపోనీ కష్టాలు కొనితెచ్చుకున్న సంధార్భాలు అనేకం. జూ అధికారులు సైతం ప్రమాదకరమైన జంతువుల సమీపంలోకి వెళ్లొద్దు అని హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా లెక్కచేయకుండా వెళ్లి పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని క్రూర జంతువులు దగ్గరకు వెళ్లేటప్పుడు జంతు సంరక్షక్షులు చెప్పే సూచనలు పాటించాలి లేదంటే ఆ జంతువుల దాడికి బలైపోక తప్పదు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం కొద్ది బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని కసాంగ్ కులిమ్ జూలో టీనా అనే గొర్రిల్లా బోనులో బంధించి ఉంది. హసన్ అరిఫిన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఈ జూని సందర్శించడానికి వెళ్లాడు. ఐతే అతను ఈ టీనా అనే గొర్రిల్లా బోను వద్దకు ఇచ్చి రెండు చేతుల ఇచ్చి సరదాగా రా అన్నాడు. అంతే అది ఒక్కసారిగా అతన్ని కోపంగా పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. అక్కడి అతను దూరంగానే ఉన్నాడు. ఐతే ఆ గోర్రిల్లా మాత్రం ఆ వ్యక్తి చొక్కాను పట్టుకుని బోనులోకి లాగేందుకు ట్రై చేస్తోంది. సహయం కోసం హసన్ తన స్నేహితుడిన పిలిచాడు. అతని స్నేహితుడు సైతం తన ఫ్రెండ్ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆ గొర్రిల్లా అతని కాలుని కదలకుండా ఉడుం పట్టు పట్టేసింది. ఇక ఎలాగోలాగా బలవంతంగా ఆ గొర్రిల్లా ఉడుంపట్టు నుంచి లాగేందుకు శతవిధాల ప్రయత్నిస్తూంటే అది ఆ వ్యక్తిని కూడా పక్కకు తోసేసింది. చివరికి హసన్ తన కాలుని గొర్రిల్లా కొరకబోతుందనగా కొద్ది సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. pic.twitter.com/6yhHjvDjgT — san (@sundaykisseu) June 7, 2022 (చదవండి: ఇక రాను రాను టమాటా కెచప్ తయారు చేయకపోవచ్చు!) -
సింహం స్టైలిష్ లుక్ సూపరో సూపర్!.. కటింగ్ చేశారా?
ఫొటోలో కనిపిస్తున్న సింహాన్ని చూడండి. అరె.. సింహానికేంటీ ఈ బేబీ కటింగ్? ఎవరు చేశారబ్బా అనుకుంటున్నారు కదా? జూకు వచ్చిన ఓ వ్యక్తి కూడా ఈ వెరైటీ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్ ఎవరు చేశారో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇంకేముంది ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ సింహం ఎక్కడుందో తెలుసా.. చైనాలోని గ్వాంగ్జౌ జూలో. చదవండి: పుతిన్కు ఊహించని షాక్.. అధికారానికి బీటలు! -
బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ...ముచ్చెమటలు పట్టించేసిందిగా...
చాలామంది వేటితో పడితే వాటితో పరాచకాలు ఆడతుంటారు. ఎంతవరకు ఆటపట్టించాలో, వేటితో ఆడుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బంధించే ఉన్నాయి కదా అని వాటితో కూడా ఆడుకోవాలని చూస్తే అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ముందు వెనుక చూడకుండా క్రూరమృగాన్ని ఆటపట్టింటి ఎలా సమస్యను కొని తెచ్చుకున్నాడో చూడండి. వివరాల్లోకెళ్తే...చాలా మంది జూ చూసేందుకు వెళ్లి అక్కడ బోనుల్లో బంధించి ఉండే జంతువులను టచ్ చేయాలనుకుంటారు. ఓపక్క జూ అధికారులు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పిన వినరు. ఎవరలేరు కదా వాటిని ముట్టుకునేందుకు ప్రయత్నించి నానా అవస్థలు పడుతుంటారు. జమైక జూలో కూడా ఒక సందర్శకుడు ఇలానే జంతువులను ముట్టుకునేందుకు ప్రయత్నించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నాడు. ఆ సందర్శకుడు బోనులోనే బంధించి ఉంది కదా అని సంహాన్ని టచ్ చేసి ఆట పట్టించేందుకు ప్రయత్నిచాడు. అంతటితో ఊరుకోకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ట్రై చేశాడు కూడా. సింహం ఊరుకుంటుందా..'నాతోనే మజాక్ చేస్తావ్ రా'.. అంటూ కోపంతో వాడి వేలును గట్టిగా కోరికి పట్టుకుంది. ఇక ఆ సందర్శకుడు పాట్లు మాములుగా లేవు. తన వేలుని వెనక్కి తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరికి వేలు పైన ఉన్న కండంతా పోయి ఎముకతో మిగిలింది. అందుకే పెద్దలు అంటారు వేటిలో పడితే వాటిలో వేళ్లు పెట్టకూడదని. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది గానీ మనమే గుర్తించం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. Show off bring disgrace The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk — Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022 (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
మానవత్వం అంటే మనుషులకేనా?.. ఈ వీడియో ఏం చెబుతోంది!
వైరల్: మనిషికి ఉంటుంది కాబట్టే.. మానవత్వమా? అదే జంతువులు సాటి జీవుల పట్ల ప్రదర్శించే దయ, సాయ గుణాల్ని ఏమనాలి?? ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన చదివాక మీరే చెప్పండి! అరవై ఏళ్లకుపైగా వయసున్న ఓ ఏనుగు.. తనకు ఎదురుగా ఉన్న నీటికొలనులో ఓ జింక మునిగిపోవడం చూసింది. దానికి సాయం అందించాలని ప్రయత్నించినా ఆ ఏనుగు వల్ల కాలేదు. దీంతో గట్టిగా ఘీంకరించడం మొదలుపెట్టింది. భయంతో అక్కడే ఉన్న మరికొన్ని జింకలు అటు ఇటు పరుగులు తీశాయి. కానీ, ఆ ఏనుగు ఆలోచన మాత్రం వేరు. జూ సంరక్షకుడిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. ఏనుగు ఘీంకారాలు విన్న జూ కీపర్ పరుగున వచ్చి చూశాడు. నీళ్లలోకి దూకి ఆ జింకను బయటికి తీశాడు. బయటకు రాగానే చెంగున దూకుతూ.. వెళ్లి తన గుంపులో కలిసిపోయింది ఆ జింక. జింక మునిగిపోయేంత లోతు కాకున్నా.. అది నీళ్లలో పడి కొట్టుకోవడం చూసి ఆ ఏనుగు చలించిపోయింది. గ్వాటెమలా నగరంలోని లా అరోరా జూలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 29వ తేదీన జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతోంది. ఆ ఏనుగును ఓ సర్కస్ నుంచి రక్షించి ఆ జూకి తీసుకొచ్చారట. పద్నాలుగేళ్లుగా అది జూలోనే ఉంటోంది. మనిషి ప్రమాదంలో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు చూస్తూ వెళ్లిపోయే సమాజం.. ఈ ఏనుగు నుంచి ఏం పాఠం నేర్చుకుంటోందో మరి! -
మానవత్వం అంటే మనుషులకేనా?
-
‘ఫటో’నా మజాకా
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొరిల్లా తీక్షణంగా చూస్తున్న వస్తువు ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఇదో రైస్ కేక్. బియ్యం, వెన్న, పలు రకాల పండ్లు, కూరగాయలతో దీన్ని తయారు చేశారు. జర్మనీలోని బెర్లిన్లో ఉన్న ఓ జూలో ఫటో అనే ఈ ఆడ గొరిల్లా ఆరగించేందుకు ఇలా తెచ్చిపెట్టారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉందిలేండి.. తాజాగా ఈ గొరిల్లా 65 ఏళ్లు పూర్తి చేసుకుంది మరి! ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాగా ఇది రికార్డులకెక్కింది. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొనే కేక్పై ఎరుపు, నలుపు రంగులతో కూడిన జెమ్స్ను 65 అంకె ఆకారంలో ఉంచారు. ఇన్ని పదార్థాలతో చేసిన కేక్ను కళ్లెదుట ఉంచితే గొరిల్లా ఊరుకుంటుందా? పిసరంత కూడా మిగల్చకుండా మొత్తం కేక్ను గుటుక్కుమనిపించింది. జూ నిర్వాహకుల కథనం ప్రకారం పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో 1957లో పుట్టిన ఈ గొరిల్లాను ఫ్రాన్స్కు చెందిన ఓ నావికుడు తన దేశానికి తీసుకెళ్లాడు. 1959లో దీన్ని జర్మనీ తీసుకొచ్చిన అతను.. మద్యానికి నగదు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా జూలోనే జీవిస్తోంది. అడవుల్లోని గొరిల్లాల జీవితకాలం సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జూలో ఉంటుండటంతో ఫటో ఇంత దీర్ఘకాలంపాటు జీవించగలుగుతోందని జూ నిర్వాహకుడు క్రిస్టియన్ ఆస్ట్ పేర్కొన్నాడు. వృద్ధాప్యం మీదపడ్డా నేటికీ ఫటో ఎంతో ఆరోగ్యంగా ఉందని, ఆకలి మందగించడం వంటి సమస్యలేవీ దీనికి లేవని చెప్పాడు. సుమారు 200 కేజీల బరువు ఉండే గొరిల్లాలు రోజూ 15 నుంచి 20 కిలోల వరకు గడ్డి, ఆకులు, బెరళ్లు, పండ్లు ఆరగిస్తాయని వివరించాడు. -
సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని!
సాధారణంగా సాధుజంతువులతో మనకి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. కానీ పులి, సింహం, ఏనుగులాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే వాటికి తిక్కరేగితే అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా సింహం గాండ్రింపు వింటేనే హడలిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహాలతోనే సెల్ఫీ దిగడమే కాకుండా వాటితో వీడియోలు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన పెద్ద వ్యాపారవేత్త. దుబాయ్లోని అత్యంత ధనవంతులలో హుమైద్ ఒకరు. అతను ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్ఓసీ) సీఈఓ. అతను తన లగ్జరీ లైఫ్స్టైల్, సింహాల పెంపకం, వాటితో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో స్టార్గా కూడా మారాడు. అంతేకాకుండా అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ కారణంగా అల్బుకైష్ జంగిల్ అనే ఒక ప్రైవేట్ జూని నడుపుతున్నాడు. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులున్నాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. హుమైద్ వాటికి కొంతదూరంలోనే సెల్ఫీ తీసుకుని సోషల్మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Humaid Abdulla Albuqaish (@humaidalbuqaish) -
విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..?
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని వేంకటేశ్వర జూ పార్కు నుంచి గురువారం మూడు గ్రే జంగిల్ ఫౌల్(మగ–1, ఆడ–2), జత వైల్డ్ డాగ్స్, అడవి దున్న, జత చౌసింగా తీసుకొచ్చారు. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు వీటికి బదులుగా విశాఖ జూ నుంచి జత హైనాలు, మగ అడవి దున్న, రెండు ఆడ నక్కలు పంపించినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ నెల 13న చండీగఢ్లోని ఛత్బీర్ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్(2 మగవి), రెడ్ జంగిల్ ఫౌల్స్(మగవి–2, ఆడవి–4), లెసర్ విజ్లింగ్ టీల్స్(మగది–1, ఆడవి–2), బార్న్ ఔల్స్(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
దత్తత తీసుకుందాం రండి..!
కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. ఆరిలోవ (విశాఖ తూర్పు) ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు.. రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్ వరకు లాక్డౌన్లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. ఎంతైనా ఇవ్వవచ్చు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. జూలో 810కు పైగా వన్యప్రాణులు జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న ఐఓసీఎల్ జూలో నకుల్ అని పిలవబడే ఇండియన్ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్ నందనీ సలారియాతో ఐఓసీఎల్ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్కుమార్ జూ క్యూరేటర్ నందనీ సలారియాకు అందజేశారు. ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం.. ► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 ► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 ► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 ► సింహానికి ఒక రోజుకు–600 ► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 ► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 ► చిరుత పులికి ఒక రోజుకు రూ400 ► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 ► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 ► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 ► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 ► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 ► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100 ► రింగ్టైల్డ్ లెమూర్కు ఒక రోజుకు రూ.100 ► మొసలి/ఘరియల్ రెండింటికి ఒక రోజుకు రూ.150 ► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 ► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 ► సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్ బర్డ్స్ పదింటికి ఐదు రోజులకు రూ.100 దాతలు ముందుకు రావాలి... కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
Crocodiles: ముచ్చటగా 32.. దత్తత తీసుకుంటారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూ పార్కులో ఎన్నెన్నో రకాల వన్యప్రాణులున్నాయి. ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, కనుజులు, జింకలు, వివిధ రకాల పక్షులతో పాటు వివిధ జాతుల పాములు జూకు వెళ్లే సందర్శకులకు నేరుగా ఎన్క్లోజర్లలో కనిపిస్తుంటాయి. అయితే జూలో మొసళ్లు ఎక్కడా అని సందర్శకులు వెతుకుతుంటారు. అసలు జూలో మొసళ్లే లేవని ఇంకొందరు అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. జూలో మొసళ్లు కూడా ఉన్నాయి.. ఒకటి కాదు.. రెండు.. కాదు.. మూడు రకాలకు చెందిన 32 మకరాలున్నాయి. వాటి సంతతిని ఇప్పుడిప్పుడే వృద్ధి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో మూడు ఉప్పు నీటి మొసళ్లు, ఆరు ఘరియల్స్, 23 మగ్గర్ మొసళ్లు(మూడు పెద్దవి, 20 పిల్లలు) ఉన్నాయి. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. కొలను ఒడ్డున పిల్లలతో మగ్గర్ మొసళ్లు జూ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి మొసళ్లకు అధికారులు ప్రత్యేక స్థానం కల్పించారు. మొదటి నుంచి మూడు రకాల మొసళ్లను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. వాటి కోసం పాముల జోన్ వెనుక భాగం, సాగర్ ద్వారం నుంచి కుడివైపులో రెండు కొలనులు, సాగర్ ద్వారంలో ఎడమ వైపు ప్రధాన రహదారి పక్కనే మరో కొలను ఏర్పాటు చేశారు. వీటిలో సాగర్ ద్వారం నుంచి కుడి వైపున ఉప్పునీటి మొసళ్లు(సాల్ట్ క్రోకోడైల్), మగ్గర్ మొసళ్ల కొలనులు ఉన్నాయి. సాగర్ ద్వారం నుంచి ఎడమ వైపు ఘరియల్ మొసళ్లు కొలను నిర్మించారు. ఉప్పునీటి మొసలి ఈ మూడు కొలనుల్లో మొదట్లో ఒక్కో జత చొప్పున ఆయా రకాలకు చెందిన మొసళ్లు విడిచిపెట్టారు. అవి సందర్శకులను అలరించేవి. అవి రానురాను వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అయినా ఎప్పుడూ వాటి మూడు రకాల సంఖ్య 10 దా టేది కాదు. ఇప్పుడు మూడు పదులు దాటడం విశేషం. మగ్గర్ జాతి మొసళ్లు రెండు ఆడవి, ఒకటి మగది(పెద్దవి) ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆడ మొసలి గతేడాది మే 20న 20 పిల్లలను పొదిగింది. దీంతో వాటి సంఖ్య ఒక్క సారిగా 3 నుంచి 23కు చేరింది. ఆ 20 పిల్లలు ప్రస్తుతం జనక మొసళ్లతో వాటి కొలనులో హుషారుగా తిరుగుతున్నాయి. తల్లి మొసలితో పాటు ఒడ్డుకు చేరి గట్టుమీద గడుపుతున్నాయి. ఇక్కడ పొదగబడిన పిల్లలన్నీ బతకడం విశేషం. సాధారణంగా పొదగబడిన కొద్ది రోజులకు కొన్ని పిల్లలు నీటిలో తిరుగుతున్న సమయంలో పెద్ద మొసళ్లు ఢీకొనడం, ఒడ్డుకు చేరిన సమయంలో ఏవైనా పక్షులు ఎత్తుకుపోవడంతో ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ ఇవి పొదగబడి సుమారు తొమ్మిది నెలులు గడిచింది. ప్రస్తుతం ఇవి సుమారు 5 నుంచి 8 కిలోల బరువు పెరిగాయి. దీంతో వీటిని పక్షులు ఎత్తుకెళ్లలేవు. సరికదా కొలను లోపల పెద్ద మొసళ్లు ఢీకొన్నప్పుటికీ తట్టుకొనే శక్తి వచ్చిందని యానిమల్ కీపర్లు, జూ అధికారులు అంటున్నారు. పిల్లలన్నీ బతకం అరుదైన విషయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘరియల్స్ ఇక్కడ సాగర్ ద్వారం దాటగానే ఎడమ వైపు రోడ్డు పక్కన ఘరియల్స్ కొలను ఉంది. జూ ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 6 ఘరియల్ జాతికి చెందిన మొసళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆడవే. ఇవి తరుచూ కొలను నీటి నుంచి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటికి సుమారు అర మీటరు పొడవున నోరు ఉంటుంది. ఆ నోటిని పైకి పెట్టి నీటిలో ఈదుతూ చేపలను పట్టుకుని తింటాయి. ఇవి ఒడ్డుకు చేరి ఎక్కువ సేపు గడుపుతూ సందర్శకులను అలరిస్తుంటాయి. ఇదీ మొసళ్ల మెనూ.! ఇక్కడ మొసళ్లకు రోజులో రెండుసార్లు ఆహారం అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చికెన్, బీఫ్ను బోన్స్(దుమ్ములు)తో కలిపి కైమా చేసి వేస్తుంటారు. వీటితోపాటు కొన్ని రోజుల్లో చేప పిల్లలను, పెద్ద చేప ముక్కలు కొలనుల్లో వేస్తున్నారు. ఇవిగాక కొలనులో వాటికి దొరికిన నత్తలు, కీటకాల లార్వా తింటాయి. ఇది లా ఉండగా ఇక్కడ వాటి సంఖ్య పెరుగుతున్న రీతిలోనే వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా భారీగా పెరిగిపోతుంది. అందుకే జూ అధికారులు దాతలు ముందుకొచ్చి వాటిని దత్తత తీసుకోవాలని కోరుతున్నారు. ఉప్పునీటి మొసళ్లు ఇక్కడ ప్రస్తుతం ఉప్పు నీటి మొసళ్లు మూడున్నాయి. ఈ మూడూ ఆడవే. నాలుగేళ్ల కిందట ఇక్కడ ఒక జత ఉప్పునీటి మొసళ్లు ఉండేవి. వాటిలో ఆడ మొసలి గుడ్లు పెట్టి సుమారు 10 పిల్లలను పొదిగింది. ఆ పిల్లల్లో 8 మృతి చెందాయి. దీంతో పాటు ఇక్కడ మగ మొసలి కూడా వృద్ధాప్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ప్రస్తుతం మూడు ఆడ ఉప్పునీటి మొసళ్లు ఈ కొలనులో సందర్శకులను అలరిస్తున్నాయి. మొసళ్లను దత్తత తీసుకోండి జూలో మొసళ్ల సంఖ్య పెరిగింది. అవి సందర్శకులను అలరిస్తున్నాయి. వాటితో పాటు జూలో అన్ని జాతుల వన్యప్రాణులు సంఖ్య పెరిగింది. అందుకే దాతలు ముందుకు వచ్చి వాటిని దత్తత తీసుకుని ఆహారం అందించాలని కోరుతున్నాం. మొసళ్లను వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఒక్కో మొసలికి వారానికి రూ.525, నెలకు రూ.2,000, ఆరు నెలలకు రూ.12,000, ఏడాదికి రూ.24,000 ఆహారం కోసం ఇచ్చి దత్తత తీసుకోవచ్చు. ఉప్పు నీటి మొసలి, ఘరియల్స్లో ఇక్కడ మగవిలేవు. దీంతో ఆయా రకాల మొసళ్లను ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి: వైరల్ వీడియో
Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్ని చూసి ఏ చేసిందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి చేస్తున్న మ్యాజిక్ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది. అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..) -
ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!!
కన్నపేగు మమకారం మరిచిన ఆ తల్లి.. కర్కకశంగా వ్యవహరించింది. మూడేళ్ల బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఎలుగుబంటి బోనులోకి విసిరేసింది. పదహారు అడుగుల లోపలికి పడిపోయిన ఆ బిడ్డ తలకు గాయమై.. స్పృహ కోల్పోయింది. అందరూ అరుస్తుండగా.. ఆ బిడ్డ వైపు వెళ్లింది ఓ ఎలుగుబంటి. మరి ఆపై ఏం జరిగిందంటే.. కన్నబిడ్డను చేజేతులారా చంపాలని ప్రయత్నించింది ఓ తల్లి. తాష్కెంట్ జూలో ఎలుగు బంటి ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్లి.. తన బిడ్డను అందులోకి విసిరేసింది. అప్పటికే ఆమె చేష్టలు అనుమానంగా ఉండడంతో పక్కనే ఉన్న సందర్శకులు, జూ సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, హఠాత్తుగా ఆమె ఆ చిన్నారిని విసిరేసింది. ఆ ఎన్క్లోజర్ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తూ ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్క్లోజర్లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మళ్లీ బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయగా.. బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది. Have You Seen This?#Tashkent, #Uzbekistan A girl survives after her mom recklessly placed her child over the security fence and she fell into a bear sanctuary at #TashkentZoo. The brown bear #Zuzu, slowly approached the girl, sniffed and walked away. pic.twitter.com/dXCZwo8YVa — Geovanni Villafañe (@RezZureKtedPoeT) January 31, 2022 -
ఆ వీడియో చూసి యాంకర్ రష్మీ ఆగ్రహం.. సిబ్బందిపై ఫైర్
Anchor Rashmi Gautam Fires On Delhi Zoo Employee : బుల్లితెర యాంకర్గా దూసుకుపోతున్న రష్మీ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీ మూగజీవీలపై ఎంతో ప్రేమ చూపిస్తుంటుంది. తాజాగా జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో కేజ్ నుంచి నీటి ఏనుగు తల బయటకు పెట్టి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా అది చూసి రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కింది. లాక్డౌన్లో మూడు నెలలు ఇంట్లో బందిస్తేనే మనం ఎంతో అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి. బ్యాన్ జూ అంటూ రష్మీ తన ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేసింది. -
వరంగల్ జూ పార్క్ లో వన్యప్రాణుల పోషణ భారం
-
జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి... పాండా ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!
Naughty Panda Briefly Escapes Enclosure Zoo At Beijing: ఇటీవల కాలంలో పలు జంతువుల జూ నుంచి తప్పించుకుని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాక ఒక ఆవు జంతు వధ నుంచి తప్పించుకుని ఒక పార్క్లోకి ప్రవేశించిన వీడియో కూడా నెటిజన్లను భలే ఆకర్షించింది. అచ్చం అలానే ఇక్కడొక చిలిపి పాండా భలేగా జూ నుంచి తప్పించుకునేందుకు యత్నించి మళ్లీ వెనక్కి వచ్చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) అసలు ఏం జరిగిందంటే...చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్లాన్ అనే ఆరేళ్ల పాండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పైగా పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్ని ఎక్కేస్తుంది. పైగా అక్కడ ఉన పర్యాటకులు దాన్ని ఉత్సహపరుస్తూ బయటకు వచ్చేలా పాండాను ప్రోత్సహించారు కూడా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) -
వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!
ఇటీవలకాలంలో తమ పెంపుడు జంతువులను కౌగిలించుకుంటున్నట్లు లేదా ముద్దు పెడుతున్నట్లు ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటాం. పైగా అలాంటి చిలిపి పనులు చేసే సందర్భాలలో కొంతమంది చేదు అనుభవాలను కూడా చవిచూశారు. అయితే మరికొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి మరింత ప్రమాదకరమైన జంతువులను లేక పెంచుకునేందుకు వీలుకాని జంతువులను సైతం పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వికృతి చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ఇక్కడొక జూ సంరక్షకురాలు చేస్తుంది. (చదవండి: ఇదే ఆఖరి రోజు!....బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) అసలు విషయంలోకెళ్లితే... కాలిఫోర్నియాలోని రెప్టైల్ జూ సంరక్షకురాలు ఒక పెద్ద మొసలిని కౌగిలించుకుంటుంది. పైగా ఆ మొసలి తన స్నేహితురాలు అంటూ పరిచయం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ మొసలి ఒక్కసారిగా సదరు సంరక్షకురాలి కౌగిలి నుంచి బయట పడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలే ఏమైంది దీనికి అన్నట్లుగా ఆమె ఆ మొసలిని పరిశీలనగా చూసేటప్పటికీ ఆ మొసలి కాస్త నెమ్మదిగా టాయిలెట్కి వెళ్లిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్కి గురై ఎంత పనిచేశావ్ డియర్ అంటూ నవ్వుతుంటుంది. ఈ మేరకు సదరు సంరక్షకురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు" ఇవి పెంపుడు జంతువుల మాదిరి పెంచడం చట్టవిరుద్ధం" అనే క్యాప్షన్తో ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!) View this post on Instagram A post shared by The Reptile Zoo (@thereptilezoo) -
దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు
సింగపూర్: సింగపూర్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైల్డ్లైఫ్ గ్రూప్లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ అయిన డాక్టర్ సోంజా లూజ్ పేర్కొన్నారు. తాజాగా సింగపూర్ దేశంలో సుమారు 3,397 కేసులు ఉన్నాయని దేశం మొత్తంగా చూస్తే సుమారు 2 లక్షలకు పైగా కేసులు ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కరోనా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదీ కాక సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో సహా తేలికపాటి లక్షణాలను కనిపించాయని వైల్డ్ లైఫ్ గ్రూప్ తెలిపింది. అలాగే నైట్ సఫారీకి చెందిన ముగ్గురు కీపర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆసియాటిక్ సింహాల పార్క్ నైట్ సఫారిని మూసేసినట్లు వైల్డ్ లైఫ్ గ్రూప్ అధికారులు చెప్పారు. ఈమేరకు వైల్డ్లైఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోంజా లూజ్ మాట్లాడుతూ..."సాధారణంగా, వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావు. కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని మేము భావిస్తున్నాము. అయితే, తదుపరి చికిత్స అవసరమైతే గనుక యాంటీ ఇన్ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్ ఇస్తాం" అని చెప్పారు. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) -
వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): వండలూరు జంతు ప్రదర్శనశాలలో వైరస్ కలకలం రేపుతోంది. రెండురోజుల వ్యవధిలో తొమ్మిది నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మరణించినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యబృందాలు పరిశీలన ప్రారంభించాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులపై కరోనా ప్రభావం పడిన విషయం తెలిసిందే. రెండు సింహాలు మరణించడం, మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రదర్శనశాల కొంతకాలం మూత పడింది. మళ్లీ ప్రస్తుతం సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం హఠాత్తుగా రెండు నిప్పు కోళ్ల మరణించాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు. నివేదిక వచ్చేలోపు బుధవారం సాయంత్రం మరో ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్ కలవరం ఏర్పడింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత(22) అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు. పరిశీలనలో టీకా ఉత్పత్తి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రాష్ట్రంలోని చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో చేపట్టేందుకు కేంద్ర చర్యలు చేపడుతోందని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 ఏళ్లు లోపువారికి టీకా డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసిందన్నారు. కాగా చెన్నైలో మాస్క్లు ధరించని 47 వేల మందిని గుర్తించి, వారి నుంచి రూ. 94 లక్షల మేరకు జరిమానాను రెండు రోజుల్లో వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ -
విశాఖ జూ పార్కులో పులి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జూ పార్కులో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల ఈ రాయల్ బెంగాల్ టైగర్(సీత) వృద్ధాప్యంతో పాటు కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం పులుల ఎన్క్లోజర్లో మృతి చెందింది. యానిమల్ కీపర్ ద్వారా విషయం తెలుసుకున్న జూ అధికారులు పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
‘ఈ బంధాన్ని ఇక్కడితోనే ఆపేయండి’
జూలో జంతువులను చూసి భలే ఉన్నాయంటూ మురిసిపోతాం. కోతులు, చింపాజీల వంటి జంతువులైతే అచ్చం మనిషిలాగే ఉంటాయని ఆనందపడతాము. ఖాళీ దొరికితే చాలు జంతుప్రేమికులు.. జూలను సందర్శిస్తుంటారు. అయితే తాజాగా బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాల ఓ సందర్శకురాలిపై నిషేధం విధించింది. దీంతో సదరు సందర్శకురాలు కన్నీటి పర్యంతం అయ్యిది. వివరాల్లో వెళ్తే.. బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాలను గత నాలుగేళ్లుగా ఏడీ టిమ్మర్మన్స్ అనే ఓ మహిళా సందర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె జూకి వచ్చిన ప్రతిసారి ఆమె 38 ఏళ్ల ఓ మగ చింపాంజీని చూస్తూ కాలక్షేపం చేసేది. తరచుగా రావటంతో ఆ చింపాంజీ సదరు మహిళను గుర్తించడం మొదలుపెట్టింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో చింపాంజీ దాని సహచర చింపాంజీలో కలివిడిగా ఉండటంతో తగ్గించింది. ఒంటరిగా కూర్చోటంతో మిగతా చింపాంజీలు కూడా దాన్ని పట్టించుకోవటం మానేశాయి. దీంతో ఆ చింపాంజీలో వచ్చిన మార్పును జూ సిబ్బంది గమనించి.. దాని ప్రవర్తనకు గల కారణం ఆరా తీశారు. అయితే ఏడీ టిమ్మర్మన్స్ అనే మహిళ దాని వద్ద ఎక్కువ సమయం ఉండటం వారి దృష్టికి వచ్చింది. అయితే దాని ప్రవర్తనలోని మార్పుకు తీసుకురావడానికి సిబ్బంది.. ఆమెను జూకు రావొద్దని నిషేధం విధించారు. దీంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతూ.. చింపాజీతో తనకు బంధం ఉందని తెలిపింది. మిగతా సందర్శకులను అనుమతించినప్పుడు తనను ఎందుకు రానివ్వడం లేదని జూ సిబ్బందిని ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది. -
రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు
సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం.. సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది.. అంటే.. జంతువులు బయట తిరుగుతూ ఉంటే.. మనం బోనులో ఉండటమన్నమాట. దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యంలో ఈ వినూత్న బోనును ఏర్పాటు చేశారు. దీని వల్ల సందర్శకులకు కూడా వాటిని దగ్గర నుండి చూసే అనుభూతి కలుగుతుందని అభయారణ్యం నిర్వాహకులు చెబుతున్నారు. భద్రత విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదని.. దీన్ని తరచూ ఇంజనీర్లతో తనిఖీలు చేయిస్తామని పేర్కొంటున్నారు. -
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పులులు, సింహాలు..
వాషింగ్టన్ : నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సిన్ వేయించుకోవటం తప్పని సరైంది. దేశాలు, రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్ వేసే పక్రియ చాలా దేశాల్లో ఇంకా పూర్తికాలేదు. కొన్ని దేశాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు ప్రభుత్వాల వైఫల్యం ఓ కారణమైతే.. ప్రజల భయం మరో కారణం. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడుతున్నారు. కానీ, అమెరికాలోని ఓ జూలోని జంతువులు వాలంటీర్గా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాయి. వ్యాక్సిన్ వేసే వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా.. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా జూలోని జంతువులకు ఈ మధ్యే ఓ ప్రయోగాత్మక వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. గత వారం జూలోని జింజర్, మోలీ అనే పులులకు వ్యాక్సిన్ వేశారు. జూ అధికారి అలెక్స్ హెర్మన్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ జూలోని ఏ జంతువుకు కరోనా సోకలేదు. కానీ, వాటికి రక్షణ కల్పించటం ముఖ్యం. పులులు, ఎలుగు బంట్లు, పర్వత సింహాలు, ఫెర్రెట్స్కు మొదటి డోస్ వేశాము. ఆ తర్వాత కోతులకు, పందులకు మొదటి డోస్ వేస్తాము. ఈ వ్యాక్సిన్ను న్యూజెర్సీలోని వెటర్నరీ ఫార్మాసూటికల్స్ కంపెనీ ‘జొయోటిస్’ తయారు చేసి ఇచ్చింది’’అని పేర్కొన్నాడు. -
పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు
తిరువనంతపురం: ఈ రోజుల్లో మూగ జీవులు పై ప్రేమ చూపించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాటిని రక్షించే వృత్తిలో మాత్రం తక్కువ మంది ఎంచుకుంటారు. ఇటువంటి వృత్తిని ఎంచుకోనే జాబితాలో జంతుప్రదర్శనశాలలో పనిచేసే వారు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నిత్యం వాళ్ల ప్రాణాలకు తెగించి జంతువుల మధ్య పనిచేస్తారు. కొన్ని సార్లు అదే జంతువులకు బలైపోతారు. నిత్యం పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు అదే పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కేరళలోని తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టకడ తాలుకాలోని అంబూరి పంచాయతీకి చెందిన హర్షద్ గత నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి పాముల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. యథావిధిగా గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్క్లోజర్ను శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హర్షద్ మూడు కోబ్రాలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరిచాడని.. ఈ క్రమంలో ఒక పాము హర్షద్ చేతిపై కాటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత కొంతసేపటికే హర్షద్ సృహతప్పి పడిపోయాడని.. వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జూ అధికారి తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. -
కరోనా వైరస్తో సివంగి మృతి
చెన్నై : కరోనా వైరస్ కారణంగా ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాతపడింది. చెన్నైలోని అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్కులో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జూలోని నీలా అనే సివంగికి కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట లక్షణాలు లేకపోయినప్పటికి ఆ తర్వాత సివంగి ముక్కులోంచి స్రావాలు రావటంతో చికిత్స మొదలుపెట్టారు. చికిత్స పొందుతున్న సదరు సివంగి గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతి చెందింది. జూ ఎన్క్లోజర్లోని ఐదు, సఫారీ పార్కులోని ఒక సింహం కరోనా లక్షణాలు కలిగి ఉండటంతో మొత్తం 11 సింహాలకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో తొమ్మిది సింహాల కరోనా శాంపిళ్లను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజ్కు పంపారు. దీనిపై జూ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కరోనా సోకిన సింహాలకు తమిళనాడు వెటర్నరీ అండ్ సైన్స్ యూనివర్శిటీ కోఆర్డినేషన్తో జూ వెటర్నరీ బృందం చికిత్స అందిస్తోంది. మరో సింహంతో పాటు అన్ని పులులకు టెస్టులు నిర్వహించి శాంపిళ్లను భోపాల్ పంపాము. మృతి చెందిన సివంగికి కరోనా వచ్చిందా లేదా అన్న సంగతి ధ్రువీకరించుకోవటానికి మరో సారి పరీక్ష నిర్వహించి, శాంపిళ్లను ల్యాబ్కు పంపాము’’ అని తెలిపారు. -
వైరల్: ఈ ఖడ్గమృగం చాలా స్పెషల్! బర్త్డేకి ఏం చేసిందో తెలుసా?
వాషింగ్టన్: మనుషులు పుట్టిన రోజు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే జంతుప్రేమికులు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటారు. అయితే తాజాగా డెన్వర్ జూలో ఒక ఖడ్గమృగం తన పుట్టినరోజున తనే స్వయంగా కీబోర్డ్ను ప్లే చేసింది. జూలోని బంధు అనే ఖడ్గమృగానికి 12 సంవత్సరాలు నిండాయి. దాంతో బంధుకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేల మంది వీక్షించగా..వందల మంది లైక్ కొట్టారు. "మా జూలో ఉండే కొమ్ము గల మగ ఖడ్గమృగానికి ఈ రోజుతో 12 ఏళ్లు నిండాయి. ఇది తన పుట్టినరోజు. అయితే బంధు స్వయంగా తాను రాసిన ఒక ప్రత్యేక పాటతో మీ అందరికీ చికిత్స చేయాలనుకున్నాడు. తన పుట్టినరోజున మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరిచేందుకు అనేక మార్గాలలో ట్యూన్ కంపోజ్ చేయడానికి అతని ప్రిహెన్సిల్ పెదవిని ఉపయోగించాడు." అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బంధు! అవును! ఆ పెద్ద పిల్లవాడిని ప్రేమించండి! " అంటూ కామెంట్ చేశాడు. "జంతువులకు నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉంది" అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Denver Zoo (@denverzoo) (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
బల్లికి ఆహారంగా పురుగు, ఎలా అందించారనేదే మేటర్!
బల్లిని చూస్తేనే చాలా మందికి విపరీతమైన భయం. అదెక్కడో గోడ మీద కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తేవారు ఉంటారు. అలాంటిది బల్లి మీద పడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్లో అంతకు మించిన మ్యాటర్ ఉంది. ఇక్కడ బల్లి దాని యజమాని పెదవుల మీద ఉన్న పురుగును అమాంతం నోట్లో వేసుకుంది. యాక్ అనిపించినా ఇది వాస్తవం. ఆ వివరాలు.. సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ తన జూలోని జంతులాలతో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని స్వయంగా ఆహారం అందించి మురిసిపోతుంటాడు. తాజాగా ఆయన ఓ పెద్ద బల్లికి పురుగుని ఆహారంగా అందించాడు. మాములుగా ఇస్తే.. ఓకే! కానీ అతను తన పెదవులపై ఆ పురుగును ఉంచుకోగా.. బల్లి వేగంగా దాన్ని తన పొడవాటి నాలుకతో నోట కరుచుకుంది. అందుకనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటివెన్నో జే బ్రూవర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. (చదవండి: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?) -
వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!
వాషింగ్టన్: పిల్లలకి బొమ్మలంటే మహా సరదా. అలాగే ఇంట్లో ఉండే పెంపుడు జంతువులతో ఆడలాడుతుంటారు. వాటి చెవులు పీకుతూ.. జూలు దువ్వుతూ.. సరదాగా గడుపుతారు. తాజాగా ఫిలడెల్ఫియా జూలో చిరుతతో ఓ చిన్నారి ఆట వైరల్గా మారింది. తమ బిడ్డతో జూకి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను పులి ఎదుట నిలిపారు. వారు కొంత దూరంలో ఉండి తమ కూతురిని గమనించారు. ఆమె పులిని పెంపుడు పిల్లి అనుకుందో..ఏమో.. దానికి హాయ్ చెప్పింది. తన చేతిలో ఉన్న బొమ్మతో చిరుతను ఆటపట్టించింది. అయితే, చిరుత అమాంతం ఆ పసిపాప పైకి దూకే ప్రయత్నం చేసింది. చిన్నారి చేతిలోని బొమ్మవైపు అదోలా చేసి.. దాన్ని తినేయాలి అనేంత కసిగా.. వారి మధ్య అడ్డుగా ఉన్న గాజు గోడను గోళ్లతో రక్కింది. కాగా, ఈ వీడియోను లారా ఫ్రేజర్ అనే వ్యక్తి రికార్డు చేసి "ప్లే డేట్" క్యాప్సన్తో ఇన్స్టాగ్రామ్లో శనివారం సాయంత్రం పోస్ట్ చేయగా 93 వేల మంది వీక్షించారు. వేల మంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి తన చేతిలోని బొమ్మతో చిరుతను ఆట పట్టిస్తుంది. తన చేతిలో ఉన్న బొమ్మను గాజు ముందు ఉంచిన ప్రతిసారీ చిరుత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. " చిన్నారి చిరుతను చూసి పిల్లి అనుకుంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.." చిరుత చిన్నారిని చూసి రుచికరమైన ఆహారం అనుకుంటోంది." అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. " అడ్డుగా గాజు గోడ లేకుంటే. ఏమై ఉండేదో.."అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు) -
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జూ పార్క్లు మూసివేత
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది. ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. చదవండి: తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్.. రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్ లక్షణాలు
-
విషాద గాథ: కొన్నాళ్లకు అవి కనిపించవు..
సాక్షి సెంట్రల్ డెస్క్: జూ.. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఒక ఇంటరెస్టింగ్ ప్లేస్.. రకరకాల జంతువులు, పక్షులు ఉండే ప్లేస్.. జూ సంగతి సరే.. అందులోని జంతువులకు ఈ భూమ్మీద ప్లేస్ కరువవుతోంది.. ఆ విషయం మీకు తెలుసా? అందుకే నేడు(ఏప్రిల్ 8) ‘నేషనల్ జూ లవర్స్ డే’ సందర్భంగా వాటి పరిస్థితి ఏంటో ఓసారి తెలుసుకుందాం.. భూమ్మీద పది లక్షల రకాల జంతువులు, వృక్షాలు, ఇతర జీవజాలం అంతరించేపోయే దశలో ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 1900వ సంవత్సరం నుంచీ గమనిస్తే అంతరించిపోయే దశలో ఉన్నట్టుగా గుర్తించిన జీవుల శాతం ►భూమి మీద బతికే జీవుల్లో 20 శాతం ►ఇదే సమయంలో మొసళ్లు, కప్పలు, కొన్నిరకాల పాముల వంటి ఉభయచర జీవుల్లో 40 శాతానికిపైగా ►సముద్రాల్లో పగడపు దిబ్బలను ఏర్పాటు చేసే కోరల్స్లో 33 శాతం ►నీటిలోనే జీవించే జలచరాల్లో 30 శాతానికిపైగా మనమే చంపేస్తున్నాం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వన్యప్రాణుల హననం విచ్చలవిడిగా సాగుతోంది. అడవి జం తువుల చర్మం, దంతాలు, కొమ్ములు, గోర్లు, మాంసం కోసం చంపడం బాగా పెరిగిపోయింది. ►ప్రపంచంలోనే ఆఫ్రికా ఖండంలో ఏనుగుల సంఖ్య ఎక్కువ. స్మగ్లర్లు దంతాల కోసం ఇక్కడి అడవి ఏనుగుల్లో 65 శాతం ఏనుగులను గత పదేళ్లలోనే వధించారు. ► సౌతాఫ్రికాలో 2007 నుంచి 2013 మధ్య ఖడ్గ మృగాల వేట 7,700 శాతం పెరిగింది. ►ప్రపంచవ్యాప్తంగా జంతువుల అక్రమ వ్యాపారం విలువ ఏటా రూ.52 వేల కోట్ల నుంచి రూ. లక్షా 72 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ప్లాస్టిక్.. భూతమే.. మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, వస్తువుల్లో చాలా వరకు సముద్రాల్లోనే డంప్ అవుతున్నాయి. ఇవి భారీ ఎత్తున జీవజాలం చనిపోవడానికి కారణమవుతున్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 80 లక్షల టన్నులు. ►ఈ ప్లాస్టిక్ వేస్ట్ ప్రభావం వల్ల అంతరించేపోయే దశకు చేరుకున్న సముద్ర జీవజాతులు.. సుమారు 600 జాతులు.. సముద్రాల్లో చేరిన మైక్రో ప్లాస్టిక్ ముక్కల (ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్నవి) సంఖ్య మన పాలపుంతలో ఉన్న కోట్ల నక్షత్రాల కన్నా 500 రెట్లు ఎక్కువ. పచ్చదనం పెరగట్లే.. పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. అంతేస్థాయిలో జీవులూ అంతరించిపోతున్నాయి. ►ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అమెజాన్లో గత 50 ఏళ్లలోనే 17 శాతం తరిగిపోయింది. ►ప్రపంచవ్యాప్తంగా 2019లో ప్రతి నిమిషానికి 25–30 క్రికెట్ స్టేడియాల పరిమాణంలో అడవులను నరికేశారు. ►మొత్తంగా ఉష్ణమండల అడవుల్లోనే ప్రపంచంలోని సగం జీవజాలం బతుకుతోంది. అలాంటి ఉష్ణ మండల అడవుల విస్తీర్ణం ఏటా ఏకంగా 1.7 లక్షల కిలోమీటర్ల మేర తరిగిపోతోంది. మనమేం చేద్దాం.. భూమ్మీద జీవజాలం సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి పలు సూచనలు చేసింది. అందరూ కూడా వ్యక్తిగతంగా వీటిని అనుసరిస్తే.. అడవులను, జంతువులను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఒక లక్ష్యంగా.. పర్యావరణంపై అతితక్కువ ప్రభావం పడేలా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తుల వృథాను అరికట్టడం వంటివి.. అందరికీ అవగాహన కల్పించి.. అడవి జంతువులు, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు, ఇతర చోట్ల అవగాహన కల్పించాలి. వినియోగంలో బాధ్యత.. అడవుల నుంచి అక్రమంగా తరలించే ఉత్పత్తులు, వస్తువులు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. సమాచారం ఇవ్వాలి.. అడవి జంతువుల అక్రమ రవాణా, వాటి మాంసం, ఇతర ఉత్పత్తుల విక్రయాలు వంటివాటి గురించి తెలిస్తే.. వెంటనే ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వాలి. అడవి జంతువులు తగ్గిపోయిన తీరు... చదవండి: సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్! ఆ ఒక్కటీ పాయె -
నెహ్రూ జూ: చల్లందనమే..చల్లదనమే..!
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు ఉపశమనం కలిగించేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు ఇబ్బంది పడకుండా చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నామన్నారు. అన్ని జంతువుల ఆవరణలో స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. తుంగగడ్డిని కొన్ని ఆవరణల పైకప్పుపై ఉంచారు. కోతులు, పులులు, లయన్స్, జాగ్వార్స్, చిరుత పులి జంతువుల ఆవరణలలో 50కి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ యానిమల్ హౌస్లో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. కోతులు, పక్షులు, ఎలుగుబంట్లకు పండ్లను అందజేస్తున్నారు. గ్లూకోన్–డీ, ఎలక్ట్రోరల్ పౌడర్, విటమిన్–సి, సప్లిమెంట్స్, బి–కాంప్లెక్స్ సప్లిమెంట్స్, థర్మోకేర్ లిక్విడ్ నీటిలో కరిగి వేసవి ఒత్తిడిని నివారించడానికి జంతువులు, పక్షులకు ఇస్తారు. -
జూపార్క్... అధికారుల నిర్లక్ష్యం
-
వైరల్ వీడియో: అమ్మో..పాము
-
వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది!
కాలిఫోర్నియా: జూలో ఉన్న జంతువులు ఒక్కోసారి తమ యజమానులపైన దాడిచేయడం మనం చూస్తునే ఉంటాం. అయితే తాజాగా, ఒక పెద్ద పాము తన జూకీపర్పైన దాడిచేసింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని జూలో చోటు చేసుకొంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని జూలో పనిచేస్తున్న మిస్టర్ బ్రీవర్కు పాములను పట్టుకోవడమంటే మహసరదా. ఇప్పటి వరకు రకరకాల పాములను పట్టుకున్నాడు. పాములను మెడలో వేసుకొని, వాటి మధ్యలో కూర్చున్న అనేక ఫోటోలు, వీడియోలు తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే, బ్రీవర్ ఓ రోజు చేతిలో స్టిక్ పట్టుకొని , టేబుల్ పైన ఉన్న పెద్ద పాము వద్దకు వెళ్లాడు. దాన్ని కర్రతో తాకుతూ ఏదో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ పాము బ్రీవర్ను కరవడానికి ముందుకు దూకింది. దీంతో షాక్కు గురైన అతను వెంట్రుకవాసిలో దాని కాటునుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీన్ని చూసిన నెటిజన్లు ‘నువ్వు అదృష్టవంతుడివి, దాదాపు నీ ముఖాన్ని పాము పట్టేసుకొంది, వెంట్రుకవాసిలో తప్పించుకున్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: విషనాగును ఒంటి చేత్తో పట్టుకొన్న మహిళ -
ఏనుగు పాదానికి గాయమైందని వెళితే.. విసిరికొట్టింది!
మాడ్రిడ్: ఓ ఏనుగు తన తొండంతో గట్టిగా కొట్టి, ఎన్క్లోజర్ నుంచి జూ కీపర్ను బయటకు విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తర స్పెయిన్లోని కాంటాబ్రియాలోని కాబార్సెనో నాచురల్ పార్క్లో జూ కీపర్ జోక్విన్ గుటిరెజ్ ఆర్నైజ్(44)పై ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో జూ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఏనుగు పాదానికి ఇన్ఫెక్షన్ అయినట్లు తెలుస్తోంది. ఆ గాయం స్థితిని తెలుసుకోవడానికి జూకీపర్ దాని వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఏనుగుకు దగ్గు రావటంతో అది ఒక్కసారిగా తన తొండాన్ని బలంగా ముందుకు విసిరింది. దీంతో దాని పాదాల వద్ద ఉన్న జూ కీపర్ ఎన్క్లోజర్ అవతలపడ్డాడని తెలిపారు. ఆ ఏనుగు తొండానికి చాల బలం ఉంటుందని, అది మనుషులకు తగిలితే బతకటం కష్టమని పేర్కొన్నాడు. ఈ ఘటన చోటు చేసుకోవటం బాధాకరం, 30 ఏళ్ల జూ చరిత్ర ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరిగిందని ఆయన తెలిపాడు. చదవండి: తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా మాట్లాడుకుందామని పిలిచి మోడల్పై ఆత్యాచారం -
భగ్న ప్రేమకు గుర్తుగా బొద్దింకలు, ఎలుకలు
వాషింగ్టన్ : ప్రేమలో వైఫల్యం కారణంగా పగిలిన హృదయాన్ని అతికించటం అంత వీజీ కాదు!. ఆ బాధనుంచి బయటపడటానికి ఒకరకంగా మనసుతో మనిషి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయినా అందులో విజయం సాధిస్తామన్న నమ్మకంలేదు. చాలా మంది భగ్న ప్రేమికులు దూరమైన వాళ్లను తలుచుకుంటూ తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. మాటల్లోనో.. చేతల్లోనో వాళ్లను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ల కోసం అమెరికా, టెక్సాస్లోని శాన్ ఆంటానియో జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ( వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు) ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ‘‘ క్రై మీ ఏ కాక్రూచ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జూలోని బొద్దింకలు, ఎలుకలకు తమ మాజీల పేర్లు పెట్టుకునే, ప్రేమికుల రోజున వాటితో వేరే జంతువుల కడుపునింపే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. బొద్దింకకు రూ. 370, ఎలుకకు రూ.1800లు చెల్లించాల్సి ఉంటుంది. మనం బహుమతిగా ఇచ్చే వీటిని ఇతర జంతువులకు ఆహారంగా వేస్తారు. శాకాహార జంతువులకు శాకాహారం బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ఐదు డాలర్లు (370 రూపాయలు) చెల్లించాలి. -
నవ్వులు పూయిస్తున్న చింపాజీ పిల్లల అల్లరి
చిన్న పిల్లలు చేసే అల్లరిని భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఒక్క చోట ఉండకుండా అటు,ఇటు తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. తోటి పిల్లలతో పోట్లాడుకోవడం లేదా పనికి వచ్చే వస్తువులు పగులగొట్టడం వారికి సరదా. ఇక వారి అల్లరిని ఆపేందుకు తల్లి చేయని చేయని ప్రయత్నం ఉండదు. అయితే పిల్లల అల్లరి కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తప్పదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. అమెరికాలోని ప్రముఖ మేరీలాండ్ జూలో రెండు చింపాజీ పిల్లలు ఆటలాడుతూ కొట్టుకోగా తల్లి చింపాంజీ వచ్చి వారిని విడగొట్టింది. అటు,ఇటు పరుగెత్తుతుంటే.. తీసుకొచ్చి బుట్టలో పడేసింది. ఈ వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చింపాంజీల జీవితంలో శారీరక సంకర్షణలు అనేది అతి ముఖ్యమైనవి. పిల్ల చింపాంజీలైన లోలా, వైలెట్ తమదైన అల్లరి చేష్టలను ప్రదర్శించాయి. వాటి నేపుణ్యాన్ని ప్రదర్శించే క్రమంలో కొట్లాటకు దిగినప్పుడు తల్లి రావెన్ అప్పుడప్పుడు స్పందించి వాటిని సముదాయించింది’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పిల్ల చింపాజీల అల్లరి, వాటి కొట్లాట, తల్లి సముదాయించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. Physical interactions are a big part of life in a #chimpanzee troop. Chimp youngsters Lola and Violet are practicing their rough-and-tumble social skills with occasional refereeing from Violet's mom Raven. pic.twitter.com/pd9NSogwYp — Maryland Zoo (@marylandzoo) January 16, 2021 -
జూల్లోకి సందర్శకులకు అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన అటవీశాఖకు చెందిన అన్ని జంతుప్రదర్శన శాలలు, నగర వనాలు, ఎకో టూరిజం పార్కులను వెంటనే తెరవాలని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, కంబాలకొండలోని ఎకో టూరిజం పార్క్, రాష్ట్రంలోని నగరవనాలు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించిన నిబంధలనల మేరకు అటవీశాఖకు సంబంధించిన అన్ని పార్కులు, నగరవనాలు, ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని రాష్ట్రంలోని సర్కిల్ కేంద్రాల అధిపతులు, డిఎఫ్ఓలను ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో మూసివేసిన ఈ కేంద్రాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రాణుల మనసు వీరికి తెలుసు..
వన్యప్రాణులకు గాయమైతే వీరి గుండె చలిస్తుంది. అవి హుషారుగా ఎన్క్లోజర్లలో తిరిగితే వీరు పట్టరాని సంతోషంతో ఉంటారు. వాటి ఆకలి, కోపం, బాధ అన్నీ వీరికి తెలిసిపోతాయి. పగలంతా వాటితో గడిపే వీరికి ఇంటికెళ్లినా.. వాటి ధ్యాసే. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. వన్య ప్రాణులను తమ కన్న బిడ్డల్లా సాకుతూ.. వాటి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే జూ కీపర్లు. జంతువుల మనసెరిగి.. వాటి ఆలనాపాలన చూసుకుంటున్న యానిమల్ కీపర్ల దినోత్సవం ఈ రోజు.. ఆరిలోవ(విశాఖతూర్పు): జాతీయ రహదారి పక్కన 625 ఎకరాల విస్తీర్ణంలో 1972లో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. మొదట్లో ఇక్కడ 25 ఎన్క్లోజర్లు ఉండేవి. వాటిలో 100 వన్యప్రాణులు సందర్శకులను అలరించేవి. ఇప్పుడు జంతువుల సంఖ్య 880కు పైగా చేరింది. వాటి ఎన్క్లోజర్లు 65 ఉన్నాయి. పులులు, ఏనుగులు, సింహాలు, చిరుతలు, చింపాంజీలు, నీటి ఏనుగులు, జింకలు, జిరాఫీలు, ఖడ్గమృగం, కణుజులు, పాములు, మొసళ్లు, తాబేళ్లు, నెమళ్లు, ఆస్ట్రిచ్లు, హంసలు, వివిధ రకాల పక్షులున్నాయి. వాటి సంరక్షణకు సిబ్బంది, వైద్య సేవలందించడానికి ఆస్పత్రి, వైద్య సిబ్బంది, ఆహారశాల అన్నీ అందుబాటులో ఉన్నాయి. కన్న బిడ్డల్లా సాకుతూ.. జూ ఏర్పడిన తర్వాత జంతువులను సంరక్షించడానికి 25 మంది యానిమల్ కీపర్లుగా ఎన్.ఎం.ఆర్ విధానంలో ఉద్యోగాల్లో చేరారు. తర్వాత వారు శాశ్వత ఉద్యోగులుగా మారారు. వీరిలో 19 మంది ఉద్యోగ విరమణ చేయగా.. ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరికి సహాయకులుగా మరో ఏడుగురు ఉన్నారు. వీరంతా ఇక్కడ జంతువులు, పక్షులు, పాములకు స్నేహితులయ్యారు. దళపతి అని ఓ కీపర్ పిలవగానే నీటి ఏనుగు నోరు చాపుకుంటూ వస్తుంది. కృష్ణ అనగానే తొండం పైకెత్తి ఆశగా ఏనుగు చూస్తుంది. చీపా అంటే గెంతులేస్తూ చింపాంజీ అతని దగ్గరకు చేరుకుంటుంది. ఇలా జంతు సంరక్షకుల గొంతు వినగానే దగ్గరకు చేరిపోతుంటాయి. క్రూర మృగాలు కూడా వీరికి నేస్తాలుగా మారిపోయాయి. సమయానికి ఆహారం అందించడం, నైట్క్రాల్స్లో ఉన్న వాటికి ఉదయం స్నానం చేయించడం, ఆ తర్వాత వాటిని సందర్శకుల కోసం ఎన్క్లోజర్లలోకి విడిచిపెట్టడం, ఆ సమయంలో వాటి నైట్క్రాల్స్ను శుభ్రం చేయడం, అందులోని జంతువుల మలమూత్రాలను తొలగించడం వీరి విధులు. రోజంతా వన్యప్రాణులతో గడిపే వీరు.. ఇంటికి వెళ్లినా వీటి ధ్యాసలోనే ఉంటారంట. కన్న పిల్లల కంటే ప్రేమగా వీటిని చూసుకుంటామని వారు చెబుతున్నారు. ఇంటికెళ్లినా వాటి ధ్యాసే.. నేను 1993లో జూలో ఎన్.ఎం.ఆర్గా చేరాను. ప్రస్తుతం ప్రస్తుతం చింపాంజీలతో సావాసం చేస్తున్నాను. చింపాంజీలతో నేను మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. చీకో, చీపా అని పేర్లతో పిలవగానే అవి వస్తాయి. అయితే చింపాంజీలు మనిషి కంటే చాలా తెలివైనవి. ఎక్కువగా మారాం చేస్తాయి. వేళకు ఆహారం ఇవ్వకపోతే తలుపులు బద్దలు గొట్టేస్తాయి. గేట్లు విరగ్గొంటేందుకు చూస్తాయి. ఆ సమయంలో నేను ఏమి పెట్టినా తినవు. అందుకే సమయానికి భోజనం పెడతాను. వాటితో ఉన్న అనుబంధం వల్ల నేను ఇంటికి వెళ్లినా అవే గుర్తొస్తాయి. మొదట నేను అడవి కోళ్లు, కొంగలు, జింకలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ల వద్ద పనిచేశాను. – వై.అప్పారావు, యానిమల్ కీపర్ జూలో పులులకు పైపుతో స్నానం చేయిస్తున్న యానిమల్ కీపర్ (ఫైల్).. మన ప్రవర్తన బట్టే.. నేను 1980లో ఎన్.ఎం.ఆర్గా చేరాను. 1991లో పర్మినెంట్ అయింది. ఐదేళ్లుగా తెల్ల పులుల ఎన్క్లోజర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మన ప్రవర్తనను బట్టి జంతువులు మనతో సరదాగా ఉంటాయి. మనం కోపం, చిరాకుతో ఉంటే అవి గ్రహిస్తాయి. అలాంటప్పుడు అవి కూడా మన మీదకు దూకడానికి ప్రయతి్నస్తాయి. చిరుతలు, పెద్ద పులులు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. గతంలో రేచు కుక్కలు, పాంథర్, పెద్ద పులులు, ఆఫ్రికన్ పక్షులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద పనిచేశాను. రేచుకుక్కలు మాత్రం వాటి ఎన్క్లోజర్ను చెత్త చేస్తాయి. అన్ని వైపులా మూత్ర విసర్జన చేస్తాయి. – వై.రాంబాబు, యానిమల్ కీపర్ జూలో వేధిస్తున్న సిబ్బంది కొరత జూలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. వన్యప్రాణుల బాగోగులను చూసుకునే సంరక్షలు సరిపడినంతగా లేరు. జూలో ఉన్న జంతువులు, పక్షుల సంరక్షణ కోసం యానిమల్ కీపర్లను కొన్ని దశాబ్దాలుగా నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జూ ప్రారంభంలో 25 ఎన్క్లోజర్లలో సుమారు 100 వన్యప్రాణులను సంరక్షించడానికి 25 మంది సంరక్షకులను నియమించారు. ఇప్పుడు వాటి సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగింది. కానీ వాటి సంరక్షకుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఆరుగురు కీపర్లు, మరో 7 మంది వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు(కీపర్లకు సహాయకులు), మరో 35 మంది ఎన్ఎంఆర్లు ఉన్నారు. నిజానికి జూలో ఎన్క్లోజర్లు, వాటిలో ఉన్న సంఖ్య ప్రకారం సుమారు 212 మంది యానిమల్ కీపర్లు ఉండాలి. వీరిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తే.. వన్యప్రాణులకు మరింత సంరక్షణ ఉంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. -
అందరూ చూస్తుండగా జూ ఉద్యోగిని చంపిన పులి
జ్యూరిచ్: జూ ఉద్యోగినిపై పులి దాడి చేసి చంపేసిన ఘటన శనివారం స్విట్జర్లాండ్లో చోటు చేసుకుంది. జ్యూరిచ్ జూలో సైబీరియన్ జాతి పులి ఉంది. దాని ఎన్క్లోజర్లోకి ఓ మహిళా ఉద్యోగి ప్రవేశించింది. దీంతో అక్కడే ఉన్న పులి వెంటనే ఆమె మీద పడి దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పెద్ద ఎత్తున అరుపులు, కేకలు పెట్టడంతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దీంతో అప్రమత్తమైన ఇతర జూ అధికారులు వెంటనే ఎన్క్లోజర్ దగ్గరకు ప్రవేశించి పులి దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సహచర ఉద్యోగిని పులి చేతిలో ప్రాణాలు విడిచింది. దీంతో ఆదివారం నాడు జూను తాత్కాలికంగా మూసివేశారు. (గాయపడిన పులి జాడేది..?) ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. పులి మెలకువగా ఉన్న సమయంలో ఆమె ఎన్క్లోజర్లోకి ఎందుకు వెళ్లింది? అన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. కాగా 2015లో డెన్మార్క్లోని జంతుప్రదర్శనశాలలో జన్మించిన ఈ పులి పేరు ఐరినా. దీన్ని గతేడాది జ్యూరిచ్ జూకు తీసుకువచ్చారు. ఇక జూలోని జంతువులు మనుషులపై దాడికి దిగడం కొత్తేమీ కాదు. 2019లోనూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న మొసలి అక్కడి ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన ఉద్యోగి చేయి నోట కరిచింది. దాన్ని వదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మొసలిని కాల్చివేశారు. (మహిళపై సింహాల దాడి) -
మహిళపై సింహాల దాడి
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలో పని చేసే మహిళపై రెండు సింహాలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జూ ఆవరణను శుభ్రపరుస్తుండగా సింహాలు దాడి చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం... పారామెడిక్స్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యు) రాష్ట్రంలోని షోల్హావెన్ జూ లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి మూసివేశారు. ఈ నేపథ్యంలో జూ ఆవరణను బాధితురాలు శుభ్రం చేస్తుండగా సింహాలు ఆమెపై దాడి చేశాయి. ఇది గమనించిన ఇతర జూ సిబ్బంది సింహాలను గుహలోకి తరిమి ఆమెను రక్షించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో బాధితురాలి మెడ, తల భాగంలో గాయలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొంతకాలంగా జూలో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన జూలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా భయంకరమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జూ వద్ద హై అలర్ట్ ప్రకటించామని, ఘటనపై జూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పోలీసులు తెలిపారు. -
వాటిని చైనాకు పంపించేయనున్న కెనడా
ఒట్టావా: చైనాకు చెందిన రెండు పెద్ద పాండాలను ఆ దేశానికే తిరిగి పంపించేయనున్నట్లు కెనడా కల్గరి జంతు ప్రదర్శనశాల ప్రకటించింది. వాటికి ఆహారం సేకరించడం కష్టతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా కాల్గరీ జూ మార్చి 16న తాత్కాలికంగా మూసివేశారు. అందులో ఇతర జంతువులతోపాటు ఎర్ షన్, డామావో అనే రెండు పాండాలున్నాయి. ఇవి వెదురు చెట్లను ఆహారంగా తీసుకుంటాయి. సాధారణంగా చైనా నుంచి వెదురును తెప్పించి వాటికి ఆహారాన్ని అందించేవారు. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం) విమానాల రద్దుతో వెదురు రవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో జూ అధికారులు వెదురు కోసం ఇతర మార్గాలను అన్వేషించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అవి ఆకలితో అలమటిస్తూ చనిపోవడం ఇష్టం లేక వాటిని చైనాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ రెండు పాండాలు పది సంవత్సరాల షరతు మీద 2013లో చైనా నుంచి కెనడాకు తెప్పించారు. ముందుగా టొరంటో జంతు ప్రదర్శనశాలకు తరలించారు. అక్కడ ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత 2018లో వాటిని కాల్గరీ జూకు తరలించారు. అప్పుడు వాటికి పన్పన్, జియా యోయు అనే రెండు పిల్ల పాండాలు జన్మించాయి. వీటిని జనవరిలోనే చైనాకు తరలించారు. (మే 16 నుంచి 22 వరకు) -
ఆడతోడు కోసమేనా..?
సాక్షి, జన్నారం(మంచిర్యాల) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో అడవిప్రాంతంలోని వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత వాతావరం నెలకొంది. ప్రజలు లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమయ్యా రు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోగా అడవి ప్రాంతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవి డివిజన్లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్పల్లి అటవి రేంజ్లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వచ్ఛాయుత వాతావరణంలో విహరిస్తున్నాయి. గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. అడవి వదులకపోయిన స్వచ్ఛగా తిరుగుతున్నా యి. ఈక్రమంలో‘సాక్షి’ గురువారం జన్నా రం అటవిడివిజన్లో అధికారులతో డుగా పర్యటించగా పలుచిత్రాలు కనిపించాయి. పక్షుల సందడి... అడవిలో వన్యప్రాణులే కాకుండా రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, యూరేషియన్ వైజన్ పక్షి, గార్గానీడక్, కామన్టీల్ డక్, ఆసియన్ ఓపెన్బిల్, రెడ్ నాపెడ్ ఐపిస్ పక్షి, గ్రేహెరన్ పక్షి, బ్లాక్ వింజ్డ్ స్టిల్ట్ పక్షి, కామన్ స్టాండ్ పైపర్ పక్షి, పీఏడ్ కింగ్ ఫిషర్, క్రేస్టెడ్ ట్రీస్వీఫ్ట్, బ్లాక్ నెక్డ్, వుల్లి నెక్డ్ పక్షులు ఈ కవ్వాల్లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డును వదిలి అడవుల్లోకి... ప్రతి రోజు అడవి సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉంటూ వాహనదారులు వేసే పండ్లు, వేరుశనగా, మొక్కజొన్న కంకులు తదితర వాటిని కోతులు తింటూ ఉండేవి. అదే విధంగా ఇందన్పల్లి, చింతగూడ, పొనకల్ తదితర గ్రామాల్లో కోతులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవి. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోతులకు ఆహారం కరువైంది. దీంతో కోతులు ఊర్లను వదిలి అడవిబాట పట్టాయి. కోతులు ఒకసారి అడవి రుచి మరిగితే ఇక జనావాసాల్లోకి రావని, ఇది కొంత ఊరట నిచ్చే విషయమని అటవి అధికారులు చెబుతున్నారు. బెల్లంపల్లి: బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతున్న పులి గ్రామీణులతోపాటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పులి ఒక్కచోట ఉండదు. అలాంటిది ఐదురోజులుగా ఒకే ప్రాంతంలో ఉంటూ.. ప్రజల అలికిడి ఉన్నప్పటికీ అదరకుండా తిరుగుతుండడంతో ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా..? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అనేది అంతుచిక్కడం లేదు. చెర్లపల్లి శివారులో అడుగుపెట్టగానే ఓ గేదెను హతమార్చిన పులి రోజువారీ కదలికలు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్యస్తమయం కాకముందే.. దర్జాగా తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తోంది. దీంతో పులిని కాపాడుకునేందుకు అటవీ అధికారులు నానాయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు, నాలుగు బేస్క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చకుండా, అటువైపు జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. యవ్వన దశలో పులి.. మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగపులి యవ్వన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వయసు నాలుగేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కండపుష్టి కలిగి.. బలిష్టంగా ఉన్న పులి కదలికలను సీసీ కెమెరాల్లో బంధిస్తున్న అధికారులు.. ఆడతోడు కోసం ఆరాటపడుతున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. బెల్లంపల్లి పులితో ఆ సంఖ్య ఐదుకు చేరిందని చెబుతున్నారు. వీటన్నింటిలోనూ ఈ పులి వయస్సే తక్కువని పేర్కొంటున్నారు. జోడుకోసం వెంపర్లాడుతున్న ఈ పులి కొద్దిరోజులపాటు ఇదే ప్రాంతంలో ఉంటుందా..? లేక తోడు వెదుక్కుంటూ మరో ప్రాంతానికి వెళ్తుందా.. తేలాల్సి ఉంది. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి తాండూర్: మండలంలో పులి హడలెత్తిస్తోంది. బుధవారం రాత్రి గోలేటి వన్ ఇంక్లైన్ గని హోటల్ వెనకాలలోని అటవీ ప్రాంతంలో, రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన కోటేష్కు చెందిన ఎద్దును హతమార్చింది. ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గోలేటి వన్ ఇంక్లైన్ గని నుంచి బీపీఏ ఓసీ –2 మధ్యలో పులి సంచారం చేస్తున్నట్లు చూపరులు చెబుతుండగా, అర్ధరాత్రి అచ్చులాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రెండు పులులు తిరుగుతున్నాయా.? ఒకే పులినా అనేది అటవీ అధికారులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. -
4 పులులు, 3 సింహాలకు కరోనా పాజిటివ్
న్యూయార్క్ : నగరంలోని బ్రాంక్స్ జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా వైరస్ సోకింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జూ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూ టైగర్ మౌంటైన్లో ఉంటున్న మూడు పులులకు, మరో మూడు ఆఫ్రికన్ సింహాలకు పొడి దగ్గుతో కూడిన లక్షణాలు కనిపించాయని, ఓ పులికి మాత్రం లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే వాటికి ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వలేదని, మల పరీక్ష ద్వారా కరోనాను పరీక్షించామని తెలిపారు. ( ఒకే నెలలో 2.6 కోట్ల ఉద్యోగాలు మాయం ) మల పరీక్ష ద్వారా తమ అనుమానం నిజమైందని, జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు. కాగా, గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. నదియా కరోనా సోకిన తొలి పులి కావటం గమనార్హం. ( కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ ) -
మరో 6 పులులకు కరోనా లక్షణాలు?!
అల్బానీ: న్యూయార్క్లోని బ్రాంక్జ్ జూలో నాలుగేళ్ల మలయన్ పులి నాదియా(పెద్ద పులి)కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కరోనా బారిన పడిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్కాలే ఆదివారం ప్రకటించారు. తాజాగా జూలోని మరో 6 పెద్ద పులులు పోడి దగ్గుతో బాధపడుతున్నట్లు సోమవారం వెల్లడించారు. వాటికి రోగనిరోధక శక్తి మందులు ఇస్తున్నామని, ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనిపై కాలే మాట్లాడుతూ.. ‘ఈ పులులను చూసుకునే సంరక్షకుల ద్వారా కొద్ది మోతాదులో టీఎల్సీ, కొన్ని రోగనిరోధక మందులు ఇస్తున్నాము. ప్రస్తుతం ఆ పులుల ఆరోగ్యం మెరుగుపుడుతుంది. అంతేగాక స్వల్ప అనారోగ్యంతో ఉన్న జూలోని మరో 4 పులులకు, 3 సింహాలకు కూడా రోగ నిరోధక ఔషధాలు ఇస్తున్నాము’ అని చెప్పారు. (అమెరికాలో పులికీ కరోనా!) కాగా ‘నాదియా మార్చి మధ్యలో అనారోగ్య బారిన పడింది. ఇక మార్చి 27 నుంచి కరోనా లక్షణాలు దానిలో కనిపించడంతో కోవిడ్-19 పరీక్షలు చేయించాం. ఇందుకోసం నాదియా కాలేయం, ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసనాళాల నుంచి వచ్చే కార్నెల్లను పరీక్షల నిమిత్తం న్యూయార్క్ పశువైద్యశాల యూనివర్శిటీకి పంపించాం. ఆ పరీక్షల్లో నాదియాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం దానినిను ఐసోలేషన్లో ఉంచాం. అయితే నాదియా ఇప్పుడు ఆహారం తీసుకోవడం మానేసింది’ అని పాల్కాలే అన్నారు. అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా హాంకాంగ్లోని కొన్ని జంతువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని వాటికి కూడా కరోనా పరీక్షలు జరిగాయని చెప్పారు. వాటికి కరోనా సోకిందా, లేదా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. (కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం) -
పులిరాజాకు కరోనా
-
అమెరికాలో పులికీ కరోనా!
న్యూయార్క్: ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు జంతువులకూ సోకడం మొదలైంది. పిల్లి జాతి జంతువుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన నేపథ్యంలో న్యూయార్క్లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్ బారిన పడింది. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని అంచనా. హాంకాంగ్లో ఇప్పటికే రెండు కుక్కలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. -
జంతువులకు కరోనా సోకకుండా చర్యలు
సాక్షి, విజయవాడ: జంతువులు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్) ప్రతీప్ కుమార్ సూచించారు. ఈమేరకు అన్ని జూలలోని జంతువుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా అమెరికాలో ఓ పులికి మనిషి ద్వారా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం, కేంద్ర అటవీశాఖ.. జూల సంరక్షణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రతీప్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిపై వన్యప్రాణుల విషయంలోనూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ జూ అథారిటీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శన శాలల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని జూలలో ఉండే వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జంతువులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా ఇరవై నాలుగు గంటలు వాటి కదలికలు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వాటి రక్త నమూనాలను సేకరించి, యానిమల్ హెల్త్ ఇస్టిట్యూట్కు పంపి.. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందిస్తామని అధికారి తెలిపారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్) -
అమెరికా జూలో పులికి కరోనా
-
కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్
న్యూయార్క్ : ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న ముఖ్యంగా అమెరికాను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని ఇప్పటివరకు భావిస్తున్న తరుణంలో మొదటి సారి జంతువులకు సోకడం మరింత ఆందోళన రేపుతోంది. న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లోని నదియా అనే ఆడపులి (4) ఈ వైరస్ బారిన పడింది. పొడిదగ్గు రావడంతో అప్రమత్తమైన జూ అధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు నదియా మరో ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ఇది తనను షాక్ కు గురి చేసిందని, నమ్మలేక పోతున్నానని జూ డైరెక్టర్ జిమ్ బ్రెహనీ అన్నారు. నదియాకు మార్చి 27న కోవిడ్ -19 లక్షణాలు ప్రారంభమయ్యాయనీ, ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నాయని త్వరలోనే కోలుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రోజూ వీటి బాగోగులు చూసే ఉద్యోగి ద్వారా ఈ వైరస్ సోకినట్టుగా వైల్డ్ లైఫ్ సొసైటీ అధికారులు భావిస్తున్నారు. ఇన్ఫెక్షన్లకు వివిధ జాతులకు చెందిన జంతువులు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతాయని, కానీ ఈ క్రూర జంతువులకు ఈ మహమ్మారి ఎలా సోకిందో తెలియడంలేదని ఈ జూ నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు కరోనావైరస్ తో బాధపడుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ జంతువులకు దూరంగా ఉండాలని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ , ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు సిఫారసు చేశారు. తాజా ఘటనతో జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పెంపుడు జంతువులను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. వివిధ జంతు జాతుల సెన్సిబిలిటీని అర్థం చేసుకోవడానికికొంతమంది పరిశోధకులు ప్రయత్నిస్తున్నారనీ, అలాగే జూలలో ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంస్థ తెలిపింది. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, పెంపుడు జంతువుల యజమానుల నుంచి వాటికి సోకే అవకాశం వుందని జంతు నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కాగా న్యూయార్క్ లో అంతకంతకూ పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా మార్చి 16 నుంచి ఈ జూను మూసివేశారు. చదవండి : లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
జంతు ప్రదర్శనశాలలు, పర్యాటక కేంద్రాలు మూసివేత
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఎకో టూరిజం కేంద్రాలు, అటవీ పర్యాటక కేంద్రాలు, పార్కులు, టెంపుల్ ఎకో పార్కులు, నగర వనాలు, జంతు ప్రదర్శనశాలలను శుక్రవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ప్రతీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాలకు రోజూ భారీగా సందర్శకులు వస్తున్నారని, వీటిని కొనసాగిస్తే కోవిడ్ ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల తక్షణమే వీటిని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల అధికారులకు ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
విశాఖ జూకి రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జూ లోకి రాయల్ బెంగాల్ టైగర్ ప్రవేశించింది. బిలాస్పూర్ జూ నుంచి ఆడ రాయల్ బెంగాల్ టైగర్ రైలులో గురువారం విశాఖ జూ కి చేరుకుంది. అనంతరం జూ క్యూరేటర్ యశోద బాయి పులిని పరిశీలించారు. ఏడాది వయస్సున్న ఆడ పులికి జూ అధికారులు దుర్గగా నామకరణం చేశారు. ఆడపులికి విశాఖ జూ పూర్తిగా కొత్తది కావటంతో అలవాటు పడటానికి ప్రత్యేక రక్షణలో ఉంచారు. ఆడ పులిని పంపినందుకు బదులుగా రెండు జతల నక్షత్ర తాబేళ్లను విశాఖ జూ అధికారులు బిలాస్పూర్ జూకు పంపారు. -
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
జూలో కలకలం
ఆరిలోవ(విశాఖతూర్పు): ఓ వైపు సందర్శకుల కిటకిట.. అంతలోనే అలజడి.. దీంతో ఒక్కసారిగా జూ పార్కులో కలకలం రేగింది. జూలో బంధించి ఉన్న కృష్ణ పరుగులెత్తింది..జూ అధికారులను, సిబ్బందిని, సందర్శకులను ఆందోళనకు గురిచేసింది. కృష్ణ అనే 34 ఏళ్ల మగ ఏనుగు ఆదివారం హడావుడి చేసింది. అధికారుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇదీ పరిస్థితి : ఇది ఇక్కడ మావాటి వారి మాట కూడా వినదు. తోటి ఏనుగుల మీద సైతం దాడిచేస్తుంది. దీంతో సుమారు 10 ఏళ్లగా కృష్ణను జూ సిబ్బంది ఇనుప సంకెళ్లతో కట్టి ఏనుగుల మోటోలో సందర్శకులకు దూరంగా ఉంచారు. ఏనుగులు సాధారణంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో శృంగార తాపానికి గురవుతుంటాయని యానిమల్ కీపర్లు అంటున్నారు. ఇక్కడ ఉన్న నాలుగు ఏనుగుల్లో మిగిలిన మూడింటిని దాని నుంచి వేరుచేసి దూరంగా ఉంచుతున్నారు. దీంతో తోడులేని ఆ ఏనుగు కకావికలమై దాని కాళ్లకు కట్టిన ఇనుప సంకెళ్లను సైతం తెంపేసింది. మోటో నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేసింది. ఎత్తైన గోడలు, మోటు లోపల గోడలను ఆనుకొని ట్రంచ్ తవ్వి ఉండటంతో బయటకు రాలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయం మోటులో పరుగులు పెడుతూ గీంకరిస్తూ సిబ్బందిని ఆటాడించింది. దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది నానా హైరానా పడ్డారు. ఓ దశలో జూ అధికారులు దీన్ని ఎలా కట్టడిచేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మత్తిచ్చి పట్టుకోవడానికి కూడా ఆలోచన చేశారు. ఎట్టకేలకు చాకచక్యంతో సిబ్బంది ఇనుప గొలుసులు, తాళ్లతో బందించి పట్టుకొన్నారు. దీంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. కృష్ణ హడావుడి చేసిన వెంటనే సందర్శకులను అటుగా వెళ్లకుండా జూ సిబ్బంది జాగ్రతపడ్డారు. ఏనుగు బయటకు వచ్చేసిందంటూ టికెట్లు కొన్నవారు కూడా తిరుగుముఖం పట్టారు. గతంలో శాంతి హడావుడి : సుమారు 13 ఏళ్ల కిందట వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన శాంతి అనే ఆడ ఏనుగు ఇదే మాదిరిగా చిందులేసింది. మోటు బయట పరుగులెడుతూ అప్పటి జూ అధికారులను బెంబేలిత్తించింది. లారీ నుంచి దించుతుండగా ఇక్కడ మోటులోకి వెళ్లకుండా బయటకు పరుగులు తీసింది. -
జంతువులకు సౌకర్యాలు కల్పించాలి
చిత్తూరు, తిరుపతి అర్బన్: జంతువులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, అవి బక్కచిక్కితే ఊరుకునేది లేదని వైల్డ్లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్), అండ్ వార్డెన్ డి.నళినిమోహన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తిరుపతి ఎస్వీ జూపార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న జంతువులు, పక్షులు, వృక్షాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింహాలు, పులుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేయడమేగాక అందులో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. మెను ప్రకారం జంతువులు, పక్షులకు ఆహారం అందజేయాలని ఆదేశించారు. వాటి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. తిరుపతి జూపార్కు ప్రధానమైందని, వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్శకుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాది రోజున బైక్లకు అనుమతివ్వడంతో సందర్శకుల సంఖ్య పెరిగిన విషయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవనన్, ఏసీఎఫ్ ధనరాజ్, డీఎఫ్ఓ శైలజ, జూపార్కు క్యూరేటర్ బబిత పాల్గొన్నారు. -
వైరల్: ఇక నుంచి పులిరాజాకు చలిపెట్టదు
కాస్త చలి పెడితే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడూ బయటే తిరుగాడే మూగ జంతువులకు చలి పెట్టదా అంటే పెడుతుంది. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయి. మరి జూలో ఉండే జంతువుల మాటేమిటి? అవి ఎలాంటి చలిలోనైనా వణుకుతూ బాధపడాల్సిందేనా అనిపించక మానదు. కానీ అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా సరిగ్గా ఈ ప్రశ్నే తట్టింది. వాటి కోసం ఏదైనా చేయాలని భావించిన అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ అధికారులకు చక్కని ఐడియా తట్టింది. బోనులో ఉన్న పులుల, సింహాలు వెచ్చదనాన్ని అనుభూతి చెందేందుకు ఎన్క్లోజర్ వెలుపల హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే అన్ని జంతువులకు హీటర్ అంత మంచిది కాదు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. పాపం.. మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. జంతువులను బంధించకుండా వదిలేస్తే అయిపోయేది కదా అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పిల్లోడిపై దూకేందుకు ప్రయత్నించిన పులి
-
జస్ట్ మిస్; లేకపోతే పులికి ఆహారం అయ్యేవాడే!
పులితో పరాచకాలొద్దు.. పులితో ఆట నాతో వేట మొదలెట్టొద్దు వంటి పాపులర్ పంచ్ డైలాగులు మీకు గుర్తుండే ఉంటాయి. కానీ ఇక్కడ పులికి ఎవరూ ఎదురెళ్లకపోయినా.. పులే నేరుగా వచ్చి పలకరించినంత పని చేసిందంటే నమ్మండి. ఐర్లాండ్లోని ఓ కుటుంబం సరదాగా జంతు ప్రదర్శనశాలకు వెళ్లింది. అక్కడ వారి కుమారిడిని ఫొటో దించడానికి వాళ్లు ప్రయత్నించారు. ఇంతలో ఓ పులి ఆ బుడ్డోడిని చూసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని వైపుగా వస్తోంది. దీంతో పిల్లోడు వెనక్కి తిరిగి చూడగా పులి కనిపించింది. అయినా అదేమీ పట్టనట్టు ఫొటోకు పోజిస్తుండగా ఆ పులి ఒక్క ఉదుటున బాలుడిని సమీపించి అతడిపై దాడి చేయబోయింది. కానీ అక్కడ గాజుగ్లాస్ అడ్డుగా ఉండటంతో పులి దాన్ని దాటి లోనికి రాలేకపోయింది. ఈ భయంకర వీడియో చూసిన నెటిజన్లు బాలుడికి పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. ‘అక్కడ ఆ గాజుగ్లాస్ లేకపోయుంటే నా కొడుకు జూలో పులికి ఆహారం అయ్యేవాడు’ అని బాలుడి తండ్రి పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను దాదాపు 2 మిలియన్ల మంది వీక్షించారు. బాలుడికి ఈ వీడియో తీపి గుర్తుగా మిగిలిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘వేటాడటం అనే సహజ గుణాన్ని అణచివేసి పులిని జూలో బందీ చేశారు’ అని మరికొందరు ఆ జంతువు పట్ల జాలిని ప్రదర్శించారు. ఇక అదేజూలో మరో పులి కూడా అద్దానికి ఆనుకుని ఫొటో దిగుతున్న పిల్లలపైకి దూకేందుకు ప్రయత్నించింది. -
పాతబస్తీలో ప్రైవేట్ ‘జూ’లు!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో జూ ఎక్కడ? అంటే.. బహదూర్పురాలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కు అని ఠక్కున చెబుతారు. అయితే, ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్ జూ’లు కూడా నడుస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు వన్యప్రాణులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. జనాల్లో ఉన్న మూఢ నమ్మకాలు, ఫ్యాషన్, మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ జూలు ఇలా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వరుసగా చిక్కుతున్న జంతువులు ఈ వన్యప్రాణుల దందా పాతబస్తీ కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివారు జిల్లాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ జంతువుల్ని అక్రమంగా తీసుకువస్తున్నారు. అక్కడి వేటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అక్రమ వ్యాపారులు వీటిని సమీకరిస్తున్నారు. ఆపై బోనుల్లో బంధించి రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు. రహదారుల్లో ఉంటున్న చెక్పోస్టులు, అటవీ శాఖ తనిఖీ కేంద్రాలనూ వీరు దాటి వచ్చేస్తున్నారంటే మామూళ్ల మత్తులో ఆ సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత తమ ఇళ్లు, ఫామ్హౌస్లు, దుకాణాల్లో ఈ జంతువుల్ని కొంతకాలం పెంచి ఆపై అసలు ‘పని’ ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడే ప్రధాన కారణాలు ఇతర ప్రాంతాల నుంచి సిటీకి గుట్టుగా, వ్యవస్తీకృతంగా ఈ వన్యప్రాణుల అక్రమ దందా సాగడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీకి చెందిన వారి కుటుంబీకులు అనేక మంది దుబాయ్ వంటి దేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారు తరచు అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఆయా దేశాల్లో పులులతో సహా కొన్ని వన్యప్రాణుల్ని ఇళ్లల్లో పెంచుకోవడం సరదా. అక్కడిలాగే ఇక్కడా వన్యప్రాణులను పెంచాలని కొందరు ప్రయతి్నస్తున్నారు. మరికొందరికి ఈ తరహా వన్యప్రాణుల్ని పెంచుకుంటే, సజీవంగా పాతిపెడితే, నిరీ్ణత రోజుల్లో బలి ఇస్తే అదృష్టం వరిస్తుందనే మూఢనమ్మకం ఉంది. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వీటితో పాటు కొన్ని జంతువుల మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వన్యప్రాణుల అక్రమ రవాణా య«థేచ్ఛగా సాగుతోందని పోలీసులు వివరిస్తున్నారు. ‘అంతర్జాతీయ’ ప్రమేయంపై అనుమానాలు వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం సైతం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన వన్యప్రాణుల్లో నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని పాతబస్తీతో పాటు శివార్లలోని ఫామ్హౌస్ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలించేస్తున్నారని భావిస్తున్నారు. ఈ కోణంలో అటవీ, కస్టమ్స్ అధికారులతో కలిసి ఆరా తీయాలని నిర్ణయించారు. ఈ దందా చేస్తున్న వాళ్లంతా ఏళ్లుగా పక్షులు, కుందేళ్లను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, వేటగాళ్లు, ఇతర వ్యాపారులతో ఏర్పడిన పరిచయాల నేపథ్యంలో వీరంతా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలోకి దిగారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేయాలని నిర్ణయించారు. స్మగ్లింగ్కు ఉదాహరణలు.. పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లులు ఐదింటిని బీహార్ అడవుల్లో పట్టుకున్నారు. వీటిని కారులో ప్రత్యేకంగా రూపొందించిన బోనుల్లో సిటీకి తీసుకువస్తూ 2017 జనవరిలో మీర్జాపూర్ ప్రాంతంలో అక్కడి అటవీ శాఖ అధికారులకు దొరికారు. పాతబస్తీలోని బార్కస్కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్లు ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే నాలుగు స్లోలోరిస్లు, ఓ స్టార్ తాబేలు, మరో మొత్తడి డొప్ప తాబేలును విక్రయానికి ప్రయతి్నంచారు. ఓ నిందితుడిని ఈ నెల 17న దక్షిణ మండల టాస్్కఫోర్స్ పట్టుకుంది. వనసర్తి జిల్లా పెబ్చేర్లోని కృష్ణా నది ఒడ్డున పట్టుకున్న కృష్ణ జంకను బహ దూర్పురాలోని కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అన్వర్ అలీ, మహ్మద్ జావేద్ సిటీకి తీసుకొచ్చారు. కేజీ రూ.3 వేల చొప్పున దీని మాంసం విక్రయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ వీరికి చెక్ చెప్పింది. -
పర్యటనకు వెళ్తే.. పరుగులు పెట్టించింది
బెంగళూరు: సరదాగా పర్యటించడానికి పార్కుకు వెళ్లిన వారికి ఒక్కసారిగి మృత్యువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దాంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు. మృగరాజు పర్యటనకు వచ్చి వారిని వెంటాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు. కానీ సింహం వేగంగా సఫారివైపు దూసుకువస్తుండటంతో మృత్యు దేవతే తమను తరుముతున్నట్లు భయంతో వణికిపోయారు. వెంటనే సఫారి వేగాన్ని పెంచి ముందుకు దూకించారు. కానీ మృగరాజు మాత్రం కొద్ది దూరం పాటు ఆ సఫారిని వెంబడించి.. ఆ తర్వాత దాని వేగాన్ని అందుకోలేక ఆగిపోయింది. దాంతో సఫారిలో ఉన్నవారిగా ఒక్కసారిగా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు సింహం పర్యటకుల వాహనాన్ని ఎందుకు వెంబడించిందనేది మాత్రం తెలియలేదు. మూడు రోజుల క్రితం యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షలో వ్యూస్, కామెంట్స్ సంపాదించింది. -
సఫారిని వెంబడించిన సింహం
-
జూపార్క్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం -మంత్రి
విశాఖపట్నం : విశాఖ ఇందిరా గాంధీ జూపార్క్ లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. రూ. 70 లక్షల నిధులతో అభివృద్ది చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంఖుస్థాపన చేశారు. మంగుళూరు నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్శకులు చూడడానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో సీఎంతో మాట్లాడి జూపార్క్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలో కోటి మొక్కలు నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ జూ కి ఓ ప్రత్యేకత ఉంది. 625 ఎకరాలలో సహజ సిద్దంగా ఏర్పడిన జూ ఇది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలో విశాఖ జూని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎఫ్ రాహుల్పాండే, ఇంచార్జి కలెక్టర్ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు, జూ క్యూరేటర్ యశోద బాయి తదితరులు పాల్గొన్నారు. -
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
-
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
ఎవరైనా జూపార్కుకు వెళితే.. అక్కడి జంతువులను చూసి.. వాటితో కాసేపు సరదాగా గడిపి వస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో జూపార్కులో హల్చల్ చేశాడు. జిరాఫీ ఉన్న బోను దగ్గరికి వెళ్లి.. అది ఫెన్సింగ్ సమీపంలోకి రాగానే.. అమాంతం దానిపైకెక్కి కూర్చొని.. కాసేపు అటు-ఇటు స్వారీ చేశాడు. మొదటిసారి జిరాఫీ కొంచెం మృదువుగా వ్యవహరించి.. అతన్ని కిందికి విదిలించింది. అయినా, తాగిన మైకంలో ఉన్న సదరు వ్యక్తికి జిరాఫీపై మీద ఊరేగాలన్నా కోరిక తీరలేదేమో.. ఫెన్సింగ్ సాయంతో మరోసారి ఇదే దుస్సాహసానికి అతడు ఒడిగట్టాడు. జిరాఫీ మీద కూర్చొని.. స్వారీ చేయాలని చూశాడు. ఈసారి జిరాఫీ సదరు వ్యక్తిని గట్టిగా విదిలించి దభేల్న పడేలా చేసింది. దెబ్బకు మైకం నుంచి తేరుకున్న ఆ ఆకతాయి.. బతుకు జీవుడా అనుకుంటూ.. ఫెన్సింగ్ను ఎక్కి అక్కడినుంచి బయటపడ్డారు. ఒకింత సరదాగా, మరొకింత వికృతంగా ఉన్న ఈ ఘటన కజకిస్థాన్లోని స్కైమెట్ జూలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జూలో జిరాఫీపై స్వారీ చేసేందుకు ప్రయత్నించి.. ఆకతాయి కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదరు దుండగుడిని పట్టుకొని తగిన శాస్తి చేసేందుకు ఇటు జూ అధికారులూ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. -
ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి
అదొక జంతు ప్రదర్శనశాల. అక్కడ ఒకే బోనులో ఓ పులి, మేక కలిసి ఉంటున్నాయి. ఈ విచిత్రాన్ని చూడడానికి రోజూ ప్రజలు అక్కడికి వచ్చేవారు. పులి నిద్రపోతున్నప్పుడు దాని పొట్టకు ఆనుకుని ఓ మేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్న దృశ్యం చూసిన వారికి ఆశ్చర్యంగా ఉండేది. ఓ మహిళ ఇది చూసి ఆశ్చర్యంతో ఆ ప్రదర్శనశాల నిర్వాహకులలోని ఓ ప్రతినిధితో ‘‘ఇదెలా సాధ్యమైంది?’’ అని ఎంతో ఆసక్తితో అడిగింది. ఆరోజే ఆ ప్రతినిధి విధుల నుంచి రిటైర్ అవుతున్న రోజు. ఆయన ఆ మహిళతో నెమ్మదిగా చెప్పాడిలా... ‘‘ఇందులో రహస్యమేమీ లేదు. రోజూ ఓ మేకను మారుస్తుంటాం. ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి’’ అన్నాడతను. పులి ఇతర జంతువులను చంపి తినే క్రూరమృగమే. కాదనను. కానీ అది ఆకలి వేసినప్పుడు మాత్రమే తనకు అవసరమైన మేరకు మరొక జంతువును చంపుతుంది. ఆకలి తీరిపోతే అది మహాసాధువవుతుంది. ఇంకేదీ పట్టించుకోదు. ఎవరి మీదా దాడికి పూనుకోదు. కానీ మనిషే కారణం లేకున్నా సరే ఇతరులను నాశనం చేసే గుణం కలిగి ఉంటాడు. ఓ అణుబాంబుతో వేలాది మందిని హతమార్చగలడు. హిట్లర్ వంటి మనుషులే లక్షల మంది మరణానికి కారకులయ్యారు. అలాటి వారు ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరు. – యామిజాల జగదీశ్ -
యాంగ్ యాంగ్ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..
బీజింగ్ : 12 ఏళ్లుగా బోనులో బందీగా ఉన్న ఓ చింపాంజీకి విముక్తి లభించింది. ఇంకేముంది.. తనదైన రీతిలో పరుగులు తీసింది. తన దారికి అడ్డువచ్చిన వారిని ఎగిరెగిరి తన్నింది. ఇక తనను ఆపేవారే లేరనుకొని పార్క్లో పరుగెడుతూ హల్చల్ చేసింది. చివరకు మళ్లీ అదే బోనులోకి వెళ్లి బిక్కమొఖం వేసింది. ఈ ఘటన చైనాలోని హెఫీ వైల్డ్లైఫ్ పార్క్లో గత శుక్రవారం చోటు చేసుకుంది. హెఫీ వైల్డ్లైఫ్ పార్క్లో ఓ రేకుల షెడ్డూలో ఉన్న 12 ఏళ్ల యాంగ్ యాంగ్ అనే చింపాంజీ షెడ్డును పగులగొట్టి అక్కడ ఉన్న వెదురు బొంగుల ద్వారా బయటపడింది. అక్కడ నుంచి పరుగులు తీస్తూ జూలో ఉన్న సందర్శకులపై దాడి చేయబోయింది. అడ్డుకున్న జూ సిబ్బందిని ఎగిరితన్నింది. దీంతో కొద్దిసేపు జూలో గందరగోళ వాతావరణం నెలకొంది. తమపై చింపాంజీ ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందోనని సందర్శకులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. జూ సిబ్బందితో కలిసి పోలీసులు చాకచక్యంగా యాంగ్ యాంగ్ను పట్టుకుని తిరిగి బోనులో పెట్టారు. దీంతో సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘బెంగాల్ టైగర్’ వారసులొచ్చాయి
ఆస్ట్రియా: కాకుల కావ్కావ్లు కానరావట్లేదు. కోకిల కిలకిలలు తగ్గిపోయాయి. పాలపిట్ట జాడైనా తెలియరావట్లేదు. పక్షులే కాదు జంతువులూ ఈ కోవలోకే వస్తున్నాయి. మనిషి తన స్వార్థానికి చేస్తున్న విధ్వంస రచన వల్ల అనేక జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఎన్నో జంతువులు ఇప్పటికే అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరాయి. అందులో ‘బెంగాల్ టైగర్’ మొదటి స్థానంలో ఉంది. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి భారత్తో పాటు ఇతర దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రియాలోని కెర్నాఫ్ జూ సంరక్షణలో ఉన్న పదమూడేళ్ల ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకొస్తున్న జూ సిబ్బంది పులిపిల్లలు పుట్టిన నెలన్నర తర్వాత వాటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. జూ అధికారి రేయినర్ ఎడర్ మాట్లాడుతూ.. పదమూడేళ్ల ముసలి వయసులో ఒక పులి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం తమకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందన్నారు. పుట్టినప్పుడు అవి ఒక్కోటి కిలో బరువు ఉండగా ఇప్పుడు దాదాపు నాలుగు కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హెక్టార్, పాషా, జీయస్ అని వాటికి నామకరణం కూడా చేశారు. ఈ జూలో ఇప్పుడు పులిపిల్లలు వచ్చి చేరడంతో జూకి కొత్త అందం వచ్చినట్టయింది. దీంతో కెర్నాఫ్ జూ మంచి టూరిస్ట్ స్పాట్గా మారింది. ఒక ఏడాది తర్వాత ఈ పిల్లలను వేరే జూకి దత్తత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. భారతదేశంలో ఎక్కువగా ఉండే ఈ జాతి పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2500కు పడిపోయిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ అనే వెబ్సైట అంచనా వేసింది. మరోవైపు ఈ పులిపిల్లలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసి ముచ్చట పడిపోతున్న జంతు ప్రేమికులు ‘బెంగాల్ టైగర్ వారసులొచ్చాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జూపార్క్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని జూపార్కుతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జూపార్కుల్లో సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సోమవారం జూపార్క్లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో తెలంగాణలోని ఎనిమిది జూలు, పార్కుల తీరుతెన్నులను ఆయన సమీక్షించారు. టెక్ మహీంద్రా కంపెనీ సామాజిక బాధ్యత కింద రూ.కోటితో జూపార్క్ ఎంట్రీ గేట్ పునరాకృతి, ఫుడ్కోర్టు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాగా బోర్డు దానికి అనుమతినిచ్చింది. రోజురోజుకూ జూకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2020–2040 పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, జూ పార్కుల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బర్, ఓఎస్డీ శంకరన్, జూపార్క్ క్యూరేటర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు. జూపార్కుకు అదనపు ఆకర్షణలు.. నగరంలోని జూపార్కు అదనపు ఆకర్షణలతో సందర్శకులను మరింతగా అలరించనుందని ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సోమవారం నెహ్రూ పార్క్లో ఆఫ్రికన్ సింహం, దాని రెండు కూనలు, ఆస్ట్రిచ్ పక్షులు, స్టార్క్ ఎన్క్లోజర్స్, డక్ ఫాండ్ వాక్ త్రూ ఇవరీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర అమరావతి యూనివర్సిటీకి చెందిన గడ్డి శాస్త్ర పరిశోధకుడు డా.మురాత్కర్ను మంత్రి సన్మానించారు. -
గుజరాత్ గుప్పెట్లో ‘జూ’ కార్లు
తిరుపతి సిటీ: శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలోని బ్యాటరీ కార్ల నిర్వహణను గుజరాత్ కంపెనీ చేపట్టింది. ఈ మేరకు ‘సేవ్ ఈ’ ఎలక్ట్రికల్ కంపెనీతో జూ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 12 మంది డ్రైవర్లు ఇకపై గుజరాత్ కంపెనీ నేతృత్వంలో పని చేయాలని జూ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. జూలో పనిచేసే ఓ అధికారి గుజరాత్ కంపెనీ తో చేతులు కలిపి బ్యాటరీ కార్ల ద్వారా వచ్చే ఆదాయంలో కాంట్రాక్టర్కు 60 శాతం, జూకు 40 శాతం చొప్పున కేటాయింపులు చేస్తూ ఒప్పందం చేసుకున్నారు. మూలనపడ్డ బ్యాటరీ వాహనాలు జూలో సందర్శకులకు సౌకర్యంగా ఉన్న బ్యాటరీ కార్లు 15 మరమ్మతులకు గురి కావడంతో ఏడాదికి పైగా మూలన పడేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్కు చెందిన ‘సేవ్ ఈ’ కంపెనీతో 30 బ్యాటరీ వాహనాలు జూ కు తీసుకొచ్చే విధంగా గత ఏడాది జూలైలోనే ఒప్పందం చేసుకున్నారు. మొదటి విడతగా 5 బ్యాటరీ వాహనాలు తెప్పించారు. అయితే ఆ వాహనాలు తెచ్చిన కొద్ది నెలలకే మరమ్మతులకు గురయ్యాయి. కంపెనీకి చెందిన వాహనాలు నాసికరంగా ఉండటం వల్లే సందర్శకులు కూర్చుని తిరిగేటప్పుడు వాహనాలకు ఉన్న విడిభాగాలు ఊడి పడిపోతున్నా యని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో జూలో ఉన్న వాహనాలకు మరమ్మతులు చేయిస్తే బాగా నడుస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. కానీ లక్షలాది రూపాయలు విలువ చేసే వాటిని మూలన పడేసి ఎక్కడో గుజరాత్లో ఉన్న కాంట్రాక్టర్కు ఆదాయం సమకూర్చిపెట్టడం వెనుక మతలబు ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నో అని.. ఇప్పుడు ఓకే అని.. ఇక్కడ మరో విశేషమేంటంటే 7వ జూ అథారిటీ ఆఫ్ ఏపీ అధికారుల సమావేశంలో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయలేమని, అంత బడ్జెట్ పెట్టలేమని సేవ్ ఈ సంస్థ ప్రతినిధులు జూ అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. జూ అధికారులకు అవసరమైతే తమ కంపెనీ తరపున ఈఎంఐ పద్ధతిలో ఒక్కొక్క వాహనం రూ.3లక్షల 50 వేల చొప్పున 30 వాహనాలను జూకు అందిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రతినిధులే 8వ జూ అథారిటీ సమావేశంలో కొత్త వాహనాలు అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. రోడ్డున పడ్డ డ్రైవర్లు శ్రీవెంకటేశ్వర డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే డ్రైవర్లు ఇకపై గుజరాత్కు చెందిన సేవ్ ఈ కంపెనీ నుంచే జీతాలు పొందవలసి వుంటుందని జూ అధికారిణి పేర్కొన్నారు. లేకుంటే వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సేవ్ ఈ సంస్థకు జూ అధికారులు తెలియజేశారు. దీంతో డ్రైవర్లు రోడ్డున పడ్డట్టు అయింది. ఇప్పటికే జీతాల పెంపుపై హైకోర్టులో డ్రైవర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి 14 నెలలైనా సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలే ఊడిపోయేలా జూ అధికారులు వ్యవహరించడం దారుణం. -
రో'జూ'విలవిల
శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వరుసగా వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. దీని వెనుకఅసలు కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. వరుసగా మూగ జీవాలు మృతి చెందుతున్నాయి.వన్యప్రాణుల కేర్ టేకర్ల పర్యవేక్షణ లోపమా.. వైద్యులనిర్లక్ష్యమా.. అధికారుల పనితీరు లోపమా.. అనేది తెలియడం లేదు. ఈ క్రమంలో గురువారం మగ సింహం పిల్ల మృతి చెందింది. కేన్సర్ వ్యాధితో మృతి చెందిందని పశు వైద్యులు నిర్ధారించారు. గత నెలలో కూడా మనుబోతులు మూడు మృతి చెందాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ వల్ల జంతువులు మృతి చెంది ఉండవచ్చనే అనుమానం కూడా ఉంది. తిరుపతి సిటీ: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 28 మూగజీవాలు మృతి చెందినట్లు జూ పార్క్ రికార్డుల్లో నమోదైంది. మూగజీవాల మృతికి కారణం ఏమిటనే విషయం అంతుపట్టడం లేదు. జూలో 1,068 వన్యప్రాణులు ఉన్నాయి. వాటిలో ఇటీవల రెండు మనుబోతులు,ఒక కణితి, చుక్కల దుప్పి, బుర్ర జింక కూడా మృతిచెందాయి. గురువారం 8 నెలల మగ సింహం పిల్ల మృతి చెందింది. ఇది వడదెబ్బకు గురై మృతి చెందిందనే అనుమానాలు ఉన్నాయి. జూ క్యూరేటర్ మాత్రం ఊపిరాడక మృతి చెందిందని చెప్పారు. ముందే పసిగట్టలేని వైద్యులు సింహం పిల్ల అనారోగ్యానికి గురైందని జూలో ఉన్న డాక్టర్లు ముందుగా పసిగట్టలేకపోయారు. వైద్యులు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచడం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. డాక్టర్లు జూ అంతటిని కార్లలో చుట్టి వెళ్లిపోతుంటారు. జంతువులు ఉండే చోటికి వెళ్లి కారు దిగకుండానే అనిమల్ కీపర్ను వారి దగ్గరకు పిలుపించుకుని జంతువు బాగుందా.. ఫీడ్ తీసుకుంటుందా అని అడిగి వెళ్లిపోతుంటారు. పోస్టుమార్టంపై అనుమానాలు జూలో ఏ జంతువు మృతి చెందినా వెటర్నరీ యూనివర్సిటీకి పంపించి పోస్టుమార్టం నిర్వహించాలి. గతంలో ఇదే విధానాన్ని అధికారులు అమలుచేసేవారు. కానీ ప్రస్తుతం జూ లోనే అక్కడున్న వైద్య సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి దహనక్రియలు చేస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. స్ప్రింక్లర్లు ఉన్నా.. నామమాత్రమే. జూలో మొత్తం 1,500 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. అన్నింటిని పూర్తిగా వినియోగించడంలేదు. ఏవరైనా వీఐపీలు వచ్చిన సమయంలో వాటిని వినియోగంలోకి తెస్తారు. మిగిలిన సమయాల్లో వాటిని వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అక్కడ సింహాలతో ఆడుకోవచ్చు!
గాజా, పాలస్తీనా : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న పాలస్తీనియన్ రాజ్యం గాజాలోని పార్కులు సందర్శకులకు వినూత్న అనుభవం కలిగిస్తున్నాయి. ఏకంగా సింహాలతో ఆడుకునే వెసలుబాటు కల్పించి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫాలో ఉన్న ఓ జూ పార్కులో ‘ఫెలెస్టీన్’ అనే ఆడ సింహాన్ని జూ నిర్వాహకులు సమీపంలో ఉన్న ఇళ్లకు తీసుకువెళ్లి ఆడిస్తుండటం విశేషం. ఈ విషయం గురించి జూ యజమాని మహ్మద్ జుమ్మా మాట్లాడుతూ... ‘ సింహంలో ఉన్న క్రూరత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా. అందుకే దాని గోళ్లు కత్తిరిస్తున్నాం. సందర్శకులతో తను స్నేహంగా ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. పిల్లలు కూడా ఆడుకున్నారు... ఫెలెస్టీన్ను మంగళవారం షికారుకు తీసుకువెళ్లినట్లు దాని శిక్షకుడు ఫయీజ్ అల్- హదద్ వెల్లడించారు. ‘ కొన్ని రోజులుగా ఫెలెస్టీన్ మానసిక స్థితిని అంచనా వేశాను. అందుకే సమీపంలో ఓ అపార్ట్మెంట్కి తీసుకు వెళ్లాను. అక్కడ ఉన్న వారంతా పిల్లలతో సహా ఫెలెస్టీన్తో ఆడుకున్నారు. దాని గోళ్లు కత్తిరించాం కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే పళ్లు మాత్రం అలాగే ఉంచుతాం. కాబట్టి దాని సహజత్వాన్ని కోల్పోదు. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తాం’ అని పేర్కొన్నాడు. కాగా శిథిలావస్థకు చేరిన జూ పార్కులను పునరుద్ధరించేందుకు.. జంతువులతో ఆడుకోవడం వంటి వెసలుబాటు కల్పిస్తున్న యజమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారం కోసం జంతువుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని.. అదేవిధంగా జంతువులను బయట తిప్పడం వల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరంతరం బాంబుల మోతతో దద్దరిల్లే గాజాలో పిల్లల ముఖాల్లో కాస్త సంతోషం చూసేందుకే ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నామని జూ నిర్వాహకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. -
ఆబ్సెంట్ మైండ్ అప్పారావు.. ఓ ‘యాపిల్’ కథ
అనగనగా చైనాలోని చాంగ్జౌ ఊరు.. అక్కడ ఓ ఆబ్సెంట్ మైండ్ అప్పారావు.. మన కథలోని హీరో ఇతడే. ఈ మధ్యన అప్పారావు యాన్చెంగ్ జూకు వెళ్లాడు. మనోడసలే చిన్న పిల్లాడి టైపు. జూలోని జంతువులను చూస్తే చాలు. వాళ్లలాగే కేరింతలు కొడతాడు. ఇక ఎలుగుబంట్లు అంటే మనోడికి చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం.. అందుకే వాటి కోసం యాపిల్లు కూడా తీసుకెళ్లాడు. స్కై ట్రెయిన్ రైడ్ ఎక్కాడు. రైలు.. ఎలుగు బంట్లు ఉన్న ఎన్క్లోజర్ వద్దకు వచ్చింది. ఆబ్సెంట్ మైండ్ అప్పారావు ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఇదిగో యాపిల్ అని విసిరాడు. అసలే అయోమయం. దీంతో తొందరలో కుడి చేతిలోని యాపిల్కు బదులుగా.. ఎడమ చేతిలోని యాపిల్ ఫోన్ను విసిరేశాడు. విషయం అర్థం కావడానికి మనోడికి రెండు నిమిషాలు పట్టింది. ఎలుగుబంట్లకు అంత టైము పట్టలేదు.. ఆపిల్స్ తినీతినీ.. వాటికీ తెలివి బాగా పెరిగినట్లుంది. అది మామూలు యాపిల్ కాదని. చాలా ఖరీదైన యాపిల్ అన్న విషయాన్ని గ్రహించాయి. లటుక్కున నోట కరుచుకుని.. చటుక్కున తమ బోనులోకి దూరిపోయాయి. జూవాళ్లు వచ్చారు.. బోనులోకి వెళ్లారు.. యాపిల్ను బయటకు తెచ్చారు.. కానీ.. అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోనులోకి వెళ్లేముందు.. కొత్త రూపాయి నాణెంలా ఉన్న ఆ ఫోను. బయటికి వచ్చేసరికి.. రైలు పట్టాల మీద పెట్టిన రూపాయి నాణెంలా తయారైంది. అదండి సంగతి.. కథ కంచికి.. ఆబ్సెంట్ మైండ్ అప్పారావు ఇంటికి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్ వీడియో: పాండాల మధ్య పడిపోయిన చిన్నారి
-
విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్
-
విమానంలో పులి పిల్ల.. పాలు పట్టిన సిబ్బంది
చెన్నై : చిరుత పులి పిల్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్ చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఈ క్రమంలో ఎయిర్పోర్టు ఇంటిలెజిన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెన్నైలోని ఆరినగర్ అన్నా జువాలాజికల్ పార్కుకు తరలించారు. కాగా భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను ఎయిర్పోర్టు సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. అనంతరం దానికి పాలు పట్టించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. -
13 ‘జూ’ల గుర్తింపు రద్దు
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దయ్యింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శన శాలలు పనిచేయకపోవడం, అక్కడి జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్ఏ) వాటి గుర్తింపును రద్దు చేసిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం లోక్సభకు చెప్పారు. గుర్తింపు రద్దయిన వాటిలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉన్న డీర్ పార్క్ ఎన్సీఎఫ్ఎల్, తెలంగాణలోని డీర్ పార్క్ కేశోరాం సిమెంట్, సంఘీ మినీ జూ, కర్ణాటకలోని తుంగభద్ర మినీ జూ, శ్రీ క్షేత్ర సొగల్ సౌండట్టి, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న వీఓసీ పార్క్ మినీ జూ మొదలగునవి ఉన్నాయి. -
వామ్మో.. చిరుత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చిరుతపులులను దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా రైతుల వెంటపడి తరుముతుంటే.. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీసిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా పరిసర అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అదే తండాలో రెండునెలల వ్యవధిలో చిరుతపులి మూడుసార్లు స్థానికులకు భయం కల్పించింది. తాజాగా శనివారం రాత్రి తండాకు చెందిన నునావత్ రాములు, మాలోతు గన్యా వ్యవసాయ పొలాల వద్దకు కాపలాగా వెళ్లారు. తెల్లవారుతుండగా తండాకు వస్తున్న క్రమంలో దూరంగా పులి అరుపులు విన్న రైతులు అప్రమత్తమై తండావైపు పరుగులు తీశారు. చిరుతకు ఎక్కువ దూరంలో రైతులు ఉండడం వల్ల, తండాకు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. చిరుతపులి సంచారంతో ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని అటవీ ప్రాంతంలో నివాసాలు ఉండే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లో మూడో ఘటన గుంటపల్లి చెరువు అటవీ ప్రాంతంలో సరిగ్గా 57 రోజులక్రితం చిరుతపులి రెండు లేగదూడలపై దాడిచేసి హతమార్చింది. గ్రామ శివారులోని పశువుల కొట్టంలో ఉంచిన లేగదూడలను అటవీ ప్రాంతంలోకి లాక్కువెళ్లి హతమార్చింది. ఈ సంఘటన తండాలో భయాన్ని కలిగించింది. అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి చిరుతకోసం నామమాత్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 15 రోజులకు అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడం రైతులకు కనిపించింది. వారు దూరం నుంచే గమ నించి తండాకు పరుగులు తీశారు. ఆ ఘటన నుంచి గిరిజనులు తేరుకోక ముందే 42 రోజుల కు మరోసారి తాజాగా చిరుతపులి రైతులను వెంబడించింది. గతంలో వీర్నపల్లి మం డలం కంచర్ల, రంగంపేట, మద్దిమల్ల, వీర్నపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరించి సుమారు 20 లేగదూడలను హతమార్చాయి. చిరుతలను బంధించాలి చిరుతపులులను బంధించి ప్రజలకు ప్రాణరక్షణ కల్పించాలి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకొని జూపార్క్కు తరలించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా చిరుతపులులు సంచరించే ప్రాంతంలో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బోర్డులు ఉంటే తెలియని వారు అప్రమత్తమయ్యే అవకాశాలుంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పులుల నుంచి గిరిజనులు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఏఆర్సీలో ఆడ సింహం మృతి
విశాఖపట్నం, ఆరిలోవ : జూపార్కు సమీపంలోని జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ)లో శుక్రవారం ఓ వృద్ధ ఆడ సింహం మృతి చెందింది. జూ క్యూరేటర్ యశోదభాయి తెలిపిన వివరాలు ప్రకారం.. ఏఆర్సీలో ఉన్న మాధురి అనే 27 ఏళ్ల ఆడ సింహం వృద్ధాప్యం కారణంగా శరీర అవయవాలు పాడవడంతో అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీన్ని 2001లో కోల్కతాలో జెమినీ సర్కస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. దీని మరణంతో ప్రస్తుతం ఏఆర్సీలో ఆరు సింహాలు, మూడు పులులు ఉన్నాయి. -
బాలిక ముఖంపై గుద్దిన కోతి..వైరల్!
-
గట్టి పంచ్ ఇచ్చిన కోతి..!!
సాక్షి, వెబ్ డెస్క్ : ఆహారాన్ని అందిస్తూ మరీ దగ్గరకు వెళ్లిన బాలిక ముఖంపై గుద్దిన కోతి వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని ఓ జూలో జరిగింది. ఓ మహిళతో పాటు ఆహారం తినిపించడానికి బాలిక కూడా కోతి వద్దకు వెళ్లింది. మహిళ ఇస్తున్న ఆహారాన్ని కోతి తీసుకుంటుండగా, మధ్యలో బాలిక దానికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పటివరకూ శాంతంగా కనిపించిన కోతి బాలిక చర్యతో తన చేతిని విసిరింది. అంతే ఆ పంచ్ బాలిక ముఖాన్ని బలంగా తాకడంతో ఆమె వెనక్కు పడిపోయింది. -
జూ నుంచి తప్పించుకున్న క్రూర మృగాలు
బెర్లిన్: జూ నుంచి అయిదు క్రూర మృగాలు తప్పించుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ జర్మనీలోని లూనెబాక్ నగరంలోని ఐఫెల్ జూలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం పోలీసులకు తెలియడంతో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. జూ నుంచి తప్పించుకున్న వాటిలో రెండు సింహాలు, రెండు పులులు, ఒక జాగ్వార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి సంభవించిన వరద కారణంగా క్రూర మృగాల సంరక్షణ కేంద్రంలోని ఇనుప కంచెలు విరిగిపోయాయని, ఇదే అదనుగా భావించి అవి తప్పించుకున్నాయని జర్మన్ మీడియా తెలిపింది. తప్పించుకున్న వాటిలో ఓ ఎలుగు బంటి కూడా ఉంది. అయితే అధికారులు ముందే అప్రమత్తమై దానిని కాల్చి చంపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జంతువులేవైనా కనబడితే సమాచారం అందించాలని కోరారు. అయితే ఎన్ని జంతువులు తప్పించుకున్నాయనే దానిపై అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యులు జూలో గాలింపు చర్యలు చేపట్టారు. 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జూలో సైబీరియన్ పులులు, సింహాలతో పాటు 60 రకాలైన సుమారు 400 జంతువులు ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం తూర్పు జర్మనీలోని లీప్జిగ్లోని ఓ జూలో రెండు సింహాలు తప్పించుకోవడంతో అధికారులు ఒక దానిని కాల్చిచంపారు. మరో సింహాన్ని మత్తు ఇచ్చి సజీవంగా పట్టుకోగలిగారు. -
ఆదమరిస్తే..అపాయమే!
‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. అయితే పులితోనే కాదు ఏ జంతువుతో అయినా సెల్ఫీలు, ఆటలు ప్రమాదమే. మచ్చిక చేసుకున్నవైనా, శిక్షణలోనివి అయినా.. క్రూర జంతువుల దగ్గర అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాస్తంత పరధ్యానంగా ఉన్నా, సెల్ఫీల పేరుతో వాటితో ఆటలాడ్డానికి ప్రయత్నించినా అంతే సంగతులు. ఒక్కోసారి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి వాటికి నిదర్శనంగా నిలిచే కొన్ని సంఘటనలివీ.. సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.. ఇది రెండేళ్ల కిందట మన హైదరాబాద్లోనే జరిగింది. బిహార్కు చెందిన ఓ వ్యక్తి(35) నెహ్రూ జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ సింహాలున్న ఎన్క్లోజర్ ప్రాంతంలోకి హఠాత్తుగా దూకాడు. అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్న ఆ వ్యక్తి సమీపంలోని సింహాలను చూస్తూ షేక్హ్యాండ్ ఇచ్చేందుకన్నట్లు చేయి చాపాడు. గమనించిన జూ నిర్వాహకులు వెంటనే సింహాల దృష్టిని మరల్చి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించారు. చిన్నారి తలను దొరకబుచ్చుకుంది సౌదీ అరే బియాలోని జెడ్డా లో జరిగింది ఈ సంఘటన. జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్లో భాగంగా పదేళ్ల లోపు చిన్నారులు కొంత మంది ఓ జూ లోకి వెళ్లారు. అక్కడ శిక్షకుడి పర్యవేక్షణలోని ఓ సింహం(ఆరు నెలల వయస్సు) చుట్టూ మూగారు. సరదాగా దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఉన్నట్లుండి ఆ సింహం పిల్ల ఓ చిన్నారిపై దాడికి దిగింది. ఆ చిన్నారి తలను నోట కరుచుకుంది. దీంతో భయపడిన మిగిలిన పిల్లలు దూరం జరిగారు. శిక్షకుడు అతికష్టమ్మీద ఆ చిన్నారిని సింహం పిల్ల నుంచి విడిపించగలిగాడు. ఈ ఘటనలో చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు అక్కడక్కడా కుట్లు పడ్డాయి. ఎన్క్లోజర్లో దూకి బలయ్యాడు.. మన దేశ రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక్కడి నేషనల్ జులాజికల్ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు హఠాత్తుగా పులుల ఎన్క్లోజర్లో దూకాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఓ తెల్లపులి కంట పడ్డాడు. ఆ పులి ఓ పదిహేను నిమిషాలు అతనిపై దాడికి దిగలేదు. ఈ లోపు మిగిలిన సందర్శకులు దాన్ని బెదరగొట్టడానికి, దాని దృష్టిని మరల్చడానికీ రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసర డం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అది హఠాత్తుగా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి పంజాతో దాడి చేసి చంపి లాక్కెళ్లింది. పులి దాడికి దిగుతుండగా ఆ యువకుడు నమస్కరిస్తూ ప్రాధేయపడిన వీడియో అప్పట్లో సామా జిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. జూ యజమానిపై దాడి.. ఇది రెండు వారాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ జూ నిర్వాహకుడు(85).. సందర్శకులకు జూ చూపిస్తుండగా సింహాల ఎన్క్లోజర్లో దుర్వాసన రావడం గమనించాడు. వెంటనే పరధ్యానంగా లోపలికి వెళ్లాడు. సమీపంలోనే ఓ సింహం ఉండడం గమనించి గేటు వైపు పరిగెత్తబోయాడు. ఈ లోపలే అతన్ని దొరకబుచ్చుకున్న సింహం..పంజాతో దాడికి దిగి లోపలికి లాక్కెళ్లింది. ఇంతలో సందర్శకుల్లో ఎవరో తుపాకీతో సింహాన్ని కాల్చడంతో ఆ జూ నిర్వాహకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీసుకోవాల్సిన జాగ్రతలు: జూ, అడవుల సందర్శనకు వెళ్లినపుడు అక్కడి సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం, వాటితో సెల్ఫీలు దిగాలనుకోవడం ప్రమాదకరం. అడవి జంతువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. సింహాలు, పులులు లాంటి క్రూర జంతువులు ఉన్న ఎన్క్లోజర్స్లోకి వెళ్లకూడదు. జంతువులకు చేత్తో ఆహారపదార్థాలు తినిపించేందుకు ప్రయత్నించకూడదు. జంతువులను భయపెట్టేలా శబ్దాలు చేయకూడదు. పాటలు పెట్టకూడదు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలి వెళ్లకూడదు. -
చింపాంజీలు చల్ల..చల్లగా..
భువనేశ్వర్ : రాష్ట్రంలో ప్రముఖ జంతు ప్రదర్శన శాలగా పేరొందిన బారంగ్ నందన్ కానన్ ప్రాంగణంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇటీవల కాలంలో ఎండల తీవ్రత అకస్మాత్తుగా పెరిగింది. వన్యప్రాణులను వడ దెబ్బ నంచి నివారించేందుకు జూ అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో చల్లని వాతావరణం కల్పించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. వన్య ప్రాణులు తిరుగాడే పరిసరాల్లో జలాశయాలు ఏర్పాటు చేయడం, తాగు నీరు సదుపాయాల్ని కల్పించడం వంటి ఏర్పాట్లతో సంరక్షిస్తున్నారు. సున్నితమైన వన్య ప్రాణులు, పక్షుల పంజరాల పరిసరాల్లో ఐస్ క్యూబ్లు అమరుస్తున్నారు. ఎండ వేడిమి తాకకుండా నీడ కల్పించేందుకు పలు చోట్ల గడ్డి చాపలు, ఎయిర్ కూలర్లను అమర్చుతున్నారు. రాత్రింబవళ్లు వాతావరణం చల్లగా ఉండేందుకు పంజరాల్లో పిచికారితో నీరు చిమ్మడం, జలాశయాల్లో నీటి మట్టం నిర్వహణ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చింపాంజీలు వంటి సున్నిత వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో ఎయిర్ కూలర్లను అమర్చారు. చల్లని ఆహారం వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వన్య ప్రాణుల శరీరానికి చల్లదనం కూర్చే ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తున్నారు. నిత్య ఆహార పదార్థాలతో పాటు దోస కాయలు, పుచ్చ కాయలు, చెరుకుగడలు వంటి ప్రత్యేక పదార్థాల్ని జోడించారు. తాగేందుకు చల్లని నీటి ప్రవాహం ఏర్పాటు చేశారు. జంతువులను వడ దెబ్బ ప్రమాదాల నుంచి కాపాడేందుకు చేపడుతున్న కార్యాచరణలో నందన్ కానన్ పరిసరాల్లో హరిత పర్యావరణం ఏమాత్రం ప్రభావితం కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. వేసవిలో వాతావరణ సంబం ధిత అనారోగ్య పరిస్థితులు వన్యప్రాణులను ఆవరించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపడుతున్నారు. ప్రత్యేక వన్యప్రాణుల చికిత్స బృందం ఈ మేరకు కృషి చేస్తుందని నందన్ కానన్ పర్యాటకుల నిర్వహణ విభాగం సహాయ అటవీ సంరక్షణ అధికారి అమూల్య కుమార్ ఫరిడ తెలిపారు. -
పులి పిల్ల మృతి...పెద్దపులి మాయం
సాక్షి, ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణ పరిసరాల్లో నాలుగు రోజులుగా కలకలం రేపుతున్న పెద్దపులి, దాని రెండు పిల్లల్లో ఒకటి చనిపోయింది. మరొక పులిపిల్లను అటవీ శాఖ అధికారులు బంధించారు. పెద్దపులి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. మామిడితోటలో తిష్ట వేసిన పులులను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది శనివారం తీవ్రంగా శ్రమించారు. ఇదే క్రమంలో అక్కడి పొదల్లో చనిపోయిన పులిపిల్ల కనిపించింది. సుమారు ఏడాదిన్నర వయసున్న పులి పిల్ల ఆహారం లేకపోవడం వల్లే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పెద్దపులితో పాటు మరొక పులి పిల్ల కోసం అటవీశాఖ అధికారులు నాలుగు జేసీబీలను తెప్పించి.. వాటిపై నిపుణులైన సిబ్బందిని ఉంచి గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతోనూ అన్వేషించారు. మామిడి తోట చుట్టుపక్కల పొదల్లో గాలిస్తుండగా రెండవ పులిపిల్ల కనిపించింది. దీనికి తుపాకీ సాయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూకు తరలించారు. ఇక తల్లి పులి ఏమైందన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా పులి పిల్లలు తల్లితోపాటు సుమారు రెండున్నరేళ్ల వరకు అంటిపెట్టుకొని ఉంటాయి. అక్కడే ఆహారం కోసం జంతువులను వేటాడటం నేర్చుకుంటాయి. అయితే.. ఈ పులి పిల్లలు వేటలో నిపుణత సా«ధించకముందే తల్లి నుంచి దూరమవ్వడం వల్ల ఆహారం లభించక ఇబ్బంది పడి ఉంటాయని, ఈ కారణంగానే ఒక పులి పిల్ల మరణించిందని భావిస్తున్నారు. ఆ పులి పిల్ల కళేబరానికి పంచనామా నిర్వహించి అక్కడే పూడ్చేశారు. -
అరుదైన పాము లభ్యం
హైదరాబాద్: గత నెల జూపార్క్ మసీదు వద్ద దొరికిన అరుదైన "ఎల్లోకాలెడ్ ఉల్ఫ్" స్నేక్ ను బుధవారం జూ అధికారులు జూలో వదిలిపెట్టారు. జూ పార్కు సమీపంలోని ఓ మసీదు ప్రాంతంలో కనిపించిన పామును పట్టుకున్న సిబ్బంది కొద్ది రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి అనంతరం జూ అభయారణ్యంలో వదిలిపెట్టారు. అనపర్తిలో గత ఏప్రెల్ లో ఇలాంటి పాము కనిపించింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే "ఎల్లోకాలెడ్ ఉల్ఫ్" స్నేక్ లు అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు. -
హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్
నీళ్లు చూస్తే.. ఎవరికైనా జోష్ వచ్చేస్తుంది. ఇక చిన్న పిల్లతైతే మరీ.. ఒళ్లంత.. తుళ్లింతగా కేరింతలు కొడుతూ జలకాలాటల్లో ఎంజాయ్ చేస్తారు కదా! తాజాగా హూ లలల్లా..ఏమి హాయిలే. అంటూ ఒక గొరిల్లా చేసిన డ్యాన్స్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఉత్సాహంతో ఊగిపోతున్న ఈ గొరిల్లా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డల్లాస్ లోని ఒక జూ లోని 14 ఏళ్ళ మగ గొరిల్లా ‘జోలా’ ఇక నాకెవరు అడ్డు అన్నట్టుగా ఎంజాయ్ చేసిన డ్యాన్స్ వీడియోని షేర్ చేశారు . ఎలాంటి బ్రేక్ డాన్స్ మ్యూజిక్ లేకుండానే జోలా హ్యాపీ డ్యాన్స్ అంటూ జూ అధికారులు షేర్ చేసిన ఈ వీడియో లక్షల వ్యూస్తో సాగుతోంది. జూన్ 20 న షేర్ చేయగా ఇప్పటికీ భారీగా షేర్ అవుతోంది. 7లక్షలకు పైగా వ్యూస్ను, కమెంట్లను సొంతం చేసుకుని ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తోంది.