Sleep
-
ఎంత పెద్ద స్టార్ అయినా ఓ బిడ్డకు తల్లి అయితే ఇంతేగా..!: ప్రియాంక చోప్రా
పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లులు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు. అల్లరి బిడ్డ నిద్రలోకి జారుకుంటే ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదయా! ఇలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా ఈసారి తన సరికొత్త పోస్ట్లో స్వాతంత్య్ర వేడుకల గురించి మాట్లాడింది!. నిద్రిస్తున్న తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ప్రియాంక. ‘మీ సూపర్ యాక్టివ్ బేబీ నిద్రపోతుంటే’ అని ప్రియాంక ఈ వీడియోను పరిచయం చేసింది. దీంతోపాటు లాఫింగ్ ఇమోజీని కూడా షేర్ చేసింది. కొన్ని సెకన్ల తరువాత టామ్, జెర్రీ డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తుంది. ఈ వీడియోకు ‘ఆజాదీ’ అనే కాప్షన్ ఇచ్చింది. కూతురు అల్లరి చేయకుండా హాయిగా నిద్రపోవడమే... తనకు స్వాతంత్య్ర వేడుక!.(చదవండి: 'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణవివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై.. ) -
పోలీసులే దొంగను నిద్రలేపారు
కర్ణాటక: అర్థరాత్రి వేళ ఇంటి చోరీకి వచ్చిన దొంగ ఆరవేసిన టవల్, పంచను చోరీ చేసి పక్కింటి మీద నిద్రించగా, మంగళవారం ఉదయం పోలీసులు అతనిని నిద్రలేపి ఠాణాకు తీసుకెళ్లారు. నవ్వు పుట్టించే ఈ తమాషా సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. నగర శివార్లలోని సోమినకొప్ప టీచర్స్ కాలనీలో కుమార్ అనే వ్యక్తి ఇంటి పై అంతస్తులోకి ఓ యువ దొంగ చొరబడ్డాడు. అక్కడ ఉన్న బీరువాను తెరిచి చూడగా అందులో ఏమీ దొరకలేదు. టవల్, పంచ తదితర దుస్తులను తీసుకుని పక్కింటి మిద్దైపెన వాటిని పరచుకుని నిద్రించాడు. తెల్లవారగానే కుమార్ ఇంటి పైభాగంలో ఆరవేసిన దుస్తుల కోసం రాగా, గది తలుపులు, బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు, వెంటనే పోలీసులు వచ్చి చూడగా పక్కింటిపై నిద్రిస్తున్న దొంగ కనిపించాడు. వినోబానగర ఎస్ఐ సునీల్, సిబ్బంది ఆ దొంగను నిద్ర లేపి పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
బెడ్కు జై.. భాగస్వామికి బై..
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు.. నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్లు/ బెడ్రూమ్లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి. అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.నిద్ర విడాకులకు కారణాలు జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.బలపడుతున్న బంధం.. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ.. మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు. -
ఒక 24 గంటలు నిద్రలేకుండా గడిపారో ఊబకాయం, కానీ!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేమి మధుమేహం, కేన్సర్ లాంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాదు తగినంత నిద్ర లేనపుడు మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 24 గంటలు నిద్ర పోకపోవడం వలన పెద్దల్లో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. కువైట్లోని దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (DDI) ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై స్వల్పకాలిక నిద్ర లేమి ప్రభావాన్ని అంచనా వేసింది. ఊబకాయం, మధుమేహం , గుండె జబ్బులు వంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలలో ఒక రాత్రి నిద్రను దాటవేయడం వల్ల దీర్ఘకాలిక మంట (chronic inflammation)తో ముడిపడి ఉన్న కణాల్లో పెరుగుదల నమోదైంది. ఇదే ఊబకాయానికి ముఖ్య లక్షణం. అయితే ఆసక్తికరవిషయం ఏమిటంటే, సాధారణ నిద్ర పునరుద్ధరించుకున్న తరువాత ఇది సాధారణ స్థితికి చేరింది. తమ పరిశోధన నిద్ర, రోగనిరోధక ఆరోగ్యం మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు.నిద్ర - బరువు మధ్య సంబంధంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. నిద్ర నియంత్రణ అనేది మెదడుకు మాత్రమే సంబంధించినది కాదు, మెదడు ,శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఆరోగ్యంపై నిద్ర లేమి ప్రభావం తెలిసినప్పటికీ, ఈ అనుబంధానికి అంతర్లీనంగా ఉన్న విధానం తక్కువగా అర్థం చేసుకున్నారు. 237 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ పరిశోధన జరిగింది. వీరిబాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా పీలగా ఉన్నవారు, అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో ఉన్నవారు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు , మూత్రపిండాల పనితీరు బావుందని నిర్ధారించుకున్నారు. అలాగే మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), అధిక రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్న వారు. గుండె సమస్యలు (గుండెపోటు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) శస్త్రచికిత్స, కరోనరీ యాంజియోప్లాస్టీ లేదా 'స్టెంట్లు') గుండె సంబంధిత కారణాల వల్ల అకాల మరణం (40 ఏళ్లకు ముందు) సంభవించిన కుటుంబ చరిత్ర ఉన్నవారిని, డిప్రెషన్, సంబంధిత మందులు తీసుకుంటున్న వారికి కూడా మినహాయించారు."నిద్ర లేమి, రోగనిరోధక కణాల డైనమిక్స్ మధ్య పరస్పర చర్యను పరిశీలించేందుకు ఐదుగురు 'సాధారణ బరువు' వ్యక్తులను - ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలను - 24 గంటల పాటు నిద్ర లేమికి గురిచేశారు. వారి నాన్-క్లాసికల్ మోనోసైట్లు (NCM) , ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను గమనించారు. ఇందులో ఎన్సీఎంలో తీవ్రమైన, గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే ఇది రెండు రోజుల తర్వాత అంటే వారు సాధారణంగా నిద్రపోయినపుడు ఇది సాధారణ స్థితికి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది. -
పని మాత్రమే కాదు.. నిద్ర కూడా ముఖ్యమే: కర్ణాటక హైకోర్టు
విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని, సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి కచ్చితంగా అవసరమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయి సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వెల్లడించింది.‘‘ఇవాళ ఈ కానిస్టేబుల్ కావొచ్చు. రేపు మరొకరు కావొచ్చు. మనిషికి నిద్ర సహజం. అలాంటిది మనిషికి నిద్రను దూరం చేస్తే ఎలా?. ఈరోజుల్లో పని-జీవితం మధ్య సమతుల్యం(Worklife Balance)లో నిద్ర-విశ్రాంతి కీలక అంశం. షిఫ్ట్లవారీగా పని చేసినప్పుడు.. ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా?’’ అని జస్టిస్ ఎం నాగప్రసన్న(Justice M Nagaprasanna) ధర్మాసనం వ్యాఖ్యానించింది.వైరల్ వీడియోతో మొదలై..కిందటి ఏడాది మార్చి 23వ తేదీన కల్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పని చేసే చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై చంద్రశేఖర్ను ఉన్నతాధికారులు వివరణ కోరారు. వరుస షిఫ్ట్లలో డ్యూటీ చేయడం మూలంగా తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నానని, వాటి మూలంగానే నిద్ర ముంచుకొచ్చిందని, అయినా తాను 10 నిమిషాలపాటే విశ్రాంతి తీసుకున్నానని వివరణ ఇచ్చారాయన.అయితే కానిస్టేబుల్ వివరణతో అధికారులు సంతృప్తి చెందలేదు. డ్యూటీలో ఉండగా పడుకోవడం తప్పేనని, పైగా ఈ చర్యలో డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెబుతూ సస్పెండ్ చేశారు. ఆపై ఘటనపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సస్పెన్షన్పై ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు.అయితే.. విజిలెన్స్ నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది. సదరు విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారని, వరుసగా మూడు షిఫ్ట్లలో పని చేస్తున్నారని.. కాబట్టి వారిపై పని ఒత్తిడి తగ్గించడానికి మరో ఇద్దరిని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 24 ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి విశ్రాంతి హక్కు ఉంటుంది. అలాగే వేతనంతో కూడిన కాలానుగుణ సెలవులు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంఘ ఒప్పందాల ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి. షిఫ్ట్లవారీగా పని చేసేవాళ్ల విషయంలో ఇది మరీ అవసరం. అసాధారణ సందర్భాలను మినహాయిస్తే.. రోజుకి 8 గంటలు.. వారంలో 48 గంటలకు పని గంటలు మించకూడదు.ఈ కేసులో పిటిషనర్ విధుల్లో నిద్రపోవడంలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదు. వరుస షిఫ్ట్లలో 16 గంటలపాటు పని చేయడం మూలంగా ఆయన అధిక పని ఒత్తిడితో ఇబ్బంది పడ్డారు. అందుకే నిద్రపోయారు.కాబట్టి, సస్పెన్షన్ సరికాదు. తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి అని జస్టిస్ ఎం నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు. -
Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా!
సాధారణంగా.. కీలక సమావేశాల్లో లేదంటే ఉపన్యాసాలు జరుగుతున్న టైంలో మన నేతలు నిద్రపోతూ కనిపించే దృశ్యాలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే నేతలు ఇక మీదట హుషారుగా పని చేసేందుకు కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) సమావేశాల టైంలో భోజనం తర్వాత.. సభ్యులు కాసేపు నిద్ర తీసేందుకు ఏర్పాట్లు కలిగించబోతున్నారు. ఈ మేరకు అద్దె ప్రతిపాదిక 15 ‘కునుకు కుర్చీలు’ తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాళ్ల పని తీరు మెరుగుపడుతుందని, పైగా సభ్యుల హాజరు శాతం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.#Karnataka MLAs to get recliners in assembly for quick power naps🙂Speaker UT Khader has approved installing 15 recliners in the Assembly lobby on rent, allowing legislators a quick nap post lunch. Idea is to boost productivity ensuring they stay active for rest of the session… pic.twitter.com/OUMNtVxfuf— Nabila Jamal (@nabilajamal_) February 25, 2025సర్ ఇంగ్లీష్ అంతే!సీనియర్ నేత, తిరువంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ట్రంప్-మోదీ భేటీపై ఆయన సానుకూలంగా మాట్లాడడం, బీజేపీ నేతలతో సెల్ఫీ దిగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఖండించేశారు. అయితే ఆయన ఆంగ్ల పరిజ్ఞానం అత్యంత అరుదు. పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు తరచూ ఆయన వాడుతుంటారు. అలాగే.. ఆ ఖరీదైన ఇంగ్లీష్కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇక.. హిందీ భాషాభిమానంలో బీజేపీని కొట్టేవారు ఈ దేశంలోనే లేరు. అలా.. అమిత్ షా-శశి మధ్య పార్టీ మారడం గురించి చర్చ జరిగితే ఇలా ఉంటుందనే సరదా ప్రయత్నం.. ఈ ఎక్స్ కామెంట్.What say you Shashi T, my old friend? pic.twitter.com/a8sjohnZ71— ParanjoyGuhaThakurta (@paranjoygt) February 25, 2025 సొంత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైంలో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా.. సోషల్ మీడియాలో జోకులు సైతం పేలుతున్నాయి. ఇక సొంతదేశంలోనే మీమ్ మెటీరియల్గా పేరున్న షాహిన్ అఫ్రిదీ(Shaheen Afridi)ని ఇలా.. భారత్లోని భాగేశ్వర్ ధామ్లో పూరీలు అమ్ముకునేవాడిలా చేసేశారు. Shaheen Afridi Bageshwar Dham mai pooriya nikaal raha 😸 pic.twitter.com/BeTMsC1Lzf— Sachya (@sachya2002) February 25, 2025 Note: ఈ పోస్టులు ఎవరినీ కించపరిచడానికో లేదంటే విమర్శించడానికో కాదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలియజేయడం కోసమే.. -
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్గా టూర్లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు. -
Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో గ్లామర్గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు. 59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు. ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి. నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్గా కాలేజ్లో..!) -
నిద్రలేమితో నా'ఢీలా'!
నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది. అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు. పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... పెద్దవాళ్ల విషయంలో... అల్జిజమర్స్ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్ ప్యాక్ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్ వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. స్లీప్ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్ ఆప్నియా’ అని పిలిచే ఇది... చాలా ప్రమాదకరమైన వ్యాధి. గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే... గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్ డెఫిసిట్తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్ ఎబిలిటీస్) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్ కండిషన్స్)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్ టర్మ్ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.నిద్రతోనే పిల్లలు ఎత్తు పెరిగే సామర్థ్యం: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. మంచి నిద్ర కోసం... ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడానికి దూరంగా ఉండటం పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడంపడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం సమకూరుతుంది. డా. విక్రమ్ కిశోర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్ (చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!) -
ఈ డివైజ్తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!
ఉయ్యాల్లో ఊపుతూ.. లాలి పాటలు పాడుతూ.. కథలు చెబుతూ.. ఇలా చిన్నారులను నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు ఏవేవో చేస్తుంటారు. ఇప్పుడు, ఆ పనిని సులభతరం చేసింది ఈ ‘జియానా లులుమ్ బేబీ సూథర్’. ఇదొక ఆల్ ఇన్ వన్ స్లీప్ మెషిన్. ప్రత్యేకమైన , ఆహ్లాదకరమైన పాటలు, శబ్దాలను ప్లే చేస్తూ చిన్నారులను త్వరగా నిద్రపుచ్చడానికిఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులోని క్రై డిటెక్షన్ టెక్నాలజీ, చిన్నారులను ఏడుపు విన్న 20 సెంకన్లలోపే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు, ప్రశాంతకరమైన శబ్దాలను ప్లే చేస్తుంది. తర్వాత రెడ్ లైట్ థెరపీలో భాగంగా డివైజ్ లైట్లను అడ్జస్ట్ చేస్తూ, పిల్లలను కామ్ చేయటానికి ప్రయత్నిస్తుంది. దీనిని, మొబైల్కు ఓ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులోని స్మార్ట్ ఇన్ఫాంట్ మానిటరింగ్ సాయంతో ఎక్కడి నుంచి అయినా ఈ డివైజ్ను ఆపరేట్ చేసుకోవచ్చు. టైమర్, నోటిఫికేషన్ , ఇతర సెట్టింగ్స్ అన్ని కూడా యాప్ లోనే సెట్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. (చదవండి: ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!) -
అవును... ఆమెకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరం
అందరికీ 7–8 గంటల నిద్ర అవసరమని అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిది గంటలసేపు నిద్రపోయిన తర్వాత కూడా, ఉదయం ఇంకా రిఫ్రెషింగ్గా లేకుండా, ఇంకా అలసటగా... బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం. అయితే స్త్రీల విషయంలోనే! అందరికీ కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. వైద్య పరిశోధకులు వివరణాత్మకంగా చెప్పిన విషయమే.పురుషులు 7–8 గంటల నిద్రలో బాగా పని చేయగలిగినప్పటికీ, మహిళలకు నిద్రకు మరికాస్త ఎక్కువ సమయం అవసరం. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు, నిద్ర గురించి మరికొంత అర్థం చేసుకుందాం.మంచి నిద్ర ఎందుకు ముఖ్యం?మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, జీవక్రియలు, చర్మం, జుట్టు నాణ్యతను, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కంటినిండా నిద్రపోయేవారికి ఆందోళన, డిప్రెషన్ స్థాయులు తక్కువ గా ఉండటం వల్ల వారు కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది. నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం ఆర్టెమిస్ హాస్పిటల్లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు, నిద్ర సమయంలో శరీరం కణజాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల, హార్మోన్ నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు. ‘దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మన మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది, ఉత్పాదకత తగ్గుతుంది. ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది‘ అని ఆయన చెప్పారు.పురుషుల కంటే మహిళలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. ‘మెదడు కోలుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మహిళల్లో నిద్ర, నిద్ర రుగ్మతలకు సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి‘ అని డాక్టర్ చెప్పారు.నిద్రకు సంబంధించి స్త్రీ పురుషులలో వ్యత్యాసం చాలా ఎక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం 11 నుంచి 13 నిమిషాల అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని వారికి కావలసిన అధిక నిద్రను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలనడాన్ని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేమితో సతమతమవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇది చాలా సమస్యలను కొనితెస్తుంది. ఏది ఏమైనప్పటికీ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వివాదాంశం. అయితే వారు మరికాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషుల సహకారం పూర్తిగా అవసరం. వయసును బట్టి నిద్ర అవసరాలు నవజాత శిశువులు, పసిబిడ్డలకు ఎక్కువ నిద్ర అవసరం. సరైన ఆరోగ్యం, పనితీరు కోసం సగటున, పెద్దలకు సాధారణంగా రాత్రికి 7–9 గంటల నిద్ర అవసరం. వయస్సుతో ΄ాటు నిద్ర అవసరాలు కొద్దిగా తగ్గవచ్చు, వృద్ధులకు ఇప్పటికీ రాత్రికి 7–8 గంటల నిద్ర అవసరం. -
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
బెడ్ వెట్టింగ్
సాధారణంగా పిల్లల్లో 95 శాతం మంది దాదాపుగా ఐదారేళ్ల వయసు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ నాలుగు శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే... ఒక శాతం (1%) మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో కాస్తపెద్దయ్యాక కూడా... అంటే 10 – 12 ఏళ్లు వచ్చాక కూడా కొందరు పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటారు. ఇలా పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ అన్యురిసిస్’ అంటారు. ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే... అలాంటి కుటుంబాల్లో 50 శాతం మందిలో... వాళ్ల పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.అన్యురిసిస్ సమస్యలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటిది ‘ప్రైమరీ అన్యురిసిస్. రెండోది సెకండరీ అన్యురిసిస్. ప్రైమరీ అన్యురిసిస్ : చిన్నారులు ఒక్క రోజు కూడా విడవకుండా ప్రతిరోజూ పక్క తడుపుతుంటే దాన్ని ‘ప్రైమరీ అన్యురిసిస్’ అంటారు. సెకండరీ అన్యురిసిస్ : ఇలా రాత్రుళ్లు పక్క తడిపే పిల్లలు కొన్నాళ్ల పాటు పక్కతడపకుండా బాగానే ఉండి, కొంతకాలానికి వాళ్లలో సమస్య మళ్లీ తిరగబెట్టడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇలా సెకండరీ అన్యురిసిస్ సమస్య రావడానికి తల్లిదండ్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం, కుటుంబంలోకి తమ్ముడో, చెల్లెలో వచ్చినప్పుడు కలిగే ఈర్ష్య (సిబ్లింగ్ జెలసీ) వంటి కారణాలతో పిల్లల్లో నెలకొన్ని మానసిక ఆందోళన వంటి అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ప్రైమరీ అన్యురిసిస్కు కారణాలు... ప్రైమరీ అన్యురిసిస్కు పిల్లల్లో నాడీ సంబంధమైన వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం అంటే న్యూరోనల్ మెచ్యురేషన్ డిలే, మూత్రం ఉత్పత్తి కాస్త ఎక్కువగా జరుగుతుండటం (ఇన్క్రీజ్డ్ యూరిన్ ్ర΄÷డక్షన్), బ్లాడర్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ బ్లాడర్ కెపాసిటీ)తో పాటు జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు కారణమవుతాయి.ఇతర కారణాలు...ఇలా పెద్దయ్యాక కూడా రాత్రి నిద్రలో పక్కతడిపే సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్, బ్లాడర్ డిస్ఫంక్షన్, నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ స్టడీస్ చేయించడం, బ్లాడర్ అనాటమీ అండ్ ఫంక్షనల్ టెస్ట్ చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు.ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. ∙సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. రోజులో తీసుకునే ద్రవపదార్థానికి 20 శాతానికి మించి 5 గంటల తర్వాత ఇవ్వకూడదు. ∙పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించడం వల్ల పక్క తడిపే అవకాశాలను తగ్గించవచ్చు.మేనేజ్మెంట్ / కేర్...ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ∙ఈ సమస్యకు హార్మోన్లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. ∙ -
ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...
చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతోనో లేదా బద్ధకం అలవాటవుతుందనో పిల్లలను ఎక్కువ సేపు నిద్రపోనివ్వరు. వాళ్లు కంటి నిండా నిద్రపోకముందే నిద్రలేపేస్తుంటారు. కారణం... వాళ్లు అలా నిద్రపోతూ ఉండటం, చురుగ్గా లేకపోవడంతో వాళ్లకేమైందో అన్న ఆందోళన వాళ్లను అలా నిద్రలేపేలా చేస్తుంది.పిల్లలు కంటినిండా నిద్రపోకపోవడం వల్ల వాళ్లు చికాకుగా, చిరాగ్గా ఉంటారని తెలుసుకోవాలి. రానున్నది చలికాలం. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా సేపు నిద్రపోవడం చాలా సాధారణం.చలికాలంలో ఎక్కువ సేపు నిద్ర ఎందుకు?పిల్లలు చలికాలంలో కొద్దిగా ఎక్కువగా నిద్రపోవడం చాలా సాధారణం. దీనికి మొదటి కారణం చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి నిడివి ఎక్కువ; రెండోకారణం వెలుగు తగ్గిపోయి చీకటి పడగానే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ స్రావాలు పెరగడం, నిద్ర మేల్కోడానికి ఉపయోగపడే సెరటోనిన్ స్రావాలు తగ్గడం... వంటి మార్పుల వల్ల చలికాలంలో నిద్ర పెరుగుతుంది. పిల్లలు ఎక్కువసేపు పడుకోవడానికి కొన్ని కారణాలు... ⇒ బరువు ఎక్కువగా ఉన్న చిన్నారులు ⇒ శ్వాస తీసుకోవడంలో సమస్యలున్నప్పుడు ⇒ సర్కాడియన్ రిథమ్లో మార్పులు (మనుషుల్లో నిద్రపోవడం, నిద్రలేవడంలోని క్రమబద్ధతను నిర్వహించే రిథమ్ను సర్కాడియన్ రిథమ్ అంటారు) ⇒మెదడు పనితీరులో కొన్ని లోపాలు ∙దగ్గు, జలుబు, అలర్జీలకు వాడే కొన్ని మందులు ∙ఆహార పదార్థాలు, హర్మోన్లలో మార్పుల వల్ల నిద్ర వ్యవధిలో మార్పులు రావడం వంటి అంశాలు నిద్ర పెరగడానికి కారణమవుతాయి. మరి... ఎన్ని గంటల నిద్ర నార్మల్...? పిల్లల్లోగాని, పెద్దల్లోగాని ఖచ్చితంగా నిద్రపోవాల్సిన వ్యవధి ఇదీ అంటూ ఎవరూ నిర్దిష్టంగా, నిర్ధారణగా చెప్పలేరు. మనుషులకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందన్న అంశం ఎప్పుడూ చర్చనీయాంశమైన విషయమే. అయితే సాధారణంగా పిల్లలు 8–9 గంటల పాటు నిద్రపోవడాన్ని నార్మల్గా పరిగణించవచ్చు. రోజూ పది గంటలకు మించి నిద్రపోవడాన్ని మాత్రమే కొన్ని రుగ్మతలకు సూచికగా చెప్పవచ్చు. ఒక ఉజ్జాయింపుగా చె΄్పాలంటే రోజుకు పదిగంటల కంటే ఎక్కువ, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్నారులు ఈ వ్యవధి కంటే తక్కువగా నిద్రపోతుంటే ఒకసారి థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు చేయించి, పిల్లల డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. -
ఈ మెంటల్ ఎక్సర్సైజ్తో మంచి నిద్ర షురూ..!
ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్నే సాగిస్తున్నారు.ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్సైజ్ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్సైజ్ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్లో ఏదోక ఒక వర్డ్ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడంనిర్ణిత సమయానికి నిద్రించడంసిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.సాయం సమయాల్లో వ్యాయామం చేయడంమద్యానికి దూరంగా ఉండటం.టెలివిజన్ లేదా స్మార్ట్ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటంయోగా, ధ్యానం వంటివి సాధన చేయడంతదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!) -
'స్లీప్మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?
ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్ చేసుకునేలా కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్మాక్సింగ్" వెల్నెస్ ట్రెండ్..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్మాక్సింగ్"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్మీడియాలో గ్రూప్గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్ మాక్సింగ్". ఒక ఔత్సాహిక సోషల్ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది. 'స్లీప్మాక్సింగ్' అంటే..నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్ప్లగ్లు, నాసికా డైలేటర్లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్మాక్సింగ్. దీని గురించి సోషల్ మీడియా వినియోగదారు డెరెక్ ఆంటోసిక్ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్మాక్సింగ్ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు. ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్తో చెక్ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్బ్యాండ్ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు. అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: 'సూసైడ్ పాడ్': జస్ట్ బటన్ నొక్కితే చాలు.!) -
లేలేలే.. లేలేలే.. నా రాజా
నిద్ర నుంచి ఎవరినైనా లేపొచ్చు.. ఈ పాటనే కాదు గానీ.. వేరే పాట పాడి కూడా లేపొచ్చు.. లేదా అలారం పెట్టి మరీ లేపొచ్చు. మరి.. శాశ్వత నిద్ర నుంచి.. అదేనండి.. చచ్చిపోయాక ఎవరినైనా లేపొచ్చా?? మేం లేపుతాం అని అంటున్నాయి కొన్ని కంపెనీలు.. అంతేకాదు.. తాము చెబుతున్నది అబద్ధం కాదని.. కావాలంటే మీరు చచి్చనంత ఒట్టు అని కొంచెం గట్టిగానే చెబుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో జనం ఈ ఒట్లను నమ్మారు. చచ్చాక కచి్చతంగా లేపుతారు కదూ అంటూ కంపెనీలతో తిరిగి ఒట్టేయించుకున్నారు కూడా.. వీళ్లంతా ఒట్లు తీసి గట్లు మీద పెట్టేలోపు.. మనం విషయంలోకి వెళ్లిపోదాం... రేయ్.. ఎవుర్రా వీళ్లంతావీళ్లంతా ఎవరంటే.. అల్కార్, టుమారో బయో, సదరన్ క్రయోనిక్స్, క్రియోరస్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అని ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్లేం చెబుతున్నారంటే.. చనిపోయాక మన శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. ‘ఫ్రిజ్’లాంటి దాంట్లో పెట్టేసి.. భవిష్యత్తులో అంటే ఏ 2100లోనో.. లేదా కల్కి 2898 ఏడీలోనో.. మరణాన్ని జయించే మందు లేదా ఏ జబ్బుతో చనిపోయారో దానికి చికిత్స వచి్చనప్పుడు మళ్లీ ‘లేపుతారట’!! ఇందుకోసం జస్ట్.. రూ.1.5–1.8 కోట్లు ఇస్తే చాలట.ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారా.. చెప్పాంగా.. చాలామంది నమ్మారు. ఏకంగా 6 వేల మంది ఈ సరీ్వసును బుక్ చేసుకున్నారు. అందులో 500 మంది దాకా.. ఆల్రెడీ ‘ఫ్రిజ్’లో శాశ్వత నిద్రలో ఉన్నారు. భవిష్యత్తులో తమను నిద్ర లేపే అలారం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో సదరన్ క్రయోనిక్స్ ఇటీవలే 80 ఏళ్ల సిడ్నీవాసి మరణించాక.. అతడిని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. భద్రపరిచింది. ఇలా భద్రపరిచిన వాటిల్లో పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంతా క్రయోప్రిజర్వేషన్ మహిమ. అంటే.. అత్యంత శీతల వాతావరణంలోమానవ శరీరాన్ని భద్రపరచడం.1 మనిషి చనిపోయాక.. ఈ కంపెనీల ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగుతాయి. మెదడు ‘చనిపోకుండా’ప్రత్యేక పరికరాల ద్వారా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేస్తారు.2 శరీరాన్ని ఐసులో ఉంచుతారు. రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు..3 ప్లాంట్కు వెళ్లాక.. శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయి దెబ్బతినకుండా ఉండటానికి వాటి నుంచి ద్రవాలను తీసేసి.. బదులుగాగ్లిజరాల్ బేస్డ్ రసాయనాన్ని ఎక్కిస్తారు (ఈ కంపెనీల్లో టుమారో బయో మాత్రం వాహనంలో ప్లాంటుకు తెస్తున్నప్పుడే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది)4 తర్వాత శరీరాన్ని డ్రై ఐసులో –130 డిగ్రీల ఉష్ణోగ్రతకు వెళ్లేదాకా ఉంచుతారు..5 అనంతరం లిక్విడ్ నైట్రోజన్ (–196 డిగ్రీలు) ఉన్న మెటల్ కంటైయినర్లో తలకిందులుగా వేలాడదీస్తారు. ఎందుకంటే.. ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయినా సరే.. మన మెదడు భాగం ద్రవాల్లోనే సురక్షితంగా ఉంటుంది. నమ్మకమే జీవితం..మనమా.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని.. అలానడుచుకుంటూ వెళ్లిపోదాం.. ఇంత చెబుతున్నారు సరే.. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే.. సినిమాల్లోనే అయితే సాధ్యమే. కానీ బయట అంటే.. ప్రస్తుతానికైతే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లను బతికించే టెక్నాలజీయే లేనప్పుడు ఇలా చేయడం మోసపుచ్చడమే అని విమర్శిస్తున్నారు. ఎప్పటికి వస్తుంది అంటే.. చెప్పడం కష్టమేనంటున్నారు.అయితే.. ఏదో సినిమాలో ‘నమ్మకమే జీవితం’అన్నట్లు ఈ కంపెనీలు మాత్రం భవిష్యత్తుపై ఆశలు చూపుతున్నాయి. ఇటు జనమూ అలాగే డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సంపన్నులే. వీరు తమ సంపదను అనుభవించడానికి.. అలాగే అమరత్వం సాధించడానికి అన్నట్లుగా చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీలు, అద్భుతాలను వీక్షించేందుకు ఇదో అవకాశమని భావిస్తున్నారు. ఇప్పుడు నయంకాని జబ్బులను నయం చేసే మందులు భవిష్యత్తులో వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఇంతకీ మనమేం చేద్దాం.. -
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే!..!
మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..జపాన్లో హ్యూగో ప్రిఫెక్చర్కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు. అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్లు ఇవే..!) -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
పగటి నిద్ర మేలే సుమా!
పగటి నిద్ర పనికి చేటు అన్నారు మనవాళ్లు. కానీ పరిశోధకులు మరోరకంగా అంటున్నట్టున్నారు. పగటి పూట పని చేసుకునేట ప్పుడు కళ్ళు బరువెక్కుతాయి. నిద్ర వస్తున్న భావన కలుగుతుంది. అప్పుడు కాసేపు పడుకుంటే తప్పా? అంటే కాదు అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యం దృష్ట్యా చూస్తే కొంతసేపు పడుకోవడం మంచిదే అంటున్నారు. అయితే ఈ పగటి నిద్ర అందరిపైనా ఒకే ప్రభావం కలిగిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. చాలామందిలో మాత్రం కొంతసేపు పడుకుంటే మంచి జరుగుతుంది అని గమనించినట్లు పరిశోధకులు చెబు తున్నారు. క్రమంగా ప్రతి నిత్యం మధ్యాహ్నం కొంచెం సేపు పడుకుంటే అన్ని రకాల మంచిదే. దాని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అని కొంత కాలం క్రితమే తెలుసుకున్నారు. మెదడుకు కూడా మంచిదే అంటున్నారు. మెదడు కణాలు తగ్గకుండా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గడం అనే సమస్య తగ్గుతుంది. అయితే ఎంతసేపు పడుకోవాలి అన్నది పెద్ద ప్రశ్న. అరగంట వరకు పడుకుంటే తప్పు లేదు. మెదడుకు మంచి ఆరోగ్యం అందుతుంది, అది పనిచేసే, పెరిగే తీరు సక్రమంగా సాగుతుంది అంటున్నారు విక్టోరియా గార్ఫీల్డ్. ఆమె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో పరిశోధ కురాలు. సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విష యాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరో గ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. పాత పరిశోధనల ఫలితాలను ఇక్కడి ఫలితాలతో సరిపోల్చి చూశారు. నిజానికి 2009లోనే ఇటు వంటి పరిశోధనా ఫలితాలు ‘స్లీప్ రీసెర్చ్’ అనే పత్రికలో వచ్చాయి. కొంతసేపు పడుకున్న వారిలో వారు పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపకశక్తి లాంటి అంశా లలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్ర పోయి లేచిన తర్వాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. పరిశోధనకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కునికిన వారు కూడా ఆ లెక్కలను సులభంగా సాల్వ్ చేయగలిగారు. వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువ సేపు నిద్ర పోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకు దనం కనిపించలేదు. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. నిద్ర సరిగా రానివారూ, కావలసినంత నిద్ర పోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటు న్నారు. షిఫ్ట్లలో పనిచేసేవారూ, చిన్న శిశు వులతో బతికే తల్లితండ్రులూ, రాత్రిపూట సరిగా నిద్ర పట్టని పెద్ద వయసు వారూ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్లో పని చేస్తున్న వాళ్లు షిఫ్ట్ మధ్యలో కొద్ది సేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలు గదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వర లోనే పరిస్థితి మారిపోతుంది. వారిలో చురుకు దనం కనిపిస్తుంది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో పని చేస్తున్న నటాలి డాటోవిచ్ బృందం వారు కూడా ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. వారికి నిజానికి ఔషధాలు తయారు చేసే కంపెనీలు, వైద్య పరికరాల కంపెనీలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. 20 నిమిషాలు పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గంటనుంచి గంటన్నరసేపు పడుకుంటే మరింతమంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నటాలి. పడుకుంటే 20 నిమిషాలు పడు కోవాలి, లేదంటే గంటపైన పడు కోవాలి. అంతే కానీ మధ్యలో లేస్తే అంత మంచి ప్రభావం ఉండదు అని గమనించారు. ఎక్కువ రోజులపాటు ఇలా కునుకులు తీసే వారి మీద ప్రభావం గురించి మాత్రం అంతగా సమాచారం లేదు. నిద్రకు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి గల సంబంధాన్ని గురించి చెప్పడం అంత తేలిక కాదు అని కూడా ఈ పరిశోధకులు అంటున్నారు. ‘కొంచెం సేపు నిద్రపోతే మంచిదేనట’ అని నిద్రకు ఉపక్రమించేవారు ఫలితాలను గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.మంచి ఫలితాలు కనిపిస్తే కొంచెం సేపు నిద్రించ వచ్చు. ఆ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసు కోవాల్సినది.డా‘‘ కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత -
నిద్రారాక్షసం
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. ‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్ కవి, రచయిత హేన్రిక్ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్/ వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్ న్యోక్ మై కిమ్ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. -
గంటల తరబడి ఏసీతో అనర్థాలెన్నో!
గతకొద్దేళ్లుగా పర్యావరణ కాలుష్యం, మానవ కార్యకలాపాలు కారణంగా సమ్మర్లో ఎండలు దంచి కొట్టాయి. సూర్యుడి భగభగలు మాములుగా లేదు. అంతేగాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్ సైతం ప్రజలు అధిక వేడిని ఎదుర్కొటున్నారని, బిలయన్లమంది ప్రజలు ప్రాణాంతక వేడి తరంగాలతో అల్లాడుతున్నారంటూ హెచ్చరించారు. అంతేగాదు ఇటీవల ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు సైతం అప్పో సొప్పో చేసి మరీ కూలర్ లేదా ఏసి కొనుక్కుని ఉపశమనం పొందుతున్నారు. ఈ విపరీతమైన వేడికి భయపడే ఏసీ గదుల్లో గంటల్లకొద్ది నిద్రిస్తున్నారు. కొందరైతే తెల్లవార్లు ఏసీ ఆన్చేసి పడుకుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏసీలో పడుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు..పొడి కళ్ళు: ఏసీ గాలి నుంచి తేమను తొలగిస్తుంది. ఇది కళ్లను పొడిగా చేసి.. దురద, అసౌకర్యానికి దారితీస్తుంది.బద్ధకం: చల్లని ఉష్ణోగ్రతలు జీవక్రియ రేటును తగ్గించి, శరీర ప్రక్రియలను నెమ్మదిస్తాయి. ఇది అలసట, మగతకు దారితీస్తుంది.నిర్జలీకరణం: పొడి గాలి వేగవంతమైన తేమ నష్టాన్ని కలిగిస్తుంది. తగినంతగా నీళ్లను తాగకపోతే నిర్జలీకరణానికి దారితీస్తుంది.పొడి లేదా దురద చర్మం: తక్కువ తేమ చర్మం తేమను కోల్పోయేలా చేసి చర్మ పొడిబారినట్లుగా అయిపోతుంది. దీంతో ఒక విధమైన దురద, చికాకుకు కలుగుతుంది.తలనొప్పి: ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు, చల్లని పొడి గాలి తలనొప్పి, సైనస్కు కారణమవుతుంది.శ్వాసకోశ సమస్యలు: చల్లని మరియు పొడి గాలి వాయుమార్గాలను చికాకుపెడుతుంది, ఉబ్బసం మరియు అలెర్జీల వంటి అధ్వాన్నమైన పరిస్థితులు.అలెర్జీలు, ఉబ్బసం: ఎయిర్ కండిషనింగ్లో దుమ్ము ధూళి వంటి అలెర్జీ కారకాలను కలిగి ఉంటాయి. ఇది అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.శబ్ద కాలుష్యం: నిరంతరం హమ్మింగ్ చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించి, చికాకు కలిగిస్తుంది.అంటువ్యాధులు: పేలవంగా నిర్వహించబడే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు బాక్టీరియా, వైరస్లు,శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి.నవజాత శిశువులపై ప్రభావంఎయిర్ కండీషనర్లను సరిగ్గా ఉపయోగిస్తే నవజాత శిశువులకు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు శిశువు శరీర ఉష్ణోగ్రతకు ఉష్ణోగ్రతను నియంత్రించాలి, సర్దుబాటు చేయాలి. నవజాత శిశువును గదిలోకి తీసుకురావడానికి కనీసం 20 నిమిషాల ముందు AC ఆన్ చేయాలి, అదికూడా 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉంచాలి. దగ్గు, న్యుమోనియా వంటి వ్యాధుల బారినపడకుండా ఉండేలా చల్లటి గాలికి ప్రత్యక్షంగా గురికాకుండా జాగ్రత్తపడాలి. కొంతమంది నవజాత శిశువులకు కూడా చల్లని ఉష్ణోగ్రతలకు అలెర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతమైన చలికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా దుమ్ము వంటి అలర్జీలను నివారించడానికి ఎయిర్ కండీషనర్లను తరచుగా శుభ్రం చేయాలి.(చదవండి: ఈగను చంపడంతో ..ఏకంగా కన్నే పోగొట్టుకున్నాడు..!) -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
ఆకలి... నిద్ర సరిగా లేవా? మెగ్నీషియం లోపం కావచ్చు
మన శరీరం ఫిట్గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. అనారోగ్యాలు వేధిస్తుంటాయి!శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా... వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారుతుంటాయి. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారు.సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం లోపించదు. -
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
ఢైలీ రొటీన్ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్ఎన్ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్లో కెఫిన్ కంటెంట్లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు -
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్ఫోన్ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్సామ్నియా డిజార్డర్’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్గానూ ఉండవచ్చు. ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్ ఇన్సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... ప్రైమరీ ఇన్సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్సామ్నియా’ అంటారు. సెకండరీ ఇన్సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా, క్యాన్సర్ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’గా చెప్పవచ్చు. ఇన్సామ్నియాకు కారణాలు చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి) జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).మేనేజ్మెంట్ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం మంచిది. నిద్రలేమి నివారణ ఇలా... వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్న్యాప్లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్తో కూడా నిద్రను దూరం చేస్తుంది.ఆల్కహాల్తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ (చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ) -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..
నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే.. కజకిస్తాన్లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?) -
SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్
టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్ మూన్ ల్యాండర్ స్లిమ్(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) నిద్రలోకి జారకుంది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్(ట్విటర్)లో వెల్లడించింది. రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్ను కచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్గా కూడా పిలిచారు. చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్ తర్వాత జపాన్ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్ కంపెనీ ఐఎమ్ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్ ల్యాండ్ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది. చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 3/1午前3時過ぎ(日本標準時)にしおりクレータは日没を迎え、SLIMは再び休眠に入りました。厳しい温度サイクルを繰り返すことになるため故障確率は上がりますが、次回の日照(3月下旬)でもSLIMは再び運用を試行する予定です。#JAXA #SLIM #たのしむーん 2/29 23:00過ぎ 航法カメラによる周辺画像 pic.twitter.com/xutv56uSU9 — 小型月着陸実証機SLIM (@SLIM_JAXA) March 1, 2024 ఇదీ చదవండి.. టెక్సాస్లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం -
30 సెకెన్లలో గాఢ నిద్రకు మూడు సూత్రాలు: ప్రధాని మోదీ!
ఏడవ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు గాఢనిద్రకు గల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తనకున్న ఒక అలవాటును వివరిస్తూ, దాని కారణంగానే తాను ప్రతిరోజూ సులభంగా గాఢ నిద్రలోకి జారుకుంటానని తెలిపారు. తాను గాఢ నిద్రలోకి వెళ్లడానికి కేవలం 30 సెకన్లు మాత్రమే సరిపోతుందని ప్రధాని మోదీ తెలిపారు. మంచంపై పడుకున్నాక కేవలం 30 సెకన్లలో గాఢ నిద్రలోకి జారుకుంటానని, ఇది సంవత్సరంలో 365 రోజులూ జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను పనిచేసే సమయంలోనే పనిచేస్తానని, నిద్రపోయే సమయంలో మాత్రమే నిద్రపోతానని అన్నారు. మేల్కొన్నప్పుడు పూర్తి మెలకువలో ఉంటానని, నిద్రించేటప్పుడు పూర్తి నిద్రలో ఉంటానని పేర్కొన్నారు. ఇదే ప్రధాని మొదటి గాఢ నిద్రా రహస్యం. ఇక ప్రధాని మోదీకి అలవాటైన రెండో గాఢ నిద్రా రహస్యం సమతుల ఆహారం. వయసును బట్టి సమతులాహారం తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా గాఢ నిద్రకు సహాయ పడుతుందన్నారు. గాఢ నిద్రకు ప్రధాని మోదీ చెప్పిన మూడవ కీలక సూత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కుస్తీ తరహాలోని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని, తేలికపాటి వ్యాయామాలు కూడా గాఢ నిద్రకు సహాయపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాఢ నిద్రతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. విద్యార్థుల విజయానికి ప్రధాని సూచనలు ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోండి. జీవితంలో పోటీతత్వం ఉండటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులను తక్కువ చేసి చూడకూడదు. మంచి విద్యార్థులతో స్నేహం చేయండి. వారిపై అసూయ పెంచుకోవద్దు. ఉపాధ్యాయుని పని కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. జీవితాలను మెరుగుపరచడం. పరీక్షకు ముందు విద్యార్థులు తగిన శ్రద్ధ వహించాలి. అప్పుడు పరీక్ష సులువవుతుంది. రాసే అభ్యాసం కూడా విద్యార్థులకు చాలా ముఖ్యం. మొబైల్కు ఛార్జింగ్ ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యానికి క్రీడలు కూడా అంతే ముఖ్యం. -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
ఎప్పుడు లేస్తామన్నదీ కీలకమే!
మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటి నుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారని చెబుతారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు. కొంతమంది రాత్రి చాలాసేపు వరకు పని చేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు ‘క్రోనోటైప్’ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు. అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60 శాతం మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్ర లేవడం అన్న లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధ కులు. ఇంగ్లీష్లో రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు, త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు. పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువ సేపు మేల్కొంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట. ఇంతకు నిద్ర, మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరి శోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధార ణంగా ఆనందంగా ఉంటారు. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్ర లేచే వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు తేలింది. విద్యార్థులు త్వరగా నిద్ర లేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది. విద్యార్థులలో 26.6 శాతం మంది గబ్బిలాలు (అంటే రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు). అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురు కుగా ఉన్నారట. ఈ మధ్య ఒక జర్మన్ యూని వర్సిటీ పరిశోధనలో త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి. విషయం అను కున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్న వాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికీ తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది. ఇంతకు నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవు తాయి? సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగల వారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశాభావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడే వారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉంటున్నారని గమనించారు. జన్యుపరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది. అన్నిటికీ మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచే వారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మారే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు. ఉదయాన త్వరగా నిద్ర లేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్కు వెళ్లి రావచ్చు. వార్సా యూనివర్సిటీలో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా నిద్రపోయే విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి. అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం. వ్యాసకర్త సైన్స్ రచయిత డా‘‘ కె. బి. గోపాలం -
ఈ వారం కథ - ‘కంటి నిండా కునుకు’
ఈమధ్య రాత్రయితే సరిగా నిద్ర పట్టడంలేదు దుర్గారావుకి. పక్కమీద యిటు దొర్లా, అటు దొర్లా. కునుకు పట్టినట్టే పట్టి, మళ్లీ యెవరో లేపినట్టు ఉలిక్కిపడి లేచిపోతాడు. పిసరు కునుకు కోసం, చీకట్లో మూతపడని కళ్ళతో యెదురుచూపులు... మంచానికి ఆవైపు భార్య జయమ్మ ఒళ్లెరుగని నిద్ర. ఇల్లాలు ఇంటిపనంతా చేసుకుని, మామయ్యగారి గదిలో పక్కసర్ది , పెద్దాయనకి దుప్పటి కప్పి, మంచం పక్క నీళ్ల చెంబు వుందో లేదో చూసుకుని, ఏమైనా కావాలంటే పిలవండి మామయ్యా అని నిష్క్రమిస్తుంది. దుర్గారావు సంగతికొస్తే, ధనార్జనకి యెన్ని అడ్డతోవలు వున్నాయో అతనికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు మరి. కాకుల్ని కొట్టి గద్దలకి వెయ్యడం దుర్గారావుకి వెన్నతో పెట్టిన విద్య. అన్నట్టు, కథలోంచి పిట్టకథకి వెళ్లడం యెందుకూ..! దుర్గారావుకి నిద్రయితే పట్టలేదు కానీ బుర్రనిండా ఆలోచనలే. రేపు తెల్లారితే యెన్ని పనులు! తను కబ్జా చేసిన రైతుల భూముల కేసు కోర్టులో హియరింగు. పనికిమాలిన లాయరు మూడేళ్లుగా లాగిస్తున్నాడు తెమల్చకుండా. లాభం లేదు... పెద్దరైతుని లేపేస్తే సరి. అప్పటికీ ఓ పదో పరకో పడేస్తాను, పట్టుకుపోయి బాగుపడండ్రా అంటే వినరుకదా! విత్తనాలకి డబ్బుండదు... పైర్లకు మందులు కొట్టించలేరు, నాట్లకీ.. కోతలకీ కూలీలు దొరకరు. వాళ్ళ కష్టాలకి జాలిపడి, భూములు కబ్జాచేసి, తలాకొంచెం పట్టుకుపోదాం రండిరా అంటే, వింటేగా! పెద్దరైతుని లేపెయ్యడమే బెస్టు. అలాగే కష్టపడి చెరువులు పూడిపించి ఫ్లాట్లు కట్టిస్తే, ఏడాదిలో బిల్డింగు కుంగిపోడం యేమిటో.. కొన్నవాళ్ళ ఖర్మ కాదూ. బిల్డింగు కూల్చేదానికి నోటీసు యిప్పించేసి, అది కూల్చే కాంట్రాక్టు కూడా తనే సంపాదించడం యెంత కష్టం. జనాలకి విశ్వాసం లేదు. అంతెందుకు.. కన్న కొడుక్కి వుందా విశ్వాసం! లక్షలు తగలేసి ఇంజనీరింగు చదివిస్తే, యాభై లక్షల కట్నంతో వస్తున్న ఎమ్మెల్యే గారి మెల్లకన్ను కూతుర్ని చేసుకోడానికి వీడికి యేమాయ రోగం? ఎవరినో లవ్వు చేశాట్ట. ఆ పిల్లను తీసుకుని సీమకెళ్లి చచ్చాడు. పైగా ‘నాయనా, నీ పాపపు ఆస్తి నాకొద్దు, ఎవడికి రాస్తావో రాసుకో’ అని నీతులు కూడాను. కునుకుపట్టే వేళకి వీథి తలుపు చప్పుడు, టక టకా, టక టకా... ఈ వేళప్పుడు యెవరా అనుకుంటూ, దుర్గారావు తలుపు తీశాడు. తనంటే కిట్టనివాళ్లు యెవరైనా వచ్చి రెండు పోట్లు పొడుస్తారన్న భయం కూడా లేదు. చీకట్లో కలిసిపోయేలా నల్లటి ఆకారం.. బలిష్టంగా, కళ్ళలో యేదో మెరుపు. ‘మీరు..’ అంతకన్నా మాటపెగల్లేదు దుర్గారావుకి. ‘ష్.. గట్టిగా మాట్లాడకు, మీ ఆవిడ, పక్కగదిలో నాన్న.. లేచిపోతారు’ అగంతకుడి గొంతు చిత్రంగా వుంది. ‘ఎవరు నువ్వు? నీకు మా వాళ్ళు యెలా తెలుసు?’ అని అడగాలనుకున్నా అడగలేకపోయాడు దుర్గారావు. నల్లటి ఆకారం పరిచయం వున్నట్టు డ్రాయింగ్ రూమ్లోకి నడిచింది. మంత్ర ముగ్ధుడిలా వెనక దుర్గారావు! లైటు వెయ్యబోతున్న దుర్గారావుని వద్దంటూ సైగ చేసింది ఆకారం. గది కిటికీలోంచి మసక వెలుతురు. ‘అలా కూర్చో’ అది తిరుగులేని ఆజ్ఞలా అనిపించింది దుర్గారావుకి. నెమ్మదిగా, ధైర్యం కూడగట్టుకున్నాడు దుర్గారావు. ‘యెవరు నువ్వు? యీ వేళకి యెందుకొచ్చావు?’ నీరసంగా మాట పైకి వచ్చింది. అప్పుడు నవ్వింది ఆకారం. ‘మృత్యువు పేరు విన్నావా? వినుండవేమో కదూ, నేనే ఆ మృత్యువుని. నాకు వేళాపాళా వుండదు. వెళ్లాలనుకున్న చోటికి వెళ్లడమే నాపని.’ దుర్గారావు వులిక్కిపడ్డాడు. నమ్మలేడు, నమ్మి తీరాలి.. అదీ పరిస్థితి. ‘మనం కాసేపు మాట్లాడుకుందాం.. సరేనా?’ దుర్గారావు జవాబుని యెదురు చూడలేదు మృత్యువు. దుర్గారావు చేసిన వొక్కో అకృత్యాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది మృత్యువు. ఇది యెలా సాధ్యం! ‘నిన్ను తీసుకెళ్లాలి, కానైతే నీతోవున్న యింత పెద్ద పాపపు భారాన్ని మోసుకెళ్లడం కుదరదు. నీ ప్రయాణంలో లగేజ్ అనుమతించ బడదు. యెలాగా అని ఆలోచిస్తున్నా’ మృత్యువు ముఖంలో చిరునవ్వు. సరే మరో నాల్గయిదు రోజుల్లో వస్తా... సిద్ధంగావుండు...’ ఆకారం లేచి నిల్చుంది. ‘నువ్వు... నువ్వు యెవరు? కరోనావా?’ దుర్గారావు నీరసంగా అడిగాడు ధైర్యం కూడగట్టుకుని. ‘చెప్పాను కదా... నేను మృత్యువుని... యింతకీ నువ్వనే కరోనా యెవరో నాకు తెలీదు. త్వరలో కలుద్దాం!’ చీకట్లో వచ్చిన ఆకారం గాల్లో తేలిపోతున్నట్టు నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయింది. దుర్గారావుకి అంతా అగమ్యగోచరంగా వుంది. మృత్యువు ఎందుకొచ్చినట్టు, యిప్పుడెక్కడికెళ్ళినట్టు! దుర్గారావు భయమంటే ఎరగడు. అలాంటిది రాత్రి జరిగిన సంఘటన పదే పదే మెదులుతూ వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్నది. తనని చూసి జనాలు భయపడుతుంటే.. దాన్ని గౌరవం అని భావించడం ఒక పొరపాటు. తను ఏం చేశాడని కొడుకు విశ్వాసం చుపించాలి? కూడపెట్టిన సంపద ఇప్పుడు ఎవరికి యివ్వాలి? ‘సరే తరవాత ఆలోచిద్దాం’ అనుకున్నాడు దుర్గారావు. కోర్టుకి టైమవుతున్నదని పూనకం వచ్చిన వాడిలా బయలుదేరాడు. దుర్గారావు కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తుండగా జరిగిపోయింది ఆ సంఘటన. కోర్టు నుండి బయటకి వెడుతున్న కారు విసురుగా దుర్గారావుని ఢీ కొట్టడం, దుర్గారావుకి స్పృహ తప్పడం! కోర్టు జనాలు అతడివైపు పరుగెత్తుకుంటూ రావడం కూడా అతనికి తెలీలేదు. దుర్గారావు కష్టం మీద కళ్లు తెరిచాడు. చేతికి, తలకి, కట్లు. గదిలో నర్సుల హడావిడి. అప్పుడు గమనించాడు దుర్గారావు. తనకి రక్తం ఎక్కిస్తున్నారు... మర్నాడు పోలీసులు... ఎంక్వైరీ... యథావిధి. వకీలు ఎంతచెప్పినా దుర్గారావు వినిపించుకోలేదు. ‘ఈ సంఘటన యథాలాపంగా నా పరధ్యాన్నం వల్లే జరిగింది. ఇందులో కారు నడిపేవాడి తప్పులేదు. కోర్టుకి హాజరయే హడావిడిలో నేనే చూస్కోకుండా బండికి అడ్డం పడ్డాను’ దుర్గారావు స్టేట్మెంట్ యిస్తుంటే, నల్లకోటు తలపట్టుకుని కూర్చుంది. డ్యూటీ డాక్టర్లు, నర్సుల వల్ల అర్థమైందేవిటంటే.. కోర్టు ఆవరణలో అపస్మారకస్థితిలో ఉన్న తనని ఓ నలుగురు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. డిపాజిట్ అదీ వాళ్ళే కట్టి ట్రీట్మెంట్ వెంటనే జరిగేలా చూశారు. నాలుగు యూనిట్ల రక్తం కూడా వాళ్ళే దానం చేశారు. తన వకీలుకూ కబురుపెట్టి రప్పించారు. ‘ఇంతసాయం చేశారు కదా మీకు ఈయన యెలా తెలుసు?’ అని డాక్టర్లు అడిగితే, ‘యెలా ఏవిటండీ ఆరి భూవులు దున్నుకుని బతికేటోళ్ళం... ఆరికి మేం మాకున్నంతలో కూసింత రగతం యిచ్చాము... అంతేకదా సారూ’ అన్నారట. మరి తన వకీలుగారు యిదంతా యెందుకు చెప్పలేదో. రేపో మాపో డిశ్చార్జ్ చేస్తారనగా దుర్గారావు వకీలుకి కబురు పెట్టాడు.. ‘వీలునామా రాయాలి’ అని. ‘ఇప్పుడేం తొందర? మీరు హాయిగా యింటికెళ్లి కోలుకున్నాక రాయచ్చు లెండి’ అంటున్న వకీలు మాటలకి దుర్గారావు అడ్డుపడ్డాడు. ‘అన్నట్టు వకీలు గారూ... రేపు వచ్చేప్పుడు మన కక్షిదారు పెద్దరైతుని కూడా రమ్మనండి!’ దుర్గారావు మొహంలో వకీలుకి యే భావమూ కనిపించలేదు. ‘ఇది నేను పూర్తి ఆరోగ్యంతో వుండగా, యెవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయం...’ అంటూ వకీలు రాసింది చదివాక దుర్గారావు సంతకం పెట్టాడు. కాగితం మీద పెద్దరైతు, మరో ముగ్గురు వేలిముద్రలు వేశారు. దుర్గారావు కోరికమీద ఒక డాక్టరు, నర్సు సాక్షి సంతకాలు కూడా పెట్టేశారు. మనం కూడా ఆ రాసిందంతా యెందుకు చదవడం... రెండు మెతుకులు ముట్టుకు చూస్తేసరి.. అన్నం వుడికిందో లేదో...! ‘కోర్టు పరిధిలో వున్న కేసులన్నీ వాపసు తీకుంటున్నాను... భూములు.. పంటపొలాలు సర్వే ప్రకారం కౌలుదార్లకీ, పెద్దరైతుకీ చెందుతాయి. మా వకీలు ఆ మేరకి కావలసిన పత్రాలు సిద్ధం చేస్తాడు. తనవల్ల నష్టపోయిన ఫ్లాట్ వోనర్లందరికీ నష్టపరిహారం...! తేలికపడిన మనసుతో దుర్గారావు యిల్లు చేరాడు. వకీలు తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు. రోజులు వారాలయిపోయాయి. కాలెండర్లో నెలలు తిరిగాయి... దుర్గారావుకి పడుకోగానే కంటినిండా కునుకు పడుతున్నది. యే అర్ధరాత్రో తలుపు చప్పుడు విందామన్నా నిద్రలో వినపడదు కదా! - వల్లూరి విజయకుమార్ -
అర్థరాత్రుళ్లు.. ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? దీనివల్లే కావొచ్చు
కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఓ పట్టాన నిద్రపట్టదు. మరికొందరు నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఇంకొందరు అర్థరాత్రుళ్లు 1-4 గంటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అని ప్రయత్నించినా నిద్రపట్టదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకున్నామంటే తెల్లారే వరకు లేవకూడదు. అలా అయితేనే మంచి నిద్ర పట్టినట్లు. నిద్రలో పదేపదే మెలకువ వస్తే వారు జాగ్రత్త పడాల్సిందే. అర్థరాత్రుళ్లు మనం లేచే సమయాన్ని బట్టి మనం ఏ విషయం గురించి ఆందోళన చెందుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చట. అర్థరాత్రి 1 గంటలకు.. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణంగా గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఆ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీరు మానసికంగా చాలా స్ట్రెస్లో ఉన్నట్లు అర్థం. 2 గంటలకు.. ఈ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీ శరీరం చాలా అలిసిపోతుందని, దానికి కాస్త రెస్ట్ అవసరమని గ్రహించాలి. దీనికోసం ఎక్సర్సైజ్, మంచి డైట్ వంటివి రెగ్యులర్ రొటీన్లో అలవాటు చేసుకోవాలి. 3 గంటలకు.. తెల్లవారుజామున 3 గంటలకు మెలవకువ వస్తుందంటే కాస్త భయానకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయాన్ని డెవిల్స్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో ఆత్మలు కలలోకి వస్తాయని కొందరి విశ్వాసం. అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ధ్యానం చేయడానికి సరైన సమయంగా చెబుతున్నారు. ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నిద్రలేవొచ్చు అని, కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు. రాత్రి 3.30 నిమిషాలు ఈ సమయంలో నిద్ర లేస్తున్నారంటే మీరు మంచి అభివృద్ది పథంలో కొనసాగుతున్నట్లు అర్థమట. ఈ సమయంలో దేవతలు సంచరిస్తుంటారనే విశ్వాసం కూడా ఉంది. తెల్లవారుజామున 4గంటలకు.. తెల్లవారుజామున 4 గంటలకు ఉలిక్కి పడి లేస్తున్నారంటే మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, చాలా నిరాశతో ఉన్నట్లు ఈ సమయం సూచిస్తుందట. ఉదయం 4.30 గంటలకు.. ఈ సమయంలో మీరు మేల్కొనడం మంచిదే అని పరిశోధనల్లో వెల్లడైంది. చాలా పాజిటివ్ మైండ్తో జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుందని కొందరి నమ్మకం. ఉదయం 5గంటలకు.. అకస్మాత్తుగా 5 గంటలకు తరచూ లేస్తున్నారంటే జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్యల వల్ల కావొచ్చట. సాయంత్రం వేళల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. అంతుకే నైట్ టైం లైట్ ఫుడ్ను తీసుకోవాలి. ఇలాంటి వాళ్లు రాత్రి 7 గంటలు లేదా అంతకంటే ముందే భోజనాన్ని తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. -
అర్థరాత్రి దాటాక నిద్రపోతున్నారా? మీ గుండె రిస్క్లో పడ్డట్లే!
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నిద్రవేళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే హార్ట్ రిస్క్ తగ్గుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ నిద్రకు ఏ సమయం మంచిది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా 80% కంటే ఎక్కువ గుండె జబ్బులను నివారించవచ్చని మీకు తెలుసా? ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది.ఈ రీసెర్చ్ కోసం సుమారు 88వేల మందిని పరిశీలించారు. ఇందులో 60% మంది మహిళల వయసు దాదాపు 61 ఏళ్లుగా ఉంది. వీరిలోరాత్రి 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో హార్ట్ రిస్క్ తక్కువగా ఉందని తేలింది. అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయిన వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం సుమారు 24% ఎక్కువగా ఉంది. అందుకే రాత్రిళ్లు త్వరగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సుమారు 7-8గంటలకు తగ్గకుండా, రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మరింత మంచిదంటున్నారు. -
పగటి పూటా ఓ కునుకేయండి
సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర ప్రమాదకరం తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ సమయంతోనే ముప్పు స్క్రీనింగ్ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది. ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు. -
రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
ఈ మధ్య కాలంలో చాలామందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిద్ర కష్టాలు చిన్నవిగా అనిపించినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల రోజంతా తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. కంటినిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు పాటిస్తే సరి.అవేంటో చూద్దామా ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు నిద్రపోవడానికి, నిద్రలేవడానికి ఒక సమయాన్ని కేటాయించండి. పగలు నిద్రపోయే అలవాటు ఉంటే, దాన్ని 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలి. నిద్రవేళకు 4 గంటల ముందు మద్యం తీసుకోవడం,ధూమపానం చేయవద్దు. నిద్రవేళకు 6 గంటల ముందు కెఫిన్ మానుకోండి. నిద్రవేళకు 4 గంటల ముందు ఎక్కువగా, కారంగా లేదా చక్కెర కలిగిన ఆహారాన్నితీసుకోవద్దు. నిద్రపోవడానికి ముందు తేలికపాటి చిరుతిండి తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కాని నిద్రపోయే ముందు చేయడం మంచిది కాదు. సౌకర్యవంతమైన పరుపులను వాడండి. దీనితో పాటు, ఉష్ణోగ్రత కూడా నిద్రకు అనుకూలంగా ఉండాలి. చాలా వేడి, చల్లని వాతావరణంలో కూడా నిద్రపోలేరు కాబట్టి సరైన టెంపరేచర్ ఉండేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోండి. నిద్రపోయే ముందు శబ్ధాలకు దూరంగా ఉండండి. బెడ్ రూంలో సాధ్యమైనంత ఎక్కువ కాంతి ఉండకుండా చూడండి. -
ఈ వాచ్ పెట్టుకుంటే నిద్ర సమస్యలు పరార్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘సామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకొని ఓ కొట్టు..ఎక్కడంటే..) -
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
ఈ పొరపాటు చేస్తే.. ఏజ్డ్ పర్సన్లా కనిపించడం ఖాయం!
ఇటీవలకాలంలో చాలామంది ఏజ్ పరంగా చూస్తే చిన్నవాళ్లే అయినా వారిని చూస్తే ఏజ్డ్లా కనిపిస్తారు. వాళ్లు చెబతేగానీ మనకు తెలయను కూడా తెలియదు. దీంతో ఒకరకంగా వారు కూడా సమాజంలో కాస్త ఇబ్బందిగా ఫీలవ్వడమే గాక ఆత్మనూన్యత గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేసే వాటికి దూరంగా ఉండి వీలైనంతలో కొద్దిపాటు జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య మీ ధరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకూడదంటే.. కొందరూ చూస్తే ఎంత ఏజ్ వచ్చినా కూడా స్మార్ట్గా యంగ్గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర అంటున్నారు డాక్టర్ పాల్విన్. మంచి నిద్ర మన ముఖవర్చస్సు కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. సుఖమైన నిద్ర మనిషి ఏజ్ని దాచేస్తుందంటున్నారు. ఎప్పుడూ నిద్ర విషయంలో అస్సలు అశ్రద్ధ కనబర్చకూడదట. ఇదే అన్ని రకాల వ్యాధులు అటాక్ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందని కూడా చెబుతున్నారు. ఈ నిద్ర మన జీర్ణవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతుందంటున్నారు. కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావట. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి అవసరమయ్యే నిద్రను మిస్ చేయకండని వార్నింగ్ ఇస్తున్నా డాక్టర్ పాల్విన్. ఇలా ఒక నెలపాటు వేళకు భోజనం చేస్తూ..కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవడానికి యత్నించి చూస్తే మీకే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం స్వస్థత చెందడమేగాక మీకు తెలియకుండానే మీలో జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో మీ పడకగది కూడా మీరు వెళ్లగానే పడుకోవాలనిపించేంత ఆహ్లాదంగా పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్ తదితర చెడు అలవాట్లను సాధ్యమైనంత తొందరగా వదిలేయాలి. రోజువారి జీవనశైలిలో కొద్ది మార్పులు చేసి నిద్రకు సక్రమంగా షెడ్యూల్ని కేటాయించేలా చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని అంటున్నారు. ఈ విధానం పాటిస్తే కచ్చితంగా ఏజ్డ్ పర్సన్లా కనిపించరని, ఆయుః ప్రమాణం పెరిగి మీరు చిన్నవారిలానే కనిపిస్తారని డాక్టర్ పాల్విన్ చెబుతున్నారు. (చదవండి: చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!) -
Chandrayaan-3: స్లీప్ మోడ్లోకి ప్రజ్ఞాన్..
శ్రీహరికోట: చంద్రయాన్–3 మిషన్లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్ మోడ్లోకి వెళ్లిందని ఇస్రో శనివారం తెలిపింది. లూనార్ మిషన్లోని రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా వాటిని స్లీప్ మోడ్లోకి పంపుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ చుట్టూ 100 మీటర్ల మేర రోవర్ ఇప్పటివరకు ప్రయాణించిందని చెప్పారు. అందులోని రిసీవర్ను ఆన్లోనే ఉంచి, పేలోడ్స్ను ఆఫ్ చేసి ఉంచుతామన్నారు. అందులోని డేటా బేస్ ల్యాండర్ ద్వారా ఇప్పటికే తమకు చేరిందన్నారు. ప్రస్తుతం వీటి బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జి అయి ఉన్నాయని, ఈ నెల 22వ తేదీన తిరిగి అక్కడ సూర్య కిరణాలు ప్రసరించిన తర్వాత వాటికి తిరిగి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చంద్రుడిపై భారత రాయబారిగా రిసీవర్ ఎప్పటికీ అక్కడే ఉంటుందని చెప్పారు. Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
ఇలా కూడా నిద్రపోవచ్చా!..అబ్బా!.. వర్క్ప్లేస్లో కూడా..
సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్ కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్ పాడ్స్లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చు. ‘గిరాఫెనాప్’ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్ పాడ్స్ను రూపొందించారు. ఇది చూడటానికి పాతకాలం టెలిఫోన్ బూత్లా ఉన్నా, ఇందులో చాలా సౌకర్యాలే ఉంటాయి. ఇందులో కూర్చుని, డెస్క్పై పనిచేసుకోవచ్చు. నిలబడి కునుకు తీయాలనుకుంటే, ఇందులోని ఒక మీట నొక్కితే చాలు– కూర్చీ నిలువునా పైకి లేస్తుంది. ఇందులో తలవాల్చుకునేందుకు దిండు కూడా ఉంటుంది. మన ఎత్తుకు తగినట్లుగా దిండు ఎత్తును సవరించుకునే వెసులుబాటు కూడా ఉంది. పని ప్రదేశాల్లో నిద్రపోవడాన్ని అనుమతించే జపాన్లో ఇదొక కొత్త ఆకర్షణగా మారింది. (చదవండి: ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!) -
ఇలా చేస్తే ఎక్కువకాలం బతికేయొచ్చు.. రీసెర్చ్లో వెల్లడైంది కూడా
మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, మీరు మీ జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు ఆరోగ్యకరమైన తిండి, నిద్రవేళలను కచ్చితంగా కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర ప్రణాళిక అవసరం. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం వంటి స్థిరమైన నిద్ర షెడ్యూల్ను పాటించడం మీకు ఎక్కువ కాలం జీవించడంలో ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవద్దు. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని అదే సమయంలో కచ్చితంగా నిద్రించాలి. అంతేకాదు, రోజూ ఒకే సమయంలో నిద్ర నుంచి మేలుకోవాలి. ► కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలం జీవించాలనుకుంటే, మీ మెదడు, శరీరాన్ని పునరుద్ధరించడానికి ప్రతి రాత్రి 8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర మీ మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి, శక్తి స్థాయులను మెరుగుపరుస్తుంది. చెదిరిన లేదా కలత నిద్ర మీ మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ► విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. దీనివల్ల మీ మనస్సుకే కాదు, శరీరానికి కూడా రోజంతా హాయిగా ఉండేందుకు అవసరమైన విరామం లభిస్తుంది. మీరు దీన్ని ఎలా చేస్తారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ► ప్రపంచంలోని చాలా మంది ప్రజలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. వారు క్రమం తప్పకుండా నడవడం, పుస్తకం చదవడం, వెచ్చని చామంతి టీ తాగడం వంటివి చేస్తారు. ఆనందంగా ఉండటమే.. ఎక్కువ కాలం జీవించేందుకు కారణం. ► సుదీర్ఘ జీవితాన్ని గడపడంలో మీ ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా తినొద్దు. సరైన సమయంలో తగినంత తినడం శరీర బరువును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు అల్పాహారం, మధ్యాహ్న భోజనం మీకు నచ్చినట్లుగా తినవచ్చు. రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవచ్చు. ►కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్ క్యాన్సిల్
చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్ టెర్రర్ లేదా స్లీప్ టెర్రర్ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం. మాధురి, మాధవ్ అందమైన జంట. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్ స్టేజ్కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్ స్టాఫ్ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్ కేన్సిల్ చేసుకుని వచ్చేశారు. ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్ చేసి అదో స్లీప్ డిజార్డర్ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్ కు తీసుకువచ్చాడు. స్లీప్ టెర్రర్స్... మాధురి సమస్యను స్లీప్ టెర్రర్స్ లేదా నైట్ టెర్రర్స్ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్ టెర్రర్స్ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. స్లీప్ టెర్రర్ లక్షణాలు యుక్త వయసు తర్వాత కూడా స్లీప్ టెర్రర్స్ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్ ప్లేస్లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి ... · నిద్రలో భయపెట్టే అరుపులు · కళ్లు పెద్దవి చేసి చూడటం · మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం · గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం · మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం · మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ... స్లీప్ టెర్రర్స్ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్ టెర్రర్స్ లేదా స్లీప్ వాకింగ్ చరిత్ర ఉంటే స్లీప్ టెర్రర్స్ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. · నిద్ర లేమి, విపరీతమైన అలసట · మానసిక ఒత్తిడి · నిద్ర షెడ్యూల్కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు · తరచూ ప్రయాణాలు · జ్వరం · నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు · రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు, · మద్యం వినియోగం ప్రశాంతత ముఖ్యం... మీకు లేదా మీ పిల్లలకు స్లీప్ టెర్రర్స్ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. · మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. · అలసట, ఆందోళన స్లీప్ టెర్రర్స్కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి. · స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్ రూమ్ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. · నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా సహాయపడవచ్చు. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. · ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్బ్యాక్ లేదా రిలాక్సేషన్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
నిద్రలేమికి ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నిద్రలేమి సమస్యలతో పాటు నిద్రలో వచ్చే అనేక ఇబ్బందులకు ఎక్కడికి వెళ్లాలో చాలామందికి తెలియదని అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ రోడ్ నెం 82లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోడలు, స్లీప్ థెరపిటిక్స్ డాక్టర్ హర్షిణికి చెందిన ‘ది బ్రీత్ క్లినిక్’ను ఆయన మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ముఖ్యమని, చాలినంత నిద్రలేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా జనాభా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికోసం తాము మూడు ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాల్లోనే నిద్రకు సంబంధించి ఇది తొలి క్లినిక్ అని అన్నారు. -
దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. -
Sleep Paralysis: నిద్రిస్తున్నప్పుడు.. సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?
నిద్రిస్తున్నప్పుడూ..మీకు సమీపంలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుందా?. అక్కడ జరగుతున్నవన్నీ అర్థం అవుతుంటాయి. కానీ లేవలేరు. ఎంతలా.. లేద్దామనుకున్నా కళ్లు తెరవలేక నానా అవస్థలు పడతారు. చాలా సేపు కొట్టుకుని అతికష్టంపై మేల్కొంటారు. ఇలాంటి విషయాలు మీ స్నేహితులు లేదా మరేవరైనా చెబుతుండడం వినే ఉండే ఉంటారు. వాటిని తేలిగ్గా కొట్టిపారేయొద్దు అంటున్నారు వైద్యులు. ఎందకంటే అది స్లీప్ పెరాలసిస్ కావచ్చు అంటున్నారు. ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటి స్లీప్ పెరాలసిస్? ఎందుకు వస్తుంది నిద్ర పక్షవాతం ఇది ఒక పీడకలలా ఉంటుంది. నిద్రలేచినట్లు ఉంటుంది కానీ లేవలేం. లేవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. శరీరంలోని అవయవాలు ఏ మాత్రం సహకరించవు. విచిత్రం ఏమిటంటే.. అతను చూడటానికి నిద్రపోతున్నట్లు ఉంటాడు. తనకు హాని చేస్తున్న అనుభూతి పొందుతాడు. వినడం, లేచినట్లు, ఎవరైన సమీపస్తున్నట్లు తదితర అనుభూతులు అన్ని పొందుతాడు. ఇన్ని అనూభూతులు అనుభవించినా.. కదలలేడు. ఇలాంటి ఫీలింగ్ సాధారణంగా అందరికీ ఒక్కో సమయంలో అనిపించేవే. అయితే అది సాధారణంగా కొన్ని సెకన్లు మాత్రమే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ కొందరికి అదొక భయానక అనుభవం. నిద్ర అంటే భయపడిపోయేలా చేస్తుంది ఆ పరిస్థితి. ఇంతకీ ఎందుకు వస్తుందంటే.. ఈ నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన సమాధానం లేదని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, రాత్రిపూట సరిగా నిద్రపోక పోవడం, నార్కోలెప్పీ, ఒత్తిడి, ఆందోళన, వివిధ భయాలు తదితర రుగ్మతలు ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉంటే.. అది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి, మద్యం, ధూమపానం, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
తొలి ఏకాదశి..శయన ఏకాదశి.. ఆరోజు విష్ణువు నిజంగానే..
హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. అందుకే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు. దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ’ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆషాడంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. జూన్ 29వ తేది గురువారం నాడు తొలి ఏకాదశి వస్తున్న నేపధ్యంలో ఈ పండగ విశేషాలు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు తిరిగి నిద్ర లేస్తాడు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవ శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది, విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. నిజంగానే విష్ణువు ఆ రోజు నిద్రపోతారా.. నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే..చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం.. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటి పూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూలతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు. ఏకాదశి తిధి ఎలా వచ్చిందంటే.. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించు విధానం.. ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజున పిండిదీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగులా జరుపుకునే ఆచారం కూడా ఉంది. రైతులకు కూడా పండుగే.. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ.. తొలి ఏకాదశి రోజున శేషసాయిని(విష్ణువు) పూజించి..అలా ప్రతినెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేగాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. (చదవండి: ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో అదే..!) -
భోజనం చేసి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? పక్షవాతం వస్తుందట!
శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి ► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి ► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట. ► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. ► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. ► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఏ సమయంలో నిద్రపోతే మంచిది మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే. -
పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్మీడియాలో షేర్ చేశారు. పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Candid Impressions🧿📸 (@candid_impressions) చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..
ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్ గటన మధ్యప్రదేశ్లో ఇండోర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది. దీంతో విసిపోయిన శశిపాల్ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్మెంట్తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు. ఐతే ఆమె అతడి వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్ని అతని మూడో భార్య పాయల్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్ మొబైల్లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్పైకి విసిరేసిన తండ్రి) -
Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా కునుకు తీశాడు.. సస్పెండ్ చేశారు
గాంధీనగర్: స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగిస్తున్న సభలో కునుకు తీశాడు ఆ అధికారి. అయితే మామూలుగా అయితే విషయం ఎవరూ పట్టించుకునేవాళ్లు కారేమో. పాపం.. కెమెరా కళ్లన్నీ ఆయన మీదే పడ్డాయి. లోకల్ మీడియాలో పదే పదే ఆ దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి. ఫలితంగా.. ఆయనపై కమిట్మెంట్ను ప్రశ్నిస్తూ సస్పెన్షన్ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్ భూపేంద్ర పటేల్ పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. శనివారం భుజ్లో ఈ ఘటన జరిగింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్గా గుర్తించారు. కచ్ జిల్లాలో.. 2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను సీఎం భూపేంద్ర పటేల్ అందించారు. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.. ముందు వరుసల్లో కూర్చున్న జిగర్ పటేల్ కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ వీడియో విపరీతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ. విధి పట్ల నిబద్ధతా లోపం, పైగా ఆయన ప్రవర్తన నిర్లక్ష్యపూరితంగా ఉందన్న విషయం.. వీడియోల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అందుకే గుజరాత్ సివిల్ సర్వీస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్ షా. మరోవైపు వేటుపై ఆ అధికారి స్పందన కోసం మీడియా యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. Kutch News: ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરાયા, CMના કાર્યક્રમમાં ઉંઘતા હોવાથી કરાયા સસ્પેન્ડ #gujarat #kutch #bhuj #vtvgujarati pic.twitter.com/2nnJIv12no — VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 30, 2023 Video Credits: VtvGujarati ఇదీ చదవండి: అవును, శివుని కంఠంపై సర్పాన్ని: మోదీ -
ఆ చిన్నారి నిద్రిస్తే.. ఏ క్షణంలోనైనా శ్వాస ఆగిపోతుంది!
ఎన్నో రకాల వింత వ్యాధుల గురించి విన్నాం. కానీ నిద్రిస్తే శ్వాస ఆగిపోవడం అనే వ్యాధి గురించి విని ఉండరు కదా! నిద్రిస్తేనే శ్వాస ఆగిపోతే ఎలా? నిద్రపోకుండా ఉండటం కూడా అసాధ్యమే. ఇదోకరకమైన అరుదైన వ్యాధి అట. దేనిపైన దీర్ఘంగా దృష్టి కేంద్రీకరించినా లేదా ఏకాగ్రత పెట్టినా.. శ్వాస ఆగిపోవడమే ఈ వ్యాధి లక్షణం. యూకేలోని ఓ చిన్నారి అచ్చం అలాంటి వ్యాధి బారినే పడింది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని రక్షించుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా నానా అగచాట్లు పడుతున్నారు. అసలేం జరిగిందంటే.. యూకేలోని బర్మింగ్హామ్కు చెందిన 48 ఏళ్ల స్టార్ బౌయర్, ఆమె భర్త ఆండ్రూ బౌయర్ ఇద్దరు తమ కుమార్తె సాడీని రాత్రింబవళ్లు కంటి మీద కునుకులేకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. సాడీ పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొనడం ప్రారంభమైంది. ఆ తర్వాత దీని గురించి ఆ చిన్నారి కొన్నాళ్లు ఇంటెన్సీవ్ కేర్లో కూడా చికిత్స తీసుకుంది. ఐతే ఆమె పుట్టుకతో సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఏదైనా సినిమా చూస్తూ ఉండిపోయినా లేదా గట్టిగా దేనిమీద అయినా ఏకాగ్రత పెట్టినా ఆమె మెదడు శ్వాస తీసుకోవడం మర్చిపోవడంతో ఆమె శరీరం నీలంగా మారి చనిపోయే స్టేజ్కి వెళ్లిపోతుంది. దీంతో వైద్యులు ఆ చిన్నారికి ట్రాకియోస్టోమీ చేశారు. అంటే మెడకు రంధ్రం చేసి శ్వాసనాళ నుంచి ఒక గొట్టం ఏర్పాటు చేశారు. ఇది శ్వాస తీసుకునేలా చేసి మెదడుకు సంకేతాలు పంపి గుండె కొట్టుకునేలా చేస్తుంది. ఇది ఆమె ఏకాగ్రతగా ఉన్నప్పుడూ (దీర్ఘంగా సినిమా చూస్తుండిపోయినప్పుడూ).. శ్వాస తీర్చుకోవడం మర్చిపోయిన ప్రతి సారి ఈ గొట్టం శ్వాస గురించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. అదే ఒకవేళ ఆ చిన్నారి అకస్మాత్తుగా నిద్రపోయినా లేదా డీప్ స్లీప్లో ఉంటే అంతే సంగతి. శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. వెంటనే తల్లిదండ్రులు అది గమనించి వెంటిలేటర్పై ఉంచి కృత్రిమ శ్వాస అందించి తిరిగి బతికించుకుంటున్నారు. ఒకవేళ ఆమె శ్వాస ఆగిపోవడాన్ని గమనించనట్లయితే ఆమె శాశ్వతంగా దూరమైపోతుందని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రలుకు కంటి మీద కునుకు లేకుండా అయింది. 24/7 ఆమెను పర్యవేక్షించడమే వారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఆమె రోజులో సాధారణ బిడ్డ మాదిరిగానే ఉన్నా.. నిద్రించిందా ఇక అంతే! ఆ చిన్నారి రూమ్ అంతా వైద్య పరికరాలతో నిండి ఉంటుంది. ఐతే తల్లిద్రండులు ఆమెకు వెంటిలేటర్ లేకుండా శ్వాస పీల్చుకునేలా ప్రత్యామ్నాయ మార్గం గరించి తెలుసుకున్నారు. నిద్రలో శ్వాస ఆగిపోకుండా డయాఫ్రాగ్మాటిక్ పేసర్లను అమర్చాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమర్చితే ఆ చిన్నారి నిద్రపోయినా పర్వాలేదు, పైగా తాము నిద్రపోకుండా చూసుకోవాల్సిన సమస్య తప్పదంటున్నారు తల్లిదండ్రులు. ఐతే అందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బుల సేకరణ పనిలోనే తాము ఉన్నట్లు తల్లిదంద్రడులు వివరించారు. (చదవండి: మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!: జెసిండా) -
మీకు తెలుసా?
మెదడు తనను తాను రిపేర్ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు ♦ నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. ♦ దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది. ♦ నిద్రలేమి కారణంగా కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ♦ ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. ♦ నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం. ♦ కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. ♦ కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. -
మీరు నిద్రించే సమయం ఇదేనా? తేడా వస్తే కష్టమే! ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు
చిన్నా పెద్దా అని తేడా లేదు.. చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది.. పైకి తెలియకుండానే శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, విద్యాపరంగా ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో కెరీర్పై ఫోకస్ పెరగడంతో నెలకొన్న ఒత్తిడి వంటివి ఒకవైపు అయితే.. విపరీతంగా స్క్రీన్ టైమ్ (ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీ చూడటం వంటివి) పెరిగిపోవడం మరోవైపు దీనికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, రోజువారీ జీవన విధానంలో వచ్చిన మార్పులూ సమస్య పెరగడానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, వైద్య సంస్థలు అధ్యయనం చేసి.. నిద్ర లేమి కారణాలు, దీనివల్ల తలెత్తుతున్న సమస్యలపై నివేదికలు విడుదల చేశాయి. ఆ అంశాలపై ఓ లుక్కేద్దాం. – సాక్షి, హైదరాబాద్ 7 నుంచి 9 గంటల నిద్ర వల్ల ప్రయోజనాలివీ.. ►18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటల రాత్రి నిద్ర అవసరం. ►తగినంత నిద్రతో రోగ నిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అనారోగ్యం బారినపడే అవకాశాలు తగ్గుతాయి. ►ఒకవేళ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా వేగంగా కోలుకోగలుగుతారు. ►7 నుంచి 9 గంటల మధ్య నిద్రతో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుంది. ►ఏకాగ్రత కూడా పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ►రోజువారీ వ్యక్తిగత జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సమస్యను అధిగమించేందుకు ఇలా చేయొచ్చు ► క్రమం తప్పకుండా రోజూ అరగంటకుపైగా వ్యాయామం, నడక ►రాత్రి మితంగా భోజనం చేయాలి. సాయంత్రాలు సిగరెట్లు, మద్యం, పొగాకు వంటివి తీసుకోవద్దు. ►వీకెండ్స్, ఆదివారాలు సహా అన్నిరోజుల్లో నిద్రపోయేందుకు, పొద్దున లేచేందుకు ఒకే సమయం పాటించాలి. ►బెడ్రూంలలో టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలను వినియోగించొద్దు. ►నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 5, 6 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో సమస్యలివీ.. ►ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రతో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. ►ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, కుంగుబాటు వంటివి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. ►5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి. ►జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస 40%పైగా తగ్గిపోతుంది. ►దీర్ఘకాలం నిద్ర సమయం తక్కువగా ఉంటే మానసిక సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే ఆందోళన పడటం, కుంగుబాటు, షార్ట్ టెంపర్, ప్రతీదానికి విసుక్కోవడం, వాహనాలు నడిపేపుడు ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. ►చేసే పనుల్లో తరచూ తప్పులు దొర్లడం, పనివేగం తగ్గిపోవడం, మార్పులకు తగినట్టు సర్దుబాటుకాకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. నిద్ర తగ్గితే శారీరక, మానసిక సమస్యలు గత పదేళ్లలో భారతీయుల్లో నిద్ర అలవాట్లు, పద్ధతుల్లో బాగా మార్పులు జరిగాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరును మెరుగుపర్చుకునేందుకు, ఆ రోజంతా చేసిన పనులను ఒక క్రమపద్ధతుల్లో పెట్టుకోవడానికి, ‘మెటబాలిక్ రియాక్షన్ రిథమ్’లో ఉండటానికి నిద్ర తోడ్ప డుతుంది. అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండటం, లేవడం వంటివాటి వల్ల ‘సర్కాడియన్ సైకిల్’ దెబ్బతింటుంది. ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఐటీ ఉద్యోగుల్లో తీవ్రంగా సమస్య మూడేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు అధికంగా వర్క్ఫ్రం హోం పద్ధతికి మారారు. ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న వారిలో సరైన నిద్రలేకపోవడం, గురక, మధ్యలో ఉలిక్కిపడి లేవడం, పొద్దున లేచాక ఫ్రెష్గా అనిపించకపోవడం వంటి లక్షణాలతో కూడిన ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యలతో వస్తున్న ఐటీ ఉద్యోగులకు తగిన చికిత్స అందిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రోజుకు 7, 8 గంటల నిద్ర ఉండాలి. సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తీసుకోకపోవడం, రాత్రి 9 తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఆపేయడం మంచిది. నిద్రవచ్చినా, రాకపోయినా రాత్రి 9.30 గంటలకల్లా బెడ్పైకి వెళ్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. – వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
తండ్రి గిటార్పై పడుకుని బుడ్డోడి తన్మయత్వం..! క్యూట్ వీడియో
-
నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్ర.. ఈ డివైజ్ గురించి తెలుసుకోవాల్సిందే!
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది. ‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్కు చెందిన స్విచ్లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే! చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్హౌస్లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
వారంలో 4 రోజులే పని, మిగిలిన టైంలో ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగస్తుల పని దినాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని దినాలు తగ్గించేందుకు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. గతంలో వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసేలా సంస్థలు ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాయి. అయితే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసిన ఉద్యోగులు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు? రెండో ఉద్యోగం చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? అంటూ బోస్టన్ కాలేజీ ఎకనమిస్ట్, రిసెర్చర్ జూలియట్ షోర్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్! జూలియట్ షోర్ ఆరు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 సంస్థలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ అభిప్రాయ సేకరణలో.. వారానికి 4 రోజుల పనిచేస్తున్న ఉద్యోగులు 8 గంటల పాటు నిద్రకే కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 40 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా నిద్రపోలేదన్నారు. ఆఫీస్ వర్క్, ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గమనించినట్లు రీసెర్చర్ జూలియట్ షోర్ తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, స్నేహితులతో కాలక్షేపం, సినిమాలు, షికార్ల పేర్లతో ఎంజాయ్ చేయడం కంటే..వారానికి ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల పాటు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు రోజుల పని సమయాల్లో రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు భావించే ఉద్యోగుల శాతం 42.6 శాతం నుండి 14.5 శాతానికి పడిపోయింది. ఈ సందర్భంగా జూలియట్ షోర్ మాట్లాడుతూ..‘ఉద్యోగులు ఎక్కువ సేపు నిద్రపోవడంపై నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఉద్యోగుల్లో చోటు చేసుకుంటున్న బలమైన మార్పులపై ఆశ్చర్యపోయాను’ అని షోర్ చెప్పారు. ఈ అనూహ్య మార్పుల కారణంగా ఆఫీస్ వర్క్ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందోనని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయని అన్నారు. చదవండి👉 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్! -
జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?
ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్.. చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా.. జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట. -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
పని మధ్యలో నిద్ర.. ఏం పర్లేదు మా కంపెనీకి ఓకే!
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అప్పుడప్పుడు బల్లల మీదే తలవాల్చి కునుకుతీసే సందర్భాలు మామూలే! ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. మధ్యాహ్నంపూట కాస్త కునుకు తీస్తే, మెదడు చురుకుదేరి పనితీరు మెరుగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు. అయినా, పనివేళల్లో ఉద్యోగులు కునుకుతీయడానికి తగిన ఏర్పాట్లు ఏ ఆఫీసులోనూ కనిపించవు. జపాన్లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్బాక్సెస్) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం. -
Smart Pillow: నిద్రను కనిపెట్టుకొనే దిండు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది అధునాతనమైన స్మార్ట్ దిండు. దీనిపై తలపెట్టుకుని నిద్రించే వారి నిద్రను ఇది కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి చక్కని వరప్రసాదం ఈ తలదిండు. అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ దిండు నమూనాను రూపొందించారు. ఇందులోని ట్రైబో ఎలక్ట్రిక్ నానో జెనరేటర్స్తో పనిచేసే సెన్సర్లు నిద్రను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. నిద్రించేటప్పుడు నిద్రించే వ్యక్తికి సౌకర్యంగా ఉండే భగింమ, గాఢంగా నిద్రించే సమయం వంటివన్నీ క్షుణ్ణంగా ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు హెడ్బ్యాండ్స్, రిస్ట్బ్యాండ్స్ వంటి రూపాల్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ కంటే ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
గురకకూ... ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా?
ఇటీవల బప్పీలహరి మరణం తర్వాత స్లీప్ ఆప్నియా సమస్య గురించి చర్చ జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా’ వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ ఆప్నియా కాకపోవచ్చుగానీ... స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం... అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్లీప్ ఆప్నియా గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈసీ వినయకుమార్ను అడిగి తెలుసుకుందాం. ప్రశ్న : అసలు గురక ఎందుకు/ఎలా వస్తుంది? జ: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ప్రశ్న : గురకకూ, ఆప్నియాకు సంబంధమేమిటి? జ: అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి... ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. పైగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్న : గురకకూ... ఆప్నియాకూ తేడా ఏమిటి? జ: గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. అది ఆరోగ్యపరంగానే కాదు... కుటుంబ బంధాల్లో... ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు... రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి. ప్రశ్న : మంచి జీవనశైలితో మెరుగవుతుందా? జ: మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. (బప్పీ లహరి స్థూలకాయం కూడా ఆయన సమస్యకు దోహదం చేసి ఉండవచ్చు). ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకూ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా మానేయాలి. ప్రశ్న : ఏ డాక్టర్ను కలవాలి? ఎప్పుడు సంప్రదించాలి? జ: వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్ స్పెషలిస్టులను లేదా ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. కారణాలు / నివారణ కొన్ని అలవాట్లు ఆప్నియాకు కారణం కావడంతో పాటు, మరిన్ని దుష్ప్రభావాలు కలిగేలా చేస్తాయి. మద్యం అలవాటు వాటిలో ముఖ్యమైనది. దాంతోపాటు పొగతాగడం, స్థూలకాయం ఆప్నియాను మరింతగా తీవ్రతరం చేస్తాయి.ఈ అలవాట్లను తప్పక మానేయాలి. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ – అంటే బరువు ను ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్య) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది 27 కంటే ఎక్కువ ఉంటే స్లీప్ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. మరీ ఎక్కువ బరువు (మార్బిడ్ ఒబేసిటీ) ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లడం మంచిది. చికిత్స స్లీప్ టెస్ట్ల తర్వాత... తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్’ అంటే... ‘కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్–వే’ మెషిన్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స (వ్యూలో పాలటో ఫారింగోప్లాస్టీ – యూపీపీపీ) అవసరం కావచ్చు. -ఇ.సి వినయ కుమార్ సీనియర్ ఇఎన్టి సర్జన్ -
Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా?
Health Tips: రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి. వాతం ఎక్కువైందా? ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం.. ►50 గ్రాములు సొంఠి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి. ►అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకుండా తీసుకుంటే సరి. ►ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
పూటుగా మద్యం తాగి గేట్మ్యాన్ నిద్ర.. ఆగిన రైలు
నంద్యాల రూరల్: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ వద్ద కాపలా ఉన్న గేట్మ్యాన్ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్ వేయలేదని గమనించిన లోకోపైలెట్ రైలును ఆపి హారన్ మోగించారు. స్థానికులు రూమ్లో ఉన్న గేట్మ్యాన్ను నిద్రలేపారు. గేట్ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్మ్యాన్ను విచారించారు. అతడు మద్యం తాగాడని తెలుసుకుని విధుల నుంచి తొలగించారు. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ -
వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ
బీజింగ్: సాధారణంగా ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతేనే ఆ ప్రభావం మన మీద చాలా దారుణంగా ఉంటుంది. రోజంతా చిరాకుగా... నిరుత్సాహంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పని వాతావారణం, సాంకేతికత మన శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో రాత్రి ఎంత సమయం గడిచినా ఓ పట్టాన నిద్రపట్టదు చాలా మందికి. మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. ఇక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ ఏకంగా 40 ఏళ్ల నుంచి నిద్ర పోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదట. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికి ప్రయోజనం లేదని వాపోతుంది. ఆ వివరాలు.. చైనా హెనాన్ ప్రావిన్స్లో నివసించే లి జ్యానింగ్ అనే మహిళ(45) గత 40 ఏళ్లుగా ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. ఈ వింత జబ్బు ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదట. తనకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని తెలిపింది జ్యానింగ్. (చదవండి: నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది ) ఈ విషయాన్ని జ్యానింగ్ భర్త కూడా అంగీకరించాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు జ్యానింగ్ నిద్రపోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుందన్నాడు. ఇక ప్రారంభంలో భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడం కోసం జ్యానింగ్ భర్త నిద్ర మాత్రలు కూడా తీసుకువచ్చాడట. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందట. (చదవండి: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!) ఈ వింత జబ్బు వల్ల జ్యానింగ్ తన గ్రామంలో చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా జ్యానింగ్ను టెస్ట్ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్ మాత్రం అలానే మెలకువగా ఉండేదట. సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్ ఎన్నో ఆస్పత్రులను సందర్శించింది.. ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) అయితే సాధారణంగా వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఎవరు నిద్ర పోకుండా బతకలేరు. అలాంటిది జ్యానెంగ్ ఇన్నేళ్లు నిద్ర పోకుండా ఉంది అనే వార్తలను జనాలు పెద్దగా నమ్మడం లేదు. బహుశా ఆమెకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. పగటి పూట నిద్ర పోతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. -
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ చాటింగ్లు, బ్రౌజింగ్లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్ మోడ్ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్ నొక్కాలి. ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్లెట్లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200. -
డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్
ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రయాణాల్లో ఏ ప్రమాదం ఎటునుంచి మీదకొస్తుందో తెలియని రోజులివి. ఇక దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడైతే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్లకు మరిన్ని జాగ్రత్తలు తప్పవు. స్మూత్గా దూసుకుపోయే కారు వంటి వాహనాల్లో నిద్ర ముంచుకొస్తుంటుంది. అప్పుడే రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. హెచ్చరించే పరికరమే చిత్రంలోని ఆటో సేఫ్ డివైజ్. విధుల్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తుల కోసం ఈ రిమైండర్ని రూపొందించారు. డ్రైవర్స్, రాత్రిపూట డ్యూటీ చెసే సెక్యూరిటీ గార్డ్స్, మెషిన్ ఆపరేటర్లు ఇలా ఎందరికో ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. పోర్టబుల్ సైజుతో డిజైన్ చేసిన ఈ పరికరం.. ప్రాణాలను రక్షించే నిద్ర నిరోధక అలారమే అంటున్నారు నిపుణులు. ఎలక్ట్రానిక్ పొజిషన్ సెన్సార్ కలిగిన ఈ గాడ్జెట్ని.. చెవికి బ్లూటూత్ మాదిరి పెట్టుకుంటే సరిపోతుంది. వినియోగిస్తున్నవారు ఏమాత్రం నిద్ర మత్తులో తూగినా చెవిలో వైబ్రేషన్తో కూడిన అలారాన్ని మోగించి అలెర్ట్ చేస్తుంది. -
కరోనా వచ్చిన తర్వాత నిద్ర ఉండటం లేదా?.. ఇలా చేయండి!
నిద్ర మీద కరోనా దెబ్బ గట్టిగానే పడింది. అది దేహంలోని అన్ని కీలకమైన అవయవాలతో పాటు నిద్రపైనా ప్రభావం చూపింది. ‘కరోనాసామ్నియా’గా పిలిచే దీని ప్రభావం ఎలా ఉందో చూద్దాం... కరోనా వైరస్ సోకడం మొదలైన తొలిరోజుల నుంచి నేటివరకు అది అందరినీ ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా మనం భయాందోళనలకూ, తీవ్రమైన ఉద్వేగానికీ లోనైనప్పుడు దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. నిద్ర అనేది మన సాధారణ ఆరోగ్యానికీ, వ్యాధి నిరోధకత సక్రమంగా పనిచేయడానికి అవసరమన్నది తెలిసిన విషయమే. కరోనా సోకి కోలుకున్న కొందరిలో నిద్ర పట్టడం ఓ సమస్యగా మారిపోయింది. ఫలితంగా అంతరాయాలతో కూడిన కొద్దిపాటి నిద్ర లేదా నిద్రలేమి పీడిస్తోంది. ఓ పక్క కరోనాసామ్నియాతో నిద్రలేమి. దాని కారణంగా రాత్రంతా మెలకువతో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రిపూట సమయం గడిపేందుకు చాలామంది తమ మొబైల్స్ లేదా కంప్యూటర్లను ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో ఓటీటీ ద్వారా సినిమాలు చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం చేస్తున్నారు. స్క్రీన్ ముందు గడిపే సమయం పెరగడంతో ‘ఎక్సెస్ స్క్రీన్ టైమ్’తో వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా వృత్తి నిర్వహించే ప్రదేశాల్లో, ఆఫీసుల్లోనూ, ఇతరత్రా ఉపాధి / సంపాదన పొందే చోట్ల తగినంత సామర్థ్యం చూపలేక పనిలో నాణ్యత కుంటుపడుతోంది. దాంతో ‘వర్క్ రిలేటెడ్ స్ట్రెస్’ పెరుగుతోంది. పై అంశాల కారణంగా మనో వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటివి కనిపిస్తున్నాయి. ఆ మానసికమైన సమస్యలు... వ్యక్తుల్లో తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతగానో నిద్రవస్తున్నట్లు అనిపించడం లేదా ఏ పనీ చేయలేనంత తీవ్రమైన అలసట కలగడం చాలా సాధారణం. దీన్నే ‘స్ట్రెస్ రిలేటెడ్ ఫెటీగ్’ అంటారు. నిద్ర ఎందుకంత ప్రధానం అంటే... నిద్ర అన్నది ఓ జీవసంబంధమైన (బయలాజికల్) ప్రక్రియ. ఇది శారీరక, మానసిక పరిస్థితులతో పాటు ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మన వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలు మంచి నిద్రపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కంటి నిండా నిద్రపోయే వారిలోనే ‘వ్యాధితో పోరాడే శక్తి’ (డిఫెన్స్ మెకానిజమ్) చాలా సమర్థంగా ఉంటుంది. (మనం ఇచ్చే వ్యాక్సిన్లు కూడా మంచి నిద్ర ఉన్నవారిలోనే సమర్థంగా పనిచేస్తాయన్న విషయం కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది). మన మెదడు సమర్థంగా పనిచేయడానికి కూడా మంచి నిద్ర అవసరం. ఎందుకంటే... మన ఆలోచనా విధానాలు, నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, మనోభావాలు, చిరాకులు... ఇవన్నీ నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. నిద్రలేమి కారణంగా వచ్చే డిప్రెషన్, యాంగ్సైటీ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటి అదనపు మానసిక సమస్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. నిద్రలేమి కారణంగా కొందరు పొగాకు, వాటి ఇతర ఉత్పాదనలు, ఆల్కహాల్ వంటి వాటిని ఆశ్రయించడం ఇటు వ్యక్తిగత ఆరోగ్యానికీ, అటు సామాజిక సమస్యలకూ కారణమవుతోంది. కరోనా తగ్గాక నిద్రలేమితో వచ్చే సమస్యల్లో కొన్ని... బాధితుల దైనందిన వ్యవహారాల్లో క్రమబద్ధత లోపించడం. అన్ని టైమింగులూ దెబ్బతినడం (ఉదాహరణకు ఆఫీసులకు వెళ్లడం, అనేక సామాజిక కార్యకలాపాలకు హాజరుకావడం వంటివి). రాత్రి వేళ నిద్రలేమి...పగటివేళల్లో మందకొడితనం. నిద్రను ఆయా వేళల్లో నియంత్రించే ‘సర్కాడియన్ రిథమ్’ దెబ్బతినడం. కొన్ని అంశాలు నిద్ర సక్రమంగా పట్టేలా చూస్తాయి. వాటిని ‘జెయిట్గెబర్స్’ అంటారు (ఉదాహరణకు రాత్రి నిద్రవేళ వెలుగు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు ఒకింత తక్కువగా నిద్రకు అనువుగా ఉండటం). జెయిట్గెబర్స్కూ, నిద్రను కల్పించే సర్కాడియన్ రిథమ్కూ సమన్వయం లోపించింది. ఇది మరిన్ని నిద్ర సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతోంది. ఈ సమగ్ర ప్రభావాల కారణంగా పనిగంటలు తగ్గుతున్నాయి. ఒకపక్క కోవిడ్ కారణంగా అసలే వృత్తులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఇప్పుడీ ‘కరోనోసామ్నియా’ ఓ రుగ్మతలా ఉన్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలనూ దెబ్బతీస్తోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని సూచనలు... నిద్ర పట్టినా లేకపోయినా... రోజూ మీ నిర్ణీతమైన నిద్రవేళకు పక్క మీదికి చేరండి. పక్క మీదికి వెళ్లే సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడీ లేకుండా జాగ్రత్తపడండి. సరిగ్గా నిద్రసమయానికి బాగా కడుపునిండుగా ఉండేలా భోజనం చేయకండి. రాత్రి ఒకింత తేలికపాటి ఆహారమే మేలు. రాత్రి భోజనానికీ, నిద్రకూ కాస్తంత వ్యవధి ఉండేలా జాగ్రత్తపడండి. నిద్రకు ముందర శరీరానికి ఒకింత ఎక్కువ శ్రమ కలిగించే ఎలాంటి వ్యాయామాలూ చేయకండి. నిద్రవేళకు చాలా ముందుగా తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయండి. ఒకసారి పడక మీదకు చేరాక ఎంతగా నిద్రపట్టకపోయినా మొబైల్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి. మీ పడకగదిలోకి ఆఫీసు పనిని తీసుకురాకండి. ఎంతకీ నిద్రపట్టకపోతే రిలాక్సేషన్ ప్రక్రియలైన యోగా, ధ్యానం వంటి వాటిని చేయండి. ఇవన్నీ ఆచరించాక కూడా నిద్ర పట్టకపోయినా నిద్రమాత్రలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. మీ డాక్టర్ను తప్పక సంప్రదించండి. . డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ చదవండి : పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి -
రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఏడాదిన్నర కాలం నుంచి వారి జీవన విధానాల్లో మార్పులు సంభవించాయి. దీంతో సరిగ్గా నిద్ర పోవట్లేదు. గతేడాది సుదీర్ఘ లాక్డౌన్ విధింపుతో మొదలైన సంప్రదాయ విరుద్ధ ఆహారం, నిద్ర, ఇతర అలవాట్లు శరీరంపై అనేక రూపాల్లో ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ ముందు నుంచీ ఇలాంటి జీవన విధానం అవలంబించిన వారున్నా.. ఇప్పుడు వారి సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు. తాజాగా ఈ కోవలోకి యువత, స్కూల్, కాలేజీ పిల్లలు, ఇతర వర్గాల ఉద్యోగులు, ప్రజలు వచ్చి చేరారు. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర పోవడం, మధ్యాహ్నం లేవడం వల్ల మన ‘జీవ గడియారం’లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు, మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లోని నార్త్ వెస్ట్రన్, సర్రే యూనివర్సిటీలు ఇటీవల జరిపిన పరిశీలన ప్రకారం.. రాత్రిళ్లు ఎక్కువ సమయం మెలకువ ఉండే వారిలో దీర్ఘకాలిక మధుమేహం, మానసిక సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు, ఉదర కోశ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని వెల్లడైంది. నిద్రలేమి, సంబంధిత ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై సైకాలజిస్ట్ సి.వీరేందర్, సైకియాట్రిస్ట్ డా.నిషాంత్ వేమన వెలిబుచ్చిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. కారణాలు– జాగ్రత్తలు.. అధిక బరువు, ఊబకాయమున్న వారిలో నిద్రలేమి ఎక్కువగా ఉండే అవకాశం. లాక్డౌన్లో అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడంతో బరువు పెరుగుదల నిద్రలేమికి కారణం కావొచ్చు. సరిగ్గా నిద్రపోని కారణంగా రోజంతా చురుగ్గా లేకపోవడం, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. నిరాసక్తంగా ఉంటారు. దీన్ని అధిగమించేందుకు మితమైన ఆహారంతోపాటు ప్రాణాయామం, యోగా, తేలికపాటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. 30–60 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రలేక ఆక్సిజన్ శాతం తగ్గినా, శ్వాస సరిగ్గా ఆడకపోయినా ఇబ్బందులొస్తాయి. నిద్ర లేమితో మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడంతో ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు. ఈ కారణంగా ఏర్పడే మైక్రో అరొజల్స్ వల్ల గాఢ నిద్రలోకి వెళ్లినా కూడా నిద్ర పోయినట్లే అనిపించదు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం లేదా వేళాపాళా లేకుండా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రపోతే ఉదయం ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. పగటిపూట నిద్ర ఆపుకొనేందుకు ఎక్కువగా సిగరెట్లు, కాఫీ, టీలు తాగడం కూడా డీహైడ్రేషన్కు దారితీస్తుంది. నిద్రపోవడానికి 2 గంటల ముందు వరకు మొబైళ్లు, ల్యాప్టాప్స్, టీవీలు ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించొద్దు. సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయం తగ్గించాలి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం, పాటలు, ఇతర అభిరుచుల్లో నిమగ్నం కావాలి. శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది శరీర సహజ సిద్ధమైన వ్యవస్థ, జీవ గడియారానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల జీవన ప్రక్రియలపై ఒత్తిడి పెరిగి రోగనిరోధకత ప్రభావితం అవుతుంది. దీంతో అర్ధరాత్రి దాటాక నిద్ర పోయి.. మధ్యాహ్నం సమయంలో నిద్ర లేచిన వారి శరీరాల్లో విషపూరిత రసాయనాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే పద్ధతిని దీర్ఘకాలం కొనసాగిస్తే జీవన ప్రక్రియలపై ప్రభావం చూపడమే కాకుండా మతిమరుపు, గుర్తుకు పెట్టుకునే తత్వం కోల్పోవడం, గుండెపోటు వంటి వాటి బారిన పడతారని వివిధ పరిశోధనల్లో గతంలోనే నిరూపితమైంది. ఇలా వేళ కాని వేళల్లో నిద్రించే విధానాల వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. మారిన అలవాట్లు, నిద్ర సమయాలకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు మన శరీరం అదనంగా శ్రమించాల్సి వస్తుంది. మెదడులో నిద్రకు ఉపక్రమించేలా చేసేందుకు ఉత్పత్తి అయ్యే ‘మెలటోనిన్’అనే హార్మోన్ విడుదలలో కాస్త అయోమయం ఏర్పడుతుంది. దీంతో అది పూర్తిగా విఫలమై తీవ్ర భావోద్వేగాలకు గురి కావడం, ఆదుర్దా, ఆందోళన చెందడం జరుగుతుంది. మెలటోనిన్ హార్మోన్ను మెదడులోని పీనియల్ గ్రంథి విడుదల చేస్తుంది. చీకటి సమయాల్లో ఇది విడుదలై నిద్ర పోయేందుకు దోహదపడుతుంది. వెలుతురు ఉన్నప్పుడు విడుదల ఆగిపోయి మెలుకునేలా ఉంటుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు బాగా పొద్దుపోయాక నిద్ర లేవడం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల వివిధ పనులు చేసుకునే వారి ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో నిద్రపోతేనే మనలో ఏకాగ్రత పెరగడమే కాకుండా, జ్ఞాపకశక్తి, ధ్యాస సరిగా ఉండటంతో పాటు త్వరగా అలసిపోకుండా ఉంటాం. మేం ఇప్పటివరకు పరిశీలించిన కేసుల ప్రకారం.. సరైన సమయానికి నిద్రపోక పోవడం, నిద్రలేమి కారణంగా ఆందోళన, డిప్రెషన్, కోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిణామాలు, పరిస్థితుల కారణంగా యుక్త వయసు పిల్లలు, యువతరం రాత్రుళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోవడం కారణంగా మరునాడు ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల వల్ల మొక్కుబడిగా ల్యాప్టాప్.. ట్యాబ్, ఫోన్ ఆన్ చేసి మళ్లీ నిద్రలోకి జారుకోవడం లేదా చెప్పే పాఠాలపై దృష్టి పెట్టకపోవడం చేస్తున్నారు. రాత్రి సరైన నిద్రలేకపోవడంతో సమయానికి తిండి తినకపోవడం వల్ల ఉదర సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్షైన్ ఆస్పత్రి -
నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. బెడ్పై అటు ఇటు దొర్లుతున్నా కళ్లు మూసుకోవడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి. పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ను దూరంగా పెట్టడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. -
బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే..
బ్యాంకాక్ : దొంగతనానికి పోయిన ఓ దొంగ అక్కడి వస్తువులు ఎత్తుకుపోవటం మానేసి ఏసీ వేసుకుని మంచంపై హాయిగా నిద్రపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ వింత, నవ్వు తెప్పించే ఘటన థాయ్లాండ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్లాండ్లోని ఫెట్చబూన్ ప్రావిన్స్కు చెందిన అతిట్ కిన్ కుంతుబ్ అనే 22 ఏళ్ల యువకుడు మార్చి 22వ తేదీన అక్కడి ఓ ఆఫీసర్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. అప్పటికే బాగా అలసిపోయిన అతడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. వెంటనే ఆఫీసర్ కూతురి బెడ్రూంలోని ఏసీ ఆన్ చేసి మంచంపై నిద్రపోయాడు. అయితే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఉదయం ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. కూతురి బెడ్రూంలోని ఏపీ ఆన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. మంచంపై ఎవరో ముసుగు తన్ని పడుకుని ఉన్నారు. ఊరికి వెళ్లిన కూతురు ఏమైనా వచ్చిందా అనుకున్నాడు. దుప్పటి తెరిచి చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు‘‘ బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే’’ అంటూ దొంగను నిద్ర లేపారు. నిద్రలోంచి కళ్లు తెరిచిన అతను ఎదురుగా పోలీసులను చూసి కంగుతిన్నాడు. ‘అరే! పాడు నిద్ర ఎంత పని చేసింది’ అనుకుంటూ ఆలోచనల్లో ఉండగానే పోలీసులు అతడి చేతులకు బేడీలు వేసి తీసుకుపోయారు. చదవండి, చదివించండి : అయ్యో పాపం! క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు.. -
నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..
ఎయిర్ పోర్టు లాన్లో ప్రశాంతంగా నిద్రపోతున్న మహిళను చనిపోయిందని భావించి సెక్కూరిటీ సిబ్బందికి ఫోన్ చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె నిద్ర అక్కడి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. లారా అనే టిక్ టాక్ యూజర్ ఎయిర్ పోర్టు ట్రావెలింగ్కు సంబంధించిన తన అనుభవాలను వీడియోలు చేసి తన టిక్ టాక్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఓ అనుభవాన్నితాజాగా వీడియో తీసి పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో.. ‘‘ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులు లేని సమయం అది. నేను తెల్లవారుజామున 4 గంటలకు లోకల్ బస్లో ఎయిర్ పోర్టుకు వెళ్లాను. 5.30 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోకి చేరుకున్నాను. నా ఫ్లైట్ 7 గంటలకు ఉంది. బాగా ఎక్కువ ఖాళీ సమయం ఉండే సరికి అక్కడే లాన్లో పడుకున్నాను. ఎక్కువ సేపు కదలకుండా పడుకునే సరికి.. నా పక్కనున్న వ్యక్తి నేను చనిపోయాననుకున్నాడు. వెంటనే సెక్కూరిటీని అక్కడికి పిలిచాడు. కొంతమంది జనం చుట్టూ చేరారు. నా కేమైందో అని ఆదుర్ధుగా చూస్తున్నారు. సెక్కూరిటీ వాళ్లు నన్ను తట్టి లేపారు. పైకి లేచాను. అక్కడి వాళ్లంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు’’ అని చెప్పుకొచ్చింది. చదవండి : ఫ్రిజ్లో ఎలా కూర్చున్నాడబ్బా?! పూనమ్ అందాల విందు.. అదిరిన కాజల్ పరువాలు -
మంచి నిద్రతో గుండెపోటు దూరం
నిద్రకూ గుండెపోటు నివారణకూ సంబంధం ఉంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల తో గుండెపోటును ఇలా నివారించుకోవచ్చు. ►మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్కు సూచిక. ►మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ►తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు. ►నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది. ►నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. -
నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి!
న్యూఢిల్లీ : రోజూ పొద్దెక్కే వరకు నిద్రపోతున్న మనల్ని ‘‘ బొట్టు సంపాదన లేదు.. దమ్మిడి ఆదాయం లేదు’’ అని ఇంట్లో పెద్దోలు తిట్టినపుడు.. నిద్రలేవటానికి బాధపడి.. కష్టంగా కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి పైకి లేచి.. ‘‘ అరే! నిద్రపోవటానికి కూడా ఎవరైనా డబ్బులిస్తే బాగుండు. హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించవచ్చు’’ అనుకుని ఉంటాం. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ‘‘ వేక్ ఫిట్ వారి బ్యాచ్ 2021-22 స్లీప్ ఇంటర్న్షిప్లో పాల్గొనటమే.. నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించాలనుకునేవారి కోసం ఇదో అత్యున్నతమైన ఉపాది అవకాశం. ఈ ఇంటర్న్షిప్లో పాల్గొనే వారు 100 రోజుల పాటు ప్రతి రోజూ 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా, హాయిగా నిద్రపోవాలి. మొదట ఈ ఇంటర్న్షిప్కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యుత్తమంగా నిద్రపోయే కొంతమందిని ఎంపిక చేసి 100 రోజుల ఇంటర్న్షిప్కు అర్హుల్ని చేస్తారు. ఎంపికైన ప్రతీ ఒక్కరికి లక్ష రూపాయలు అందుతాయి. గెలిచినవారికి మాత్రమే 10 లక్షల రూపాయలు సొంతం అవుతాయి. మీరు ఈ ఇంటర్న్షిప్లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern/ను సందర్శించండి. ఒకటికి రెండు సార్లు పూర్తి వివరాలు.. టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి కాంపిటీషన్కు దరఖాస్తు చేసుకోండి. -
2021లో బాగుండాలంటే.. ఈ 5 మార్చుకోండి!
2020 ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి... ఇళ్లు ఆఫీసయ్యింది. సినిమాలు లేవు.. షికార్లు లేవు. మన జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా వరకు బయటి తిండి తగ్గించాము. ఇంటి భోజనానికి అందులోనూ.. ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇవి మంచి విషయాలైతే.. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. చాలా మందిలో మానసిక కుంగుబాటు ఎక్కువయ్యింది. మరి కొద్ది రోజుల్లో 2020కి ముగింపు పలకబోతున్నాం. ఇక 2021లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు అలవాట్లను తప్పక మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మార్చుకుని వచ్చే ఏడాదిని సంతోషంగా గడపండి... ఫీలింగ్స్ని అణిచవేసుకుంటున్నాం.. దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని అనుభవించారు. మన ఎమోషన్స్ని కావాలని ఇగ్నోర్ చేసే పరిస్థితులను 2020లో ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్ని అణిచివేసుకోవడం మంచిదేనా అంటే.. కాదని అంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఫీలింగ్స్ని అణిచి వేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాక మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనకు మనమే విశ్లేషించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్ని కలవమని సూచిస్తున్నారు. (చదవండి: న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే) అధిక ఒత్తిడి భరిస్తున్నాం.. మనం ఎదుర్కొనే సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవ్వడం. ఆందోళనని బయటకు వెళ్లడించడం ఎంతో మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. సాధారణంగా కార్టిసాల్ పని ఏంటంటే ఇది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. ఇది మెదడు పని తీరును అడ్డుకుంటుంది. దాంతో రోజువారి జీవిన విధానం పూర్తిగా దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి లేవల్స్ పెరిగినప్పుడు తప్పకుండా బ్రేక్ తీసుకొండి. దాన్ని జయించడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకొండి. తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు మీ మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. తగినంత నిద్ర పోవడం లేదు... దురదృష్టవశాత్తు.. గత కొద్దేళ్లుగా మన నిద్ర అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇది అనారోగ్యకరమైన పద్ధతి అని తెలిసినప్పటికి మార్చుకోలేకపోతున్నాం. మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60 నుంచి 90 శాతం మంది రోగులు నిద్రలేమితో బాధపడుతున్నా వారే అని తెలిపింది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అలవాటు ఇలానే కొనసాగితే.. ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక రాబోయే సంవత్సరంలో నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మీ మనస్సు సరిగా పనిచేయదు, ఇది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. (చదవండి: ఆనందారోగ్యాలకు పది సూత్రాలు) తగినంత వ్యాయామం లేదు.. మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా. ఎక్సర్సైజ్ విషయంలో 2020 మమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చింది. లేచిన దగ్గర నుంచి చాలా మంది మొబైల్ స్క్రీన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయారు. సామాజిక దూరం కారణంగా వ్యాయమాన్ని నిర్లక్ష్యం చేశాము. ఇక రాబోయే సంవత్సరంలో ఈ అలవాటును తప్పక మార్చాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మయోక్లినిక్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, వ్యాయామం “ఫీల్-గుడ్ ఎండార్ఫిన్లు, సహజ గంజాయి లాంటి మెదడు రసాయనాలు (ఎండోజెనస్ కానబినాయిడ్స్), ఇతర సహజ మెదడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతాయి”. జిమ్కు వెళ్లడం మరి కొద్ది రోజులు వీలుపడక పోవచ్చు. కానీ వాకింగ్ చేయడం ఒకే కదా. ప్రయత్నించండి.. 21 రోజుల తర్వాత ఎలా ఉందో పరిశీలించండి. 24 గంటలు సోషల్ మీడియానే లోకం.. 2020 మనల్ని సోషల్ మీడియాకు మరింత బానిసల్ని చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా రోజుల పాలు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలుపోక స్క్రోలింగ్ చేయడం, సెల్ఫీలు పోస్ట్ చేయడం, రోజంతా మీమ్స్ను సర్చ్ చేయడం వంటివి చేస్తూ టైం పాస్ చేశారు. సోషల్ ప్లాట్ఫామ్లపై కొంత సమయం గడపడం మంచిదే. కానీ ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే కోరిక ఉంటే, మీ సమస్య తీవ్రమైనట్లే. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. మొబైల్కే అతుక్కపోవడం వల్ల శారీరక ఆతోగ్యం కూడా దెబ్బతింటుంది. కష్టమైనా సరే ఈ ఏడాది సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిద్దాం అని నిర్ణయం తీసుకొండి. ఆ సమయాన్ని మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు.. కుటుంబంతో గడిపేందుకు.. ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించడానికి వినియోగించండి. ఆ తర్వాత మీరే అద్భుతః అంటారు. (చదవండి: మోదీ ఎలా యాక్టివ్గా ఉంటున్నారు ?) -
కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే
న్యూఢిల్లీ: మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువయి, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్ శ్రేయా గుప్తా చెబుతున్నారు. ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు. కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్డాలా’ అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. -
జూమ్ క్లాస్లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?
కరోనా అన్నింటినీ మార్చేసింది. తినే తిండినీ, మనిషి నడతను, నడవడికను పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు గదుల్లో కంప్యూటర్తో కుస్తీ పట్టేవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే పని చేస్తున్నారు. ఒక ఇంట్లోనే ఉన్నా కూడా ఒకరి మొహాలు మరొకరు చూసుకోవడమే గగనమైపోయిన నగరవాసులు ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి ముచ్చట్లాడుతూ భోజనం చేస్తున్నారు. ఇక ఈ సమయానికల్లా మొదలవాల్సిన పాఠశాలలు, కాలేజీలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. కానీ ఆన్లైన్లో మాత్రం పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి. (‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్పాట్!) ఈ నేపథ్యంలో నిద్రిస్తే లేపే స్నేహితుడు లేక, నిద్రను ఆపుకోలేక ఓ బుడ్డోడు జూమ్లో నిర్వహించిన క్లాసులోనే నిద్రపోయాడు. ఎంతలా అంటే కుర్చీనే పరుపుగా భావిస్తూ వెల్లకిలా పడుకుండిపోయాడు. అయితే అటువైపు టీచర్ మాత్రం 40 నిమిషాలు పాఠాలు చెప్తూనే ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారణం ప్రస్తుతం ఇది అందరి జీవనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిద్రను మించిన పని లేదంటూ అనేకమంది బెడ్డుకే పరిమితమవుతూ మరింత బద్ధకస్తులవుతున్నారు. 2020 మొత్తం ఇలాగే గడిచిపోయేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. (మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..) -
మనం నిద్రిస్తే కరోనా కూడా నిద్రిస్తుందట!
కరాచీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. తొలుత భారత్లో నమోదైన కేసుల సంఖ్య లాక్డౌన్ సడలింపులతో విపరీతంగా పెరిగిపోయింది. అటు పొరుగు దేశమైన పాకిస్తాన్ కరోనాను ఎదుర్కోలేక పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వైరస్పై విచిత్ర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు ఎంతసేపు పడుకుంటే కరోనా అంతసేపు నిద్రిస్తుంది. మనం చనిపోతే కరోనా చనిపోతుంది. అంతే.. " (పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్) "నిద్రించే సమయంలో వైరస్ ఎలాంటి హాని చేయదు. పైగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు ఫజల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాటలు వింటే కరోనా నిజంగానే చనిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంతకీ పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మనం నిద్రపోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!) -
కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం
న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్గానీ, పడితే ప్రాణాలను కాపాడేందుకు తగిన మందులుగానీ ఇంతవరకు అందుబాటులో లేవు. కనుక పడకుండా ఉండేందుకు పరిశుభ్రత ఎలా ఏకైక మార్గమో, పడితే మన శరీరంలోని రోగ నిరోధక శక్తియే మనల్ని కాపాడాలి. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే అన్ని విటమిన్లకు సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలని మన వైద్యులు చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నితిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదట. ఈ విషయాన్ని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పింది. మన శరీరమంతా బయటి నుంచి దాడిచేసే మైక్రోబ్స్ను ఎదుర్కొనేలా నిర్మాణమై ఉంది. అణువులతో కూడా మన శరీరంపైనుండే చర్మం భిగించినట్లుగా ఉండి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రోబ్స్ను చొరపడకుండా అడ్డుకుంటుంది. అందుకు అనువుగా చర్మం వెలుపలి పొరలో ‘డెడ్ సెల్స్’ ఉంటాయి. కనుక కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్ శరీరంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తాయి. కళ్లలో ఓ దశ వరకు యాంటీసెప్టిక్ కన్నీళ్లు మైక్రోబ్స్ను అడ్డుకుంటాయి. ముక్కు, కాలేయంలో ఏర్పడే శ్లేష్మం కూడా వాటికి ఓ దశ వరకు అడ్డుకుంటాయి. కాలేయంలో తయారయ్యే శ్లేష్మం ముక్కు ద్వారా తుమ్ముల రూపంలో బయటకు వేగంగా వస్తుంది. శ్లేష్మం తుంపర్ల ద్వారా మైక్రోబ్స్ మన శరీరం నుంచి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియను కూడా తట్టుకొని కొన్ని వైరస్లు మన శరీర జన్యువుల్లోకి ప్రవేశిస్తాయి. వాటిని మన రక్తంలోని యాంటీ బాడీస్ (రోగ నిరోధక శక్తి) గుర్తించి చంపేస్తాయి. మొట్టమొదటగా ‘బి–లింపోసైట్స్’గా పిలిచే కొన్ని తెల్ల రక్త కణాల గుంపు మైక్రోబ్స్ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీస్ సృష్టికి సంకేతాలు పంపిస్తాయి. అప్పుడు టీ–సెల్స్గా పిలిచే రక్తంలోకి మరికొన్ని తెల్ల రక్తకణాలు వైరస్ మీద దాడి చేస్తాయి. రసాయనిక సంకేతాలు పంపడం ద్వారా ఇవి మైక్రోబ్స్ను నాశనం చే స్తాయి. మైక్రోబ్స్ను ఎదుర్కోవడంలో భాగంగా అభివృద్ధి చెందిన యాంటీ బాడీస్ రక్తంలోని ప్లాస్మాలో కొన్ని సంవత్సరాలపాటు మనుగడ సాగిస్తాయి. యాంటీ బాడీస్ వల్ల నాశనం కాకుండా బతికే మైక్రోబ్స్ వల్లనే అంటురోగాలు వస్తాయి. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) చర్మం దగ్గరి నుంచి రక్తంలోని యాంటీ బాడీస్ వరకు అన్ని రోగ లేదా మైక్రోబ్స్ నిరోధక వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే జీవ గడియారం (బయాలోజికల్ క్లాక్) సరిగ్గా పని చేయాలని, అందులో నిద్ర అతి ముఖ్యమైనదని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలియజేశారు. ఏ వేళకు తినాలి, ఏ వేళకు నిద్రపోవాలి, ఏ వేళకు నిద్ర లేవలనే ప్రక్రియలను నిర్దేశించేదే జీవ గడియారం. ఈ జీవ గడియారం సక్రమంగా నడవాలన్నదే నిద్రనే ముఖ్యం. (చైనా కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్!?) -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్కు రండి
ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్ ల్యాబ్లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గుంటూరు (మెడికల్) సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్ ఫోన్స్ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్). తొలి ఆస్పత్రిగా రికార్డు ‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్ ల్యాబ్)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చు తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు. రుగ్మతల నిర్ధారణకు స్లీప్ల్యాబ్ ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్ డిజార్డర్తో బాధపడేవారికి స్లీప్ ల్యాబ్లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు. పరీక్షల విధానం ఇలా.. ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. ► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు. ► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ► ఇక్కడి ల్యాబ్లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్ల్యాబ్లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు. ► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్ ఉంటారు. ► నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్ను ప్రత్యేకంగా నియమించారు. రెండేళ్లుగా ఉచిత పరీక్షలు స్లీప్ల్యాబ్ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్ ల్యాబ్లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం -
నాణ్యమైన నిద్రతోనే మెదడు హెల్దీ
మనకు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని కొందరు చెబుతుంటారు. ‘మత్తు వదలరా... నిద్దుర మత్తు వదలరా’ అని సినిమా పాట వినిపిస్తూ... చాలాసేపు నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమనీ, అది తమోగుణం అని హితవు చెబుతుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్ పరిశోధకలు,. అక్కడి డ్యూక్–ఎన్యూఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్కు చెందిన పరిశోధకులు... కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల మీద కొన్ని న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్ స్కాన్లు తీశారు. ఆ ఎంపిక చేసిన వ్యక్తుల నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను రెండేళ్ల పాటు పరీక్షించాక కొన్ని విషయాలను తెలుసుకున్నారు. అదేమిటంటే... సాధారణంగా అందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కొద్దీ మెదడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఏడు గంటల పాటు నాణ్యమైన నిద్రను అనుభవించేవారిలో ఇలా క్షీణించే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంటుందనీ, దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే చాలాకాలం పాటు ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు ఏజింగ్ ప్రక్రియ త్వరత్వరగా జరిగి మెదడుకు వృద్ధాప్యం కాస్త త్వరత్వరగా వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు ‘స్లీప్’ అనే మెడికల్ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. -
ఆలస్యపు నిద్రతో అనారోగ్యం!
న్యూయార్క్: ఆలస్యం.. అమృతం.. విషం.. అంటారు. అయితే నిద్రపోయే విషయంలో ఆలస్యం అమృతం కానేకాదని.. కచ్చితంగా విషమేనని అంటోంది తాజా అధ్యయనం. ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల బరువు పెరుగుదల విషయంలో ఇది అక్షరాలా నిజమని పేర్కొంది. ఆలస్యంగా నిద్రపోయే అమ్మాయిల్లో బరువు పెరిగే ప్రమాదం అధికమని తేల్చి చెప్పింది. న్యూయార్క్లో జరిపిన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల జామా పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న 418 మంది బాలికలు, 386 మంది మగపిల్లలను ప్రశ్నించారు. నిద్రకు సంబంధించిన అలవాట్లను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాన్ని పిల్లల చేతి మణికట్టుపై అధ్యయన కాలంలో ధరించారని అమెరికాలోని ఆరోగ్య సంస్థ కైసర్ పర్మనెంట్ పరిశోధకులు తెలిపారు. అనంతరం డ్యూయల్ ఎక్స్రే అబ్సార్ప్షియోమెట్రీ విధానాన్ని ఉపయోగించి పిల్లల శరీరంలోని కొవ్వు నిష్పత్తిని కొలిచారు. అదేవిధంగా పిల్లల నడుము పరిమాణాన్ని రికార్డు చేశారు. వీటితో పిల్లల సోషల్ మీడియా వాడటం వల్ల వారంపాటు నిద్రపోయే సమయంలోనూ, వారాంతాల్లో నిద్రపోయే సమయంలోనూ తేడాని సైతం గమనించారు. వారం రోజుల్లో కన్నా, వారాంతంలో ఆలస్యంగా నిద్రిసున్న వారిలో సామాజిక మాద్యమాల వాడకం వల్ల వచ్చే బద్ధకం (సోషల్ జెట్లాగ్) ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించే యుక్తవయసు బాలికల నడుము చుట్టుకొలతలు 0.58 సెంటీమీటర్లు అధికంగా ఉన్నాయని, వారి శరీరంలో 0.16 కిలోగ్రాముల కొవ్వుపెరిగినట్లు అధ్యయనంలో తేలింది. గంట గంటకీ పెరిగే కొవ్వు.. ప్రతి గంట సోషల్ జెట్లాగ్ కారణంగా యుక్తవయసు బాలికల్లో 1.19 సెంటీమీటర్ల మేర నడుము కొలత, శరీరంలోని కొవ్వు 0.45 కిలోగ్రాములు పెరుగుతున్నట్టు వెల్లడైంది. బరువు పెరుగుదలకు కారణమయ్యే ఇతర అంశాలైన నిద్రించే సమయం, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, టీవీ చూసే సమయం తదితర అంశాలను వేరుచేసినప్పటికీ నడుము కొలతల్లోనూ, కొవ్వు శాతంలోనూ తేడా అలాగే కొనసాగినట్లు తేలింది. అయితే అబ్బాయిల్లో సైతం కొన్ని తేడాలు గమనించినప్పటికీ అవి అంతగా చెప్పుకోదగినవి కావని వెల్లడించింది. అందుకే నిర్దిష్టంగా నిద్రపోవడం వల్ల బాల్యంలోనూ, యవ్వనంలోనూ వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చని అధ్యయనకారులు సూచిస్తున్నారు. -
నిద్ర అలవాట్లలో తేడా వస్తే...
వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్ టెన్షన్లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్ తెలిపారు. ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు. -
బ్యాంకులో ఓ రోజు
ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం గుయ్మని వినిపించసాగింది. బద్ధకంగా మెసేజ్ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్ నెగటివ్ నుండి పాజిటివ్కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్ మెంట్ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్ గా క్లినిక్ కి వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్ కాల్. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్ తన హౌసింగ్ లోన్ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్.మొండి బకాయిల గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్ ఆన్ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్. ఫోన్ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్ గా కాష్ కావాలి’ కస్టమర్ అభ్యర్ధన. కనెక్టివిటీ వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్ ఉంచుకుని కాష్ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్ విన్నపం మరియు సలహా. క్యాషియర్ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్లో బాలన్స్ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్ రాదని ప్రశ్న ప్లస్ జవాబు?! ఇంతలో లోన్ సెల్ నుండి డీవియేషన్ అప్రూవ్ అయితే గాని హౌసింగ్ లోన్ క్లియర్ కాదని, అర్జంట్ గా రమ్మనమని పిలుపు. సింగల్ బ్రాంచ్ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్ ఆఫీస్ నుండి కాల్. సీజీమ్ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ నా?!) ‘నేను సింగల్ బ్రాంచ్ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్ ఫోన్ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్ రాలేదు’ ‘లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్ ‘సిస్టమ్ సస్పెన్స్ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్గా రివర్స్ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్ సర్! ఇంకా రెస్టోర్ కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్ వచ్చి ‘సర్ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’ ‘అదే సర్...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట. గబగబా బీఓడీ చేసి, కాష్ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్ ఇన్ఛార్జ్ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్ కూడా చెయ్యాలి, గోల్డ్ లోన్కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్ ఇన్ఛార్జ్. చిరాకు, టెన్షన్ తో ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా మరిచిపోయాను ఈ రోజుకి తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్ లెవెల్ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం గ్యారెంటీ.పాసింగ్ ప్రారంభించాడు చకచకా. ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్ లోన్కి.‘వీటికి లోన్ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్ హెడ్ ఆఫీస్ నుండి ...ట్రేడింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ లీన్ లో ఉందనీ, అది లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్ అంబుడ్స్మెన్కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా ఫోన్ వచ్చింది.ట్రేడింగ్ అకౌంట్ ఆపరేట్ చేసేది కస్టమర్, అతడు షేర్స్ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్ లీన్లో పెట్టుకునేది అతడే...షేర్స్ అలాట్ కానప్పుడు ఆ లీన్ లిఫ్ట్ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్ మేనేజర్ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్ లిఫ్ట్ చేయించి ప్రాబ్లెమ్ లేకుండా చూసుకోండి’ అని ఫోన్ కట్ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్ అందుకుంటే అది ఖాళీ.బెల్ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్ క్లియరింగ్కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్ హాల్లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్ బాక్స్ లో వేశారు. అది శుక్రవారం ఉదయం వెళ్ళింది. శనివారం నాన్ క్లియిరింగ్ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్ అని బోర్డ్ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని కౌంటర్లో కాష్ ఇన్చార్జ్ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని కస్టమర్ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తాననే వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్ టైం అవ్వడంతో ఇంట్రవెల్ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది. రమణమ్మకు టిఫిన్ తెమ్మనమని చెప్పాడు.బాంక్ ఎదురుగా ఓ పాక హోటల్ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్కి బైపాస్ తప్పదేమో? సీనియర్ కొలీగ్ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్ అర్జంట్ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్ బ్రాంచ్ లిమిట్ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్ బ్రాంచ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే, చెక్ ఎటెస్టు చేసి కస్టమర్ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్ ట్రాన్జాక్షన్స్ క్లోజ్ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్ బాలన్స్ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్ క్లోజ్ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్ నైట్.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్ ఎంట్రీలు రివర్స్ చెయ్యాలంటే స్టాఫ్ ఉండాలి. వాళ్లు ఫీడ్ చేసాక గాని తను ఆథరైస్ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్ నుండి ఫోన్ వచ్చింది.‘ఇంకా రివర్స్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్. ‘ఒరేయ్...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్ లోన్ లిమ్మంటారు.బ్రాంచ్ షిఫ్ట్ చేద్దామంటే నన్నే షిఫ్ట్ చేస్తామన్నారు. పైగా నా వాక్ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్ చేశావ్’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్లోన్ ఇవ్వొచ్చూ అంటావ్...సరి సరి’ఇంతలో సెల్ఫోన్లు గుయ్ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది’ అంటూ ఇద్దరూ ఫోన్ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్? ఇంకా పదేళ్లు సర్వీస్ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్తో వుంటామో లేదో....వున్నా రోగాలతో, మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్ కాల్, ఓ రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటికి తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్ చేసాడు.‘క్లినిక్ కి వస్తున్నాను’ చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్ చెక్ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్ లేదా?’ అంది.సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ గుయ్ మంది.మెసేజ్ చూశాడు...బ్రాంచ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఉదయం ఏడు గంటలకు ఆడిటర్ వస్తున్నట్టుగా ఓ వార్త. ∙పక్కి శివప్రసాదరావు -
నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కళ్యాణ్, గుంటూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు... నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
నిద్ర... పరీక్షకు రక్ష!
నిద్రపోవడం అంటే... మెదడుకు శక్తినివ్వడమే.పరీక్షల సమయంలో అయితే... జ్ఞాపకశక్తినివ్వడమే.చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికిరాత్రి నిద్రే కాదు... మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.ఆ వివరాలను మెలకువతో మెళకువగాతెలుసుకోండి. ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు. రాత్రిళ్లు చాలా ఆలస్యంగా పడుకోవడం, మళ్లీ పొద్దున్నే త్వరగా లేవడం లాంటి చర్యలతో తమ నిద్ర సమయాన్ని కుదించుకుంటారు. దాంతో మామూలుగా నిద్ర పోయే వ్యవధి కంటే చాలా తక్కువగా నిద్రపోతుంటారు. పరీక్షల సమయంలో ఇలా చేయడం ఎంత వరకు సబబు? పరీక్షల్లో చదవడానికి నిద్ర ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ సమయంలో నిద్ర తగ్గడం మంచిదేనా? నిద్రనూ, చదువునూ సమన్వయపరుచుకుంటూ పరీక్షల సమయంలో ఎలా చదవాలి? ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పిల్లల్లో నిద్ర చాలా ప్రధానం. అందునా చిన్నపిల్లలతో పాటు, ఇప్పుడు పరీక్షలకు చదువుతున్న టీనేజ్లో ఉండే పిల్లలకూ తగినంత సేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కరూ సరిగ్గా నిర్ణీతంగా ఇంత సమయం నిద్రపోవాలని చెప్పలేకపోయినప్పటికీ, మర్నాడు నిద్ర లేచాక తమకు అలసటగా ఉండటం, నిస్సత్తువగా లేదా నీరసంగా ఉండటం, మాటిమాటికీ చికాకు కలగకుండా ఉండటానికి ఎంత నిద్ర అవసరమో అంతసేపు నిద్రపోవాల్సిందే. పరీక్షలప్పుడు కూడా అంతే నిద్ర అవసరం. కాకపోతే పరీక్షల పేరిట పిల్లలు తాము అంతకు ముందు చదువుతున్న అంశాలను బ్రష్ అప్ చేసుకోడానికి ఒక గంట, గంటన్నర కేటాయించి, ఆ మేరకు మాత్రమే మెలకువతో ఉండటం మంచిది. ఏదో ఒక రోజు నిద్ర తగ్గితే పర్లేదుగానీ... అలా కాకుండా... రోజులో తాము నిద్రపోయే మొత్తం వ్యవధిలో రెండు గంటలకు మించి నిద్ర తగ్గడం అంత మంచిది కాదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే... పిల్లల్లో నిద్ర సమయంలో ఎన్నో కీలకమైన జీవక్రియలు జరుగుతుంటాయి. దాంతో నిద్ర వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. టీనేజ్లో ఉండే పిల్లల్లో అప్పుడప్పుడే యుక్తవయసులోకి వస్తుండటంతో వారిలో ఎన్నో రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. ఈ హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడం జరుగుతుంది. అందుకే పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తే, అవి పెద్దయ్యాక కూడా వారి సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రిపేర్ల ప్రక్రియ అంతా నిద్రలోనే : మనం నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అంటే మనం తగినంత నిద్రపోకుండా ఉంటే మనలోని రోజువారీ పనులు లేదా జీయక్రియల్లో దెబ్బతిన్న అంశాల రిపేర్లు అంత సమర్థంగా జరగవన్నమాట. నిద్రపోతేనే ఎత్తు పెరిగేది: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే స్రవిస్తుంది. కాబట్టి పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా ఎత్తు పెరగగలరు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలనూ బలపడేలా చేస్తుంది. అవి బలిష్టంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. ఇక పరీక్షలు రాసే మన పిల్లలంతా ఎదిగే వయసులో ఉండేవారే. ఏదో ఒకరోజో, రెండు రోజులో కాసేపు నిద్ర పోకపోతే దాని వల్ల జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పరీక్షలు సాధారణంగా రెండు లేదా మూడు వారాల పాటు జరుగుతుంటాయి. అంతకాలం నిద్రకు దూరం కావడం అంటే మన ఎదుగుదలనూ మనమే చేజేతులారా దెబ్బతీసుకున్నట్టే. చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి : పరీక్షల సమయంలో మనం చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి నిద్ర ఎంతగా దోహదం చేస్తుందో చూద్దాం. మనలో జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిదాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. మనం ఏదైనా చదవగానే మనకు అర్థమైనదంతా తిరిగి చెప్పాలంటే చెప్పగలం. కానీ కొంతకాలం తర్వాత దాన్ని మరచిపోవచ్చు. మళ్లీ చదివితే తప్ప అది గుర్తు రాదు. ఏదైనా చదివింది చాలాకాలం గుర్తుండాలంటే అది జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియలో రెండోదైన శాశ్వత జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ)లోకి వెళ్లాలి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్న అంశం... షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్లే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పరీక్షల కారణంగా రాత్రిపూట ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ వ్యవధి రాత్రి ఒక గంట ఆలస్యంగా పడుకోవడమో, ఉదయం ఒక గంట ముందుగా నిద్రలేచి ఆ సమయాన్ని చదువుకు వాడకోవడమో మంచిది. అంతకు మించి నిద్రను దూరం చేసుకోవడం పిల్లలకు మంచిది కాదు. నిద్రపోకుండా చదివితే కీడే ఎక్కువ : నిద్రపోకుండా చదువుకోవడం ఎందుకు మంచిది కాదో చెప్పడానికి ఎన్నో అధ్యయనాలున్నాయి. పరీక్షల పేరుతో నిద్రపోకుండా ఉండటం వల్ల జరిగే అనర్థాల్లో కొన్ని ఇవి... నేర్చుకునే శక్తి తగ్గుతుంది : íపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారిలో నేర్చుకునే శక్తి మందగిస్తుంది. అంతేకాదు... వారి ఏకాగ్రత సైతం తగ్గుతుంది. చురుకుదనం లోపిస్తుంది. ఏదైనా అంశం మీద దృష్టి కేంద్రీకరించే శక్తి, రీజనింగ్ పవర్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బాగా తగ్గుతాయి. పిల్లలు మందకొడిగా అయిపోతారు. పరీక్షల సమయంలో పైన పేర్కొన్న అంశాలు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకే చదువుకునే సమయం కాస్త తగ్గినా పర్లేదుగానీ... చిన్నారుల నిద్ర సమయం మాత్రం తగ్గనివ్వకూడదు. పిల్లల మూడ్స్కు అంతరాయం : నిద్రలేమితో బాధపడేవారి పిల్లల మూడ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి అంశాలకే తీవ్రంగా స్పందించడం, చిన్న చిన్న అంశాలకే చికాకు పడటం వంటి ఎక్స్ట్రీమ్ మూడ్స్ ప్రదర్శిస్తుంటారు. అదే బాగా నిద్రపోయిన వారు కాస్త స్థిమితంగా ఉంటారని అధ్యయనవేత్తలు తెలుసుకున్నారు. పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి వాళ్ల మూడ్స్ కూడా బాగుండటం చాలా అవసరమన్నది తెలిసిందే కదా. పదాల కోసం తడుముకోవడం : ఇక నిద్ర కోసం జరిగిన మరో పరిశోధనలో వెల్లడైన వివరాలివి... క్రితం రాత్రి నిద్రలేమితో బాధపడ్డవారూ, కంటినిండా నిద్రపోయిన వారు... ఇలా రెండు విభాగాలను తీసుకొని ఒక అధ్యయనం నిర్వహించారు. నిద్రలేమితో బాధపడ్డవారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయినట్లు, ఏదైనా రంగులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించడంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు, మాట్లాడే సమయంలో పదాల కోసం తడుముకున్నట్లు తెలుస్తోంది. అదే బాగా నిద్రపోయిన వారిలో ఈ సమస్య ఎదురుకాలేదు. పైగా నిద్రలేమితో ఉన్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు కూడా అధ్యయనవేత్తలు గుర్తించారు. పరీక్షల కోసం తయారయ్యే పిల్లలకు పదసంపద (వకాబ్యులరీ) ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. చదివిన అంశాలను పరీక్షల్లో రాసే సమయంలో వారికి పదాలు (వకాబ్యులరీ) వెంట వెంటనే తడుతూ ఉండాలి. అలా తట్టాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. ఒకటీ రెండూ కాకుండా... ఈ విషయాలన్నీ నిద్ర గురించి వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు జరిపిన దాదాపు 70 అధ్యయనాల్లోనూ ఇదే తేలింది. పరీక్షల సమయంలో నిద్ర మానేసి చదవడం అంత శ్రేయస్కరం కాదని ఇటు పిల్లలూ, అటు పెద్దలూ గుర్తించాలి. పరీక్షల సమయంలో నిద్రను సమన్వయించుకోవడానికి ఈ కథనంలో పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. మిగతా పదహారు గంటలు చదువుకోసం కేటాయించవచ్చు. అలా కుదరకపోతే మీ రాత్రి నిద్రను ఆరుగంటల కంటే ఎట్టిపరిస్థితుల్లో తగ్గనివ్వవద్దు. అది మీ చదువుకు మేలు చేకూర్చకపోగా... మీకు (పిల్లలకు) కలిగే నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోండి. పరీక్షల సమయంలో మీ పడక, నిద్ర ఎలా ఉండాలంటే... చదివే ప్రదేశం ప్రకాశవంతంగా ఉండాలి: కొంతమంది పిల్లలు చదివేదానిపై బాగా దృష్టి కేంద్రీకరించడం కోసం టేబుల్ లైట్ మాత్రమే వేసి, గదంతా చీకటిగా ఉంచుతారు. చదువు ఒంటబట్టడానికి ఈ తరహా వాతావరణం సరికాదు. మీరు చదివే గదంతా వెలుతురు పరచుకుని ఉన్నప్పుడే చదువు బాగా మనసుకెక్కుతుందని గుర్తుంచుకోండి. పడక దీనికి భిన్నంగా ఉండాలి. మీరు పడుకునే చోట మసక వెలుతురుండాలి. మీరు చదివే గది దేదీప్యమానంగా ఉండాలి. మీ పడక పడుకోవడం కోసమే: కొంతమంది పిల్లలు పడకపై పడుకొని చదువుతుంటారు. నిజానికి కూర్చొని చదవడమే మంచిది. బెడ్పై చదవడం, ల్యాప్టాప్ బ్రౌజింగ్ చేయడం, సెల్ఫోన్ చూసుకోవడం.. ఇలాంటి పనులేవీ చేయకండి. చదవడం అన్నది డెస్క్ దగ్గర. పడుకోవడం మాత్రమే బెడ్ మీద. పడకగది చీకటిగా ఉంటేనే మెదడులో మెలటోనిన్ అనే రసాయనం స్రవిస్తుంది. నిద్రపట్టడానికి ఈ రసాయనమే దోహదపడుతుంది. నిద్రకు రెండు గంటల ముందే భోజనం : మీరు పరీక్షలకు చదువుతున్నా లేదా మామూలు సమయంలోనైనా... మీరు పడకకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు. ఇలా కుదరకపోతే కనీసం గంట ముందన్నా భోజనం పూర్తి చేయండి. హెవీ మీల్ తినేసి, అప్పుడు మీరు చదువుకోడానికి కూర్చున్నా అది కునికిపాట్లకు దారితీస్తుంది తప్ప ఏకాగ్రత కుదరదు. రోజూ అదే వేళకు... ‘అర్లీ టు బెడ్.. అర్లీ టు రైజ్’ అని వాడుక. అంటే పెందలాడే పడుకొని, పెందలాడే నిద్రలేవడం మంచి అలవాటని అర్థం. పరీక్షలున్నా లేకపోయినా... వేరే పనులున్నా... సెలవుల సమయమైనా, హాలిడే ఉన్నా ఈ అలవాటు తప్పనివారిలో ఏకాగ్రత, చదివింది అర్థం చేసుకునే శక్తి ఎక్కువ అని అనేక అధ్యయనాల్లో తేలింది. నీళ్లు ఎక్కువగా తాగండి : సాధారణంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచి అలవాటన్నది తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో, బాగా చదివే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు పిల్లల్ని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలోని మిగతా అవయవాలతో పాటు మెదడుకూ మంచి హైడ్రేషన్ ఉండటం వల్ల చదివింది గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. మరిన్ని సార్లు మూత్రవిసర్జనకు లేవాల్సిరావడం కూడా వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. మధ్యాహ్నం పూట ఓ పవర్ న్యాప్ : పరీక్షలకు చదివే సమయంలో రాత్రి నిద్రపోని పిల్లలు మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు నిద్రపోవడం మంచిది.ఈ పవర్న్యాప్ వారిలో మరింత శక్తిని పెంచుతుంది. అయితే ఈ పగటి నిద్ర కేవలం అరగంటకు మాత్రమే పరిమితం కావాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోతే అది రాత్రి మళ్లీ నిద్రలేమికి దారితీయవచ్చు. దాంతో మర్నాడు పగటిపూట మందకొడిగా, చికాకుగా, నిస్సత్తువగా ఉండవచ్చు. అందుకే పవర్న్యాప్ అన్నది కేవలం చదివే పవర్ను పెంచేలా ఉండాలి. అది అరగంటకు మించకూడదు. రాత్రి కష్టమైన టాపిక్స్ చదవవద్దు : మీకు కష్టం అనిపించినవీ, కఠినమైనవీ రాత్రిపూట చదవకండి. కేవలం మననం చేసుకునేవీ, మనసులో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు చదివేవి మాత్రమే రాత్రిపూట చదవండి. ఒక్కోసారి అలా చదివే సమయంలో అది రాత్రి నిద్రలేమికి దారితీయవచ్చు. కాబట్టి కఠినమైనవీ, టఫ్ సబ్జెక్టులను పగటివేళే చదవండి. లెక్కలూ... రీజనింగ్ కోసం నిద్ర అవసరం ఎంతంటే... విక్టోరియా (ఆస్ట్రేలియా)లోని ప్రవుుఖ పిల్లల పరిశోధన సంస్థ ‘వుర్డోక్ చిల్డ్రెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన ఓ అధ్యయన బృందం 4500 వుంది పిల్లలపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో నిద్రసమస్యలు ఉన్న పిల్లల కంటే... రాత్రి బాగా నిద్రపోయిన పిల్లలు క్లాస్రూమ్లో మిగతా పిల్లలు తవు టీచర్లతో వ్యవహరించేటప్పుడూ, లెక్కలు చేసేటప్పుడూ మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంటే రీజనింగ్తో వ్యవహారాలను సమర్థంగా నెరపడానికీ, మ్యాథ్స్ బాగా చేయడానికి కూడా కంటినిండా నిద్రపోవడం అన్నది బాగా ఉపకరిస్తుంది. ‘‘నిద్ర సవుస్యలు ఉన్న పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సవుస్య వస్తే– అది తగ్గే తీరు, కోలుకునే వ్యవధి వంటివి మిగతా పిల్లల కంటే కాస్తంత తక్కువే. అదేగానీ పిల్లలకు సరిపోయినంత నిద్ర ఉంటే వాళ్లలో దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సస్ట్రేషన్) కూడా ఎక్కువ. అంతేకాదు– సవుస్యలను పరిష్కరించే (ప్రాబ్లమ్ సాల్వింగ్) శక్తి కూడా అధికం. పైగా వర్క్లోడ్ తీసుకునే సావుర్థ్యం కూడా పెరుగుతుంది’’ అన్నది ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన జాన్ క్వాష్ చెబుతున్న మాట. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్రపోయే దిక్కుల్లో... ఈస్ట్ బెస్ట్... నార్త్ వరస్ట్
ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోవడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధనలూ నిరూపిస్తున్నాయి. మనం తలపెట్టుకునే దిశను బట్టి దాని ప్రభావం మన నిద్రమీద, తద్వారా శరీరం మీదా పడుతుందని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. మనం పడుకునే భంగిమ సరిగా లేకపోతే అది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి. అన్నింటికన్నా తూర్పు దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిక్కున తల పెట్టుకుని పడుకుంటే ఏ ఫలితం ఉంటుందో చూద్దాం.. తూర్పుదిక్కున తలపెట్టుకుని పడుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుందట. సానుకూల ఆలోచనలు వస్తుంటాయట. తూర్పు తర్వాత దక్షిణానికి పెద్ద పీట వేశారు పెద్దలు. దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకునేవారికి ఆయుష్షు వృద్ధి అవుతుందట. పని చేసే శక్తి కూడా పెరుగుతుందట. ఆ తర్వాత పడమటి దిక్కు. అది అంత మంచిది కాదట. పడమటి దిక్కుగా తల పెట్టుకుని పడుకునేవారిలో అనవసర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. ఇక ఉత్తర దిక్కు సంగతి సరేసరి. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే జీవన కాలం తరిగిపోతుందట. రక్తపోటు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయట. గుండెపోటు, పక్షవాతం, హెమరేజ్, పార్కిన్సన్, ఆలై్జమర్స్ వంటివి తలెత్తే ప్రమాదం ఉందట. మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి తరంగాలు మన మెదడులో దాగి వున్న శక్తిమంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు, దక్షిణ దిక్కులలో తల ఉంచి నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి లోపాలు ఏమైనా ఉన్నా సర్దుకుంటాయి. రక్తప్రసరణ సరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని ఆయుర్వేద, జ్యోతిష పండితుల దగ్గరనుంచి ఆధునిక పరిశోధకుల వరకూ చెబుతున్నారు. -
నిద్రకు అష్టకష్టాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం. నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు. నిద్రపై శాస్త్రీయమైన దృష్టి నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది. నిద్ర అంటే... మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్ఆర్ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్ఆర్ఈఎమ్లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు. నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్ఆర్ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.) నిద్రలేమితో వచ్చే సమస్యలు నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు ∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం ∙దిగులు ∙మానసిక కుంగుబాటు ∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... మంచి నిద్ర కోసం... ►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం ► రోజూ వ్యాయామం చేయడం ►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు ►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు ►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు. ►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు. ►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి. ►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి. కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని... ►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు. ►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ. ►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు. జాగారంలో రికార్డు మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు. – పన్యాల జగన్నాథదాసు నిద్ర సంబంధమైన సమస్యలు కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. -
తగిన యుక్తి
ఇశ్రాయేలీయులను పరిపాలించిన కనాను రాజు సేనాధిపతి సీసెర చాలా క్రూరుడు. ఇశ్రాయేలీయులను బహుగా హింసించేవాడు. ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఈ సీసెర ఇనుప రథాలతో ఇశ్రాయేలీయులను, వారి పక్షంగా యుద్ధం చేసే బారాకుని చంపాలని బయలుదేరాడు. అయితే ఎంతటి సేనాధిపతి అయినా అవతలి వ్యక్తి బలాన్ని తక్కువ అంచనా వేస్తే ఓడిపోక తప్పదు కదా. సీసెర విషయంలో కూడా ఇదే జరిగింది. తన సైన్యాన్నంతా కోల్పోయి తన రథాలను విడిచి బారాకు తరుముతున్నప్పుడు కాలినడకన అక్కడినుండి పారిపోవడం మొదలు పెట్టాడు. అలా వెళ్లిన సీసేరాకు ఒక స్త్రీ కనిపించింది. స్త్రీనే కదా, తనకు ఇక ప్రాణహాని ఉండదు.. నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని దాహం ఇమ్మని ఆ స్త్రీని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ స్త్రీ నీళ్లకు బదులుగా పాలిచ్చి అతడిని నమ్మించింది. ఇక ఈ స్త్రీ వల్ల తనకు హాని లేదని అనుకుని ఆ స్త్రీని గుడారానికి కాపలాగా ఉంచి ‘‘ద్వారంలో నిలిచి ఎవరైనా వచ్చి అడిగితే ఎవరూ లేరని చెప్పు’’ అని ఆదేశించి, తాను లోపల పడుకున్నాడు. ఇశ్రాయేలీయులను హింసిస్తున్న సీసెర మీద కోపంతో ఉన్న ఈ స్త్రీ ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. పాలు తాగి గాఢ నిద్రలో ఉన్న సీసెరాని గుడారపు మేకుతో సుత్తి చేత పట్టుకుని పొడిచి చంపేసింది. సీసెరా పీడ నుండి ఇశ్రాయేలీయులను విడిపించింది. ఎంతో గర్వంగా ప్రవర్తించిన ఒక రాజ్య సేనాధిపతి దారుణంగా చనిపోయాడు. ఇక్కడ ఈ స్త్రీ గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అవకాశం దొరకగానే చాలా తెలివిగా ప్రవర్తించి నీళ్లడిగితే పాలిచ్చి అతడిని గాఢ నిద్రలోనికి జారుకునేటట్లు చేసింది. అతడి బలాన్ని చూసి భయపడకుండా అతడు పడుకోగానే ఎవరికైనా చెబుదామని వెళ్లలేదు. తాను వెళితే అతడు లేస్తే మళ్లీ బలం తెచ్చుకుంటాడేమోనని ఆలోచించింది. తన ప్రాణానికి తెగించి అతడిని మట్టు్టబెట్టింది, చాలా యుక్తిగా, తెలివిగా ప్రవర్తించి తన జాతిని ఆ క్రూరుడి నుండి రక్షించింది. ఇలాంటి స్త్రీలు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. – రవికాంత్ బెల్లంకొండ -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
నిద్రపోతే ప్రాణానికే ముప్పు!
న్యూఢిల్లీ: ఆరోగ్యం బాగుండాలంటే సరిపడ నిద్ర ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అదే నిద్ర ఓ బాలుడి పాలిట శాపంగా మారింది. నిద్ర శాపంగా మారడం ఏంటని అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి... న్యూఢిల్లీకి చెందిన యదార్థ్ (6 నెలలు) అనే బాలుడు అరుదైన ‘సెంట్రల్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నాడు. జన్యులోపాల కారణంగా పుట్టుకతోనే ఈ వ్యాధి వస్తుంది. దీని వల్ల శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతున్నా నరాలు దాన్ని మెదడుకు చేరవేయడంలో విఫలమవుతాయి. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు గాఢ నిద్రలోకి వెళ్తే ఆక్సిజన్ తగ్గి, ప్రాణాపాయ స్థితి తలెత్తవచ్చు. అందుకే యదార్థ్ తల్లి తన బిడ్డను నిద్రపోనివ్వకుండా కాపాడుకుంటోంది. మరి ఈ వ్యాధికి చికిత్స లేదా అంటే.. కచ్చితంగా ఉంది కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఇది తలకి మించిన భారంగా మారింది. ‘చికిత్సకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తే మా బాబు బతుకుతాడ’ని యదార్థ్ తండ్రి ప్రవీణ్ వేడుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి. -
మేల్కొని ఉండండి
గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది! కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు. ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు. మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు. కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి. అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి. – డి.వి.ఆర్. -
కాంటాక్ట్లెన్స్తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్లెన్స్తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
ఎక్కువైనా.. తక్కువైనా ముప్పే
టోక్యో: అతి నిద్ర, నిద్రలేమి రెండూ హృదయ సంబంధ వ్యాధులకు కారణాలవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. రోజులో సాధారణంగా కావలసిన నిద్రకన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో ముందస్తు మరణాలు, మెదడులో రక్తనాళ సమస్యలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజ నిద్ర సమయంకన్నా ఎక్కువగా అంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 5 శాతం ఉండగా, 9 నుంచి పది గంటలు నిద్రపోయేవారిలో 17 శాతంగా ఉందని చెబుతున్నారు. రోజుకు ఆరు లేదా అంతకన్నా తక్కువ నిద్రపోయే వారిలోనూ ఈ ప్రమాద శాతం 9 శాతంగా ఉంది. రాత్రి సమయంలో ఆరు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రభావానికి గురయ్యే అవకాశం 9.4 శాతంగా ఉందని చెబుతున్నారు. అయితే హృదయ సంబంధ వ్యాధులన్నింటికీ నిద్రే ప్రధాన కారణమని చెప్పలేం అని యురోపియన్ హార్ట్ జర్నల్ చెబుతోంది. అయితే అతి నిద్ర, నిద్రలేమి కచ్చితంగా గుండెకారక వ్యాధులపై ప్రభావం చూపేవేనని ఆ జర్నల్లో ఓ కథనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి 35 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 1,16,000 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా దేశాలనుంచి ఉన్నారు. ఎనిమిదేళ్ల కాలానికి పరిశోధనను తీసుకుంటే సుమారుగా 4,381 మంది మరణించగా, 4,365 మంది తీవ్ర హృదయ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వారు చెప్పారు. -
స్క్రీన్టైమ్తో నిద్ర ఎందుకు చెడుతుందంటే?
నిద్రకు ఉపక్రమించేంత వరకూ స్మార్ట్ఫోన్, టీవీ, ల్యాప్టాప్లతో కుస్తీపడుతున్నారా? అయితే మీకు జాగరణ తప్పదు. ఈ విషయం తెలియనిది ఎవరికి అంటున్నారా? నిజమేగానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం స్క్రీన్ ముందు ఉన్నప్పుడు మన కళ్లల్లోని కొన్ని కణాలు ఈ కాంతికి స్పందించి మన జీవగడియారాన్ని రీసెట్ చేస్తాయి! రాత్రిపూట స్క్రీన్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి మన జీవగడియారాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తుందని ఈ మధ్యలో ఈ ప్రత్యేక కణాలు గడియారాన్ని రీసెట్ చేయడం వల్ల నిద్ర దెబ్బతినడం మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచిన్ పాండా తెలిపారు. కృత్రిమ కాంతి ముందు ఉన్నప్పుడు రెటినా లోపలిభాగాల్లో ఉండే కణాలు మెలనోస్పిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందని.. ఇది కాస్తా మెలకువగా ఉండాలన్న సంకేతాలను మెదడుకు పంపుతాయని పాండా చెప్పారు. పదినిమిషాల కంటే ఎక్కువ సమయం ప్రకాశవంతమైన కాంతిలో ఉన్నప్పుడు మెలనోస్పిన్ విడుదలై నిద్రకు కారణమైన రసాయనం వె -
యూటూ...
కోళ్ళు కూయక ముందే నిద్దర లేచింది రాజమ్మ. లేస్తానే బిందెలు, చేంతాడు తీసుకోని బయల్దేరింది. ఒళ్ళు తెలియకుండా నిద్ర పోతున్న కూతురు సుజాతని తట్టి లేపి ‘అమ్మాయ్, లే, లేచి తలుపు గడేస్కో, నేను బాయికి పోతన్నా’ అని చెప్పి బయట పడింది.తిరిగొచ్చే సరికి తెల్లగా తెల్లారిపొయ్యింది. ఎప్పుడూ ఎండాకాల మొచ్చిందంటే ఇదే తంతు.చెర్లో ఉన్న కమ్మోళ్ళ బాయిలో చుక్క నీళ్లు ఉండవు. ఊరు మొత్తానికీ మాలోళ్ళ బాయే గతి. దాంట్లోనైనా ఇబ్బడిముబ్బడిగా ఏవీ నీళ్ళుండవు. కొంచెం కొంచెంగా జల ఊరతా ఉంటది. జనాలు రేత్తిరి తెల్లార్లూ డబ్బాలకు గాలాలేసుకోని వంతులవారీగా చేదుకుంటా ఉంటారు.ఎప్పుడు వంతొచ్చేనో ఏమో అని వరసలో నుంచోని నుంచోని ఇసుగు పుట్టి పక్కకి పొయ్యామా, అప్పుడే వంతొచ్చుద్ది, ఎనకోళ్ళు ముందుకొచ్చేత్తారు, ఇంక చివర్నే మళ్ళీ వంతొచ్చేది. ఎందుకొచ్చిన గోలనుకోని కొంతమందిఅక్కడే ఆ చెరువు కట్ట మీదే ఒక నిద్ర బోతారు తమ వంతొచ్చేదాకా. ఈ బాధలన్నీ పడలేక కొంతమంది ఆసాములు సైకిళ్ళున్నోళ్ళు పొలం బాయికో, పక్కూరి బాయికో పోయి నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా వీలు కానోళ్ళు రాజమ్మలాగే తంటాలు పడతారు. అయితే ఊళ్లోని ముసలీ ముతకా బాయికాడకొస్తే కాపోళ్ళు గదా అని పల్లె జనాలు కాస్త బరవాసాగానే పోతారు. వంతుల్తో పని లేకుండా ‘‘వరసలో రాండమ్మో’’ అనకుండా నీళ్ళు చేదిపోస్తారు. కానీ రోజు అట్టా కుదరొద్దూ?ఎవురికోళ్ళకే తొందర పనులాయె! వస్తా వస్తానే కూతుర్ని కేకలు పెట్టి పక్కలు తియ్యమని చెప్పి చీపురుతో గబగబా చిమ్మి కల్లాపు చల్తుంది రాజమ్మ. అందరికంటే ముందు పాచికసువు తీయలేకపొయ్యాననే ఇసురులో ఉంది. ‘ఇయ్యాలేందొదినా పొద్దెక్కిందాకా ఉన్నావు. మెలుకువ రాలేదా ఏంది ?’ అప్పటికే ఇంటిముంగల ముగ్గెయ్యడం పూర్తిచేస్తున్న పొరుగామె ఆరా తీసింది. ‘ఆ... ఎంత ముందు లేచినా నీళ్ళ బాయి దగ్గరే పున్నెకాలం పూర్తవుతుంది. ఒకరోజు అయితే బతిమాలీ బామాలీ వరసతో పన్లేకండా దోర్చుకుంటాం. రోజూ అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? మాకు పనులు లేవా అని ఎదురు అడుగుతున్నారు.’‘అవునొదినా. మరీ పెద్దంతరం చిన్నంతరం లేకండా పోతంది. నిన్న మాయిటేల నీళ్ళ బాయి దగ్గర నడిం బజారోల్ల మీద అడ్డం దిరిగారు పల్లెలో కుర్రాళ్ళు. ఆ గంగి కొడుకు ఏసోబు గాడయితే మరీ పెచ్చుమీరి పోతన్నాడు. వాళ్ళనట్టా అలవాటు కానిస్తే ఎట్టా?అందుకే మీ బావకొడుకు శీనూ ఇంకా నలుగురయిదుగురొచ్చి బాయి దగ్గర దుమ్ముదులపబోయారు. పిల్లల్ని వదిలితే గోల పెద్దదయిద్దనీ ఎసోబుగాడ్ని పంచాయితీకి పిలిపిచ్చి మాట్టాడారు పేద్దోళ్ళు. వాడు పొగురుగా మాట్లాడతా మిర్రిమిర్రి చూస్తా శీనయ్య మీద కొచ్చ్సాడు. వాళ్లమ్మొచ్చి కొడుక్కి నాలుగుబెట్టి లాక్కెళ్ళింది సర్దుకు పోవాలగానీ ఏందీ తగాదాలంటా’. ‘ఏమోలే వదినా. నాల్రోజులు తాలితే అదే చల్లబడుద్దిలే. ఇయ్యాల సత్తాయి చేలో నయ్యెరువు జల్లాల. అందరూ పనులు మొదలు పెడితే పల్లెలో మంగి ముఠా కట్టిద్ది. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. మనుషుల్ని పిల్చకరమ్మని పొద్దుననంగా పంపా పల్లె మీదికి. వొచ్చాడేమో చూడు మీ అన్న!’’ అంటా రాజమ్మ లోపలికొచ్చింది. సుజాతకి జడలేస్తా వాళ్ళ నాన్నింకా బజారునుండి పెత్తనాలోదిలి రాలేదని సాగాదీస్తుండగానే తాగే బీడీని బైట గోడమీద బెట్టి లోపలికొచ్చాడాయన.‘మిడిమేలపు చావొచ్చిందాకా ఇట్టానే తాగు. రోగమొస్తే రోప్పోస్తే ఎట్టనా అనేదే లేదు. అవతల మీ అన్న కాడెద్దుల ఎగసాయం జేస్తా, ఎకరాలు సంపాయిస్తా ఉంటే నువ్వు మాత్రం మీ అయ్యిచ్చిన ఆ ఎకరం ముక్కలోనే పొర్లాడతా ఉండు..సిగ్గన్నా పెట్టలా మడిసి జన్మకి ..ఇంతకీ మణుసుల్ని పిల్చావా లేదా?’ఈ గొంతుకి అలవాటైపోయిన ఆయన తాపీగా చెప్పాడు.‘ఇయ్యాలెవరూ పన్లోకి రారు. మంగి కూతురు కుమారుళ్ళా.. దాని మొగుడు ఐదరాబాద్లో యాక్సిడెంటయి చచ్చిపోయాడంట. రాత్రి మేదరమెట్ట ఫోనోచ్చిందంట. శవాన్నిక్కడికి తెచ్చేసరికి రేపటేలయ్యిద్దంట..‘ ‘ఎట్టా జరిగిందంటా?’ అడిగింది రాజమ్మ‘ఏమోనే. వస్తేగానీ తెలీదు. పాపం ఊరొదిలి ఎల్లడం వాడికి బాదగా ఉన్నా, ఇద్దరాడపిల్లల్నీ బాగా చదివిచ్చుకోవాలనీ, ఈడుంటే మంగి కుమార్ని చేనూ చేనూ తిప్పిద్దనీ, ఐదారాబాద్లో వాళ్ళ బావ ఇళ్ళకిరంగులేసే పని జేస్తంటే ఆడనే ఎదో ఒక పని చూసుకుంటానని ఎల్లాడు. ఇప్పూడిట్టా జరిగా. ఇద్దరూ ఎంతఒద్దిగ్గా ఉంటారు పాపం’ అన్నాడు రామయ్య.పదింటికి వచ్చిన శవాన్ని చూసినోళ్ళందర్రూ ఇళ్ళకు సాంతం వెళ్ళకుండానే– ‘చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆ పిల్లల్నేట్టా నెట్టాల కుమారి. యాక్సిడెంట్ డబ్బులొస్తే పెళ్ళిజేసి అది కూలో నాలో జేసుకు బతకడమే’నని తేల్చారు. రాజమ్మమాత్రం మొగుడులేనిల్లు ఊరందరికీ అలుసైద్దనీ కాయలున్న చెట్టుకే రాళ్ళదెబ్బలనీ అంది. కొన్నాళ్ళు పిల్లలిద్దర్నీ బడికి పంపింది కుమారి. పెద్దదయిందగ్గర నుండి బరువు పెరిగిద్దనీ పెళ్ళి జేయ్యమని అందరూ తొందర పెట్టడంతో సుజాతోళ్ళ పెద్దయ్య దగ్గర డబ్బు తెచ్చి పెద్దకూతురి పెళ్లి చేసింది.చిన్న కూతురు దేవిని సుజాతతో పాటు హైస్కూల్కి పంపింది. దేవి ఎనిమిదో తరగతి సుజాత పది. మనిషి నలుపైనా దేవి ఎంత అందంగా ఉండేదో.నవ్వే కళ్ళతో మెరిసిపోతా ఉండేది. గలగలా మాట్లాడ్డం మొదలు పెట్టిందంటే చుట్టూ ఉన్నోళ్ళు అట్టా నోర్లు తెరుచుకోని ఇంటానే ఉండేవాళ్ళు. అంత అయిస్కాంతం ఆ పిల్ల. తొమ్మిది అయిపోగానే పెద్ద పిల్ల పురుళ్లనీ, అయ్యనీ, ఇయ్యనీ డబ్బుల్లేక దేవిని చదువు మాన్పించేసింది కుమారి. పొలంపనులకి తీస్కెళ్ళడం మొదలుపెట్టింది.పత్తి చేలల్లోఊళ్ళో వాళ్ళందరూ ఒక వరసగా, తరువాత పల్లెలో వాళ్ళందరూ ఒక వరుసగా సాళ్ళు పట్టుకుని పనిజేసేవాళ్ళు. సాళ్ల మధ్యలో ఎవరికిష్టమైన యవ్వారాలు వాళ్ళు పెట్టుకునే వారు. కుమారి సాల్లో ఉండి పనిజేస్తే, దేవి మనిషెత్తు సాళ్ళు దాటి అందరి ఒళ్ళల్లో పత్తి తీసుకుని గోతాలకేసుకుని, గట్టు మీదున్న శీనయ్యకి అందిచ్చేది. ఎప్పుడూ గలగలా మాట్లాడతానే ఉండే పిల్లకి పాపం నోరు తెరిచే తీరికుండేది గాదు. బడి మానేసినాక ఈ రెండేళ్ళలో దేవి యవ్వనోత్సాహంతో మరింత అందంగా తయారయింది. పొలంలో దిగిం దగ్గర్నించీ ఆ పిల్లని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. వొడినిండిందనో, మంచి నీళ్ళనో పిలుస్తానే ఉండేవాళ్ళు. వీటికి తోడు గట్టు మీదనుంచి శీనయ్య గోతాలెత్తాలనో, కుట్టాలనో చీటికి మాటికి పిలుస్తా ఉండేవాడు. ఒకరోజు శీనన్న అట్ట పిలిచినప్పుడు దేవి సుజాతని తోడు రమ్మంది. ఇది గమనించిన శీను ‘‘సుజాత వల్ల కాదులే, నువు రా’’ అని గట్టిగా పిలిచాడు. దేవి అయిష్టంగా కదిలి వెళ్ళింది.ఏదో తేడాగా అనిపించింది సుజాతకి. ఆ మాటే అంది వాళ్ళమ్మతో సాయంత్రం. ‘అసలా గోతాలు వాడేత్తుకోలేకనా. ఆ సోంబేరోడు దేనికీ కాకుండా పోతున్నాడు.గాలెవ్వారాలెక్కువౌతున్నాయి. ఈడు మొగపిల్లోడనీ, వంశాన్ని నిలబెడతాడనీ ఉన్న పొలమంతా మీ తాత పెదయ్యకి బెట్టె. మీ అయ్యకేమో గొర్రెలూ బర్రెలూ ఇచ్చి బయటకి పంపే. నోరున్నోడి మాటే చెల్లిద్ది. ఈడెమో సదువూ సంధ్య లేకుండా ఊరు మీద దిరుగుతున్నాడు. ఈడికి కాదుగానీ దానికి జెబుతాలే’ అంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మాటతో సుజాతకి ఊరట కలిగింది. అమ్మ ఎప్పుడూ అంటుంది. మగపిల్లల జోలికి వెళ్ళకూడదు. వాళ్లోస్తే ఊరుకోకూడదు. గట్టిగా బుద్ది జెప్పాలనేది.ఒకరోజు పొద్దున్న ‘అమ్మాయి సుజాతా ... నాకు చేలో ఉమ్మరంగా పనుంది గానీ, తొందరగా పన్జేసుకొని కొట్టం కాడికెళ్ళమ్మా బర్రీనేటట్టుంది’ అని చెప్పి రాజమ్మ బయటికెళ్ళింది. అమ్మ వెళ్ళిం తర్వాత మిగిలిపోయిన పనులు చేయటానికి సిద్దం అయింది సుజాత. ఇంతలో గోడవతలనుండి శీనన్న పిలవడంతో బయటకొచ్చింది. ఎందన్నాయ్ ‘ అంటా దగ్గరకెళ్ళింది. ‘అమ్మోల్లు పొలం ఎల్లారా? ...నువ్వు కొట్టం దగ్గరకి వెళ్లొద్దులే. బర్రె పని నేను జూస్తాలే’ అన్నాడు. ఎప్పుడూ పనందుకొని శీనన్న ఇలా అనటంతో సుజాతకి ఆశ్చర్యం వేసింది. వద్దులే అందామనుకొని ఏదో విషయం ఉందని అర్ధమయ్యి ‘ఎందుకన్నాయి?’ అంది.‘ఏం లేదులే ...మొన్న నేను దేవితో ఉన్నప్పుడు వాళ్ళ మామ ఏసోబు గాడు చూశాడు’ అన్నాడు నంగినంగిగా. ‘వాడు దాన్ని కొట్టాడు. అది నామీద చెప్పింది వాడికి. వాడు నామీద కోపంగా ఉన్నాడు. నన్నేమనలేక నిన్నేమన్న అంటాడేమోనన్లే ...జాగర్తగా ఉండు.’ అనెళ్ళాడు. అన్నమాటలకి సుజాత బిత్తరకపోయింది. ఎంత తేలిగ్గా చెప్పెల్తన్నాడు!. ఏసోబు, వాళ్ళమ్మ దేవినేమన్నారో. ఆ పిల్ల ఎంతేడుస్తుందో. ఏసోబుకి నిజంగానే కోపం వచ్చుంటుంది. మొన్న అంజమ్మత్త చెప్పిన బాయికాడ సంగతి గుర్తొస్తే భయమేసింది. వీడు జేసిన పనికి నిజంగా నన్నేమన్నా అంటాడేమో. ఇంట్లో ఉన్నా భయం పుట్టేట్టు జేశాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు జాగ్రత్త చెబుతున్నాడు. మా పెద్దయ్యోల్లకు తెల్సో లేదో. ఎవరికన్నా జెప్తే శీనన్నాయ్ ఏమంటాడో ...శీనన్న బర్రెదగ్గరకి వెళ్ళాడో లేదో. చెప్పింది చేస్తాడని లేదుబర్రీనుంటే? ఏంకాదులె అనుకోని కొట్టంకాడికి బయల్దేరింది. ఇల్లు మూలదాటి గొందిలోకి ఎళ్ళగానే హటాత్తుగా ఎదురయ్యాడు ఏసోబు. వేగంగా అడుగులేస్కుంటా వస్తున్నాడు.. తనకోసమే వస్తున్నాడా? భయమేసింది. గబుక్కున వెనక్కు తిరిగింది. ఏసోబు పిలుస్తున్నా వెనక్కి తిరగలేదు. పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చిపడింది.అమ్మకోసం ఎదురు చూస్తా కూర్చుంది సుజాత. తప్పుజేస్తే అమ్మ ఎవర్నైనా ఊరుకోదు. ఇవ్వాళ శీనన్నకి బాగా గడ్డిబెట్టిద్ది. పెద్దయ్యోళ్లతో తగాదయినా సరే. ‘ఏందే బర్రె దగ్గరకెళ్ళ లేదు? బర్రీనిందని ఏసోబు చెబుతున్నా వినిపించోకుండా వచ్చావంట.’ అంది రాజమ్మ లోపలికొస్తానే. జరిగిందంతా చెప్పింది సుజాత. ‘ఆ సన్నాసోడికేం పొయ్యేకాలమొచ్చింది. దాన్నలరిపాలు చెయ్యడానికి. ఈడిలాగే అందరూ ఎదవ పనులు జేస్తారంటనా. వాళ్లట్టాటోళ్ళుకాదు. ఏసోబు మాట కటువైనా మనిషి మంచోడు. అయినా ఊళ్ళో వాళ్ళ జోలికి రావడం అంత తేలికా’ అంది రాజమ్మ.ఆ రాత్రి కుమారి రాజమ్మ దగ్గరకొచ్చింది. ‘అక్కాయ్ గ్రేడు పనులు మొదలు పెడితే చెప్పు మేం కూడా వస్తాం.’ దిగులు గొంతుతో అంది కుమారి. సరేలే కుమారీ అట్టనే వద్దువు... విషయం తెలిసిందిలే. అయినా దానికైనా జాగర్త ఉండొద్దా. ఎవురేందో తెలియోద్దా.. నువ్వయినా చేప్పొద్దా.’ అంది.అమ్మ మాటలో, గొంతులో ఏదో తేడా అనిపించింది సుజాతకి. ‘నాకేం తెలుసక్కాయి ఇట్ట జేస్తాడనీ.... ఈడ పెరిగిన పిల్ల కాదాయె. దానికేందెలుసు..... అయినా ఆ మనిషే ఉంటే.... ఎన్ని అనుకున్నాడు..’ దుఃఖంతో కుమారి గొంతు పూడుకుపోయింది.‘ఇప్పుడు ఏడిచి ఏం లాభం కుమారీ... ముం దుండాలి. ‘అంది రాజమ్మ.కాసేపు మాట్లాడి కుమారి వెళ్ళిపోయింది.అమ్మ మాట్లాడాల్సినవేవో మాట్లాడలేదనిపించింది సుజాతకి ‘‘పాపం దేవిమా ...’ అంది సుజాత వాళ్ళమ్మ మొహంలోకి చూస్తూ.‘ఏమయ్యిద్ది .. దానికి తెలియోద్దంటే జాగర్త? ఎదురెళ్ళి తెచ్చుకుంటారనుకుందా? ఆ ఏసోబు గాడికిచ్చి ముడి పెట్టేస్తార్లే ’’ అంది తేలిగ్గా .సుజాతకు అమ్మ కొత్తగా కనిపించింది. అమ్మ ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతుంది. శీనన్న మీద అమ్మకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. చిన్న విషయాల దగ్గర కూడా తిడుతుంది. కానీ ఇప్పుడు శీనన్న మీద రావల్సినంత కోపం రాలేదెందుకనీ. పైగా దేవినే తప్పుబడుతూ మాట్లాడింది. పొలంలో దేవి గురించి అమ్మ జాగ్రత్త దేవి గురించేనా?అమ్మ గురించి చెడ్డగా అనుకోలేకపోయింది.ఏసోబు మంచితనం మీద అమ్మ నమ్మకానికి, మనజోలికి రాలేడనే ధీమాకి మధ్య ఎదో సంబంధం ఉన్నట్లనిపించింది సుజాతకి .కానీ అదేమిటో తెలీలేదు.ఆ రాత్రి నిద్ర పోలేదు సుజాత. -ఝాన్సీరాణి -
పాప ఎక్కువగా నిద్ర పోతోంది?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. ఉజ్వల, కొత్తగూడెం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. బాబుకు ఉన్న కళ్ల సమస్య ఏమిటి? మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – డి. సూర్యారావు, టెక్కలి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ విషయానికి వస్తే... కళ్లు నాన్ రిథమిక్గా, అనేక డైరెక్షన్స్లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు మాటిమాటికీ జ్వరం... ఎందుకిలా? మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – వి. రంగారావు, ఒంగోలు పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
స్లీప్టెస్ట్తో నా సమస్య తెలుస్తుందా?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాను. గత ఆర్నెల్లుగా నాకు సరిగా నిద్రపట్టడం లేదు. నిద్రలో ఉన్నప్పుడు తరచూ లేచికూర్చుంటున్నాను. అయితే నాకు ఆ విషయం తెలియడం లేదు. నా రూమ్మేట్స్ చెబుతున్నారు. పగటివేళ మగతగా ఉంటోంది. ఒక్కోసారి క్లాసులో పాఠం వింటూ నిద్రపోతున్నాను. వారం కిందట డాక్టర్కు చూపించుకుంటే స్లీప్ టెస్ట్ చేయించుకొమ్మన్నారు. ఆ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది? – ఎన్ వైష్ణవి, వైజాగ్ స్లీప్ టెస్ట్ను వైద్యపరిభాషలో పాలీసోమ్నోగ్రఫీ అంటారు. ఇది ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత సమస్యలను) గుర్తించి, నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అతడి బ్రెయిన్వేవ్స్, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు, గుండె స్పందనల రేటు, శ్వాస స్థాయి, కనుగుడ్లు – కాళ్ల కదలికలను రికార్డు చేస్తారు. ఆసుపత్రి లేదా స్లీప్ సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సాయంత్రం పొద్దుపోయాక రావాల్సిందిగా పేషెంట్కు సూచిస్తారు. రాత్రి ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు స్లీప్ పాటర్న్ లను నమోదు చేయడానికి వీలుకలుగుతుంది. ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్ను గుర్తించడమే కాకుండా ఇప్పటికే నిద్రసంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. సాధారణంగా వయోజనులకు 7 – 8 గంటల నిద్ర అవసరం. అయితే ఈ నిద్రసమయంలో అందరిలోనూ ఒకేలా ఉండదు. ఇందులోనూ ఎన్నో దశలు ఉంటాయి. ఉదాహరణకు నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్) దశ ప్రారంభమైన తర్వాత ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే దశకు మారుతుంది. నిద్రపోతున్న సమయంలో ఈ రెండు దశలు ఒక క్రమబద్ధమైన రీతిలో కొనసాగుతుండటం కనిపిస్తుంటుంది. ఎన్ఆర్ఈఎమ్ దశలో నిద్రలో ఉన్న వ్యక్తి కనుపాపల్లో కదలికలు ఉండవు. కానీ గంట తర్వాత ఆర్ఈఎమ్ దశలోకి ప్రవేశించగానే కనుపాపలు వేగంగా కదులుతాయి. వ్యక్తిలో కలలు వచ్చేది ఈ ఆర్ఈఎమ్ సమయంలోనే. ఎన్ఆర్ఈఎమ్ దశ, ఆర్ఈఎమ్ దశల మధ్య 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోయే సమయంలో ఆరుసార్లు ఈ ఎన్ఆర్ఈఎమ్, ఆర్ఈఎమ్ల సైకిల్స్ (చక్రభ్రమణాలు) సాగుతాయి. నిద్ర సమయం గడుస్తున్న కొద్దీ ఆర్ఈఎమ్ వ్యవధి పెరుగుతుంది. స్లీప్ డిజార్డర్స్ ఈ సైకిల్స్ను దెబ్బతీస్తాయి. పాలీసోమ్నోగ్రఫీ పరీక్షలో వ్యక్తి తాలూకు నిద్రలోని దశలను గమనించి, ఏ స్లీప్ పాటర్న్ దెబ్బతింటున్నది అన్న అంశాన్ని నిపుణులు గుర్తిస్తారు. పేషెంట్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించినప్పుడు ఈ స్లీప్టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. స్లీప్ ఆప్నియా కారణంగానో లేదా మరో ఇతర సమస్య వల్లనో వ్యక్తి తాలూకు శ్వాస తరచూ నిలిచిపోవడం; వ్యక్తి తన ప్రమేయం లేకుండా నిద్రలో తరచూ కాళ్లు కదుపుతుండటం, రోజంతా మగతగా ఉంటూ హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఉండే నార్కోలెప్సీ వంటి పరిస్థితులు; నిద్రలో ఉండగా నడవడం లేదా లేచి తిరగడం వంటి అసాధారణ ప్రవర్తనలు; అకారణంగా కొనసాగుతున్న తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ స్లీప్ టెస్ట్ను చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఈ పరీక్షతో సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేసి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుకలుగుతుంది. రాత్రంతా నిద్రపట్టడంలేదు... ఎందుకిలా? నా వయసు 47 ఏళ్లు. ఒక చిట్ఫండ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ఏడాదికాలంగా నాకు రాత్రిళ్లు నిద్రపట్టడం చాలా కష్టమవుతోంది. ఒకరోజు తెలతెలవారేదాకా నిద్రపట్టక, పొద్దున్నే కాసేపు మాత్రం పడుకోగలుగుతున్నాను. రోజంతా నిస్సత్తువ, చికాకుగా ఉంటోంది. పనిమీద ఏకాగ్రత కుదరడం లేదు. మధ్యాహ్నం నిద్ర ముంచుకువస్తోంది. దాంతో ఈమధ్య రాత్రిళ్లు నిద్రమాత్రలు వేసుకోవడం మొదలుపెట్టాను. అయితే మా ఖాతాదారుగా ఉన్న ఓ వైద్యుడితో ఈ సమస్యను ప్రస్తావిస్తే వెంటనే నిద్రమాత్రలు మానేయమని అన్నారు. ఇది స్లీప్ డిజార్డర్లా అనిపిస్తోంది. హైదరాబాద్కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించుకొమ్మని సలహా ఇచ్చారు. నా సమస్య ఏమిటి, ఎందువల్ల వస్తుంది. దయచేసి తెలియజేయండి. – సీహెచ్ మృత్యుంజయం, సిద్ధిపేట క్రమం తప్పకుండా తగినంత నిద్రపోలేకపోవటానికి సంబంధించిన చాలా లక్షణాలను కలుపుకొని స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు)గా చెబుతుంటారు. ఈ సమస్యలకు ఏ అనారోగ్యమైనా కారణం కావచ్చు. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీరికలేని పనుల ఒత్తిడి, మరికొన్ని ఇతర కారణాలూ కావచ్చు. మొత్తం మీద ప్రతివ్యక్తీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఇది నెలల తరబడి కొనసాగుతున్నట్లయితే దాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్లీప్ డిజార్డర్స్ వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో పట్టణప్రాంతాల్లో వయోజనులు, ప్రత్యేకించి నలభౖయెదేళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది నిద్రలేమి, నిద్రసంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా. ఇది వ్యక్తుల సాధారణ జీవితానికి ఆటంకం అవుతుంది. మీరు చెప్పిన లక్షణాలైన నిస్సత్తువ మాత్రమే గాక మానసికంగా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. దేనిపైనా ఏకాగ్రత కుదరదు. ఊరికే చికాకు పడుతుంటారు. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొంతమందిలో శారీరక, మానసిక రుగ్మతల కారణంగా స్లీప్ డిజార్డర్స్ ఏర్పడతాయి. ఒకసారి ఆ రుగ్మతలకు చికిత్స చేయడం వల్ల వాటితోపాటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందు వల్ల ముందుగా మీరు మొదట ఫిజీషియన్ను కలిసి, ఆయన సూచించిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారణ అయితే మీది స్లీప్ డిజార్డర్గా భావించవచ్చు. ఇలా ఆరోగ్యకారణాలు ఏవీ లేకుండా స్లీప్ డిజార్డర్స్ కనిపించినప్పుడు దానికి వైద్యపరమైన చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా అవసరం. ఇతరత్రా ఎలాంటి అనారో గ్యాలు లేకుండా నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు స్లీప్స్పెషలిస్ట్ను సంప్రదించండి. డాక్టర్ వై. గోపీకృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పడగ్గదిలో ‘సోషల్’ ట్రెండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండే పడక గదులను సైతం సైబర్ ‘చాట్ రూం’లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్టాప్.. ట్యాబ్.. స్మార్ట్ఫోన్.. ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు పడక సమయంలోనూ బెడ్మీదకు చేరుతున్నాయి. దీంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ‘సెంచురీ మాట్రిసెస్’ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల ‘స్లీపింగ్ ట్రెండ్స్’(నిద్ర అలవాట్లు)పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో అగ్రభాగాన నిలవడం గమనార్హం. ఈ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలడం గమనార్హం. పలు నగరాల్లో నిద్ర అలవాట్లు ఇలా.. సెంచురీ మాట్రిసెస్ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్లైన్’లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11–12 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5–6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది. అధికంగా వీక్షిస్తే ప్రమాదమే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీంతో మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంటే మేలు. – డాక్టర్ రవీంద్రగౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
కేన్సర్ కణాలను నిద్రపుచ్చారు!
కేన్సర్పై పోరులో మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేన్సర్ కణాలను శాశ్వత నిద్రలోకి పంపే ఓ మందును సిద్ధం చేశారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందు... కణితి పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా సాధారణ కణాల డీఎన్ఏను ఏ మాత్రం మార్పు చేయకుండా పని చేస్తుంది. రక్త, కాలేయ కేన్సర్ల విషయంలో తాము ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు పొందామని, ఈ మందుతో కేన్సర్ మళ్లీ తిరగబెట్టడమన్నది కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని టిమ్ థామస్ అనే శాస్త్రవేత్త తన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. కేఈటీ 6ఏ, కేఏటీ 6బీ అనే రెండు ప్రొటీన్ల ఉత్పత్తిని నిలిపివేస్తే కేన్సర్కు సమర్థమైన చికిత్స కల్పించవచ్చా? అన్న ప్రశ్న ఆధారంగా తాము పరిశోధనలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ప్రత్యేకమైన మందు సాయంతో కేఏటీ 6ఏ ఉత్పత్తిని నిలిపివేయగానే రక్తపు కేన్సర్లు ఉన్న ఎలుకల ఆయుష్షు నాలుగింతలైందని చెప్పారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు వాడే కీమోథెరపీ, రేడియేషన్ల వల్ల సాధారణ కణాల డీఎన్ఏ లో సరిచేయలేని మార్పులు చోటు చేసుకుంటాయని, దీని ఫలితంగా అనేక సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయని మనకు తెలుసు. తాము సిద్ధం చేసిన మందు మాత్రం కేన్సర్ కణాలు విభజితం కాకుండా అడ్డుకుంటాయని.. ఇంకోలా చెప్పాలంటే కణాలు మరణించవుగానీ.. పునరుత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయని వివరించారు. -
మూడో నిపుణుడు
రాజుగారు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. లేవగానే తన నోట్లో దంతాలున్నాయో లేవోనని చూసుకోసాగారు. అంతా సరిగానే ఉందని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి రాజదర్బారు కొలువయ్యాక తన మంత్రి వర్గంతో ‘‘రాత్రి కలలో నా దంతాలన్నీ విరిగిపోయాయనే కల వచ్చింది. దీని నిగూడార్థం చెప్పే నిపుణుడిని హాజరుపరచండి’’ అని హుకుం జారీ చేశారు. రాజుగారు చెప్పినట్లుగానే హుటాహుటిన స్వప్న ఫలితాలను వివరించే ఒక నిపుణుడిని హాజరుపర్చారు. ‘నా పళ్లన్నీ ఊడిపోయినట్లుగా నేను కలగన్నాను’ అని చెప్పి కలను వివరించారు. రాజుగారు. దానికి ఆ నిపుణుడు ‘‘అపచారం అపచారం.. రాజుగారూ మీకు వచ్చిన కల ఏమి చెబుతోందంటే... మీ కళ్లముందే మీ ఇంటిలోని వారంతా చనిపోతారు’’ అని అర్థం చెప్పాడు. రాజుగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే అతన్ని కారాగారంలో వేసి నిర్బంధించవలసిందిగా భటులను ఆదేశించి, మరో నిపుణుడిని పిలవాలని ఆజ్ఞాపించారు. మరో నిపుణుడు వచ్చాడు. రాజుగారు చెప్పిన కలను విన్న అతనూ మొదటి నిపుణుడు చెప్పినట్లుగానే చెప్పడంతో అతన్నీ చెరసాలలో వేసి, మూడో నిపుణుడిని పిలవాలని మళ్లీ రాజుగారు హుకుం జారీచేశారు. మూడో నిపుణుడు హాజరయ్యాడు. రాజుగారు తనకొచ్చిన కలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇది విన్న ఆ నిపుణుడు రాజుగారూ ‘మీకు నిజంగానే ఈ కల వచ్చిందా?’ అని మళ్లీ రెట్టించాడు. రాజుగారు ఎంతో ఆతృతతో అవునని తలూపారు. దానికా నిపుణుడు ‘‘రాజుగారూ మీకు శుభాకాంక్షలు’’ చెప్పగానే.. రాజుగారు ‘‘దేనికి శుభాకాంక్షలు:’’ అని ఎంతో ఆతృతతో అడిగారు. దానికా నిపుణుడు ‘‘మీ ఆయుష్షు సుదీర్ఘమైనది. మీ కుటుంబంలో అందరికంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు’’ అని కల అర్థాన్ని వివరించాడు. రాజుగారు అతను చెప్పిన జోస్యానికి ఎంతో మెచ్చుకున్నారు. ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. నిజానికి మిగతా ఇద్దరు జ్యోతిష్యులు చెప్పింది కూడా ఇదే అయినప్పటికీ చెప్పే తీరులో వ్యత్యాసముంది. కొందరి మాటలతో మనస్సుకు గాయాలవుతాయి. మరికొందరి మాటలు ప్రేమను పంచి హృదయాలను గెలుచుకుంటాయి. – ముజాహిద్ -
నిద్ర ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడమా?
కంటి నిండా నిద్ర పట్టకపోతే.. ఎంత చికాకో మనకు తెలియంది కాదు. పైగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి హేతువు అవుతుంది. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈగలపై జరిగిన ఈ ప్రయోగం ద్వారా నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం కావచ్చునని స్పష్టం చేసింది. తినే ఆహారం, పీల్చేగాలి... పరిసరాల్లోని వాతావరణం వంటి అనేక కారణాల వ్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువవుతాయని.. ఇవి కాస్తా వాపు/మంటకు దారితీసి చివరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ సమయం మాత్రమే నిద్రపోయే ఈగలను ఎన్నుకున్నారు. వీటన్నింటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వీరు.. మిగిలిన వాటితో పోల్చి చూడటం ద్వారా నిద్ర ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుందన్న అంచనాకు వచ్చారు. నిద్రలేమి కారణంగా అల్జైమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్స్ వంటి వ్యాధులు వస్తాయని, నిద్రతక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుందని తమ అధ్యయనం స్పష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఎల్జీ ఆఫీసులో కేజ్రీవాల్ నిద్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వినూత్న రీతిలో ఆందోళనకు దిగి సంచలనం సృష్టించారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కార్యాలయం వద్ద మంత్రివర్గ సహచరులతో కలసి రాత్రి నిద్ర చేశారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విరమణ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రులు గోపాల్ రాయ్, జైన్.. ఎల్జీ అనిల్ బైజాల్ను కలిశారు. ఆయన వారి డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి ఎల్జీ కార్యాలయంలోనే నిద్రించి నిరసన తెలిపిన కేజ్రీవాల్.. వాటికి ఆమోదం తెలిపేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఇదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీ ప్రజల కోసమే ఆందోళన: కేజ్రీవాల్ ఈ సందర్భంగా కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ’నా కోసం ఆందోళన చేయడం లేదు, ఢిల్లీ ప్రజల కోసమే చేస్తున్నా’ అని అన్నారు. ఎల్జీ ఆదేశాల మేరకే అధికారులు పనిచేయడం మానుకున్నారని, దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యంగా రేషన్, గుడిసెవాసులకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజోపయోగ పనులు నిలిచిపోయాయని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము సమ్మె చేయడం లేదని, రోజువారీ పనులు చేస్తూనే ఉన్నామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కారణం లేకుండానే చేస్తున్న ఆందోళన ఇదని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కేజ్రీవాల్ అకారణంగా ఆందోళన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు. మరోవైపు, కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరుల అనూహ్య ధర్నతో ఎల్జీ ఆఫీసు వెలుపల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ నివాస్కు చేరుకునే రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐఏఎస్ల వివాదమిదీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం కేజ్రీవాల్ సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఐఏఎస్లు నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఇదే సమయంలో వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా ఆందోళన బాట మాత్రం వీడలేదు. గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేసిన కేజ్రీవాల్.. పెరుగుతున్న విద్యుత్ బిల్లులపై షీలాదీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలియజేశారు. -
నిద్ర కరవైతే కోట్లు ఖర్చవుతాయి..
జనాలు సరిగ్గా నిద్ర పోకపోతే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది! ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి అనే సమస్య ఎక్కువవుతోందని.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందికి తగినంత నిద్ర లభించకపోగా.. మిగిలిన వారు వృత్తిపరమైన ఒత్తిడితో, సామాజిక, కుటుంబ కార్యకలాపాల కోసం నష్టపోతున్నారని.. ఇంకొందరు తెలిసో తెలియకో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు దాని ప్రభావం ఉత్పాదకతపై పడటంతోపాటు ఆరోగ్యసమస్యలకూ కారణమవుతోందని వీరు అంటున్నారు. తగినంత నిద్ర లేకపోతే త్వరగా కోపం రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ప్రతిస్పందించే సమయం తగ్గిపోవడం, సానుభూతి కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ రకమైన సమస్యలన్నింటి పర్యవసానాలు ఆర్థికంగా ఎలా ఉంటాయని ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్లు లెక్కకట్టారు. ఆరోగ్య ఖర్చులు, ప్రమాదాల వంటి వాటి వల్ల వచ్చే ఖర్చులు వంటివన్నీ లెక్కకడితే ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 1788 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు వీరు తేల్చారు. ఈ నష్టం ఒక్క ఆస్ట్రేలియాలోనే దేశ జీడీపీలో 1.55 శాతం వరకు ఉందని అంచనా. -
నానో రోబోలతో రక్తశుద్ది...
నానో స్థాయి రోబోలతో రక్తంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో) శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అల్ట్రాసౌండ్ ధ్వనులతో నియంత్రించగల ఈ నానోరోబోలు అతిసూక్ష్మమైన బంగారు తీగలతో చేస్తారు. రక్తంలోని ప్లేట్లెట్లు, రక్తకణాల త్వచాలకు వీటిని జోడించినప్పుడు అవి విషపదార్థాలను నిర్వీర్యం చేసేస్తాయి. అంతేకాకుండా ఈ నానోరోబోలతో ఎంఆర్ఎస్ఏ వంటి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేయవచ్చునని.. కేవలం అల్ట్రాసౌండ్స్తో నియంత్రించే అవకాశం ఉండటం అదనపు ప్రయోజనమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు జోసెఫ్ వాంగ్, లియాంగ్ఫాంగ్ ఝాంగ్లు తెలిపారు. ఒకే రకమైన నానోబోట్లతో రకరకాల పనులు చేయించే లక్ష్యంతో తాము ఈ ప్రాజెక్టు చేపట్టామని, ప్లేట్లెట్లు బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుంటే.. ఎర్ర రక్త కణాలు విషపదార్థాలను నాశనం చేస్తాయని వారు వివరించారు. మనిషి వెంట్రుక కంటే దాదాపు 25 రెట్లు తక్కువ వెడల్పు ఉండే ఈ నానో రోబోట్లు రక్తంలో సెకనుకు 35 మైక్రో మీటర్ల దూరం ప్రయాణించగలవని, కేవలం అయిదు నిమిషాల్లో రక్త నమూనాల్లోని బ్యాక్టీరియా మూడు రెట్లు తక్కువైనట్లు తాము ప్రయోగాల ద్వారా గుర్తించామని వివరించారు. ప్రస్తుతం తమ ప్రయోగాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని... జంతువుల్లో నేరుగా పరీక్షించిన తరువాత రక్తశుద్ధి కోసం నానోబోట్లను మనుషుల్లోనూ వాడే అవకాశం ఉంటుందని చెప్పారు. నిద్ర తక్కువైతే... తిండి యావ పెరుగుతుంది! ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిళ్లు సకాలంలో నిద్రపోకపోకపోయినా.. సరైన నిద్ర లేకపోయినా అది కాస్తా తిండియావ పెంచేస్తుందని అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రిళ్లు చిరుతిళ్లు, జంక్ ఫుడ్కు అలవాటు పడటం వల్ల కొంత కాలం తరువాత ఊబయకాం, మధుమేహం వంటి వ్యాధులొచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని తాము అధ్యయన పూర్వకంగా తెలసుకున్నట్లు మైకేల్ ఎ.గ్రాండ్నర్ తెలిపారు. అమెరికా మొత్తమ్మీద కొంతమందిని ఎంపిక చేసుకుని తాము ఫోన్ ద్వారా కొన్ని వివరాలు సేకరించామని చెప్పారు. ఎంత కాలం నిద్రపోతున్నారు? సుఖ నిద్ర పడుతోందా? వేళకాని వేళలో ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి తిండి తింటున్నారు? వంటి వివరాలను పరిశీలించినప్పుడు 60 శాతం మంది రాత్రి తిండికి అలవాటు పడ్డామని చెబితే... మూడింట రెండు వంతుల మంది రాత్రిళ్లు సక్రమంగా నిద్ర పట్టడం లేదని చెప్పారని వివరించారు. నిద్ర తక్కువ కావడం జీవక్రియలపై ప్రభావం చూపుతుందని.. ఫలితంగా జంక్ఫుడ్ కావాలన్న కోరిక పెరిగేందుకు అవకాశముందని చెప్పారు. ఆరోగ్యానికి పౌష్టికాహారంతోపాటు సుఖమైన నిద్ర కూడా అవసరమని గుర్తిస్తున్న ఈ తరుణంలో ఈ అధ్యయనం ఎంతైనా అవసరమని.. రాత్రిపూట పనిచేసేవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేందుకూ దోహదపడుతుందని వివరించారు. త్రిఫల చూర్ణంతో ఆయుష్ణు పెరుగుతుందా? ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రముఖ స్థానముంది. జీర్ణసంబంధిత సమస్యలను తీర్చడంతోపాటు శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ఆయుర్వేద మందుకు కొన్ని రకాల బ్యాక్టీరియాను జోడిస్తే ఆయుష్షు కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు మెక్గిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మనిషితో ఎన్నో సారూప్యాలున్న జీవజాతి ఈగలపై తాము ప్రయోగాలు చేశామని, త్రిఫలతోపాటు ల్యాక్టోబాసిల్లస్ ప్లాంటారమ్, లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటమ్, బైఫైడోబ్యాక్టీరియా లాంగమ్ అనే మూడు బ్యాక్టీరియాను చేర్చి ఈగలకు అందించినప్పుడు వాటి జీవితకాలం దాదాపు 60 శాతం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంటున్నారు. ఈగలు సాధారణంగా 40 రోజుల పాటు బతికి ఉంటాయని, బ్యాక్టీరియాతో కూడిన తిఫల ఇచ్చినప్పుడు మాత్రం ఇవి 26 రోజులు ఎక్కువగా జీవించాయని సూసన్ వెస్ట్ఫాల్ అనే శాస్త్రవేత్త వివరించారు. వయసు మళ్లిన మనుషుల పేవుల్లో ఈ మూడు బ్యాక్టీరియా సంతతి తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారని వివరించారు. త్రిఫలతోపాటు పేవుల్లోకి చేరే బ్యాక్టీరియా అక్కడ మనకు మేలు చేసే సూక్ష్మజీవుల సంతతిని పెరిగేందుకు దోహదపడుతూండవచ్చునని వివరించారు. -
ఊబకాయంతో నష్టమా? లాభమా?
బరువు పెరిగినకొద్దీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి చుట్టుముడతాయని తరచూ వింటూ ఉంటాం. అందుకే బరువు తగ్గించుకునేందుకు నానా తంటాలూ పడుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో అవసరం కంటే ఎక్కువ బరువు ఉండటం లాభదాయకమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 15 ఏళ్ల క్రితం కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న వారి వివరాలు సేకరించినప్పుడు విచిత్రమైన అంశం ఒకటి బయటపడింది. ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటే.. ఊబకాయుల్లో అది తక్కువగా ఉంది. ఈ ఊబకాయ వైచిత్రిని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు పదేళ్లకుపైగా సమయం పట్టింది. ఒక్క కిడ్నీ సమస్యలకు మాత్రమే కాకుండా కొన్ని ఇతర వ్యాధుల విషయంలోనూ ఊబకాయం పాజిటివ్ ఫలితాలిస్తున్నట్లు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నెదర్లాండ్స్లో సాధారణ సాంక్రమిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన దాదాపు 18 వేల మందిని పరిశీలించినప్పుడు ఇతరులతో పోలిస్తే ఊబకాయులు ఎక్కువకాలం జీవించినట్లు తెలిసింది. నుమోనియా, సెప్పిస్ వంటి విషయాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వెలువడటం గమనార్హం. వీటన్నింటిని బట్టి శాస్త్రవేత్తలు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. శరీరం తీవ్రంగా వ్యాధిగ్రస్తమైనప్పుడు అది అదనపు ఇంధనం కోసం ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలో తగినంత బరువు మాత్రమే ఉండేవారి కండరాలు బలహీనపడిపోతే.. ఊబకాయుల్లో మాత్రం ఇది చాలా తక్కువగా జరుగుతూంటుందని ఫలితంగా వారు బతికేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడుతూండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫోన్లు, ట్యాబ్లెట్లతో నిద్రకు చేటే... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను పొద్దుపోయేంత వరకూ తెగ వాడేస్తున్నారా? అయితే మీకు నిద్రకు చేటు వచ్చినట్లే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని వినే ఉంటాంగానీ.. తాజాగా హార్వర్డ్లోని బోస్టన్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఇంకో అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. ట్యాబ్లెట్లను ఇష్టమొచ్చినట్లు వాడుకొమ్మని చెప్పి కొంతమంది యువకుల నిద్రతీరును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త అంశాలు తెలిశాయి. ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే శక్తిమంతమైన తెల్లటి వెలుగు మెలటోనిన్ రసాయన ఉత్పత్తిని తగ్గించిందని ఈ అధ్యయనానికి నేతత్వం వహించిన శాస్త్రవేత్త జీనీ డుఫీ తెలిపారు. స్క్రీన్స్ను దగ్గరగా ఉంచుకోవడం వల్ల తెల్లటి వెలుగు మన జీవ గడియారంపై దుష్ప్రభావం చూపుతుందని ఫలితంగా తగినంత నిద్ర పట్టదని జీనీ అంటున్నారు. ట్యాబ్లెట్లను విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఇచ్చిన తరువాత కొన్ని రోజులకు తాము వారిని మరోసారి పరీక్షించామని.. ఈసారి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఏవీ ఇవ్వకుండా కేవలం వార్తాపత్రికలు చదివేందుకు మాత్రమే అవకాశమిచ్చామని.. అప్పుడు వారు సుఖంగా నిద్రపోయినట్లు తెలిసిందని చెప్పారు. పడుకునే ముందు ట్యాబ్లెట్లు వాడే వారిలో మెలటోనిన్ ఉత్పత్తి కనీసం అరగంట తరువాత మాత్రమే జరుగుతున్నట్లు తెలిసిందని, పైగా నిద్రలోంచి మేల్కొన్న తరువాత గంట సేపటి వరకూ వారు చురుకుగా ఉండలేకపోయారని జీనీ వివరించారు. -
ఆఫీస్ టైంలో హాయిగా నిద్రపోవడం ఎలా?
న్యూయార్క్, అమెరికా : తీరిక లేని ఉద్యోగ జీవితంలో కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. ఇంట్లో ఆఫీస్ దిగులు. ఆఫీస్కు పోతే ఇంటి దిగులు ఇక నిద్రపోవడానికి టైమేది. ఇలా ఆలోచించే వాళ్ల కోసం అమెరికాలో ఓ చక్కటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ‘నాప్ యార్క్ ’, ‘నాప్ క్లబ్స్’ల పేరిట ఉద్యోగుల్ని హాయిగా నిద్రపుచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి అక్కడి వ్యాపార సంస్ధలు. ఆఫీస్ టైంలో బ్రేక్ దొరకగానే రిలాక్స్ అవ్వడానికి చాలా మంది ‘టీ’, ‘కాఫీ’ తీసుకుంటారు. కానీ న్యూయార్క్ ఉద్యోగులు మాత్రం హాయిగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. ‘నాప్ యార్క్ ’, ‘నాప్క్లబ్స్’లు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి కాబట్టి పగలు, రాత్రి తేడా లేకుండా ఆఫీస్ టైంలో బ్రేక్ దొరికినపుడు కొంత డబ్బు చెల్లించి ఓ చెక్క గదిలో హాయిగా నిద్రపోవచ్చు. అసలే న్యూయార్క్ సిటీలో ప్రశాంతత భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు అందుకే ఉద్యోగులు నాప్ క్లబ్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 30 నిమిషాల పాటు సాగే ఈ నిద్ర కోసం 15 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంపన్న వ్యక్తులకు, వేల డాలర్ల జీతాలు తీసుకునే వారికి 15 డాలర్లు పెద్ద ఖర్చు కాకపోయిన చిరుద్యోగులకు మాత్రం కొంత కష్టమే. రానున్న రోజుల్లో ఈ సదుపాయం అన్ని దేశాలలో అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి. -
సభలో యెడ్డీ ప్రసంగిస్తున్న వేళ...
సాక్షి, బెంగళూరు: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.. అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ సీరియస్గా కునుకు తీశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం ముగిశాక భోజన విరామ సమయంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా ఆదమరిచి నిద్రపోయారు. ఓవైపు బలనిరూపణ గురించి కాంగ్రెస్-జేడీఎస్ నేతలంతా హడావుడి పడుతుంటే.. వాళ్లు కూల్గా కునుకు తీయటం విశేషం. ఇంకోవైపు సోషల్మీడియాలో వాళ్ల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. ఏదైతేనేం తమ వద్ద తగినంత బలం లేదని ఒప్పుకున్న యడ్యూరప్ప చివరకు ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కునుకు తీస్తూ.. కెమెరాకి చిక్కిన సీఎం
గుల్బర్గా : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిరంగ సమావేశాలంటే.. జోలపాటలా అనిపిస్తాయేమో..! ఇప్పటికే చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో కునికిపాట్లు తీస్తూ కన్పించారు. తాజాగా సోమవారం గుల్బర్గాలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సైతం సిద్ధరామయ్య కునికిపాట్లు పడుతూ మీడియా కంటికి చిక్కారు. ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న ఈ సమయంలో సిద్దరామయ్య మాత్రం ఇలా సభల్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటున్నారు. ఈ సారి జరగబోయే ఎన్నికలు ఇటు కాంగ్రెస్కు, అటు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. పార్టీల మధ్య ప్రచారాల పోరు కూడా తారాస్థాయిలోనే ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉన్న సిద్ధరామయ్య మాత్రం ఈ సారి ఎన్నికలను సీరియస్గా తీసుకోకుండా ప్రచార సభల్లోనే నిద్రపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య నిద్ర పోవడాన్ని గమనించిన పక్కనే ఉన్న ఓ నాయకుడు చెవి దగ్గర ఏదో చెప్పడంతో నిద్రలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రచార సభలోను సిద్ధరామయ్య కునికిపాట్లు
-
పాప ఇంతగా నిద్రపోతోంది... ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య చాలా ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి లేపినా కూడా లేవడం లేదు. డాక్టర్ను సంప్రదించాం. మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. పాప ఇలా అతిగా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? తగిన సలహా ఇవ్వండి. – వనజ, పాడేరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి పాప నిద్రపోవాల్సిన సమయం కంటే చాలా ఎక్కువ సేపు పడుకుంటోందని చెప్పవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. రంగులరంగుల ఆహారం తీసుకోవచ్చా? మా పాప బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా? – కె. దీక్ష, హైదరాబాద్ ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. - డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పగటి నిద్ర ఒంటికి చేటు కాదు!
మీరు ఒళ్లు తెలియకుండా నిద్ర పోయి ఎంతకాలమైంది? పడుకోగానే నిద్రలోకి జారిపోతాను అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టవంతులే. లేదంటే మాత్రం మూడొంతుల ప్రపంచ జనాభాలో మీరూ ఒకరు. నిద్రలేమి ఉందంటే.. ఉదయాన్నే చిటపటలాడే ముఖంతో లేవాలి.. రోజంతా చిర్రుబుర్రులాడుతూ ఉండాలి. పనులపై శ్రద్ధ తగ్గిపోతుంది..! అబ్బో ఇలాంటి సమస్యలు బోలెడున్నాయి లెండి. మరి.. తరుణోపాయం ఏమిటంటారా? ఎంచక్కా రోజుకు రెండుసార్లు కునుకేస్తే సరి అంటున్నారు నిపుణులు! సాధ్యాసాధ్యాలను కాసేపు పక్కన పెట్టేసి.. ఈ ఆలోచన వెనుక ఉన్న తర్కం ఏమిటో చూసేయండి! రాత్రిపూట ఏకంగా 8 గంటలకు బదులుగా నాలుగు గంటల చొప్పున రెండుసార్లు నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మిగిలిన సమయమంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండేందుకు.. సృజనాత్మకత పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. దీనివల్ల మన శరీర గడియారానికి మేలు జరుగుతుంది. ఇంకో విషయం.. ఇదేదో కొత్త విషయమేమీ కాదు. మనిషి విద్యుత్తును ఉత్పత్తి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రమే రాత్రిపూట నిద్రకు అలవాటు పడ్డాడని అంటున్నారు సోమ్నాలజిస్టులు! అదేనండి.. నిద్రపై పరిశోధనలు చేసే వైద్యులు, శాస్త్రవేత్తలు! నడుం వాల్చడం అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో మధ్యాహ్నం కాసేపు పడుకున్నాడని తెలిస్తే.. అతడిని బద్ధకిస్టుగా ముద్ర వేయడం ఖాయం. ఈ కాలపు ఉద్యోగాలతో రోజుకు రెండుసార్లు నిద్రపోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అయితే ఎలాగోలా వీలు చేసుకుని మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చగలిగారనుకోండి.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల రోజంతా క్రియాశీలత, నైపుణ్యం, చురుకుదనం పెరుగుతుంది. నిద్రలేమిని అధిగమించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ జీవనంలో భాగంగా మధ్య మధ్యలో నిద్ర పోవడం వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే తత్వం పెరగడంతో పాటు, రోజంతా మంచి మూడ్లో ఉంటారని 1990ల్లోనే థామస్ వెహర్ అనే మానసిక వైద్యుడు అధ్యయనాల ద్వారా స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా ఒకే పర్యాయం దీర్ఘకాలం పాటు మేల్కొనడం/నిద్ర వంటివి ఉంటే రోజు గడిచే కొద్దీ ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆలోచించుకోండి మరి.. –సాక్షి హైదరాబాద్ ఐరోపాలో పుట్టింది.. రాత్రిపూట ఏకబిగిన ఎనిమిది గంటల పాటు నిద్రపోవడమన్న అలవాటు 1700 సంవత్సరం ప్రాంతంలో ఐరోపా దేశాల్లో మొదలైందని అంచనా. విద్యుదుత్పత్తి మొదలైన తర్వాత కృత్రిమ వెలుగులు అందుబాటులోకి రావడంతో ఉత్తర ఐరోపాలోని ఉన్నత వర్గాలు ఈ అలవాటు చేసుకున్నాయని ఆ తర్వాత ఇది పాశ్చాత్య దేశాలకు విస్తరించిందని చరిత్రకారుడు ఎ.రోజర్ ఇకిర్చ్ అంటున్నారు. అంతకంటే ముందు.. దినచర్యలన్నీ సూర్యుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండేవి. శారీరక వ్యవస్థ కూడా అందుకు తగ్గట్టుగా పనిచేసేది. అప్పట్లో రాత్రి 7–8 గంటల కల్లా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున రెండు, మూడు గంటలకే లేచి రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నడుం వాల్చడమన్నది రివాజుగా ఉండేదని మనకూ తెలుసు. అయితే పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక నిద్రపోయే సమయం తగ్గిపోయింది. నిద్రను నియంత్రించుకోవడమూ మొదలైంది. పనివేళలు పెరిగిపోవడం.. ఇల్లు.. కార్యాలయాల మధ్య ప్రయాణానికే ఎక్కువ సమయం ఖర్చయిపోతుండటం వల్ల నిద్రలేమి ఎక్కువవుతోంది. జీవనశైలి మార్పులు, రాత్రి, పగలు తేడా తెలియనంత స్థాయిలో కృత్రిమ కాంతులు పెరిగిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చాయి. -
ఇన్నాళ్లూ బీజేపీ నేతలు నిద్రపోయారా?
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. -
లచ్చిగాని కల
‘‘ఎందిరా తమ్మి, లచ్చిగాని ఇంటికాడ ఇంతమంది గుమిగూడిండ్రు?’’ గుంపును చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రాజన్న.‘‘అయ్యో! నీకు తెల్వదు గాదే!! లచ్చిగానికి దేవుడు పూనిండంట. సాధక బాధకాలు చెప్పుకుంటే చాలు రాత్రి నిద్రలో కలగని తెల్లారి పొద్దునకల్లా సమస్యకు కారణంతో పాటు పరిష్కారం చెప్తుండంట. చానా మందికి అచ్చొస్తుందంటన్న.’’‘‘ఇదేం శిత్రం రా?’’‘‘అవునంటన్నా రోజుకు ఒక్కలికి మాత్రమే చెప్తుండంట. కలలోనే కోరుకున్న దేవుణ్ణి కలిసొచ్చీ, దేవుడేమంటున్నడో కూడా చెప్తుండంటనే!’’‘‘అన్ని మాయలు తీర్రా..ఈడు గూడా మాయమాటలు చెప్పి, ఏ బాబాలాగానో మారి గుడి కట్టించుకుందాం అనుకుంటుండేమో. ఇలాంటోళ్లను భూమ్మీద ఎంతమందిని చూస్తలేం?’’‘‘మాయనో, మర్మమో తెల్వదన్నా, అన్నేలం మాట వాడు డబ్బూ, దస్కం మాత్రం తీస్కుంటలేడన్న పాపం’’ ఆ మాటల్లో దయ ధ్వనించింది.రాజన్న నర్సిగాని కళ్లల్లోకి చూశాడు శాంతంగా!‘‘శానా రోజుల నుంచి చూస్తున్న.. నువ్వు దిగులుగా కనబడుతున్నావు. ఒక్కసారి నీ బాధగూడా చెప్పి చూద్దాం అన్నా, ఏమన్నా జాడ దొరుకుద్దేమో మరీ’’ అని సలహా ఇచ్చాడు నర్సిగాడు. ‘‘నిజమా, కాదా అన్నది తర్వాత ముచ్చట. ఒక్కసారైతే చెప్పి సూద్దామన్నా’’ రాజన్న మౌనాన్ని దాటుకుంటు మళ్లీ నర్సిగాడు. ‘‘నాదేంది నీదేందిరా తమ్మి! మనందరిది ఒక్కటే బాధగాదురా? టైంకు వానలు పడక పంటలు పండుతలేవాయే. ఏశిన సేండ్లెమో ఎండకు మాడిపోతుండే. కరువు, పురుగులు కలిసి మింగగ మిగిలిన పంట కోతకొచ్చేవరకు వడగళ్ల పాలయితుండే. ప్రతియేడు గిదే వరసాయే మనకు..’’ అని తన బాధనంతా రాజన్న గద్గద స్వరంతో చెప్పాడు.రాజన్న మాటలు మౌనంగా వింటున్నాడు నర్సిగాడు.‘‘అన్నదాత, దేశానికి వెన్నుముక అనే పొగడ్తలు తప్ప రైతుగా పుట్టినందుకు ఏం సుఖంరా? నైఋతి కాలమొచ్చి రెండు కార్తులు దాటిపాయే. తొలకరికి ఏశిన ఇత్తులు మొలిశినయ్ గని ఏం లాభం! కూలిపనికి పోయిన తల్లికోసం సాయంకాలం ఆశావరణంతో ఎదురు చూసే పల్లె పిల్లలాగేచెలకల్లో మొలకలు మొయిలు కోసం ఎదురుచూస్తూ మాడిపోతున్నాయి.’’ ఆవేదన వెళ్లగక్కాడు రాజన్న.‘‘అవునన్నా ఈ ఎవుసాయం చేసుడుకంటే, ఏడూర్లు దాటి వలసపోవడం మేలనిపిస్తుందే.’’‘‘గిట్ల ఋతుపవన కాలమొచ్చినా వానలేందుకొస్తలేవో? కాలానికి తగ్గట్టుగా వానదేవుడేందుకు కరుణిస్తలేడో? ఏ పాపం చేయ్యని రైతుల మీద వరుణ దేవుడెందుకు కక్ష కట్టిండోనని ఆ వరుణ దేవుణ్ణేతెలుస్కోని రమ్మందాంరా తమ్మీ’’ ఆశతో అన్నాడు రాజన్న. సరే అనుకుని ఇద్దరూ కలిసి లచ్చిగాని ఇంటికి వెళ్లారు. రాజన్న అంటే ఊరంతా చాలా గౌరవం. ఏ కార్తెకు ఏ పంట బలమో చెప్పగల సమర్థుడు. ఇప్పటకీ ఎడ్లతోనే వ్యవసాయం చేస్తున్న బలవంతుడు. సలహా అయినా, సహాయం అయినా ముందుగా గుర్తొచ్చేది రాజన్నే. ఏదైన మన అంటడు గానీ మధ్యలో ఒదిలేసిపోయే రకం కాదు. అందుకే ఈ రాత్రి కల రాజన్నకే అని లచ్చిగాడు బహిరంగంగా ప్రకటించి అందరికి సెలవు చెప్పాడు.‘‘చెప్పే రాజన్న నీకేం రందే?’’ గౌరవంగా అడిగాడు లచ్చిగాడు.‘‘నా ఒక్కందేం కాదురా తమ్మీ! ఈ లోకంలో ఉన్న మనందరి రందే నా రంది. కరువుకోరల్లో చిక్కి, అప్పుల బాధతో బలైపోతున్న రైతన్నల ప్రాణాల గురించి ఈ లోకానికి తెల్వంది కాదు. కాలం దాటిపోతున్న కార్తులకు తగ్గట్టు ఎనకటిలెక్క వానలెందుకొస్తలేవో ఆ వరుణదేవుణ్ణి అడిగిరా. రైతులంగే ఎందుకంతా కక్ష కట్టిండో నిలదీసి రారా!’’ ముచ్చటలాగా వివరించిండు రాజన్న.‘‘తప్పకుండ తెలుసుకొస్తనే... రేపు పొద్దునకల్లా ఏ సంగతైందీ నీకు చెప్త.’’ అని బదులిచ్చి లచ్చిగాడు సెలవు తీసుకున్నాడు.రాత్రి పడుకున్న తర్వాత వరుణదేవుడి గురించి ఆలోచించసాగాడు లచ్చిగాడు. కన్నంటుకోగానే కల మొదలైంది లచ్చిగానికి. తలచుకోగానే రెక్కలొచ్చాయి కలలో!ఆహా.. అనుకుంటూ ఆనందంగా ఆకాశానికి ఎగిరాడు. ఎక్కడ చూసినా అనంతమైన నీలాకాశం. చుట్టూ్ట శూన్యం. ఆకాశం కళ్లకందినట్టే అనిపిస్తూ, సాగేకొద్దీ దూరమైపోతుంది. ఇది నైరుతి ఋతుపవన కాలమని నైఋతి దిక్కు తన ప్రయాణం కొనసాగించాడు.‘‘వర్ష ఋతువే అయినా ఎండ దంచుతోంది. వేడికి చెమట ఆవిరై ఒళ్లు బొగ్గయిపోతోంది. అయినా ఒక్క మబ్బు ముక్కా కనపడి చావాదేం?’’ అని మనసులో అసహనంతో గుణుక్కొన్నాడు లచ్చిగాడు.నైఋతి దిక్కుకు వేగంగా కదులుతున్నాడు. కంటికి అలుపొచ్చే సమయానికి కొంచెం దూరంలో కంటికి మసక మసకగా నల్లని ఒక మేఘమాలిక కనబడింది. గాలి ఉలిలా మారి మబ్బు మాలికను ఇంకా అందంగా చెక్కడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. మేఘమాలికను చూడగానే ఒళ్లంతా ప్రకంపించి, ప్రాణం లేసొచ్చినట్టయింది. వేగంగా మేఘమాలికకు ఎదురెళ్లి నమస్కరించాడు లచ్చిగాడు.వెంటనే ఆ మేఘమాలిక దేవకన్యలా మారి ‘‘ఎవరు మీరు?’’ అని లచ్చిగాన్ని సౌమ్యంగా ప్రశ్నించింది. ‘‘నేను భూలోక మానవుణ్ణి! నన్నందరూ లచ్చిగాడు అని పిలుస్తారు.’’ అని వినయంగా పరిచయం చేసుకున్నాడు.‘‘ఇలా ఎందుకొచ్చావ్ నాయానా? ఆకాశ దేశంలో నీకేం పని?’’‘‘మీ రాజు వరుణదేవుణ్ణి కలవడానికి వచ్చాను తల్లీ! ఎంతో దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా కనబడడేం? అలసి సొలసి మాడి మసి బొగ్గయి వచ్చానమ్మా. నా యందు దయుంచి కొంచెం వరుణదేవుని చిరునామా చెప్పు’’ అని చేతులు జోడించి వేడుకున్నాడు.‘‘మీరు సరైన దిశలోనే వచ్చారు మానవా! ఈ నైఋతి మూలవైపే వెళ్లు. దగ్గర్లోనే వజ్ర కాంతులతో మెరిసే రాజమందిరం కనబడుతుంది’’ తన బాధ్యత నిర్వర్తించడానికి త్వరితగతిన వెళ్లాలని మేఘమాలిక చెప్పింది. మరోసారి చేతులు జోడించి నమస్కరించి, కృతజ్ఞతాభావంతో మేఘమాలిక నుంచి సెలవు తీసుకున్నాడు.ఆనందంగా రెట్టించిన వేగంతో రెక్కలు జాడించి, పెద్ద పెద్ద కొండల్ని దాటి, సముద్రాల మీదుగా పైపైకి ఎగిరాడు. తొందర్లోనే వరుణదేవుని విశాల భవనం ముందు వాలాడు.వజ్ర వైడుర్యాలతో నిర్మించబడిన ఆ కోట తళతళలాడుతోంది. ఆ రాజభవనపు కాంతికి కళ్లు సొమ్మసిల్లిపోతున్నాయి. వరుణుడు, అతిథి దేవతలు మబ్బు శయ్యలపై సభమందిరంలో ఆసీనులైనారు. ఉరుముల సంగీత హోరులో, మెరుపు తీగల్లాంటి అప్సరసల నాట్యాన్ని సురపానకాన్ని సేవిస్తూ ఆనంద డోలికల్లో తిలకిస్తున్నారు. ఇంతలో కళల సమయం ముగిసింది.ఇది సభా సమయం. సభ ప్రారంభమైంది. వరుణుడు వివిధ మేఘాలతో సమావేశమై ఏదో సంభాషిస్తున్నాడు. వరుణుడి ముఖంలో జలకళ ఉట్టిపడుతోంది. సూర్యకాంతికి అతని దేహంపై నీటి బిందువులు వజ్రహారాల్లా మెరుస్తున్నాయి. మబ్బు సింహాసనంపై కూర్చొన్న వరుణిడి కళ్లకు కరుణ అలంకారమైంది.వరుణుడికి చెమట పట్టకుండా పిల్లగాలులు పరిచారికల్లా సేవ చేస్తున్నాయి.ఇన్ని సౌఖ్యాలనుభవిస్తూ రైతుల గోడును పట్టించుకోవడానికి ఏమైందని మనసులో అనుకుంటు కోపంతో ‘‘వరుణ దేవా!’’ అని గద్దించి పిలిచాడు. ‘‘ఎవరక్కడ? మీకేం కావాలి?’’ అని గట్టిగా ఉరిమాడు వరణుడు.ఇంతలో ద్వారపాలకులు వెళ్లి లచ్చిగాన్ని పట్టుకొచ్చి వరుణుడి ముందు ప్రవేశపెట్టారు.‘‘నేనవరినైతే నీకెందుకు? భూలోకంలో రైతన్నలు కన్నీటిలో మునిగి, ఉరిపోసుకుని యమపురికి చేరుకుంటుంటే, రైతు రక్షకుడిగా నియమింపబడిన నీవు మాత్రం అవేమి పట్టించుకోకుండా, కర్తవ్యం మరిచి నీ దర్బారులో జల్సాలు చేస్తున్నావు!’’ గట్టిగా అరిచాడు లచ్చిగాడు.‘‘హా..హా..హా...’’ పెదవులపై మెరుపులు చిల్లుతుండగా ఉరిమినట్టు నవ్వాడు వరుణుడు.‘‘నా ఆవేదన మీకు హాస్యంగా తోస్తుందా? వానదేవా?’’ అని లచ్చిగాడు కళ్లు ఎర్రచేసి పిడికిలి బిగబట్టాడు.‘‘ముందు ఆసీనులుకండీ మానవా!’’ వరుణుడు మర్యాదగా చెప్పటంతో, నిలబడే తేల్చుకుందామనకున్న లచ్చిగాడికి కూర్చోక తప్పలేదు.‘‘చెప్పు మానవా నీ ఆవేదన.. ఆలకించి, ఆదుకోవడానికి మేం సిద్ధం’’ అన్నాడు. అతిథిని గౌరవించడం దైవకార్యం.‘‘కాలమైన చినుకుపడదు. ఖరీఫ్ వచ్చిన కరువు పోదు. కరువూ, పురుగూ కబళించగా మిగిలిన కాసింత పంటను మీ వడగళ్లు బలితీసుకుంటాయి. కాలచక్రంతో పాటే నీ వాన చక్రం తిప్పవచ్చుకదా? తొలకరికి విత్తిన విత్తనాలు అనాథల్లా రోదిస్తోంటే మీకు కనపడటం లేదా స్వామి? రైతుపట్ల దళారులకూ, ప్రభుత్వానికీ, తినేవాడికీ ఎవ్వరికి కనికరం లేదు.మీరు కూడా మాపై దయలేకుండా పగపడితే మేమైపోవాలి దేవా? కాలానికి తగ్గట్టుగా మీరెందుకు కురవడం లేదు?’’ అని ఆపకుండా గుండెల్లో బాధనంతా ప్రశ్నల్లా కక్కేశాడు.‘‘మంచి ప్రశ్నలే సంధించావు మానవా! ఇప్పుడు మేము చెప్పేది కూడా విను. మాకూ వర్షించాలనే ఉంటుంది. మట్టికప్పుకుని పడుకున్న ప్రతివిత్తును స్పృశించి ప్రాణం పోసి విముక్తి కలిగించాలనే ఉంటుంది. మబ్బుల నుంచి జారే ప్రతి చినుకూ చిగురులా రూపాంతరం చెంది మోక్షం పొందాలనుకుంటాయి. ప్రతి ప్రాణి దాహం తీర్చడం మా కర్తవ్యం. మానవుల్లా మాకు స్వార్థ గుణం లేదుగనుకే కవులచేత కీర్తింపబడ్డాము! అందుకే మబ్బుల సైన్యాన్ని నలుమూలలా వర్షించుటకు పంపిస్తున్నాము..’’ అని చెప్తుంటే మధ్యలో ఈశాన్య సేనాని రొప్పుతూ వచ్చాడు. ‘‘వాన దేవుడికి జయము...జయము..’’ అని పలికి సభా ప్రవేశం చేశాడు. ‘‘చెప్పండి ఈశాన్య సేనాధిపతి.. వెళ్లిన పని విజయవంతం అయిందా? మీరు తెచ్చిన తీపి కబురు వినాలని నా హృదయం ఉవ్విళ్లూరుతోంది!’’ సంతోషంతో గంభీరంగా అడిగాడు వరుణుడు.‘‘క్షమించండి వరుణదేవా! ఈశాన్యం వైపు చినుకు కొరకు పరితపిస్తున్న అమాయక రైతులపై జాలితో వెళ్లిన మన మేఘసైన్యం ఈసారి కూడా ఓడిపోయింది. ఆ పొలాల పక్కనున్న విషబాణల్లాంటి కర్మాగారాల పొగతో పోటిపడి పోరాడలేక మన మబ్బులన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోయి చినుకు జారవిడచకుండానే చెల్లా్లచెదురయ్యాయి ప్రభూ!’’ అని బాధతో దీనంగా చెప్పాడు సేనాధిపతి.లచ్చిగానికి అప్పటికే సగం సంగతి బోధపడింది.‘‘చూశావుగా మానవా? మా కర్తవ్యంలో ఏమైనా లోపముందా? మా నిరంతర ప్రయత్నం ఇలాగే ప్రతిసారి వృథా ప్రయాస అవుతోంది’’లచ్చగాడి గుండెల్లో బాధ కమ్ముకుంది.‘‘అటు చూడు మానవా! ప్రతి పవనం కురవలేకపోతున్నామనే బాధ, నిరాశల బరువును ఎలా మోస్తున్నాయో?’’లచ్చిగానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్లీ వరుణుడే అందుకొని ‘‘భూలోకంలో వలే లంచానికి పనిచేసే వారు ఇక్కడెవ్వరూ లేరు. ప్రతి మేఘం తమ కర్తవ్యానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి.’’ అన్నాడు. మౌనం కాటేసినట్టయింది లచ్చిగానికి. ఏం మాట్లడలేకపోయాడు.‘‘లేగలు లేకుండా ఆవులు పాలిస్తాయా నాయనా? ఓ మరిచిపోయాను మీరు మానవులు కదా? సైన్స్తో అద్భుతాలు చేసిన మర సృష్టి కర్తలు కదా! మరుగు మందు పెట్టయినా బలవంతంగా పాలు పితుక్కొగల తెలవిమంతులు! కానీ ఎన్నాళ్లు?’’తలదించుకున్నాడు లచ్చిగాడు మానవుడైనందుకు. మళ్లీ అందుకుంటూ వరుణుడు...‘‘అలాగే మేఘాలు కూడా లేగల్లాంటి చెట్లు లేకుండా వర్షించలేవు. కొమ్మలు రమ్మని పిలిచినప్పుడు మేం తప్పకుండా కురుస్తాం! మీ మానవులు చెట్లను నరకడం ఆపకుండా మేదోమథనం చేసినా, మేఘమథనం చేసినా మేఘాలు వర్షించలేవు’’ అని వరుణుడు స్పష్టం చేశాడు.లచ్చిగాడు అపరాధ భావంతో బాధగా చేతులు జోడించి వరుణదేవుడికి మొక్కివినసాగాడు. ‘‘స్వార్థబుద్ధితో ఇలాగే కాలుష్యం చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ కృత్రిమ జీవనం సాగిస్తూ పోతామంటే శ్మశానం అయ్యేది మీ మనుగడే!’’ అని వరుణుడు బో«ధించాడు.ఇంతలో లచ్చిగాడు కళ్లు తెరిచాడు!! - తండ గణేశ్ -
నిద్ర చాలా అవసరం గురూ...!
నిద్ర...మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యతున్న అంశం. చుట్టూ ఏదో జరిగిపోతోంది. జీవితంలో ఏదో సాధించాలి..అమ్మో.. టైమ్ చాలా తక్కువగా ఉందని భావించే వారూ ఎక్కువ మందే ఉన్నారు. దీని కారణంగానే వారు నిద్రాకాలాన్ని తగ్గించుకుంటున్నట్టు వెల్లడైంది. అయితే దీనిని దీర్ఘకాలిక ప్రాతిపదికన విశ్లేషిస్తే ఆరోగ్య, శక్తి సామర్థ్యాలపరంగా నష్టం కలిగించవచ్చునని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 16 (శుక్రవారం)ను ‘వరల్డ్ స్లీప్ డే’గా వరల్డ్ స్లీప్ కమిటీ నిర్వహిస్తోంది. నిద్రను ఒక ఉత్సవంగా, పండుగలా నిర్వహించేందుకు ఈ దినోత్సవం ఉపయోగపడుతుందని, నిద్రతో ముడిపడిన ఆరోగ్యం, మందులు, విద్య, సామాజిక అంశాల వంటివి చర్చనీయాంశం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ కమిటీ పేర్కొంది. నిద్రలో నడిచేవారు 15 శాతం ఉంటారని, నిద్రలో వచ్చిన 50 శాతం కలలు మెలకువ వచ్చాక మరిచిపోతామని మరో అధ్యయనంలో వెల్లడైంది. అరవై శాతానికి పైగా భారతీయులు నిద్రను ప్రాధాన్యతా అంశంగా పరిగణించడం లేదని, అంతే శాతం మంది ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కంటే కూడా శారీరక వ్యాయాయమే ముఖ్యమనే అభిప్రాయంతో ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరమే అన్న విషయం చాలా మందికి అవగాహన లేదని ఫిలిప్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. భారత్తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్, జపాన్లలోని 15 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. టెక్నాలజీతో నిద్రాభంగం... మన దేశం విషయానికొస్తే,... సుఖమయమైన నిద్ర కోసం 45 శాతం వయోజనులు ధ్యానం (మెడిటేషన్) చేస్తున్నారు. నిద్ర నుంచి దృష్టి మళ్లేందుకు, నిద్రించే సమయం తగ్గిపోయేందుకు టెక్నాలజీ ప్రధాన ప్రతిబంధ కంగా మారిందని 32 శాతం అభిప్రాయపడ్డారు. రోజూ సవ్యంగా నిద్రపోయేందుకు ‘ప్రత్యేక బెడ్డింగ్’ ఏర్పాట్లు చేసుకున్నట్టు 24 శాతం వెల్లడించారు. పనివేళల కారణంగా సాధారణ నిద్రా సమయం ప్రభావితం అవుతుందని 19 శాతం పేర్కొన్నారు. అందరూ అనుకుంటున్న దాని కంటే అపసవ్యమైన నిద్ర అనేది మరింత తీవ్రమైన సమస్య అని ఫిలిప్స్సంస్థ స్లీప్, రెస్పిరేటరీ హెడ్గా ఉన్న హరీష్ ఆర్ చెబుతున్నారు. దీని ప్రభావం గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటీస్ తదితరాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. గురకతో కూడిన నిద్రను సంతృప్తికరమైనదిగా భారతీయులు భావిస్తుంటారని, అయితే ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు మూలమని గుర్తించాలన్నారు. ఎదురయ్యే సమస్యలు... –సరైన నిద్ర లేకపోతే బరువు పెరగడంతో పాటు కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది –నిద్రలేమి గుండెజబ్బుతో పాటు గుండెపోటుకు అవకాశాలెక్కువ –నిద్రలో నియంత్రణలు బ్లడ్షుగర్పై ప్రభావంతో పాటు ఇన్సూలిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది –తక్కువ నిద్ర భావోద్వేగంపై, సామాజిక కలివిడిపై ప్రభావం చూపుతుంది సానుకూలాంశాలు... –మంచినిద్ర ఆరోగ్యంతో పాటు ఆకలి పెంచుతుంది –ఉత్పాదకత పెరిగేందుకు, మరింత ఏకాగ్రతను సాధించేందుకు ఉపయోగపడుతుంది –మంచి నిద్రతో క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు –రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది, దీర్ఘకాలిక రోగాలతో ముడిపడిన సమస్యలు తగ్గే అవకాశం –జ్ఞాపకశక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను పెంచుకునేందుకు సహకరిస్తుంది -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ రోజు ప్రత్యేకత మీకు తెలుసా?
తీరిక లేకుండా చేసే ఉద్యోగాలు, జీవితంలో మోసే బాధ్యతలు మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురిచేస్తుంటాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేము. ఫలితంగా సహజ సిద్ధంగా చక్కటి ఆరోగ్యం లభించే పరిస్థితిని కోల్పోయి నిత్యం ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. బహుశా అందుకేనేమో.. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండంటూ ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టారనుకుంటా. వివధ దినోత్సవాల మాదిరిగానే మార్చి 16కు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదే ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్ స్లీప్ డే-మార్చి 16). మన దేశంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత, గుర్తింపు లభించనప్పటికీ వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని తప్పకుండా పాటిస్తారు. ఆ రోజు భిన్నచర్చలు జరుపుతుంటారు. వాస్తవానికి శరీరానికి విశ్రాంతి లేకుంటే ఏం చేయలేము.. చేసినా అది స్పష్టంగా ఉండదు. శరీరంలోని ప్రతి భాగం సమన్వయం కావాలంటే నిద్ర తప్పనిసరి. అందుకే ప్రతి మనిషి రోజు కనీసం 8గంటలైనా నిద్రపోవాలని ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెబుతుంటారు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్రతో వచ్చే లాభాలుపలువురు, వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పారు.. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. 1.ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఉత్పాదక శక్తి పెరుగుదల మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్రనే కీలక పాత్ర పోషిస్తుంది. అది సరిగా పనిచేస్తే మంచి ఉత్పాదక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. గొప్పగా, తెలివిగా పనిచేయడంలో సహకరిస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా నిద్ర ఉపయోగపడుతుంది. 2.క్రీడల్లో, వ్యాయామాల్లో రాణింపజేస్తుంది సరైన నిద్ర అథ్లెటిక్స్లో బాగా రాణించేలా చేస్తుంది. అలాగే, దేహదారుఢ్యం చక్కగా ఉంచుకునేందుకు చేయాల్సిన వ్యాయామానికి సహకరిస్తుంది. మానసిక చలనత్వం వేగంగా చేస్తుంది. 3.రోగ నిరోధకశక్తి పెంపొందుతుంది చక్కటి నిద్రతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిర్ణయించిన 8గంటల లోపుకంటే ఎవరు తక్కువగా నిద్రిస్తారో వారిలో జలుబు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎదుర్కోవడం 8గంటలకంటే ఎక్కువ నిద్రపోవడంతోనే సాధ్యం అవుతుంది. 4. ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది గాఢమైన నిద్ర శరీరంలోకి కలిగే నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. సరిగా నిద్రపోకుంటే శరీరంలోని కణాలు దెబ్బతినే అవకాశం ఎక్కువవుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నొప్పులకు సంబంధించిన రోగాలు బయలుదేరతాయి. 5. నిద్రలేమితో కష్టమే నిద్రలేమితో శరీరంలో అమితంగా కొవ్వుపేరుకుపోతుంది. ఒబేసిటీకి నిద్రలేమి ముఖ్యకారణం. నిద్ర తక్కువగా పోవడం మూలంగా హార్మోన్లలో సమన్వయం పోతుంది. పైగా వ్యాయామం చేయాలనే ఆలోచనను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర కూడా అవసరం. 6. భావోద్వేగాల నియంత్రణ, సామాజిక సంబంధాలు మంచి నిద్ర వ్యక్తులను భావోద్వేగాల పరంగా బలమైనవాడిగా మారుస్తుంది. అలాగే, తన చుట్టూ ఉండేవారితో చక్కటి సంబంధాలు కొనసాగించేందుకు కూడా సహకరిస్తుంది. 7. నిద్రలేమి వల్లే మానసిక ఒత్తిడి నిద్రలేమి కారణంగానే మానసిక ఒత్తిడిలు వస్తాయి. 90శాతం ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే అప్నియా, ఇన్సోమ్నియా, ఒత్తిడివంటి సమస్యలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి.. చక్కటి ఆరోగ్యంతో జీవించండి.. హ్యాపీ వరల్డ్ స్లీప్ డే.. -
పగటి నిద్రతో ముంచుకొచ్చే అల్జీమర్స్
లండన్ : పగటిపూట కునికిపాట్లు భవిష్యత్లో అల్జీమర్స్ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. పదవీవిరమణ చేసిన 300 మందిపై చేసిన అథ్యయనంలో పగటిపూట నిద్రించిన వారి మెదడులో అల్జీమర్కు దారితీసే కారకాలు ప్రేరేపితమయ్యాయని వెల్లడైంది. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లతో సతమతమైతే అల్జీమర్ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు పగలు అతిగా నిద్రించడం మంచిది కాదని అథ్యయనం చేపట్టిన మయో క్లినిక్కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. 2009 నుంచి 2016 వరకూ 70 ఏళ్లు పైబడిన దాదాపు 300 మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు పగటిపూట వారు నిద్రించే సమయాన్ని విశ్లేషించారు. వారి బ్రెయిన్ స్కాన్స్ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు. జామా న్యూరాలజీ జర్నల్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
నిద్ర పట్టడం లేదా? అయితే మేల్కోండి...
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర... అంతకు మించి మనిషి జన్మకు కావలసినవేంటి? మిగిలినవన్నీ తిండి, నిద్ర తర్వాతే కదా! పూట గడిచే స్థాయిలో కాస్త సంపాదన ఉంటే చాలు, ఏదోలా కడుపుకింత తిండి తిని బతకొచ్చు. మరి నిద్ర సంగతి అలా కాదు కదా! డబ్బు ఖర్చుపెడితే బజారులో దొరికే సరుకేమీ కాదది. శరీరం అలసి సొలసినప్పుడు, మనసుకు చీకూ చింతా లేనప్పుడు కదా ఎవరైనా ఆదమరిచి నిద్రపోగలరు. ఆకలి బాధల కారణంగా నిద్రకు దూరమయ్యే నిరుపేదలు కొందరైతే, ఆధునిక జీవితం తెచ్చిపెట్టిన మాయదారి మానసిక సమస్య కారణంగా నిద్ర కరువైన వారు ఇంకొందరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనాభాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వారంతా నిద్రలేమి ఫలితంగా తలెత్తే రకరకాల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే వారిలో చాలామంది అకాల మరణాల పాలవుతున్నారు. నిద్రలేమికి కారణాలు... నిద్రలేమికి దారితీసే కారణాలు చాలానే ఉన్నా, ఒక్కోసారి ఎలాంటి కారణాలూ లేకుండా తనంతట తానుగానే తలెత్తే సమస్య ఇది. అయితే, కొన్నిసార్లు ఇతర సమస్యల పర్యవసానంగా కూడా నిద్రలేమి తలెత్తుతుంది. ఇతర శారీరక, మానసిక సమస్యల వల్ల నిద్రలేమి తలెత్తే సందర్భాల్లో ఆ సమస్యలు తీరిపోగానే నిద్రలేమి కూడా నయమైపోతుంది. డిప్రెషన్, విపరీతమైన మానసిక ఒత్తిడి, భరించలేని నొప్పి, గుండెజబ్బులు, ఎసిడిటీ, ౖహె æబీపీ, మెనోపాజ్ వంటి సమస్యలు ప్రశాంతంగా నిద్ర పట్టనివ్వవు. శారీరక, మానసిక సమస్యలే కాకుండా జీవనశైలి కారణాల వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతూ ఉంటుంది. కెఫీన్ ఉండే కాఫీ, టీ, కూల్డ్రింక్స్ వంటివి అతిగా తాగడం, మోతాదుకు మించి మద్యం సేవించడం, పొగతాగడం, మాదకద్రవ్యాల వాడకం వంటి అలవాట్లు, నైట్ షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడం, ఎలాంటి వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి టీవీలకు, కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి వృథా కాలక్షేపం చేయడం, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాలు కూడా నిద్రలేమికి దారితీస్తాయి. ఇక వృద్ధాప్యంలో పడినప్పుడు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. నిద్రలేమితో బాధపడే వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరవయ్యేళ్లకు పైబడ్డ వయసు గలవారిలో దాదాపు 40–60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. శారీరక, మానసిక సమస్యలకు పర్యవసానంగా నిద్రలేమితో బాధపడే వారిని మినహాయిస్తే, పెద్దగా ఎలాంటి కారణం లేకుండానే నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య దాదాపు ఆరు శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ సొసైటీస్ వంటి సంస్థలు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం నిద్రలేమితో బాధపడుతున్న వారు సంపన్న దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, నిరుపేద దేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. కాయకష్టం చేసుకునేవారితో పోలిస్తే ఎక్కువగా విద్యార్థులు, మేధోపరమైన వృత్తులు, ఉద్యోగాలు చేసేవారు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి లక్షణాలు పక్క మీదకు చేరుకున్నా ఒక పట్టాన నిద్రపట్టదు. చాలా ప్రయాస తర్వాత నిద్రపట్టినా, అర్ధంతరంగా ఏ అర్ధరాత్రి వేళలోనో మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టడం గగనమే అవుతుంది. ఉదయం చాలా తొందరగా మెలకువ వచ్చేస్తుంది. మేలుకున్న తర్వాత చాలా నిస్సత్తువగా అనిపిస్తుంది. పగటి వేళ మగత మగతగా ఉంటుంది. పని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు ఏవీ లేకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, దానిని ప్రాథమిక నిద్రలేమి (ప్రైమరీ ఇన్సోమ్నియా) అంటారు. ఉబ్బసం, ఎసిడిటీ, హై బీపీ, అలెర్జీలు, గాయాలు, శస్త్రచికిత్సల కారణంగా తలెత్తే నొప్పి, కేన్సర్, కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, భయం, ఆందోళన, డిప్రెషన్ వంటి శారీరక, మానసిక సమస్యలు నిద్రను దూరం చేస్తాయి. రకరకాల శారీరక, మానసిక కారణాలతో తలెత్తే నిద్రలేమిని సెకండరీ ఇన్సోమ్నియా అంటారు. కెఫీన్, ఆల్కహాల్ మితిమీరి వాడటం, కొన్ని రకాల ఔషధాలు, మాదకద్రవ్యాలు, గురక వంటివి కూడా సెకండరీ ఇన్సోమ్నియాకు కారణమవుతుంటాయి. ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో తలెత్తే అభద్రతా భావం, సన్నిహితుల మరణం, శక్తికి మించిన పని ఒత్తిడి, తరచుగా నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, పరీక్షల భయం, సుదూర విమాన ప్రయాణాల కారణంగా ఏర్పడే జెట్లాగ్ వంటి పరిస్థితులు కూడా ప్రశాంతమైన నిద్రను కరువు చేస్తాయి. జీవితంలోని ఏదో ఒక దశలో కొద్దికాలం మాత్రమే కనిపించే నిద్రలేమి లక్షణాలను ‘అక్యూట్ ఇన్సోమ్నియా’ అంటారు. తాత్కాలికంగా కనిపించే ఇలాంటి నిద్రలేమికి వైద్య చికిత్స అవసరం ఉండదు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి దానంతట అదే సర్దుకుంటుంది. నెల్లాళ్లకు మించి నిద్రలేమి లక్షణాలు కొనసాగుతున్నట్లయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిందే. నిద్రలేమి అనర్థాలు చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్రలేమితో బాధపడే డ్రైవర్లు ట్రాఫిక్పై సరిగా దృష్టి సారించలేక ప్రమాదాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. మన దేశంలో ఈ దిశగా గణాంకాల సేకరణ, శాస్త్రీయమైన అధ్యయనాలు ప్రత్యేకంగా ఏవీ జరగలేదు. అయితే, అమెరికా వంటి అగ్రదేశాలు రోడ్డు ప్రమాదాల వెనుక నిద్రలేమి కోణంపై ప్రత్యేక అధ్యయనాలు జరిపించి, నివారణ చర్యలు కూడా చేపడుతున్నాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల హైబీపీ, టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, మూర్ఛ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల డిప్రెషన్, ఆందోళన, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లడం, జ్ఞాపకశక్తి తగ్గడం, విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి మందగించడం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాదు. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుర్దాయాన్ని కూడా హరించేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్రపోయే వారితో పోలిస్తే నిద్రలేమితో బాధపడేవారు 12 శాతం ఎక్కువగా అకాల మరణాల పాలయ్యే అవకాశాలు ఉంటాయని ఇటీవలి అధ్యయనాల్లో నిపుణులు తేల్చారు. మంచి నిద్రకు మేలైన చిట్కాలు దీర్ఘకాలిక నిద్రలేమికి వైద్య చికిత్స తప్ప ప్రత్యామ్నాయాలేవీ లేవు గాని, తాత్కాలికంగా కనిపించే అక్యూట్ ఇన్సోమ్నియాను చిన్న చిన్న చిట్కాలతో తేలికగానే అధిగమించవచ్చు. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. తాత్కాలిక నిద్రలేమిని అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి... ప్రతిరోజూ రాత్రివేళ నిర్దిష్ట సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి. నిద్ర వస్తున్నా, లేకున్నా నిర్ణీత వేళకు పక్క మీదకు చేరుకోండి. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో సీరియస్ విషయాలపై సుదీర్ఘ చర్చలు లేదా వాదులాటలు సాగించడం వంటి పనులు మానుకోండి. రాత్రిపూట కడుపు కిక్కిరిసిపోయినట్లుగా అతిగా భోంచేయకండి. భుక్తాయాసం మితిమీరితే నిద్రపట్టడం కష్టమవుతుంది. నిద్రలేమి ఇబ్బంది పెడుతున్నట్లయితే, పగటి వేళ నిద్రపోవద్దు. పగటి నిద్ర వల్ల రాత్రి నిద్ర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంట ముందు టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్ వంటివి చూడటం ఆపేయండి. అత్యవసరమైతే తప్ప మొబైల్ ఫోన్ను కూడా ఆ సమయంలో ఉపయోగించవద్దు. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగండి. తేలికగా నిద్రలోకి జారుకుంటారు నిద్రకు ఉపక్రమించడానికి ముందు ఏదైనా పుస్తకం చదవడం, ఆహ్లాదభరితమైన సంగీతం వినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి పనులు తేలికగా నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రపోయే సమయంలో ఇంట్లో రణగొణ శబ్దాలేవీ వినిపించకుండా చూసుకోండి. ఇంటి చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలు ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇయర్ ప్లగ్స్ వాడటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. బెడ్రూమ్లో బెడ్లైట్ మినహా మరేమీ వెలిగించి ఉంచకండి. మితిమీరిన వెలుతురు నిద్రను దూరం చేస్తుంది. అలాగే, బెడ్రూమ్లో నల్లులు, బొద్దింకలు, దోమలు వంటి కీటకాల బాధ లేకుండా చూసుకోండి. అరోమా థెరపీ, లైట్ థెరపీ వంటి పద్ధతులు ప్రాథమిక స్థాయిలోని నిద్రలేమిని నయం చేయడంలో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి బాధిస్తుంటే... ఒక్కోసారి ఎన్ని చిట్కాలు పాటించినా ఉపయోగం ఉండకపోవచ్చు. నాలుగు వారాలకు మించి నిద్రలేమి సమస్య బాధిస్తున్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. వైద్యుల పర్యవేక్షణలో కొన్నాళ్లు నిద్రమాత్రలు వాడాల్సి ఉంటుంది. నిద్రమాత్రల వాడకంలో సొంత వైద్యాలేవీ చేసుకోకండి. మీ సమస్యకు ఎలాంటి నిద్రమాత్రలను ఎన్నాళ్లు వాడాలో నిపుణులైన వైద్యులు మాత్రమే నిర్ధారించగలరు. మీ నిద్రలేమికి శారీరక సమస్యలేవైనా కారణమైతే, ఆ సమస్యలకు తగిన వైద్యం అందిస్తారు. మానసిక సమస్యలేవైనా కారణమైతే, వాటి నివారణకు తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. తీవ్రమైన దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే సమగ్ర చికిత్సను అందిస్తారు. నిద్రలేమి... కొన్ని నిజాలు... నిద్రలేమిని అమెరికా వంటి అగ్రరాజ్యాలు ప్రజారోగ్య సమస్యగా ఇప్పటికే గుర్తించాయి. అయితే, భారత్లో మాత్రం ఈ విషయమై అలాంటి చర్యలేవీ మొదలు కాలేదు. ఆయువును హరించేసే నిద్రలేమిపై నిర్లక్ష్యం తగదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న నిద్రలేమి సమస్య గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు... ∙ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది నిద్రలేమి బాధితులే. ∙డిప్రెషన్తో బాధపడేవారిలో 90 శాతం మంది నిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ∙నిద్రలేమితో బాధపడేవారిలో 35 శాతం మంది వంశపారంపర్యంగా ఈ సమస్యతో బాధపడేవారే. ∙అమెరికాలో దాదాపు కోటి మంది నిద్రలేమి బాధితులు వైద్యులు సూచించిన నిద్రమాత్రలపై ఆధారపడుతున్నారు. ∙దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు ఇతరుల కంటే 27 శాతం ఎక్కువగా స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ∙ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దాదాపు 15 కోట్ల మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙నిద్రలేమి బాధితులు బంగ్లాదేశ్లో అత్యధికంగా ఉన్నారు. బంగ్లాదేశ్ జనాభాలోని పురుషుల్లో 23.6 శాతం మంది, మహిళల్లో 43.9 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙వియత్నాంలో 37.6 శాతం మంది మహిళలు, 28.5 శాతం మంది పురుషులు నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙దక్షిణాఫ్రికాలో 31.3 శాతం మంది మహిళలు, 27.2 శాతం మంది పురుషులు నిద్రలేమి బాధితులు. ∙నిద్రలేమి బాధితుల సంఖ్యలో భారత్, ఇండోనేసియాలే కాస్తంత నయంగా ఉన్నాయి. భారత్లో 6.5 శాతం మంది మహిళలు, 4.3 శాతం మంది పురుషులు నిద్రలేమితో బాధపడుతుంటే, ఇండోనేసియాలో 3.9 శాతం మంది పురుషులు, 4.6 శాతం మంది మహిళలు నిద్రలేమి బాధితులు ఉన్నారు. -
స్లీప్ కౌన్సెలింగ్
డే అండ్ నైట్ షిఫ్ట్లతో సమస్యగా ఉంది నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్, డే షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటీవల నాలో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. – సమీర్, హైదరాబాద్ మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. షిఫ్ట్లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ఇలాంటి కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. మంచి నిద్ర కోసం చేయాల్సినవి ఇవే... నాకీమధ్య నిద్ర బాగా తగ్గింది. టాబ్లెట్లు వాడకుండా స్వాభావికంగా నిద్రపట్టే మార్గాలు చెప్పండి. – సుమనశ్రీ, విశాఖపట్నం రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... ∙పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి ∙నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి ∙సాయంత్ర వేళల నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్డ్రింక్స్ తీసుకోకండి ∙రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి ∙ పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు ∙గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది ∙పుస్తకం చదువుతుంటే వెంటనే నిద్రపడుతుందంటారు. కానీ... నిద్రకు వుుందు పుస్తకాలు చదవద్దు ∙నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. - డాక్టర్ రమణ ప్రసాద్ ,కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
ఇదో వింత వ్యాధి
వాషింగ్టన్ : నిద్రలో కలలు రావటం.. కలవరపాటుకు గురికావటం సహజం. కానీ, మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి నిద్రలేచాక అకస్మాత్తుగా ‘పొరుగు’భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది. అరిజోనాకు చెందిన మిచెల్లె మైర్స్(45) పరిస్థితి అలాగే ఉంది. ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతోంది. ఒక్కోసారి ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆపై మెలుకువ వచ్చేసరికి అసలు వ్యవహారం మొదలవుతుంది. స్వతహాగా అమెరికన్ అయిన ఆమె వేరే వేరే భాషల్లో మాట్లాడుతుంది. అసంకల్పితంగా ఆమె నోటి నుంచి పర భాష పదాలు దొర్లుతుంటాయి. గతంలో ఆస్ట్రేలియన్, ఐరిష్ భాషలు ఆమె మాట్లాడారు. అయితే అది రెండు వారాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఓ రోజు నుంచి ఆమె బ్రిటీష్ భాష మొదలుపెట్టి రెండేళ్లు మాట్లాడారు. దీనికి గల కారణాలను పరిశోధకులు వివరిస్తున్నారు. ‘మనిషి మెదడులో భాషలను గుర్తించే ఓ కేంద్ర విభాగం(బేసల్ గ్యాంగ్లియాన్) ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. లేదా షాక్ తగిలినప్పుడు పదాల ఉచ్ఛరణ అన్నది వారికి తెలీకుండానే మారిపోతుంది. అలా వారి ప్రమేయం లేకుండానే వేరే భాషలు మాట్లాడుతుంటారు. కానీ, అది తాము సాధారణంగా మాట్లాడే భాషే అని వారనుకుంటారు. ఆ ప్రభావం కొన్ని గంటలు ఉండొచ్చు.. లేదా ఏళ్ల తరబడి ఉండొచ్చు. దీనినే ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్గా వ్యవహరిస్తుంటార’ని షెలియా బ్లూమ్ స్టెయిన్ అనే భాషావేత్త వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. 2010లో వర్జీనియాకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహా సమస్యతో బాధపడినట్లు ది వాషింగ్టన్ పోస్టు తన కథనంలో వివరించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇలాంటివి 60 కేసులు నమోదు అయినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. -
స్లీపింగ్ బ్యూటీ
ఆ అద్భుత సౌందర్యానికి కళ్లు తిప్పుకోలేకపోయాను. సన్నగా పొడుగ్గా ఉంది. బ్రెడ్డు రంగులో నున్నటి చర్మం. ఆకుపచ్చ బాదంకాయల్లాంటి కళ్లు, భుజాల మీదికి జుట్టు. కాలంతో కొలవలేని అందం అది. ఇండోనీషియన్ లేదా ఆండియన్ (దక్షణ మధ్య అమెరికా ప్రాంతం) కావచ్చు. ఆమె డ్రెస్ సెన్సు గొప్పది. లింక్స్ (అడవి పిల్లి) జాకెట్, ముతక ఖద్దరు బ్లౌజు, కాటన్ ప్యాంటు, బోగెన్విల్లా రంగుల్లో బూట్లు. ‘ఇంతటి లావణ్యరాశిని ఒక్కసారైనా చూసినందుకు జీవితం ధన్యమైంది’ అనుకున్నాను. పారిస్లోని చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్టులో చెక్–ఇన్ లైన్లో నిల్చున్న నా పక్కనుంచి ఆడసింహంలా నడిచివెళ్లిందా సుందరి. నేను న్యూయార్క్ వెళ్లాలి. ఆమె నిజంగా నాకు కనిపించిందా? లేక భ్రమా? ఒక లిప్తపాటు దర్శనమిచ్చి టెర్మినస్లోని ఒక సందోహంలో అదృశ్యమైంది. ఉదయం, రాత్రంతా మంచు కురిసింది. వీధుల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. హైవేల మీద కూడా ట్రాఫిక్ వేగంగా కదలడం లేదు. రోడ్ల పక్కన కార్లు, ట్రక్కులు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. బైట వాతావరణం ఎలా ఉంటేనేం, ఎయిర్పోర్టు టెర్మినల్లో సుఖంగానే ఉంది. లైన్లో ఒక డచ్ స్త్రీ వెనకాల నిల్చున్నాను. ఆమె తన పదకొండు సూటుకేసుల బరువు గురించి కౌంటర్లో ఉన్న వాళ్లతో ఎడతెగని వాదన చేస్తున్నది. విసుగ్గా ఉంది. ఆ అలౌకిక సుందరి దర్శనంతో ముగ్ధుణ్ణయిన నేను వాదులాట ఎలా ముగిసిందో గమనించలేదు. నా పరధ్యానానికి కౌంటర్ క్లర్కు నావైపు కోపంగా చూసింది. ఏదోరకంగా మాటలు కలపాలని ‘‘లవ్ ఎట్ ఫస్ట్ నమ్ముతావా?’’ అని అడిగాను. ‘‘అఫ్కోర్స్, మరే పద్ధతిలోనూ ప్రేమలో పడటం అసాధ్యం’’ అంటూ ‘‘సీటు స్మోకింగ్ సెక్షన్లో కావాలా? నాన్ స్మోకింగ్ సెక్షన్లో కావాలా?’’ అని అడిగింది.‘‘ఎక్కడైనా ఫర్వాలేదు. డచ్ లగేజి పక్కన మాత్రం వద్దు’’ అన్నాను వ్యంగ్యంగా.‘‘ఏ నంబర్ కావాలి? 3, 4, 7?’’‘‘నాలుగు’’‘‘పదిహేనేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. ఏడో నంబర్ ఎంచుకోని మొదటి పాసెంజర్ మీరే’’ అంటూ బోర్డింగ్ పాస్ మీద నంబర్ రాసిచ్చింది. వెనక్కి తిరిగానో లేదో నా దేవత మళ్లీ కనిపించింది. ఎయిర్పోర్టును మూసేశారని, అన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా బయల్దేరతాయని ప్రకటించింది క్లర్కు. ‘‘ఆలస్యమంటే ఎన్ని గంటలు?’’‘‘తెలియదు. ఈ సంవత్సరం వచ్చిన అతి పెద్ద మంచు తుఫాను’’ అని ప్రకటించారు రేడియోలో. అది శుద్ధ తప్పు. ఈ సంవత్సరం కాదు. ఈ శతాబ్దంలోనే ఇంత పెద్ద తుఫాను రాలేదు. అయినా ఫస్ట్క్లాస్ వెయిటింగ్ రూంలో సదుపాయాలకేం కొదవ. మనోహరమైన సంగీతం వినిపిస్తుంది. నగరంలో తుఫాను వచ్చినా మాకు మాత్రం వసంతమే. అప్పుడు తట్టింది. నా వూర్వశి ఇక్కడ ఉండే అవకాశం లేకపోలేదు. వెయిటింగ్ హాలంతా గాలించాను. నా తెగువకు నాకే ఆశ్చర్యం వేసింది. ప్రయాణికులందరూ అక్కడికే చేరుకుంటున్నారు. సీట్లు దొరికిన పురుషులు ఇంగ్లిష్ వార్తపత్రికలు చదువుతున్నారు. వాళ్ల భార్యలు తమ తమ కలల రాకుమారుల కోసం కిటికీల్లోంచి కనిపించే మంచులో వెదుకుతున్నారు. మధ్యాహ్నం వరకు సీట్లన్నీ నిండిపోయాయి. అందరూ పోగవడంతో వేడి ఎంత పెరిగిందంటే ఆ ఉక్కను భరించలేక హాలు దాటి రాక తప్పలేదు. అక్కడా అదే దృశ్యం. ఇతర వెయిటింగ్ రూములు, కారిడార్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. పెంపుడు జంతువులు, పిల్లలు, లగేజీతో ప్రయాణీకులు.. నగరంతో సంబంధాలు తెగిపోయాయి. నా నమ్మకం బలపడింది. ‘ఆవిడ’ ఇక్కడే ఎక్కడో ఉండక తప్పదు. మంచు తుఫానులో చిక్కుకున్న ప్లాస్టిక్ కాప్సూల్లాగుంది ఎయిర్పోర్టు.లంచ్టైం వరకు అర్థమైంది. మేం చిక్కుకుపోయాం. రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, బార్ల వద్ద పొడుగాటి క్యూలు. తినడానికీ, తాగడానికీ ఏమీ మిగలకపోవడంతో మూడు గంటల తర్వాత అన్నీ మూసేశారు. చంటిపిల్లలు ఏడుపు లంకించుకున్నారు. జనమంతా ఎడం లేకుండా నిలబడటంతో ఓ రకమైన వాసన వ్యాపించింది. తినడానికేమీ లేదనుకుంటున్నప్పుడు పిల్లల దుకాణంలో రెండు కప్పుల వెనిల్లా ఐస్క్రీం దొరికింది. హోటళ్లు ఖాళీ కావడంతో టేబుళ్ల మీద కుర్చీలు పేర్చుతున్నారు. దూరంగా నిల్చుని ఐస్క్రీం తింటున్నాను గానీ నా కళ్లు ఆమె కోసమే వెదికాయి. ఉదయం పడకొండు గంటలకు న్యూయార్క్కు బయల్దేరాల్సిన విమానం.. రాత్రి ఎనిమిదింటికి బయల్దేరింది. నేను లోపలికి వెళ్లేసరికే సీట్లలో జనం కూర్చున్నారు. ఫ్లైట్ అటెండెంట్ నన్ను నా సీటు వద్దకు తీసుకెళ్లింది. అంతే, ఒక్కసారి గుండాగినంత పనైంది. నా పక్కన విండో సీటు ఆమెదే. ‘ఇలా జరిగింది’ అని రాస్తే ఎవరూ నమ్మరు కదా అనిపించింది. తడబడుతూ విష్ చేశాను కానీ ఆమె వినిపించుకున్నట్లు లేదు. జీవితమంతా అక్కడే గడపబోతున్నట్లుగా సుఖంగా సీట్లో సెటిలయ్యాను. ఇంట్లో సర్దుకున్నట్లుగానే తన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుంది. న్యూయార్క్ దాకా అదే ఆమె స్థిరనివాసం. ‘వెల్కం షాంపేన్’ తీసుకొచ్చాడు స్టువార్డ్. నేను గ్లాస్ అందుకుని ఆమెకు ఆఫర్ చేయబోయాను. కానీ, అర్థంకాని ఫ్రెంచ్లో వచ్చీరాని ఇంగ్లిష్లో నీళ్లు మాత్రమే కావాలంది స్టువార్డుతో. అంతేకాదు ఫ్లైట్లో తనను లేపకూడదని కూడా సూచించింది. గొంతు గంభీరంగా ఉంది. ఆ స్వర్ణంలో తూర్పు దేశాల విషాదం దాగి ఉందనిపించింది. స్టువార్డు నీళ్లు తేగానే ఆమె తన కాస్మెటిక్స్ బాక్స్ తెరిచి, అందులో ఉన్న రంగురంగుల బిళ్లలోంచి రెండు బంగారు బిళ్లలు చేతిలోకి తీసుకుంది. ఆమె ప్రతి కదలికా, ఎంతో నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఏ అనుకోని సంఘటనా జరగలేదేమోనన్నంత ధీమాగా ఉందామె ప్రవర్తన. చివరికి, విండోషేడ్ కిందికి దించి, సీట్ బ్యాక్ వీలైనంత వెనక్కి వంచి, నడుం దాకా బ్లాంకెట్ కప్పుకుని, కళ్లమీద స్లీపింగ్ మాస్క్ పెట్టుకుని, అటు తిరిగి పడుకుంది. అంతే, న్యూయార్క్ చేరిన ఎనిమిది (ఎంతకూ గడవని) గంటల, అదనపు పన్నెండు నిమిషాలు ఆమె మరి కదలలేదు. ప్రయాణికుల సహనాన్ని పరీక్షించిన ఫ్లైట్ అది. ఈ సృష్టిలో అందమైన పడతి కన్నా అందమైనదేమీ లేదని నా గట్టి నమ్మకం. కాని నా పక్కనున్న సుందరి నిద్రాలోకంలో విహరించింది. టేకాఫ్ తర్వాత, స్టువార్డుకు బదులు మరో అటెండెంట్ వచ్చి ఆమెకు టాయ్లెట్రీ కేస్, సంగీతం వినడానికి ఇయర్ ఫోన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ, ఆమె డిస్టర్బ్ చెయ్యవద్దని కోరిందని చెప్పాను. కాని ఆ మాట ఆమె స్వయంగా చెప్పాలన్నాడు. భోజనం కూడా వద్దా, ఆమె తన సీట్లో ‘డునాట్ డిస్టర్బ్’ ట్యాగ్ పెట్టుకోనందుకు నావైపు అసహనంగా చూశాడు.కంపెనీలేక ఒంటరిగా భోజనం ముగించాను. మెలకువగా ఉంటే ఆమెతో చెప్పాల్సిన కబుర్లన్నీ నాలో నేనే చెప్పుకున్నాను. ఆమె ఎంత గాఢ నిద్రలోకి జారుకుందంటే ఆమె తీసుకున్నవి నిద్రమాత్రలా లేక విషం గుళికలా అన్న సందేహం వచ్చింది. డ్రింక్ తీసుకున్న ప్రతిసారీ, ‘టు యువర్ హెల్త్, బ్యూటీ’ అంటూ టోస్ట్ చేశాను.భోజనం తర్వాత లైటాఫ్ చేశారు. ఆ చీకట్లో ఏదో సినిమా చూపించారు కానీ, ప్రపంచమంతా నిండిన అంధకారంలో మేమిద్దరమే ఒంటరిగా మిగిలాం. ఈ శతాబ్దపు అతి పెద్ద తుఫాను తీవ్రత తగ్గింది. అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రశాంతంగా అంధకారం పరుచుకుంది. నక్షత్రాల కింద విమానం నిశ్చలంగా ఉన్నట్లనిపించింది. గంటల తరబడి, అంగుళం అంగుళం ఆమె గురించి ఆలోచించాను. ధ్యానించాను. చలనం లేదు కలల నీడలు కదలాడుతున్నట్లుగా నుదిటిమీద ఏర్పడిన సన్నని రేఖలు తప్ప. ప్రశాంతమైన నీటి మీద తేలియాడుతున్న మేఘాల్లా ఉన్నాయవి. మెళ్లో సన్నని గొలుసుంది కానీ, ఆమె బంగారు రంగు చర్మం మీద అది కనిపించడమే లేదు. చెవులకు రంధ్రాలు లేవు. గోళ్లు గులాబీ రంగులో ఉన్నాయి. ఎడమ చేతికో ఉంగరముంది. ఆమెకు ఇంకా ఇరవై ఏళ్లు కూడా దాటినట్లు లేవు కనుక ఇది పెళ్లి ఉంగరం కాదు. ఎంగేజ్మెంట్ రింగ్ అయివుంటుందని సమాధానం చెప్పుకున్నాను. షాంపేన్ నురగను చూస్తుంటే ‘రెండు చేతులకూ సంకెళ్లున్న నాకు నువ్వు సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తున్నావు’ అన్న జెరార్డో డియేగో కవిత స్ఫురించింది. నేను కూడా సీటు పుష్ చేసి వెనక్కు వాలాను – పక్కపక్కనే. పందిరి మంచంలో నవ దంపతులు కూడా అంత దగ్గరగా పడుకుని ఉండరు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆమె గొంతులాగే గంభీరంగా ఉన్నాయి. చర్మం కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్లే పరిమళం విరజిమ్ముతోంది. ఇదో వింత అనుభవం. షాంపేను, మ్యూట్లో పెట్టిన సినిమా దృశ్యాలూ నిద్రకు సహకరించాయి. చాలా సేపు నిద్రపోయాను. తలనొప్పి పెరిగి మెలకువ వచ్చింది. బాత్రూంకి వెళ్లి వచ్చాను. రెండు సీట్ల వెనకాల పదకొండు సూటుకేసులావిడ. యుద్ధరంగంలో వదిలేసిన మృతదేవతలా వికృతంగా కాళ్లు చాపుకుని పడుకుంది. గొలుసుకు కట్టిన కళ్లద్దాలు సీట్ల మధ్య పడి ఉన్నాయి. ఎవరైనా తొక్కితే విరిగిపోక తప్పదు. అయినా వాటిని తీసి ఆమెకు అందించాలనే కోరికను అణచుకుని చిలిపి ఆనందం అనుభవించాను.షాంపేను మత్తు దిగింతర్వాత అద్దంలో మొహం చూసుకున్నాను. అసహ్యంగా ఉంది. ప్రేమ పర్యవసానం ఇంత దారణంగా ఉంటుందా? విమానం ఆల్టిట్యూడ్ తగ్గి, మళ్లీ పైకి లేచి ముందుకు దూసుకెళ్లింది.‘రిటర్న్ టు యువర్ సీట్’ సైన్ వెలిగింది. విమానం కుదుపుకైనా ఆమె కళ్లు తెరిచి భయంతో నా చేతుల్లో వాలకపోతుందా అనుకున్నాను. ఆ తొందరలో డచ్ ఆవిడ కళ్లద్దాల మీద కాలు పడేదే కానీ తమాయించుకున్నాను (తొక్కనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. అయినా సీటు నంబరు నాలుగు ఆమె ఎంచుకోనందుకు కృతజ్ఞతగా కళ్లద్దాలు తీసి ఆమె ఒళ్లో వేశాను.)నా సుందరికి నిద్రాభంగం చేయడం అసాధ్యం. ఆమె భుజాలు విదిలించి లేపాలనే కోరికను అతి ప్రయత్నం మీద అణచుకున్నాను. తనకు కోపమొచ్చినా సరే. ప్రయాణంలోని ఈ చివరి గంటలోనైనా ఆమె కళ్లు తెరిస్తే బాగుండును. ఆమె లేస్తే తప్ప నాకు విముక్తి దొరకదు. ఆమె లేస్తేనే నా యవ్వనానికి సార్థకత. చివరికి నిస్సహాయంగా వృషభరాశిలో పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను.ల్యాండింగ్ లైట్స్ వెలగగానే ఆమె తనకుతానే దిగ్గున లేచింది. గులాబీ తోటలో పడుకుని లేచినట్టు ఇనుమడించిన అందంతో ఫ్రెష్గా కనిపించింది. అప్పుడు తెలిసింది. రాత్రంతా పక్కపక్కనే పడుకున్న దంపతులు తెల్లవారి గుడ్మార్నింగ్ చెప్పుకున్నట్లుగా, పక్క సీట్లలో ఉన్న విమాన ప్రయాణికులు ఏ అభివాదమూ చేసుకోరని. నాకేసైనా చూడలేదామె. స్లీపింగ్ మాస్క్ తొలగించగానే ఆమె కళ్లు మిలమిలా మెరిశాయి. సీటు ముందుకు లాక్కుంది. బ్లాంకెట్ తొలగించింది. జుత్తు వదులు చేసుకోగానే మళ్లీ భుజాల మీదకి జారింది. కాస్మెటిక్స్ బాక్స్ ఒళ్లో పెట్టుకుని అవసరం లేని మేకప్ చేసుకుంది. విమానం డోర్ తెరిచిందాకా ఒక్కసారంటే ఒక్కసారైనా నా వైపు చూడలేదు. మళ్లీ లింక్స్ జాకెట్ వేసుకుని, నా కాళ్లు తొక్కుకుంటూ మొక్కుబడిగా లాటిన్ అమెరికన్ స్పానిష్లో ‘ఎక్స్క్యూజ్మీ’ అంటూ ముందుకెళ్లింది. ఆమె సుఖ ప్రయాణానికి, సుఖనిద్రకు నేను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పలేదు. గుడ్బై కూడా చెప్పలేదు. అంతే మరి కాసేపటికి న్యూయార్క్ అనబడే అమెజాన్ మహారణ్యంలో అదృశ్యమైపోయింది. స్పానిష్ మూలం : గేబ్రియల్ గార్సియా మార్కెజ్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
ఇకనైనా బజ్జోమ్మా..!
పెద్దల్లో నిద్రలేమి సర్వసాధారణమే. వయసు మళ్లిన వారు వివిధ ఆరోగ్య సమస్యల కారణాల వల్ల నిద్రకు దూరమవుతుంటారు. పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, కుంగుబాటు వంటి కారణాల వల్ల యుక్త వయస్కులు కూడా నిద్రకు దూరమవుతుండటం మామూలే. అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఇటీవలి కాలంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. స్థూలకాయానికి ఇదే కారణం... చదువుల్లో పెరిగిన ఒత్తిడి, టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి వీడియో గేమ్స్తో గడిపే అలవాటు, ఒంటికి అలసట కలిగించే ఆటపాటలకు అవకాశం లేకపోవడం వంటి పలు కారణాలు చిన్నారులను నిద్రకు దూరం చేస్తున్నాయి. అవసరమైన సమయం కంటే తక్కువసేపు నిద్రపోయే చిన్నారులు త్వరగా వయసుకు మించి బరువు పెరుగుతున్నారని వర్జీనియా కామన్వెల్త యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నాలుగు నుంచి పన్నెండేళ్ల లోపు వయసు గల 120 మంది పిల్లలపై నెలల తరబడి నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ బెర్నార్డ్ ఫ్యూమలర్ వెల్లడించారు. పిల్లల్లో స్థూలకాయానికి కొవ్వులతో నిండిన జంక్ఫుడ్, తీపి పదార్థాలనే అంతా నిందిస్తారు. చిన్నారులు స్థూలకాయం బారినపడటానికి ఇవి ప్రధాన కారణాలే అయినప్పటికీ నిద్రలేమి కూడా ఇందుకు కారణమవుతోందని ఆయన తెలిపారు. నిద్రలేమికి గురైన పిల్లల్లో జీవక్రియలు మందగిస్తాయని, ఫలితంగా వారు త్వరగా బరువు పెరిగిపోతారని వివరించారు. పిల్లలు వేళకు నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారు తగినంత సమయం నిద్రపోలేకపోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల సహాయం తీసుకోవాలని ప్రొఫెసర్ ఫ్యూమలర్ సూచిస్తున్నారు. మానసిక సమస్యలకూ మూలం... నిద్రలేమి కారణంగా స్థూలకాయం, దాని ద్వారా తలెత్తే శారీరక సమస్యలతో పాటు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. తగినంత నిద్రకు దూరమైన చిన్నారుల్లో ప్రవర్తనాపరమైన రుగ్మతలను గుర్తించినట్లు సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్లోని న్యూరోసైకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ డీన్ బీబె తెలిపారు. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో దుడుకు ప్రవర్తన, కుదురుగా ఉండలేకపోవడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయని ఆయన చెప్పారు. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడే పిల్లలు ఏకాగ్రత కోల్పోయి, చదువు సంధ్యల్లో వెనుకబడతారని వివరించారు.9 పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే...? పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిలడెల్ఫియా చిల్డ్రన్స్ హాస్పిటల్లోని స్లీప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జోడి మిండెల్ ఈ విషయమై చేసిన సూచనలు ఇవీ... ►రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా పిల్లలను ప్రోత్సహించాలి. ►పిల్లలు పడుకునే గదిలో తక్కువ కాంతితో ఉండే లైట్లు వెలిగించాలి. ►పిల్లలు నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఇంట్లోని టీవీలు, కంప్యూటర్ల వంటివి కట్టేయాలి. ►పిల్లలను పడుకోబెట్టి కథలు, కబుర్లు చెబుతూ వారిని నిద్రపుచ్చాలి. -
అదేపనిగా కూర్చొనే ఉంటున్నాను... ఆరోగ్యం చెడకుండా సలహా ఇవ్వండి
నేను ఐటీ ప్రొఫెషన్లో ఉన్నాను. ఒకసారి ఆఫీసులోకి వచ్చాక నేను నా కంప్యూటర్ ముందు కూర్చున్నాననంటే మళ్లీ సాయంత్రం వరకూ లేచే పరిస్థితి ఉండదు. అంతంత సేపు అదేపనిగా కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్ అంటున్నారు. వారనేది వైద్యపరంగా కరక్టేనా? నా ప్రొఫెషన్ను దృష్టిలోపెట్టుకొని, నా ఆరోగ్యం కాపాడుకోడానికి తగిన సలహాలు ఇవ్వండి. – సమీర్, హైదరాబాద్ కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చొనే ఉండటం చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, వృత్తిపరంగా బైక్మీద కూర్చొనే చాలాసేపు ప్రయాణం చేస్తూ ఉండటం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం అవసరం. పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్లో నిమగ్నం కావడం అనే కారణాలతో అదేపనిగా కూర్చొనే ఉంటారు. ఇక పెద్దలు తమ ఆఫీసు పనుల్లో మునిగిపోయి కూర్చొనే ఉంటారు. కొన్ని సూచనలు : ∙మీ బెడ్రూమ్స్లో టీవీ / కంప్యూటర్ / ల్యాప్టాప్ లను ఉపయోగించకండి ∙మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి పిల్లలకు మీరు ఇచ్చే బహుమతుల్లో పిల్లలకు శారీరక ఆరోగ్యం చేకూర్చే బంతులు / ఆటవస్తువుల వంటివి ఉండేలా చూసుకోండి ∙మీరు ఆఫీసుకు వచ్చే ముందర లోకల్ బస్సుల్లో, లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేసేవారైతే ఆ టైమ్లో కూర్చుని ప్రయాణం చేయకండి. ∙ఎస్కలేటర్ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి ∙రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ∙మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్ తీసుకోండి ∙మీకు దగ్గరి కొలీగ్స్తో మాట్లాడాల్సి వస్తే మొబైల్ / మెయిల్ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడండి వ్యాయామంతో నిద్రపడుతుందా... పట్టదా? నేను దాదాపు రోజుకు 14 గంటలు కూర్చొనే పనిచేస్తుంటాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు. నేను సందిగ్ధంలో ఉన్నాను. దయచేసి సలహా ఇవ్వండి. – అనిల్కుమార్, విశాఖపట్నం మీరు విన్న రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్సైజ్కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్రలేని రాత్రి ఒక్కటైనా హానికరమే
నిద్రలేమి దీర్ఘకాలికంగా కొనసాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే. కొందరిలో నిద్రలేమి మానసిక, శారీరక సమస్యల వల్ల తలెత్తే సమస్య. అయితే, ఇంకొందరు తాము నిర్వర్తించే విధుల కారణంగా అనివార్యంగా నిద్రకు దూరమవుతుంటారు. కారణాలు ఏవైనా, తగిన నిద్ర లేకుండా ఒక్క రాత్రి గడిపినా, దాని ప్రభావం మెదడుపై పడుతుందని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క రాత్రి నిద్రలేమితో గడిపినా, అది అల్జీమర్స్తో పాటు పదిరకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశాలను పెంచుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి ఫలితంగా మెదడులో అమిలాయిడ్ బీటా ప్రొటీన్లు సహా నానా వ్యర్థాలు నిండిపోతాయని, ఇవి మెదడులోని కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు వారు చెబుతున్నారు. -
నిద్రలేమితో జుట్టుకు ముప్పు!
మంచి నిద్ర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బ తింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడంతో పాటు జుట్టుపై కూడా ఆ ప్రభావం పడుతుంది. నిజానికి నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అందులో అన్ని అవయవాలతో పాటు వెంట్రుకలు కూడా ఉంటాయి. నిద్రలేమి కారణంగా ఆ రిపేర్ల కార్యక్రమం కుంటుపడటంతో మిగతా అన్ని అవయవాల్లాగే జుట్టు రిపేరు ప్రక్రియ కూడా దెబ్బ తింటుంది. ఫలితంగా జుట్టు తన సహజ కాంతిని, మెరుపును కోల్పోవడం సాధారణం. అంతేకాదు జుట్టు బలహీనపడి రాలడం కూడా సహజమే. అందుకే ఒల్తైన తలకట్టుతో మెరుస్తున్న అందమైన జుట్టు కావాలనుకునేవారు పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, తమ అలసట పూర్తిగా తీరిన అనుభూతి కలిగేంతగా కంటి నిండా నిద్రపోవడం అంతే అవసరం. కంటి నిండుగా నిద్రతోనే తల నిండుగా జుట్టు అని గుర్తుంచుకోండి. -
చితిమంటల్లో చీకటి
వెలుతురు కత్తులు చీకటిపై దాడి చేస్తున్నాయి. కసిగా పొడుస్తున్నాయి. పొద్దు పొడవక ముందే రాత్రిని చంపేస్తున్నాయి. రాత్రి.. ఆ చితిమంటల్లో మండుతుంటే... గ్లోబు గుడ్లప్పగించి చూస్తోంది! నిద్ర గర్భంలోకి వెలుతురు వంతెనపై జబ్బులు కవాతు చేస్తున్నాయి. పహారా హుషార్! రాత్రిని ఎత్తుకుపోతున్నారు!! వెలుతురు.. చీకట్లను చిదిమేస్తోంది! వెలుగు చీకటిని మింగేస్తోంది. రాత్రి చీకటిని పారదోలుతూ పగటి వెలుగుల మాదిరిగా విద్యుత్ వెలుగులు మరింత విస్తరించడం మానవాళికి సంకటంగా మారుతోంది. దాంతో ఏడాదికేడాది కొత్త ప్రాంతాలను కాలుష్య కాంతులు ఆవరిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న కాంతి కాలుష్యంరాత్రి వేళల్లో అవసరానికి మించి ఉపయోగిస్తున్న విద్యుత్ లైట్ల వల్ల ‘కాంతి కాలుష్యం’ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 2.2 శాతం (భారత్లో 7.4 శాతం) మేర లైట్ల వినియోగంలోని వృద్ధితో ఈ కాలుష్యం మరింత విస్తరిస్తోంది. ఇది మానవాళి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ మూడు రెట్లు ఎక్కువగా రాత్రులను కోల్పోతున్నట్లు 2012–2016 మధ్యలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘లైట్ ఎమిటింగ్ డయోడ్స్’ (ఎల్ఈడీ) కాంతుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా కాకపోగా ఈ కాలుష్యం పెరుగుదలకు దారితీస్తోంది! విద్యుత్ ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లోనే ఈ కాలుష్యం పెరుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల సహాయంతో స్పష్టమైంది. జర్మనీలోని ‘జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్’లో ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యంపై కాంతి కాలుష్య ప్రభావాల మీద పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తున్న క్రిస్టఫర్ కైబా ఈ అధ్యయనం నిర్వహించారు. వెలుగు కాటే స్తోంది మన శరీరాల్లోని జీవక్రియల్లో కీలకమైనవి కొన్ని.. వెలుగు, చీకట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ కాంతి కాలుష్య ప్రభావం సకల జీవరాశితో పాటు మానవాళిపై కూడా ఉంటుంది. ఈ వెలుగులతో మన మెదడులోని జీవగడియారం గతి తప్పుతుంది. దాంతో వెలుగు, చీకట్లకు అనుగుణంగా ప్రవర్తించాల్సిన సర్కేడియన్ రిథమ్ సైతం దెబ్బతింటుంది. అది ఇన్సోమ్నియా, కుంగుబాటు, గుండెకు సంబంధించిన సమస్యల వంటి వాటికి కారణమవుతుంది. కృత్రిమ వెలుగులు చిందించే లైట్లు రొమ్ము కాన్సర్, ప్రొస్టే్టట్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయని గతంలో నిర్వహించిన మరో అధ్యయనంలోనూ తేలింది. లైట్ల వెలుగుల వల్ల శరీరాలు అయోమయానికి గురై స్వతహాగా నిర్వహించాల్సిన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఉదయం సమయాల్లో సూర్యుడి వెలుగు ఆరోగ్యవంతమైంది. అదే.. రాత్రి సమయాల్లో లైట్ల కాంతి అనారోగ్యానికి కారణమవుతోంది. రాత్రి సమయాల్లో లైట్ల వల్ల నిద్ర దూరమై ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. రాత్రుళ్లు పడక గదుల్లోకి సైతం వీధి లైట్ల వెలుగులు ప్రసరిస్తుండడంతో నిద్రపై ప్రభావం చూపే పరిస్థితులున్నాయి. చాలా జీవక్రియలకు నిద్ర కీలకం. వెలుతురు కాలుష్యంతో ప్రధానంగా దెబ్బతినేది నిద్ర. దాంతో మరెన్నో ఆరోగ్యపరమైన అనుబంధ సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు శరీరంలోని అన్ని వ్యవస్థలు నిద్రలేమి వల్ల దెబ్బతింటాయి. అదీ తీవ్రస్థాయిలో. ఉదాహరణకు నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా.. ∙ఏకాగ్రత లోపించడం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె వేగం / గతిలో మార్పు ∙తక్షణం స్పందించలేకపోవడం (అవసరమైనది ఏదీ తక్షణం స్ఫురించకపోవడం) ∙హుషారు / ఉత్సాహం తగ్గుదల ∙తమ పని తాము సక్రమంగా చేయలేకపోవడం ∙మబ్బుగా / దిగులుగా ఉండటం ∙చిరాకు, కోపం ఎక్కువ కావడం ∙మానవసంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం ∙ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక నష్టాలు ∙మతిమరపు ∙మెదడు ఎదుగుదలలో లోపం ∙పిల్లల ఎదుగుదలలో లోపం ∙అధిక రక్తపోటు ∙గుండెజబ్బులు ∙స్థూలకాయం ∙డయాబెటిస్, ∙జీర్ణకోశ సమస్యలు ∙రోగనిరోధక శక్తి తగ్గడం ∙గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం ∙జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం. నిద్రలేమితో మానసిక సమస్యలు నిద్రలేమి వల్ల ప్రత్యేకించి మానసిక సమస్యలు పెరుగుతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్ (భావోద్వేగ సమస్యలు), యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల్లో... ∙అటెన్షన్ డెఫిసిట్ హెపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం జ్ఞాపకశక్తి లోపించడం పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్ (ఆందోళన వల్ల కలిగే సమస్యలు) ∙డిప్రెషన్ ∙సైకోసిస్ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం పరోక్షంగా అనేక ఆరోగ్య అంశాలపై నిద్రలేమి ప్రభావం ఉండటం, దానికి వెలుగు కాలుష్యం దోహదపడుతుండటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది. వెలుగు కాలుష్యాన్ని అధిగమించడం ఎలా? ‘విద్యుత్ వెలుగుల నియంత్రణ’కు సాంకేతికతను జోడించి విద్యుత్ ఆదాతో పాటు కాంతి కాలుష్యాన్ని తగ్గించవచ్చునంటున్నారు. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ద్వారా లైట్లు ఏ దిశలో వెలగాలో కూడా నిర్ణయించవచ్చునని, భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే అంతగా అవసరం లేని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో లైట్ల కాంతిని తగ్గించడం లేదా ఈ అధిక వెలుగుల సమయాన్ని కుదించడం చేయవచ్చునని చెబుతున్నారు. లైట్లను అమర్చే విధానం వల్ల కూడా అనుకున్న ఫలితాలను సాధించవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. భారత్లో పరిస్థితి భారత్లోని ఒక చిన్నగ్రామంలో అయిదారు విద్యు™Œ స్తంభాలతో విద్యుత్ వెలుగులను అందిస్తే దాంతో పెద్ద ప్రమాదం ఉండదు. కానీ పట్టణాల్లో వీధులన్నీ లైట్లతో నిండిపోతే అది కాలుష్యానికి తప్పక కారణమవుతోంది. గత అయిదేళ్లలో దాదాపు అన్ని పట్టణాల్లో విద్యుత్ బల్బుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. అలాగే కొత్తగా శివారు ప్రాంతాల విస్తరణతో ఈ లైట్ల వినియోగం మరింత అధికమైంది. మొత్తంగా చూస్తే మనదేశంలోని దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కాంతులు పెద్దమొత్తంలో పెరిగాయి. మనదేశంలో పదిశాతం ప్రాంతాలు అత్యంత ప్రకాశవంతంగా ఉన్నట్లు, ఇతర ప్రాంతాల్లో 25 శాతం వరకు పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. ఎవరికి ఎంత నిద్ర అవసరం? నిజానికి ఎవరికి ఎంత నిద్ర కావాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా... చాలా అధ్యయనాల ఏకాభిప్రాయం ప్రకారం ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే: ఏ వయస్సు వారు? ఎంత నిద్ర? రోజుల పిల్లలు పద్దెనిమిది గంటలు ఆ పైన 1 నుంచి 12 నెలల పిల్లలు 14 నుంచి 18 గంటలు 1 ఏడాది నుంచి 3 ఏళ్లు 12 నుంచి 15 గంటలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 11 నుంచి 13 గంటలు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు 9 నుంచి 11 గంటలు కౌవూరంలో (12–19 ఏళ్లు) 9 నుంచి 10 గంటలు 21 ఏళ్లకు పైబడ్డవారిలో 7 నుంచి 8 గంటలు 50 ఏళ్లు పైబడిన వారిలో 5 నుంచి 7 గంటలు – కె. రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కంటి నిండా నిద్ర కరవయిందా?
సెల్ఫ్ చెక్ చాలామంది తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నా, అందుకు సరైన నిద్రలేకపోవడం కూడా ఒక కారణమనుకోరు. మీకు కూడా నిద్ర రాని సమస్య ఉందా? తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ పూర్తి చేయండి. 1. రాత్రి వేళ నడుం వాల్చాక గంటలకొద్దీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పగలు కాస్త కుదురుగా కూర్చుంటే చాలు, నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 3. అర్ధరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపోలేరు. ఎ. అవును బి. కాదు 4. పగలు చాలా ఆందోళనగా, చికాకుగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. మీటింగ్లలో వద్దనుకున్నా నిద్ర వస్తుంది. ఎ. అవును బి. కాదు 6. డ్రైవ్ చేస్తున్నప్పుడో, బస్సులో వెళుతున్నప్పుడో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. నిద్రలేవగానే మీరు ఫ్రెష్నెస్ ఫీల్ కారు. ఎ. అవును బి. కాదు 8. నిద్రలో గురకపెడతారని సన్నిహితులు మీకు చెబుతుంటారు. ఎ. కాదు బి. అవును 9. పనిపై ఏకాగ్రత చూపలేరు. ఎ. అవును బి. కాదు 10. స్లీపింగ్ పిల్స్ తరచూ వాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు 7 దాటితే మీరు నిద్ర కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని అర్థం. ఇందుకు కారణాలేమిటో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.. ‘బి’లు 7 కన్నా ఎక్కువ వస్తే నిద్ర గురించి ఆందోళన చెందనక్కర లేదు. -
అంగన్వాడీ పాలల్లో పురుగులు
తాగలేమంటున్న గర్భిణులు, బాలింతలు కంబదూరు : అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న విజయ పాల ప్యాకెట్లలో పురుగులు ఉంటున్నాయి. దీంతో ప్యాకెట్ తెరవగానే పాలన్నీ కంపుకొడుతున్నాయని మండలంలోని ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు వాపోయారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకూ గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న విజయ పాలు 10 రోజులకే దుర్వసన వస్తున్నాయని దీంతో పాలు తాగలేక పోతున్నామన్నారు. అనేక మార్లు పాల విషయంపై ఐసీడీఎస్ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోడం లేదని ఆరోపించారు. ఇలా అయితే ఎలా తాగాలని ప్రశ్నించారు. దీనిపై ఇన్చార్జ్ సీడీపీఓ హేమను వివరణ కోరగా.. పాలు మూడు నెలల పాటు నిల్వ ఉండలన్న ఉద్ధేశంతో పాలను ఎక్కువగా కాచీ ప్యాక్ చేస్తారని దీంతో ఆ పాలు తాగేటప్పుడు కొంత తేడాగా ఉంటాయని అంతే తప్ప పురుగులు ఉండటం, వాసన రావడం కానీ జరగదన్నారు. దీనిపై ఆరా తీస్తామని చెప్పారు. -
నిద్రపోతే ప్రాణం పోతుంది!
మెదడుకు, శరీరానికి విశ్రాంతినిచ్చేది నిద్ర. ప్రతి ఒక్కరూ రోజూ తగినంత నిద్రపోతేనే ఇతర జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, నిద్రలో అన్నీ మర్చిపోతాం. ఇది దాదాపు అందరికీ వర్తిస్తుంది. కానీ, లియామ్ డెర్బిషైర్ అనే టీనేజ్ యువకుడికి మాత్రం కాదు. ఎందుకంటే అతడికి నిద్రపోవడమంటేనే ప్రాణాలను పణంగా పెట్టినట్టు. అవును లియామ్ నిద్రపోతే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిద్రపోగానే, శ్వాస ఆగిపోయే అరుదైన వ్యాధితో అతడు బాధపడుతున్నాడు. కానీ, ఆ సమస్యతో ఏళ్లుగా పోరాటం సాగిస్తూ, తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అరుదైన సమస్య.. బ్రిటన్కు చెందిన లియామ్ డెర్బిషైర్ అనే యువకుడికి ఓ అరుదైన వ్యాధి ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ లేదా ‘ఆన్డైన్స్ కర్స్’ అంటారు. ఈ సమస్య ఉన్న వారు నిద్రపోతే, ఊపిరి ఆగిపోతుంది. అంటే వారు నిద్రలో శ్వాసతీసుకోలేరు. నిద్రపోగానే, శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో తమ ప్రాణాల్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,500 మంది వరకు మాత్రమే ఉన్నారంటే, ఇది ఎంత అరుదైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. పుట్టుకతోనే.. లియామ్కు ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ సమస్య పుట్టుకతోనే ఉంది. లియామ్ పుట్టిన వెంటనే దీన్ని గమనించిన వైద్యులు, ఆరు వారాలకు మించి బతకలేడని చెప్పారు. ఎందుకంటే దీనికి చికిత్స లేదు. అయితే లియాన్ సమస్య గురించి తెలిసిన తల్లిదండ్రులు, తమ పిల్లాడ్ని బతికించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. లియామ్ నిద్రపోయాక, అతడికి శ్వాస అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లియామ్ వయసు పద్దెనిమిదేళ్లు. ఆరు వారాలకు మించి బతకడం అసాధ్యం అని చెప్పిన వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ, అతడు రోజూ మృత్యువుని ఓడిస్తూనే ఉన్నాడు. నిరంతర పర్యవేక్షణ.. నిద్రపోతే, శ్వాస తీసుకోవడం ఆగిపోయి ప్రాణాలు కోల్పోతాడు లియామ్. ఈ సమస్యను అధిగమించేందుకు అతడి తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య సదుపాయాల్ని కల్పించారు. లియామ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందిస్తారు. దీని ద్వారా గుండె, ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేస్తారు. ఈ సేవల కోసం అతడి బెడ్రూమ్లో ప్రత్యేక పరికరాల్ని అమర్చారు. వీటి ద్వారా నిరంతరం అతడి గుండె పనితీరు, ఇతర అవయవాల్ని పరిశీలిస్తూనే ఉండాలి. ఈ పని చేసేందుకు ఎవరో ఒకరు సుశిక్షితులైన సిబ్బంది పక్కన ఉండాల్సిందే. బాల్యం నుంచి ఈ వైద్య సదుపాయాల ద్వారానే లియామ్ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. లియామ్ ప్రాణాలతో ఉండాలంటే ఎప్పుడూ బెడ్రూమ్లో ఇలాంటి ఏర్పాట్లు తప్పనిసరి. ఎన్ని వైద్య సదుపాయాలున్నా, నిద్ర పోయే విషయంలో లియామ్ జాగ్రత్తగా ఉండాల్సిందే. తల్లిదండ్రులు, వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటూ పర్యవేక్షిస్తుండడం వల్లే ఇదంతా సాధ్యమైంది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
కునుకు పట్టట్లేదా..!
కొందరికి రాత్రి వేళల్లో నిద్రపట్టాలంటే గగనమే. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు అని మనలో చాలామందే అనుకుంటూ ఉంటాం. ఇలా నిద్రపట్టకపోవడానికి జన్యుపరమైన కారణాలు కావొచ్చని చెబుతున్నారు రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. చాలామందికి నిద్రలేమి వారసత్వంగా కూడా రావొచ్చని చెబుతున్నారు. జీవితాంతం తెల్లవారుజామున రెండు మూడు గంటలకు మాత్రమే నిద్రపట్టే మహిళపై చేసిన పరిశోధనల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు అలీనా పార్కే తెలిపారు. సీఆర్వై 1 అనే జన్యువులో తేడా ఉండటం వల్ల నిద్ర తొందరగా పట్టదని, నిద్రకు ఉపకరించే హార్మోన్ మెలటోనిన్ కూడా చాలా ఆలస్యంగా ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. సీఆర్వై1 జన్యువు క్లాక్, బీఎంఏఆర్ వంటి ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రొటీన్లు మరిన్ని జన్యువులు పనిచేసేందుకు కారణమవుతాయని వివరించారు. ఈ జన్యువులో తేడా కారణంగా ఈ రెండు ప్రొటీన్లు ఉత్పత్తి కావని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల్లో జన్యుమార్పులు ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన నిద్ర సమస్యల్లేవని తెలిసింది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని అలీనా అంచనా వేస్తున్నారు. -
నేను నిద్రపోనివ్వనుగా ..!
బీజింగ్: వాహనాన్ని నడిపే సమయంలో నిద్రమత్తు, అలసటకు గురయ్యే డ్రైవర్లను అప్రమత్తత చేసేందుకుగాను నూతన స్మార్ట్ఫోన్ యాప్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. నిద్రమత్తు కారణంగా జరిగే ఘోర ప్రమాదాలను నివారించేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్లు ముందుగా ఈ యాప్ను తమ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం డ్రైవింగ్ చేసే సమయాల్లో యాప్ను ఆన్ చేసి ఫోన్ను డ్రైవర్ తలకు ఎదురుగా.. స్టీరింగ్కు దగ్గర్లో ఉంచాలి. ప్రయాణ సమయంలో ఈ యాప్ డ్రైవర్ల ముఖకవళికలను గమనిస్తూ ఉంటుంది. డ్రైవర్ ముఖంలో ముఖ్యంగా కనురెప్పలు, తల పొజిషిన్ను ఫోన్ కెమెరాతో వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏవైనా మార్పులు కలిగినట్లయితే ఈ యాప్ తక్షణమే పెద్దగా శబ్ధం చేస్తుందని యాప్ను అభివృద్ధి చేసిన చైనాలోని హాంగ్కాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వివరించారు. సెన్సార్లు, ఇతర పరికరాల సహాయం లేకుండా కేవలం స్మార్ట్ఫోన్తోనే ప్రమాదాలను కాపాడవచ్చని, అదనంగా ఖర్చు కూడా అవసరం లేదని వారు పరిశోధకులు తెలిపారు. -
ఉప్పు తగ్గితే... నిద్ర పెరుగుతుంది!
పరిపరిశోధన ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగిన కొద్దీ రక్తనాళాల్లో రక్తపోటు పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తల వల్ల కొత్తగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారికి నిద్రపట్టడం తగ్గుతుంది. అన్నంలో ఉప్పు తగ్గించండి... మంచి నిద్రపడుతుందంటూ భరోసా ఇస్తున్నారు. దీనికి మరో మంచి తార్కాణాన్ని కూడా వారు చూపుతున్నారు. ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగినప్పుడు రాత్రివేళ చాలాసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందట. దాంతో అనేక మార్లు నిద్రాభంగమవుతుందంటున్నారు వారు. అలాగే ఉప్పు తగ్గిస్తే మూత్రానికి వెళ్లాల్సి రావడం తగ్గుతుందని పేర్కొంటున్నారు. దాంతో అంతరాయం లేనందు వల్ల నాణ్యమైన నిద్రపోవడం సాధ్యమంటున్నారు. ఈ అధ్యయనం కోసం అన్నంలో ఉప్పు ఎక్కువగా వేసుకునే 321 మంది జపాన్ పౌరులను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. వారిని 12 వారాలు పరిశీలించారు. ఆ తర్వాత వాళ్లలోనే 223 మందిని ఎంచుకొని, వారి ఆహారంలో ఉప్పు పాళ్లను బాగా తగ్గించారు. దాంతో వీళ్లలో రాత్రివేళల్లో నిద్ర లేవాల్సిన అవసరం రావడం గణనీయంగా తగ్గడం చూశారు. ఆహారంలో ఉప్పు తగ్గించని మిగతా 98 మంది మాటిమాటికీ బాత్రూమ్కు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే మంచి నిద్ర కావాలంటే ఉప్పు తగ్గించాల్సిందేనని సూచిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల నిర్వహించిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ యూరాలజీ వార్షిక సమావేశంలో వెల్లడించారు జపాన్ పరిశోధకులు. -
అశ్వగంధతో మేలైన నిద్ర!
టోక్యో: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే అశ్వగంధ ఉపయోగించండి అంటున్నారు శాస్త్రవేత్తలు. అశ్వగంధ ఆకులలో నిద్రకు ఉపకరించే లక్షణాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అశ్వగంధలోని వివిధ మూలకాలు నిద్రపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయంపై జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ త్సుకుబాకు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన నిర్వహించారు. అశ్వగంధ ఆకుల నుంచి సంగ్రహించిన నీటిలో ట్రైఎథిలీన్ గ్లైకోల్(టీఈజీ) అధికంగా ఉంటుందని, ఇది సాధారణ నిద్రకు ఉపకరిస్తుందని వారు తెలిపారు. ఇన్సోమ్నియా, నిద్ర సంబంధిత రుగ్మతలకు చికిత్స అందించడంలో ఈ పరిశోధనలు ఎంతో సహాయపడతాయని త్సుకుబా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మహేశ్ కె.కౌశిక్ తెలిపారు. భారత్లోని సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదలో అశ్వగంధను ఉపయోగిస్తారు. దీని లాటిన్ పదం సోమ్నిఫెరా (నిద్రను కలిగించేది అని అర్థం). అశ్వగంధ నిద్రకు మేలు చేస్తుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నప్పటికీ, అందులో నిద్రకు ఉపకరించే లక్షణాలున్న మూలకం ఏమిటో ఇప్పటికీ తెలియలేదని పరిశోధకులు తెలిపారు. -
భారతీయుల సగటు నిద్ర ఎంతసేపంటే?
న్యూఢిల్లీ: భారతీయులు రాత్రి సగటున 6.55 గంటలే నిద్రపోతున్నారని, ప్రపంచంలో తక్కువగా నిద్రిస్తున్న వారిలో మనమూ ఉన్నామని ప్రముఖ ఫిట్నెస్ సంస్థ ఫిట్బిట్ చేసిన అధ్యయనంలో తేలింది. 18 దేశాల్లో ఈ సర్వే చేయగా జపాన్లో అత్యంత తక్కువగా ప్రజలు 6.35 గంటలే నిద్రిస్తున్నారని తెలిసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే ప్రజలు సగటున అత్యధికంగా వరసగా 7.25 గంటలు, 7.16 గంటలు, 7.15 గంటలు పడుకుంటున్నట్లు ఫిట్బిట్ పేర్కొంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా మన ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. -
బర్నింగ్ ప్రాబ్లమ్!
ఒకప్పుడు ట్రైన్ ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. బొగ్గును తీసుకొని ఇంజన్ కడుపులో వేస్తే భగభగమని మండి ఛుక్ ఛుక్మని పరుగెడుతుండేవి. మన కడుపూ అంతే. కడుపులో అన్నం పడితే... ఆ అన్నం భగభగా మండి మనల్ని పరుగులు తీసేలా చేస్తుంది. కానీ... వేళకు అన్నం పడకపోతే కడుపే మండిపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో యాసిడ్ తిప్పేస్తుంది. ఈరోజుల్లో వేళకు భోజనం, నిద్ర ఎలాగూ కరువయ్యాయి. దీనికి తోడు పాడు స్ట్రెస్ యాసిడ్ను చిమ్మిస్తూనే ఉంటుంది. కడుపు రగిలిపోతూనే ఉంటుంది... అమ్మో!! ఎసిడిటీ... బర్నింగ్ ప్రాబ్లమ్! మనం తిన్న అన్నం అరగాలంటే యాసిడ్ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా... లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే... కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. ఆ యాసిడ్ మంటలూ, కడుపు ఉబ్బరాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపు నిర్మాణం అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలికను చూద్దాం. అచ్చం కింద ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఒక సన్న మూతి ఉన్న సీసాలా ఉంటుంది మన కడుపు నిర్మాణం. అలాంటి సీసాలో నీళ్లు పోస్తున్నామనుకోండి. ఏమవుతుందో ఊహించండి. కింది నుంచి గాలి బుడగలు బుసబుసమంటూ పైకి వస్తాయి కదా. కడుపులోని అన్నంపై యాసిడ్ పనిచేస్తున్నప్పుడు, అవసరమైన దాని కంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు అది పైకి తంతుంది. అలాగే గ్యాస్ కూడా. ఆ గ్యాస్ పైకి వస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు యాసిడ్ పైకి రావడాన్ని వెట్బర్ప్ అంటారు. ప్రతివారూ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అయితే కొందరికి అది నిత్యకృత్యం. యాసిడ్, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఈ సమస్యకు పేర్లు ఎన్నో... యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, గ్యాస్ కడుపులోనే చిక్కుకుపోయి కడుపు ఉబ్బరంగా ఉండే ఈ సమస్యను సాధారణంగా ఎసిడిటీగా పేర్కొంటాం. అయితే దీనికి వైద్యపరంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి... నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్ఈఆర్డీ), ఎరోసివ్ ఈసోఫేజియల్ డిసీజ్ (ఈఈజీ), గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). కొందరిలో ఎసిడిటీ వల్ల కడుపు మంట, గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం రాత్రివేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా రాత్రివేళల్లో కనిపించే ఆ సమస్యను నాక్చర్నల్ జీఈఆర్డీ అంటారు. కారణాలు గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్ లైఫ్స్టైల్), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్న వెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ∙ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం ∙పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడంతో యాసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ∙జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అదేపనిగా వేపుడు పదార్థాలు తీసుకుంటూ ఉండటం, కొన్నిసార్లు భోజనం తినకపోవడం (మీల్ స్కిప్ చేయడం), తీవ్రమైన పని ఒత్తిడి ∙రాత్రిషిఫ్ట్లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం ∙అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం ∙నిద్రలేమి. మరికొన్ని అంశాలు పైన పేర్కొన్న కారణాలతో పాటు మరికొన్ని అంశాలు సైతం ఎసిడిటీకి దోహదం చేస్తుంటాయి. అవి... ∙స్థూలకాయం ∙ఒళ్లు కదలకుండా ఒకే చోట కుదురుగా కూర్చొని పనిచేసే వృత్తులలో ఉండటం వ్యాయామం చేయకపోవడం ∙తరచూ కాఫీ తాగడం లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ∙చాక్లెట్లు తినడం రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వంటి అంశాలు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి ∙ఇక మద్యం (ఆల్కహాల్), పొగతాగే అలవాటు, మింట్ (పుదీనా బిళ్లలు) చప్పరిస్తూ ఉండటం కూడా ఎసిడిటీకి దోహదం చేస్తుంది. అనర్థాలు ►దీర్ఘకాలికంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుండేవారిలో చాలా ఆరోగ్యపరమైన అనర్థాలు సంభవిస్తుంటాయి. ►జీర్ణాశయం కింది భాగం (లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్) సన్నబడిపోతుంది. ►చాలా కొద్ది మందిలో మాత్రం యాసిడ్ పైకి ఎగజిమ్ముతూ ఉండే జీఈఆర్డీ సమస్య చాలాకాలం పాటు కొనసాగేవారిలో నోటి నుంచి జీర్ణాశయం (పొట్ట) వరకు ఉండే నాళం క్రమంగా పేగు వంటి కణజాలాన్ని పెంపొందించుకుంటుంది. దీన్నే బారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అయితే దీనిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అది క్రమంగా ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. నివారణ ►చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ►స్థూలకాయం ఉన్నవారు తప్పక బరువు తగ్గించుకోవాలి ►బరువు పెరుగుతున్న వారు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి ► పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి ►రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు ►రాత్రి ఆహారం తీసుకోగానే నిద్రకు ఉపక్రమించకూడదు ►రాత్రి భోజనం తర్వాత వీలైతే కాసేపు నడవాలి ► రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి ►రాత్రి పడుకోవడానికి ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు ► కంటినిండా నిద్రపోవాలి ►డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్ను తీసుకోకూడదు. ►పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ ► మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను తలకింద పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఎసిడిటీ నిర్ధారణ పరీక్షలు యూజీఐ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డీసీజ్ను నిర్ధారణ చేయవచ్చు. ఇక దీన్ని నిర్ధారణ చేయడానికి 24 గంటల పీహెచ్ మానిటరింగ్ పరీక్షను గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు. చికిత్స దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. వీటితో తగినంత ఉపశమనం కనిపిస్తుంది. డయాఫ్రమ్ బలహీనంగా ఉండటంతో కడుపు ఛాతీలోకి పొడుచుకువచ్చిన (హయటస్ హెర్నియా) కండిషన్లో ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గృహ వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఎసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ ఉండి ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి ఎసిడిటీ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గుతుండటం, మింగడం చాలా కష్టంగా అనిపించడం, ఎసిడిటీ మందులు తీసుకుంటున్నా ఉపశమనం కనిపించకపోవడం, చికిత్సకు స్పందించక.. లక్షణాలు పెరుగుతూ పోతూ ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి తప్పక డాక్టర్ను సంప్రదించాలి. ఎసిడిటీ వల్ల కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు ఎప్పుడూ దగ్గు వస్తుండటం గొంతు బొంగురుగా అనిపిస్తుండటం ఆస్తమా – పిల్లికూతలు మింగుతున్నప్పుడు గొంతునొప్పి (అయితే దీన్ని గ్యాస్ కారణంగా అని గుర్తుపట్టలేకపోవడంతో.. దగ్గు, గొంతు బొంగురుపోవడం, ఆయాసపడటం, మింగుతునప్పుడు వచ్చే నొప్పికి మామూలుగా తీసుకునే మందులు వాడుతుంటారు. అవి సమస్యను పరిష్కరించకపోగా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి). కొందరిలో ఉదరంలోని భాగాలను కప్పి ఉంచే డయాఫ్రమ్ అనే పొర బలహీనంగా ఉండటంతో కడుపు భాగం ఛాతీలోకి పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. దాంతో ఛాతీలో నొప్పితో ఎసిడిటీ, గ్యాస్ సమస్య బయటపడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. మలం నల్లరంగులో వస్తుంటే అది కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం అవుతుందన్న దానికి సూచనగా భావించి తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. గుండెపోటో, గ్యాస్ ట్రబులో తెలియక తికమక ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని గుండెపోటులా పొరబడే అవకాశం ఉంటుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పే అయినా డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింత వహించాలి. అంతేగానీ... కేవలం ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకోకూడనివి ⇒ స్ట్రాంగ్ కాఫీలు n చాక్లెట్లు ⇒ కూల్ డ్రింక్లు ⇒ ఆల్కహాల్ ⇒ మసాలాలతో కూడిన ఆహారం ⇒పుల్లటి సిట్రస్ పండ్లు ⇒ టొమాటో ⇒ కొవ్వుతో ఉండే ఆహారాలు ⇒ వేటమాంసం (రెడ్మీట్) చేయకూడనివి... ⇒ ఒకేసారి ఎక్కువగా తినేయడం ⇒ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఎసిడిటీని నివారించే ఆహారాలు... ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ’ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది. తీసుకోవాల్సినవి ⇒కాస్త వీక్గా ఉండే హెర్బల్ టీ (అవి కడుపులో యాసిడ్ పాళ్లను పెంచకూడదు) ⇒ తాజా పండ్లు ⇒ పరిశుభ్రమైన మంచినీళ్లు ⇒ నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు ⇒ ఉడికించిన అన్నం, తాజా బ్రెడ్, ఉడికించినమొక్కజొన్న గింజలు ⇒ పియర్పండ్లు, అరటిపండ్లు, ఆపిల్స్, పుచ్చపండు ⇒ ఉడికించిన ఆలూ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారట్, గ్రీన్ పీస్ ⇒ కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు ⇒ కొవ్వు తక్కువగా ఉండే చేపలు, కోడి మాంసం చేయాల్సినవి ⇒ కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినడం ⇒ నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినడం. డాక్టర్ శివరాజు సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
తుగ్లక్ కాలంలోకి..
హ్యూమర్ ప్లస్ ఎవరో పనిలేనాయన ౖటñ ం మెషిన్ని కనిపెట్టాడు. ఇది తెలిసి నాకెంతో ఇష్టమైన తుగ్లక్ పాలనని చూడ్డానికి వెళ్లాను. తుగ్లకంటే నాకెందుకు ఇష్టమంటే ఆయన సర్వాంతర్యామి. అన్ని రాజ్యాల్లోనూ ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది.తుగ్లక్ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా కనిపించారు. కొంతమంది ‘తకిథినథోం’ అని డాన్స్ కూడా చేస్తున్నారు!‘‘మీ ఆనందానికి కారణమేంటి?’’... నాన్ స్టాప్గా స్టెప్పులు వేస్తున్న ఒకాయన్ని అడిగాను.‘‘తుగ్లక్ ప్రభువే’’ అన్నాడు డాన్స్ ఆపకుండా.‘‘ఆయన అంత బాగా పాలిస్తున్నాడా?’’‘‘పాలన, దండన ఇక్కడ రెండూ ఒకటే. ఆనందంగా కనబడకపోతే వంద కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.నేను భయంతో ‘హిహిహి’ అని ఇకిలించుకుంటూ ముందుకెళ్లాను. అక్కడ ఒకాయన ఒంటి కంటితో సూర్యుణ్ణి చూస్తున్నాడు.‘‘ఏం చేస్తున్నావ్’’ అని అడిగాను. ‘‘సూర్యుడిపై ఒక కన్నేసి ఉంచుతున్నాను. ఇక్కడి గూఢచారులు సూర్యచంద్రుల్ని కూడా వదలరు’’ అన్నాడు. ‘‘కళ్లు పోతాయి’’ అన్నాను. ‘‘ఇప్పటికి చాలామందికి పోయాయి. నేను కొత్తగా విధుల్లోకి వచ్చాను’’ అన్నాడు. ఇంకో చోటికి వెళితే ఒకాయన నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ పది మంది భటులు కాపలా ఉన్నారు. నన్ను చూసి, ‘‘నిద్రాభంగం కలిగించకు. ఆయన న్యాయాధికారి’’ అన్నాడో భటుడు.‘‘మీ దేశంలో న్యాయం ఇలా నిద్రపోతూ ఉంటుందా?’’‘‘మెలకువల వల్ల అనర్థాలు ఉన్నప్పుడు, నిద్రపోవడమే న్యాయం. ఆయన నిద్రలో కలలు కని, వాటి ఆధారంగా తీర్పులు చెబుతాడు’’.‘‘కలల్ని బట్టి తీర్పులు చెబుతాడా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘కలలతో తీర్పులేంటి, పాలనలే జరుగుతాయి. చాలాసార్లు కలలే పాలిస్తాయి. వ్యవస్థలు నిద్రపోతేనే వ్యక్తులకు న్యాయం జరిగేది’’.ఇంతలో న్యాయాధికారి గురక కూడా ప్రారంభించాడు. ఆ శబ్ధానికి నాలుగైదు గుర్రాలు బెదిరి పరుగులు తీశాయి. ఒక లేఖకుడు గురకని జాగ్రత్తగా వింటూ ఏదో రాసుకుంటూ ఉన్నాడు. గురకలో రాసుకోడానికి ఏముందో నాకర్థం కాలేదు. అదే అడిగాను.‘‘గురక గాఢతకు చిహ్నం. వినడానికి ఒకేలా ఉన్నా అందరూ ఒకేలా గురక పెట్టలేరు. శబ్ధం శబ్ధిస్తే దాన్ని గురక అంటారు. అర్థం కాకపోయినా శబ్ధానికి అర్థం ఉంటుంది. శబ్ధార్థాలు, అర్ధశబ్ధాలు జమిలి పదాలు’’ అన్నాడు. వాడు చెప్పిందాంట్లో అర్థం వెతకడం కంటే యూనివర్సిటీ థీసిస్ల్లో అర్థాలు వెతకడం ఈజీ.ఇంతలో ఒకాయన సైన్యంతో కవాతు చేస్తూ ఎదురొచ్చాడు. ‘‘ఎక్కడికి?’’ అని అడిగాను.‘‘యుద్ధానికి’’ కవాతు ఆపకుండా చెప్పాడు. ‘‘ఎవరి మీద?’’‘‘ఈ రాజ్యంలో ఎవరు ఎవరి మీదయినా యుద్ధం చేయవచ్చు. రాజు ప్రజలతో, ప్రజలు రాజుతో, ప్రజలు ప్రజలతో. యుద్ధం ఇక్కడ సర్వనామం. యుద్ధం తెలిసి చేస్తే అది ధర్మయుద్ధం. తెలియకుండా చేస్తే అది యుద్ధవ్యూహం అంటారు’’.నేను తికమకగా నడుస్తూ ఉంటే సాక్షాత్తూ తుగ్లక్ ప్రభువే ఎదురొచ్చాడు. ఆనందంగా దండం పెట్టాను. చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు.‘‘చూడ్డానికి ఇంత హూందాగా ఉన్నారే, మీకు పిచ్చి తుగ్లక్ అని పేరెందుకొచ్చింది?’’ అని అడిగాను.‘‘పిచ్చి వాళ్లను పాలించడం వల్ల’’ అన్నాడు. ‘‘అయితే మీకు పిచ్చి లేదా?’’‘‘పిచ్చిలో ఉన్న పిచ్చి గొప్పతనం ఏంటంటే, అది వున్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. ఇలా ప్రశ్నలు అడిగేవాళ్లను మా రాజ్యంలో యాభై కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.భటుడు కొరడా తీసేలోగా నేను టైం మిషన్లో పారిపోయి వచ్చాను.మన కాలంలోకి రాగానే ‘ట్రంపెట్’ మోగింది.మనం ఏ కాలంలో జన్మించినా ఆయా కాలాల్లో తుగ్లక్లు పుడుతూనే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒక తుగ్లక్ని మోస్తూనే ఉంటుంది. – జి.ఆర్.మహర్షి -
మీ సమస్య స్లీప్ పెరాలసిస్ కావచ్చు...
నా వయసు 50. నేను నిద్రలేచాక కొద్దిసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – వెంకటయ్య, డోర్నకల్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువకి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. స్లీప్ పెరాలసిస్ నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు సంభవిస్తుంది. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇందుకు దోహదపడే మరికొన్ని అంశాలు... ∙నిద్రలేమి ∙మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం ∙బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ∙ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం ∙నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం ∙కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్డీకి వాడేవి) ∙తీవ్ర అవమానానికి గురికావడం చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్యాంక్రియటైటిస్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకూ దెబ్బ! నా వయసు 36 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు చాలా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. తరచు పొత్తి కడుపులో నొప్పి. రక్తపరీక్ష చేయించుకున్నాను. షుగర్ ఉన్నట్లు తేలింది. డాక్టర్ను సంప్రదించి మందులు వాడదామని వెళ్తే, ఆయన కొన్ని ఇతర పరీక్షలు చేసి, నేను అక్యూట్ పాంక్రియాటైటిస్తో బాధపడుతున్నానని, వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదమన్నారు. నేను తరచూ మద్యం తాగుతాను. అందుకే ఈ వ్యాధి వచ్చిందా? – డి. దాస్, విజయవాడ పాంక్రియాటైటిస్ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. కానీ దీర్ఘకాలం దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) చిన్నపేగుకు పక్కనే ఉండి జీర్ణప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్ అనే హార్మోన్లను రక్తంలోకి విడదుల చేసి దానిని శక్తిగా మారుస్తుంది. డయాబెటిస్ నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. ఈ రసం ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీన్ని పాంక్రియాటైటిస్ అంటారు. కొన్ని సందర్భాల్లో క్లోమరసంలో ప్రోటీన్లు పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు మితిమీరిన మద్యంపానం, జన్యువుల ప్రభావం, జంక్ఫుడ్ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొన్నేళ్ల తర్వాత బయటపడతాయి. మీకు ఈ వ్యాధి చాలాకాలం నుంచి ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువతో పాటు బరువు తగ్గడం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. మీరు వెంటనే మద్యం పూర్తిగా మానేయండి. దీనిని మొదటిదశలోనే కనిపెట్టకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ లాంటివి చేయాల్సి ఉంటుంది. క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స అందించాలి. లేకపోతే ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ కాస్తా ‘క్రానిక్ పాంక్రియాటైటిస్’గా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి చెడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాలలో మందులతో ఈ జబ్బు తగ్గనప్పుడు ఇప్పుడు అందివచ్చిన అత్యాధునిక చికిత్స సదుపాయం ల్యాపరోస్కోపిక్ సర్జరీ/కీహోల్ సర్జరీ విధానం ద్వారా ఒకవేళ క్లోమగ్రంథి చెడిపోయి ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఈ శస్త్రచికిత్స వల్ల రోగి హాస్పిటల్లో ఉండే వ్యవధి తగ్గడంతో త్వరగానే మీరు మీ సాధారణ వృత్తి వ్యాపకాలు కొనసాగించవచ్చు. -
నైటౌటా..? ఎక్కువ నిద్రపోండి!
టొరంటో: రాత్రంతా మెలుకువగా ఉండి చేయాల్సిన పనులేమైనా మీకు ఉన్నాయా? అయితే అంతకుముందు రోజు కాస్త ఎక్కువ నిద్రపోండి. ఇక మరుసటి రాత్రికి మీ మెదడు పనితీరు మెరుగుపడటంతోపాటు, పనులు కూడా మరింత కచ్చితత్వంతో చేయగలరట. కెనడాలోని కల్గరీ విశ్వవిద్యాలయం వారు పరిశోధన చేసి ఈ విషయం చెబుతున్నారు. పరిశోధనకు వారు 12 మంది పూర్తి ఆరోగ్యవంతులైన, యుక్త వయసులో ఉన్న పురుషులను ఎంపిక చేసుకున్నారు. రెండు వారాల పాటు పరిశోధన చేసి పురుషులు ఎక్కువ సేపు నిద్ర మేల్కొని ఉన్నపుడు వారి మెదడు పనితీరు, అలసట స్థాయిలను పరిశీలించి ఈ విషయం తేల్చారు.