criticism
-
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం! -
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
...ఆ ఒక్కటి తప్ప!
చైనాలో అంకుర సంస్థకు చెందిన కృత్రిమమేథ మోడల్ ఏఐ డీప్సీక్ ఇప్పుడు చాట్జీపీటీ, జెమినీ వంటి దిగ్గజ ఏఐల ఆధిపత్యాన్ని కూలదోస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కృత్రిమ మేథ చాట్బాట్ పారదర్శకత మీద విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. డీపీసీక్ సంస్థ వారి కొత్తరకం అధునాతన చాట్బాట్ ఆర్1 మీద చైనా కమ్యూనిస్టు పార్టీ సెన్సార్షిప్, సమాచార నియంత్రణ ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రపంచదేశాల వినియోగదారులు ఈ చాట్బాట్ను అడిగే ప్రశ్నలకు ఇది ఇస్తున్న సమాధానాలే ఇందుకు ప్రబల నిదర్శనం. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు?. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శ్వేతసౌధం నుంచి ఇప్పుడు వచ్చిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు ఏంటి? ఏదైనా చక్కటి జోక్ చెప్పు అంటూ ఎలాంటి ప్రశ్నలు అడిగినా రెప్పపాటు వ్యవధిలో టకటకా సమాధానాలు ఇస్తున్న డీప్సీక్ చాట్బాట్.. చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటోంది. సమాధానం చెప్పకుండా దాటవేస్తోంది. తియానన్మెన్ స్క్వేర్ ప్రశ్న ఒక ఉదాహరణ చాట్బాట్ సమాధానాల దాటవేతకు వినియోగదారులు ఒక చక్కటి ఉదాహరణను పేర్కొన్నారు. 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో ఆందోళనాకరులపై ప్రభుత్వ అణచివేత కారణంగా వేలాది మరణించారు. ఇదే విషయంపై ప్రముఖ చైనీస్ ఆన్లైన్ సెర్చ్ ప్లాట్ఫామ్ బైదును 1989 జూన్ నాలుగో తేదీన బీజింగ్లో ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే ‘‘గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ ఏడాదిలో జూన్ 4 అనేది 155వ రోజు. అదే సంవత్సరం అధికారులు ‘విప్లవ వ్యతిరేక అల్లర్లను అణచివేశారు’’అని మాత్రమే సమాధానం చెప్పిందిగానీ ఆ వాక్యాల్లో ఎక్కడా కనీసం పేరుకైనా తియానన్మెన్ స్క్వేర్ అనే పదాన్ని ప్రస్తావించలేదు. ఇదే ప్రశ్నను ఇప్పుడు డీప్సీక్ ఏఐ అసిస్టెంట్ ఆర్1 ను అడిగితే ‘ఈ రకమైన ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో ఇంకా నాకు ఖచ్చితంగా తెలియదు’అని సమాధానం చెబుతోంది. ‘‘ఎలా సమాధానం చెప్పాలో తెలియనందుకు క్షమాపణలు’’అని ఒక సందేశం ఇస్తోంది. 2019లో హాంకాంగ్లో ఏం జరిగింది? అని అడిగినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇస్తోంది. ‘‘ఇలాంటివికాకుండా ఇంకేవైనా అడగాలని ఉచిత సలహా ఇస్తోంది. అంతేకాదు చైనా వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడటం లేదు. భారత్–చైనా సంబంధాలు, చైనా–తైవాన్ సంబంధాలు, ఇతర రాజకీయంగా సున్నితమైన అంశాలపై చర్చించేందుకు నిరాకరిస్తోంది. స్వదేశీ సమస్యలపై... వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింల పట్ల కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అడిగినప్పుడు ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రను యథాతథంగా డీప్సీక్ యథాతథంగా అందించిందిగానీ అక్కడ నిత్యకృత్యమైన మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాలను మచ్చుకైనా పేర్కొనలేదు. బలవంతంగా కార్మికులుగా మార్చడం, రీ–ఎడ్యుకేషన్ క్యాంపులు, అంతర్జాతీయ ఆంక్షల గురించి అడిగినా ‘‘ఈ ప్రశ్న నా ప్రస్తుత పరిధికి అతీతమైనది’’అని సమాధానం మాత్రమే ఇస్తోంది. చాట్జీపీటీ, జెమినీ మాత్రం జిన్జియాంగ్ ఘటనలపట్ల అంతర్జాతీయ నివేదికలను వివరంగా అందిస్తున్నాయి. తైవాన్ గురించి అడిగితే ‘‘పురాతన కాలం నుంచి తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా ఉంది. దేశాన్ని చీల్చే ఏ ప్రయత్నమైనా విఫలం అవుతుంది’’అని చెబుతోంది. అంతేకాదు.. 2019 హాంకాంగ్ నిరసనలను కూడా చాట్బాట్ తక్కువ చేసి చూపిస్తోంది. దురుద్దేశాలతో చిన్న చిన్న సమూహాలు ప్రజాస్వామ్యపాలనకు కల్గించిన ఒక అవాంతరంగా నాటి ఉద్యమాన్ని చాట్బాట్ వ్యాఖ్యానించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గురించి అడిగినా సరే.. ‘‘నా ప్రస్తుత పరిధికి మించినది’’అనే ఒకే సమాధానం ఇస్తోంది. చైనాలో సెన్సార్షిప్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివాటిపై నిషేధం గురించి అడిగినప్పుడు అస్పష్టమైన సమాధానాలనే చాట్బాట్ వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల గురించి ప్రశ్నిస్తే ‘‘నాన్షా ద్వీపాలు, వాటి సమీప జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉంది’’అని తానే ఒక అధికారిక విభాగం అన్నంత స్థాయిలో డీప్సీక్ కుండబద్దలు కొట్టిమరీ సమాధానం చెబుతోంది. భారత్ చైనా సంబంధాల గురించి.. ఇండో–చైనా యుద్ధం గురించి ప్రశ్నలను అడిగినప్పుడు డీప్సీక్ తెలివిగా తప్పుకుంటోంది. యుద్ధానికి కారణాలు, పర్యవసానాల గురించిన చర్చలను జాగ్రత్తగా పక్కదారి పట్టించింది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినైలను అడిగితే... యుద్ధం ఎలా? ఎందుకు? జరిగిందనే దానిపై ఆధారాలతో చారిత్రాత్మక కథనాలను అందిస్తున్నాయి. భారత్లో ని ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ గురించి సమాధానమివ్వడానికి డీప్సీక్ నిరాకరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమా? అని అడిగినప్పుడు డీప్సీక్.. ‘‘క్షమించండి, ఇది నా ప్రస్తుత పరిధికి అతీతమైన ప్రశ్న. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం’’అని సమాధానమిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా తమ దక్షిణ టిబెట్ భూభాగంగా భావిస్తోంది. ఇలాంటి చైనా విధానపర నిర్ణయాల్లో తలదూర్చే సాహసం ఈ ఏఐలు చేయట్లేదని అర్థమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్కు చైనా ‘జాంగ్నాన్’అని పేరు కూడా పెట్టింది. ఈ వాదనలపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెల్సిందే. లద్దాఖ్లోని కొన్ని ప్రాంతాలు కూడా తమవేనని చైనా చాన్నాళ్లుగా వాదిస్తోంది. తూర్పు లద్ధాఖ్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపిస్తూ కొత్తగా ‘ప్రామాణిక మ్యాప్’ను సైతం 2023లో చైనా విడుదల చేసింది. ఈ మ్యాప్ను భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తోసిపుచ్చారు. అయితే, అకాŠస్య్ చిన్ గురించి డీప్సీక్ను అడిగినప్పుడు తన పరిధికి అతీతమైందని సమాధానం ఇస్తోంది. ఇక కశ్మీర్ గురించి ప్రశ్నిస్తే.. ‘ఇది భారత్, పాకిస్తాన్ల మధ్య చారిత్రక, రాజకీయ, ప్రాదేశిక వివాదాలతో కూడిన సంక్లిష్టమైన, సున్నితమైన అంశం. ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా చర్చల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా వివాదాల పరిష్కారానికి తాము మద్దతిస్తామని చైనా చెబుతోంది’అని సుదీర్ఘ సమాధానాన్ని ఇచ్చింది.దలైలామా, టిబెట్ గురించి...డీప్సీక్ను దలైలామా గురించి అడిగితే.. టిబెటన్ బౌద్ధమతంలో గణనీయమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా అభివర్ణించింది. ఇక టిబెట్.. పురాతన కాలం నుంచి చైనాలో అంతర్భాగంగా ఉందని చెబుతోంది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినీలను అడిగితే చైనా వైఖరిని అంగీకరిస్తూనే.. టిబెట్ స్వయంప్రతిపత్తి, 1959 నుంచి భారతదేశంలో దలైలామా ప్రవాస జీవితం గురించి కూడా ప్రస్తావిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్ఫ్రూఫ్గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
ఓట్ల కోసం బంగారం పంచుతున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్నికల ప్రధానంగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విమర్శల దాడి పెంచారు. తాజాగా ఆప్ (AAP)అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు.‘ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది.ఓటర్లను ఆకట్టుకునేందుకు జాకెట్లు,షూస్,చీరలు, డబ్బులు పంచుతున్నారు. కొన్ని కాలనీల్లో అయితే బంగారు గొలుసులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.నేను ఓటర్లను కోరేది ఒకటే..ఓట్లను అమ్ముకోకండి. బంగారం,డబ్బులు ఎవరిచ్చినా సరే,అది ఆప్ అభ్యర్థులైనా సరే వారికి ఓటు వేయకండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేజజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ(Bjp) ఎంపీ మనోజ్ తివారీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఎప్పుడో మద్యం ట్రేడర్లకు సోల్డ్ఔట్ అయ్యారు’ అని మండిపడ్డారు. -
ఎలాన్ మస్క్కు ట్రంప్ స్వీట్ వార్నింగ్?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మీద నెగ్గిన డొనాల్డ్ ట్రంప్దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్హౌజ్లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్ మస్క్ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..మస్క్ అధ్యక్షుడని.. ట్రంప్ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్ మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఓ సందేశం వైరల్ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్ మస్క్ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్ మస్క్ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్ ట్రంప్నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్ కాలేదు. ఆ ఇమేజ్ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం. సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్ బిలియనీర్ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా.. డోజ్తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి.. అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్కు చెందిన ఎక్స్(ట్విటర్) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ట్రంప్ ఏన్నారంటే..ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ మనసులో..ఎలాన్ మస్క్(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.చదవండి👉పంజాబ్ పోలీస్ వర్సెస్ బ్రిటన్ ఆర్మీ! -
‘అతడు ఏనాటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు!’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతేకాదు.. రాబోయే కాలంలో ఆయన పాలనలో మస్క్ కీలక పాత్ర సైతం పోషించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే.. అలాంటి వ్యక్తిపై ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ.. ప్రత్యర్థుల విమర్శల నేపథ్యంలో..ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న ఎలాన్ మస్క్ను.. అమెరికాకు షాడో ప్రెసిడెంట్గా పేర్కొంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోంది. ప్రజలచేత ఎన్నుకోబడని ఓ వ్యక్తి(ఎలాన్ మస్క్).. అధికారం చెలాయించేందుకు సిద్ధమైపోతున్నాడు. రాబోయే రోజుల్లో అమెరికా ఆదాయ వ్యవహారాలన్నింటిని ప్రెసిడెంట్ మస్క్ చేతుల మీదుగానే నడుస్తాయి అంటూ ఎద్దేవా ప్రకటనలు చేస్తోంది. ఈ తరుణంలో..ఆదివారం అరిజోనా ఫీనిక్స్లో ఓ కార్యక్రమానికి హాజరైన ట్రంప్కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘‘ఎలాన్ మస్క్ ఏదో ఒకనాటికి అమెరికా అధ్యక్షుడు కాకపోతాడా?’’ అని ప్రశ్నించింది. దానికి ఆయన ‘నో’ అనే సమాధానం ఇస్తూ కారణం వివరించారు.‘‘అతడు అధ్యక్షుడు కాలేడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నా. ఎందుకంటే.. అతను ఈ దేశంలో పుట్టలేదు. కాబట్టి అది ఏనాటికి జరగదు’’ అని చెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశ గడ్డపై పుట్టిన వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడు. ఎలాన్ మస్క్ సౌతాఫ్రికాలో పుట్టాడు.ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీలోనూ మస్క్కు వ్యతిరేక వర్గం తయారవుతున్నట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఫండింగ్ ప్రతిపాదనను తిట్టిపోస్తూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీటే అందుకు కారణం. -
కేటీఆర్పై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి,వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం(అక్టోబర్ 26) స్టేషన్ఘన్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారి అనడం సిగ్గుచేటు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటాం.కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదు. 2014 ముందు నీ ఆస్తులు ఎంత,ఇప్పుడు ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలి. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. 2014లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వలేదా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’అని కడియం హెచ్చరించారు.ఇదీ చదవండి: కేసులకు భయపడం ఏం చేస్తారో చేస్కోండి: కేటీఆర్ -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
‘కామ్ కీ బాత్’ ఏనాడూ చెప్పలేదు
సురాన్కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్ను లోక్సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు. కశ్మీర్ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి జమ్మూకశీ్మర్ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం ‘‘జమ్మూకశీ్మర్కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్కు ప్రచారం సోమవారంతో ముగిసింది. కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి లేదన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో శుక్రవారం(సెప్టెంబర్20) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని విమర్శించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు. అందరం ఏకమై కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి.. ఖర్గే మోదీ కంటే సీనియర్.. ఆయనను అవమానిస్తారా: ప్రియాంకగాంధీ -
Narendra Modi: దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ, కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇండియా, గుజరాత్ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.తొలి భారత్ మెట్రో పేరు మార్పుమెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.మరో మెట్రోలో ప్రధాని ప్రయాణంఅహ్మదాబాద్, గాంధీనగర్లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయంగాంధీనగర్లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. -
రైతులనే మోసం చేస్తారా?: జగదీష్రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గందరగోళంలోకి నెట్టిందని, కరెంట్ విషయంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(సెప్టెంబర్8) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ మంత్రులు సంపాదనలో మునిగిపోయారు. రైతులు మిమ్మల్ని గెలిపిస్తే అదే రైతులను మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారా లేదా స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి’అని డిమాండ్ చేశారు -
ఆ కాలేజీల్లో కేటాయింపులపై రగడ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో ఇటీవల జరిగిన డిగ్రీ లెక్చరర్ల కేటాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో డిగ్రీ లెక్చరర్లను రాత్రికి రాత్రే మల్టీజోన్–1 నుంచి డిస్లొకేట్ చేస్తూ మల్టీజోన్–2కు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. కేవలం ఐదు కాలేజీల నుంచి దాదాపు నలభై మంది డిగ్రీ లెక్చరర్లు మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయిస్తూ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ గత నెల జూలై 19, 24, 29 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వీరంతా మల్టీ జోన్–2లో వారికి కేటాయించిన చోట విధుల్లోకి చేరుతున్న నేపథ్యంలో అసలు వీరంతా ఏయే కారణాలతో డిస్లొకేట్ అయ్యారనే అంశం ఇప్పుడు గురుకుల ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్లో ఎందుకు?టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఉద్యోగ కేటాయింపులన్నీ ఇదివరకు కార్యదర్శిగా పనిచేసిన రోనాల్్డరోస్ సమయంలో జరిగాయి. అప్పట్లో ఉద్యోగ కేటాయింపులన్నీ గజిబిజిగా జరగడంతో వాటిని సరిదిద్దే క్రమంలో డిస్లొకేషన్ చేస్తున్నట్లు గురుకుల అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించకుండా మాన్యువల్ పద్ధతిలో చేయడంతో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు సొసైటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓ సంఘం నేతలకే ప్రాధాన్యం? సొసైటీ కార్యాలయంలో ఉద్యోగుల కేటాయింపులు చేసే విభాగంలోని అధికారుల్లో కొంతమంది.. ఓ ఉద్యోగ సంఘానికి చెందిన వారు కావడంతో కేటాయింపుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కాలేజీల నుంచి 40 మంది లెక్చరర్లను మల్టీజోన్–1 నుంచి మల్టీజోన్–2కు కేటాయించడం... వీరికి గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కలున్న కాలేజీల్లోనే పోస్టింగ్ ఇవ్వడంపైన ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో లెక్చరర్ నుంచి భారీ మొత్తంలో దండుకున్న కొందరు అధికారులు ఈ ఘనకార్యం చేశారంటూ ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతలకే పోస్టింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఆ తొమ్మిది మందికి నచ్చిన చోట పోస్టింగ్ ఎస్సీ గురుకుల సొసైటీలో డిప్యుటేషన్లను సొసైటీ కార్యదర్శి ఇటీవల రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ కార్యాలయంలో పనిచేస్తున్న 12 మందిని వారి సొంత స్థానాలకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇందులో తొమ్మిది మంది ఉద్యోగులకు నచ్చినచోట పోస్టింగ్ ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ ఉద్యోగికి ఏకంగా మహిళా విద్యా సంస్థలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహిళా విద్యా సంస్థలో కేవలం మహిళలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పని పరిస్థితుల్లో అయితే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి అవకాశం కలి్పంచాలి. కానీ కనీస నిబంధనలు పట్టించుకోకుండా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్ వేసిన పిటిషన్ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లోనూ జరుగుతుంది. 17సి ఫామ్లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం. -
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
Lok sabha elections 2024: ‘ఎక్స్–రే’పై మాట మార్చిన రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతోపాటు తీవ్ర విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు.సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక, సంస్థాగత సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడూ చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే ప్రధాని మోదీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.ఆర్థిక, సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులం అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేలి్చచెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వ హయాంలో ఎక్స్–రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్ప్రెస్గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
ప్రజాగళం: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్లో..
కావలి/కోవెలకుంట్ల: ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు. కేసు పెడతారు. తర్వాత సీబీసీఐడీ వారు వస్తారు. వాళ్లు అరెస్ట్ చేస్తారు. జైల్లో పెడతారు. జైల్లో కొడతారు. టార్చర్ చేస్తారు. కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు’ అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని, నిబద్ధతను కించపరిచేలా మాట్లాడారు. ఇక.. అధికారం కోసం మళ్లీ ఆయన ఇస్తున్న ఎన్నికల హామీలపై సెటైర్లు పడుతున్నాయి. అధికారంలోకి వస్తే ‘వర్క్ ఫ్రం హోం’ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్(ఈ స్కాంలోనే ఆయన అరెస్టైంది)తో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి లాభాల బాట పట్టిస్తానన్నారు. ఒకప్పుడు ఏ నోటితో అయితే వలంటీర్లను విమర్శించారో.. ఇప్పుడు అదే వలంటీర్లపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించబోమని చెప్పారు. మళ్లీ అరిగిపోయిన రీల్ వేసి.. హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనన్నారు. హైటెక్ సిటీ, ఔటర్రింగ్రోడ్, విమానాశ్రయం అంటే తన పేరే గుర్తుచేసుకుంటారని చెప్పారు. టెక్నాలజీ, సెల్ఫోన్లు, పవర్ సెక్టార్ తన చలువేనన్నారు. బస్సులోనే పడిగాపులు: సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకుపైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగళం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరికి రూ. 500 వంతున ఇచ్చి తీసుకువచ్చిన జనాలు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు ముఖం చాటేశారని చెబుతున్నారు. ఆటోల్లో తీసుకువచ్చిన జనాలకు ‘రాజరాజేశ్వరి ఐస్’ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్పులను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్లేటప్పుడు స్లిప్ ఇచ్చి రూ.500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. -
నిందలూ... నిజాలూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఈ సంగతి రుజువవుతోంది. మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శ కంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు. పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్య వేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి మన అసంతృప్తిని, అభ్యంత రాన్ని తెలియజేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందో ళన వ్యక్తం చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటాన్ని కూడా ప్రస్తా వించింది. ఇక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరేసరి. అన్ని టికీ అతీతమని భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడకుండా వుండలేరు. అలాగే విమర్శలొచ్చినప్పుడూ, తప్పును ఎత్తిచూపినప్పుడూ పౌరుషం పొడుచు కురావటం కూడా సహజం. పాశ్చాత్య దేశాలు అవసరార్థమో, అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు. అయితే వాటినుంచి వచ్చే విమర్శలు అలా కాదు. అవి అరుదే కావొచ్చుగానీ ఆలోచించదగినవి. ఇందిరాగాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరకాలంలో మేధావులనూ, పౌరహక్కుల సంస్థల నేతలనూ అరెస్టు చేసిన సందర్భాల్లో పాశ్చాత్య ప్రపంచంస్పందించకపోలేదుగానీ... ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకూ, అవి ప్రాతినిధ్యంవహించే రాజ్యాలకూ అంతర్జాతీయంగా ఆమోదనీయత, విశ్వసనీయత వుంటాయి. అయితే అస మ్మతి విషయంలో వాటి వైఖరి ఎలావుందన్నదాన్నిబట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది. దాన్ని పొందాలంటే సంయమనం పాటించటం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా వుండటం అవసరమవుతాయి. అగ్రరాజ్యాలు అన్నాయని కాదుగానీ, మన దేశంలో అంతా సవ్యంగానే వున్నదని భావించగలమా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు రెండేళ్లనుంచి మద్యం కుంభకోణం గురించీ, అందులో కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా పేరు వినిపిస్తూనే వుంది. కానీ తనను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీ వాల్ వాదనకు జవాబిచ్చేందుకు మూడు వారాల వ్యవధి కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో వుండటం ఈడీ తీరుతెన్నులపై అనుమా నాలు రేకెత్తించదా? ఆమధ్య మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనపై అప్రూవర్లు ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ముందే ఆసంస్థ అంగీకరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్టు చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు. దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలంటారు. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. అన్ని పార్టీలూ తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారమిస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ వున్నదంటే నమ్మలేం. మరో మూడు నాలుగు నెలలు ఆగితే ఇందులో కొంపమునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబులేదు. నేరం నిరూపణయ్యేవరకూ నిందితుడు నిర్దోషేనని న్యాయ శాస్త్రం చెబుతుంది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు. పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణలను విస్మరించటం, నీరు కార్చటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రావా? మన దేశంలో ఇప్పటికీ ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థకు విశ్వసనీయత అధికం. దాన్ని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహారశైలి వుండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతలావుంచి దేశ పరువుప్రతిష్ఠలకే భంగం వాటిల్లుతుంది. అమెరికా రెండోసారి కూడా అన్నదనో, జర్మనీ విమర్శించిందనో, ఐక్యరాజ్యసమితి సైతం మాట్లాడిందనో కాదు... చట్టం ముందు పౌరులంతా సమానమన్న రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేదా అన్న అంశంలో ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు. సహ ప్రజాస్వామిక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో బాధ్యతతో మెలగాలనీ, దాన్ని విస్మరించటం సరికాదనీ మన విదేశాంగ శాఖ హితవు పలికింది. కానీ మానవహక్కుల ఉల్లంఘనల అంశంలో మనం కూడా వేరే దేశాల తీరుతెన్నులను విమర్శించిన సందర్భాలున్నాయని గుర్తించాలి. మనం అన్ని విషయాల్లోనూ సక్రమంగానే వున్నామన్న భావన ఇంటా బయటా కలగజేయటం ప్రభుత్వ బాధ్యత. దానికి భిన్నమైన పరిస్థితులుంటే అవి ఎందుకు తలెత్తాయో సమీక్షించుకోవటం అవసరం. -
మోదీవి పచ్చి అబద్ధాలు: ఖర్గే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు. ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు. -
పాతపట్నంలో కొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్ఓఎస్, ఎస్ఎంఎస్ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి. ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ, గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్లో కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్ సర్వే అని రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి. కుమ్ములాటలు కొత్తకాదు.. పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు. -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్కతా: దాదాపు 1,20,000 మందితో కోల్కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్ఎస్పై దాడికి దిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పక్షాన సీనియర్ సభ్యులు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. మొదట సీఎం దాడి.. సీఎం రేవంత్ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్ఎస్లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్మెంట్ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారు కేబినెట్ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్ వ్యాఖ్యానించగా.. కేటీఆర్ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు. దీంతో.. ‘‘గవర్నర్ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్ సెటైర్ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హరీశ్రావుకు మైక్ నిరాకరణపై నిరసన ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్ఎస్ పక్షాన హరీశ్రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్రావుకు మైక్ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్ఎస్ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు. -
నిజం మాట్లాడే సొంత నేతలనూ బహిష్కరిస్తుంది
జైపూర్: రాజస్తాన్లో ఎన్నికల ప్రచారసభల్లో అధికార కాంగ్రెస్పై ప్రధాని మోదీ మరింతగా విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్వాడా జిల్లాలోని కోట్రీ గ్రామంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ కాంగ్రెస్ కుటుంబం ముందు ఎవరైనా నిజం మాట్లాడితే ఇక అంతే. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఒకప్పుడు రాజేశ్ పైలట్ ఆహార సమస్యపై కాంగ్రెస్ కుటుంబాన్నే సవాల్ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజేశ్ పైలటే కాదు ప్రస్తుతం ఆయన కుమారుడు సచిన్ పైలట్ సైతం పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 1997లో పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేసరికి పోటీగా ఎన్నికల్లో నిల్చున్నందుకు రాజేశ్ పైలట్పై పార్టీ కన్నెర్రజేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అశోక్ గెహ్లోత్తో పోటీపడినా అధిష్టానం దీవెనలు సచిన్కు దక్కలేదు’’ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు క్లీన్ చిట్ ‘‘అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు రాష్ట్ర మంత్రులే క్లీన్చిట్ ఇస్తున్నారు. ఇలాంటి పాలనలో మన తల్లులు, కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు రక్షణ ఏది? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. కమలానికి మీరు వేసే ఒక్కో ఓటు కాంగ్రెస్ను తుడిచిపెట్టేందుకు దోహదపడుతుంది’’ అని మోదీ అన్నారు. అంతకుముందు దుంగార్పూర్ జిల్లాలోని సాగ్వారా పట్టణంలో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు సచిన్ పైలట్ కూడా ఖండించారు. ఆయన సొంత పార్టీపై దృష్టి పెడితే మంచిదని సచిన్ సూచించారు. -
పంజాబ్ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
చండీగఢ్: పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు. మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు. కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది. -
సామాన్యుడి సమయం... సోదాహరణం
ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న సోదాలు, హడావుడి ఈ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్లు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీని నిలువరించేందుకు పటిష్టమైన ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే బదులు.. అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద రోజూ సాధారణ జనం నుంచి సైతం నిత్యం నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతా చేస్తే.. ఈ తతంగమంతా వృథా ప్రయాసగానే మారుతోందని, చాలావరకు కేసుల్లో అసలు దోషుల్ని గుర్తించడం లేదని, కొన్ని కేసులు విచారణకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 90% డబ్బులు వెనక్కే.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం.. ఎన్నికల అనంతరం నూటికి 96 శాతం తిరిగి సంబంధిత వ్యక్తులకు అప్పగించేశారు. ప్రస్తుతం కూడా వివిధ చెక్పోస్టుల్లో స్వాదీనం చేసుకుంటున్న కేసుల్లో 90 శాతం డబ్బును జిల్లా స్థాయి కమిటీలే తిరిగి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నా..ఈ సందర్భంగా చిన్నా చితక వ్యాపారులు, సాధారణ జనాన్ని రోజుల తరబడి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ప్రలోభాల కోసం రాజకీయ పక్షాలు అత్యధికంగా హవాలా, ప్రైవేటు బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుండి భారీగా రవాణా చేస్తున్నా..అలాంటి వాటిని వదిలి పోలీసులు సాధారణ జనం మీద పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాధారణ ట్రాఫిక్ సాఫీగా ముందుకు సాగిపోయే వీల్లేకుండా రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. పన్ను కట్టించుకుని వదిలేస్తున్న ఐటీ 2014–2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ స్వా«దీనం చేసుకున్న డబ్బు – శిక్షలు తదితర అంశాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్ఐటీ ద్వారా సమాచారం సేకరించగా, పది లక్షల లోపు అయితే జిల్లా అధికారులు, పది లక్షలు దాటితే ఐటీ అధికారులు పరిశీలించారు. ఐటీకి సంబంధించి ఒక వేళ పన్ను కట్టకపోతే పన్ను కట్టించుకుని, మరికొన్ని కేసుల్లో అడ్వాన్స్ పన్ను కట్టించుకుని ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.హవాలా ద్వారా భారీ ఎత్తున వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకున్న మెజారిటీ కేసుల్లో ఇంకా న్యాయ విచారణలే మొదలు పెట్టకపోవటంతో ఒక్కరికీ శిక్ష పడలేదు. అడ్వాన్స్ ట్యాక్స్లు.. సాగని విచారణలు ♦ 2018 ఎన్నికల్లో జనగామ వద్ద రూ.5.8 కోట్లతో వెళుతున్న కంటెయినర్ను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు (576–2018) చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు నమోదు చేసినా.విచారణ ముందుకు సాగలేదు. ♦ ములుగు పరిధిలో పట్టుకున్న రూ.19.95 లక్షల కేసులోనూ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆధారాలున్నా ఆ దిశగా విచారణ ముందుకు సాగటం లేదు. ♦ 2104 ఎన్నిక సమయంలో బేగంబజార్ పోలీస్స్టేషన్ పరిధిలో విశ్వాస్కుమార్ అనే వ్యక్తి నుండి స్వాదీనం చేసుకున్న రూ.8.38 లక్షల డబ్బును ఐటీ విభాగానికి అప్పగించగా, అందులోనుండి రూ.3.38 లక్షలు అడ్వాన్స్ట్యాక్స్గా కట్టించుకుని మిగిలిన డబ్బును తిరిగి అప్పగించారు. ♦ 2018లో కొడంగల్ నియోజకవర్గం మిర్జాపూర్లో రూ.17.5 కోట్ల నగదు ఉందని సమాచారం వస్తే ఐటీ అధికారులు దాడి చేసి నగదు స్వాదీనం చేసుకున్నారు. తీరా రూ.51 లక్షలు మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ♦ 2018లో పోలీసులు రూ.79.23 లక్షలు (500 డినామినేషన్) స్వాదీనం చేసుకుని కేసు నమోదు (190–2018) చేశారు. ఎన్నికలయ్యాక..అందులో రూ.23,000 మాత్రమే ఒరిజినల్ నోట్లుగా తేల్చి మిగిలినవి నకిలీగా పేర్కొన్నారు. రాజకీయ లింకులు పరిశీలించాలి ఎన్నికల సమయంలో యంత్రాంగం స్వాధీనం చేసుకునే మొత్తం రూ.10 లక్షల లోపు అయితే జిల్లా కమిటీకి, రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖకు పంపుతున్నారు. కాగా జిల్లా స్థాయి కమిటీలు తగు రశీదులు సమర్పిస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రతి వ్యక్తి వెనుక రాజకీయ లింకులను లోతుగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీకి వెళ్లిన డబ్బు విషయంలో కూడా రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలు, ఇతరత్రా లోతుల్లోకి వెళ్లకుండా..కేవలం నల్లధనమా లేక తెల్లధనమా అనేది చూస్తున్నారు. ఒక వేళ నల్లధనమైతే పన్ను కట్టించుకుని వదిలేస్తున్నారు. డబ్బును తీసుకువెళుతున్న కారణాన్ని విశ్లేషించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక భారీ మొత్తాలు దొరికిన సమయాల్లో రాజకీయ పార్టీ ల కార్యకర్తలు, వారు నియమించిన కూలీలు దొరికిన సందర్భాల్లో లోతైన విచారణలు చేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేయాలని సూచిస్తున్నారు. -
అలవికాని హామీలు.. అబద్ధపు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: అలవికాని హామీలు.. అబద్ధాల ఆరోపణలు.. చరిత్ర వక్రీకరణలతో కాంగ్రెస్ సభ సాంతం పరనిందగా సాగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్కే ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగసభపై హరీశ్రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టే కాంగ్రెస్ నాయకులు బూటకపు హామీలను ఇస్తున్నారని, ఆ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు అన్నీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే..రాష్ట్రానికో మేనిఫెస్టో కాకుండా, హైదరాబాద్ సభలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా.. ఎందుకు చేయలేదు? తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా అని హరీశ్రావు ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఇలానే బూటకపు హామీలిస్తే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని, 2019లో 52 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వలేదని, యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని చెప్పారు. కావాలంటే పేపర్లు తిరగేసి తెలుసుకోవాలని సూచించారు. ‘ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా? గుజరాత్ ఎన్నికలపుడు భారత్ జోడో యాత్ర గుజరాత్కు ఎందుకు వెళ్లలేదు..? హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి మద్దతివ్వడం మీకు తెలియదా? ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధించడం మీకు కనిపిస్తలేదా’అని హరీశ్రావు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ అవడం అన్నది ప్రపంచానికి తెల్సిన విషయమేనని అన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, పోరాడి గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారో సమాధానం చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
ఏయూ క్యాంపస్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చౌకబారు విమర్శలు చేయడం పవన్కళ్యాణ్ మానుకోవాలని ఏయూ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ ఘాటుగా బదులిచ్చారు. ఏయూ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. ఉద్యోగులు, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేన అధినేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు అందించే ర్యాంకింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు, ఆచార్యుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ♦ ర్యాంకింగ్లో పాల్గొనే విద్యా సంస్థల సంఖ్యపై కూడా వర్సిటీల ర్యాంకులు ఆధారపడి ఉంటుంది. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి కేవలం వెయ్యి విద్యా సంస్థలు పాల్గొంటే, 2023లో 2,478 సంస్థలు పాల్గొన్నాయి. ♦ తొలి 100 స్థానాల్లో నిలిచే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2.5 నుంచి 4 మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ర్యాంకింగ్ విధానంలో ఐఐటీలు, కేంద్రీయ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కొంతమేర ప్రయోజనం పొందుతున్నాయి. ♦ గతంలోనే ఐఐటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆచార్య రాంగోపాల్ ర్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిమితులు (పారామీటర్స్) వేరుగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. ♦ ఇక ఏయూలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య 2018తో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 2023లో ఏయూ విద్యార్థులు పొందిన అత్యధిక వార్షిక వేతనం రూ.84.5 లక్షలు. 2018లో విద్యార్థులు సాధించిన అత్యధిక వార్షిక వేతనం కేవలం రూ.22 లక్షలు మాత్రమే. ♦ కేంద్ర విశ్వవిద్యాలయాల కంటే మిన్నగా ఏయూలో ఏర్పాటుచేసిన టెక్ స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 124కి పైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏయూ స్టార్టప్–ఇంక్యుబేషన్ సెంటర్ 14వ ర్యాంకు సాధించింది. తొలి 13 స్థానాల్లో ఐఐటీలు మాత్రమే నిలిచాయి. ♦ జాతీయ విశ్వవిద్యాలయాల తరహాలో 18 చెయిర్ ప్రొఫెసర్లు కలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. దీనిపై ఉన్న నమ్మకంతో నవరత్న కంపెనీల నుంచి అమెరికాలో స్థిరపడిన భారతీయులు, ఏయూ పూర్వవిద్యార్థులు ఐఐటీ ఢిల్లీ తరహాలో ఇక్కడ చెయిర్ ప్రొఫెసర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా.. వర్సిటీలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని పవన్ చదవడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఏయూకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్య, వివేకంలేని వ్యక్తిలా పవన్ విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూ క్యాంపస్ : జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు విద్య, వివేకంలేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ విమర్శించారు. ఏయూపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏయూను శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హర్షించేలా పవన్ మాట్లాడాలని హితవు పలికారు. నిజమైన విద్యావంతుడు, సంస్కారవంతులెవరూ ఏయూని ఉద్దేశించి ఇలా మాట్లాడరన్నారు. పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వు.. ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు భారతీయ విద్యావ్యవస్థపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన పవన్కు తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి ఆయన సమాధానం చెప్పాలని షారోన్రాజు సవాల్ విసిరారు. అవి.. ♦ ఏయూకి 2018లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.150 కోట్లు నిధులను పసుపు–కుంకుమ పథకానికి ఎందుకు మళ్లించారు. అప్పుడు మీరు దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు? ♦ ఏయూ సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జ్ఞానభేరి సభను చంద్రబాబు నిర్వహించారు. వాటిని ఎందుకు తిరిగి చెల్లించలేదు? ♦విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలపై 1996 నుంచి 2006 వరకు, తిరిగి 2014 నుంచి 2018 వరకు ఎందుకు నిషేధం విధించారు? ♦పోలమాంబ ఆలయం పక్కనే, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.300 కోట్లు విలువైన స్థలాన్ని ఇటీవల ఏయూ స్వాధీనం చేసుకుంది. ఇంతకాలం ఈ స్థలం ఎవరి గుప్పిట్లో ఉందో మీకు తెలుసా? ♦ 2019–2023 మధ్య 200 మందికిపైగా ఆచార్యులు ఏయూలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఏయూ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు, స్కోర్ను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. దార్శనికత కలిగిన రాష్ట్ర సీఎం ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేయడంవల్లే ఇది సాధ్యపడింది. ఈ విషయం మీకు తెలుసా? -
రైళ్లలో అరకొరగా ఆన్బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్రోల్స్ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్ప్రెస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా షార్ట్సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
OceanGate: మళ్లీ ఛలో టైటానికా? సిగ్గుండాలి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్వాటర్ టూరిజం కంపెనీ ఓషన్గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్తో మళ్లీ ఊదరగొడుతోంది. అట్లాంటిక్లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్గేట్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్లోనా? మరేయిత సబ్మెర్సిబుల్లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్ను తొలగించింది ఓషన్గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్ల తరహా రిమోట్కంట్రోల్తో టైటాన్ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు! -
‘మోదీపై విద్వేషంతోనే ఇదంతా..’
ఢిల్లీ: తొమ్మిదేళ్ల మోదీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలన్నీ అబద్ధాల పుట్టలేనని బీజేపీ దుయ్యబట్టింది. కేవలం మోదీపై కాంగ్రెస్కు ఉన్న విద్వేషం నుంచి అవి పుట్టుకొచ్చాయని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ దాడి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఫ్యాక్ట్ చెక్ పేరిట.. పలు గణాంకాలను వివరిస్తూ మీడియా సమావేశం నిర్వహించారాయన. విమర్శలు చేసే హక్కు వాళ్లకు(కాంగ్రెస్ను ఉద్దేశించి..) ఉంది. కానీ, ఇది విమర్శల నుంచి ఉత్పన్నమయిన ప్రశ్నలు కావు. కేవలం ప్రధానిపై కాంగ్రెస్కున్న ద్వేషంతోనే తెరపైకి వచ్చాయి. అది వాళ్లకు ఉన్న ఒక రోగం అని విమర్శించారు. మోదీ హయాంలో భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ఈ ప్రశ్నలన్నీ ఫ్రస్టేషన్లో చేస్తున్నవే. కరోనా టైంలో వైఫల్యాలపై కాంగ్రెస్ నిలదీయడంపైనా ఆయన స్పందించారు. ‘‘అది అబద్దం మాత్రమే కాదు.. కాంగ్రెస్ సిగ్గులేనితనం తారాస్థాయికి చేరిందనడానికి నిదర్శనం’’ అని మండిపడ్డారాయన. ప్రపంచం మొత్తం భారత్ కరోనా సమయంలో వ్యవహరించిన తీరును అభినందించాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇక్కడి ఫ్రంట్లైన్ వారియర్లను తీవ్రంగా అగౌరవపరుస్తోందని, దానిని ఖండిస్తున్నామని అన్నారాయన. అలాగే.. దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి 9 ఏళ్లలో దేశ వృద్ధిని వివరిస్తామని తెలిపారాయన. ఇదీ చదవండి: అది రాజదండం కాదు! -
ఖమ్మం పిట్టలదొర పొంగులేటి: పువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని.. చేసిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని మంత్రి అజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి, మంత్రి పువ్వాడ అజయ్కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి పువ్వాడ ఆజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు... అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు పువ్వాడ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా. పిట్టల దొర కూడా. ఫ్రస్టేషన్లో ఉన్న పొంగులేటి.. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడు. అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదు నేను. ఖమ్మం లో తనపై బచ్చాగాడినెవిడైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడు. ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది’’ అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నువ్వు సీఎం అవుతావని మురిసిపోతున్నావు. నువ్వు సీఎం ఏంటయ్యా?.. సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలి. వందల కోట్లు దోచుకున్నావు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా? బిడ్డా అన్నీ ఇంకా ఉన్నాయి. ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు. డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం. ఖమ్మం రాజకీయ చరిత్ర లో పుట్టిన వాడే పువ్వాడ. ఆ పువ్వాడ కు పుట్టిన వాడే ఈ పువ్వాడ. నీ పక్కన ఉన్న అరాచక శక్తుల గురించి ముందు మాట్లాడు. ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుష్యులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?. నువ్వు ఎంపీగా ఖమ్మంకు చేసిన మేలు ఏంటో చెప్పగలవా?. పిచ్చోడా.. ఖమ్మం లో లైట్లు పెడితే అభివృద్దా? అంటున్నావు. ఒక్క లైట్లు కాదు అన్ని రంగాలలో అభివృద్ది చేశా. ఎవరో బచ్చాను నిలబెట్టి నాపై గెలిపిస్తా అంటున్నావు. రా.. ఎవడినైనా ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. నీ చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. మదన్ లాల్ ని నువ్వు ఓడించలేదా?. ప్రతీ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల కు వెన్నుపోటు పొడవలేదా? అంటూ పువ్వాడ, పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతిపెడతాం -
కాంగ్రెస్ ఖజానా నింపుతున్న గహ్లోత్
భరత్పూర్(రాజస్తాన్): రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. శనివారం రాష్ట్రంలోని భరత్పూర్లో బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో షా ప్రసంగించారు. ‘ ఓవైపు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ అధిష్టానం ఖజానాను సీఎం గహ్లోత్ నింపేస్తుంటే మరోవైపు సరైన కారణం లేకుండానే సచిన్ పైలట్ ధర్నాకు కూర్చుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పైలట్ ఎంతగా చెమటోడ్చినా లాభం లేదు. ఎందుకంటే పార్టీ ఖజానాను నింపేస్తూ అధిష్టానం దృష్టిలో పైలట్ కంటే గెహ్లాట్ కొన్ని మెట్లు పైనే ఉన్నారు. రాష్ట్రాన్ని గెహ్లాట్ అవినీతి అడ్డాగా మార్చారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి ఆ ధనంతో పార్టీ ఖాతా నింపుతున్నారు. దిగబోనని గహ్లోత్ సీఎం కుర్చీపై భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి సీఎం కుర్చీ నాదేనని పైలట్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీరిద్దరూ అనవసరంగా అధికారం కోసం పోరాడుతున్నారు. వాస్తవానికి ఈ దఫా అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘ వారసత్వ రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ గహ్లోత్ ప్రభుత్వం పనిచేసింది. కుల రాజకీయాలను రాజేసింది. బుజ్జగింపుల్లో టాప్ మార్కులు ఈ ప్రభుత్వానికే పడతాయి. రాష్ట్రంలో రెండు డజన్లకుపైగా పేపర్లు లీక్ అయ్యాయి. అయినా ఇంకా మీకు అధికారం కావాలా గహ్లోత్ జీ ? లీకేజీలో సెంచరీ కొడతారా ఏంటి ?. రాష్ట్ర ప్రజలకు మీరిక అక్కర్లేదు. ఈసారి మూడింట రెండొంతుల సీట్లు మావే. మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గెల్చేది మేమే’ అని షా ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇటీవలే రాహుల్ బాబా దేశమంతటా నడుస్తూ భారీ యాత్ర ముగించారు. కాంగ్రెస్కు లబ్ధి ఏమేరకు చేకూరుతుందని నన్ను పాత్రికేయులు అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందిగా’ అని షా అన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత... అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. వారు అతడిని రెండో అంతస్తులో వైద్యుడి వద్దకు వెళ్లాలని ఓపీ రాసిచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. అక్కడ స్ట్రెచర్ లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టి లాక్కెళ్లారు. అక్కడ ఉన్నవారు అది చూసి ఆశ్చర్యపోయారు. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. అతడిని రెండో అంతస్తుకు చేర్చాక అక్కడ కూడ స్ట్రెచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవటంతో అక్కడి నుంచి కూడా వైద్యుడి గది వరకు కాళ్లు పట్టి లాక్కెళ్లారు. స్ట్రెచర్, వీల్చైర్ లేకపోవడం, లాక్కెళుతున్నా సిబ్బంది పట్టించుకోక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. -
‘ఈనాడు’ పైత్యం: అటకాయించడమే కాక.. ఎదురుదాడా!?
హనుమాన్ జంక్షన్ రూరల్: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉంది ఈనాడు పైత్యం చూస్తుంటే. చట్ట ప్రకారం.. నిబంధనల ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు విధులు నిర్వర్తించినప్పటికీ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిపై ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పడక గదిలోకి చొరబడి దౌర్జన్యం’ అంటూ ఆ పత్రిక మంగళవారం సంచికలో అచ్చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజానికి.. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కల్యాణిని అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులపై నిందితురాలి కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఆమెను అరెస్టుచేసేందుకు వచ్చినట్లు ఎస్ఐ జి. రమేష్బాబు వారికి చెప్పారు. కానీ, ఈ సమయంలో సాయికల్యాణి కుటుంబ సభ్యులు ఎస్ఐతో పాటుగా వచ్చిన మహిళా కానిస్టేబుళ్లపై దురుసుగా వ్యవహారిస్తూ నానా దుర్భాషలాడారు. అరెస్టుకు సహాకరించాల్సిందిగా ఎస్ఐ రమేష్బాబు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులపై ఆమె కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సాయికల్యాణిని అరెస్ట్చేసి తీసుకువెళ్లేందుకు యత్నించిన పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు. ఇలా దాదాపు గంటసేపు అరెస్టుచేయటానికి వచ్చిన గన్నవరం పోలీసులకు చుక్కలు చూపించారు. చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు అయినప్పటీ ఎంతో ఓర్పుతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహారించిన పోలీసులు ఆమె దుస్తులు మార్చుకుని, బ్రష్ చేసుకునేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కానీ, ఈనాడు పత్రిక ఈ వివరాలేమీ ప్రస్తావించకుండా ఏకపక్షంగా పోలీసుల తీరును అభ్యంతరకర రీతిలో విమర్శించడం శోచనీయం. అయినా, తప్పు చేసిన వారి కోసం పోలీసులు ఎక్కడైనా వెతుకుతారు. ఇందులో తప్పేముంది?. -
Donald Trump: అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు
ఫ్లోరిడా: క్రిమినల్ అభియోగాలు ఎదుర్కోవడమే కాదు.. కోర్టు విచారణకు హాజరయ్యే క్రమంలో అరెస్టయిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కారు. అయితే కోర్టు విచారణ అనంతరం ఈ కేసుపై మీడియాతో మొదటిసారిగా మాట్లాడిన ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. బైడెన్ పాలనలో అమెరికా నానాటికీ నాశనం అవుతోందంటూ మండిపడ్డారాయన. శృంగార తారతో అనైతిక ఒప్పందం కేసులో ఆయన కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లగా.. పోలీసులు అరెస్ట్ చేసి మరీ కోర్టులో హాజరు పరిచారు. తానే నేరమూ చేయలేదని ట్రంప్ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ మాన్హట్టన్ కోర్టులో సుమారు గంటపాటు విచారణ జరిగిన తర్వాత.. ట్రంప్ నేరుగా ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఇంటికి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని ఏనాడూ ఊహించలేదు. ఇలా జరగాలని కోరుకోవడం లేదు కూడా. నేను చేసిన నేరమల్లా ఒక్కటే. దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న శక్తులకు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడమే అని ట్రంప్అన్నారు. అమెరికా నరకంగా మారి నాశనం వైపు అడుగులేస్తోందని, అది చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనపై ఈ కుట్ర జరుగుతోందని, దానిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసంటూ ఈ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ట్రంప్ డిసెంబర్లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావొచ్చని తెలుస్తోంది. మిస్టర్ ట్రంప్.. యూ ఆర్ అండర్ అరెస్ట్ -
TS: అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఈ ప్రభుత్వం.. కంటోన్మెంట్ సాయన్న విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శించిందని? మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు చనిపోతే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష? అని కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారు బండి సంజయ్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విషయంలో.. సర్కార్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారాయన. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన వ్యక్తి సాయన్న. ఆయన మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఒక శాసనసభ్యుడికి.. అదీ పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమన్నారు. గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సినీ రాజకీయ ప్రముఖుడు హరికృష్ణ లాంటి వాళ్లకు అధికారిక లాంఛనాలతో కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయమన్నారు. కేసీఆర్ స్పందనేది? సాయన్న అంత్యక్రియల ఉదంతం మరవక ముందే.. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజానీకానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలుకన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తూ.. కేసీఆర్ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. -
ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం: ఈటల
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో దుమారం రేగిన తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించని పరిణామంపై ఆయన అనుచరులు నిన్న(సోమవారం) స్మశానంలో నిరసన వ్యక్తం చేయగా.. మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోక్యంతో అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి. తాజాగా ఈ పరిణామంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం.. కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఈటల పేర్కొన్నారు. ఫ్యూడల్ మనస్తత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ను దేవుడు కూడా కాపాడలేడని, బీజేపీ గెలుపుఖాయమని ఎమ్మెల్యే ఈటల జోస్యం పలికారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసగించారు. ఏడేళ్లుగా దళితులకు ఒక్క ఎకరం భూమిని కూడ ఇవ్వకుండా దళితులను కేసీఆర్ మోసగించాడు.ధరణీ పేదల కొంపముంచింది.. పేదలను బిక్షగాళ్లుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్ ది. 2018 నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగరవేతదారులుగా మారటం కేసీఆర్ పుణ్యమే!. మద్యం విపరీత అమ్మకాలతో ఎంతో మంది మహిళల పుస్తెలతాడులు తెగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రెటేరియట్ నోటీసులిచ్చింది. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధర్మాసనం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ చేసిన విమర్శల పట్ల బీజేపీ సభ్యులు నిశికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీటిపై లోక్సభ సెక్రెటేరియట్ రాహుల్కు లేఖ రాసింది. -
తప్పో.. ఒప్పో.. అంగీకరించడం మీ విధి: నారిమన్
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే.. ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్ కిరెన్ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్ అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారీమన్.. ఆగస్టు 2021లో రిటైర్ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు. -
బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత
షిల్లాంగ్: రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, ఇతరత్రా హామీలను ఎన్నికల వేళ ప్రధానంగా ప్రస్తావించే బీజేపీ ఆ తర్వాత మరోలా మాట్లాడుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మేఘాలయలోని ఉత్తర గారో హిల్స్ జిల్లాలో బుధవారం ఆమె భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘బీజేపీకి రెండు ముఖాలుంటాయి. ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తూ ఒక ముఖం మాట్లాడుతుంది. ఆ తర్వాత మరో ముఖం మరోలా మాట్లాడుతుంది. కాషాయ పార్టీ ఏలుబడిలోని రాష్ట్రాలకే కేంద్ర నిధులు దక్కుతాయి. ఇలాంటి పార్టీకి ఓటేయకండి’’ అని పిలుపునిచ్చారు. అస్సాం, త్రిపురలతోపాటు మేఘాలయలోనూ పార్టీని పటిష్టంచేయడంపై మమత దృష్టిసారించారు. మేఘాలయలో 2021 నవంబర్లో కాంగ్రెస్లోని 17 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరడం విశేషం! గత డిసెంబర్లో రాష్ట్రంలో పర్యటించిన మమత.. స్థానిక మహిళలకు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ కొద్దిరోజుల్లోనే 3.14 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు! -
చీరకట్టులో.. ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు
సామాజిక కళంకం(Social Stigma)..ను పక్కకు తోసేసి రాణిస్తున్న వాళ్లను ఎందరో!. అలా అన్ని రంగాల్లో మహిళల జోరు కూడా కనిపిస్తోంది. ఫిట్నెస్ మీద మక్కువ పెంచుకున్న రీనా సింగ్ వర్కవుట్ వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు ఒక ప్రత్యేక కారణ ఉంది కూడా!. ‘‘ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ గులాబీ రంగు చీరలో ఆమె వర్కవుట్స్ చేసిన వీడియో.. ఇన్స్టాగ్రామ్లో దుమ్మురేపుతోంది. చీరకట్లు వర్కవుట్స్కి లక్షల్లో వ్యూస్, లైకులతు రాబట్టింది ఆ వీడియో. స్వతహాగా ఫిట్నెస్ ట్రైనర్ అయిన ఆమె.. అలా రకరకాల బరువులెత్తడం, ఎక్సర్సైజులు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33 మిలియన్ వ్యూస్, పది లక్షల లైకులను దాటేసి వీడియో దూసుకుపోతోంది. అయితే.. అదే సమయంలో ఆమె తీరును తప్పుబడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు ప్రమాదరకరంతో కూడుకున్నవని ఆమెకు సూచిస్తున్నారు. ఇలా చీరకట్టులో చేయడం సాహసమేనని, స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రమాదకరంగా మారొచ్చని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వీడియోలు చేయడం ఆపేయాలంటూ ఆమెను మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) -
AP: జీవీఎల్కు మంత్రి అమర్నాథ్ చురకలు
సాక్షి, తాడేపల్లి: బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలటించారు. విభజన హామీలపై అసలు జీవీఎల్కు అవగాహన ఉందా? అని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విభజన హామీలపై జీవీఎల్ చర్చకు రావాలి. స్టీల్ ప్లాంట్కి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయన సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటి వ్యక్తి. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వ్యక్తి జీవీఎల్ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. -
ఆ హీరోయిన్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నయనతార
సౌత్ సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నయనతార. తాజాగా ఆమె కనెక్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న నయనతార గతంలో ఓ హీరోయిన్ తనపై చేసిన కామెంట్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాళవిక నయనతారను ఉద్దేశిస్తూ.. 'సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ ఓ హాస్పిటల్ సీన్ నటించడానికి మేకప్, లిప్స్టిక్, హెయిర్స్టైల్ ఇలా చక్కగా అలంకరించుకుంది. చావు బతుకుల్లో ఉన్నప్పుడు అలా అందంగా రెడీ అయి ఎవరైనా సీన్ చేస్తారా?ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండలి కదా' అంటూ విమర్శించింది. తాజాగా నయన్ మాళవిక చేసిన కామెంట్స్పై స్పందించింది.. ''ఆమె పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఆసుపత్రి సీన్లో నేను మేకప్, హెయిర్స్టైల్లో కనిపించడం ఆమెకు తప్పుగా అనిపించింది. సినిమాల విషయంలో రియలిస్టిక్, కమర్షియల్ అనే తేడా ఉంటుంది. రియలిస్టిక్గా కనిపిస్తూనే లుక్స్పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ చిత్రాల్లో దర్శకుడి సూచనల ప్రకారం నటించాల్సి ఉంటుంది. అంతెందుకు యాడ్స్లోనూ హీరోయిన్స్ను ఇలాగే స్టైలిష్గా చూపిస్తారు'' అంటూ మాళవికకు చురకలింటించింది. -
నిష్పక్షపాతంగానే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం మీడియా చిట్చాట్లో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు షెడ్యూల్ అంతా సవ్యంగానే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెండు వారాల గ్యాప్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికత.. గర్వించదగ్గ వారసత్వం. మేము 100 శాతం నిష్పక్షపాతంగా ఉన్నాం అని ప్రకటించారాయన. కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మాటల కంటే చర్యలు, ఫలితాలు ఎక్కువగా మాట్లాడతాయి. కొన్నిసార్లు, కమిషన్ను విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందాయి. ఈ కేసులో థర్డ్ అంపైర్ లేడు. కానీ ఫలితాలు సాక్ష్యంగా ఉంటాయి అని రాజీవ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు గుజరాత్ షెడ్యూల్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన(దశల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి) ముగిసే వరకు ఈసీ ఎదురు చూసిందని, తద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆటంకం ఎదురు కాకుండా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా కాంగ్రెస్-బీజేపీలు ఈసీ తీరుపై పరస్పరం ట్వీట్లు చేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి జనవరి 8వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది. మోడల్ ప్రవర్తనా నియమావళి 38 రోజుల పాటు అమలులో ఉంటుంది, ఇదే అతి తక్కువ వ్యవధి. అది ఢిల్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు.. అసెంబ్లీ కాలపరిమితికి కౌంటింగ్ డేకి మధ్య 72 రోజుల గ్యాప్ ఉందని గుర్తు చేశారాయన. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, అసెంబ్లీ చివరిరోజు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఒకేసారి వెలువడడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, సమతుల్యంగా వ్యహరించాల్సిన అవసరం మాకు ఉంది అని సీఈసీ వెల్లడించారు. మోర్బి ప్రమాద బాధితుల కోసం వెలువడే ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండవచ్చా? అనే ప్రశ్నకు.. ఏదైనా నిర్ణయం వల్ల స్థాయి ఆటంకం ఏర్పడితే, ఎన్నికల సంఘం చర్య తీసుకుంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. -
చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం
భోపాల్: ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి భారత్కు రప్పించిన చీతాల విషయంలో రోజుకో విమర్శ వినిపిస్తోంది. చీతాల రాకతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఓ ప్రచారం వెలుగులోకి రావడంతో బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు నిరసనలకు దిగారు. చీతాల కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన చీతల్(మచ్చల జింక)లను మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో వదిలినట్లు ప్రచారం మొదలైంది. దీంతో రాజస్థాన్కు చెందిన బిష్ణోయ్ తెగ నిరసనలకు దిగింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది ఆ తెగ. చీతల్ అనేది అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలమని, అధికారులు తీసుకున్న అర్థంపర్థం లేని నిర్ణయంపై పునరాలోచన చేయాలని వాళ్లు ప్రధానిని లేఖలో కోరారు. అంతేకాదు.. హర్యానా ఫతేబాద్ కలెక్టర్కు మెమోరాండం సమర్పించి.. మినీ సెక్రటేరియెట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే.. మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. రాజస్థాన్ నుంచి చీతల్ను తెప్పించలేదని, ఎందుకంటే.. అలా తెప్పించాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కునో నేషనల్ పార్క్లోనే 20వేలకు పైగా చీతల్స్ ఉన్నాయని, కాబట్టి, బయటి నుంచి తెప్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా.. నమీబియా(ఆఫ్రికా దేశం) నుంచి తెప్పించిన ఎనిమిది చీతాలను సెప్టెంబర్ 17వ తేదీన గ్వాలియర్ కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేశారాయన. ఛత్తీస్గఢ్(అప్పట్లో మధ్యప్రదేశ్) కొరియా జిల్లాలో 1947లో భారత్లో చివరి చీతా కన్నుమూసింది. ఆపై 1952 నుంచి చీతాలను అంతరించిన జాబితాలో చేర్చింది భారత్. ఇదీ చదవండి: డివైడర్పై పడుకోవడమే వాళ్లు చేసిన పాపం! -
ఏం రాహుల్.. ఏం మాట్లాడుతున్నావ్.!
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత సీనియర్ పొలిటీషియన్ గులాం నబీ ఆజాద్ మాటల తుటాలు పేలుస్తున్నారు. రాజ్య సభ సీటు దక్కనందుకు, సౌత్ ఎవెన్యూలోని బంగ్లా ఆయన చేజారినందుకు ఫ్రస్టేషన్లోనే ప్రేలాపనలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఆజాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇవాళ కాంగ్రెస్కు రాజీనామా తర్వాత తొలిసారిగా మీడియా ఎదుటకు వచ్చారు ఆజాద్. ‘‘కాంగ్రెస్లో ఇప్పుడున్న 90 శాతం మంది కాంగ్రెస్సీలు కారు. కొందరు కాలేజీల నుంచి వచ్చారు.. మరికొందరు సీఎంల దగ్గర అటెండర్ పనులు చేసుకునేవాళ్లు. వాళ్ల వాళ్ల చరిత్ర గురించే సరిగా తెలియనివాళ్లతో నేనేం వాదించాలి. విమర్శలకు ఏం సమాధానం ఇవ్వాలి. జీ-23 గ్రూప్ అనేది ఏర్పడక ముందు.. ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియాగాంధీకి లేఖ రాశాను. అప్పుడేం చేశారు?.. కేసీ వేణుగోపాల్తో మాట్లాడుకోమని నాకు చెప్పారు. నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో.. ఆయన(వేణుగోపాల్ను ఉద్దేశిస్తూ..) స్కూల్కు వెళ్లే వాడు.. ఓ బచ్చా అని చెప్పా. అప్పుడు ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి రణ్దీప్ సూర్జేవాలాతో మాట్లాడమని సలహా ఇచ్చాడు. నేను జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో.. రణ్దీప్ తండ్రి పీసీసీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన నా కింద పని చేశారు. అలాంటి వ్యక్తి కొడుకుతో చర్చించాలా? ఏమయ్యా రాహుల్ గాంధీ.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రాహుల్పై మండిపడ్డాను అని నాటి ఘటనను ఆజాద్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో.. రాహుల్ గాంధీపై ఆజాద్ ఒకింత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడా? ఒకవేళ అతను కాకుంటే.. ఇంకెవరు కాంగ్రెస్ అధ్యక్షుడైనా సరే ఆ వ్యక్తి కచ్చితంగా రాహుల్ గాంధీకి బానిస కావాల్సిందే.. అతని ఫైల్స్ మోయాల్సిందే అంటూ ఆగ్రహం వెల్లగక్కారు ఆజాద్. ఈ వయసులోనూ పార్టీ కోసం రోజులో 20 గంటలపాటు పని చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందని ఆజాద్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో.. సీనియర్ల మీద ఆరోపణలు గుప్పించాడు. తనకెవరూ మద్దతు ఇవ్వడం లేదంటూ పేర్కొన్నాడు. ఏ విషయంలో మద్దతు ఇవ్వాలి?. ‘చౌకీదార్ చోర్ హై’ అనడంలోనా?.. ఓరోజు రాహుల్ నన్ను.. ‘బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు ఎందుకు చేయలేద’ని ప్రశ్నించాడు. దానికి నేను ‘‘అది నీ భాష. నాది కాదు. ఇందిరా గాంధీ, వాజ్పేయిపైన ఏనాడూ ఇలాంటి ఆరోపణలు చేయాలని మాకు చెప్పలేదు. రాజీవ్ గాంధీ సైతం ప్రతిపక్షాల ఇళ్లకు వెళ్లమని చెప్పేవారు. అలాంటి సంస్కారం వాళ్లు నేర్పించారు. ఆ బాటలో ఉన్న మేం.. నువ్వు చెప్పే విమర్శలు చేయలేనని ఖుల్లాగా చెప్పాను’’ అని రాహుల్తో జరిగిన గత సంభాషణలను మీడియాతో పంచుకున్నారు ఆజాద్. కాంగ్రెస్ నిండా అధ్యక్ష ఎన్నికలతో విషం నిండుతోందని, ‘గాంధీ’ కుటుంబం పట్ల అయిష్టత పేరుకుపోతున్నా.. సల్మాన్ ఖుర్షీద్, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు రాహుల్నే అధ్యక్షుడిగా కోరుకోవడం దురదృష్టకరమని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ..రాహుల్ను మించినోళ్లు లేరు! -
సంచలనం.. జమ్ము కశ్మీర్ ఓటర్లుగా నాన్-లోకల్స్ కూడా!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. స్థానికేతరులను సైతం ఓటర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు.. ఓటు హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. సీఈవో హిర్దేశ్ కుమార్ స్వయంగా చేసిన ఈ ప్రకటన.. ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది అక్కడ. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్-లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత.. తిరిగి రాజకీయ స్థిరత్వం నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఎన్నికల నిర్వహణ వీలైనంత త్వరలోనే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ఇప్పుడు ఈసీ ఓటర్లుగా స్థానికేతరులనూ గుర్తిస్తామని ప్రకటించడం విశేషం. ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు.. ఇలా బయటి నుంచి వచ్చి జమ్ము కశ్మీర్లో ఉంటున్న వాళ్లకు ఓటు హక్కు దక్కనుంది. అంతేకాదు వాళ్లు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ‘నివాసం’ అనే ఆప్షన్ తప్పనిసరేం కాదని, మినహాయింపు ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ ఈసీ వెల్లడించింది. ఇక జమ్ము కశ్మీర్లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటు హక్కుకు అర్హులేనని, వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 1, 2022 వరకు పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు వచ్చే జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని, నవంబర్ 25వ తేదీ లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. అందునా.. ప్రస్తుతంఉన్న ఓటర్లు లిస్ట్లో 76 లక్షల మందే ఉన్నారు. ఈసీ తీసుకున్న స్థానికేతరులకు ఓటు హక్కు నిర్ణయంతో మరో పాతిక-ముప్ఫై లక్షలకు పైగా కొత్త ఓటర్లు.. జమ్ము కశ్మీర్ ఓటర్ల కింద జమ కానున్నట్లు అంచనా. ఇక ఈసీ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని జమ్ము కశ్మీర్ స్థానిక పార్టీలు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఓటు రాజకీయమంటూ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. GOIs decision to defer polls in J&K preceded by egregious gerrymandering tilting the balance in BJPs favour & now allowing non locals to vote is obviously to influence election results. Real aim is to continue ruling J&K with an iron fist to disempower locals. https://t.co/zHzqaMseG6 — Mehbooba Mufti (@MehboobaMufti) August 17, 2022 Is the BJP so insecure about support from genuine voters of J&K that it needs to import temporary voters to win seats? None of these things will help the BJP when the people of J&K are given a chance to exercise their franchise. https://t.co/ZayxjHiaQy — Omar Abdullah (@OmarAbdullah) August 17, 2022 ఇదీ చదవండి: అదానీకి జెడ్ కేటగిరి భద్రత -
ఇక భయంతో బతకాల్సిందేనా?: బిల్కిస్ బానో ఆవేదన
తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను రెమిషన్ కింద విడుదల చేయడంపై బిల్కిస్ యాకూబ్ రసూల్ అలియాస్ బిల్కిస్ బానో స్పందించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న నమ్మకాన్ని ఈ నిర్ణయం చెదరగొట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తనను మోసం చేసిందని, ఆ నిర్ణయం బాధించిందని, ఇంతకాలం అభద్రతాభావంతో బతికిన తాను ఇకపైనా భయంభయంగా బతకాల్సిందేనా? అంటూ ప్రశ్నిస్తున్నారామె. ‘‘న్యాయస్థానాలు పవిత్రమైనవి నమ్మాను. కానీ, ఏ మహిళకైనా న్యాయపరిధిలో ఇలాంటి ముగింపు దక్కుతుందా?. నేను వ్యవస్థను నమ్మాను. అందుకే గాయంతోనే జీవించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. నా ఈ బాధ, అస్థిరమైన విశ్వాసం నా ఒక్కదానిదే కాదు.. న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి స్త్రీది అని ఆమె పేర్కొన్నారు. ఇది అన్యాయం. నా భద్రత, బాగోగుల గురించి పట్టింపులేదన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలిని సంప్రదించాలన్న స్పృహ గుజరాత్ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. గుజరాత్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా బతికే నా హక్కును నాకు ఇవ్వమని. నన్ను, నా కుటుంబానికి రక్షణ కల్పించమని అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. జైల్లో ఉన్నా భయంగానే.. బిల్కిస్ బానో పోరాటం పద్దెనిమిదేళ్ల పైనే కొనసాగింది. ఈ సమయంలో ఆమె ఒక చోట స్థిరంగా ఉండలేదు. దోషుల కుటుంబాల నుంచి హాని పొంచి ఉండడంతో అజ్ఞాతంలో కొన్నాళ్లు, ఆపై క్రమంతప్పకుండా ఇళ్లను మారుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిందితుల విడుదలతో ఆమెలో మరింత ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది శోభా గుప్తా చెప్తున్నారు. నిందితుల విడుదల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారామె. గుజరాత్ వీహెచ్పీ ఆఫీస్లో సన్మానం అందుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు దోషులు బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఈ కేసులో 2008, జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి బాంబే హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాన నిందితులైన జశ్వంత్భాయ్, గోవింద్భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే.. కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును సమర్థించి బాంబే హైకోర్టు. 1992 పాలసీ ప్రకారం.. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో నిందితులను రెమిషన్ కింద విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. రేపిస్టులు.. నరహంతకులను విడుదల చేయడంపై రాజకీయ నేతల దగ్గరి నుంచి సామాన్యుల దాకా సోషల్ మీడియాలో గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెమిషన్ పాలసీ 2014 ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దోషులకు 2008లో శిక్ష పడిందని, ‘సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం 1992 పాలసీ ప్రకారం’ వాళ్ల విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇదీ చదవండి: అసలు ‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా? -
కాకులను కొట్టి గద్దలకు వేయడమేనా మీ పని: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో.. ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నామన్నది చేదు నిజమని పేర్కొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పత్రిక ప్రకటన ద్వారా తీవ్ర స్థాయిలోనే కేటీఆర్ స్పందించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి?.. బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా?. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా. రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా?. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్లకేమో పన్ను రాయితీలా?. మీకు దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదు. నైజీరియా కన్నా అధ్వానం! ఇటీవల ప్రధాని మోదీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!. ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మోదీకి ముందున్న రూ.14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు.రూ. అసలు ఇన్నేసి లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారు?. ఇదీ చదవండి: మునుగోడు వైపు పోనే పోను-వెంకట్రెడ్డి అంత అప్పుతో ఏం జేసిన్రు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని ఈమధ్యనే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది. మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా?. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె. లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారు. ఆదేశిక సూత్రాలే పరమావధి, కానీ.. మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక "సంక్షేమ రాజ్యం" అని నేను ప్రధానమంత్రికి గుర్తుచేయదలిచాను. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు భరోసా ఇస్తాయి. ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజం అని కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మోదీకి ప్రత్యామ్నాయం ఆ ముఖ్యమంత్రేనా? -
కాల్పుల వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన
సాక్షి, హైదరాబాద్/మహబూబ్నగర్: తెలంగాణ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని మరీ ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. ‘‘నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన. @TelanganaCMO @KTRTRS @TelanganaDGP @CPHydCity @AmitShah తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. పోలీసు తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి.... Minister firing.... pic.twitter.com/d8iiHwBeZb — Aravind Sharma (@MAravindSharma1) August 13, 2022 -
జెండా పేరుచెప్పి ఇలా చేస్తారా.. కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్
ఢిల్లీ/ఛండీగఢ్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రాలు కూడా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను తమ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ వేడుకలు పేదలకు భారంగా పరిణమించాయంటున్నారు బీజేపీ నేత వరుణ్ గాంధీ. బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర వ్యతిరేక స్వరం వినిపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరం అంటూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారాయన. రేషన్ కోసం వెళ్తున్నవాళ్లు.. జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామంటూ డీలర్లు బలవంతం చేయడం సిగ్గుచేటంటూ వరుణ్ గాంధీ ఆరోపించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో బతుకుతున్న 'తిరంగ'.. నిరుపేదల ఆహారాన్ని లాగేసుకోవడం సిగ్గుచేటన్నారు. आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा। राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है। हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV — Varun Gandhi (@varungandhi80) August 10, 2022 హర్యానా కర్నల్లో జాతీయ జెండా కోసం 20రూ. డిమాండ్ చేయడం, అలా కొంటేనే రేషన్ ఇస్తామని డీలర్లు బలవంతం చేయడం.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ రేషన్ డిపో ఓనర్ లైసెన్స్ రద్దు చేశారు. రేషన్ డిపోలో జాతీయ జెండాలు అమ్మకానికి ఉంచిన మాట వాస్తవమేనని, అయితే.. కొనుగోలు చేయాలని రేషన్ లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు అంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్గా మువ్వన్నెల జెండాలను ఉంచాలన్న ప్రధాని పిలుపునకు మంచి స్పందనే లభిస్తోంది. మరోవైపు యూపీ పిలిభిత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఈ మధ్యకాలంలో కేంద్రంపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే కన్షెషన్ రద్దు చేయండం, ప్యాకేజీ ఫుడ్ ఐటెమ్స్ మీద జీఎస్టీ, అగ్నిపథ్ నియామక ప్రకటన.. ఇలా దాదాపు చాలావరకు కేంద్ర నిర్ణయాలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు -
హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్
సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చూసి.. జీవితం అంటే అలా ఉండాలి అనుకుంటారు సాధారణ వ్యక్తులు. కానీ, అనుకున్నంత సులభంగా, సౌకర్యవంతంగా సినీ తారల జీవితం ఉండదు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 'దఢక్' సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. అలాగే వాళ్ల అమ్మ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నిజానికి ప్రతి క్షణం అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేపేది. అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాటంది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అని తెలిపింది. 'ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?' అని అడిగిన ప్రశ్నకు.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొద్దనే చెప్పింది. 'నా జీవితం మొత్తం చిత్రపరిశ్రమతోనే గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకుంటున్నట్లుగా స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటీ?' అని అమ్మ ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను హీరోయిన్గా చేయడం నాకిష్టమని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి కాదనలేక ఆమె ఒప్పుకున్నా.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కొంతమంది చేసే వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది' అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది'' అని జాన్వీ కపూర్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. అనంతరం తన సినిమాలు, నటనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ 'నేను శ్రీదేవి కూతురు కావడం వల్లే నాకు ఎక్కు విమర్శలు వస్తున్నాయి. నా మొదటి నాలుగు సినిమాలను ఆమె 300 చిత్రాలతో పోల్చి చూస్తున్నారు. నేను ఆమెలా నటించలేకపోవచ్చు. కానీ ఈ వృత్తిని ఆమెకోసం చేయాలనుకుంటున్నాను. నేను ఆమెను గర్వపడేలా చేయకుండా అలా వదిలేయలేను' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. -
ఆడుకున్న తండ్రి భుజాల మీదే శవంగా..
భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన. మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్వాహా హెల్త్ సెంటర్కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది. బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు. A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp — Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022 ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. -
యాసిన్ మాలిక్ తీర్పుపై విమర్శా?.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు. చదవండి: Yasin Malik: యాసిన్కు మరణశిక్ష ఎందుకు వేయలేదు! -
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సాధిస్తున్న వరుస విజయాలు, సాగిస్తున్న పోరాటాలు చూస్తుంటే.. తెలంగాణలో పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని, బీజేపీని తప్పక గెలిపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని, కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని విమర్శించారు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పాటు జరగలేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలనను ఊడబెరికి, ఈ పాలనకు అంతం పలికే పోరాటాన్ని తెలంగాణ సోదర, సోదరీమణులు, ప్రజలు ముందుకు తీసుకెళతారని భావిస్తున్నానన్నారు. గురువారం ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయం వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ఎత్తకుండానే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కుటుంబ పాలకులే దేశద్రోహులు.. కుటుంబ పాలన చేసేవారే దేశ ద్రోహులు. ఇలాంటి పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. దేశంలో కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతి మయం. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2023లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి తెలంగాణను తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కుట్రకు కుటుంబ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏమి చేసినా ప్రజల హృదయాల నుంచి మాపై ప్రేమాభిమానాలను, మా పేరును మీరు తుడిచి వేయలేరు. రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దేశ ప్రజల కలలు సాకారం అవుతున్నాయ్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్లను ప్రోత్సహించాం. ప్రపంచంలోనే మూడో స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ ఉద్భవించింది. వంద యూనికార్న్ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ పురోగతిలో టెక్నాలజీ పాత్ర ముఖ్యమైనది. ఇందులో తెలంగాణ యువత, సాంకేతిక నిపుణుల నైపుణ్యం మరువలేనిది. కేంద్ర పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు..నెగ్గేవాళ్లు నేను శాస్త్ర, సాంకేతికతలను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. 21వ శతాబ్దంలోనూ తెలంగాణలో అంధవిశ్వాసాలున్న వారున్నారు. వారితో తెలంగాణకు ప్రయోజనం కలగదు. వీరు తెలంగాణకు న్యాయం చేయలేరు. గుజరాత్ సీఎంగా ఉన్నపుడు కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందన్నారు. నేను ఢంకా భజాయించి మరీ పదేపదే ఆ ప్రదేశాలకు వెళ్లివచ్చాను. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి ప్రధాని మొదట తెలుగులో మాట్లాడుతూ.. ‘పట్టుదలకు, ధృఢ సంకల్పానికి, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు..’ అంటూ సభికులకు అభివాదం చేశారు. ‘నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దెత్తున అపూర్వమైన రీతిలో స్వాగతించారు. ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు, స్నేహానికి కృతజ్ఞతలు. 2013లో నేను ప్రధానిని కాదు. అయినా అప్పుడు హైదరాబాద్లో నా సభ జరిగితే దానికి టికెట్టు కొనుగోలు చేసి మరీ నా ప్రసంగం వినడానికి వచ్చారు. ఇదొక అద్భుతం. ఇది యావత్ దేశంలో పరివర్తనకు కారణమైంది. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ విధంగా తెలంగాణకు, హైదరాబాద్కు తనదైన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జెండా నాటాలి. గవర్నర్, తలసాని స్వాగతం విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బీజేపీ అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, సీఎస్ సోమేశ్కు మార్, డీజీపీ మహేందర్రెడ్డి స్వాగతం పలికారు. సంజయ్ ఇంకా పోరాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పలుకరించిన మోదీ.. ‘పాదయాత్ర ఎలా సాగుతోంది? ఆరోగ్యం ఎలా ఉంది ?’ అంటూ ప్రశ్నిం చారు. ‘ఇంకా పోరాడు..’ అని అన్నారు. సభా వేదికపై మూడువరసల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఆసీనులయ్యారు. స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తలసాని వీడ్కోలు సందర్భంగా కనబడలేదు. -
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్పై.. సోషల్మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. విమర్శలు
Rahul Gandhi Night Club Video:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన నైట్క్లబ్ వీడియో ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపుతోంది. నైట్పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ కాంగ్రెస్ నేతపై విరుచుకుపడుతోంది. వ్యక్తిగత టూర్ అయినప్పటికీ.. వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇన్చార్జి అమిత్ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతపై, ఆ పార్టీ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం నిన్న(సోమవారం) రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్లోని మారియట్ హోటల్లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్ ఉదాస్ ధృవీకరించారు. భూమ్ ఉదాస్.. మయన్మార్లో నేపాల్ అంబాసిడర్గా ఉన్నారు. Noiiice 😎 pic.twitter.com/jTvUyVuE7A — Ajit Datta (@ajitdatta) May 3, 2022 ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ ‘దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్ నేపాల్ టూర్పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఆయుధంగా చేసుకుంది. Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent. Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate... pic.twitter.com/dW9t07YkzC — Amit Malviya (@amitmalviya) May 3, 2022 హానీ ట్రాప్.. విమర్శలు దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్ గాంధీ ఓ మహిళతో క్లోజ్గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్ నుంచి వివరణ రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ను ముంచుతూ.. యువరాజు విలాసాల్లో తేలుతున్నాడంటూ పలువురు సెటైర్లు సైతం పేలుస్తున్నారు. -
అమిత్ షాకు ఏఆర్ రెహమాన్ కౌంటర్!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘హిందీ కామెంట్లు’ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. ఒకరినొకరు హిందీలోనే పలకరించుకోవాలని, ఇంగ్లిష్లో సంభాషించుకోవడానికి వీల్లేదంటూ వ్యాఖ్యానించారు షా. ఈ కామెంట్లపై వ్యతిరేకత మొదలుకాగా, మరోవైపు రాజకీయమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సదరు వ్యాఖ్యలపై ఒక ఫొటోతో అమిత్ షా కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రియమైన తమిళం..’ అంటూ భాషాభిమానం ప్రదర్శిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారాయన. ఆ ఫొటో తమిళ దేవతకు చెందింది. ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మూడింటిలోనూ ఆయన ఆ ఫొటోను షేర్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేసిన, మనోమణియమ్ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని పదాలను ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్ రెహమాన్. మన ఉనికికి మూలం ప్రియమైన అని 20వ తమిళ కవి భరతిదశన్ రాసిన ‘తమిళియక్కమ్’ కవితా సంకలనంలోని ఓ లైన్ను ఆ ఫొటోపై క్యాప్షన్గా ఉంచారాయన. pic.twitter.com/W9PDIwHigy — A.R.Rahman (@arrahman) April 8, 2022 అయితే రెహమాన్ ఇలా భాషకు సంబంధించిన చర్చల్లో.. కామెంట్ చేయడం ఇదేం కొత్త కాదు. జూన్ 2019లో ప్రతి రాష్ట్రంలోనూ మూడు భాషల పాలసీని తప్పనిసరి చేయాలంటూ కేంద్రం ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆ టైంలో ‘అటానమస్’ కేంబ్రిడ్జి డిక్షనరీలోని పదం అంటూ ట్వీట్ చేసి.. తమిళనాడు అటానమస్ #autonomousTamilNadu హ్యాష్ట్యాగ్ ద్వారా పెద్ద చర్చకే దారి తీశారు. అలాగే హిందీ కంపల్సరీ అనే ప్రతిపాదనను సైతం కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు.. మంచి నిర్ణయం. హిందీ తమిళనాడులో తప్పనిసరేం కాదు అంటూ మరో ట్వీట్ చేశారు ఏఆర్ రెహమాన్. AUTONOMOUS | meaning in the Cambridge English Dictionary https://t.co/DL8sYYJqgX — A.R.Rahman (@arrahman) June 4, 2019 గురువారం జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే మాధ్యమమే అధికార భాష అని, దీని వల్ల హిందీకి ప్రాధాన్యత పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని చెప్పారు. అంతేకాదు ఇకపై దేశం ఐక్యంగా ఉండాలంటే ఇతర రాష్ట్రాల వాళ్లు హిందీలోనే మాట్లాడుకోవాలంటూ సూచించారాయన. ఈ వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం దేశ ‘బహుత్వ గుర్తింపు’ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని, షా కామెంట్లు ఐక్యత్వాన్ని దెబ్బ తీసేలానే ఉన్నాయని పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. చదవండి: సారూ అదేం పని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్! -
థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్.. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి థ్యాంక్యూ అంటూనే సెటైర్లు వేశారు. ఈ ఉదయం నుంచే వరుస ట్వీట్లతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శనాత్మక పోస్టులు చేస్తున్నారు. తెలంగాణలో 2019 నుంచి 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని, మహిళలకు ఊరట ఇచ్చామని ప్రధాని పేరిట ఒక ప్రకటన వెలువడింది. దానిని ప్రస్తావిస్తూ.. ‘మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం ఏమేర సహకారం అందించిందో చెప్పాలంటూ ప్రధాని మోదీని నిలదీశారు. ఏ మాత్రం సాయం అందించకుండా.. ప్రధాని హోదాలో ఇలా ప్రచారం చేసుకోవడం తగదని కేటీఆర్ అన్నారు. Reiterating some of your previous statements Modi Ji 👇 ❇️ “Failure of Union Govt” ❇️ “Burden on States” ❇️ “Petrol & Diesel prices will come down” ❇️ “Arrogance of Power” ❇️ “Unsympathetic to needs of Poor” pic.twitter.com/Yuj4T6jRO1 — KTR (@KTRTRS) March 31, 2022 అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ధరల పెంపు, ఇతర సమస్యలపై స్వయంగా మోదీ చేసిన ట్విటర్ పోస్టుల తాలుకా స్క్రీన్ షాట్లను షేర్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు అదే జరగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ట్వీట్ ద్వారా నిలదీశారు. ఆపై పెట్రో ధరల పెంపు వార్తాంశాన్ని ప్రస్తావిస్తూ ‘థ్యాంక్యూ మోదీ జీ, అచ్చెదిన్’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు కేటీఆర్. అంతటితోనే ఆగలేదు.. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్కు అర్థం.. ధరల్ని డబుల్ చేయమే అనే అర్థం అంటూ చేసిన ఓ పోస్ట్ను రీట్వీట్ చేశారు కేటీఆర్. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బిజేపి వాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదు. 👉పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం 👉కార్పొరేట్ సంస్థల సపదన డబుల్ చేయడం 👉నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం 👉గ్యాస్ ధరలు డబుల్ చేయడం @KTRTRS @krishanKTRS — K€€®TH! (@KeerthiRachana) March 31, 2022 -
ఇమ్రాన్కు విషమ పరీక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం విషమ పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ సోమవారం ఇమ్రాన్ ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతకుముందు సభ ఆమోదించింది. దీంతో, ప్రభుత్వంపై సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పీఎంఎల్ నేత షెహబాజ్ మాట్లాడుతూ. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విశ్వాసం లేదని సభ తీర్మానించింది. క్లాజ్–4 ప్రకారం ఇమ్రాన్కు పదవిలో ఉండే అర్హత లేదు’అని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ సభను 31వ తేదీకి ప్రొరోగ్ చేశారు. కాగా, నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ పెట్టేందుకు 3నుంచి 7 రోజుల వరకు గడువుంటుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో అవిశ్వాసంపై ఓటింగ్ మార్చి 4వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. పార్లమెంట్లో మొత్తం సభ్యులు 342 మంది కాగా, అవిశ్వాసం గట్టెక్కేందుకు ఇమ్రాన్కు 172 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. అయితే, ఇమ్రాన్ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మందితోపాటు అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది సభ్యులు ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
ఐఐటీ మద్రాస్లో కీచకపర్వం
చెన్నై: ఐఐటీ మద్రాస్లో ఎస్సీ మహిళా రీసెర్చ్ స్కాలర్పై లైంగిక వేధింపుల పర్వం నాలుగేళ్లు కొనసాగింది. పరిపాలనా విభాగానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2016లో రీసెర్చ్ స్కాలర్గా చేరిన మహిళపై తోటి స్కాలర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీశాడు. అతనికి ఇద్దరు ప్రొఫెసర్లు వంతపాడారు. ల్యాబ్ పరికరాలనూ వాడుకోకుండా, పరిశోధన చేయకుండా అడ్డు తగిలారు. దారుణంగా తిట్టిపోశారు. 2018, 2019లో జరిగిన ఘోరాలను భరించిన ఆమె 2020లో ఫిర్యాదు చేసింది. దాంతో లైంగిక వేధింపుల ఫిర్యాదుల అంతర్గత కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది. ముగ్గురు తోటి విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించారని తేలింది. జాతీయ మహిళా కమిషన్ ఆదేశంతో గతేడాది మైలాపూర్ మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలికి న్యాయం జరిగేదాకా నిందితుల పీహెచ్డీ పూర్తి కాకుండా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది. -
Kamala Harris: ఉక్రెయిన్పై కమలా హ్యారిస్ ట్వీట్.. దుమారం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో వేసిన ఓ ట్విటర్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో భాగమేనంటూ అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన ఆమె.. కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కానీ, ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో యూరప్లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పోల్యాండ్ వెళ్లిన ఆమె.. అక్కడి ప్రెసిడెంట్ అండ్ర్జెజ్ డూడాతో రష్యా దురాక్రమణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పోల్యాండ్ అధికారులకు, పోల్యాండ్లోని అమెరికా రక్షణ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేసి.. ఉక్రెయిన్ వెంట అమెరికా ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్లో ఉక్రెయిన్, నాటో కూటమిలో భాగం అని అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్ట్కి నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో అసలు విషయం అర్థమైన ఆమె.. గంట తర్వాత ఆ ట్వీట్ తొలగించి.. మరో ట్వీట్ చేశారు. చివర్లో మరియు and అనే పదం చేర్చి మరోసారి ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే కమలా హారిస్ డిలీట్ చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్లు షేర్ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలికి వాస్తవ పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా లేదు. ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదకరమంటూ మాజీ భద్రతా అధికారి డెర్రిక్ కామెంట్ చేశాడు. ఈయనే కాదు.. వేలమంది యూజర్లు కమలా హారిస్ రాంగ్పోస్ట్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్ను ఉతికారేసిన అశ్విన్
ఇంగ్లండ్కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో 1/3 వంతును ఐపీఎల్ ఆక్రమిస్తుందని.. దీనివల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపాడు. లారెన్స్ వ్యాఖ్యలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూ ట్యూబ్ వేదికగా ఖండిస్తూ ధీటుగా బధులిచ్చాడు. ''ఐపీఎల్ 1/3 వంతును ఆక్రమిస్తోందంటూ లారెన్స్ బూత్ వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు. ఐపీఎల్లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది. వారానికి ఒక జట్టు గరిష్టంగా రెండు మ్యాచ్లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆటగాళ్లకు రెండురోజలు విశ్రాంతి దొరుకుతున్నట్లే. కనీసం పరిజ్ఞానం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. వాస్తవానికి ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలిసిపోతున్నారేమో చూసుకో. వీలైతే ఈపీఎల్పై నీ విమర్శనాస్త్రాలు సంధించు. సోయి లేకుండా మాట్లాడొద్దు. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల కొంతమంది ఆటగాళ్లు పేరుతో పాటు తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అశ్విన్ను ఈసారి మెగావేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2022లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఇప్పటివరకు అశ్విన్ ఐపీఎల్లో 167 మ్యాచ్లాడి 456 పరుగులతో పాటు 145 వికెట్లు తీశాడు. చదవండి: Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
హ్యుందాయ్ ‘సారీ’.. మరో మలుపు తిరిగిన వివాదం
హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో #BoycottHyundai బాయ్కాట్ హుందాయ్ ట్విటర్లో ట్రెండ్ అయ్యింది. వాహనదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు. కశ్మీర్ కోసం పాక్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ కడిగిపడేశారు హ్యుందాయ్ని. ఈ నేపథ్యంలో కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్.. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా.. హ్యాందాయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యూందాయ్(హెచ్ఎంఐఎల్) భారత విభాగం చెప్పుకొచ్చింది. కానీ.. Hi Hyundai. So many wishy-washy words not needed. All you need to say is - we are unequivocally sorry. Rest is all unnecessary https://t.co/wjqNh7YsXv — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 6, 2022 Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd — Hyundai India (@HyundaiIndia) February 6, 2022 రాజకీయ విమర్శలు అయినా వివాదం చల్లారడం లేదు. పైగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. పలువురు రాజకీయ నేతలు.. హ్యుందాయ్పై విరుచుకుపడుతున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. హ్యూందాయ్ ఇండియా ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన సందేశంలో అనవసరమైన పదాలు అక్కర్లేదని, స్పష్టంగా సారీ చెప్తే సరిపోయేదని, మిగతాదంతా అనవరసరమని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌథాయివాలే సైతం హ్యుందాయ్పై విరుచుకుపడ్డారు. కేవలం సారీ సరిపోదని, వివరణ ఇవ్వాల్సిందేనని, ఇలా భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలపై హ్యుందాయ్ గ్లోబల్ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు. .@HyundaiIndia , this is not sufficient. You must explain if you endorse statements of @PakistanHyundai ? What's your global stand on such anti-India rhetoric? @Hyundai_Global https://t.co/jA0QQjU3Az — Dr Vijay Chauthaiwale (@vijai63) February 6, 2022 ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారుతీ సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రముఖ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV అయిన క్రెటాతో సహా కంపెనీ 12 మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో, హ్యుందాయ్ 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశంలో సుమారు ₹ 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించుకుంది. చదవండి: హ్యుందాయ్ కంపెనీపై ఫైర్! ఏ రేంజ్లో అంటే.. -
విద్వేష కర్మాగారాలు నడుపుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో విద్వేషాన్ని మరింత పెంచేందుకు బీజేపీ.. ‘విద్వేష కర్మాగారాలు’ నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శ చేశారు. ఆ కార్ఖానాల్లో ‘ టెక్ ఫాగ్’ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం హిందీలో ట్వీట్లు చేశారు. ‘ ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసి, వారిపై అంతగా విద్వేషం పెంచుకున్న బుల్లి బాయ్ యాప్ నిర్వాహకుడు చాలా తక్కువ వయసు వాడు. యువతలో విద్వేషం పెంచేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో విద్వేషం ఎక్కడి నుంచి వెదజల్లబడుతోందని యావత్ భారతావని ఆశ్చర్యంలో మునిగిపోయింది. నిజానికి బీజేపీ ఇలాంటి ఎన్నో కర్మాగారాలను నడుపుతోంది’ అని రాహుల్ ట్వీట్చేశారు. -
‘నువ్వింక మారవా?’.. ఎలన్ మస్క్ రిప్లై ఇది
సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు మాత్రం.. చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరులతో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్గేట్స్తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. ‘విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా’ అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ‘ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం’ అంటూ సింగిల్ లైన్లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు. Hopefully enough to extend life to Mars — Elon Musk (@elonmusk) October 16, 2021 ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్కాయిన్లకు సమానం. బిల్గేట్స్, వారెన్ బఫెట్ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్కు ఎలన్ మస్క్ ‘బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో!’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు . టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్ఎక్స్ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్ను సైతం ఆస్వాదిస్తుంటాడు. చదవండి: మస్క్, బెజోస్.. భూమ్మీద ఏక్ నెంబర్ 'పిసినారులు' -
రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు. బండి సంజయ్ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు. అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు. మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో సంజయ్కి ఘన స్వాగతం పూడూరు: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ధరణి కాటన్ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు. -
కేజ్రీవాల్పై విరుచుకుపడ్డ మనీశ్ సిసోడియా! జరిగింది ఇది..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై.. సొంత పార్టీ నేతనే తీవ్ర విమర్శలు గుప్పించాడు. వ్యాక్సినేషన్లో విఫలమవుతూనే.. మరోపక్క యాడ్ల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాడంటూ సీఎం కేజ్రీవాల్పై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై, ఆప్ కీలక నేత.. డిప్యూటీసీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డట్లు 30 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓవైపు సిసోడియా మాట్లాడుతుండగా.. మరోవైపు ఆప్ యాడ్లతో ఉన్న పేపర్ క్లిప్పులు, యాడ్ కట్టింగ్లు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. యాడ్ల పేరుతో ఎంత వృథా చేస్తారు. వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. అని అందులో డైలాగులు ఉన్నాయి. దీంతో వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఆప్లో ముసలం మొదలైందని, కీలక నేతల మధ్య వైరం షురూ అయ్యిందని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. Mr. Handsome Sisodia Slams Kejriwal For "No Vaccination, Only Ads". pic.twitter.com/rNMs1fuQro — अमित शर्मा (@AmitsharmaGRENO) June 24, 2021 ఫ్యాక్ట్ చెక్.. ఆ రెండు వేర్వేరు వీడియోలు. ఎవరో ఎడిట్చేసి వైరల్ చేశారు. మనీశ్ సిసోడియా జూన్ 21న నిర్వహించిన ట్విటర్ లైవ్ మీడియా సమావేశంలో ఢిల్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడాడు. అదేరోజు ఉదయం ‘‘ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత’ పేరుతో బీజేపీ పాలిత రాష్రా్టల్లో ఫుల్ పేజ్ యాడ్లు పబ్లిష్ అయ్యాయి. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, గప్పాలు మానుకోవాలని, ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బును వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని బీజేపీకి సూచిస్తూ సిసోడియా ప్రెస్ మీడియాలో మాట్లాడాడు. అందులోని పోర్షన్లను కట్ చేసి.. ఎవరో ఎడిట్ చేశారు. సో.. మనీష్ సిసోడియా విమర్శించింది సొంత ప్రభుత్వాన్ని కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని. Addressing an important Press Conference | LIVE https://t.co/CCdbez8UeJ — Manish Sisodia (@msisodia) June 21, 2021 చదవండి: రాష్ట్రపతి జీతం, కట్టింగ్లపై గోల -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా పేరున్న ఒసామా బిన్ లాడెన్ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఇమ్రాన్ఖాన్పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్ను మట్టుపెట్టాయి. బాలీవుడ్ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
ఆసీస్ పర్యటనకు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా: రిషబ్
న్యూఢిల్లీ: ధోనీ వారసుడిగా అప్పటి వరకు సాఫీగా సాగిన అతని ప్రయాణం.. అధిక అంచనాలు, బ్యాటింగ్లో నిలకడలేమీ, వికెట్ల వెనుక వైఫల్యం, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి, కుదుపునకు లోనైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో(14 మ్యాచ్ల్లో 343 పరుగులు) బ్యాట్తో పర్వాలేదనిపించినా, వికెట్ కీపింగ్లో వైఫల్యాలు, అధిక బరువు కారణంగా.. సోషల్ మీడియాలో అతని అభిమానులకే టార్గెట్గా మారిపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆసీస్ పర్యటనలో టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు. సోషల్ మీడియాలో తనను అవమానించిన వాళ్లకు ఇప్పుడతను డార్లింగ్ క్రికెటర్గా మారిపోయాడు. అతడే రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి సారించినందుకే తాను పూర్వవైభవాన్ని సాధించగలిగానని పేర్కొన్నాడు. ఆసీస్ పర్యటనకు ముందు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ తాను ఏమాత్రం కుంగిపోలేదని, తన బలాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగానని వివరించాడు. ఆటలో వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శలు మామూలేనని, వాటిని ఆటతీరుతోనే తిప్పికొట్టాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన పేర్కొన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా ఉండేందుకు తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఆసీస్ పర్యటనలో అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన భారత క్రికెటర్గా నిలిచిన ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. సిడ్నీ టెస్టులో అతను సాధించిన 97 పరుగులు, బ్రిస్బేన్ టెస్టులో అతని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(89 నాటౌట్) టీమిండియా అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో అతను అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ధోనీ పేరిట నమోదైవుంది. ఆసీస్ పర్యటనకు కేవలం టెస్టు జట్టు సభ్యుడిగా ఎంపికైన పంత్.. నిలకడలేమి, అధిక బరువు సమస్యల కారణంగా తుది జట్టులో ఆడతాడా లేదా అన్న అనుమానం ప్రతి భారతీయుడిలో ఉండింది. అయితే అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న పంత్ తన ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలనందుకున్నాడు. -
‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’
బాలీవుడ్ నటి అంకితా లోఖండే బాయ్ఫ్రెండ్, సోల్మెట్ విక్కిజైన్కి ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తన వల్లే అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని వాపోయారు. తనలాంటి పబ్లిక్ ఫిగర్తో కలిసి ఉండటం వల్లే అతను విమర్శలు ఎదుర్కొంటున్నాడని.. కానీ వాటికి అసలు అతడు ఏ మాత్రం అర్హుడు కాదని తెలిపారు. అలానే ప్రతిసారి తనను అర్థం చేసుకుని.. మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రేమికుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని కోరారు. అభిమానులు కూడా అంకితకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అంకిత విక్కి జైన్కి క్షమాపణలు, కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’) ఈ మేరకు అంకిత తన ఇన్స్టాగ్రామ్లో ‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్మెట్గా పంపినందుకు. అలానే నీవు నాకు అన్ని వేళలా తోడుగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ విక్కి జైన్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు అంకిత. (చదవండి: 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) View this post on Instagram I can’t find the words to describe my feelings for you. One thing which come in my mind when I see us together is I’m grateful to god for sending u in my life as a friend, partner and as soul mate ❤️ Thanku for being someone who was always there for me. Thanks for making all my problems as yours and helping me whenever I needed you.Thankyou for being my support system. Most important thanku for understanding me and my situations ❤️ And I am sorry because of me u hv to face criticism which u don’t deserve at all . Words fall short but this bond is amazing🤗I love you 😽 @jainvick #viank A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Nov 1, 2020 at 11:04pm PST పవిత్ర రిష్తా సిరీయల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అంకిత. ఇందులో సుశాంత్ ఆమె కో స్టార్గా నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. 2019లో అంకిత మణికర్ణిక చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. -
ఇదా ‘విచక్షణ’?
మనపై కరోనా ప్రభావం లేదు.. రాష్ట్రంలో ఎక్కడో చెదురుమదురు సంఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి.. అయినా ‘విచక్షణాధికారం’తో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. రాజ్యాంగానికి బద్ధుడై ఉండాల్సిన ఉన్నత స్థాయి వ్యక్తి ఓ రాజకీయ పార్టీ కుటిల యత్నాలకు ఊతమివ్వడం ఎంత వరకు సబబని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.. ఇది ఓటమి భయంతో టీడీపీ పన్నిన పన్నాగమని, 14వ ఆర్థిక సంఘ నిధులు కోల్పోతే అభివృద్ధి సాధించాలన్న ప్రభుత్వ యత్నాలు ఎలా ముందుకు సాగుతాయని ప్రజలు నిలదీస్తున్నారు. అరసవల్లి, శ్రీకాకుళం: కరోనా వైరస్ను బూచిగా చూపుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెలాఖరు కల్లా పరిషత్, పురపాలక, గ్రామ పంచాయతీల పాలకుల ఎన్నికలు పూర్తి కానున్నాయి. అలా జరిగితే రూ.5 వేల కోట్ల నిధులు పంచాయతీలకు చేరేవి. తాజాగా ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘ నిధులకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం వెనుక మాజీ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రాంగం నడిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 2200కు పైగా ఎంపీటీసీలు, 125 వరకు జెడ్పీటీసీలు ఏకగ్రీవాలై.. వైఎస్సార్సీపీ పరం కావడం తట్టుకోలేక తనదైన తప్పుడు మార్గాల తలుపులు తెరిచినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఏకగ్రీవాలను తట్టుకోలేకనే.... ఈనెల 7న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ముందుగా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్లు, స్రూ్కట్నీ, ఉపసంహరణలు పూర్తయ్యయి. తుది జాబితాలను కూడా ఖరారు చేశారు. ఈనెల 21న పోలింగ్ జరుగనుంది. అలాగే జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ పురపాలక సంఘాల్లో కూడా నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. అయితే ఇందులో 66 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, జెడ్పీటీసీల్లో కూడా శతశాతం విజయానికి అవకాశమున్న పరిస్థితులను విపక్ష పార్టీ ఏమాత్రం తట్టుకోలేకపోయింది. దీంతో అధికార పార్టీ అల్లర్లు, దౌర్జన్యాలు చేస్తోందంటూ అసత్య ప్రచారాలకు దిగింది. దీంతో ఎన్నికల కమిషనర్ను కలిసి రాష్ట్రంలో దారుణాలు జరిగిపోతున్నాయన్న కలరింగ్ ఇచ్చేలా చంద్రబాబు వ్యవహరించారు. ఏకగ్రీవాలను తట్టుకోలేకే ఇలా మాయోపాయాలకు దిగారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ తదితర ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి ఆంక్షలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడింది. కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు వైరస్ రాష్ట్రంపై కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ... అంతకుమించిన ప్రమాదకర వైరస్గా రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. గ్రామీణాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. ఓటమి భయం నుంచి కొన్నాళ్లు తప్పించుకోవడానికి చంద్రబాబు పన్నిన కుట్ర కారణంగా ఇప్పుడు నిధులకు అడ్డంకి ఏర్పడుతుంది. 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే నాయకుడు ఇంతటి కుటిల యత్నాలకు దిగుతాడని కనీసం ఆ పార్టీ వారు కూడా ఊహించి ఉండరు. భూస్థాపితం దిశగా.. తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాలకు, 25 ఎంపీ స్థానాల్లో మూడింటికీ పరిమితమైన టీడీపీ పరిస్థితి స్థానిక ఎన్నికల నాటికి మరింత దిగజారింది. ఇటీవల కాలంలో జిల్లాలో టీడీపీని వీడి వేలాదిమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు కేవలం రెండు చోట్ల గెలిచి, ఒక ఎంపి స్థానంతో సరిపెట్టుకున్న జిల్లా టీడీపీలో ఇప్పుడు క్యాడర్ అంతా జారుకుంటోంది. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, కళావెంకటరావుల సొంత నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వైఎస్సార్సీపీకి దక్కడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో పార్టీ పూర్తిగా మునిగిపోతుందని తెలిసి...ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాల కోసం తన సామాజిక వర్గ అధికారులను చంద్రబాబు వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 66 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేగిడి, వంగర ఎంపీపీలు హస్తగతమయ్యాయి. తాజా ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ స్థానాల వరకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో టీడీపీ అగ్రనాయకులుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, కూన రవికుమార్, గౌతు శివాజీ, గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్ తదితర నాయకులంతా బతిమలాడుతూ కూడా అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వంగర, రేగిడి, కోట»ొమ్మాళి, సంతకవిటి, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, లావేరు, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ముందుగానే చేతులెత్తేశారు. ఈ పరాభవాన్ని ఎలా తట్టుకోవాలని యోచిస్తుండగా వారికి ఎన్నికలు వాయిదా పడడం ఆనందాన్నిచ్చింది. జిల్లాలో రాజాం, ఆమదాలవలస, శ్రీకాకుళం మునిసిపల్ ఎన్నికలకు ఏదో ఒక సాకు చూపించి ఆ పారీ్టకి చెందిన నాయకుల ద్వారా కోర్టును ఆశ్రయింపజేసి ఎన్నికలను వాయిదా వేయించగలిగింది. దీని వలన అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. ఇందుకు ఉదాహరణగా శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం నగర పంచాయతీలను చెప్పవచ్చు. 2010 నుంచి ఈ రెండింటికీ ఎన్నికలు లేకపోవడం వలన 14వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోవాల్సి వచ్చింది. దీని వలనే ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని కాంక్షించకుండా తాము, తమ పార్టీ మనుగడే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుండడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవరిని సంప్రదించారు? ఎవరినీ సంప్రదించకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచక్షణాధికారం పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది. రాష్ట్రంలో మరో పక్షం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ముగుస్తుందనగా ఇలా చేయడం తగదు. మార్చి 31లోపు స్థానిక సంస్థల ప్రక్రియ పూర్తి కాకపోతే కేంద్రం నుంచి 14 ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.5 వేల కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అంతగా లేవని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెపుతున్నాయి. దాని కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం అహరి్నశలు శ్రమిస్తూ అంది. నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ విచక్షణ కోల్పోయి, చంద్రబాబు అండ్కోకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందనే అక్కసుతోనే ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. –రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుంటి సాకులు చెప్పొద్దు కరోనాను ఎదుర్కొనడానికి ఎన్నికల ప్రచారాన్నే ఒక సాధనంగా చేసుకోవలసింది. ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. కుంటి సాకులతో ఎన్నికలు వాయి దా వేశారని అభ్యర్థులు నిరాశ చెందవద్దు. ప్రచారం ఆపవద్దు. వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించడం ఖాయం. –తమ్మినేని సీతారాం, శాసనసభాపతి -
ఏం సాధించారని వస్తున్నారు బాబూ...
అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ... ఎన్నెన్నో శుష్క వాగ్దానాలు చేశారు. ఏవీ నెరవేర్చకుండానే కాలం గడిపేశారు. వెనుకబడిన జిల్లాను ఏమాత్రం పట్టించుకోలేదు. అభివృద్ధికి చేపట్టిన చర్యలూ లేవు. ఆ పరిస్థితులపై విసిగెత్తిన జనం గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు విశాఖకు రాజధాని ద్వారా జిల్లా అభివృద్ధి సాధిస్తుందనుకుంటే... దానినీ అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారు. తగుదునమ్మా... అని ఇప్పుడు జిల్లాకు వస్తున్న ఆయన తీరును జిల్లావాసులు ఎండగడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ నిలదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి విజయనగరం: చంద్రబాబు నాయుడు. ఈ పేరు చెబితేనే జిల్లావాసులు ఊగిపోతున్నారు. ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని చేసిన కుట్రల్లో తాము ఎంతగా కష్టపడిందీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పీడించిన నియంతృత్వ పోకడల్ని మరిచిపోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఈ గాయాలకు మందు రాసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ గాయం తాలూకు మచ్చలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మానిపోతున్నాయి. జిల్లా ప్రజలకు భవిష్యత్తు మీద ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మరోసారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మళ్లీ జిల్లాకు వస్తున్నారు. పేరుకే చైతన్యయాత్ర... ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలోనే రావాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పటికైనా రాకపోతే ప్రజలు పూర్తిగా మర్చిపోతారని భయపడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. శృంగవరపు కోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయన పాలనలో ఒరిగింది శూన్యం ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ పర్యటనపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయనగరం జిల్లా ఎప్పటి నుంచో వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. ఇక్కడి నుంచి వేలాదిమంది ప్రజలు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. జిల్లా ప్రజల మంచికోసం చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయలేదు. భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు ఆయన హయాంలో ఖరారు చేయలేకపోయారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన మెడికల్ కళాశాలను స్థాపించలేకపోయారు. జూట్ మిల్లులు, పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోలేదు. పైపెచ్చు జన్మభూమి కమిటీలతో సామాన్య ప్రజలను నానా రకాలుగా హింసించారు. స్వపార్టీ వారికే సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజలను బాధపెట్టారు. ఇన్నాళ్లకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి జనం బాగుకోరే ముఖ్యమంత్రి వచ్చారు. ఉత్తరాంధ్రకు మంచి చేయాలని భావించి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని, ఏమాత్రం జిల్లా ప్రజలకు మంచి జరగనివ్వకూడదని పర్యటనల పేరుతో జన వంచనకు సిద్ధమై వస్తున్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన చంద్రబాబు పర్యటనను జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే, విజయనగరం జిల్లాకు వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలని, విశాఖలో పరిపాలన రాజధాని రావాలని కోరుకుంటున్నారు. కానీ దానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎందుకు పర్యటిస్తున్నారు? విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుకు ససేమిరా అంటున్న విపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు కోల్పోయారు. ఏ మొహం పెట్టుకొని ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విజయనగరం వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమరి్ధంచాలి. టీడీపీ నాయకులు ఆ మేరకు తమ నేతకు దిశ నిర్దేశంచేయాలి. కె.కూర్మినాయుడు,న్యాయవాది,పార్వతీపురం ఆయన అధికారంలో చేసిందేమిటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ మేలూ చేయలేదు. అప్పుడు లేని ప్రజాచైతన్య యాత్రలు ఇప్పుడు ఎవర్ని మోసగించడానికి చేపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబునాయుడు స్వార్ధంతో దానిని అడ్డుకుంటున్నారు. ఇదేనా ఆయనకు జిల్లాపై ఉన్న ప్రేమ? – కె.వి.కె.రెడ్డి, కాంట్రాక్టర్, పార్వతీపురం అభివృద్ధిని అడ్డుకుని ఇప్పుడు చైతన్యయాత్రలా? రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడి తే వాటిని అడ్డుకుని... ఇప్పుడు చైతన్యయాత్రలంటూ ఎలా వస్తున్నారు? జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడుతుంటే అసె ంబ్లీలో అడ్డుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు. – ఇండుపూరు గున్నేష్, వ్యాపారివేత్త, పార్వతీపురం బాబును నమ్మే రోజులు పోయాయి... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయా యి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఆయన హయాంలో జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టలేదు. ఏదైనా కార్యక్రమం చేపడితే ఓ అర్ధం ఉండాలి. ఈ యాత్ర ఇప్పుడెందుకు చేస్తున్నారో సొంత పార్టీ నేతలకే తెలియడంలేదు. జిల్లావాసులకు న్యాయం చేయలేని బాబుకు ఈ జిల్లాలో పర్యటించే హక్కు కోల్పోయారు. – పెనుమత్స సురేష్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అధికారంలో ఉన్నపుడు ఏంచేశారు? రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు విజయనగరం జిల్లా అంటే గుర్తు లేదు. ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రజా చైతన్య యాత్ర పేరుతో అభివృద్ధిని అడ్డుకొనేందుకు వస్తున్నందుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – బిడ్డిక అన్నాజీరావు, గిరిజన సంఘం నాయకుడు, నీలకంఠాపురం ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమిటి ఉత్తరాంధ్రకు ఇన్నాళ్లూ వెనుకబాటుకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ రాజధానిని అడ్డుకుంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజాచైతన్యయాత్ర చేస్తున్నారు? జిల్లాకు న్యాయం చేయలేని ఆయన ఇక్కడకు వచ్చే అర్హత కోల్పోయారు. – చుక్క ఈశ్వర అప్పారావు, పీఆర్టీయూ నేత, కొత్తవలస -
మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు
కరాచీ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేంద్ర మోదీ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్- పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగవంటూ పేర్కొన్నాడు. అంతేకాదు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ' భారత్, పాక్ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారతదేశ ప్రధాని మోదీ. ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు. అసలు మోదీ ఎజెండా ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి' అంటూ తెలిపాడు. (‘భారత్-పాక్ సిరీస్ యాషెస్ కంటే గొప్పది’) కాగా భారత జట్టు చివరిసారిగా రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 2006లో పాక్లో పర్యటించింది. అయితే 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నమెంట్లలో తప్ప భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగలేదు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. 2013 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. (ట్రంప్పై పీటర్సన్, ఐసీసీ సెటైర్) -
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
-
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్కు దేశ ప్రజల నుంచి వింత అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకొని మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్ ఫైటర్స్, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్ మోరిసన్ గురువారం న్యూ సౌత్వేల్స్లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు. కాగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఒక మహిళా ఫైర్ ఫైటర్ను అభినందిస్తూ ఆమెతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రధానితో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. అంతలో అక్కడ ఉన్న మరో వ్యక్తితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అతను కూడా నిరాకరించి ప్రధానికి క్షమాపణ చెప్పి దూరంగా వెళ్లిపోయాడు. కాగా ఆ వ్యక్తి ఇతరుల ఇళ్లను కాపాడే ప్రయత్నంలో తన ఇళ్లును పోగొట్టుకున్నాడని ఒక అధికారి వెల్లడించారు. 'కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడుతుంటే మీరు మాత్రం సిడ్నీ హార్బర్ దగ్గర్లోని కిర్రిబిల్లి హౌస్లో కూర్చొని కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాదిస్తారా' అంటూ ఒక వ్యక్తి ప్రధానిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' నువ్వు ఒక మూర్ఖుడివి.. నిన్ను మళ్లీ మేం ప్రధానిగా చూడబోమంటూ' మరొక వ్యక్తి ప్రధాని మోరిసన్ మీద విరుచుకుపడ్డాడు. అయితే వీటిపై ప్రధాని స్పందిస్తూ.. ' ఈరోజు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నా కళ్లారా చూశాను. నన్ను తిట్టినందుకు నేనేం బాధపడడంలేదు.ఎందుకంటే ఇందులో మానవ తప్పిదం ఏం లేదు. కేవలం ప్రకృతి వైపరిత్యాల వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు మా ప్రజలు పడుతున్న బాధను దగ్గరుండి గమనించాను. మా ప్రభుత్వం తరపున వారికి కావలిసివి అన్ని ఏర్పాటు చేస్తామని' పేర్కొన్నారు. గతేడాది మేలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి స్కాట్ మోరిసన్ ప్రధాని పదవిని చేపట్టాడు. అయితే కార్చిచ్చు అంటుకొని దేశంలోని ఐదు రాష్ట్రాలకు వ్యాపించిన సమయంలో మోరిసన్ తన కుటుంబంతో కలిపి హాలిడే టూర్ పేరుతో హవాయి నగరాన్ని సందర్శించారు. అయితే ప్రధాని తీరుపై అక్కడి ప్రజలు, విపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశారు. దీనిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు మోరిసన్ తెలిపారు.జనవరి 13 నుంచి 16 వరకు ప్రధాని స్కాట్ మోరిసన్ భారత్లో పర్యటించాల్సి ఉండగా, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. -
సచివాలయానికి రాని ఏకైక వ్యక్తి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణాలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. మంగళవారం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోవడంపై గాంధీభవన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆచరణకు నోచుకోని సంక్షేమ పథకాలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మాయమాటలతో మభ్యపెడుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన చరిత్ర ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా చూస్తే మొదటి ఏడాది అంతా పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. వడ్డీలు కట్టడమే సరిపోతుంది.. ఇక అభివృద్ధి ఏం చేస్తారు.. రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఇప్పటి దాకా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారని, వీటికి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోందన్నారు. ఏకంగా రుణాల కోసం ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టిందన్నారు. అంతే కాకుండా ఈ అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయా రుణ మంజూరు సంస్థలకు పూచీకత్తుగా ఉంటుందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకువచ్చారని ఆరోపించారు. మ్యానిఫెస్టోలోని హామీలను నెరవేర్చడంలో విఫలం.. అంచనాలను పెంచి అడ్డగోలుగా ప్రాజెక్టులకు కేటాయించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొడుతున్న ఒక్క మద్యం ద్వారా దాదాపు రూ. 20వేల కోట్లు ఆదాయం గడించిన ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ తప్ప మిగతా ఏ రంగాలపై దృష్టి సారించలేదని విమర్శించారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఖాళీలను భర్తీ చేయడం లేదా కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలను ప్రభుత్వం నిర్వహించడంలో విఫలమైందని ఆయన తెలిపారు. అక్షరాస్యత పరంగా ఇండియాలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని, ఈ విషయాన్ని 2011 జనగణన సూచించిందని పేర్కొన్నారు. బడ్జెట్ పరంగా చూస్తే అమలులో దేశంలో 31వ ర్యాంక్ లో ఉందని ఆర్బీఐ పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యంలో మిగతా రాష్ట్రాలు మెరుగైన సేవలందిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదని వివరించారు. మొత్తం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం 3.50 శాతం మాత్రమే కేటాయించినందని గుర్తుచేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని దుయ్యబట్టారు. -
మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క
సాక్షి, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గతనెల 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో దళిత మహిళ సమతపై అత్యాచారం, హత్య చేసిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తదితరులతోకలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్లో పడుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లాపటార్లో దళిత మహిళపై అత్యాచార, హత్య ఘటనపై గవర్నర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రతపై మహిళలకు ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు కేవలం టీఆర్ఎస్ నాయకులకే పని చేస్తున్నారని విమర్శించారు. వారి వెంట మాజీ ఎంపీలు నిఖిల్, రాథోడ్ రమేశ్ తదితరులు ఉన్నారు. -
దిద్బుబాటు లేకుంటే తిప్పలు తప్పవు!
గత ఆయిదున్నరేళ్ల పాలనలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ.. మహారాష్ట్రలో ఆకస్మిక రాజకీయ పరిణామాలతో చేష్టలుడిగిపోయింది. శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఊహించలేకపోయిన బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహపరంగానే దెబ్బతినిపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యం, జీడీపీ పతనం, నిరుద్యోగిత వంటి మరకలు ఉన్నప్పటికీ మోదీపై వ్యక్తిగతంగా సదభిప్రాయం ఆ పార్టీకి నేటికీ బలాన్ని అందిస్తోంది. అయితే నరేంద్రమోదీ, అమిత్ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. మహారాష్ట్ర గుణపాఠాలను త్వరగా నేర్చుకుని బీజేపీ మిత్రుల సంఖ్యను పెంచుకుని, శత్రువుల సంఖ్యను తగ్గించుకుంటే అది మళ్లీ తన పూర్వ ప్రభలను వెదజల్లుతుంది. పం«థాను మార్చి గెలుపొందడం.. మారకుండా ఓటమివైపు పయనించడం అనే రెండు అవకాశాలు బీజేపీ ముందున్నాయి. శివసేన రూపంలో ఆప్తమిత్రుడే బద్ధ శత్రువుగా మారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పర్చాక బీజేపీలో నిశ్శబ్దం తాండవిస్తోంది. దీనిపైనే శరద్ పవార్ ప్రతి రోజూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు: ‘అమిత్ షా ఎక్కడ? ఎమ్మెల్యేలను గెల్చుకుని ప్రభుత్వాలను ఎవరు ఏర్పర్చగలరు?’ ఇక బీజేపీ సాహసప్రవృత్తి కలిగిన ప్రతిపక్షాన్నే ఎదుర్కోనుందా లేక ఆ పార్టీ తన సంతృప్తస్థాయిని ఇప్పటికే చేరుకుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంతృప్తస్థాయి అంటే సాధ్యపడినంత అత్యున్నత స్థాయికి చేరిందనీ, ఇక తదుపరి దశలో క్షీణత లేక పతనం తప్పదని అర్థం. అయితే బీజేపీ తగ్గుముఖంలో ఉందని ఇప్పటికిప్పుడే చెప్పడం తొందరపాటే కావచ్చు. మోదీ నేతృత్వంలోని బీజేపీ 2014 నుంచి నిరంతర విజయాలను నమోదు చేస్తూ వచ్చింది. కొన్ని ఉపఎన్నికల్లో నష్టపోయి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ బలాన్ని సంతరించుకుంటూనే వచ్చింది. పెద్దనోట్ల రద్దు, పేలవమైన జీఎస్టీ వంటి తప్పిదాలను మోదీ ప్రభుత్వం చేసినప్పటికీ మొత్తం మీద ప్రధాని మంచి పనులే చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.అయితే 2019 అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం తప్పదనిపించిన చోట ఉన్నట్లుండి భారీ రాజకీయ విషాదంగా పరిణమించింది. బీజేపీ, శివసేనలు ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ శివసేన తర్వాత ఒక్కసారిగా బీజేపీని ఎత్తి కుదేసింది. ఈసారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని శివసేన బహిరంగంగా పట్టుబట్టడంతో ఇరుపార్టీల మధ్య విచ్ఛిన్నత తప్పలేదు. అనేక మలుపులు, ఒడిదుడుకుల తర్వాత బీజేపీ ప్రధాన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్తో పొత్తు కలిపిన శివసేన ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పర్చేసింది. మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీని నిస్సహాయతలోకి నెట్టేశాయి. ఎన్నికల వ్యూహ రచనలో అతిశక్తిమంతులుగా ముద్రపడిన నరేంద్రమోదీ, అమిత్ షాలు నిస్సహాయులైనట్లు కనిపించారు. బీజేపీకి ఇప్పుడు శివసేన బద్ధ శత్రువైంది. పైగా కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీకి బదులుగా మహారాష్ట్రలో ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రతిపక్షం ఐక్యంగా ఉంటే బీజేపీ, మోదీలను ఓడించగలదనే సంకేతాన్ని కొత్త కూటమి ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి ఫలితాలు మహారాష్ట్రను బీజేపీ కోల్పోవడం నిస్సందేహంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర. బీజేపీ ప్రత్యర్థులు ఇక్కడ వచ్చే ఎన్నికలకోసం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా భారీ నిధులను సేకరించగలరు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి 48 లోక్సభ స్థానాలకుగాను 41 స్థానాలు గెల్చుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాన్ని సాధించడం చాలా కష్టం. అందుకే మహారాష్ట్రలో ఓటమి బీజేపీ పతనానికి నాంది పలుకనుందా లేక మరో చిన్న పరాజయంగానే మిగిలిపోతుందా అనేది ప్రశ్నగా మిగిలింది. మహారాష్ట్రను కోల్పోవడం బీజేపీని నైతికంగా దెబ్బతీసింది. ఒక సంపన్న రాష్ట్రం ఇంత సులభంగా తమ చేతుల్లోంచి చేజారిపోయిందా అని బీజేపీ కేడర్, నాయకత్వం చేష్టలుడిగిపోయారు. బలహీనంగా కనిపించిన శివసేన చేతుల్లో అజేయమైనదని పేరొందిన మోదీ, షాల వ్యూహం దెబ్బతినిపోవడం బీజేపీ ప్రతిష్టను మసకబార్చింది. మహారాష్ట్రనే కోల్పోయినప్పుడు, రానున్న జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ నష్టపోవచ్చు. ప్రతిపక్షం మళ్లీ శక్తిని పుంజుకుంది, ఐక్యత అనేది బలమైన బీజేపీని కూడా ఓడించవచ్చనే అభిప్రాయం ప్రతిపక్షంలో పెరిగింది. బీజేపీ బలాలు మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయినప్పటికీ, లోక్సభ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల 6 నెలల కాలం ఉంది. నరేంద్రమోదీ సత్పరిపాలనను అందించగలిగితే రాజకీయాల్లో పైచేయి సాధించటానికి ఇది సుదీర్గ సమయమే. కాబట్టి 2014 ఎన్నికల్లో ప్రజల విశ్వసనీయతను బీజేపీ పొందే అవకాశం ఉంది కూడా. పైగా ప్రతిపక్షానికి జాతీయ వ్యాప్తంగా తమ్ముతాము నిరూపించుకున్న జాతీయ స్థాయి నాయకులు లేరు. సోనియా గాంధీ కుటుంబం ఇప్పటికే విస్తృత ప్రచారం జబ్బు బారినపడ్డారు. ఇక వారినిుంచి ఒరిగేదేమీ లేదు. రాజకీయాల్లో పాతబడిపోతే త్వరగా తెరవెనక్కు పోతారు. ప్రజలు మార్పు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని యువతకు, నూతన నేతలకు ఇవ్వడానికి సిద్దంగా లేదు. కాంగ్రెస్ తన జనాకర్షణ శక్తిని కోల్పోయిందని బీజేపీకి తెలుసు. పైగా కాంగ్రెస్ నుంచి దానికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో అందరూ ప్రాంతీయనేతలే. జాతీయ నేతలు లేరు. అదే అధికార పక్షాన్ని చూస్తే ఈశాన్య భారత రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా ఎదిగింది. బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, అసోంలలో బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. బెంగాల్లో మమతకు, ఒడిశాలో నవీన్ పట్నాయక్కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అసోంని, ఈశాన్య భారతాన్ని దాదాపు ఈ పార్టీనే పాలి స్తోంది. బీజేపీకి ఇది అతిపెద్ద బలం మరి. పైగా తూర్పు, ఈశాన్య భారత్లో కోట్లాదిమంది పరదేశీయులు వలస వచ్చి స్థిరపడినందున బీజేపీ ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ చట్టం ఎన్ఆర్సీ దేశంలోని అనేక ప్రాంతాల్లో భావోద్వేగాలను ప్రేరేపించింది. ఎన్నార్సీకి భారీ డిమాండ్ ఉంటున్నందున బీజేపీ ఈ ఎన్నార్సీని అమలు పర్చి భారీ ప్రయోజనాన్నే పొందవచ్చు. ఇక విదేశీ విధాన వ్యవహారాల్లో మోదీ గొప్ప విజయం సాధించారు. కశ్మీర్ వంటి కీలక అంశంలో ప్రపంచం మొత్తంగా మన వాదనను బలపర్చేలా మోదీ ప్రభుత్వం చేయగలిగింది. దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటుండటంతో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగే సులభం కావచ్చు. బీజేపీ బలహీనతలు మహారాష్ట్రలో వ్యూహపరంగా బీజేపీ దెబ్బతినిపోవడానికి కేంద్రీకృత నాయకత్వమే కారణం. శివసేనకు రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చి ఉంటే మహారాష్ట్ర ఇంత సులభంగా చేజారిపోయి ఉండేదని చాలామంది పరిశీలకుల వ్యాఖ్య. కానీ ఈ విషయాన్ని మోదీ, షాలకు చెప్పే ధైర్యం బీజేపీలో ఎవరికీ లేదు. శివసేన డిమాండును అంగీకరించి ఉంటే ఇంత ఉపద్రవం ఎదురయ్యేది కాదు. బీజేపీ కూడా కాంగ్రెస్ లాగే అధిష్టానం, దాని ముందు ఎవరూ నిలబడలేని పనివిధానంతో సాగుతోంది. మోదీ, షా, పీయూష్, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ మినహాయిస్తే మంత్రిమండలి రాజకీయంగా, పాలనాపరంగా బలహీనమైంది. అనుభవం లేని మంత్రులవల్లే ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, విద్య వంటి రంగాలు ఫలితాలనివ్వడం లేదు. పైగా పొత్తు పార్టీలను నిర్లక్ష్యం చేయడం బీజేపీని బాగా దెబ్బతీస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ కూటమి పార్టీలను పక్కనబెట్టేసింది. పైకి ఏమీ అనలేకపోయినా వీరంతా సమయం కోసం కాచుకుని ఉన్నారు. మహారాష్ట్ర ఉదంతంలో గుణపాఠాలు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరన్న విషయం మర్చిన బిజేపీ శివసేనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఊహించలేకపోయింది. అనూహ్యంగా అలా జరగడంతో బీజేపీ షాక్కు గురయింది. కాంగ్రెస్ పార్టీ శివసేనతో పొత్తుకు సిద్ధపడగలదని ఏమాత్రం ఊహించినా శివసేనకు సీఎం పదవిని ఇవ్వడానికి బీజేపీ సిద్ధపడిపోయేది. ఢిల్లీని ఏలుతున్న తనను అర్భక పార్టీ అయిన శివసేన ఏం చేస్తుందన్న నిర్లక్ష్యం ప్రదర్శించడమే బీజేపీ కొంప ముంచింది. ఏకు అనుకున్న శివసేన ఇప్పుడు ప్రమాదకర శత్రువుగా మారిపోయింది. అలాగే మీ మిత్రుల సంఖ్యను పెంచుకుని శత్రువుల సంఖ్యను తగ్గించుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ మర్చిపోయింది. అయితే నరేంద్రమోదీ, అమిత్ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. పెద్దనోట్ల రద్దు గురించి మోదీ ఇప్పుడు కనీసంగా ప్రస్తావించలేదు. అరుణ్ జైట్లీ జీఎస్టీని కుప్పగూలిస్తే, మోదీనే దాన్ని మెరుగుపర్చారు. ఉపయోగంలేని మంత్రుల, నేతలను వదిలించుకోవడంలో మోదీ, షాలు సిద్ధహస్తులు. తన రాజ కీయాలను మార్చుకుని మిత్రులను సంపాదించుకుని మరింత నమ్రతగా ఉండే అవకాశం ఇప్పటికీ బీజేపీ ముందుంది. ఈకోణంలో మహారాష్ట్ర బీజేపీకి పెద్ద గుణపాఠమైంది. బీజేపీ తన తప్పిదాలను సరిదిద్దుకుని నమ్రత గల పార్టీగా మారుతుందా? ఇప్పుడు బీజేపీకి రెండు అవకాశాలున్నాయి. మార్పు చెంది గెలుపొందడం, మారకుండా ఉండి ఓటమి వైపు పయనించడం! వ్యాసకర్త, పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
'ప్రజలు ఛీకొట్టినా బాబుకు సిగ్గురాలేదు'
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు సిగ్గు రాలేదని, ఏ ముఖం పెట్టుకొని కడపలో అడుగుపెట్టారని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. కడపకు వచ్చిన ప్రతీసారి కడప, రాయలసీమ రౌడీలంటూ ప్రజలను అవమానించిన చంద్రబాబుకు స్వాగతం పలికిన టీడీపీ నాయకులకు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. ముందు కడప ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత కడపలో చంద్రబాబు అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ మాయ మాటలు పలుకుతున్న బాబు మాటలు ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ ఎన్నికలు వచ్చిన బాబుకు ఒక్కసీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. కోర్టుల చుట్టూ తిరిగి 26 స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తనను ఎవరు ఏమి చేయలేరని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ఎమ్మెల్యేలను ఆంబోతులు అంటూ చంద్రబాబు మాట్లాడడం తగదని హెచ్చరించారు. ఆ మాటకొస్తే వ్యవస్థలను సర్వ నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్షలాది ఉద్యోగాలు ఇస్తుంటే చంద్రబాబు వాటిని తీసేస్తామంటున్నారని, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి భయపడి పిల్లిలా వ్యవహరిస్తున్న బాబు గతంలో అదే మోదీని తన వియ్యంకుడు బాలకృష్ణతో నోటికొచ్చినట్లు తిట్టించిన సంగతి గుర్తుకులేదా అని ప్రశ్నించారు. అలాగే తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్షాపై రాళ్ల దాడి చేయించింది మీరు కాదా అని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్న పవన్కల్యాణ్ తాను ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని దుయ్యబట్టారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంది ముమ్మాటికి చంద్రబాబేనని, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఆ ప్రదేశంలో నెమళ్లు నాట్యం చేస్తాయంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నుంచి తరిమేస్తే అమరావతికి పారిపోయి వచ్చిన చంద్రబాబు అధికారులను భయపడే విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని శ్రీకాంత్రెడ్డి అన్నారు. -
బాబు కపట దీక్షలను ప్రజలు నమ్మరు
సాక్షి, కడప : ఇసుకపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసే కపట దీక్షలను ప్రజలు నమ్మబోరని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు అన్నారు. గురువారం కడపలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా నూతన పాలసీని తీసుకొని ఉచిత ఇసుక పేరుతో వేలకోట్లు దోచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి క్యూబిక్ మీటర్ రూ.90–120గా ఉన్న దాన్ని అమాంతం పెంచేసి రైతులకు ఇవ్వకుండా, మామూళ్లు, టోల్గేట్లుపెట్టి, ఇతర రాష్ట్రాలకు తరలించి వేల కోట్లు దోపిడీ చేశారన్నారు. తెలంగాణలో నూతన ఇసుక పాలసీ ద్వారా రూ. 2900కోట్లు ఆదాయం రాగా, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో రూ.50కోట్లకు మించి రాలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందని తహసీల్దార్ వనజాక్షిని దెందులూరు ఎమ్మె ల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చినా అతనిపై కేసు పెట్టకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రాజీ చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి టీడీపీ నేతలు సాగించిన అక్రమాల వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కార్ చేసిన తప్పులను తమ ప్రభుత్వం చేసేందుకు సిద్ధగా లేదన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినందున కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందన్నారు. అందుకే కిలోమీటర్కు రూ.4.90 లతో ఇసుక ధర నిర్ణయించి సరఫరా చేస్తున్నామని, కొత్త రీచ్లు ఏర్పాటు చేసిన ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లపాటు ఇసుక దోపిడీ చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ చంద్రబాబు దీక్ష చేయడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కడుపు మంటతో దీక్ష చేస్తున్నారని, ఇలాంటివాటిని ప్రజలు నమ్మరని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
'రాజకీయ లబ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర'
సాక్షి, కరీంనగర్ : రాజకీయ లభ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర చేపట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడు అంటూనే.. గాంధీ పేరుతో సంకల్ప యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంపిన వాళ్లను పూజించే బీజేపీ ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న ఆందోళనపై స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో రిపేర్లు నడుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచే నీరు వృధాగా పోతుందని, వెంటనే ఆ నీటిని దారి మళ్లించి చెరువులను, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నామవ్వడానికి బతుకమ్మ చీరలు తయారుచేసిన సిరిసిల్ల నేతన్నలకు డబ్బులు చెల్లించకపోవడమే నిదర్శనమని వాపోయారు. -
'కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'
సాక్షి, గద్వాల : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్కు, ఉప సర్పంచ్కు మధ్య కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం తప్పకుండా వస్తుందని ఘాటుగా స్పందించారు.కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సర్పంచ్ హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. తలా తోక లేని పార్టీగా కాంగ్రెస్ మారిందని, కనీసం వారి నాయకులను కాపాడుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2023 కల్లా రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించనుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. -
సుష్మా స్వరాజ్ రోజుకో రంగు చీర
2009–14 మధ్య (15వ లోక్సభ) కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్, లోక్సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఉన్న సమయంలో వారిరువురి మధ్య పలు కవితా యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో 15వ లోక్సభ సమావేశాల్లో అనేకసార్లు అసహ్యకర పరిస్థితులు తలెత్తాయి. అయితే కొన్నిసార్లు మన్మోహన్, సుష్మలు.. ఒకరిపై ఒకరు కవితాత్మకంగా చేసుకున్న విమర్శలు సభ్యులను ఉల్లాసపరిచాయి. వారిద్దరి హాస్య చతురత అందరికీ గుర్తుండేలా చేశాయి. ఓ సారి మన్మోహన్ మాట్లాడుతూ, మీర్జా ఘాలిబ్ రాసిన ప్రఖ్యాత కవితను చదివారు. ‘హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్, జో నహీన్ జాన్తే వఫా క్యా హై’ (విశ్వాసం అనే పదానికి అర్థం కూడా తెలియని మనుషుల దగ్గరి నుంచి మేం విశ్వాసాన్ని ఆశిస్తున్నాం) అని మన్మోహన్ అనగా, సుష్మ దీనికి స్పందిస్తూ, బషీర్ బద్ర్ కవితతో సమాధానం ఇచ్చారు. ‘కుచ్ తో మజ్బూరియా రహీ హోంగీ, యూం హీ కోయీ బేవఫా నహీ హోతా’ (కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉండుండాలి. ఏ కారణమూ లేకుండా ఊరికే ఎవ్వరూ నమ్మిన వారిని మోసం చేయరు) అని సుష్మ బదులిచ్చారు. ఆ వెంటనే మన్మోహన్ను ఉద్దేశించి సుష్మ మరో కవిత చదువుతూ ‘తుమ్హే వఫా యాద్ నహీ, హమే జఫా యాద్ నహీ; జిందగీ ఔర్ మౌత్ కే తో దో హీ తరణే హై, ఏక్ తుమ్హే యాద్ నహీ, ఏక్ హమే యాద్ నహీ’ (నా విశ్వాసాన్ని మీరు గుర్తుంచుకోరు. మీకు విశ్వాసం లేకపోవడాన్ని నేను గుర్తుంచుకోను. జీవితంలో రెండే పాటలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోరు. ఇంకోటి నాకు గుర్తుండదు) అని చెప్పడంతో సభ్యులంతా ప్రశంసించారు. ఇలాంటి సందర్భాలు 15వ లోక్సభలో ఎన్నో ఉన్నాయి. వచ్చి మీ రూపాయి తీసుకోండి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తనకు చేసిన ఫోన్ కాల్ను, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని సాల్వే కంట తడి పెట్టారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేకపోయారని అన్నారు. గుండెపోటుకు అరగంట ముందు, మంగళవారం రాత్రి 8:50 గంటల ప్రాంతం లో సుష్మా హరీష్కి కాల్ చేసి మాట్లాడారు. . ‘మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉద్వేగపూరితమైనది. ఒక్క రూపాయి నేను నీకు ఇవ్వాల్సి ఉంది. వెంటనే వచ్చి తీసుకోండి’ అని ఆమె చెప్పారని ఆయన అన్నారు. ‘‘నిజంగానే ఆ రూపాయి ఎంతో విలువైనది. ఎందుకంటే అది ఒక లాయర్గా నాకు ఆమె చెల్లించే ఫీజు. అందుకే తప్పకుండా వచ్చి తీసుకుంటా’ అని నేను చెప్పాను. ‘ సరే బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ రూపాయి తీసుకోండి’ అని ఆమె చెప్పారు. ‘నేను సరే’ అనడంతో ఆమె ఫోన్ పెట్టేశారు. సుష్మాతో అవే చివరి మాటలవుతాయని ఊహించలేకపోయానని సాల్వే గద్గద స్వరంతో చెప్పారు. ఆ రూపాయి కథేంటంటే.. పాక్ జైల్లో ఉన్న కుల్భూషణ్ జాధవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సాల్వే వాదించారు. అందుకు ఆయన భారత ప్రభుత్వం దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఈ కేసులో ఆయన గెలవడంతో జాదవ్ ఉరి ఆగింది. భారత్ తరఫున సాల్వేను నియమించినప్పుడు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఉన్నారు. రోజుకో రంగు చీర సుష్మా స్వరాజ్కు ఓ వైవిధ్యమైన అలవాటు ఉంది. వారంలో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలనే దానిపై ఆమె కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. ప్రతి సోమవారం ముత్యపు తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ చీరలు, మంగళవారాల్లో ఎరుపు, కాషాయం లేదా దొండపండు రంగు చీరలు, బుధవారాల్లో ఆకుపచ్చ రంగు, గురువారాల్లో పసుపుపుచ్చ రంగు, శుక్రవారాల్లో బూడిద లేదా వంగపూత రంగు, శనివారాల్లో నీలం లేదా నలుపు రంగు చీరలను ఆమె ధరించేవారు. ఆదివారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలనేదానిపై ప్రత్యేకమైన నిబంధనలేమీ ఉండేవి కావు. దాదాపు గత రెండు దశాబ్దాలపాటు ఆమె ఈ అలవాటును పాటించారు. ఇలా రోజుకో రంగు చీర ధరించేందుకు జ్యోతిష్యం లేదా మూఢనమ్మకాలు కారణం కాదనీ, కేవలం అది తన అలవాటని సుష్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాకు కూడా ఇలాంటి అలవాటే ఉంది. సిక్కు అయిన ఆయన, రోజుకో రంగు తలపాగాను ధరిస్తారు. -
అజయ్ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు
న్యూఢిల్లీ : 'హమ్ హిందూ' వ్యవస్థాపకుడు అజయ్గౌతమ్ ముస్లిం యాంకర్ను చూడలేనంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ట్విటర్ వేదికగా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటీవల జొమాటో ఫుడ్ డెలివరీ విషయమై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు అజయ్ గౌతమ్ను ఒక న్యూస్ చానెల్ ఆహ్వానించింది. చర్చల సందర్భంగా న్యూస్ యాంకర్ ఖలీద్ను చూడగానే కావాలనే తన చేతులను ముఖానికి అడ్డుపెట్టుకోవడం టీవీలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న న్యూస్ ఎడిటర్ అనురాధప్రసాద్ అతని చర్యలతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంకెప్పుడు అజయ్ను ఏ చర్చలకు తమ చానెల్కు పిలవదని స్పష్టంచేశారు. కాగా, ముస్లిం రాజకీయాలకు వ్యతిరేకంగా సంపూర్ణ హిందూ రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంతో అజయ్ గౌతమ్ 2015లో 'హమ్ హిందూ' ఆర్గనైజేషన్ను స్థాపించాడు. we at the newsroom of @news24tvchannel are in shock at the inappropriate & condemnable behaviour of Mr Ajay Gautam . Ethics of journalism do not allow to give platform to such devisive voices & gestures . @news24tvchannel has decided not to invite Mr Ajay Gautam to its studio .— Anurradha Prasad (@anurradhaprasad) August 1, 2019 Hindu leader Ajay Gautam was on a debate show & covered his eyes so he didn't have to see Khalid, a Muslim news presenter. This is NOT SATIRE! This is the state of national TV in #India in 2019. pic.twitter.com/lxqYzhxjMu — omer (@intellectroll) August 1, 2019 -
‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’
సాక్షి, రామగుండం(కరీంనగర్) : ‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచాడు. కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం దురదృష్టకరం’ అని రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడంతో రైల్వే, ఎన్టీపీసీ పూర్తిగా ప్రయివేటుపరం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కానుండడంతో కార్మిక రంగం మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిఖని విప్లవాలకు పురిటిగడ్డని, తాను సింగరేణి కార్మిక సంఘాల్లో 30 ఏళ్లు పనిచేశానని, సమీపంలోని కేశోరాం కర్మాగారంలో కూడా ఐదేళ్లు ఏకగ్రీవంగా తనను కార్మిక సంఘం నాయకుడిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశంలోనే రైల్వే వ్యవస్థ అతిపెద్ద కీలకమైన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అని దీనిని ప్రైవేటీకరిస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం ఖరీదవుతుందని అన్నారు. -
'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'
సాక్షి, అనంతపురం : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమేనని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచాయే తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పేరుతో భూములను చదును చేయడానికి దాదాపు రూ. 175 కోట్ల ప్రభుత్వ నిధులను ఉపయోగించిన బాబు అదే నిధులతో రాజధాని ప్రాంత అభివృద్ధిని మాత్రం చేపట్టడంలో విఫలమవ్వడమే గాక, ఇప్పుడు ఈ తప్పులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదకు నెడుతున్నారని మంత్రి ఆరోపించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటికీ చేర్చేందుకే గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ. 12,500 అందిస్తామని, పంటల బీమా ప్రీమియంలను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. -
'బాబూ శవరాజకీయాలు మానుకో'
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాల వ్యవధిలో జిల్లాలో 130 మంది రైతులు, 75 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఏనాడూ వారిని పరామర్శించేందుకు రాని వ్యక్తి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య స్థలవివాదంలో జరిగిన గొడవ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందితే శవరాజకీయాలు చేసేందుకు వచ్చాడని చంద్రబాబుపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రి , ధర్మవరంలో జరిగిన సంఘటనలు చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగిన సంఘటనలేనని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు హయాంలో పార్టీల వారీగా ప్రజలను విభజించి విభేదాలను రగిల్చాడని, ఇప్పుడు ఆ నింద తమపై వేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కారణంగా 21 మంది మృతి చెందారని, అంతెందుకు తాడిపత్రిలో మట్కాబీటర్లను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐని చితకబాదిన సంఘటన, ఆశ్రమ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనలు ఎవరి హయాంలో జరిగాయో జిల్లా ప్రజలు ఇంకా మరువలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసిన పాపాల కారణంగా మీకు ప్రజలు బాగా బుద్ధిచెప్పారనడానికి వారికి వచ్చిన 23 సీట్లే నిదర్శనమన్నారు. హిట్లిస్ట్లు అనౌన్స్ చేసి హతమార్చారు పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్చార్జ్ బాధ్యతల విషయమై కేతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఓసీ సంస్థ స్థాపన వెనుక ఎవరున్నారో ? ఆ సంస్థ చేసిన హత్యల వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి హిట్లిస్ట్లు ప్రకటించి మరీ హత్యలు చేసిన మాట వాస్తం కాదా ? అని ప్రశ్నించారు. తాము 25 ఏళ్లుగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ధర్మవరానికి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల హయాంలో జరిగిన హత్యలకు క్షమాపన చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాన్నారు. అక్కడలా ఇక్కడ వారి హడావుడి వ్యవహారాలు చెల్లబోవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. -
భార్యను వదిలేసినోడు.. చెల్లెళ్లను గౌరవిస్తాడా?
గోరఖ్పూర్: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమాయకురాలైన భార్య జశోదాబెన్ను మోదీ వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలోని మహిళా నేతలు కూడా మోదీలా తమ భర్తలు తమను వదిలేస్తారేమో అని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సెకనుకో కులం మార్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి మోదీలాంటి వ్యక్తికి ఓటేయవద్దని దేశంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ మహిళా నేతలకు భయం రాజస్తాన్లోని ఆళ్వార్లో దళిత మహిళపై అత్యాచారం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మోదీ డిమాండ్పై మాయావతి స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లు, భార్యలను ఎలా గౌరవిస్తాడు? ఇటీవల నాకు ఓ కొత్త విషయం తెలిసింది. తమ భర్తలు మోదీకి సమీపంగా ఉండటం చూసి బీజేపీ మహిళా నేతలే ఆందోళనకు గురవుతున్నారట! వాళ్లంతా మోదీలాగే తమను వదిలేస్తారని భయపడుతున్నారట. మోదీ హయాంలో గుజరాత్లో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. కాబట్టి ఆళ్వార్ ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు. మోదీని తప్పించేవరకూ ఎస్పీ–బీఎస్పీ పొత్తు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. మాయావతి క్షమాపణ చెప్పాలి: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాయావతి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల వివరాలను సీతారామన్ మీడియా ముందు ప్రదర్శించారు. ‘దళిత హక్కుల సాధన కోసం బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి.. దళిత్ బేటీ(దళిత కులం యువతి) స్థాయి నుంచి దౌలత్కీ బేటీ(ధనికురాలైన మహిళ)గా మారారు’ అని దుయ్యబట్టారు. మోదీపై విమర్శలతో మాయావతి తన స్థాయిని దిగజార్చుకున్నారనీ, ఆమె ప్రజాజీవితానికి అనర్హురాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. -
‘బాయ్’పై ప్రణయ్, సాయిప్రణీత్ ధ్వజం
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)కు తమ పేర్లను ప్రతిపాదించకపోవడంపై భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికార వర్గాలపై వారు విమర్శల దాడికి దిగారు. చైనా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మంగళవారం నుంచి జరుగనుంది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మలేసియా, ఇండోనేసియా నుంచి తమకంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగుతుండగా... ‘బాయ్’ ఉదాసీనత కారణంగా తా ను, సాయిప్రణీత్ అవకాశం కోల్పోయినట్లు ప్రణయ్ విమర్శించాడు. దీనిపై ‘బాయ్’ స్పందన మాత్రం వేరుగా ఉంది. బ్యాడ్మింటన్ ఆసియా (బీఏ) కోరిన మేరకు తాజా ర్యాంక్ల ప్రకారం పురుషుల, మహి ళల సింగిల్స్లో ఇద్దరేసి ఆటగాళ్లను ప్రతిపాదించా మని ‘బాయ్’ చెబుతోంది. మరోవైపు పలు టోర్నీలకు ఆటగాళ్ల ఎంట్రీలను పంపడంలో, వారి ప్రయా ణ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ‘బాయ్’ తీరు ఘోరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. -
వంచన, బెదిరింపులే మోదీ తత్వం
న్యూఢిల్లీ: ప్రజలను మోసం చేయడం, వంచించడం, ప్రతిఘటించిన వారిని బెదిరించడమే ప్రధాని మోదీ తత్వమని కాంగ్రెస్ నేత, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దేశప్రజలు ఒక భయానక పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారని ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామిక, లౌకిక పునాదులను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిందని, రాజ్యాంగ విలువలను పాతిపెట్టి ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. మాయమాటలతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మాటలతో సమస్యలు పరిష్కరించలేరని, కార్యాచరణ ద్వారానే సమస్యలు పరిష్కార మవుతాయని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం అదుపుచేస్తోందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు ‘ఈశాన్య ప్రాంతం రగిలిపోతోంది, జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దళితుల, ఆదివాసీల, మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోంది. రైతులు మనోవేదనలో ఉన్నారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపిం చడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఊపిరిలూదాయని సోనియా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నాయకత్వాన్ని ఆమె సమర్థించారు. ‘రాహుల్ కొత్త శక్తితో ముందుకు వెళుతు న్నారు. అనుభవాన్ని, యువతరాన్ని ఆయన సమంగా వినియోగించుకుంటున్నారు’ అని కుమారుడిని ప్రశంసించారు. ‘ప్రత్యర్థులు అజేయంగా కని పించినప్పటికీ రాహుల్ తన పనితీరుతో కార్య కర్తలను ఉత్తేజపరిచారు. లక్షలాది కార్యకర్తల శ్రమ వృధా కాలేదని, విజయం సాధించడంలో వారి పాత్ర కీలకం’ అని ఆమె ప్రశంసించారు. సమావేశంలో రాహుల్తోపాటు మన్మోహన్ సింగ్, ఖర్గే, ఆజాద్ పాల్గొన్నారు. -
బంధుప్రీతి ఉంది
గతేడాది ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) రాక్స్’ ఇష్యూలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, నటుడు సైఫ్ అలీఖాన్, నటుడు వరుణ్ ధావన్లకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు, కొంత సపోర్ట్ లభించిన విషయం గుర్తుండే ఉంటుంది. రీసెంట్గా వరుణ్ ధావన్ ఈ విషయంపై స్పందించారు. ‘‘అవును.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఒక భాగంగా ఉంది. కానీ బయటి నుంచి వచ్చే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సక్సెస్ఫుల్గా వినియోగించుకునే వారు ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఎవరో ఎందుకు? మా నాన్నగారు (డేవిడ్ ధావన్) బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. మా నాన్న కెరీర్ స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు ఇంకా గుర్తు ఉంది’’ అని చెప్పుకొచ్చారు వరుణ్« దావన్. ఇక సినిమాల విషయానికొస్తే... శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన ‘సూయి దాగా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో ఓ పాత్ర పోషిస్తున్నారు వరుణ్. -
విమర్శలను సహించలేక పోతున్న టీడీపీ నాయకులు
-
భారతీయ సినిమా పరువు తీసిన ప్రియాంక చోప్రా
-
పరువు తీసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్
నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా క్వాంటికో ఎపిసోడ్లో హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, అది కాస్త వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె చేసిన వ్యవహారం తాలూకూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అవార్డుల వేడుకకు హాజరైన ప్రియాంక అక్కడి వ్యాఖ్యాతతో మాట్లాడుతూ... ‘భారతీయ సినిమాలు అంటే ఏం ఉండదు.. కేవలం నడుము(హిప్) మరియు పై భాగం(బూ*) ఆడించటమే. అక్కడి చిత్రాల్లో అలా స్టెప్పులేస్తే సరిపోతుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సరదాగా మూమెంట్స్ చేసి మరీ చూపించారు. తన క్రేజ్ను పెంచుకోడానికి దిగజారి భారతీయ చలన చిత్రపరిశ్రమ పరువు తీయాలా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు. పాత వీడియోనే... అయితే తర్వాత అది 2016 ఎమ్మీ అవార్డు వేడుకల తాలూకూ వీడియో అన్నది తేలింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వైఖరిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఆ వీడియోను బయటకు దులిపిన కొందరు దానిని వైరల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత.. అదే స్థాయిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆమె.. టూరిజం క్యాలెండర్ కోసం చేసిన ఓ ఫోటో షూట్లో హాట్ హాట్గా ఫోజులివ్వగా, ఆ అంశం అసెంబ్లీని కుదిపేసింది కూడా. (నటి హాట్ ఫోటో.. అసెంబ్లీలో దుమారం) According to @priyankachopra - Bollywood in a Nutshell pic.twitter.com/nykaU9ZFnl — Rishi Bagree 🇮🇳 (@rishibagree) 9 June 2018 Indian movie is all about Hips and Boobs. According to mentality retired @priyankachopra. pic.twitter.com/fpzYD8IEQU — Hardik Bhatt 🧘♂️ (@iHardikB) 9 June 2018 I have just unfollowed @priyankachopra on Twitter and decided not to watch any of her movies/shows from now on. I request everyone to do the same. #BoycottPriyanka — Shusmita Rani 🇮🇳 (@ShusmitaRani) 9 June 2018 Humari billi hume hi meow .#Shame #PriyankaChopra #Quantico #quantico3 pic.twitter.com/vY8cgwqJM1 — Hunट₹₹♂ (@nickhunterr) 9 June 2018 Unexpected from Priyanka Chopra tbh describing our movies in that way is so so wrong ffs Indian movies are known for family drama & music & dance.. since when it is about boobs hips @priyankachopra which planet you live in? Cool banne ki ghatya koshish saali chutyaah. https://t.co/fRFiykPuPu — Zahra ♛ (@BreadAurJam) 9 June 2018 Disgusting of Priyanka Chopra to demean Bollywood. Bollywood makes worldclass movies. Even the recent ones like Dangal, Padman are fantastic. Looks like she has acted mostly in such low grade movies. https://t.co/qNzj5LrsUC — Arun Rao (@bigsanturi) 9 June 2018 Ha :@priyankachopra ne Bollywood me bahut boob's and hips hilayenge honge #castingcouch ke samne tabhi movies mili hogi😠😠😠😠 Insulting indian culture is her fashion now a days.. — Ticks (@ticks1301) 9 June 2018 Awesome! What else to expect from a wannabe firangan. So movie like Barfi where u were praised for your performance is also about that, right @priyankachopra ? Want to see how far ur arrogance with that irritating fake accent & plastic beauty will take u.Continue selling ur soul. https://t.co/9CWRMNZFRk — 🇮🇳 Shweta Singh (@swetassingh1) 9 June 2018 -
అవినీతిలో మీకు ‘గోల్డ్మెడల్’
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తన విమర్శల ధాటిని పెంచారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో ‘గోల్డ్ మెడల్’ సాధించిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలకు అధికారం మత్తు తలకెక్కిందని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుల్బర్గ, బళ్లారి, బెంగళూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ పాల్గొన్నారు. రాహుల్ వందేమాతరాన్ని అగౌరవపరచటం, సర్జికల్ దాడులను కాంగ్రెస్ ప్రశ్నించటాన్ని ప్రధాని గుర్తుచేశారు. జాతి గర్వించే సైనికుల త్యాగాలనూ కాంగ్రెస్ విస్మరించిందన్నారు. బెంగళూరులో జరిగిన ర్యాలీలో రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంత్రులకు, వారి శాఖలకు ఎవరెక్కువ అవినీతిపరులో నిరూపించుకునేందుకు పోటీ నెలకొందని ఎద్దేవా చేశారు. అందుకే సిద్దరామయ్య ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు అవినీతిలో గోల్డ్మెడలిస్టులని మోదీ పేర్కొన్నారు. ‘బెంగళూరు ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు పనులు, అవినీతి, అక్రమాలపై కోపంగా ఉన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరాన్ని ఐదేళ్లలో పాపపు నగరంగా (వ్యాలీ ఆఫ్ సిన్)గా మార్చేశారు. గార్డెన్ సిటీ (ఉద్యాన నగరి)ని గార్బేజ్ సిటీ (చెత్త నగరం)గా మార్చారు. కంప్యూటర్ రాజధానిని నేరాల రాజధానిగా మార్చారు’ అని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. జేడీఎస్ను బీజేపీ ‘బీ’టీమ్గా రాహుల్ పేర్కొనటాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జేడీఎస్కు ఓటు వేసి ఆ ఓటును వ్యర్థం చేసుకోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ మూడోస్థానంలో నిలుస్తుందన్నారు. మైనింగ్ పాలసీ మరిచారా? గాలి సోదరులకు టికెట్లు ఇవ్వటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మోదీ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా తాము అవినీతికి పాల్పడటం లేదని.. అక్రమ గనుల తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన మైనింగ్ పాలసీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ‘సీధా రూపయ్య గవర్నమెంట్’ (అవినీతి)గా అభివర్ణించారు. ‘సర్కారు బదలిసి.. బీజేపీ గెల్లిసి’ (ఈ సర్కారును మార్చండి.. బీజేపీని గెలిపించండి) అంటూ రెండు చేతులూ పైకెత్తి మోదీ కన్నడలో బిగ్గరగా నినదించారు. -
కామన్వెల్త్ గేమ్స్.. ముగింపు వేడుకలపై విమర్శలు
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ క్రీడల(2018) నిర్వాహకులు క్రీడాభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల నిర్వహణ సక్రమంగా లేదని.. టీవీల్లో టెలికాస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చీఫ్ పీటర్ బెట్టీ స్పందించారు. ‘ సాధారణంగా ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల కన్నా.. ముగింపు వేడుకలు క్రీడాకారులకు ఉపశమనం అందించేలా.. అందరిలో ఉత్సాహం నింపేలా నిర్వహించటం ఆనవాయితీ. కానీ, ఆ విషయంలో మేం పొరపాట్లు చేశాం. ముగింపు వేడుకల ముందే క్రీడాకారులను మేం మైదానంలోకి(కర్రారా స్టేడియం) లోకి పిలిచాం. మైదానంలో కొద్దిపాటి ప్రేక్షకులే ఉన్నారనుకుని టెలివిజన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు పొరపాటు పడ్డారు. క్రీడాకారులు జెండాలతో పెరేడ్ నిర్వహించటం కూడా కొన్ని ఛానెళ్లు సరిగ్గా ప్రసారం చేయలేకపోయారు. దీనికితోడు కొందరు క్రీడాకారులు ఇచ్చిన ఉపన్యాసాలు సుదీర్ఘంగా ఉండటం కూడా అందరికీ విసుగును పుట్టించాయి. వెరసి ముగింపు వేడుకలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నా అని బెట్టీ వరస ట్వీట్లలో పేర్కొన్నారు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ ప్రసార హక్కులు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఛానెల్ ‘సెవెన్’ కూడా ప్రోగ్రామ్ను సరిగ్గా టెలికాస్ట్ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తగా.. ఛానెల్ యాజమాన్యం కూడా ఓ ప్రకటనలో క్షమాపణలు తెలియజేసింది. -
దేవుడు ఇవ్వలేదు!
‘మాత్ర్’ సినిమా విడుదలై ఏడాది అయింది. ఆ తర్వాత బాలీవుడ్ రవీనా టాండన్ పెద్దగా వార్తల్లో లేరు. ఆమె పనుల్లో ఆమె ఉన్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ట్విటర్లో ప్రత్యక్షం అయ్యారు! ‘‘సెలబ్రిటీలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తిరిగి మాట అనే హక్కును మాత్రం సెలబ్రిటీలకు దేవుడు ఇవ్వలేదు. ట్వీటర్ వచ్చాకైతే చాలా తేలికైపోయాం’’ అని ఎంతో ఆవేదనగా కామెంట్ పెట్టారు రవీనా. దీనిని బట్టి రవీనా మనసును ఎవరో బాగా గాయపరిచినట్లే ఉంది. రవీనా ముక్కుసూటి మనిషి. ఇలాంటి కామెంట్లను, వెబ్సైట్ల ఆకతాయి వేషాలను అస్సలు సహించరు. ఓసారి షాదీడాట్కామ్, షాదీటైమ్స్డాట్కామ్ తన అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుకున్నందుకు ఆ రెండు సైట్ల మీద కేసు వేశారు. ఇంకోసారి ‘సత్యా సొల్యూషన్స్’ అనేవాళ్లు ‘మా వెబ్సైట్ వల్లే రవీనా, రవీనా భర్త కలుసుకున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలయ్యారు’ అని ప్రకటించుకోవడం ఆమెను అగ్గిమీద గుగ్గిలం చేసింది. ఆ సైట్ మీద కూడా రవీనా కేసు వేశారు. తన విషయమనే కాదు, సమాజంలోని అన్యాయాలను, దుశ్చర్యలను కూడా రవీనా ధైర్యంగా ఖండిస్తారు. అందుకు తాజా ఉదాహరణ.. పై ట్వీట్ పెట్టిన రోజే ఆమె మరో ట్వీట్ పెట్టి, రేప్ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ను విమర్శించడం. దీనిపై కూడా ఆమెకు పర్సనల్గా బెదిరింపులు వచ్చాయి కానీ రవీనా ఏమాత్రం స్పందించలేదు. సెంగర్ యు.పి.ఎమ్మెల్యే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే అతడు అత్యాచారయత్నం కేసు నుంచి తప్పించుకోగలిగాడని కూడా రవీనా ట్వీట్ చేశారు. బహుశా ఆ ట్వీట్ విషయంలోనే రవీనా మనసును ఎవరో గాయపరచి ఉండాలి. -
తిడతారని తెలుసు.. అయినా ఆ పాటను చేశాం!
సాక్షి, సినిమా : ఆణిముత్యాల్లాంటి సినిమాలనుగానీ, పాటలను గానీ రీమేక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటిని చెడగొట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్లో అలాంటిదే ఒకటి జరిగింది. 1988లో తేజబ్ సినిమాలోని ఏక్ దో తీన్ సాంగ్ను తాజాగా బాఘీ-2 చిత్రం కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. క్లాసిక్ సాంగ్లో మాధురి దీక్షిత్ స్టెప్పులు ఇరగదీస్తే... ఇప్పుడీ కొత్త పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిందులేసింది. అయితే పాట క్వాలిటీ పరంగానే కాదు.. విజువల్గా, డాన్సుల పరంగా కూడా అంత బాగోలేదని విమర్శకులు పెదవి విరిచేశారు. పైగా సోషల్ మీడియాలో ఈ ప్రయత్నంపై చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్పై ప్రేక్షకులు కొందరు దుమ్మెత్తిపోశారు. దర్శకుడి వివరణ... ఈ నేపథ్యంలో దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించాడు. పాటను సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక పాటకు డాన్సులు సమకూర్చుంది అహ్మదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఆయన స్పందించారు. ‘ఆ పాటను ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య కంపోజ్ చేశారు. ఆ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా పాట చిత్రీకరణ జరుపుకున్న సమయంలో ఆ దరిదాపులకు కూడా నేను వెళ్లలేదు’ అని అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘పాటను నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం క్లాసిక్ పాటకు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేద్దామన్న ప్రయత్నం మాత్రమే మాది. అయినా ఈ పాటపై విమర్శించే వారిని మేం పట్టించుకోలేదల్చుకోలేదు. కాకపోతే ఈ పాటపై మాధురి దీక్షిత్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్తోపాటు ఈ పాట ఒరిజినల్ కంపోజర్(తేజబ్ చిత్రం) సరోజ్ ఖాన్ కూడా ఈ ప్రయత్నంపై అభినందనలు గుప్పిస్తూ.. చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జంటగా నటించిన భాఘీ తెలుగు క్షణం సినిమాకు రీమేక్. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘సన్నీలియోన్ చనిపోతే ఏం చేస్తారో?’
సాక్షి, చెన్నై : నటి కస్తూరి తరచూ వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్, సీనియర్ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీయగా.. ఈ మధ్యే కమల్ రాజకీయ ప్రస్థానంపై కూడా ఆమె చవాక్కులు పేల్చి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇక తాజాగా ట్విట్టర్లో చేసిన ఓ పోస్టు దుమారాన్ని రేపుతోంది. ‘శ్రీదేవి చనిపోయిందని అన్ని న్యూస్ ఛానెళ్లు ఆమెకు సంబంధించిన పాటలను, వీడియోలను ప్రదర్శిస్తున్నాయి. ఒకవేళ సన్నీ లియోన్ చనిపోతే అప్పుడు ఏం ప్రదర్శిస్తాయో’ అంటూ ఓ ట్వీట్ను ఆమె చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్లో వచ్చిన ఓ జోక్ సందేశాన్నే తాను పెట్టినట్లు ఆమె స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఈ సమయంలో ఇలాంటి అసందర్భోచిత పోస్టు చేయటం.. పైగా ఒక నటి అయి ఉండి మరో నటిని అవమానించటం సరికాదని కస్తూరి తీరును పలువురు తప్పుబడుతున్నారు. All the news channels are showing songs and clips of Late Sridevi Wondering what will happen when Sunny Leone expires someday😲😜🤪#facebook #forward pic.twitter.com/D1whQIV1kD — kasturi shankar (@KasthuriShankar) 27 February 2018 -
‘నాకు లేని అభ్యంతరం వారికెందుకు?’
సాక్షి, సినిమా : దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్లో ‘అయ్యారీ’తో ప్రేక్షకులను పలకరించబోతోంది రకుల్. ఈ క్రమంలో ఓవైపు హీరో సిధార్థ్ మల్హోత్రాతోపాటు చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంది. మరోవైపు హాట్ ఫోటో షూట్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సౌత్లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్ ఒక్కసారిగా ‘అలా’ కనిపించేసరికి ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రకుల్ స్పందించింది. వారికేమైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆమె మాంచి సమాధానమే ఇచ్చింది. ‘ఆ ఫోటోషూట్పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు. కెరీర్లో ఒక్కసారైనా ప్రముఖ మాగ్జైన్ కవర్ పేజీలపై మెరవాలన్న కోరిక ప్రతీ నటీనటులకు ఉంటుంది. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా. అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు. నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోనని ఆమె తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్, కోలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్ వివరించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన అయ్యారీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సిధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్పాయి, రకుల్ ప్రధాన పాత్రలు పోషించారు. Sending you all a little love this Feb with my cover for @maxim.india #rakulformaxim ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Feb 6, 2018 at 11:44pm PST -
కత్తి ‘కవర్ డ్రైవ్’ పని చేయట్లేదు!
సాక్షి, సినిమా : సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టచ్ చేసి చూడు చిత్రానికి రివ్యూ ఇచ్చి రవితేజ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. సినిమా చూసిన కాసేపటికే కత్తి మహేష్ తన వర్షెన్ రివ్యూను ఇచ్చేస్తూ.. సినిమాను టచ్ చేయకపోతేనే బెటర్ అని వ్యాఖ్యానించాడు. అంతే మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇది చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ఉంది. కానీ, వేస్ట్ అని డిసైడ్ చేయటడానికి నువ్వెవరూ?’ అంటూ కత్తిపై విరుచుకుపడుతున్నారు. దీంతో కత్తి మరో ట్వీట్ చేశారు. ‘సినిమా నచ్చితే చూడమని రెకమండ్ చేసినట్టే. నచ్చకపోతే, చూడకపోతే బెటర్ అని కూడా చెప్తామ్! అందులో తప్పేముంది’ అని తెలిపారు. అయినా తన రివ్యూలో సినిమాను చూడటం.. చూడకపోవటం... అనే ఛాయిస్ను ప్రేక్షకుడికే వదిలేస్తానంటూ ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఏది ఏమైనా స్టార్ హీరోల విషయంలో కత్తి మహేష్ ముందు ట్వీట్లు చేయటం.. అవి వివాదాస్పదం అవుతుండటంతో... కేవలం తన అభిప్రాయమేనంటూ తేల్చేయటం ఫ్యాన్స్కు ఏ మాత్రం రుచించటం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవహారం మాదిరే.. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్ని చర్చలకు దారితీస్తుందోనని సగటు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. -
ట్రంప్ను తిట్టడం మాత్రం ఆపను...
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు చేయటం ఆపబోనని క్రేజీ పాప్ సింగర్ ఎమినెమ్ ఉద్ఘాటించాడు. ట్రంప్ పై తన ఆలోచన ధోరణిని, అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని అతను అంటున్నాడు. ‘‘నేను ఆయన్ని(ట్రంప్ను) విమర్శించటం అస్సలు ఆపను. నా అభిమానులు నాకు దూరమైన సరే.. ట్రంప్ను తిట్టడమే నా ధ్యేయం. హిల్లరీ కూడా తప్పులు చేశారని తెలుసు. కానీ, ట్రంప్ లాంటి మూర్ఖుడు కాకుండా వేరే ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా నేను అంగీకరించేవాడిని. ట్రంప్ ఒక చెత్త వ్యక్తి. చెత్త నిర్ణయాలతో అమెరికాను అంతర్జాతీయ సమాజంలో సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాడు. అందుకే అతనంటే నాకు అసహ్యం. ఈ విషయంలో నా సగం మంది అభిమానులు నాకు దూరమైనా.. నా వైఖరి మార్చుకోను’’ అని ఎమినెమ్ స్పష్టం చేశాడు. 45 ఏళ్ల ఈ క్రేజీ పాప్ స్టార్ గతంలోనూ ట్రంప్ పై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ లాంటి జోకర్కు ఓటేసి గెలిపిస్తే.. మనమంతా పిచ్చొళ్లు కావటం ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో ఎమినెమ్ అమెరికన్లను ఉద్దేశించి కామెంట్లు చేశాడు. -
చిత్తశుద్ధి ఏదీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెడిపోయిన వ్యవస్థను చక్కదిద్దుతాం, రాజకీయాల్లోకి వస్తాం, రాష్ట్రంలో మార్పులు తెస్తాం అంటూ ప్రగల్బాలు పలికిన నటులు రజనీకాంత్, కమల్హాసన్ తమ చిత్తశుద్ధిని కనపర్చడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భరించలేని బస్సు చార్జీల భారంపై ప్రజాందోళనలు జరుగుతుండగా కమల్, రజనీ ప్రజల పక్షం నిలవకపోగా కనీస స్థాయిలో ఖండించక పోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ఈనెల 20 నుంచీ బస్సు చార్జీలను నూరు శాతం పెంచింది. రాత్రికి రాత్రే అకస్మాత్తుగా పెరిగిన చార్జీలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన పోరాటాలు కొనసాగిస్తున్నాయి. పెరిగిన చార్జీల భారాన్ని భరించలేక ప్రజలు బస్సులు ఎక్కడాన్ని మానుకుంటున్నారు. నామమాత్రపు చార్జీలున్న లోకల్, ఎక్స్ప్రెస్ రైళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. బస్సు చార్జీలపై ప్రజలు భగ్గుమన్నా రజనీ, కమల్హాసన్ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. బహిరంగ విమర్శలు, సామాజిక మాధ్యమాల్లో విసుర్లు రావడంతో ఉలిక్కిపడిన కమల్హాసన్ మంగళవారం రాత్రి ఎట్టకేలకూ ట్వీట్ చేశారు. బస్సు చార్జీలను విపరీతంగా పెంచడం ద్వారా ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని అన్నాడీఎంకే ప్రభుత్వం నిరూపించుకుందని కమల్ విమర్శించారు. ఏకపక్షంగా చార్జీలు పెంచి నేడు అభిప్రాయసేకరణకు పూనుకోవడం ద్వారా తమ రాజకీయ చాణుక్యాన్ని చాటుకుందని వ్యాఖ్యానించారు. చార్జీలు పెంచకుండా రాబడి పెంచే ఉపాయాలను చెప్పేందుకు ఎందరో అధికారులు రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు. కమల్లో కదలిక వచ్చిన తరువాత కూడా రజనీకాంత్ మౌనం పాటించడాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఖజానా లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఒక నటుడు చెప్పడం విడ్డూరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా కమల్ను దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో నటించింది ఖజానాను నింపుకున్న కమల్ రాజకీయాల్లో నిజాయితీ పాటిస్తానంటేæ తాను నమ్మనని అన్నారు. రాష్ట్రంలో మార్పు తెస్తాం అంటూ తమిళనాడుపై ప్రయోగాలు చేసేందుకు పర్యటనలు జరుపనున్నారని రజనీ, కమల్ గురించి ఆమె విమర్శించారు. సినిమాలు ఫ్లాపులు కావడం వల్లనే రజనీ, కమల్ రాజకీయబాట పట్టారని మాజీ మంత్రి వలర్మతి ఎద్దేవా చేశారు. సినిమాల్లో తాగుబోతు, తిరుగుబోతు వేషాలు వేయకుండా మహిళల పట్ల గౌరవభావం కనపరిచినందునే ఎంజీ రామచంద్రన్ను తమిళనాడు ప్రజలు దేవుడిగా పూజించారని అన్నారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వెండితెరపై మెరిసిన రజనీ, కమల్కు రాజకీయాల్లో ఛేదు అనుభవం తప్పదని ఆమె వ్యాఖ్యానించారు. నటులు రజనీకాంత్ రాజకీయ సన్నాహాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన చెన్నై అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశం అవుతున్నారు. చెన్నై జిల్లాలోని యువజన, మహిళా సంఘ నిర్వాహకులను ఎంపిక చేసే నిమిత్తం చెన్నై కోడంబాక్కంలోని తనకు సొంతమైన రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరుపుతున్నారు. -
ఉగ్రవాదులు కాదు.. వాళ్లూ అమర వీరులే!
శ్రీనగర్ : కశ్మీర్ అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ చిచ్చును రాజేస్తున్నాయి. పీపుల్ డెమొక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మీర్ ఎన్కౌంటర్లో చనిపోతున్న టెర్రరిస్టులను అమర వీరులుగా పేర్కొన్నారు. దీంతో మిత్రపక్షం బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘‘ఉగ్రవాదులను చనిపోతుంటే మేం వేడుకలు చేసుకోలేం. ఎందుకంటే వారు మాకు సోదరులే. ఇకపై జవాన్ల కుటుంబాలతోపాటు మిలిటెంట్ల కుటుంబాలకు కూడా మా సంఘీభావం తెలుపుతాం’’ అని గురువారం అసెంబ్లీ బయట ఓ జాతీయ మీడియాతో మీర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారు ఉగ్రవాదులా? పోలీసులా? అని తమకు సంబంధం లేదని.. కశ్మీర్ గడ్డపై పుట్టిన వారందరినీ తాము అమరులుగానే భావిస్తామని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంలో వేర్పాటువాదులతో, ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ మీర్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వాచి అసెంబ్లీ నియోజక వర్గం(సోఫిన్ జిల్లా)లో ఉగ్రవాదుల దాడులు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబర్లో మీర్ ఇంటిపైనే గ్రెనేడ్ దాడి జరగగా.. స్వల్ఫ గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయినా సరే ఉగ్రవాదులకు మద్దతుగా ఆయన అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. వారు చనిపోయినప్పుడు వేడుకలు చేసుకోవద్దంటూ బుధవారం ఎమ్మెల్యేలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఇక మీర్ వ్యాఖ్యలను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నరరూప రాక్షసులను అమరులుగా అభివర్ణించటాన్ని కశ్మీర్ రవాణా శాఖా మంత్రి సునీల్ శర్మ తప్పుబట్టారు. ఇక ఈ వ్యాఖ్యలు పీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శిస్తోంది. -
ఆన్ లైన్ యాడ్.. సోషల్ మీడియాలో చిచ్చు
వాషింగ్టన్ : ‘‘కూలెస్ట్ మంకీ ఇన్ ది జంగిల్’’ అంటూ ఓ ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. నల్ల జాతీయులను కించపరిచేలా ఉన్న ఆ యాడ్పై సదరు కంపెనీ నుంచి క్షమాపణలు డిమాండ్ చేస్తూ నల్లజాతీయుల ఫోరమ్ నిరసన చేపట్టింది. స్వీడిష్ దుస్తుల కంపెనీ ఒకటి బ్రిటన్లో తమ అమ్మకాల కోసం ఆన్ లైన్ అమ్మకాల సంస్థ హెచ్ అండ్ ఎమ్తో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఆన్లైన్లో వారు ఓ యాడ్ పోస్టు చేశారు. అందులో ఓ నల్ల జాతికి చెందిన బాలుడి స్వెటర్పై మంకీ అంటూ వ్యాఖ్యను పేర్కొంది. పక్కనే శ్వేత జాతికి చెందిన పిల్లాడి ఫోటోను ఉంచి.. అతని స్వెటర్పై పులి ఫోటోతో శ్వేత జాతీయులు గొప్పవారు అని అర్థం వచ్చేలా మరో వ్యాఖ్య చేసింది. అంతే సోషల్ మీడియాలో అంతా ఆ కంపెనీ యాడ్పై భగ్గుమన్నారు. ఇది జాతి వివక్షతేనన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు, పాత్రికేయులు, ఉద్యమకారులు హెచ్అండ్ఎమ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ యార్క్ టైమ్స్ కాలమిస్ట్ హెచ్ అండ్ ఎమ్ కి మతి పోయిందటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మరికొందరు హెచ్ అండ్ ఎమ్కు మద్దతుగా పోస్టులు చేయటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వివాదాలు చోటు చేసుకున్నారు. ఇక నల్ల జాతీయుల ఫోరమ్ వ్యతిరేక ఉద్యమం చేపట్టడంతో ఆ ప్రభావం కారణంగా హెచ్ అండ్ ఎమ్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఎట్టకేలకు సదరు దిగ్గజ సంస్థ దిగొచ్చింది. క్షమించండి.. ‘‘ఈ ఫోటో కారణంగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. ఇందుకు మేం పశ్చాత్తాపం తెలియజేస్తూ క్షమించమని కోరుతున్నాం. మా ఛానెల్స్ నుంచి ఈ ఫోటోను తీసేస్తున్నాం’’ అని హెచ్ అండ్ ఎమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, గతంలో డోవ్ సంస్థ కూడా ఓ యాడ్తో జాతి వివక్ష విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు తెలియజేసింది. -
థ్యాంక్ యూ నితీశ్.. లాలూ కొడుకు ట్వీట్
పట్నా : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష కాలం ఖరారయ్యాక కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, జేడీయూలు హర్షం వ్యక్తం చేయటం ఆర్జేడీ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. శత్రువులతో చేతులు కలపటమే కాకుండా.. మిత్రుడి(లాలూ)ని దారుణమైన వెన్నుపోటు పొడిచారంటూ బిహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేతలు విరుచుకుపడుతున్నారు. లాలూను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ ఓ ప్రణాళికతోనే మహా కూటమిని విచ్ఛిన్నం చేసిందని.. ఈ క్రమంలో జేడీయూ కూడా వారికి తలొగ్గిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక లాలూ తనయుడు తేజస్వి యాదవ్ తన ట్విట్టర్లో ఓ వ్యంగ్య పోస్టును ఉంచారు. థాంక్యూ వెరీ మచ్ నితీష్ కుమార్ అంటూ నిన్న సాయంత్రం ఆయన తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. Thank you very much Nitish Kumar — Tejashwi Yadav (@yadavtejashwi) 6 January 2018 అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ లాలూ బీజేపీతో సంధి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ‘‘లాలూ బీజేపీ ముందు మోకరిల్లి ఉంటే.. ఆ పార్టీ ఆయన్ని రాజా సత్యహరిశ్చంద్రుడిగా అభివర్ణించి ఉండేదేమో. ఈ విషయంలో జేడీయూ చాలా ముందుంది’’ అని తేజస్వి ఎద్దేవా చేశారు. జేడీయూ నమ్మకద్రోహాన్ని మరిచిపోలేమన్న తేజస్వి .. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు జేడీయూలు తేజస్వి వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నాయి. అవినీతి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినప్పుడే లాలూ జైలుకు వెళ్లటం ఖాయమైపోయిందని, తేజస్వి పిల్ల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ సూచించగా.. లాలూ అవినీతి రాజకీయాలకు శుభం కార్డు పడిందని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూ సహా మిగతా దోషులకు రాంచీ సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసిన విషయం విదితమే. -
తీవ్ర వివాదాస్పదంగా మారిన యోగి నిర్ణయం
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కాషాయం రంగు పూయాలని గతంలో ఆయన అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అది ఇప్పుడు మతపరమైన విమర్శలకు దారితీసింది. ప్రధాన కార్యాలయంతోసహా హజ్ కమిటీ ఆఫీసులకు కూడా అధికారులు కాషాయం రంగు పూయటంతో ఇస్లాం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆయా కార్యాలయాల గోడల రంగును మార్చేయటంతో అది తీవ్ర స్థాయికి చేరుకుంది. ‘‘ఇది ముమ్మాటికీ ఖండించదగ్గ అంశం. సాధారణంగా ఈ రంగు రాజకీయాల కోసం వాడేది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు హజ్ యాత్రికులను కూడా కాషాయపు దుస్తులు ధరించమంటారేమో?’’ అని లక్నో హజ్ కమిటీ అధికారి షాహర్ ఖాజీ మౌలానా అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హజ్ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇక షియా పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా యాసుబ్ అబ్బాస్ కూడా యోగి ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రంగులు మారుస్తారా? అది కూడా మనోభావాలు దెబ్బతీసేలా.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ అబ్బాస్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విమర్శలను చాలా తేలికగా తీసుకుంటోంది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోసిన్ రాజా.. సీఎం యోగి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కాషాయం రంగు శక్తి, వెలుగులకు చిహ్నమని... ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో కార్యాలయాలకు అంతకు ముందు తెలుపు రంగు ఉండేది. కానీ, గతేడాది అక్టోబర్లో వాటన్నింటికి కాషాయం రంగు పూయాలంటూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయం లాల్ బహదూర్ శాస్త్రి భవన్తో మొదలుపెట్టి ఇప్పటిదాకా 100 స్కూళ్లకు, 50 ఆర్టీసీ బస్సులకు, పలు పోలీస్ స్టేషన్లకు కాషాయం రంగు అధికారులు అద్దేశారు. -
గంటాపై గుర్రు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ మంత్రి గంటా ఉత్సవంగా మారి పోయింది. ఉత్సవాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తన ఇంటి కార్యక్రమంలా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారంటూ సహచర ఎమ్మెల్యేల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం సమీక్షలు కాదు కదా.. ఏర్పాట్లలో కూడా ఏ ఒక్కరినీ భాగస్వామ్యం చేయకపోవడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గంటా తీరుపై కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలంతా.. విశాఖ ఉత్సవ్కు గైర్హాజ రుతో తమ నిరసనను తెలియజేశారు. వరసగా రెండో రోజు కూడా మంత్రి అయ్యన్నతో సహా ఎమ్మెల్యేలు ఉత్సవాలకు డుమ్మా కొట్టడం అధికార టీడీపీలో చర్చకు దారి తీసింది. రచ్చకెక్కిన విభేదాలు గంటా–అయ్యన్న మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. అవకాశం దొరికినప్పుడల్లా గంటాపై ఒంటికాలిపై లేచే మంత్రి అయ్యన్న ఆయన ఒంటెద్దు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన మూడేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న అయ్యన్న.. ఈసారి కూడా ఉత్సవాల దరిదాపుల్లోకి రాలేదు. కనీసం సమీక్షల్లో కూడా ఎక్కడా ఆయన పాల్గొనలేదు. ప్రస్తుతం శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మంత్రి అయ్యన్న శనివారం సొంత నియోజకవర్గమైన నర్సీపట్నంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చివరి రోజు కూడా ఆయన వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. రెండు రోజూ ఎమ్మెల్యేలు డుమ్మా మరో వైపు మంత్రి గంటా తీరుపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఉత్సవాల దారిదాపులకు వెళ్లలేదు. తొలిరోజు ఏకంగా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వచ్చినా.. ఒక్క ఎమ్మెల్యే కూడా ఉత్సవాల్లో పాల్గొనలేదు. కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ, గెస్ట్హౌస్లో పలకరించేందుకు కూడా రాలేదు. స్పీకర్గా బ్రహ్మరథం పడతారని నగరానికి వచ్చిన కోడెలకు ఆశాభంగం ఎదురైంది. గంటా, అమర్నా«థ్లతో కలసి కార్నివాల్లో పాల్గొన్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పటికీ.. ముక్తసరిగా నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. రెండోరోజు మంత్రి అయ్యన్న మాటెలాగున్నా నగర ఎమ్మెల్యేలు, ఎంపీలైనా వస్తారని అంతా భావించారు. కానీ ఒక్క గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉత్సవాల చుట్టుపక్కల కనిపించలేదు. రెండో రోజైన శుక్రవారం కొల్లు రవీంద్ర, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ విశాఖ ఉత్సవ్కు హాజరయ్యారు. అసంతృప్తిలో వెలగపూడి ఉత్సవాలు జరిగే ఆర్కేబీచ్ ప్రాంతం తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. చివరకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉత్సవాలకు డుమ్మా కొట్టారు. గంటాపైన, అధికారుల తీరుపైన వెలగపూడి ఒంటికాలిపై లేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని, ఆహ్వాన పత్రికల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిపి పేర్లు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్తో సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా గంటా తీరుపై గుర్రుగా ఉన్నారు. జిల్లా అధికారులు గంటా అడుగులకు మడుగులొత్తుతూ తమను పట్టించుకోవడం లేదంటూ జెడ్పీ చైర్పర్సన్తో సహా ఎమ్మెల్యేలందరూ మండిపడుతున్నారు. టూరిజం ఈడీ తీరుపై ఆగ్రహం ప్రస్తుతం విశాఖ ఉత్సవ్కు టూరిజం ఈడీ శ్రీరాములునాయుడు తీరుపై ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంటాను తప్ప ఇతర ప్రజాప్రతినిధులను ఆయన పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా పిలవడం కానీ, కనీసం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వడం కానీ చేయలేదని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఉత్సవాల పేరిట లెక్కా పత్రం లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుండడం ఎంతవరకు సమంజసమని మంత్రి అయ్యన్నే గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. మొత్తం మీద విశాఖ ఉత్సవాలు అధికార టీడీపీలో విబేధాలకు మరోసారి కేంద్రమయ్యాయి. -
DGP నియామకంలో సర్కార్ తీరుపై విమర్శలు
-
గాడి తప్పిన గుజరాత్ ఎన్నికల ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య విజయావకాశాల వ్యత్యాసం క్రమంగా తగ్గుతూ పోటీ రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తమ విధానాలు, మేనిఫెస్టో అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు పాల్పడుతున్నాయి. గుజరాత్ను గత 22 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీనే పాలిస్తున్నందున ప్రజల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అలాగే కేంద్రంలోని పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలకు ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలను, ఇప్పటి వరకు చేపట్టిన అభివద్ధి పనుల గురించి పాలకపక్షాన్ని నిలదీసే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనతోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివద్ధిని పోలుస్తూ కాంగ్రెస్ పార్టీని, దాని మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ ఎండగట్టవచ్చు. తొలుత ఈ దిశగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు దిగజారిన ప్రాంతీయ పార్టీల మాదిరిగానే వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు దిగుతున్నాయి. తాను నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని కానని, మనిషినని రాహుల్ గాంధీ చెప్పడం, ఔరంగ జేబు వారసుడు రాహుల్ గాంధీ అంటూ మోదీ విమర్శించడం అలాంటి కోవకు చెందిన విమర్శలే. కాంగ్రెస్ పత్రిక ‘యువదేశ్’ లో మోదీని అవమానించేలా చాయ్వాలా కామెంట్ను ట్వీట్ చేసింది. బ్రిటీష్ ప్రధాన మంత్రి థెరిస్సా మేను నరేంద్ర మోదీ ‘మే మే’ అని సంబోధించగా, ప్రధాన మంత్రిని ప్రీమ్ అని పిలుస్తారని పక్కనే ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా ఇవ్వగా, నీకెందుకిదంతా ‘ఛాయ్ బేజ్’ అని థెరిస్సా మే సలహా ఇచ్చినట్లు ఫొటోలతో కామెంట్ రాశారు. ఆ తర్వాత సైట్ నుంచి ఈ ట్వీట్ను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ ‘జహంగీర్ వారసుడిగా షాజహాన్ ఎన్నికైనప్పుడు ఎన్నికలు జరుగలేదు. షాజహాన్ వారసుడిగా ఔరంగ జేబు ఎన్నికైనప్పుడు ఎన్నికలు జరగలేదు. వారంతా వారసత్వంగా రాజులయ్యారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైనా పోటీ చేయవచ్చు. రండీ పూనావాలా రాహుల్కు వ్యతిరేకంగా పోటీ చేయండి’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ, నరేంద్ర మోదీ తమకు అనుకూలంగా వక్రీకరించారు. కాంగ్రెస్ పార్టీది ఔరంగ జేబు రాజ్యమని, రాహుల్ గాంధీ ఆయన వారసుడని మోదీ విమర్శించారు. లిటిగెంట్గా మాట్లాడే మణిశంకర్ అయ్యర్ రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా మొఘల్ వారసత్వం గురించి అనవసరంగా ప్రస్తావించి వక్రీకరణకు పరోక్షంగా కారణం అయ్యారు. ఇక అయోధ్య కేసుకు, ఎన్నికలకు సంబంధం ఏమిటంటూనే నరేంద్ర మోదీ వివాదాస్పద రామ మందిరం సమస్యను ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు అయోధ్య వివాదంపై విచారణను, తీర్పును వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో విజ్ఞప్తి చేయడాన్ని మోదీ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించారు. కపిల్ సిబల్ కూడా అనవసరంగా ఇలాంటి విజ్ఞప్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టారు. -
పార్టీ ఎన్నికల్లోనూ రిగ్గింగేనా?
భరూచ్/సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికను ఒక ప్రహసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్నిక జరగకమునుపే ఫలితం వెల్లడయిందని, ఏఐసీసీకి రాహుల్గాంధీయే అధ్యక్షుడవుతారని అందరి కీ తెలిసిపోయిందన్నారు. దీనిని బట్టి సంస్థాగత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారని వెల్లడయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సురేంద్రనగర్, భరూచ్లలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడగలుగుతారని కాంగ్రెస్ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రిగ్గింగ్ ఆనవాయితీగా మారిందన్నారు. ముందుగా ఆ పార్టీలోనే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు. జవహ ర్లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్కే అప్పటి పార్టీ సమావేశంలో ఎక్కువ ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్కు పాల్పడి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారన్నారు. మొరార్జీ దేశాయ్ విషయం లోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా కూడా పార్టీ అంతర్గత ఎన్నికల తీరును తప్పుబట్టారని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ యువనేతను గద్దెపైన కూర్చోబెట్టేందుకు నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. సమాజాన్ని విభజించాలని చూస్తోంది కులాలు, మతాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములమధ్య, ధనిక పేద, వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి, అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆయా కులాల నాయకులు హార్దిక్పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి వారితో ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు. వాళ్లు చేయలేని పనిని మేం చేశాం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ. వారు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు కాంగ్రెస్కు మంటగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చౌకబారు విమర్శలకు చేస్తున్నారని అన్నారు. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించటం వారికి ఇష్టం లేకుంటే ఎద్దుల బండ్లపై తిరగొచ్చునని ఎద్దేవాచేశారు. జాతీయతే మనల్ని సాయపడేలా చేస్తుంది: మోదీ అహ్మదాబాద్: జాతీయత భావమే తనకు, తన ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా ఉంటూ, క్రైస్తవులు సహా వివిధ వర్గాల ప్రజలకు సాయపడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వ విద్యాప్రతిష్టానమ్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గాంధీనగర్ ఆర్చిబిషప్ థామస్ మెక్వాన్ గత నెలలో క్రైస్తవులకు రాసిన లేఖను ప్రస్తావించారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రార్థన చేయాలని క్రైస్తవులను ఆ లేఖలో కోరటం తనను ఎంతో ఉత్తేజితుడిని చేసిందన్నారు. ఆ లేఖ ప్రతి భారతీయుడికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. -
టూమచ్ ట్రంప్, వెంబడించి మరీ...
వర్జీనియా : ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది. కానీ, తన విధానాల వల్లనో లేక గత చరిత్ర మూలంగానే ఏమో డొనాల్డ్ ట్రంప్పై దానిని నిలుపుకోలేకపోతున్నారు. అక్కడి ప్రజలకే ఆయనపై కనీస మర్యాద లేకుండా పోతుంది. గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో మొదలైన ఈ వ్యతిరేకత.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన పాలనపై వ్యతిరేకత వెల్లగక్కిన ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రతీ వారాంతం వర్జీనియాలోని తన నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గడపటం అలవాటుగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా మొన్న శనివారం కూడా వెళ్లిన ఆయనకు ఓ మహిళ మధ్య వేలు చూపించేసింది. తిరిగి వైట్హౌజ్కు పయనమైన క్రమంలో కాన్వాయ్ను వెంబడించి మరీ ఆ మహిళ ఆ పని చేసింది. రెండుసార్లు ట్రంప్ ఉన్న కారు దగ్గరకు వెళ్లిన ఆమె మిడిల్ ఫింగర్ సింబల్ చూపిస్తూ ముందుకెళ్లింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించటం లేదు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీ కూడా అక్కడి సీసీ కెమెరాల్లో లేకపోవటం గమనార్హం. ఆ మహిళ ఎవరన్నది తెలియకపోయినా.. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు కురిపించటం గమనార్హం. Lone cyclist responds to @POTUS motorcade shortly after departing Trump National Golf Club in Sterling, Va. (Photo: @b_smialowski/@AFP) pic.twitter.com/MKM1kVIyTY — Steve Herman (@W7VOA) October 29, 2017 ట్రంప్.. జల్సా రాయుడు ట్రంప్ 285 రోజుల పాలనలో 96 రోజులు వైట్హౌజ్కు దూరంకాగా.. అందులో దాదాపు 80 రోజులు కేవలం గోల్ఫ్ క్లబ్లోనే గడిపాడంట. పాలన సంగతి పక్కన పెట్టి జల్సాగా గడుపుతున్నాడంటూ ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉండే తక్కువ సమయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆర్థికవేత్తలు కూడా ఆయనపై మండిపడుతున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే... గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గోల్ఫ్ తెగ ఆడుతున్నాడంటూ ట్రంప్ విమర్శలు చేయటం. -
అక్కడ రీకౌంటింగ్ జరగలేదు: చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తేనే గుజరాత్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రీకౌంటింగ్లో కాంగ్రెస్ గెలిచిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కౌంటింగ్కు ముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని, అక్కడ కౌంటింగ్ జరిగిందని, రీకౌంటింగ్ జరగలేదని స్పష్టంచేశారు. స్పష్టత కావాలంటే ఈసీనే సంప్రదించాలని సూచించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించకపోవడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ను మోదీ తప్పుబట్టారు. ఈసీని పౌరులు కాకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారో చెప్పాలని చిదంబరం డిమాండ్చేశారు. -
చిన్న, మధ్యస్థాయి వర్తకులకు ఊరట
న్యూఢిల్లీ: మూడు నెలల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా జీఎస్టీపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో జీఎస్టీని సులభతరం చేస్తూ పలు సవరణలు చేసింది. వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లను తగ్గించింది. జీఎస్టీలో పన్ను చెల్లింపులు, రిటర్ను దాఖలు విధివిధానాలు క్లిష్టంగా ఉన్నాయంటూ చిన్న, మధ్యస్థాయి వర్తకులు వాపోతున్న నేపథ్యంలో వారికి ఊరట కలిగించేలా ఆయా విధానాలను కూడా సరళీకరిస్తూ శుక్రవారం జరిగిన 22వ భేటీలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఎగుమతిదారులకు కూడా నిబంధనలను సడలించింది. మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పరోక్ష పన్ను వ్యవస్థను సమూలంగా మార్చివేస్తూ ప్రభుత్వం జూలై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. గత మూడు నెలల్లో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై నవంబరు 9న జరిగే మండలి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ మండలి నిర్ణయాలు ► రూ.కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఇకపై ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్నును చెల్లించడంతోపాటు, రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనివల్ల 90 శాతం వ్యాపారులకు ఊరట కలగనుంది. ► ఇప్పటి వరకు రూ.75 లక్షల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలను కాంపోజిషన్ పథకంలో చేరేందుకు అనుమతిస్తుండగా, తాజాగా ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు. కాంపోజిషన్ పథకంలో ఉన్న వర్తకులు మూడు నెలలకోసారి తమ పన్నులు చెల్లించి, రిటర్నులు దాఖలు చేయవచ్చు. వివరంగా రికార్డులను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటివరకు 90 లక్షల మంది వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకోగా వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకున్నారు. ► ఎగుమతిదారులు జూలై నెలలో ఎగుమతులకు సంబంధించి చేసిన పన్ను చెల్లింపులకు సంబంధించిన రీఫండ్ను అక్టోబరు 10లోపు, ఆగస్టు నెల ఎగుమతులకు రీఫండ్ను అక్టోబరు 18లోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఎగుమతిదారులను మినహాయింపు పొందిన వర్గంగా పరిగణిస్తారు. వారు తాత్కాలికంగా నామమాత్రపు 0.1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. 2018 ఏప్రిల్ 1 కల్లా ఎగుమతిదారుల కోసం ఈ– వాలెట్ ప్రారంభించి మూలధన సమస్య రాకుండా చూస్తుంది. ► భవిష్యత్తులో పన్ను రేట్లను ఏ ప్రాతిపదికన సవరించాలనే దానిపై ఓ నిర్దేశ పత్రాన్ని రూపొందించారు. ► రెస్టారెంట్లపై పన్నులను హేతుబద్ధీకరించడం, అంతర్రాష్ట్ర అమ్మకాల వర్తకులకు కూడా కాంపోజిషన్ పథకం సౌకర్యం కల్పించడంపై అధ్యయనం చేసే బాధ్యతలు మంత్రివర్గ బృందానికి అప్పగించారు. సాధారణంగా కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్న వర్తకులకు ఇన్పుట్ క్రెడిట్ రాదు. ఈ పథకం కింద ప్రస్తుతం రెండు శాతం పన్ను చెల్లిస్తున్న తయారీదారులు ఇన్పుట్ క్రెడిట్ పొందే అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని కూడా మంత్రివర్గ బృందం అధ్యయనం చేస్తుంది. జీఎస్టీ మరింత సులభతరం: మోదీ తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో వస్తుసేవల పన్ను చెల్లింపు మరింత సులభతరం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్లో తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్టీని ఆయన గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్గా మరోసారి అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజలకు లబ్ధి చేకూర్చడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. వేర్వేరు వర్గాలతో విస్తృతంగా సంప్రదించి జీఎస్టీలో మార్పులు చేపట్టిన ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, ఆయన బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జైట్లీ తాజా సిఫార్సుల వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులకు లబ్ధి కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. కాంపోజీషన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామనీ, కేంద్రం ప్రస్తుత చర్యలతో జీఎస్టీ మరింత సమర్థవంతంగా తయారవుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది : కాంగ్రెస్ జీఎస్టీలో మార్పులు చేపట్టడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన కాంగ్రెస్.. ఈ సిఫార్సులు సామాన్య ప్రజలకు అత్యల్ప లబ్ధిని మాత్రమే చేకూరుస్తాయని పేర్కొంది. తప్పుడు నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం దేశ జీడీపీని అదనంగా 2% పెంచే అవకాశాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు. సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు వస్తువు పాత పన్నురేటు సవరించిన రేటు బ్రాండెడ్ కాని నమ్కీన్ 12 శాతం 5 శాతం ఆయుర్వేద ఔషధాలు 12 శాతం 5 శాతం ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు 12 శాతం 5 శాతం గుజరాత్, రాజస్తాన్లలో ప్రసిద్ధి పొందిన ఖాఖ్రా ఆహార పదార్థం 12 శాతం 5 శాతం సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఆహార పొట్లాలు 12 శాతం 5 శాతం చేతివృత్తులైన జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్ 12 శాతం 5 శాతం ఎక్కువ మంది కార్మికులు అవసరమయ్యే ప్రభుత్వ కాంట్రాక్టులు 12 శాతం 5 శాతం యంత్రాలతోకాకుండామనుషులుతయారుచేసేనూలు 18శాతం 12 శాతం స్టేషనరీ వస్తువులు 18 శాతం 12 శాతం గ్రానైట్, మార్బుల్ మినహా నేలపై పరచడానికి ఉపయోగించే బండలు 18 శాతం 12 శాతం నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు 28 శాతం 18 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) 28 శాతం 5 శాతం -
గాంధీ, మోదీ.. ఓ కార్టూన్..!
ముంబై: మహత్మాగాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీపై వినూత్న రీతిలో విమర్శలు సంధించారు. మాటల్లో కాకుండా.. కార్టూన్ రూపంలో మోదీని టార్గెట్ చేశారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ పక్కపక్కనే నిల్చుని ఉన్న ఒక కార్టూన్ను తన ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేశారు. ఆ కార్టూన్లో గాంధీ చేతిలో ఆయన ప్రసిద్ధ ఆత్మకథ ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’(సత్యంతో నా ప్రయోగాలు) అని మరాఠీలో ఉన్న పుస్తకం ఉండగా.. మోదీ చేతిలో ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ లైస్(అసత్యాలతో నా ప్రయోగాలు) అనే పుస్తకం ఉంటుంది. కార్టూన్ పై భాగంలో ‘ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు’ అనే కాప్షన్ ఉంటుంది. గతంలో బాల్ఠాక్రే నేతృత్వంలో వచ్చిన మార్మిక్ పత్రికలో రాజ్ ఠాక్రే కార్టూన్లు విరివిగా వచ్చేవి. -
ప్రధాని చేతిలో ఆ బీరేంటి.. పాపకు ముద్దేంటి?
సిడ్నీ : సరదాగా ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఆస్ట్రేలియా ప్రధాని మాకమ్ టర్న్బుల్ కొంత విమర్శకు గురయ్యారు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి సందర్భంగా అయినా కొంతమంది నెటిజన్లకు నచ్చక ఆయనను తిట్టారు. అయితే, విమర్శలకు మించి ఆయనను చాలామంది సమర్థించారు. ఇంతకీ చర్చకు దారి తీసేంతగా ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ఏమిటో తెలుసా.. సిడ్నీలోని ఓ మైదానంలో రూల్స్ గేమ్ జరుగుతుండగా దానిని వీక్షించేందుకు కుటుంబంతో కలిసి టర్న్బుల్ వెళ్లారు. మ్యాచ్ను తిలకిస్తూ తన బుల్లి మనవరాలిని ఒడిలో పెట్టుకొని మరో చేతిలో బీరు పట్టుకొని ముద్దు చేస్తూ మురిసిపోయారు. ఈ ఫొటోను ఆయన తన ఫేస్బుక్లో ఒకే సమయంలో రెండు పనులు అనే టైటిల్తో ఫేస్బుక్లో పెట్టారు. దీనిని చూసిన పలువురు ఒక ప్రధాని అయి ఉండి చేతిలో బీరు ఉన్నప్పుడు చిన్నపాపను అలా చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? పైగా అలా తాగుతూ పాపను ఎలా ముద్దు చేస్తారు? ఆయనకు ఎందుకంతా బాధ్యతా రాహిత్యం అంటూ విమర్శించారు. దీనికి స్పందించిన పలువురు 'మన ప్రధానికి అది ఓ మధురమైన అనుభూతి. ఆయన కుటుంబానికి సంబంధించిన మంచి జ్ఞాపకం. ఆయనను కొద్దిసేపు అలా తాతగా ఉండనివ్వండి. దానిని కూడా రాద్ధాంతం చేయకండి. మేం ప్రధానికి మద్దతిస్తున్నాం' అంటూ పలువురు మద్దతిచ్చారు. ఇలా ఈ ఫొటోపై దాదాపు 1600 అనుకూల వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. -
ఫిట్టర్దే పెత్తనం
► అప్పన్న గోశాల, నృసింహవనం.. ► అక్కడంతా చిరుద్యోగిదే ఇష్టారాజ్యం ► ఈవోకు నమ్మినబంటు కావడమే అర్హత ► ఏఈవో, సూపరింటెండెంట్ ఉన్నా నామమాత్రమే ► లెక్కాపత్రం లేని జమాఖర్చులు పాలు, ఇతర ఫలసాయాలు ► ఎక్కడికెళుతున్నాయో తెలియదు ► అడిగే సాహసం ఎవరూ చేయరు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు మొక్కు రూపంలో సమర్పిస్తున్న కోడెదూడల నిర్వహణ.. వాటి పోషణ నిమిత్తం దాతలు అందించే నిధుల లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పన్న క్షేత్రానికి చెందిన గోశాల నాలుగేళ్ల కిందటి వరకు సింహాచలంలోనే ఈవో ఇంటికి సమీపంలోనే ఉండేది. భక్తులు సమర్పించిన కోడెదూడలను దేవస్థానం బహిరంగ వేలం వేసి విక్రయాలు జరిపేది. కానీ 2013లో కోడెదూడలను వేలం వేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కోడెదూడలను గోశాలకు తరలిస్తున్నారు. అదే ఏడాది మే నెలలో సరైన సంరక్షణ లేక 40కిపైగా కోడెదూడలు ఒకేసారి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన గోశాలను ముడసర్లోవ సమీపంలోని శ్రీకృష్ణాపురం వద్ద వంద ఎకరాల్లో నెలకొల్పారు. పాత గోశాలలో ఉన్న గోవులు, కోడెదూడలను అక్కడికి తరలించారు. ఇక్కడ గోవుల మేతతోపాటు దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా నిర్వహణ బాధ్యతలను ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఏఈవో). సూపరింటెండెంట్లకు అప్పజెప్పారు. ఆ లñ క్కన ప్రస్తుతం ఏఈవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమాచార్యులు, సూపరింటెండెంట్ డి.బంగారునాయుడు గోశాల, నృసింహవనాలను పర్యవేక్షించాలి. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న తంతే వేరు. ఆ ఇద్దరు అధికారులే కాదు.. ఏ ఉన్నతాధికారి కూడా గోశాల వైపు కన్నెత్తి చూడరు. అంతా.. హరి..రాజ్యమే గోశాల, నృసింహవనాల ఇన్చార్జిగా దేవస్థానంలోని ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఫిట్టర్ కమ్ మెకానిక్గా ఉన్న డి.వి.ఎస్.రామరాజు అలి యాస్ హరి వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన ఇతను దేవస్థానం ఈవో రామచంద్రమోహన్కు నమ్మినబంటుగా పేరొందాడు. ఈ వో చేయాల్సిన పనులన్నీ ఇతగాడే చక్కబెడు తూ షాడో ఈవోగా ఇప్పటికే ముద్రపడ్డాడు. దే వస్థానంలో ఈవోతో ఏ పని అవ్వాలన్నా ముం దుగా హరిని సంప్రదిస్తే చాలన్న ప్రచారం బ లంగా ఉంది. చందనోత్సవాల సమయంలో కూడా సదరు హరి చేసిన ఓవర్ యాక్షన్పై ప్రజాత్రినిధులు కూడా మండిపడ్డారు. గత ఏడాది జరిగిన బదిలీల్లో సింహాచలం దేవస్థానం నుంచి వెళ్లిన పలువురు ఉద్యోగులను ఈ ఏడాది మళ్లీ ఇక్కడికి తీసుకురావడంలో ఈ హరే కీలకంగా వ్యవహరించాడన్న వాదనలు ఉన్నాయి. ఈవోతో అతని సాన్నిహిత్యం, దేవాదాయ శాఖలో అతని ప్రాబల్యం మాట ఎలా ఉన్నా.. ప్రతిష్టాత్మకమైన గోశాల పెత్తనాన్ని అతనికి కట్టబెట్టేయడం విమర్శల పాలవుతోంది. గోశాలలో ఎన్ని కోడెదూడలు ఉన్నాయి.. వాటి సంరక్షణ ఎలా ఉందనేదానిపై దేవస్థానం అధికారుల వద్ద కూడా సరైన సమాచారం లేదంటే.. దాని నిర్వహణ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఇదే గోశాలపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి, గోవులను బయటకి తరలించి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్తవలస సంత, పూర్ణామార్కెట్ సెంటర్లో వ్యాన్లలో ఆవులను తరలిస్తుండగా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆరోపణలున్న ఓ చిరుద్యోగికి గోశాల నిర్వహణ అప్పజెప్పేయడంపై అభ్యంతరాలు వ్యకమవుతున్నాయి. ఎవరి లెక్క వారికి వెళ్తోందా..? ఇక గోశాలకు ఎన్ని విరాళాలు వస్తున్నాయి.. నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనే జమాఖర్చుల లెక్క అంతా హరే చూడటంపై విమర్శలు రేగుతున్నాయి. ప్రతి పూట సుమారు 50 లీటర్ల పాలు దేవస్థానానికి ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే అన్నదానానికి కావాల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే వంటశాలకు తరలిస్తుంటారు. అయితే పాలు, కూరగాయాలు ఎంతమేరకు సవ్యంగా దేవస్థానానికి చేరుతున్నాయన్నది అనుమానమే. దేవస్థానానికంటే ముందు అధికారులు, సంబంధిత ఉద్యోగులు ..నీకింత.. నాకింత అని వాటాలు పంచుకున్న తర్వాతే మిగిలినవి దేవస్థానానికి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
నాకు నచ్చితే ఏదైనా చేస్తా!
తమిళసినిమా: నటి ఆండ్రియా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షీ ఈజ్ వెరీ బోల్డ్ యాక్ట్రస్. సంచలన నటి కూడా. చాలా సెలక్టివ్ పాత్రల్లోనే కనిపించే ఆండ్రియా నటించిన తాజా చిత్రం తరమణి. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో ఆడ్రియా నటనకు ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా ఐటీ కంపెనీలో పనిచేసే యువతిగా నటించింది. అంతే కాదు ఒక పిల్లాడికి తల్లిగానూ నటించింది. అసలు విషయం ఇవేవీ కాదు. తరమణి చిత్రంలో మద్యం తాగడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాల్లో నటించడమే విమర్శలకు దారి తీస్తోంది. అయితే అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనంటోంది ఆండ్రియా. అదే విధంగా ఇమేజ్ గురించి కూడా ఆలోచించనని అంటోంది. దీని గురించి ఆండ్రియా స్పందిస్తూ, తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంది. దర్శకుడు రామ్ తరమణి చిత్ర కథ«ను చెప్పి ఇందులో మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి అని చెప్పారని, కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే అన్నానని తెలిపింది. ప్రస్తుతం వడచెన్నై, తుప్పరివాలన్ చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలు వైవిధ్యంగా నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా వడచెన్నై చిత్రంలో తనను చూసిన వారు ఈమె ఆండ్రియానేనా అని ఆశ్చర్య పోతారని అంది. ఇకపై కూడా విభిన్న కథా పాత్రలనే పోషించాలని నిర్ణయించుకున్నానని, అలాంటప్పుడు ఇమేజ్ గురించి పట్టించుకోనని, ఎవరెలా విమర్శించుకున్నా బాధలేదని అంటోంది. -
ఇండియాకి రావొద్దు!
పాపం.. ప్రియాంకా చోప్రా. తన చేష్టలతో ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుని విమర్శలపాలవుతున్నారు. ఆ మధ్య బెర్లిన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ బ్యూటీ చిట్టిపొట్టి డ్రెస్ వేసుకోవడం.. పైగా ప్రధాని ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న తీరుపై నెటిజన్లతో పాటు పలువురు ఆమెను తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అది మరచిపోక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారామె. ప్రస్తుతం ప్రియాంక విదేశాల్లో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీ వివాదమైంది. జీన్స్ ప్యాంట్, లోనెక్ టీ–షర్ట్ వేసుకొని జాతీయ పతాకం రంగులతో ఉన్న చున్నీ మెడకు చుట్టుకుని, సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. అంతే.. విమర్శలు మొదలయ్యాయి. ‘సంప్రదాయంగా చీర కట్టుకోకుండా ఆ పిచ్చి డ్రెస్ ఏంటి? పైగా జెండాను మెడకు చుట్టుకోవడం ఏంటి? ఇదేం దేశభక్తి? అసలు నువ్వు ఇండియాకి తిరిగి రావొద్దు?’ అని సోషల్ మీడియా సాక్షిగా పలువురు మండిపడ్డారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ప్రియాంకను వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా పాపులార్టీతో పాటు ప్రియాంకను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. -
స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కాపు నాయకుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేయడానికి పూనుకున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. స్థానిక జెడ్పీ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పాదయాత్ర గతంలో తుని తరహాలో హింసాత్మకం కాకూడనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాపులకు ఉద్యోగ, విద్యాపరమైన రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ ప్రణాళిక త్వరలో పూర్తి కాబోతుందని, ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కాపు కులస్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో బీసీలు కూడా సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా గతేడాది 80 వేల మందికి స్వయం ఉపాధి రుణాలు అందించామని ఈ ఏడాది 64 వేల మంది కాపులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన మాట వాస్తవమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్ధ చైర్మన్ పాలి ప్రసాద్, కాపు సంఘ నాయకురాలు ఎ.మాళవిక పాల్గొన్నారు. -
జీఎస్టీతో వృద్ధి జోరు.. చెత్త!
♦ ప్రస్తుతమున్న స్వరూపం అనుకూలం కాదు ♦ బహుళ పన్ను రేట్లతో సమస్యలు ♦ 13వ ఆర్థిక సంఘంలో పేర్కొన్నదే ఆదర్శనీయం ♦ నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్ విమర్శలు న్యూఢిల్లీ: కీలకమైన ఆర్థిక విధానాల్లో ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే నీతి ఆయోగ్ సంస్థ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక నిపుణుడు వివేక్ దేవ్రాయ్... ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఖరారైన స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని, దీనితో జీడీపీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదనే తీరులో ఆయన మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాత స్థూల దేశీయోత్పత్తి 1 నుంచి 1.5 శాతం మేర వృద్ధి చెందుతుందంటూ వస్తున్న వార్తలన్నీ ‘పూర్తి పనికిమాలినవి’గా కొట్టి పడేశారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సైతం జీఎస్టీతో జీడీపీ పుంజుకుంటుందని ప్రకటించారు కదా! అని విలేకరులు ప్రశ్నించగా... తాను వారితో విభేదించనని దేవ్రాయ్ స్పష్టం చేశారు. హిందీ వార్తా చానల్ ఆజ్తక్ జీఎస్టీపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న దేవ్రాయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అసంపూర్ణ జీఎస్టీతో జీడీపీ ఎంత మేర పెరుగుతుందన్న సంఖ్యపై నాకు అవగాహన లేదు. ఇది ఎక్కువే ఉండొచ్చు లేదా తక్కువ కావచ్చు. కానీ 1.5 శాతం పెరుగుతుందన్నది మాత్రం ఆదర్శవంతమైన జీఎస్టీతో. ఈ సంఖ్య 13వ ఆర్థిక సంఘం నివేదికలో భాగంగా పేర్కొన్న జీఎస్టీ ఆధారంగా ఇచ్చినది. మనం దీనికి దగ్గర్లో కూడా లేమిప్పుడు’ ’అని వివేక్ దేవ్రాయ్ తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. మనకు తగినది కాదు... భారత జీఎస్టీ ఆదర్శనీయమైనది కాదన్నారు. మన జీఎస్టీ సమాఖ్య స్వరూపంలో ఉండడమే అందుకు కారణంగా పేర్కొన్నారు. ఒకటికి మించిన రేట్ల స్వరూపం ఇబ్బందికరమేనని అభిప్రాయపడ్డారు. బహుళ పన్ను రేట్లు అడ్డంకులకు దారితీస్తాయని, తాను మాత్రం ఏక పన్నును సిఫారసు చేస్తానని చెప్పారాయన. ‘‘ఉన్నత వర్గాల వారు వాడుకునే వాటిపై అధిక పన్ను రేటు, పేద వారు వినియోగించే వాటిపై తక్కువ పన్ను రేటు విధిస్తారా..? ఓ ఆర్థిక వేత్తగా అలా చేయకూడదు. కావాలంటే ఈ పనిని ప్రత్యక్ష పన్నుల్లో చేసుకోవాలి. అంతేకానీ, పరోక్ష పన్నుల్లో కాదు. ఈ అంశాలకు పరిష్కారం వేరే విధంగా చూడాలి’’ అని దేవ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో 140–160 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉందంటూ వస్తున్న వార్తలు కూడా చెత్తేనని, ఆరేడు దేశాలకు మించి దీన్ని అమలు చేయడం లేదన్నారు. చిన్న స్టీల్ కంపెనీలకు సమస్యే న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత స్వల్ప కాలంలో స్టీల్ పరిశ్రమలోని అవ్యవస్థీకృత విభాగంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చని భారత స్టెయిన్లెస్ స్టీల్ అభివృద్ధి సంఘ(ఐఎస్ఎస్డీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. వీరందరూ టెక్నాలజీని అందిపుచ్చుకోలేరని పేర్కొంది. ‘‘వ్యవస్థీకృత తయారీదారులు సన్నద్ధం కాగలరు. వారు ఉద్యోగులు, వనరులను సమకూర్చుకోగలరు. సలహాదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించుకోగలరు. అవ్యవస్థీకృత రంగంలోని వారికి (చిన్న తరహా సంస్థలు) ఇవి సాధ్యం కావు. కొంత కాలం పాటు గందరగోళం ఉంటుంది. కొత్త పన్ను చట్టం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆధారితమైనది. కానీ ఈ రంగంలో చిన్న సంస్థలు ఐటీని వినియోగించడం తక్కువే. దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని ఐఎస్ఎస్డీఏ ప్రెసిడెంట్ కేకే పహూజా తెలిపారు. ఆర్థిక రంగానికి ‘జీఎస్టీ’ బూస్ట్ న్యూఢిల్లీ: జీఎస్టీ పట్ల దేశీయ పరిశ్రమ అపార విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రేరణను ఇస్తుందని, అంతర్జాతీయ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని కొనియాడింది. శనివారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త పన్ను వ్యవస్థ నిర్వహణకు తాము సర్వసన్నద్దంగా ఉన్నట్టు తెలిపింది. ఎన్నో ప్రయోజనాలు మధ్య కాలానికి స్థూల ఆర్థిక రంగంపై జీఎస్టీ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. పన్ను ఎగవేతలను అరికట్టడం వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. పన్ను పరిధి విస్తరించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. ద్రవ్యలోటు ఇక ముందూ నియంత్రణలోనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుంది. ఎఫ్డీఐలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ వ్యాపారం మరింత సులభం చరిత్ర సృష్టించడానికి బిగ్బ్యాంగ్ సంస్కరణ సిద్ధంగా ఉంది. ఈ ఒకే ఒక్క కీలకమైన పన్ను సంస్కరణతో వ్యాపార సులభతర నిర్వహణ విషయంలో అంతర్జాతీయంగా భారత్ ఎన్నో స్థానాలు ముందుకు వెళుతుంది. – సందీప్ జజోడియా, అసోచామ్ ప్రెసిడెంట్ అందరికీ లాభం దేశ ఆర్థిక రంగానికి గణనీయమైన లాభం చేకూరుతుంది. పలు పన్ను చట్టాలను అర్థం చేసుకునే ఇబ్బంది తొలగిపోవడం వల్ల పన్ను చెల్లింపుదారుకూ ప్రయోజనం చేకూరుతుంది. – ఫిక్కీ -
విమర్శ–ప్రతి విమర్శ
జీవన కాలమ్ విమర్శ ఎదుటి వ్యక్తిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి కాలు దువ్వుతుంది. ఇద్దరి మధ్యా బాంధవ్యాన్ని చెడగొడుతుంది. 46 సంవత్సరాల కాలమ్ రచనలో ఎన్నో అనుభవాలు. ఒకసారి ఒక బడుగు వర్గం గురించి రాస్తే వెంటనే స్పందన వచ్చింది: ‘లం.. కొడకా! మా గురించి నీకేం తెలుసురా. దమ్ముంటే ఈ విషయాలు రాయి’ అని. నాకు దమ్ముంది. ఆ విషయాల్ని రాశాను–తిట్టుని భద్రంగా జతచేస్తూ. నాకు కొన్ని వేల అభినందనలు అందాయి. కాసిన్ని విమర్శలకి చోటు ఉండకపోదు. ప్రతి విమర్శ– కుసంస్కారి ఆయుధం. ప్రతి స్పందన సంస్కారి సవరణ. నాకెప్పుడూ ‘మున్నాభాయ్’ సినిమాలో ఈ సన్నివేశం చాలా ఇష్టం. ఒకాయన ఇంట్లోకి వెళ్తూ పక్కింటి గోడమీద కిళ్లీ ఉమ్ము పుసుక్కున వేసి వెళ్తుంటాడు. ఆ చర్యని చూసిన హీరో నవ్వుకుంటాడు. ఒక బకెట్తో నీళ్లు తెచ్చి–కిళ్లీ మరకని శ్రద్ధగా తుడుస్తాడు. ఈ పనిని ఉమ్ము వేసిన వ్యక్తి గమనించాడు. తనని తిట్టడేం? నిలదీయడేం? మరునాడూ ఉమ్ము వేశాడు. మరునాడూ ఉమ్ముని జాగ్రత్తగా ఇతను కడిగాడు. నాలుగోనాడు ఉమ్మువేస్తూ–కాస్త ఆగాడు. ఈసారి ఉమ్ము వేయాలనిపించలేదు. ఎదుటి వ్యక్తి తలవొంచడం ఇతని తలని దించింది. ముందుకు సాగాడు. సంస్కరణ సంస్కారాన్ని తట్టి లేపుతుంది. అసహిష్ణుత–అహంకారాన్ని రెచ్చగొడుతుంది. బెర్నార్డ్షా అనుకుంటాను – తిట్టారట – ‘లం.. కొడకా’ అని. అతను నవ్వి ‘లాభం లేదు సార్. మా అమ్మ ‘లం..’ అయివుంటే మా జీవితాల్లో ఆకలి ఉండేది కాదు’ అన్నాడట. ఈ మధ్య అతి సరదా అయిన సందర్భం కనిపిం చింది. ఐపీఎల్ పోటీల్లో రైజింగ్ çపుణే సూపర్జైంట్స్ పక్షాన ఒకనాటి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మొదటి ఆటని స్మిత్ ఆట కారణంగా ఆ టీమ్ గెలిచింది. మంచిదే. అయితే ఆ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా తమ్ముడు హర్ గోయెంకా ధోనీని ఎద్దేవా చేశాడు. కానీ ధోనీ స్పందించలేదు. ఏతావాతా అతని భార్య సాక్షి స్పందించింది. ట్వీటర్లో సమాధానం ఇచ్చింది. వాట్సప్లో ‘కర్మ’ను జొప్పించింది. ‘పక్షి ప్రాణంతో ఉన్నప్పుడు పురుగుల్ని తింటుంది. ప్రాణం పోయాక పురుగులు పక్షిని తింటాయి. కాలమూ, పరిస్థితులూ ఎప్పుడైనా మారుతాయి. జీవి తంలో ఎవరినీ తక్కువ చేయవద్దు. ఇవాళ నువ్వు శక్తివంతుడివి కావచ్చు. కానీ కాలం నీకంటే శక్తివంతమైనది. ఒక్క చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్షల చెట్లు బూడిదవుతాయి. కనుక మంచిగా ఉండు. మంచిని చెయ్యి’. విమర్శ ఎదుటి వ్యక్తిలో అహంకారాన్ని రెచ్చగొడుతుంది. కుసంస్కారానికి కాలు దువ్వుతుంది. ఇద్దరి మధ్యా బాంధవ్యాన్ని చెడగొడుతుంది. ఒక ‘విమర్శ’ ఒక మిత్రుడినో, ఒక హితుడనో నష్టపోవడానికి అవసరమా? ‘అభిప్రాయభేదం’ అభివృద్ధికి సంకేతం. ఎదుటివ్యక్తి ‘హక్కు’ని, ‘పరిమితి’ని, ‘దృక్పథాన్ని’, ‘దృష్టి’ని ఎరగడం. మా అబ్బాయి దర్శకత్వం వహించిన చిత్రానికి పని చేయడం నాకెంతమాత్రం ఇష్టం లేదు. విమర్శించే గొప్ప అవకాశాన్ని నేనూ, సవరించే గొప్ప ఊతాన్ని మా అబ్బాయీ నష్టపోతామని. మిత్రులు పాత్రో, జంధ్యాల, ఆకెళ్ల–ఇలా ఎంతమందికో ఫోన్లు చేశాను. చివరికి నిర్మాత, మిత్రులు అట్లూరి పూర్ణచంద్రరావుగారు– కొడుకుకి దన్నుగా నిలబడటం తప్పుకాదని నాతల వొంచారు. తర్వాత చాలా అనర్థాలను చేయవలసి వచ్చింది. అది వేరే కథ. ఓ సంఘటనని నేనెన్నడూ మరచిపోలేను. ఆలిం డియా రేడియోలో చేరే నాటికి నా వయస్సు 23. మా చుట్టూ మహానుభావులైన వ్యక్తులు. వారిలో ఒకరు– మహా రచయిత ‘బుచ్చిబాబు’. రోజూ జరిగే ప్రోగ్రాం మీటింగులో గత రాత్రి ప్రసారమయిన బుచ్చిబాబుగారి కార్యక్రమాన్ని ఒక ఉత్తర దేశపు ఆఫీసరు చీల్చి చెండాడారు. మేమంతా కంగారుగా, ఇబ్బందిగా వింటున్నాం. మాకు బుచ్చిబాబు ఒక ఐకాన్. సభలో హేమాహేమీలు. చివరలో బుచ్చిబాబు ఎలా స్పందిస్తారు? బుచ్చిబాబుగారికి ఉబ్బసం ఉండేది. ఉత్తర దేశపు ఆఫీసరు విసురు అయాక–సభ అంతా నిశ్శబ్దమయిపోయింది. బుచ్చిబాబు చిరునవ్వు నవ్వారు. ఆ ఆఫీసరు వేపు తిరిగి ‘మీ మాటల్లో నా పొరపాట్లు తెలుసుకున్నాను. తప్పకుండా దిద్దుకుంటాను’ అన్నారు. పెద్ద వజ్రాయుధం విసిరిన యోధుడిని–కేవలం తులసీదళంతో జయించిన సందర్భం అది. ఆయన చేసింది ‘తప్పు’ అయితే ఎవరూ ఆయన్ని ఉరి తియ్యరు. ఆ అవసరం లేకుండానే అవలీలగా ఆయన్ని బుచ్చిబాబు జయించారు. ఏమయింది? బుచ్చిబాబు పొరపాటు కాదు–పొరపాటుని అంగీకరించే పెద్దరికం–పొరపాటుని ఎత్తిచూపి, ఒక పెద్ద వాగ్యుద్ధానికి సిద్ధపడిన ప్రత్యర్థిని చిత్తు చేసింది. ‘విమర్శ’ ఓ గొప్ప బాంధవ్యాన్ని నేలరాసే ఆయుధం. సమీక్ష కొత్త స్నేహాన్ని పురికొల్పే అవకాశం. హితవు– పెద్ద దిక్కు. సంయమనం–వ్యక్తి శీలానికి పట్టాభిషేకం. గొల్లపూడి మారుతీరావు -
విమర్శ, సమీక్ష వేరువేరా?
అభిప్రాయం ‘సమీక్ష వేరు, విమర్శ వేరూనా?’ అని ఈ మధ్య ఓ యువపాఠకుడు అడిగాడు. అతను అప్పుడప్పుడూ సాహిత్యం గురించి ఏవేవో అడుగుతుంటాడు. అడిగేవన్నీ అమాయకమైనవీ, విసుగు కలిగించేవీ అయినా, తెలుసుకోవాలన్న అతని ఆసక్తిని (అదీ సాహిత్యం గురించి) గాయపర్చకూడదని తెలిసిందీ, తోచిందీ చెబుతుంటాను. ఈ సారి అతను అడిగింది అంత అమాయకమైంది కాదనిపించింది. ఎందుకంటే కొంతమంది అవి రెండూ వేరువేరని అనడం నేనూ విన్నాను. అందులో రచయితలూ, సమీక్షకులూ ఉండటం విశేషం. అమాటే ఎవరో ఎక్కడో అనగా, ఇతనూ వినివుంటాడు. ఒక్క మాటలో అతనికి సమాధానం చెప్పాను. ఆ మాటనే ఇంకొంచెం పొడిగిస్తే రచయితలకు కాకపోయినా, ఇతనిలాంటి యువపాఠకులొకరిద్దరికైనా పనికిరావచ్చు గదా అని ఈ చిన్న వ్యాసం. ఇది నా ఆలోచనే కానీ, నిర్ణయం కాదని విజ్ఞులైన పాఠకులకు మనవి. విమర్శ వేరూ, సమీక్ష వేరూ అని ఎందుకు అనుకుంటున్నట్టు? విమర్శ అంటే విస్తృతంగానూ, సమీక్ష అంటే సంక్షిప్తంగానూ వుండాలనుకుంటున్నట్టా? లేక, కొలతల రీత్యా కాక స్వభావ రీత్యానే ఆ రెండింటికీ తేడా వుందనుకుంటున్నట్టా? కొలత రీత్యా చూస్తే తేడా వుండి, వుండాలి. అది ‘తప్పనిసరి తేడా’. సమీక్ష అనేది ప్రధానంగా పత్రికల సౌకర్యం కోసం పుట్టిన ప్రక్రియ. విమర్శలాగా సాహిత్యంతోపాటు పుట్టిన సహజ ప్రక్రియ కాదు. విమర్శ అనేది ఇప్పుడు దాదాపు అంతరించిన ప్రక్రియ. ‘డాక్టర్’ పట్టాల కోసం చేసే పరిశోధన విమర్శ కాదు. సాహిత్యం ఇప్పుడు పత్రికల మీద ఆధారపడి బతుకుతున్నది కనుక, పత్రికల్లో స్థలం ఖరీదైనది కనుక, వాటి కష్టనష్టాలను గమనంలో వుంచుకోక తప్పదు. కనుక క్లుప్తత అనివార్యం. అయితే స్వభావ రీత్యా విమర్శకూ, సమీక్షకూ తేడా ఎందుకుండాలి? రెండూ సాహిత్యం గురించినవే కదా? బిందెడు నీటిలోనూ, బిందువు లోనూ నీటి గుణం ఒకటే కదా? ఈ ఉదాహరణనే సాహిత్య పరమైన పోలికతో చెప్పాలంటే, విమర్శ నవల లాంటిదైతే, సమీక్ష కథ లాంటిదనాలి. నవల కంటే కథ రాయడం కష్టమని అనుభజ్ఞులు అంటున్నదే. అపరిమిత స్వేచ్ఛలో చెప్పడం కంటే పరిమిత స్వేచ్ఛలో చెప్పడానికి మరింత నైపుణ్యం వుండాలన్నది అందులో వున్న అర్థం. ఆ రీత్యా సమీక్ష ఇంకా నిర్దిష్టంగా వుండాలి. అయితే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది నైపుణ్యం గురించి కాదు. విమర్శ, సమీక్ష వేరు వేరు అనడం గురించి. అంటే వాటి స్వరూప, స్వభావాల్లో కూడా తేడా వుండాలి అనడం గురించి. స్వరూపంలో తేడా వుండటం గురించి చెప్పుకున్నాం. స్వభావంలోనూ తేడా ఎందుకుండాలి? సమీక్ష పత్రికల సౌకర్యార్థం పుట్టిన ప్రక్రియ అన్నాను. దానికి అది రచయితలకూ ఒకరకంగా సౌకర్యంగానే వుందన్నమాటనూ చేర్చాలి. ప్రస్తుతం రచయితలూ, కవులూ విమర్శను సహించగలిగే (సహేతుకమైనా) స్థితిలో లేరు. అలాగే విమర్శకు అవసరమైన ఓపికా, తీరికా, జ్ఞానమూ సమీక్షకు అవసరం లేదు. సమీక్షకులకు అవి లేవనడం లేదు. సమీక్షకు అవసరం లేదనే అంటున్నది. పుస్తకాలు చదివే అలవాటే తగ్గుతున్న పరిస్థితిలో సుదీర్ఘమైన విమర్శ చదివే ఓపిక అసలేవుండదు. అందువల్ల, నవలలు అరుదై, కథలు వున్నట్టు విమర్శ పోయి సమీక్ష వుంది. ఇది ఇప్పటి సాహిత్య, సామాజిక పరిస్థితికి అనుగుణంగా వుంది. దీన్ని సూచిస్తున్నదే విమర్శ వేరు, సమీక్ష వేరు అన్న అభిప్రాయం. అది కాకపోతే, ‘సమీక్ష’ అనడంలోనూ సమీక్షించడం అన్న అర్థం ద్వారా ఎంతో కొంత విమర్శను సూచిస్తున్నప్పటికీ, అవి రెండూ వేరువేరు అనడంలో, వేరే అర్థముందా? -పి.రామకృష్ణ -
విమర్శలను ఎండగట్టరేం?
• అన్ని విషయాలపైనా సీఎం ఒక్కరే స్పందించాలా? • మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ ‘క్లాస్’ • పలువురి తీరుపై తీవ్ర అసంతృప్తి • ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యుల పైరవీలపై హెచ్చరిక • కేబినెట్ సమావేశానికి ముందు గంట సేపు ప్రత్యేకంగా భేటీ సాక్షి, హైదరాబాద్: పలువురు మంత్రివర్గ సహచరుల పనితీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించి పరోక్షంగా హెచ్చరిం చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి ముందు.. అధికారులెవరూ లేకుండా మంత్రు లతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులకు ‘క్లాస్’ తీసుకున్నట్లు సమాచారం. ‘జేఏసీ ఉద్యమాల పేరుతో జిల్లా ల్లో తిరుగుతూ కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే... అదే జిల్లా మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదు? ప్రజలకు వాస్తవాలు వివరించలేక పోతున్నా రెందుకు? పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా జిల్లాలు తిరిగి ఏవేవో విమర్శలు చేస్తున్నారు. పాదయాత్ర పేరుతో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీకు ఇవన్నీ ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు తిప్పి కొట్టడం లేదు.. ఒక్కరూ కౌంటర్లు ఇవ్వరా.. అన్ని విషయాలకూ ముఖ్యమంత్రే స్పందిం చాలా..?’’ అంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరుద్యోగ ర్యాలీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘కేబినెట్ సమావేశ మంటే ఆన్ ద రికా ర్డు, ఆఫ్ ద రికార్డని ఉండ దు. ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు ఎందుకు బయటకు వెళుతు న్నాయి..’ అని నిలదీసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుమారు గంటసేపు జరిగిన ఈ ‘ప్రత్యేక’భేటీ మధ్యలో టీ బాయ్లను కూడా అను మతించలేదని, మంత్రులనూ లేవనీయ లేదని తెలుస్తోంది. మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సీఎం సూత్రప్రాయంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక కేంద్రం కూడా తన పరిమితులకు లోబడి బడ్జెట్ ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘మనకు ఏం రావాలో చూసుకోవాలి. మంత్రులంతా కేంద్ర బడ్జెట్ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయండి. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన ప్రతిపాదనలు, శాఖల వారీగా రావాల్సిన నిధులపై కేంద్రంతో ఫాలో అప్ చేసుకోవాలి. మరిన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం..’అని సూచించినట్లు తెలిసింది. -
సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?
ఇంచుమించు "సాహిత్యం ఎప్పుడు పుట్టిందో, సాహిత్య విమర్శ కూడా అప్పుడే పుట్టింది" అనే మాట అర్థం లేనిది. విమర్శ అంటే ఆహో, ఓహో అంటూ తలలూపడమూ కాదు, మొదలంటూ తెగ నరకడమూ కాదు. అలాటివి కేవలం ప్రతిస్పందనలు మాత్రమే. ఆ ప్రతిస్పందన నైజాన్ని అన్వేషించి, దానికొక తాత్త్విక పరిపుష్టినీ, శాస్త్రీయ భూమికనూ సమకూర్చేది విమర్శ. వాస్తవాన్ని సంకేతంలోకి రచయిత మారుస్తుంటే, సంకేతాన్ని వాస్తవంలోకి విమర్శకుడు మారుస్తున్నారు. ఒకరికొకరు పూరకంగా నిలుస్తున్నారు. రచయితకెలాంటి సృజనాత్మక ప్రతిభ కావాలో, విమర్శకునికి కూడా అలాంటి సృజనాత్మక ప్రతిభ కావాలి. ప్రపంచంలో ఏ మూలలో ప్రసిద్ధికి వచ్చిన విమర్శకులను చూసినా, ఈ విషయం స్పష్టం కాకపోదు. కొత్త విమర్శనా సంప్రదాయాలను నెలకొల్పడం చరిత్రలో సర్వత్రా అగుపించే విషయం. అందుకే బహుకాలం విమర్శ, సృజనాత్మక సాహిత్యంలో భాగంగానే అణగి మణగివుంది. కుకవి నిందలో భాగంగా తొంగి చూసింది. మీమాంస, లక్షణశాస్త్రరూపం పొందిన దశలో కూడా రూపభద్రతకు సంబంధించే తన చర్చను నడిపింది కానీ వస్తుతత్వం పట్ల దృష్టిని ప్రవచించలేదు. వస్తుపరంగా పూర్వ ప్రసిద్ధ ఇతివృత్తాలనే కొనసాగింప చేయాలనడమూ, రూపపరంగా చాపల్య, అవనతులకు స్థానంలేని భద్రతనివ్వాలని సంకల్పించడమూ అందుకు కారణం. సాహిత్య మీమాంసను ప్రాచీన భారతీయులు "క్రియాకల్ప" అని వ్యవహరించే వారంటూ ఆచార్య వి.రాఘవన్ పేర్కొంటున్నారు. వాత్సాయయనుడిచ్చిన చతుష్షష్టి కళలలో కావ్యక్రియా, అభిధానకోశ, ఛందో జ్ఞానములతోపాటు "క్రియాకల్ప" కూడా ఉంది. ఇదే నేటి కావ్య మీమాంసగా రూపు ధరించిందని రాఘవన్ గారి అభిప్రాయం. కావ్యక్రియలో శబ్ద, సంవిధాన వైఖరికి సంబంధించిన రూప భద్రత వివేచనాన్ని ఈ మాట ఉద్దేశిస్తున్నది. వస్తుభద్రతకు సంబంధించిన వాటికి తత్త్వశాస్త్రాన్నే ఆశ్రయించమని గౌణం చేస్తున్నది. దాన్ని మొదటిమారుగా ప్రస్ఫుటం చేసి, తత్త్వశాస్త్రానికీ, కావ్య మీమాంసకూ మధ్య కొత్త సమన్వయాన్ని రూపొందించేటందుకూ ఒక పరిధిని ఏర్పరచేటందుకూ కృషి చేసినవాడు అభినవగుప్తుడు. కావ్య మీమాంసలో రూపభద్రతకూ, వస్తుభద్రతకూ మధ్య వున్న లంకెను భరతుని వద్దనుంచే అందరూ ప్రస్తావన స్థాయిలో మాత్రం పరామర్శించి విడిపోతే, దాన్ని ప్రస్ఫుటపరచి ఒకే పరిధిలో కుదిర్చేటందుకు అభినవగుప్తుడు తొలిసారిగా కృషి చేశాడు. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత అది సుసంపన్నంగా కొనసాగలేదు. పైపెచ్చు కావ్య మీమాంస యావత్తూ కేవలం రూపాశ్రితమై, అలంకార ప్రయోగాలే సాహిత్య రచన అనే భ్రమకు అవకాశమిస్తూ, అలంకారాల సంఖ్యను పెంచుతూ, వెంట్రుకను శతకోటి ఖండాలుగా చీల్చే నిరర్థక పరిశ్రమగా వక్రీకరించింది. అదే విమర్శన శాస్త్రమనే భ్రమకు అవకాశం ఇచ్చింది. ఆధునిక యుగం అందించిన భిన్న జాగృతుల మూలంగా, మానవ అధ్యయన పరిధులకి లోబడిన నవచేతనల కారణంగా, విమర్శనం ఒక విడి శాస్త్రంగా సమన్వయ భూమికతో అవతరించడం మొదలైంది. విడి శాఖగా రూపొందేటప్పుడు కూడా లారెన్స్ లాంటివాళ్లు ఇది సగం కళ, సగం శాస్త్రం అంటూ అభిప్రాయపడ్డారు. రచయిత ఎలా తన లోకానుభూతిని వైయక్తిక పరిమితికి లోబడి మాత్రమే అభివ్యక్త పరుస్తున్నాడో, విమర్శకుడు సైతం తన కావ్యానుభూతిని అలా వివరిస్తుంటాడనే అభిప్రాయం ప్రబలింది. పైపెచ్చు, కవిత్వంలో గమనించాల్సింది రచయిత వైయక్తిక అనుభూతి మాత్రమేనన్న మార్గదర్శి సూత్రం వారిని బంధించింది. అందులోంచి వేరుపడి విస్తారమైన జీవితాన్నంతటినీ అనుశీలనలోకి తీసుకొని జీవన నైతికతను పోషించాల్సిన అవసరాన్ని గుర్తుచేసి, "కవితా విమర్శనమంటే జీవిత విమర్శనమే" నంటూ ఆర్నాల్డ్ వంటి విమర్శకులు కొత్త సంప్రదాయం నెలకొల్పినా, అనుభూతివాదం వివక్షలోంచి తొలగిపోని మూలంగా చాలా కాలం విమర్శ సగం కళా, సగం శాస్త్రం అంటూ కొట్టుమిట్టాడింది. అంతేకాదు, వాస్తవ జీవితంలో ఏ మాత్రం నిమిత్తం లేని శుద్ధ కాల్పనిక ప్రత్యయంగా మాత్రమే కావ్యరచననూ, తన్మూలంగా విమర్శనూ పర్యవసింప చేయటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే "కళ కోసం కళ", "కావ్యం కోసం కావ్య"మంటూ ఆస్కార్ వైల్డ్, ఎడ్గర్ అలెన్ పో ప్రభృతుల సంప్రదాయం మొదలైంది. "కావ్యం అనేది సాంగోపాంగమైన సంపూర్ణ నిర్మాణం కాబట్టి దాని పరిశీలనమే విమర్శకుని పరమావధి, తదతీతంగా రచయిత జీవితాన్ని కానీ, జాతి జీవితాన్ని కానీ, చరిత్రను కానీ, యుగనేపథ్యాన్ని కానీ చూడటం కేవలం అనవసరం" అంటూ భావించిన నియో క్రిటిసిజం సంప్రదాయ ప్రచారంలోకి వస్తూ పిల్లి మొగ్గలు వేసింది. వైయక్తిక పరిమితుల మూలంగా పెల్లుబికిన ఈ దుర్లక్షణాల నుంచి విమర్శను బయట పడవేసి దానికి ఆధునికమైన శాస్త్రీయ భూమికను నెలకొల్పాలని ప్రయత్నం చేసింది ఒక చెంప ఐ.ఎ.రిచర్డ్స్, మరో చెంప అడాల్ఫ్ టేన్. రూప విషయంగా అన్వయ కార్యాన్ని ప్రాయోగిక విధానానికి అనువుగా మలిచేటందుకు రిచర్డ్స్ మార్గం వేస్తే, ఆయనకు చాలా మునుపు వస్తుపరంగా విస్తారమైన అన్వయ క్షేత్రాన్ని నెలకొల్పేటందుకు హిప్పోలేట్ అడాల్ఫ్ టేన్ మార్గదర్శకత్వం వహించాడు. ఆయన ప్రతిపాదించిన 1.జాతి చేతన/ప్రతిభ, 2.కాలఘట్టం, 3.పరిసరం అనేవి మూడూ ఆధునిక శాస్త్రీయ విమర్శకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఇందులో మొదటగా పేర్కొన్న జాతి చేతన ఆ దేశ ప్రజల విశిష్ట స్వభావం, ఆ జాతి వ్యక్తిత్వ మన్నమాట. కాలఘట్టం అంటే ఆ రచయిత జీవించిన చారిత్రకయుగం, దాని స్వభావం, స్వరూపం అన్నమాట. ఆ కాలానికి సంబంధించిన చేతన పరిసరం అంటే ఆ చారిత్రక యుగానికి, రచయిత ప్రాంతానికి చుట్టూ ఆవరించియున్న పరిసరాల్లోని చైతన్యం, సంఘర్షణలూ, సమస్యలూ. ఈ మూడు దృక్కోణాలనుంచి చూస్తే కానీ, ఒక రచన సమ్యక్ స్వరూపం, విశిష్ట వ్యక్తిత్వం, దాని ప్రయోజనం, ఆవశ్యకతా అవగాహనలోనికి రావు. ఈ దృక్కోణత్రయం మీద ఆధారపడి చారిత్రక విమర్శ అనే పంథా బయల్దేరింది. ఈ యుగంలో అత్యంత గౌరవాన్ని పొందిన ఆర్కిటైపల్ (మూల రూపాత్మక) మనోవైజ్ఞానిక విమర్శలోని సమష్టి సుప్త చేతన సిద్ధాంతం నుంచి స్ఫూర్తి తీసుకొని, టేన్ ప్రతిపాదించిన "జాతి ప్రతిభ" అనే అంశం మీద ఆధారపడుతూ తన సైద్ధాంతిక రూపాన్ని నిర్మించుకొంది. తొలి సమగ్ర శాస్త్రీయ విమర్శగా పేరుపొందిన చారిత్రక విమర్శలో ఒకే ఒక చిన్న బలహీనత– ఆ విమర్శ అందించే సందేశం ఏమిటి? ప్రస్తుత జీవితానికి కలిగించే స్ఫూర్తి ఏమిటీ? అనేది. విమర్శ సాఫల్యతకు సందేశం గుర్తు! ఆ సాఫల్యతను దృష్టిలో పెట్టుకొని, చారిత్రక విమర్శనారీతిలోని మూల సూత్రాలనూ సమాజ వాస్తవికతనూ విశ్లేషించి, సామాన్య మానవ జీవితానికి అర్థం, గమ్యం తెలియజెప్పిన ఆర్థిక సామాజికవేత్తల దృక్పథాలనూ వైయక్తిక భావపరిణామాల మీద మాత్రమే కాకుండా, మొత్తం సమాజం అంతటా ప్రసరించే నైతిక దృష్టితో సమన్వయపరచి సశాస్త్రీయ పంథాలో పురోగమిస్తున్నది, "సామాజిక విమర్శ" అనే ఆధునిక సంప్రదాయం. సాహిత్యం పట్ల "రచయితజనత" ఉభయుల అంతరాత్మ పరిశీలకునిగా వ్యవహరించే ఉత్తమ విమర్శకునికి, పరమోపాదేయంగా వెలసిన ఆధునిక మార్గం సామాజిక విమర్శ. విమర్శకుడు తన బాధ్యతను న్యాయంగా నిర్వర్తించాలంటే లక్షణ శాస్త్ర పరిజ్ఞానం కాదు కావలసింది, సమాజశాస్త్ర పరిజ్ఞానం. (ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ "ఆధునికత సమకాలికత"(కొన్ని పార్శ్వాలు) ఇటీవలే "చినుకు పబ్లికేషన్స్" ద్వారా ప్రచురితమైంది. పై భాగం, అందులోని "సాహిత్య విమర్శశాస్త్ర స్థాయి" వ్యాసంలోంచి సంక్షిప్తం చేసింది.) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ 9441809566 -
విమర్శలను తిప్పికొట్టలేరా?
► మంత్రుల తీరుపై కేసీఆర్ అసంతృప్తి ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా.. వివరించలేకపోతున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో బాగున్నా, ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉన్నా కూడా.. విపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాల వారీగా మంత్రుల పనితీరును కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. పలువురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, రుణమాఫీ అంశాలపై విపక్షాల విమర్శలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాల్లో వాస్తవ పరిస్థితిపై పూర్తి వివరాలతో ఒక నివేదిక అందజేయాలని సీఎస్ రాజీవ్శర్మను ఆదేశించారు. పన్నుల రూపంలో రాష్ట్రానికి 20%ఆదాయం వస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా మంత్రి ఈటల రాజేందర్ సరిగా వివరించలేక పోయారని కేసీఆర్ ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రుణమాఫీపై రైతులకు స్పష్టత ఇవ్వలేకపోయార న్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు అంశాన్ని మేనేజ్ చేయలేకపోయారని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద కొంత బకాయిలు చెల్లిస్తామని ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించలేకపోయారని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భగీరథ’పై ఇంత నిర్లక్ష్యమా? మిషన్ భగీరథ పథకం పనుల్లో జాప్యంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భగీరథ పనులను పర్యవేక్షించడం లేదని తప్పుబట్టారు. పనులను అనుకున్న రీతిలో, అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. తొలిసారిగా కేబినెట్ సమావేశానికి హాజరైన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి ఈ పథకం పనుల పురోగతిని వివరించారు. ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు. ఒక్క మారుమూల ప్రాంతాలకు కూడా పైప్లైన్ ద్వారా తాగునీటిని అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆయా జిల్లాల మం త్రులు, భగీరథ అధికారులు హెలికాప్టర్లో వెళ్లి, ప్రణాళికలు రూపొందించాలన్నారు. నూ తన సచివాలయం అంశాన్ని కూడా మంత్రుల కు వివరించారు. తూర్పు ముఖంగా కొత్త సచి వాలయ భవనం ఉంటుందని తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న సీఎం
ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజన విషయంలో ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మరిచిపోయి ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జిల్లాల పేరిట టీఆర్ఎస్ నేతలే రోజుకో మాటతో అతిపెద్ద డ్రామా ఆడుతున్నారని వంశీచంద్ విమర్శించారు. జిల్లాల పేరుతో ప్రజలను విభజించి, నిప్పు రాజేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను చెప్పడానికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఒకమాట, బహిరంగంగా మరోమాట మాట్లాడుతున్నారని, ప్రజలే తగిన సమయంలో బుద్ధిచెప్తారని వంశీచంద్ హెచ్చరించారు. -
సీఎంను విమర్శిస్తే జీరోలవుతారు: శ్రీనివాస్గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును విమర్శిస్తే హీరోలవుతామని విపక్ష నేతలు భావిస్తున్నారని,కానీ ప్రజలు వారిని జీరోలుగా చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జైపాల్రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటున్న జైపాల్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు చేసుకోలేక పోయారని నిలదీశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని విమర్శలు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనన్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ పథకాలపై విషయం కక్కుతున్నారని, ప్రభుత్వ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. -
చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం
వర్షాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నా సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరెంటు, మంచినీళ్లు, ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని చెప్పారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, భయానక వాతావరణంలో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారన్నారు. కోజికోడ్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన తన నియోజకవర్గం ముషీరాబాద్, తర్వాత కుత్భుల్లాపూర్లోని నిజాంపేట, బండారి లే ఔట్లలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి పాలు, బ్లాంకెట్లు, బిస్కెట్లు, అత్యవసర ఔషధాలు పంపిణీ చేశారు. -
గూగుల్ 'అల్లో'వాడారో.. అంతేనట!
ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ మెసేజింగ్ యాప్లకు భారీ షాకిస్తూ.. సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అల్లో యాప్ అంత శ్రేయస్సుకరం కాదంట. ప్రస్తుత చాటింగ్ యాప్స్కు దీటుగా ఈ యాప్ను తీసుకొచ్చినట్టు గూగుల్ చెప్పుకుంది. కానీ ఈ యాప్ వాడితే వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందట. ఈ విషయాన్ని స్వయానా గ్లోబల్ ఐకాన్గా పేరున్న ఎడ్వర్డ్ స్నోడెనే వెల్లడించారు. అల్లో స్మార్ట్ చాట్ను వినియోగించ వద్దని ఆయన వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ యాప్లో ప్రైవసీ సరిగా లేదని, ఈ చాట్ యాప్ ద్వారా పంపే మెసేజ్లన్నింటినీ గూగుల్ స్టోర్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పారు. ఈ యాప్ను వినియోగదారులు వాడొద్దని సూచిస్తున్నారు. మెసేజ్లను కేవలం తాత్కాలికంగా మాత్రమే స్టోర్ చేస్తామని ప్రకటించిన గూగుల్ అల్లో టీమ్, రహస్యంగా లేని అన్ని మెసేజ్లను డిలీట్ చేసేంత వరకు స్టోర్ చేసే ఉంచుతామని బుధవారం తేల్చేసింది. అదేవిధంగా గూగుల్కు, డివైజ్కు మధ్య మెసేజ్లు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయని, వాటిని గూగుల్ చదివే వీలుంటుందని ప్రకటించింది. దీంతో ఈ యాప్ వ్యక్తిగత ప్రైవసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్ను "గూగుల్ నిఘా"గా విమర్శిస్తూ వివిధ ట్వీట్లను ఎడ్వర్డ్ స్నోడెన్ పోస్టు చేశారు. యూజర్లు ఇతరులకు అల్లో ద్వారా చేరవేసే ప్రతి సందేశాన్ని గూగుల్ సేవ్ చేయడం ప్రమాదకరమని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేయడమేనని ఆయన అన్నారు. పోలీసు రిక్వెస్ట్ ప్రకారం రికార్డు చేసిన వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ లీక్ చేయొచ్చని తెలిపారు. గూగుల్ అల్లోకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటమే మంచిదని ఆయన యూజర్లకు సూచించారు. -
నియంతృత్వ పోకడలతో పాలిస్తున్నారు : ఎల్.రమణ
సీఎం కేసీఆర్ను విమర్శించిన ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి నియంతృత్వ పోకడలతో సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని టీటీడీపీ నేత ఎల్.రమణ ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ విలీన ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో జాతీయ జెండాను రమణ, టీటీడీపీ జెండాను మరో నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఎగురవేశారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే జరపాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని మీడియాకు పార్టీనేత పెద్దిరెడ్డి వినిపించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొత్తకోట దయాకరరెడ్డి, సీతా దయాకరరెడ్డి, నర్సిరెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. టీటీడీపీ రైతు దీక్ష 26కు వాయిదా: ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన రైతు దీక్షను రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 26, 27 తేదీల్లో నిర్వహించాలని టీటీ డీపీ నిర్ణయించింది. -
ఆ వ్యాఖ్య ఆయన అపరిపక్వతకు నిదర్శనం
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శ సాక్షి, హైదరాబాద్: నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వీరోచిత సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టులను దేశ ద్రోహులు అనడం హాస్యాస్పదమని బుధవారం పేర్కొన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేని విషయాన్ని ఆ పార్టీ నేతలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఏకంగా ఆరెస్సెస్ను నిషేధించిన నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ను నిస్సిగ్గుగా పొగడటం వారి రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇంద్రసేనారెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నాటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. -
కేసీఆర్ బెదిరింపులు సరికాదు: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై వచ్చిన విమర్శల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో తక్కువ ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల రాష్ట్రంపై అధిక నిర్మాణ భారంతో పాటు వచ్చే నీళ్లు కూడా తక్కువగానే ఉంటాయన్నారు. గతంలో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదంటూ వివరించలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఆయా అంశాలను లేవనెత్తిన విపక్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు కేసులు పెడతాం, జైళ్లో పెడతామనే బెదిరింపుల తీరు సరైంది కాదన్నారు. -
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
-
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
భువనేశ్వర్: ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగీంద్ర బెహరా ఓ వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుంటూ స్థానిక మీడియాకు చిక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అయితే తాను చేసిన పనికి సమర్థించుకున్న మంత్రివర్యులు పైపెచ్చు తాను వీఐపీ నంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...కియోంజర్లోని హెడ్ క్వార్టర్స్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి జోగీంద్ర బెహరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం జోగీంద్ర బెహరా షూ తొడుక్కుంటున్న సమయంలో ఆయన పీఎస్వో మంత్రి షూ లేసును కట్టడం వీడియోలో కనిపించింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిపై చర్యలపై విమర్శలు ఎక్కుపెట్టాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనను చూస్తుంటే ఇది బ్రిటిష్ మనస్తత్వానికి ప్రత్యక్ష నిదర్శనమని న్యాయవాది ప్రహ్లాద్ సింగ్ వ్యాఖ్యనించారు. కాగా తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన మంత్రి జోగీంద్ర .. తానో వీఐపీనని, జెండా ఎగురవేసింది తానే కానీ పీఎస్వో కాదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు మంత్రి వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం స్పందించలేదు. -
ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్
వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ప్రధాని మోదీని సన్నాసి అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన దగ్గర మోకరిల్లుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి ఎద్దేవా చేశారు. వివిధ అంశాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ చివరకు ప్రధానిని సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత అమర్నాథ్బాబుతో కలసి ఆయన ఎన్టీఆర్భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆకాశ హర్మ్యాలు, ప్రత్యేక దవాఖానాలు, కే జీ టు పీజీ, ఉద్యోగాలు తదితర హామీలన్నీ ఎటుపోయాయని నిలదీశారు. మల్లన్నసాగర్లో రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టారని, లాఠీలు, తూటాలు ప్రయోగించారన్నారు. రాజకీయాలు, మీడియాను కేసీఆర్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అమర్నాథ్బాబు చెప్పారు. -
ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం
మాజీ హోంమంత్రి సబితారెడ్డి శంషాబాద్ : స్థానిక సంస్థలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల రెండేళ్ల పదవీకాలం పూర్తరుున సందర్భంగా శుక్రవారం వారిని అభినందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీల బలోపేతానికి ఒక్క పైసా కూడా విడుదల చేయడం లేదని, పైగా పంచాయతీల కరెంటు బిల్లుల్లో కోత పెడుతోందని విమర్శించారు. ఎర్రవెల్లి గ్రామానికి సర్పంచ్లా వ్యవహరిస్తున్న సీఎంకు గ్రామాల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టడం తప్ప ప్రజాసంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. బంగారుతల్లి, అమ్మహస్తం, ఆపద్బందు, అంత్యోదయ, ఇందిరమ్మ ఇళ్లు ఏవీ లేకుండా చేశారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలపై ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేరవేసేందుకు ఇంతవరకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వంపై ఇంతకాలం ప్రజలు పెట్టుకున్న నమ్మకం భ్రమేనని తేలిపోతోందన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజల గొంతుకగా పనిచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉగ్ర’ బోధకుడితో దిగ్విజయ్
కలకలం రేపుతున్న 2012 నాటి వీడియో న్యూఢిల్లీ/ముంబై: 2012లో వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వేదిక పంచుకున్న వీడియో తాజాగా కలకలం రేపుతోంది. దీంతో బీజేపీ దిగ్విజయ్పై విమర్శలు ఎక్కుపెట్టింది. జకీర్ శాంతికి ప్రతిరూపమని దిగ్విజయ్ కొనియాడటాన్ని ఎండగట్టింది. ఇటీవల బంగ్లాదేశ్లో ఒక రెస్టారెంట్లో 22 మందిని దారుణంగా హతమార్చిన కొందరు ఉగ్రవాదులు జకీర్ బోధనలతో స్ఫూర్తి పొందినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా ముంబైలోని డోంగ్రీలో జకీర్కు చెందిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ కార్యాలయం వద్ద భద్రతా బలగాలను మోహరించింది. ‘ఆయన ప్రసంగాలను హోంశాఖ అధ్యయనం చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటుంది. మీడియాలో ప్రసారమైన ఆయన ప్రసంగాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. జకీర్తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ... తన చర్యను సమర్థించుకున్నారు. జకీర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం కోసం సభ నిర్వహించారన్నారు. జకీర్ స్పందిస్తూ... ఇస్లాం పేరిట అమాయకులను చంపడానికి తాను వ్యతిరేకమన్నాడు. ప్రతి ముస్లిం.. టైస్టు కావాలని తాను చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భంలోనివి అని అన్నాడు. -
కేజ్రీవాల్లా చేయకండి..
సీఎం కేసీఆర్పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద ఫైర్ సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విమర్శించారు. ‘‘ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తా.. అంటే మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్.. కేజ్రీవాల్లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు.. కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు పార్టీ లీగల్ సెల్ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల అంశాలను సదానంద దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం అనంతరం న్యాయమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ బీజేపీ లీగల్ సెల్, సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ నా వద్దకు వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. హైకోర్టు విభజనకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మౌలిక వసతుల కల్పించాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రిది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తుల విభజన చేయాల్సి ఉంటుంది. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యాయశాఖ అవసరమైన చర్యలు చేపడుతుంది. హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పదేళ్ల సమయంలో రాజధాని ఏర్పాటయ్యేంతవరకు.. ముఖ్యంగా మౌలిక వసతుల ఏర్పాటు అయ్యేంతవరకు అక్కడే కొనసాగడం అనేది ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆప్షన్. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇందులో కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదు. సబార్డినేట్ కోర్టులు కూడా మా పరిధిలో ఉండవు’’ అని ఆయన అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం సంప్రదింపులు జరిపి న్యాయమూర్తుల నియామకం చేపడతారని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు.. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణకు చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారని, దీనిపై నిన్ననే సమాచారం వచ్చిందని సదానంద గౌడ చెప్పారు. ‘‘న్యాయమూర్తుల విభజన జరిగింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఉన్నవారిలో ఏపీకి చెందిన వారు 18, తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. అందులో నేనేమీ విభేదించడం లేదు. అయితే సబార్డినేట్ జ్యుడీషియరీలో న్యాయాధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రంలో ఉంటారు. దానిని చీఫ్ జస్టిస్ చూస్తారు. అది చట్ట ప్రకారం జరుగుతుంది. ఆశ్చర్యమేంటంటే తెలంగాణ సీఎం మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రం ఏ చర్య తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వారికి కూడా న్యాయశాఖ ఉంది. వాళ్లు రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు. పునర్ వ్యవస్థీకరణ చట్టం చదువుకోవచ్చు. అంతేగానీ సింపుల్గా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఈ దేశ ప్రజలు ఆశించడం లేదు’’ అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘‘నాలుగైదు సార్లు తెలంగాణ ఎంపీలు వచ్చి నన్ను కలిశారు. ఇద్దరు సీఎంలతో చర్చించాను. హైకోర్టు విభజన విషయంలో చొరవ చూపాను. ఇంతలో హైకోర్టులో పిల్ దాఖలైంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడది కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల హైకోర్టు విభజనపై నేను మాట్లాడటం తగదు. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సబ్జ్యుడిస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రజలే జవాబిస్తారు... హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు, గవర్నర్కు లేఖ రాస్తాన ని సదానంద గౌడ తెలిపారు. ‘‘కానీ సింపుల్గా నేను ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తానంటే ఎలా..? స్వాగతిస్తాం. మాకేం అభ్యంతరం లేదు. ఆయన కేజ్రీవాల్లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్లా వ్యవహరిస్తానంటే ప్రజలే జవాబిస్తారు’’ అని అన్నారు. బీజేపీ ప్రతినిధి బృందం చెప్పిన వ్యవహారాలన్నింటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు, గవర్నర్కు లేఖ రాస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం లేదు కదా అని మీడియా ప్రశ్నించగా... ‘‘ఎవరు ఒత్తిడి చేస్తారు? నేను చేయగలనా? రేపు వాళ్లేమంటారు? రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అంటారు. మీరు సమాఖ్య వ్యవస్థ అంటూ ఇలా ఎందుకు చేస్తున్నారని అడగరా?’’ అని ఎదురు ప్రశ్నించారు. వారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్న ప్రశ్నకు బదులుగా ‘‘నాకు తెలియదు. దానిపై నేనేమీ మాట్లాడను. అందులో మేమేమీ చేసేది లేదు. నేను హైదరాబాద్ వచ్చా. సీఎంలతో మాట్లాడా. హైకోర్టులో కేసు వచ్చాక ఇక నేను చేసేదేమీ లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘విషయం కోర్టులో పెండింగ్లో ఉండగా నేను ముఖ్యమంత్రికి లేఖ రాయలేను. సబ్జ్యుడిస్ అంటే ఏంటో మీకు తెలుసు. న్యాయశాఖ మంత్రిగా నా పరిధి నాకు తెలుసు. రేపు ఏదైనా జరిగితే మీరు తప్పుపడతారు. అది కోర్టు పరిధిలో ఉందని తెలంగాణకు కూడా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు: దత్తాత్రేయ కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడతోపాటు, హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో తాము సమావేశమయ్యామని, హైకోర్టు విభజన అంశంపై సామరస్యంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ బాలసుబ్రమణ్యం, లీగల్ సెల్ కన్వీనర్ విశ్వనాథ్, రామారావు, ఆంటోనీ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన వ్యవహారం ఇద్దరు సీఎంలు కలిసి కూర్చొని పరిష్కరించుకునే అంశమే గానీ.. ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తామనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘‘మీరు ఢిల్లీ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఏమాత్రం లేదు. మీ కార్యాలయంలో కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. -
డ్రైవర్లు లేక ఒకచోట.. ఖాళీగా మరోచోట!
వైద్య ఆరోగ్య శాఖలో వింతపోకడ ముగ్గురు డ్రైవర్లు డీఎంఅండ్హెచ్వో సేవలోనే.. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరుకు వాహనం తీసుకెళుతున్న వైనం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్లు లేక అంబులెన్స్లు కదలని పరిస్థితి ఉంటే.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం వాహనాలు లేక డ్రైవ ర్లు ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకుంటున్నారు. చక్కదిద్దాల్సిన అధికారులు తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యవస్థ గాడితప్పుతోంది. లబ్బీపేట : వైద్య ఆరోగ్య శాఖలో వింత ధోరణి నెలకొంది. డ్రైవర్లు లేక వాహనాలు కదలని పరిస్థితి ఒకచోట ఉంటే.. డ్రైవర్లు ఉన్నా వాహనాలు లేక మరికొన్ని ప్రాంతాల్లో జీతాలు అందుకుంటున్నారు. నిత్యం గుంటూరు నుంచి రాకపోకలు సాగించే జిల్లా వైద్యాధికారిణి ముగ్గురు డ్రైవర్లను తన వాహనానికి వినియోగించడం విశేషం. అంబులెన్స్లకు డ్రైవర్లు లేక అదే శాఖలోని పలు ప్రాంతాల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు తమ స్వార్థం కోసం కండీషన్లో ఉన్న వాహనాలను సైతం నిర్వీర్యం చేస్తూ, సొంత వాహనాల్లో తిరుగుతూ అద్దెలు పొందుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది వాహనాలు.. 15 మంది డైవర్లు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తొమ్మిది వాహనాలు ఉండగా పదిహేను మంది డ్రైవర్లు ఉన్నారు. తిరువూరు, గంపలగూడెం పీహెచ్సీల్లో కండీషన్లో ఉన్న వాహనాలు ఉన్నా డ్రైవర్లు లేక మూలనపెట్టారు. మరో వైపు వెంట్రప్రగడ, తోట్లవల్లూరు పీహెచ్సీల్లో డ్రైవర్లు ఉన్నా.. వాహనాలు లేక ఖాళీగా ఉంటున్నారు. వారికి వాహనా లు అప్పగించే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు డ బ్బులు వచ్చే పనులు మినహా ప్రజలు, రోగులకు అవసరమైన పనులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు స్పందించక పోవడంపై వారి నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్లు లేక.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు అంబులెన్స్లు ఉండగా, ముగ్గురు డ్రైవ ర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముఖ్యమంత్రి నగరంలో ఉన్నప్పుడు ఇద్దరు డ్రైవర్లు కాన్వాయ్కు వెళ్లిపోవడంతో ఇం కా ఒక్కరు మిగులుతున్నారు. దీంతో కొత్త ఆస్పత్రి నుంచి పాత ఆస్పత్రికి, పాత ఆస్పత్రి నుంచి కొత్త ఆస్పత్రికి రో గులను షిప్ట్ చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వాహనాలు లేక డ్రైవర్లు ఖాళీగా ఉంటుండగా, ఇక్కడేమే డ్రైవర్లు లేక వాహనాలు కదలనిదుస్థితి నెలకొంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరుకు వాహనం ఏ జిల్లా అధికారి అయినా తమ వాహనాన్ని నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలో తిరిగేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రెండేళ్లుగా గుంటూరు నుంచి తన అధికారిక వాహనంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అందుకు గాను ఆమె ముగ్గురు డ్రైవర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డ్రైవర్ వారం రోజుల చొప్పున ఇద్దరు డ్రైవర్లు రెగ్యులర్గా పనిచేస్తుండగా, వారు సెలవు పెట్టిన సమయంలో ఉండేందుకు మరొకరిని తమ క్యాంపు ఆఫీసులో రిజర్వ్లో ఉంచడం కొసమెరుపు. వాహనాలకు మరమ్మతులు చేయిస్తున్నాం జిల్లాలో పుష్కరాల డ్యూటీల కు వాహనాలు కావాల్సిఉన్నం దున మరమ్మతులు చేయిస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సర్దుబాటు చేస్తాం. డీఎంహెచ్వోకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అందులో తప్పేమిలేదు. - డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి -
చార్జీల మోత
♦ చార్జీల మోత.. కరెంటు వాత ♦ బస్సు భారం ఏటా రూ.12.15 కోట్లు ♦ ప్రతినెలా విద్యుత్ వడ్డింపు రూ.5 కోట్లు! ♦ కుదేలైన సామాన్య జనం సర్కారు తీరుపై విమర్శలు సర్కార్ ఒకే రోజు రెండు షాకులిచ్చింది. చార్జీల వడ్డింపుతో సామాన్యులను ఎడాపెడా బాదేసింది. ఓ వైపు విద్యుత్, మరోవైపు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. వంద యూనిట్లు దాటితే చాలు పెంపు భారం తప్పదు. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తోన్న దశలో సామాన్యుడు సైతం వంద యూనిట్ల స్లాబ్ దాటేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా పెంపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి. మెదక్: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు భారం సామాన్యుడిపై పడింది. ఆర్డినరీ బస్సుతోపాటు అన్ని రకాల బస్సుల్లోనూ ప్రభుత్వం చార్జీల మోత మోగించింది. 30కిలో మీటర్లకుపైగా ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం మోపింది. జిల్లాలో ఏడు బస్సు డిపోలు ఉండగా మొత్తం 618 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 269 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుండగా, 349 ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్లగ్జరీ బస్సులున్నాయి. నిత్యం ఈ బస్సులు 2.25 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందులో 1,12,500 కిలో మీటర్ల ప్రయాణం 30కిలో మీటర్లపైనే కొనసాగుతుంది. 30 కిలో మీటర్ల లోపు రూపాయి చొప్పున పెరుగుతుండటంతో ఏడాదికి రూ.4.05 కోట్ల భారం పడగా, 30 కిలోమీటర్ల ఆపైనా.. 8.10 కోట్ల భారం పడుతుంది. మొత్తం రూ.12.15 కోట్లు భారం ప్రయాణికుడిపై పడనుంది.ఇప్పటికే కరువు, కాటకాలతో నిండా మునిగిన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత భారం కానుంది. ఇప్పటికే కరువుతో ప్రజలు వలసలు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. అలాంటిది కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీలను వడ్డించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చార్జీల పెంపుపై మండిపాటు... చార్జీల పెంపు సరికాదని ఇప్పటికే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏడాదికి 27శాతం ఆదాయం అధికంగా వస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామంటూ చెప్పిన మరుసటి రోజే చార్జీలు పెంచడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ♦ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముచేసినట్లే అవుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి. -
ఇక ప్రధాన ఆర్థిక సలహాదారుపై సుబ్రమణ్యస్వామి అస్త్రాలు
♦ అరవింద్ సుబ్రమణ్యంను తప్పించాలని ట్వీట్ ♦ భారత్ ప్రయోజనాలకు ఆయన వ్యతిరేకమని విమర్శలు ♦ తోసిపుచ్చిన ప్రభుత్వం, బీజేపీ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్పై ఇప్పటి వరకూ విమర్శలు సంధించిన బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న మరో సీనియర్ అధికారిపై తాజాగా తన బాణాలను ఎక్కుపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యంను తక్షణం కేంద్రం ఆ పదవి నుంచి తప్పించాలని ట్వీట్ చేశారు. రాజన్ తరహాలోనే అరవింద్ సుబ్రమణ్యం కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థిక వేత్త కావడం గమనార్హం. సుబ్రమణ్యంస్వామి తాజా ట్వీట్ అటు ప్రభుత్వాన్నీ, ఇటు పాలక పార్టీ బీజేపీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వెనువెంటనే సుబ్రమణ్యం స్వామి ప్రకటనను తోసిపుచ్చాయి. సుబ్రమణ్యం స్వామి ప్రకటన వెనుక అటు ప్రభుత్వంకానీ, ఇటు పార్టీకానీ లేదని చెప్పడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరవింద్ సుబ్రమణ్యంను ఎన్డీఏ ప్రభుత్వమే 2014 అక్టోబర్లో సీఈఏ పదవిలో నియమించడం గమనార్హం. విమర్శలు ఇవీ... బహుళజాతి ఆర్థిక సంస్థ- ఐఎంఎఫ్ ఆర్థికవేత్తగా పనిచేస్తున్న కాలంలో అరవింద్ సుబ్రమణ్యం 13వ తేదీ మార్చి 2013న భారత్ ప్రయోజనాలకు విరుద్ధ మైన సూచన చేసినట్లు సుబ్రమణ్యం స్వామి తాజాగా ట్వీట్ చేశారు. తన ఫార్మా రంగం ప్రయోజనాల పరిరక్షణకుగాను అమెరికా భారత్పై చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్కు ఆయన సూచించారన్నది ఈ ట్వీట్ సారాంశం. ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పదవీ విరమణ అనంతరం ఆ పదవికి రేసులో అరవింద్ సుబ్రమణ్యం కూడా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఈఏపై విశ్వాసముంది: జైట్లీ సుబ్రమణ్యం స్వామి విమర్శలపై విలేకరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సమాధానమిస్తూ... సీఈఏ అరవింద్ సుబ్రమణ్యంపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ప్రభుత్వానికి ఆయన ఎప్పటికప్పుడు విలువైన సలహాలు ఇస్తున్నట్లు కూడా జైట్లీ అన్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, సుబ్రమణ్యం స్వామి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఆయన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవనీ అన్నారు. -
కార్పొరేట్లకు కేసీఆర్ ఊడిగం
తమ్మినేని వీరభద్రం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న చందంగా ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ కేసీఆర్ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా తెలంగాణ బాగుకు, అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. చేసిన అభివృద్ధి కంటే చెప్పుకున్నదే ఎక్కువ. వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. కానీ కార్పొరేట్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, కుటుంబ రాజకీయాలు సుస్థిరం చేసుకోవడం, ఇతర పార్టీల్లోని కాంట్రాక్టర్లు, సంపన్నులను పార్టీలో చేర్చుకోవడం, ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం వంటి అంశాలపైనే కేసీఆర్ దృష్టి సారించారు’’ అని దుయ్యబట్టారు. కేంద్ర కమిటీ భేటీలో టీఆర్ఎస్ రెండేళ్ల పాలన, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని, ఆయా అంశాలపై కేంద్ర కమిటీకి నివేదిక కూడా ఇచ్చామన్నారు. -
ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా?
కోదండరాంపై విమర్శలు సరికాదు: రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మం త్రులు విమర్శల దాడితో ఎగబడ్డారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తప్పా అని నిలదీశారు. మం గళవారం రేవంత్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోదండరాం రెండేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే స్పందించారన్నారు. రైతు సమస్యలపై ఆయన కోర్టుకు వెళ్లిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ‘‘ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు విమర్శిస్తారా?ఉద్యమకారుడికిచ్చే గౌరవమిదేనా? ఆంధ్రావాళ్లు కూడా ఆయన్ను ఇంతలా అవమానించలేదు. జేఏసీని కనుమరుగు చేయాలన్నదే టీఆర్ఎస్ వ్యూహం’’ అన్నారు.