culture
-
కృతజ్ఞత కనీస సంస్కారం
మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞులై ఉండడం మన కనీస ధర్మం... మనం ఎవరి నుంచైతే మేలు పొందుతున్నామో, వారు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా, వారి ఉదారతను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధిగా భావించాలి. ఎందుకంటే అలా కృతజ్ఞతలు తెలియ చేసినపుడే మన సంస్కారం ఏమిటో ఇతరులకు అర్థమవుతుంది. అంతేకాదు అది మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.మనం ఇతరుల నుంచి ఎలాంటి సహాయం పొందినా వారికి కృతజ్ఞులై ఉండాలి. తల్లితండ్రులు మనకి జన్మనిస్తారు.. మన భవిష్యత్ కు పునాదులు వేస్తారు.. అందువల్ల మనం వారికి జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి. మన గురువులు మన భవిష్యత్ కు దిశానిర్దేశం చేస్తారు, మన స్నేహితులు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇలా అనేక మంది పరోక్షంగా మన భవిష్యత్కు ఎంతగానో సహకరిస్తున్నారన్నమాట.. మన భవిష్యత్ను వారంతా తీర్చి దిద్దుతున్నపుడు వారికి మనం కృతజ్ఞతలు చూపించుకోవాలి కదా.. కృతజ్ఞతలు తెలియ చేయడం మన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది.. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినపుడు నవ్వుతూ ధాంక్సండీ.. మీ మేలు మరచి పోలేను అని చెప్పి వారి కళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే, వారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం మనకు కనిపిస్తుంది.. వారికి మన పట్ల మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల అవతలి వారు భవిష్యత్లో వారితో మనకేదైనా పని పడ్డప్పుడు, వారు ఇక ఆలోచించకుండా మనకు సహాయం చేస్తారు.శ్రీరామచంద్రుడ్ని మనం దేవుడిగా పూజిస్తాం.. అయితే రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అలా రాముడు ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతను చాటుకోవడం వల్లనే ఆయనను మనం పూజిస్తున్నాం.. ఆరాధిస్తున్నాం... మనం భూమి మీద నడుస్తున్నాం. పంటలను పండించుకుంటున్నాం... కనుక భూమిని భూదేవి‘ అనీ, మనం బతికుండడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నీటిని ‘గంగాదేవి’ అనీ, గాలిని వాయుదేవుడు అనీ పిలుస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి. సమస్త ప్రకృతి మన భావాలను గ్రహించి తదనుగుణంగా స్పందిస్తుంది కనుక మనకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకూ, నీటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవితానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తికీ, వస్తువుకు, జీవికి మనం కృతజ్ఞులై ఉంటే, అదే మన భావి జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. మన జీవితాన్ని నందనవనం చేస్తుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి.– దాసరి దుర్గా ప్రసాద్, ఆధ్యాత్మిక పర్యాటకులు -
అపురూపాల మంత్రపురి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన మంత్రపురి దర్శన్లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలంనేటితరం కోసం.. భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
కనువిందు చేస్తున్న రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ (ఫోటోలు)
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్పీస్ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..
యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది. వారసత్వ జాబితాలో..టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది. ముఖ్యమైన టీ సంగతులు...టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు. 1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్ను తయారు చేస్తారు. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్సిటీ జైపూర్లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
పండుగలకే పండుగ!
నాగాలాండ్లో జరిగే ‘హార్న్బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
సమ్థింగ్ డిఫరెంట్
సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్ కేఫ్ కల్చర్ని మీరింకా టేస్ట్ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్ అంటే ఆఫీస్.. కేఫ్స్ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్లు. ఈవెంట్స్ నుంచి వెరైటీ మీట్స్ వరకూ కేఫ్లు వేదికలవుతున్నాయి. వర్క్ప్లేస్ల నుంచి వర్క్షాపుల వరకూ కేఫ్లు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. టాప్ క్లాస్ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్ సీక్రెట్స్ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్ సెంటర్కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్కి వెళితే చాలు. ఫుడ్కీ, డ్రింక్స్కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్ అని పునర్ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్. మ్యూజిక్ ఈవెంట్ల.. పంట.. పేరొందిన రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్లోని హార్డ్రాక్ కేఫ్ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్ తరచూ కేఫ్ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.కేఫ్స్లో నిర్వహించే ఈవెంట్స్లో మ్యూజిక్ తర్వాత కామెడీ షోస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్ కమెడియన్స్ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్ ఆరి్టస్ట్స్, టీవీ షోస్ ద్వారా పాపులర్ అయినవారు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్కు తరలివస్తున్నారు.వర్క్ప్లేస్లోనూ..ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్ స్పేస్ను కూడా కేఫ్స్ ఆఫర్ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్ కల్చర్స్ వల్ల ఇప్పుడు కేఫ్స్లో కూర్చునే ఆఫీస్ వర్క్ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్ను వర్క్ప్లేస్లుగా వినియోగిస్తున్నారు.వర్క్షాప్స్.. విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్ నిలయంగా మారుతుండడం విశేషం. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ కేఫ్స్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెబుతున్నారు. పోటరీ వర్క్షాప్, పెయింటింగ్ వర్క్షాప్, కేక్ డెకరేటింగ్, రెసిన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, బేకింగ్ తదితర కళలకు సంబంధించిన వర్క్షాప్లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.డేటింగ్స్.. మీటప్స్.. పలు సంస్థలు, క్లబ్స్ తమ మీటప్ పాయింట్లుగా కేఫ్స్ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్ను సిద్ధం చేసి మరీ ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్కు కూడా పలు కేఫ్స్ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్షిప్ ఈవెంట్స్, పెయిరింగ్ ఈవెంట్స్ తరహా థీమ్స్తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
మనం మీనం
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం.. మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్స్టైల్తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.జీబ్రా చేపలుఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.నెమలి నాట్యంలా.. నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్్కలు కూడా నేర్చుకుంటాయి.‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. ఆస్కార్ ఫిష్లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.ఇంటెలిజెంట్.. గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.హచ్ డాగ్స్లా.. పేరుకు తగ్గట్టే ఏంజెల్లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్గా ఉంటాయి.వెరీ.. క్యూరియస్ గయ్..గౌరమి అనే రకం చేపలు క్యూరియస్గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి. సిచిల్డ్ చాలా భిన్నం..సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట. జాగ్రత్తగా కాపాడుకోవాలి.. చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి. – షేక్ నసీరుద్దీన్ మన బాధ్యత.. ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి. – ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్ -
ఫ్లవర్ ఫేవర్
ముసి ముసి నవ్వులలోన.. కురిసిన పువ్వుల వాన.. ఏ నోము నోచినా.. ఏ పూజ చేసినా.. తెలిసి ఫలితమొసగే వాడు.. ఈ పాట వినడానికి ఎంత అందంగా ఉంటుందో.. పువ్వును చూస్తే.. మనసు అంత ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఎవరినన్నా కలిసేందుకు వెళ్లేటప్పుడు వారి ఆనందంగా ఉండాలని కోరుతూ గౌరవ సూచికంగా పుష్పగుచ్ఛాలు తీసుకెళతారు.. ఇప్పుడిది ట్రెండ్గా మారింది.. ఒకప్పటి దండల స్థానాన్ని బొకేలు భర్తీ చేస్తున్నాయి.. దీనికోసం దేశీయ పూలనే కాకుండా, దేశ విదేశాల నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం.. సాధారణంగా పువ్వులు అనగానే బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, కనకాంబరాలు, మల్లి, సన్నజాజి వంటి రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఫ్లవర్ డెకరేషన్, బొకేల్లో వినియోగించేందుకు మాత్రం హైబ్రిడ్ గులాబీ, చామంతి, సన్ఫ్లవర్, మొదలైన రకాలకు తోడు ప్రొటీయా, పింక్షన్, సింబిడియం, పియోని, చేయి, బటర్ఫ్లైగిట్, టాన్జేరియన్, తులిప్స్, డెలి్పనియం, జిప్సోఫిలా, ఆసరిన, డ్రైసిన, జొనడా, ఓరెంటీ లిల్లి, సూడాటియం, క్రైశాంతిమం మొదలైన రకాల పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇండోర్ ప్లాంట్లకు సైతం డిమాండ్ పెరిగింది. పిండోడియం అనే ఫ్లవర్ ఒక్కొక్కటీ కనీసం రూ.800 నుంచి రూ.3 వేల వరకూ ఉంటుంది. ఈ పూలతో బొకే తయారు చేస్తే దాని ధర ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు.థాయ్లాండ్ నుంచి..నగరంలో ఫ్లవర్ డెకరేషన్కు అవసరమైన ముడి సరుకు, ఫ్లవర్స్, ఇతరత్రా అన్నీ థాయ్లాండ్, బెంగళూరు, ఊటీ, పూణే, కోల్కతా తదితర నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్కడి వ్యాపారులతో సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్, ఫ్లవర్స్, ఇతర అంశాలను తెలుసుకుని అప్డేట్ అవుతున్నారు. మార్కెట్ను బలోపేతం చేసుకుంటూ, ఫ్రెష్ ఐటమ్స్, మంచి ధరకు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా మెహిదీపట్నం, ఇతర మార్కెట్లో పువ్వులు దొరుకుతున్నప్పటికీ వాటిని ఆధ్యాతి్మకం, గృహ అవసరాలకు, దండల తయారీలో వినియోగిస్తున్నారు.బొకేలకు డిమాండ్ ..భాగ్యనగరంలో గతంలో పూల బొకే కావాలంటే ఫలానాదగ్గర మాత్రమే ఉంటాయని ల్యాండ్ మార్క్ ఉండేది. ఇప్పుడు బొకేలు, ఫ్లవర్ బాక్స్లు, ఇతర ఫ్లవర్ ఐటమ్స్కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రధాన కూడళ్ల నుంచి ఎక్కడ చూసినా దుకాణాల్లో రకరకాల అలంకరణలతో విరివిగా బొకేలు లభిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని కలవాలన్నా బొకే తప్పనిసరైంది. దీంతో సుమారు ఒక్కో బొకేకి రూ.350 నుంచి రూ.10 వేల వరకూ వెచి్చస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బొకేలో వినియోగించే పువ్వుల రకాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు.డెకరేషన్ రూ.లక్షల్లో..గృహ ప్రవేశం నుంచి వివాహాది శుభకార్యాలు, సత్యన్నారాయణ వ్రతం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకూ సందర్భం ఏదైనా స్వాగత తోరణాలు, పూల అలంకరణలు తప్పనిసరి అయ్యింది. ఫ్లవర్ డెకరేషన్ స్టేటస్గా సింబల్గా భావిస్తున్నారు. దీంతో లక్షలు వెచి్చంచి ఫ్లవర్ డెకరేటర్స్కు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. ఆన్లైన్లో కొత్తకొత్త మోడల్స్ ఎంపిక చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మరో అడుగు ముందుకేసి ఇంపోర్టెడ్ ఐటమ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా వెనుకడుగు వేయట్లేదు. స్థోమతను బట్టి ఒక్కో ఫంక్షన్కు డెకరేషన్ కోసం సుమారుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వెచి్చస్తున్నారు.లక్షతో బర్తడే డెకరేషన్మా పాప మొదటి బర్తడే సందర్భంగా బందువులు, స్నేహి తులతో కలసి చిన్నగా ఫంక్షన్ పెట్టుకున్నాం. ఫొటో షూట్లో బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అన్నారు. సరే అన్నాను. డెకరేటర్ను సంప్రదిస్తే మాకు నచి్చన మోడల్కు రూ.1.20 లక్షలు చెల్లించాను. – మనోజ్, మణికొండఅభిరుచికి అనుగుణంగా... దశాబ్దకాలంగా ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నాను. ప్రస్తుత ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ చేయించడం, ప్రతి చిన్న సందర్భంలోనూ బొకేలు ఇచ్చిపుచ్చుకోవడం ట్రెండ్గా మారింది. దీంతో పాటే ఇండోర్ మొక్కలకు సైతం మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొకే, బాక్స్, బంచ్, ఇతర మోడల్స్ సరఫరా చేస్తున్నాం. – సూర్య, వీజే పెటల్స్, రోడ్ నెం–1, బంజారాహిల్స్ -
ఎక్స్ట్రా.. ఎఫెక్ట్
బోడుప్పల్లో నివసించే ప్రవీణ్..కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. అదే సమయంలో తమ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు కూడా ఫ్రీలాన్స్గా పనికి కుదిరాడు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని మూడు జాబ్లూ చేస్తూ ట్రిపుల్ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. పైగా ఎక్స్ట్రా జాబ్స్ విషయం ఇంట్లో వారికి తెలీదు కాబట్టి వాటి వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా ప్రవీణ్ సొంతం. ఎలా ఖర్చుపెట్టుకున్నా అడిగేవారు లేరు... కట్ చేస్తే... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రవీణ్ కొండాపూర్లోని ఒక రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. నగరంలో మల్టిపుల్ జాబ్స్ కల్చర్ వల్ల దెబ్బతింటున్న యువతకు ప్రవీణ్ ఓ ఉదాహరణ మాత్రమే. ⇒వారానికి 60 పని గంటలకు మించితే అనర్థాలే⇒ఒత్తిడి హార్మోన్లతో ఆందోళన, డిప్రెషన్⇒నగరానికి చెందిన వైద్య నిపుణుల హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: నగరాల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మల్టీ జాబ్ కల్చర్ పెరుగుతోంది.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే మరో సంస్థలో కూడా పనిచేసే మల్టీ జాబ్ కల్చర్ పేరే... ‘మూన్ లైటింగ్’... కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పుట్టుకొచి్చన ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ... నగరంలోనూ కనిపిస్తోంది. నాలుగు చేతులా సంపాదించడం ఎలా ఉన్నా... నానా రకాల అనారోగ్యాల పాలుకావడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రపరిణామాలు తప్పవు... తమ ఉద్యోగ పనివేళలు అయిపోయాక రెండో ఉద్యోగం చేయడం.. గత కొంత కాలంగా ఐటి సంబంధిత రంగాల్లో ఎక్కువగా, ఇతర రంగాల్లో కొద్దిగా కనిపిస్తోంది. ఈ మూన్లైటింగ్ సంస్కృతిపై... పలు బహుళజాతి కంపెనీలు విధానపరమైన ఆదేశాలనూ జారీ చేశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కంపెనీల వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. నైతికంగా ఇది తప్పా.. ఒప్పా అనేది పక్కన పెడితే న్యాయవ్యవస్థ దీని చట్టబద్ధతను త్వరలో తేల్చనుంది. మరోవైపు ఇప్పటికే ఇది వ్యవస్థలో వేళ్లూనుకుంటుండడంతో... దీని లాభనష్టాలను కూడా యువత చవిచూస్తోంది.వారానికి 60 గంటలు మించితే.. అనతికాలంలోనే విజృంభించిన మల్టిపుల్ జాబ్స్ ట్రెండ్ వల్ల కలిగే అదనపు ఆదాయాలను లెక్కించే పనిలోనే అందరూ మునిగిపోయారు. ఇప్పటి దాకా దు్రష్పభావాల గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, వారానికి 60 గంటలకు మించి పనిచేస్తే మెదడు, గుండె మీద తీవ్ర ప్రభావం పడుతుందని.. ఒక్కోసారి అవి శాశ్వతంగానూ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం, వాటిలో ఉండే పని ఒత్తిడి, పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి రావడం... ఇవన్నీ మెదడు, గుండెను దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న బాధితులు... లక్షలాది మంది టెక్నాలజీ నిపుణులకు నిలయమైన నగరంలోని ఆస్పత్రులకు ఇప్పుడు మూన్లైటింగ్ దు్రష్పభావాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనిని ఉచ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, రిహాబిలిటేషన్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ బత్తిన థృవీకరించారు, ‘బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురైన, లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుని మా పునరావాస కేంద్రానికి వస్తున్న వారిలో ఎక్కువమందిని ఈ మల్టిపుల్ జాబ్స్ బాధితుల్నే చూస్తున్నాం. వీరిలో ఐటీ నిపుణులు, అందులోనూ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నవారు, రాత్రుళ్లు సైతం నిద్ర లేకుండా, వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తూన్న వారే అధికంగా ఉన్నారు. ఈ కొత్త కల్చర్...ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని తెలుస్తోంది. అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంతీ అవసరమే... ఎక్కువ గంటలు పనిచేయడం దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇది నాడీ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెదడులో ప్రి–ఫ్రంటల్ కార్టెక్స్లో వాల్యూమ్ తగ్గడం వంటి మార్పులకు కూడా కారణమవుతుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం, ప్రణాళిక, ప్రేరణ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా అమోర్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి మాట్లాడుతూ ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, ఆడ్రినలిన్ హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల ఆందోళన, డిప్రెషన్ వస్తాయి. నిరంతర ఆందోళన లేదా నిరాశ వల్ల రక్తపోటు అధికమై గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవితం–పని బ్యాలెన్స్ గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ గంటలు పనిచేసే ప్రొఫెషనల్స్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. సూచనలు ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పనిచేస్తే, రోజువారీ ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి అతనికి అంత ఎక్కువ విశ్రాంతి అవసరం. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేటప్పుడు మన గురించి మనం పట్టించుకోవడం కూడా ఒక బాధ్యతగా గుర్తించాలి. పనికీ పనికీ మధ్య తగిన విరామం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేదా ధ్యానం వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లను అనుసరించాలి. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్లో 26 శాతం, ఉత్తరప్రదేశ్లో 24 శాతం, బీహార్లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
ఆకలికి ఏదో ఒక ఆహారం తింటేసరి అని మనం అనుకుంటాం. చాలావరకు ఆ తినేదేదో రుచికరంగా ఉంటే చాలని కోరుకుంటాం అందరం. ఆఖరికి సన్యాసులు, పశుపక్ష్యాదులైనా!.. ఉత్త అన్నంమెతుకులే వేస్తే..కుక్కయినా సరే ముఖం చిట్లించేస్తుంది. ఏదో ఓ కూర కలిపి వేస్తే కాస్తయినా రుచి చూస్తుంది. అదే చికెన్, మటన్ లాంటిదైతే కృతజ్ఞతగా తోక కూడా ఊపుతూ మరీ లాగించేస్తుంది. మనం చెట్టుమీదున్న పండు అక్కడికక్కడ తెంపుకొని గబుక్కున తినేస్తాం మనం. కానీ అమెరికావాళ్ళకు ‘ ఏమి తింటున్నాం అనేదానికన్నా ఎలా తినాలి ’ అన్నది చాలా ముఖ్యం. చేతితో మాత్రం ముట్టరు..వాళ్ళు అదే పండును శుభ్రంగా కడిగి, ప్లేట్ లో పెట్టుకొని, ఎడమ చేతిలో ఫోర్క్, కుడి చేత చాకు పట్టుకొని కోసి తినడాన్నే ఇష్టపడతారు. అది శాఖాహారమైనా మాంసాహారమైనా చేతితో మాత్రం ముట్టుకోరు . ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో.. నేను పనిచేస్తున్న సంస్థ మార్కుఫెడ్ వారు ,సహకార శిక్షణలో భాగంగా మూడు మాసాల కోసం నన్ను బెంగుళూరు పంపారు. అక్కడి మెస్సులో భోజనాల దగ్గర బయటి రాష్ట్రాల మిత్రులను చూసి పట్టిన ‘ చెంచా ’ అలవాటును నేను ఇప్పటికీ వదలడం లేదు. మా ఇంట్లో ఈ కొత్త అలవాటును చూసి ‘ ఇదేం చెంచాగిరి ’ అని వెక్కిరించినా, ఆతర్వాత వాళ్లే అర్థం చేసుకున్నారు.అలా చేస్తే అమర్యాద కింద లెక్క..ఎటైనా బయటికి వెళ్తున్నామంటే చాలు ఎందుకైనా మంచిదని ఒకటి రెండు చిన్న చెంచాలు బ్యాగులో పెట్టేవారు. అమెరికాలో ఆతిథ్యం విషయంలో ఎన్నో కొత్త విషయాలు గమనించవచ్చు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వస్తామని రాకపోవడం, ఆలస్యంగా వెళ్లడం అమర్యాద కిందే లెక్క. అతిథులకు ముందు నాప్కిన్స్ పెడితే మనం చేతి, మూతి తుడుచుకొని పక్కకు పడేస్తాం. కానీ దాన్నే అమెరికన్స్ బట్టలు పాడుకాకుండా ఉండడానికి పైన వేసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర మనను ఆహ్వానించిన గృహస్తు అందరికీ వడ్డించి, తాను తినడం ప్రారంభించాకనే వచ్చిన అతిథులు తినడం, వైన్ లాంటి డ్రింక్ ఇస్తే గ్లాస్ పైకి లేపి ‘ చీర్స్ ’ చెప్పడం అక్కడి వారి మర్యాద (etiquette ). అంతేకాదు నోరు మూసుకొని తినాలంటారు వారు, లొట్టలేసుకుంటూ శబ్దంచేస్తూ తినడం, తింటూ తింటూ మాట్లాడడం, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ముక్కు చీదాల్సి వచ్చినా రెస్ట్ రూంకు వెళ్లకుండా అక్కడే కూర్చోవడం, వాళ్లకు అస్సలు నచ్చని విషయాలు.కచ్చితంగా థాంక్స్ చెప్పడం వంటివి..ఏదైనా కావాలనుకుంటే ముందు ‘ప్లీజ్ ’ జతచేసి అడగడం, వాళ్ళు అది మీకు వడ్డించినప్పుడు ‘ థాంక్స్ ’ చెప్పడం విధిగా పాటించాల్సిన మర్యాదలు. ముందు గబగబా ప్లేట్ నింపుకొని తర్వాత తినలేక అవస్థపడి వదిలేసినా అక్కడ బాగోదు సుమా! ఎంత అవసరమో.. అంతే వడ్డించుకుని అది తిన్న తర్వాత మళ్లీ పెట్టుకోవడం అక్కడ గమనించిన విషయం. ఫుడ్ వేస్టేజ్ను చాలా మంది అమెరికన్లు ఒప్పుకోరు. భోజనం తర్వాత బ్రేవుమని త్రేన్చితే అతిథి దేవుడు తృప్తిపడ్డట్టు మనం భావిస్తాం . వాళ్ళ లెక్కలో అదీ శబ్దకాలుష్యమే. అమెరికావాళ్ళు తెలివిగలవాళ్ళు. లంచ్, డిన్నర్లే కాదు బ్రేక్ ఫాస్ట్లను కూడా వాళ్ళ కుటుంబ, వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకోడానికి వాడుకుంటారు. క్లాసుమేట్స్తో కలిసి ఇంటికి వచ్చిన మా మనవరాలు స్నేహితురాలయిన ఒక తెల్లపిల్లను చూసి ‘ నీకన్నా చాల పెద్దదానిలా ఉందే ఈ అమ్మాయి ’ అన్నాను పొరపాటున. మా గ్రాండ్ డాటర్ చెవి పిండకుండానే నా చెవిలో చెప్పిన రహస్యం ‘ యూ ఎస్ లో ఎప్పుడూ ఎవరి ఏజ్ ప్రస్తావన తేవద్దు , వాళ్ళ పెళ్ళి గురించి , పిల్లల గురించి అస్సలు మాట్లాడొద్దు జాగ్రత్త ! వేముల ప్రభాకర్(చదవండి: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్) -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్మేన్ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్షాప్ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?
యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి. జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు. వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు. యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు. వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
అమెరికాలో ఘనంగా శ్రావణమాస మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు. డెలావేర్లోని మిడిల్ టౌన్లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
నలుమూలల సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే "పండుగ"!
యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నేపథ్యం ఎడిన్బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్తో కలసి ఎడిన్బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు. ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
విశాఖలో శారీ వాక్థాన్
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన వస్త్రధారణపై నేటి యువతకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విశాఖ ఆర్కేబీచ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్థాన్ (చేనేత చీర నడక) నిర్వహించారు. భారీగా హాజరైన మహిళలతో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్థాన్ను ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ట్రేడిషనల్ వాక్, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
అడవితల్లికి ‘తొలి’ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు. వనంలో పూజలు.. అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు. కోడితో జాతకం.. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు. తుర్ర వాయింపు.. ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు. ఏత్మాసార్ పేన్కు పూజలు! అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు. -
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం
ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే. ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి. భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు. ఎంఎన్ రాయ్ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్ను దళితులు కనిపెట్టారు. అంబేడ్కర్ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ. భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది. గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది. అంబేడ్కర్ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్ చెప్పారు. మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానమైన అంశం. నిజానికి మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్ చెప్పారు. ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు. అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు. మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే... ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు. ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్: రోడ్మ్యాప్స్ ఫర్ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695 -
పాణిగ్రహణం.. దేశానికో సంప్రదాయం.. విదేశాల్లోని వింత సంప్రదాయాలివీ!
భారతదేశంలో వివాహం అనేది ఓ పవిత్ర కార్యం. రెండు హృదయాలను ఆలుమగలుగా మలిచే మనోహర ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే వివాహ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కాగా.. మరికొన్ని ఆధునికమైనవి. కొన్ని తెగల్లో ఇప్పటికీ బహుభార్యత్వం కొనసాగుతోంది. కొన్ని తెగల్లో బహుభర్తృత్వం కూడా ఉంది. కొన్నిచోట్ల వివాహానికి ముందే కాపురం చేసి పిల్లల్ని కూడా కనడం.. ఆ తరువాత నచ్చితే పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం వంటి పద్ధతులూ ఉన్నాయి. కాగా.. విదేశాల్లో అమలులో ఉన్న కొన్ని వింత సంప్రదాయాలివీ... సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ వివాహ సంప్రదాయాన్నీ, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటారు. అంత గొప్పది మన సంస్కృతి. అయితే జాతకాలను విశ్వసించే మన దేశంలో వధూవరులు పుట్టిన జాతకం (చార్ట్ మ్యాచింగ్) ఆధారంగా వివాహాలను నిశ్చయిస్తారు. వధువుకు కుజ దోషం ఉంటే.. భర్త చనిపోతాడనే నమ్మకం భారతదేశంలో ఉంది. దీనికి పరిహారంగా అమ్మాయికి చెట్టుతో పెళ్లి చేసి.. ఆ తరువాతే వరుడితో ముడిపెట్టడం ఆచారం. ఈ ప్రకారమే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకునే ముందు ఆమె మొదట ఒక చెట్టును వివాహం చేసుకుంది. ఒకవేళ వధువు ‘మంగ్లిక్’ అయితే శపించబడుతుందని నమ్ముతారు. కాగా.. వరుడి పాదరక్షల్ని దొంగిలించే (షూ గేమ్) విధానం భారతీయ వివాహ వేడుకల్లో ఒక సరదా. వధువు తరఫున యువతులు వరుడి పాదరక్షల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వరుడి సహచరులు వాటిని కాపాడతారు. ఒకవేళ వధువు సోదరీమణులు పాదరక్షల్ని దొంగిలించడంలో విజయం సాధిస్తే.. వాటిని తిరిగి పొందడానికి వరుడు డబ్బులివ్వాలి. భారతీయ వివాహాల్లో హెన్నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వధువు చేతికి ఎర్రగా పండే హెన్నా ఆమె భర్త ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. భారతీయ పెళ్లి తంతులో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు ఉంచుకోవడం.. వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వధువును విడిపించాలి రొమేనియాలో కొన్ని వివాహాల్లో వధువును స్నేహితులు, కుటుంబ సభ్యులు దాచడానికి ప్లాన్ చేస్తారు. భర్తను బెదిరించడానికి.. వధువును విడిపించడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. వరుడు ఆ మొత్తం చెల్లిస్తాడు. ‘టై’ ముక్కల వేలం స్పానిష్ వివాహ రిసెప్షన్ పార్టీలో వరుడి టైని ముక్కలుగా కోయడం కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. ఆ ముక్కలను వేలం వేస్తారు. వాటిని పాడుకున్న వ్యక్తి ఆ క్షణం నుంచి అదృష్టవంతుడవుతాడని భావిస్తారు. ముద్దాడాలి మరి స్వీడన్లో కొన్ని పెళ్లిళ్లలో వధువు గది నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుడిని ముద్దాడటానికి ఒంటరి మహిళలు క్యూలో ఉంటారు. వరుడు గదిని వధువు విడిచిపెట్టినప్పుడు యువకులు ముద్దాడుతారు. తెల్లటి డ్రెస్తో.. జపాన్లో అయితే.. పెళ్లి రోజున పైనుంచి కింది వరకు వధువు తెల్లటి డ్రెస్ ధరిస్తుంది. మహిళలు తెల్లని కిమోనోస్ ధరించి.. మేకప్ వేసుకుని.. వైట్ హుడ్ ధరిస్తారు. బరువు పెరిగితేనే.. పెళ్లికి ముందు అమ్మాయిలు స్లిమ్గా, ట్రిమ్గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం సాధారణం. కానీ.. మారిషస్లో మాత్రం కొందరు బరువు తగ్గడానికి బదులుగా.. లావు పెరగాలి. వధువు ఎంత లావుగా కనిపిస్తే అంత ధనవంతులుగా కనిపిస్తారని నమ్ముతారు. అలాంటి వారినే వరుడు వరిస్తాడు. ఫ్రెంచ్ పద్ధతి ఇలా.. ఫ్రెంచ్ దేశస్తుల్లో కొందరు వివాహ విందులో టాయిలెట్ బౌల్ నమూనా ఏర్పాటు చేస్తారు. బంధుమిత్రులు తాము తినగా మిగిలిన ఆహారాన్ని అందులో పడేస్తే.. వధూవరులు ఆ ఆహారాన్నే ఆల్కహాల్ కలుపుకుని విందు భోజనంగా తినాలి. గుండుగీసి.. కెన్యా దేశస్తుల్లో కాబోయే భార్యను వరుడు ఎంచుకోవడానికి కొందరి కుటుంబ సభ్యులు అంగీకరించరు. అతని కుటుంబమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. పెళ్లి రోజున వధువు జుట్టు పూర్తిగా తీసేసి గుండుగీసి, తలపై గొర్రె కొవ్వుతో రుద్దుతారు. స్కాట్లాండ్లో ఇదీ పద్ధతి కొత్తగా వివాహం చేసుకున్న స్కాటిష్ వధువులను బంధువులు కట్టేసే సంప్రదాయం కొందరు పాటిస్తారు. సాస్, చేపలు, గుడ్లు, పిండి మొదలైన వాటిని వారికి పూసి స్నానం చేయిస్తారు. శుభ్రం చేయాలి మరి.. జర్మనీలో అయితే.. కొన్ని పెళ్లిళ్లలో స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికి హాజరైన వారు నేలపై పింగాణీ పాత్రల్లో ఉన్న వంటకాలను నాశనం చేసి ప్లేట్లు పగులగొడతారు. వధూవరులిద్దరూ కలిసి దానిని శుభ్రం చేయాలి. నెలపాటు ఏడవాలి మరి వధువును బాణంతో కొట్టడం చైనా వివాహ సంప్రదాయంలో ఒకటి. పెళ్లి కూతుర్ని కొట్టడానికి పెళ్లికొడుకు మూడుసార్లు బాణాలను ప్రయోగిస్తాడు. పెళ్లిలో కాకున్నా వరుడు జీవితకాలంలో ఒకసారి వధువును ఇలా కొట్టవచ్చు. మరో ఆచారం ఇక్కడ ఉంది. పెళ్లి కుదిరిన తరువాత వధువు ఒక నెల పాటు క్రమం తప్పకుండా రోజూ ఓ గంటపాటు ఏడవాలి. మూడు వారాల ముందు ఆమె తల్లి, వారం గ్యాప్లో సోదరి, అమ్మమ్మ ఏడుపు మొదలు పెడతారు. -
7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది. -
మంచి మాట: నాణ్యతతో మాన్యత
నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి. నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి. నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది. గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది. ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది. ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి. కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి. నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి. నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం. – రోచిష్మాన్ -
అక్షరాల ఉత్సవం
మనుషులతో కూడిక మనిషికి ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇల్లు విడిచి బయటకు కదిలే సందర్భాలు తిరిగి ఉత్సాహంగా ఇల్లు చేరడానికి, చేయవలసిన పనిలో పునర్లగ్నం కావడానికి దోహదం చేస్తాయి. కదలకుండా ఉండిపోయే మనిషిని కదల్చడానికి, తోటి మనిషిని కలవడానికి, లోకం తెలుసుకోవడానికి పెద్దలు పూర్వం ఆధ్యాత్మికత పేరుతోనైనా కూడికలు ఏర్పాటుచేశారు. జాతరలు, తిరునాళ్లు, తీర్థయాత్రలు, పుష్కరాలు, కుంభమేళాలు... ఇవన్నీ మనిషిని కదిల్చి తనలాంటి మనుషులను కలిసేలా చేస్తాయి. భారతీయులు ఈ నిష్ఠను పాటించడంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. తెలుగువారు అందుకు సరిసమానం కాకుండా ఎలా ఉంటారు? మన జాతరలు కిటకిటలాడతాయి. మన పుణ్యక్షేత్రాలు కళకళలాడతాయి. అయితే సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించి ఈ నిష్ఠ మనలో ఏ మేరకు ఉన్నదన్నది ప్రశ్న. సాహిత్యం కోసం కదలడం, సంస్కృతికై కూడటం. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని గొప్ప గొప్ప తెలుగు కూచిపూడి కళాకారులందరూ విజయవాడ కూచిపూడి ఉత్సవంలో పాల్గొంటారు. ఆ ఉత్సవం చూడటానికి దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని తెలుగు మేటి జానపద కళాకారులందరూ ఆదిలాబాద్లో జమ అవుతారు. వేదికలు అదరగొడతారు. చూడటానికి దేశం కదిలి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి తెలుగు నాటకరంగ దిగ్గజాలందరూ నాటకాలతో తెనాలికి పొలోమంటారు. వారం రోజుల పాటు గొప్ప గొప్ప నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ నాటక ఉత్సవం కోసం ప్రేక్షకులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. తిరుపతిలో వీనుల విందుగా శాస్త్రీయ సంగీత ఉత్సవాలు జరుగుతాయి. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య మార్మోగుతారు. సీట్లు దొరక్క ప్రేక్షకులు అవస్థ పడతారు. వరంగల్లో అద్భుతమైన చిత్రకళా ఉత్సవం జరుగుతుంది. తెలుగు చిత్రకారులందరూ తరలివస్తారు. రంగులు, బ్రష్షులు పట్టుకుని చిన్నారులు చూడ పరిగెడతారు. ప్రతి ఏటా హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోని ఉత్తమ సినిమా నిపుణులకు ఆహ్వానం పలుకుతుంది. స్పీల్బర్గ్, కామెరూన్ వంటి వారు సినిమాల గురించి మాట్లాడతారు. కొత్త తరానికి ఉత్సాహాన్ని ఇస్తారు. ఇలా జరుగుతున్నదా? ఇలా ఎందుకు జరగడం లేదు? స్వర్ణకాలం అంటే కొత్త అపార్ట్మెంట్లో చదరపు అడుగు ఆరున్నర వేలు పలకడం కాదు. కొత్త కార్లు రోడ్ల మీద కిటకిటలాడటం కాదు. ప్రజలు తమ సాంస్కృతిక అభిరుచిని సజీవంగా ఉంచుకునే కాలం. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, నటీనటులు, వాద్యకారులు, చిత్రకారులు, హస్తకళా మాంత్రికులు తమ సృజనను ఉన్నతీకరించుకుంటూ సమాజంతో అనుసంధానం చేస్తూ పరస్పర సంలీనతతో పురోగమించే కాలం స్వర్ణకాలం. కళలకు ఆదరణ లభించిన అట్టి కాలమే చరిత్రలో నమోదయ్యింది. అలాంటి కాలం కొరకు ఏం చేయాలి? 16 ఏళ్ల క్రితం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రారంభించినప్పుడు వేదికకు ఒక మూల నిలుచుని యాభై మందైనా వస్తారా అని బితుకుబితుకుమన్నా. ఇవాళ చూడండి వేలాదిగా పోటెత్తుతున్నారు అని ఆ ఫెస్టివల్ నిర్వాహకుడు సంజొయ్ కె.రాయ్ అన్నాడు. అతడు ప్రయత్నం మొదలెట్టాడు. తర్వాత ప్రజలు తోడు నిలిచారు. కనుకనే జైపూర్లో ఏటా జనవరిలో జరిగే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్కు వందల మంది రచయితలు, వేలాదిగా పాఠకులు తరలి వస్తారు. ఆ సంవత్సరంలో ఇంగ్లిష్లో కొత్త పుస్తకాలు రాసిన, అనువాదమైన రచయితలు మాట్లాడతారు. అంతర్జాతీయ అవార్డు రచయితలు అందరిలో ఒకరై కనిపిస్తారు. ఆలోచనల మార్పిడి జరుగుతుంది. రచయితలు ఇదంతా మన సమూహం అని ఊపిరి నింపుకొంటారు. విద్యార్థులు హాజరై ప్రశ్నలు సంధిస్తారు. సృజన ఒక తరం నుంచి మరో తరాన్ని తాకుతుంది. సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే సంస్కృతినీ, భాషనూ సెలబ్రేట్ చేసుకోవడం. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ స్ఫూర్తితో ఇవాళ దేశంలో ఎన్నో లిటరేచర్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. పర్వత ప్రాంతాల వారు డెహరాడూన్లో, పంజాబ్ వారు కసౌలీలో, కేరళ వారు కోళిక్కోడ్లో, బెంగాలీలు కోల్కతాలో, కన్నడిగులు బెంగళూరులో, తమిళులు చెన్నైలో.. ప్రతి ఏటా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుపుకొంటున్నారు. ఇతర ప్రాంతాల రచయితలను ఆహ్వానిస్తున్నారు. ప్రజలు వీటికి హాజరై సృజనకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తమ జాతి మక్కువను నిరూపించుకుంటున్నారు. మరి తెలుగులో? ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్లో మొక్కుబడిగా సాగే ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ తప్ప ఘనమైన తెలుగు లిటరేచర్ ఫెస్టివల్స్ మనకు లేవు. కన్నడ రచయితలు ఎక్కడ ఉన్నా ఏటా జాతీయ కన్నడ రచయితల ఉత్సవం పేరుతో ఏదో ఒక ఊరిలో కలుస్తారు. తెలుగు రచయితలు పక్క జిల్లా రచయితలతో కలిసే సందర్భాలు ఏర్పడవు. సాంస్కృతిక మందకొడితనం ఎందుకు మనలో మెండుగా ఉంటుందో తెలియదు. తెలుగు మహాసభలు జరగవు. భాషా ఉత్సవాలు జరగవు. మహా రచయితల శత జయంతులకు కూడా చీమ చిటుక్కుమనదు. పరిషత్ పోటీలు కొనఊపిరితో ఉంటాయి. మరో భాషలో రాసే రచయితను జీవిత కాలంలో ఒక్కసారైనా కలవకుండానే మన రచయితలు బావి బతుకులకు పరిమితమైపోతారు. ఇలా ఉంటే తెలుగు సాహిత్యస్థాయి మెరుగయ్యి ఎల్లలు దాటడం కల్ల. పెళ్లిళ్లు ఘనంగా చేయడమూ, భారీ కల్యాణ మంటపాలు కట్టడమూ జరుగుతున్న ఈ కాలంలో పన్నెండు కోట్ల మంది తెలుగువారు తమ తెలుగు సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవం జరుపుకోలేకపోవడమే అమోఘమైన దారుణం. అత్యద్భుత విషాదం. -
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్ఫిష్’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నేచురల్ సూపర్ ఫుడ్స్ భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్ సూపర్ ఫుడ్స్ అని వరల్డ్ఫిష్ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్ఫిష్’ చెబుతోంది. విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 70 లక్షల సీడ్ ఉత్పత్తి అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్లో వరల్డ్ఫిష్ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో గల బిశ్వాల్ ఆక్వాటెక్ హేచరీతో కలిసి వరల్డ్ఫిష్ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మెత్తళ్ల సీడ్ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్లో అధిగమించటం విశేషం. 70 లక్షల మెత్తళ్లు సీడ్ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్తో కూడిన నీటిని ఎయిరేషన్ టవర్ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! ‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. ► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. ► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్ టబ్లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. ► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి. ► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్ బ్రీడర్) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. ► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. ► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు. ► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్.ఇ.) ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ) -
గురువాణి: సంస్కార వైభవం
రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు. రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు. వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు. బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు. కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కే మేనియా.. కొరియన్ కల్చర్కు ఫిదా అంటున్న భారతీయులు
హైదరాబాద్లోని ఓ మెట్రో రైల్వే స్టేషన్.. ‘అన్యొహసేవ్.. అజొస్సి..?’ అని పిలిచింది ఒక 23 ఏళ్ల అమ్మాయి తన దారికి అడ్డంగా ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడిని. ‘ఎస్..’ అంటూ అతను పక్కకు తప్పుకున్నాడు. ‘కమ్సహమీదా’ అని చెబుతూ గబగబా ముందుకు సాగిపోయింది ఆ అమ్మాయి. తీరా ఆమె ప్లాట్ఫామ్ చేరుకునే సరికి అప్పుడే ట్రైన్ డోర్స్ మూసుకున్నాయి. ‘ఒమో..’ అంటూ నిట్టూర్చుంది. అంతలోనే ఫోన్.. ‘చింగు’ అనే పేరున్న నంబర్ నుంచి. ‘అన్యొహసేవ్’ అంది ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. అవతలి నుంచీ ‘అన్యొహసేవ్’ అని బదులిచ్చి ‘ట్రైన్ క్యాచ్ చేశావా?’ అని అడిగింది ఆ స్వరం. ‘లేదు.. జస్ట్ మిస్డ్’అంది ఇవతలి అమ్మాయి. ‘చించా?’ అంది అవతలి స్వరం నమ్మలేనట్టుగా. ‘ఎస్.. కానీ ఇంకో ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేస్తాలే..’అని చెప్పింది ఈ అమ్మాయి నమ్మకంగా. ‘ఓకే.. తర్వగా రా.. బెగొపాయో’ అంది అవతలి స్వరం. ‘నేనూ బెగొపాయో’ అంది ఈ అమ్మాయి. ఇంతలోకే ఇంచుమించు ఆ అమ్మయి వయసు అబ్బాయి ఆమె పక్కనుంచి ‘వావ్.. యెప్పుదా..!’ అనుకుంటూ వెళ్లాడు. అసలే ట్రైన్ మిస్ అయిన చిరాకుతో ఉన్న ఆ అమ్మాయి.. ఆ మాటకు ‘షిరొ.. మీచెస్సో’ అంటూ రిటార్ట్ ఇచ్చింది. గూఢచారుల కోడ్ భాష అనుకుంటున్నారా ఏమీ.. ఆ సంభాషణ విని?! కాదండీ.. అది కొరియన్ భాషండీ.. కొరియన్ భాష! ‘అన్యొహసేవ్.. అజొస్సి’ అంటే ‘హలో మిస్టర్’ అని, ‘కమ్సహమీదా’ అంటే ‘థాంక్యూ’ అని, ‘ఒమో’ అంటే ‘ ‘నో’ అని, ‘చింగు’ అంటే ఫ్రెండ్, ‘చించా’ అంటే ‘రియల్లీ’, ‘బెగొపాయో’ అంటే ‘అకలేస్తోంది’, ‘యెప్పుదా’ అంటే ‘ప్రెటీ’, ‘షిరొ’ అంటే ‘నాకు నచ్చలేదు’ అని, ‘మీచెస్సో’ అంటే ‘క్రేజీ’ అని అర్థం.. కొరియన్ భాషలో! ‘ఓహ్.. చించా! అయితే.. ఇక్కడ కొరియన్ భాషను నేర్పే కాలమ్ ఏదైనా మొదలుపెడుతున్నారా అనే సందేహం వలదు. దిస్ పేజ్ ఈజ్ వెరీమచ్ డెడికేటెడ్ టు కవర్ స్టోరీ ఓన్లీ. కొరియన్ మేనియా మీదే ఈ స్టోరీ! టీన్స్ నుంచి ‘టీ (ఫిఫ్టీ..సిక్సీ›్ట, సెవెంటీ.. ఎట్సెట్రా)’ల దాకా అన్ని వయసుల వాళ్లు కొరియన్ డ్రామా, కొరియన్ పాప్కి పరమవీర ఫ్యాన్స్! ఈ అఫైర్ కొరియన్ పాప్తో పదేళ్ల కిందటే మొదలైనా కొరియన్ డ్రామాతో స్టార్ట్ అయింది మాత్రం కరోనా లాక్డౌన్లోనే. ఇంట్లోనే గడిపిన ఆ సమయాన్ని చాలామంది ఓటీటీతో కాలక్షేపం చేశారు. నెట్ఫ్లిక్స్లోని ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’, ‘బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్’, ‘రిప్లై1988’, ‘కింగ్డమ్’, ‘స్కైకెసిల్’ వంటి కొరియన్ సిరీస్తో మన వీక్షకుల ప్రేమకథ మొదలైంది. క్వారంటైన్ను మనం ఓటీటీలో కొరియన్ సిరీస్, యూట్యూబ్లో కొరియన్ పాప్తో ఎంటర్టైన్ అయ్యామని పలు అధ్యయనాల సారాంశం. అదిగో అప్పుడే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్ క్రేజ్ను పెంచి ఓ వేవ్లా మార్చింది. దీన్నే అంటే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్తో కలసి కొరియన్ కల్చర్ పట్ల మోజు పెంచుకోవడాన్ని .. అదో వేవ్లా కొనసాగడాన్ని ‘హాల్యు’ అంటున్నారు. ఎందుకంత క్రేజ్? హై ప్రొడక్షన్ వాల్యూస్, అంతే అద్భుతమైన ప్రెజెంటేషన్తో మనమూ ఐడెంటిఫై అయ్యేలా కుటుంబ కథాంశాలతో కొరియన్ డ్రామాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అందులో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకే వాటి వ్యూయర్షిప్ అంత హైలో ఉంటోంది. భాష, సెట్టింగ్స్, పాత్రలు కొరియన్ నేపథ్యం. కథనం మాత్రం అంతర్జాతీయ వీక్షకులను అలరించేదిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మన వాళ్లకు దగ్గరగా.. ఇంకా చెప్పాలంటే మనం అన్వయించుకునేలా ఉంటాయి ఆ సిరీస్లు. అందుకే కదా.. ఆస్కార్ విన్నర్ ‘పారసైట్’ని చూసి ప్రపంచమంతా ‘వహ్వా’ అంటుంటే మనకు వెరీమచ్ తెలుగు సినిమాలా అనిపించింది! ‘కొత్త మనుషులు, కొత్త వాతావరణం.. కొత్త కథలుగా అస్సలు అనిపించవు’ అని చెబుతుంటారు కొరియన్ డ్రామాను అమితంగా ఇష్టపడే తెలుగు వీక్షకులు. అప్పటిదాకా గూఢచర్య, మిలిటరీ ఆపరేషన్ నేపథ్యపు అమెరికన్ డ్రామాలు, నేరస్థులను పట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సాగే స్కాండినేవియన్ డిటెక్టివ్ సిరీస్లు చూసీ చూసీ పాతబడున్న ప్రేక్షకులు, వీక్షకులకు కొరియన్ డ్రామా ఓ మత్తులా పట్టుకుంది.. కొత్త సీసాలో పాత మందులాగా! ముక్కోణపు ప్రేమ, శృంగారం, అమ్మ సెంటిమెంట్, కిడ్నాప్లు, గతం మర్చిపోవడాలు, కుటుంబ పరువు–ప్రతిష్ఠలను కాపాడుకోవడం, పాటలు, పగ– ప్రతీకారం, పురిట్లోనే కవలలిద్దరూ విడిపోవడం, దేశభక్తి .. ముఖ్యంగా మెలోడ్రామా.. ఇలా ఇండియన్ సినిమాల్లో కనిపించే నవరస, మసాలా దినుసులన్నీ కొరియన్ డ్రామాలో పుష్కలం. అందుకే మనవాళ్లు అంతలా కనెక్ట్ అవుతున్నారు. ‘మన సినిమాలనే ఫారిన్ లొకేషన్స్లో.. ఫారిన్ యాక్టర్స్తో చూసినట్టుంటాయి.. భలే ఎంటర్టైన్ అవుతాం’ అంటున్నారు కొరియన్ డ్రామా వీరాభిమానులు కొందరు. ‘ఆ డ్రామాల్లో ఉండే ఎమోషనల్ స్టిక్నెసే వాటి పట్ల క్రేజ్ పెరగడానికి కారణం’ అంటారు ‘క్రాస్ పిక్చర్స్’ అనే కొరియన్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న చిత్ర సుబ్రహ్మణ్యం. ‘సౌత్ కొరియన్ సంస్కృతీసంప్రదాయాల్లో ఒక తరహా అప్పీల్ ఉంటుంది. అవి మనకు ఇదివరకే పరిచయమున్నట్టు తోస్తాయి. అందుకే వాటి మేళవింపుగా ఉన్న కొరియన్ డ్రామాలు మన దగ్గర అంత హిట్ అవుతున్నాయి’ అంటారు దక్షిణ కొరియాలోని భారతీయ రాయబారి శ్రీప్రియ రంగనాథన్. చవకకే.. భారతీయులు ఇలా ఏకబిగిన కొరియన్ డ్రామాలను చూడడం వల్ల నెట్ఫ్లిక్స్ వ్యూయర్షిప్ 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 370 శాతం పెరిగిందని తేలింది.. యూరోమానిటర్ సర్వేలో! దీంతో మన దగ్గర కొరియన్ డ్రామాలకున్న క్రేజ్, డిమాండ్ మిగిలిన ఓటీటీ చానెల్స్కూ అర్థౖమైపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి జీ గ్రూప్ శాటిలైట్ ప్రొవైడర్ డిష్ టీవీ హిందీలోకి డబ్ అయిన కొరియన్ డ్రామాలను అతి చవక (రూ. 1.3.. అంటే ఒక సెంట్ కన్నా తక్కువ) ప్యాకేజీకే స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. ఎమ్ఎక్స్ ప్లేయర్ (ఓటీటీ ప్లాట్ఫామ్) అయితే ఇంకో అడుగు ముందుకేసి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించిన కొరియన్ డ్రామాలను స్ట్రీమ్ చేస్తోంది. ఈ ప్రయత్నం ఇక్కడి ఔత్సాహిక కంటెంట్ రైటర్స్కూ అవకాశాలను పెంచి మంచి ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. బిజినెస్ బూమ్ ఇదిగో ఇలా కొరియన్ డ్రామా రేకెత్తించిన కుతూహలం, జిజ్ఞాస మన మార్కెట్లో కొరియన్ కంపెనీలకు కాసుల పంట కురిపిస్తోంది. ‘అందేంటీ.. కొరియన్ ఉత్పత్తులు మనకేం కొత్త కాదే. సామ్సంగ్, ఎల్జీ, కియా మోటార్స్, లాటీ, హ్యూండైలాంటి 20కి పైగా కొరియన్ కంపెనీలే కదా మన మార్కెట్ను ఏలుతున్నది! అవన్నీ దాదాపుగా 17.45 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని మన ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది! పైగా 2010లో మనకు, దక్షిణ కొరియాకు మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. దానిప్రకారం ఎలాంటి పన్ను లేకుండానే మనం దక్షిణ కొరియా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాం’ అంటారా?! నిజమే.. అదేం కొత్త విషయం కాదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్తో మన దగ్గర వ్యాపారం పెంచుకున్న .. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన కొరియన్ కంపెనీలే ఇక్కడ విషయం.. విశేషమూనూ. కే మోజు కొరియన్ తిండి, సోజూ( ్జౌu.. ఆల్కహాల్), బట్టలు, నగలు, బ్యూటీ ప్రొడక్ట్, కొరియన్ టూరిజం ఆఖరుకు కొరియన్ భాష, కొరియన్ కల్చర్ వరకూ సాగి.. కొరియన్ బ్రాండ్స్ డిమాండ్ను పెంచుతున్నాయి. నూడుల్స్ అమ్మే దక్షిణ కొరియా కంపెనీ నాన్షిన్ బ్రాండ్.. 2020లో మిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది. మీకో విషయం తెలుసా.. 2020 కన్నా 2021లో మనం 178 శాతం అధికంగా కొరియన్ ఇన్స్టంట్ నూడుల్స్ను వినియోగిం చామని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ‘ఐల్ ఆఫ్ స్కిన్’ అనే కొరియన్ బ్యూటీ బ్రాండ్ను లాంచ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి కే మేనియాను. ఇలా ఇన్నిస్ఫ్రీ, లనేజ్ ( ్చn్ఛజీజ్ఛ), ఎట్యూడ్ (్ఛ్టuఛ్ఛీ), స్లవషూ (టu ఠీజ్చిటౌౌ) వంటి దక్షిణ కొరియా బ్రాండ్స్కి, ది ఫేస్ షాప్ లాంటి ఆన్లైన్ స్టోర్స్కి భలే గిరాకీ మొదలైంది. ఇక్కడి కే క్రేజ్ వల్ల అమెజాన్లో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ ఇదివరకంటే మూడున్నర రెట్లు పెరిగాయని తెలిపింది అమెజాన్ సంస్థ ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఆ మేరకు మన మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోనూ వాటి ఔట్లెట్స్ వచ్చేశాయి. హైదరాబాద్లోనూ ఉన్నాయి. భాష మీదా.. పరాయి భాష మరీ ముఖ్యంగా ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలను నేర్చుకుంటున్నారు అంటే ఆయా దేశాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తమే అని చెప్పకనే అర్థమైపోతుంది. ఏ భాషనైనా దాని మీద అభిమానంతో నేర్చుకోవడమనేది అరుదే. కొరియన్ ఆ కోవలోకే వస్తుంది. కే డ్రామా మీద వీక్షకులకున్న అభిమానం ఆ భాష నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. వారి సంఖ్యను పెంచుతోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలన్నిట్లో కొరియన్ భాషను నేర్పే ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి.సెంట్రల్ సిలబస్ను బోధిస్తున్న అన్ని స్కూళ్లల్లో.. ఎనిమిదవ ఫారిన్ లాంగ్వేజ్గా కొరియన్ను బోధించాలని కేంద్రప్రభుత్వం 2020లో కొత్త విధానాన్నీ తీసుకువచ్చింది. ‘తమ కొరియన్ అభిమాన నటీనటులు, గాయనీగాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతున్నారు అని ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో కాకుండా నేరుగానే తెలుసుకోవాలనుకుంటున్నారు వీక్షకులు. ఇంకా చెప్పాలంటే కొరియన్ భాష మీద ఆపేక్షను పెంచుకుంటున్నారు. తద్వారా ఆ దేశంతో ప్రత్యక్షానుబం«ధాన్ని కోరుకుంటున్నారు’ అని చెబుతారు తమిళనాడులోని ఇండో– కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు హెడ్గా పనిచేస్తున్న రతి జాఫర్. ఫ్యాన్ క్లబ్స్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్సేకే కాదు కే డ్రామా, కే పాప్కీ మన దగ్గర ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకుంటే చాలు. ఆ క్లబ్లు ఎక్కడో డెహ్రాడూన్, అహ్మదాబాద్, పట్నా, ముంబై, పుణే, నాగపూర్లలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో కూడా వెలిశాయి. ఇవి తమ అభిమాన కొరియన్ నటీనటులు, కొరియన్ పాప్ సింగర్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ముంబైలోని కే పాప్ ఫ్యాన్ క్లబ్ .. 2021, మార్చి 24న బీటీఎస్ బ్యాండ్లోని ఓ మెంబర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది. నిధులను సమీకరించి.. ముంబై శివారు ప్రాంతమైన ములుండ్లోని ఓ బస్ షెల్టర్ను వారం పాటు అద్దెకు తీసుకుని దాన్నిండా జియాన్ జంగ్కూక్ పోస్టర్లను అతికించి వీరాభిమానాన్ని చాటుకుంది. ఇదంతా గమనించిన కొరియన్ కల్చరల్ సెంటర్ (ఢిల్లీ).. క్రమం తప్పకుండా కే పాప్, డాన్స్ పోటీలను నిర్వహించేలా ఈ ఫ్యాన్ క్లబ్స్కు సహకారమందిస్తోంది. ఈ పోటీల్లో ఎవరైతే తమ అభిమాన గాయనీగాయకుల గాత్రాన్ని, డాన్స్ను, వస్త్రధారణను అనుకరిస్తారో వారికే ట్రోఫీలను అందించడం విశేషం. 2021లోనే చెన్నైలోని కొరియన్ కాన్సులేట్ అక్కడ అమ్మాయిలకు కే పాప్ డాన్స్ పోటీలను నిర్వహించి అయిదుగురు విజేతలను ఎంపిక చేసుకుని వాళ్లతో ‘డ్రీమ్ కే పాప్’ అనే బాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బాండ్ కే డాన్స్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. అలాగే పాపులర్ కే పాప్ సాంగ్స్ను తమ యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తూంటుంది. ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా కొరియన్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం, ఫారిన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలు యోచిస్తున్నాయట. ఇలా కే డ్రామా.. కే పాప్ వినోదాన్ని పంచుతూ మన వీక్షకుల, ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. ఆ అభిమానాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మలచుకుంటోంది. ‘కే డ్రామా.. కే పాప్ మీద ఇండియన్స్ ప్రేమ ఇలాగే పెరిగి.. పెరిగి అది కే ఫుడ్, బ్యూటీ ఇంకా ఇతర కొరియన్ ప్రొడక్ట్స్కి ఇండియన్ మార్కెట్లో డిమాండ్ను పదింతలు చేయాలని కోరుకుంటున్నాం’ అంటాడు కొరియాలోని యూరోమానిటర్ కన్సల్టెంట్ సన్నీ మూన్. అదన్న మాట కే మేనియా ఫలితం!! పట్టించుకోకపోయినా.. చిత్రమేంటంటే అటు కొరియన్ డ్రామాలు కానీ.. ఇటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ 60 ఏళ్ల పైబడిన వాళ్లను పట్టించుకోవడం లేదు. ఆ డ్రామాల్లోని కంటెంట్ సీనియర్ సిటిజన్స్ను భాగస్వాములుగా చేసుకోవడం లేదు. ఇటు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీళ్ల కోసం కంటెంట్ను జనరేట్ చేయడంలేదు. అయినా.. ఆ పెద్దవాళ్లు సారీ.. ఆ సెకండ్ యూత్ .. ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను కన్నార్పకుండా చూస్తున్నారు. టైమ్ తెలియకుండా అందులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు. అంతేకాదు కొరియన్ భాషా పదాలను నేర్చుకుని.. ఉపయోగిస్తున్నారు. ‘అన్యొహసేవ్ (హలో)’ అంటూ ఫోన్లలో, మెసేజెస్లో సంభాషణలు కావిస్తున్నారు. ముంబైకి చెందిన 67 ఏళ్ల సీఎస్ మణి ఇప్పటి వరకు 70కి పైగా కొరియన్ డ్రామాలను వీక్షించాడు. వాటి ద్వారా దాదాపు 60 కొరియన్ నుడికారాలను నేర్చుకున్నాడు. ఆ డ్రామాలు కలిగించిన ఆసక్తితో సియోల్ గురించి తెలుసుకున్నాడు. ‘సియోల్లో లక్షా డెబ్బయి ఐదువేల సీసీ కెమెరాలు ఉంటాయి తెలుసా! అక్కడ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్. ప్రతి కారులో కెమెరా ఉండాల్సిందే. కొరియన్స్ భోజనప్రియులు. ఆల్కహాల్ ఫ్రీక్స్ కూడా’ అంటూ ఉత్సహంగా చెబుతుంటాడు. హాల్యూ.. ఓటీటీ ద్వారా మనకు ఇన్ఫెక్ట్ అయ్యేకంటే ముందే భారతీయ చిత్రసీమను ఎఫెక్ట్ చేసింది. హాలీవుడ్ ఎట్సెట్రా రంగాల్లోని చిత్రాలు మన మీద ప్రభావం చూపినట్టే.. కొరియన్ చిత్రసీమా మన మీద ప్రభావం చూపింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్.. టాలీవుడ్ దాకా చాలా వుడ్లలో కొరియన్ స్ఫూర్తి చిత్రాలు మన వెండి తెర మీద వెలుగు చూశాయి. తెలుగులో ‘అబ్బ.. భలే సినిమా’ అనిపించుకున్న ‘ఓ బేబీ’.. కొరియన్ ‘మిస్ గ్రానీ’కి రీ మేడ్. ఇలా తమిళంలోనూ కొన్ని కొరియన్ సినిమాలు రీమేడ్ అయ్యాయి. బాలీవుడ్లోనైతే ఆ జాబితా పదుల సంఖ్యలో ఉంది. నిన్నటి ‘ధమాకా’ .. ‘ది టెర్రర్ లైవ్’, ‘రాధే’.. ‘ది అవుట్ లాస్’, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘తీన్’.. ‘మాంటేజ్’, ప్రియాంక చోప్రా, రణ్బీర్ కపూర్, ఇలియానా సూపర్ హిట్ ‘బర్ఫీ’.. ‘లవర్స్ కన్సర్టో’, రితేశ్ దేశ్ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హిట్ ‘ఏక్ విలన్’.. ‘ఐ సా ది డెవిల్’కి రీమేడ్లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే! ఈ ప్రేరణ కథను చూసి సాక్షాత్తు కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోని పెద్దలే వచ్చి మన దగ్గర చిత్రనిర్మాణం చేపడుతు న్నారు. అతియోశక్తి కాదు.. నిజం! బెంగళూరులో నివాసముంటున్న మూన్ అనే అమ్మాయి (18) మంచి డాన్సర్. తన ఇంట్లోనే కే పాప్ సాంగ్స్ మీద డాన్స్ను షూట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూంటుంది. ఈ పోస్ట్లకు 86,700 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ను గమనించిన ఫ్లిప్కార్ట్ ఆమెను తమ మార్కెటింగ్ ప్రొడక్ట్స్కి మోడల్గా పెట్టుకుంది. -
Pearl Culture: ముత్యాల సాగు.. ఏడాదికి 14 లక్షల నికరాదాయం
నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు. సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు. ముత్యం ధర రూ. 400 చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!) -
రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. వేడుక ఏదైనా..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్ కాల్తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్ చేస్తోంది. అదరహో అనిపించేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లే సమకూరుస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక ఫంక్షన్కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్ మేనేజ్మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి. రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్ చేసే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్ గాళ్స్ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్ సంస్కృతి హైదరాబాద్లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్ గాళ్స్కు రూ.50–70 వేల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్యాకేజీలు.. ►పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్ సింబల్గా భావిస్తున్న వారూ ఉన్నారు. ►దీంతో ఈవెంట్ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. ►డెకరేషన్కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. ►విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. ►మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్ కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్ నిర్వాహకుడు అనిల్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కావాల్సిన విధంగా.. నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. –విజయసాయి, విజయవాడ ట్రెండ్ మారుతోంది.. వివాహ వేడుకల ట్రెండ్ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్ మ్యూజిక్లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్థింగ్ స్పెషల్గా, స్టేటస్ సింబల్గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్ గాళ్స్ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. – విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ -
మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి. అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము. కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. – భువనగిరి కిషన్ యోగి -
మధ్యలో నన్నెందుకు లాగడం?.. పుతిన్కి కౌంటర్
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, హ్యారీ పోటర్ ఫేమ్ జేకే రోలింగ్(56) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరమైన వివాదంలోకి తనను లాగినందుకు ఆమె పుతిన్ పై మండిపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. రోలింగ్కు అనుకూలంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్ ఇష్యూ) సమస్యలపై.. తన అభిప్రాయాలను తెలియజేసినందుకే రచయిత జెకె రౌలింగ్ స్వేచ్ఛను ఈయూ దేశాలు అడ్డుకున్నాయంటూ పుతిన్ ఈమధ్య ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. రష్యా సాహిత్యం, సంగీతంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ దేశాలు నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆ వర్చువల్ మీటింగ్లో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన జేకే రోలింగ్ పేరును ప్రస్తావించారు. అయితే అసందర్భంగా తనను ఈ వివాదంలోకి లాగినందుకు ఆమెకు మండిపోయింది. ‘‘పాశ్చాత్య రద్దు సంస్కృతిపై ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో.. అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నవాళ్లు, వాళ్లను ఎవరైతే విమర్శిస్తారో వాళ్లను జైలులో పెట్టేవాళ్లు, విమర్శకులకు విషం పెట్టేవాళ్లు.. విమర్శలకు అర్హులు కాదేమో’’ అంటూ పరోక్షంగా పుతిన్ను ఉద్దేశించి కామెంట్ చేశారామె. అంతేకాదు.. పుతిన్ను విమర్శించినందుకు జైల్లో ఉంచిన ఓ విశ్లేషకుడికి సంబంధించిన కథనాన్ని సైతం ఆమె ట్యాగ్ చేశారు. #IStandWithUkraine హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసిన ఆమె.. ఉక్రెయిన్కే తన మద్ధతు ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన ఫౌండేషన్ తరపున ఉక్రెయిన్లో అందుతున్న సాయంపైనా కొన్ని పోస్ట్లు చేశారు. Critiques of Western cancel culture are possibly not best made by those currently slaughtering civilians for the crime of resistance, or who jail and poison their critics. #IStandWithUkraine https://t.co/aNItgc5aiW — J.K. Rowling (@jk_rowling) March 25, 2022 పాశ్చాత్య దేశాలు చివరికి రష్యా సంస్కృతిపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాకు చెందిన ఎంతో మంది రచయితలను, వాళ్లు రాసిన పుస్తకాలనూ నిషేధించారు. ఇది నాజీ జర్మనీ చేష్టల్లాగే ఉన్నాయి. ఇంతకు ముందు పిల్లలు అభిమానించే రచయిత్రి జేకే రౌలింగ్ కూడా జెండర్ ఫ్రీడమ్ పేరుతో ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ వ్యాఖ్యానించాడు పుతిన్. కానీ, ఆమె మాత్రం పుతిన్కు మద్ధతు ఇవ్వకుండా ఇలా నెగెటివ్ పోస్ట్ చేసింది. -
ఆద్యకళలకూ ఓ ఆశ్రయం!
ఆది కళా రూపాలు ఆదిమ చరిత్రకు చిరు నామాలు. అవి మనం నడిచొచ్చిన దారులు. తరతరాల రాతలను, మాటలను, పాటలను, పది రకాల వస్తువులను పదిల పర్చుకోవాల్సిన చారిత్రక బాధ్యత మన పైన ఉన్నది. చాలా వరకు ఆద్య (ఆది) కళా రూపాలు అంతరించిపోతున్నాయి. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలి కదా! ఈటెలు, కొత్త–పాత రాతియుగాల పని ముట్లు గత కాలపు మానవుల జయాపజయా లను రికార్డు చేసినట్లే... అలనాటì రాతి పలకలు, రాత పనిముట్లు, ఇప్పటికీ కొనసాగుతున్న అరుదైన ఇంపుసొంపైన వాద్య పరికరాలు, మానవ జీవిత భిన్న కోణాలకు ప్రతిబింబాలు. ఈ నేలపై జీవించిన వీరుల పరాక్రమాలు, సామాన్యుల వీరోచిత గాథలకు ఈ ఆద్యకళలు అద్దం పడతాయి. అనేక ఉద్యమాలు విజయ వంతం కావడానికి ఈ ఆద్యకళలు వాహికలుగా నిలిచిన సంగతీ మరువరాదు. బొమ్మల పటం ద్వారానో... గోండు, కోయ, చెంచు, దాసరి, జంగం, బైండ్ల, బైరా గుల రాగి రేకులు, తాళపత్రాలపై రాతల ద్వారా మన ఉన్నతికి పునాదులైన పూర్వీకుల సంస్కృతి, టెక్నాలజీలు తెలుస్తాయి. నాటి బొమ్మల పటాలు, తాళ పత్ర గ్రంథాలు, అరు దైన సంగీత వాద్యాలూ వేలాదిగా ఉన్నాయి. వీటిని దాచడానికి, ముందు తరాలకు చూపడా నికి ఇంత చోటు చూపాలి. పద్మశ్రీ మొగి లయ్యతో అంతరించి పోతుందని భయపడు తున్న 12 మెట్ల కిన్నెర వంటి ఎన్నో వాద్య పరికరాలు ముందు తరాలకు అందాలంటే అచ్చంగా వీటికోసం మ్యూజియాలు నిర్మించ వలసిన అవసరం ఉంది. భూమి లోపల నిక్షిప్తం అయిన వాటిని వెలికి తీసి చరిత్రను కాపాడుకోవడం ఒక అంశం అయితే... మన కళ్ల ముందు సజీవంగా వివిధ రూపాల్లో... ఐసీయూలో ఉన్న అద్భుత కళా ఖండాలను అక్కున చేర్చుకోవడం అన్నింటి కంటే ముఖ్యమైన అంశం. సంగీత సాహిత్యా లను ఆస్వాదించే హృదయాలు ఉన్నట్టే... వాటి మూల రూపాలను ఒడిసి పట్టుకుని ముందు తరాలకు అందించే ముందుచూపున్న మనసులు అవసరం. ఈ కళాఖండాలు అటువంటి మనసున్న మారాజుల కోసం వేచి ఉన్నాయి. అసలు, సిసలైన మూలవాసుల, ఆది వాసుల, ఆది మానవుల ఉనికిని సగర్వంగా చాటి చెప్పే కళాకారులను, కళారూపాలను, సాహిత్య సారాలను పాలకులు పట్టించుకోవాలి. ఈ కళారూపాలను ఆదరించడం, అక్కున చేర్చుకోవడం అంటే అట్టడుగు వర్గాల, అశేష ప్రజారాశుల నిజ జీవిత గాథలను, చారిత్రక అనవాళ్లను గుర్తించినట్లే. వాటికి సామాజిక గౌరవాన్ని ఇచ్చినట్లే. ఇలాంటి సంగీత, సాహిత్య చారిత్రక ఆనవాళ్లను భద్రపర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చొరవ తీసుకోవాలి. భిన్న సాంస్కృతిక, సామాజిక, సామూహిక చైతన్య కేంద్రం హైదరాబాద్. ఇక్కడ పరిమిత కాలానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో ఓ మ్యూజియం ఉంది. కానీ అనంతానంత యుగాల మానవ జీవిత పరిణామ క్రమ ప్రతి బింబాలైన అశేషజన సమూహాల ఆట, పాట, మాట, కళాసంస్కృతుల చైతన్యమూటలైన బొమ్మలు, పటాలు, రాగిరేకుల, జంట డోళ్ల, కిన్నెర, కొమ్ముబూరల, డప్పుల వంటి వాటికి ఆలవాలమైన మ్యూజియం లేదు. అటువంటి సంగ్రహాలయ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు ఎలా ఉన్నా సినీ, మార్కెట్ శక్తులు మాత్రం ఆద్య కళారూపాలను అత్యంత చాకచక్యంగా వాడు కోవటం విశేషం. గోర్ల బుచ్చన్న వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 87909 99116 -
మగువల తెగువ.. జల్లికట్టు.. కొత్తరూటు
ఎర్ర తువ్వాలును గాల్లో గిర్రాగిర్రా తిప్పుతూ.. పొగరుతో బుసలు కొట్టే బసవన్నలను కనుసన్నలతో శాసిస్తూ.. క్రీడాకారులకు వాటిని చిక్కకుండా దౌడు తీయించే సాహస క్రీడా చాణక్యాన్ని ప్రదర్శించడంలో మగువలు సైతం తెగువ చూపుతున్నారు. వీరత్వం పురుష పుంగవులకే పరిమితం కాదని.. నారీమణుల ధీరత్వం సైతం మగధీరులకు ఏ మాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతున్నారు. సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో తమిళ తంబిలతో తలపడుతూ వారికే సవాల్ విసురుతున్నారు. మధురై పౌరుషానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. సాక్షి, చెన్నై: సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలు.. ఆలయాలు.. వారసత్వ సంపదల వంటి విభిన్న విశేషాల సమాహారంతో నిండిన రాష్ట్రం తమిళనాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై తిరగబడ్డ వీర నారీమణి వేలునాచ్చియార్, తన భర్తకు జరిగిన అన్యాయంపై తిరగబడి మధురైను తగులబెట్టిన కన్నగి లాంటి వారెందరో తమిళ మంగై (తమిళ నారీమణి)లుగా చరిత్రకెక్కారు. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వారే కాకుండా.. దేశ రాజకీయాలతోపాటు ప్రాధాన్యతా రంగాల్లోనూ సత్తా చాటుతున్న మంగైలు ఎందరో ఈ గడ్డపై పుట్టారు. తమిళనాట అత్యంత భయంకరమైన సాహస క్రీడగా పేరొందిన జల్లికట్టులోనూ ప్రవేశిస్తూ ఇక్కడి మహిళలు మధురై వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటుతామంటూ తెరపైకి వస్తున్నారు. బరిమే సవాల్ తమిళ గడ్డపై పూర్వం వరుడిని ఎంపిక చేసుకునేందుకు జల్లికట్టు క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో యువతుల్ని మెప్పించేందుకు యువకులు ఈ సాహసాన్ని ప్రదర్శించగా.. రానురాను ఇదో రాక్షస క్రీడగా మారింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ప్రారంభమయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలలపాటు జిల్లాల వారీగా తమిళనాడు వ్యాప్తంగా జరిగేది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు తమ వీరత్వాన్ని చాటుకునేందుకు జల్లికట్టు బరిలోకి దిగేవారు. ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు రానురాను ఎద్దులను హింసించడం పెరిగింది. పొగరెక్కిన ఎద్దుల దాడిలో ఎన్నో మరణాలు సైతం చోటుచేసుకున్నాయి. బసవన్నలు బుసలు కొట్టేవిధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడంతో జల్లికట్టుపై ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. సంప్రదాయ సాహస క్రీడను తిరిగి సాధించుకునేందుకు 2017లో యావత్ తమిళావణి మహోద్యమంతో కదం తొక్కింది. జల్లికట్టును మళ్లీ సాధించుకున్న తర్వాత తమిళ వీర మంగైలు సైతం సత్తా చాటుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎద్దులను మచ్చిక చేసుకుని శిక్షణ ఇవ్వడంతోపాటు వాటిని జల్లికట్టుకు సిద్ధం చేయడం మొదలెట్టారు. అయితే, వీరికి క్రీడా మైదానంలోకి కొన్నేళ్లుగా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా వాడివాసల్ (ప్రవేశ మార్గం) వెనుకకే పరిమితమయ్యారు. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళ మగువలు క్రీడా మైదానంలో అడుగు పెట్టి సత్తా చాటారు. అందుకే తిరస్కరించా.. నాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న తర్వాతే బహుమతి తీసుకోవాలన్నది నా లక్ష్యం. అందుకే తిరస్కరించాను. ప్రతిరోజు నా తమ్ముడు(ఎద్దు)తో రెండు గంటలపాటు పొలంలో సాధన చేయిస్తాను. వాడికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. ఈసారి తమ్ముడు తీవ్రంగానే పోరాటం చేశాడు. వచ్చేసారి గెలిచి తీరుతాడు. – యోగదర్శిని, అవనియాపురం ఆ ఉద్యమం స్ఫూర్తిగా.. 2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నాన్నతో పట్టుబట్టి ఓ ఎద్దును కొనిపించి శిక్షణ ఇచ్చాను. చెరువు, నీటి పరీవాహక ప్రదేశాలు, మట్టి దిమ్మెలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ సాధన చేయిస్తున్నా. అందుకే వాడిద్వారా బంగారు నాణెం బహుమతిగా లభించింది. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్తా. – స్నేహ, అలంగానల్లూరు తమిళనాట ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ మధురై జిల్లా అవనియాపురం వేదికగా భోగి రోజున జరిగిన జల్లికట్టులో అదే ప్రాంతానికి చెందిన 9 తరగతి విద్యార్థినులు అన్నలక్ష్మి, నిషా, పదో తరగతి విద్యార్థిని యోగదర్శిని తొలిసారిగా క్రీడా మైదానంలోకి తమ ఎద్దులతో దూసుకొచ్చారు. అన్నలక్ష్మి, నిషా వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బుసలు కొడుతూ క్రీడాకారులకు చిక్కకుండా ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. యోగదర్శిని ఎద్దు క్రీడాకారులకు చిక్కడంతో ఆ బాలికకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. అయితే, యోగదర్శిని ఆ బహుమతిని తిరçస్కరించి.. ‘మరోసారి కలుద్దాం.. కచ్చితంగా గెలుద్దాం’ అంటూ వాడివాసల్ వేదికగా ప్రతిజ్ఞ చేసి వెళ్లింది. ప్రస్తుతం తమిళనాట అంతటా ఇదే హాట్ టాపిక్. ఆ మరుసటి రోజున పాలమేడులో కొందరు బాలికలు తమ ఎద్దుల్ని వాడివాసల్ నుంచి బయటకు రప్పించి మెరిశారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం జరిగిన జల్లికట్టులో స్నేహ అనే 16 ఏళ్ల బాలికతో పాటుగా మరో ఇద్దరు బాలికలు తమ ఎద్దులతో వచ్చి బంగారు నాణేలను గెలుచుకెళ్లారు. ఇదే సందర్భంలో తమిళ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని.. మన సంస్కృతిని భావితరాలకు సైతం అందించాలంటే ప్రతి నారీ జల్లికట్టులో భేరీ మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. దీనినిబట్టి చూస్తే భవిష్యత్లో మగధీరులకు జల్లికట్టు పోటీల్లో మరింత పోటీ తప్పదన్న మాట. -
జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్
ప్రేమ: ‘ఏరా, కాఫీ మానేశావట!!!’ ‘ఎప్పుడైతే కావ్యకు టీ తప్ప కాఫీ నచ్చదు అనే విషయం తెలిసిందో ఇక అప్పటి నుంచి కాఫీ ముఖం ఈ జన్మలో చూడొద్దని డిసైడైపోయాను’ అభిమానం: ‘మీరు ఏమైనా అనుకోండి. మీ హీరో సినిమా ఏమాత్రం బాగలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి?’ ‘సినిమా ఎందుకు చూడాలి? అనే మాట వాడి చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అంతపెద్ద మాట అంటావా! ఇక ముందు మీ హీరో సినిమాలను బాయ్కాట్ చేస్తున్నాము’ కుటుంబం: ‘నాన్న పలకరించినా ముఖం తిప్పేస్తున్నావట! ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్లు మన బాగు కోసం ఒక మాట అంటే తప్పేమిటి?!’ సామాజికం: ‘మిత్రులారా... ఫలానా షూస్ ఎవరూ వాడవద్దు. వాటిని జంతుచర్మంతో తయారుచేస్తారట’ ∙∙ ‘జెన్ జడ్’ జనరేషన్లో కీలకపాత్ర వహిస్తుంది ‘క్యాన్సిల్ కల్చర్’ దీనికి సోషల్మీడియా ప్రధాన వేదిక అయింది. ‘క్యాన్సిల్’ అంటే ఉన్న సాధారణ అర్ధాలలో రెండు.. రద్దు చేయడం, తుడిచివేయడం. ఇక పాప్–కల్చర్ డిక్షనరీ ప్రకారం తమ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో సెలబ్రిటీలు లేదా కంపెనీలను ఏదో ఒక రూపంలో బాయ్కాట్ చేయడం. ఈ క్యాన్సిల్ కల్చర్ మూలాలు 2014 ‘లవ్ అండ్ హిప్–పాప్: న్యూయార్క్’ రియాల్టీ షోలో ఉన్నాయి అంటారు. ఆ షోలో ఒక నటుడికి తన గర్ల్ఫ్రెండ్కు అంతకుముందే కూతురు ఉందనే విషయం తెలిసి ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ అంటాడు. మొదట్లో ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ను సోషల్ మీడియాలో సరదాగా అనుకరించేవారు. అయితే ఈ సరదా కాస్త ఆ తరువాత సీరియస్ రూపంలోకి మారింది. మనలాంటి దేశాల్లోకి కూడా వచ్చేసి చాలామంది యూత్ను పట్టేసింది. ట్విట్టర్లో ‘బాయ్కాట్’ హ్యాష్టాగ్లు పెరిగాయి. ఫేస్బుక్లో ఒక కుర్రాడు ఇలా పోస్ట్ పెట్టాడు. ‘జాను లవ్స్ ఆరెంజ్. షీ ఈజ్ క్యాన్సిల్డ్’ యూత్లోని ఈ ‘క్యాన్సిల్ కల్చర్’ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనడం కంటే...‘ఇది సరికాదు’ అనే వారే ఎక్కువ. అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ‘సౌత్ పార్క్’ ఈ ధోరణిని వెక్కిరించింది. స్టాండప్ కామెడి షో ‘స్పీక్స్ అండ్ స్టోన్స్’ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ‘కాలేజి క్యాంపస్లో ప్రత్యర్థి పక్షం భావాలను వ్యతిరేకించడం... అనే భావన క్యాన్సిల్ కల్చర్కు విత్తనంలాంటిది. అది కాస్త సోషల్ మీడియాకు విస్తరించింది’ అంటాడు ‘కోడింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్’ పుస్తకం రాసిన జోనాధన్. బాయ్కాట్లు, బహిష్కరణలు మన సామాజిక చరిత్రలో కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘విదేశీ వస్తు బహిష్కరణ’ ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. అలాంటి ఉద్యమాలకు అర్థం, పరమార్థం, అనంతమైన బలం ఉన్నాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలపై ‘క్యాన్సిల్ కల్చర్’ను ఫాలోకావడం తగదని చెబుతున్నారు విజ్ఞులు. అయితే జెన్ జడ్లో ‘క్యాన్సిల్ కల్చర్’ని తలకెత్తుకుంటున్నవారితో పాటు ‘క్యాన్సిల్ ది క్యాన్సిల్ కల్చర్’ అని నినదిస్తున్నవారు కూడా ఉన్నారు. -
AP: 6 గంటల్లోనే కల్చర్ టెస్ట్
ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు): వ్యాధి నియంత్రణకు ఏ ఔషధాలను ఉపయోగించాలనే విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే కల్చర్ టెస్ట్ ఇక సులభతరం కానుంది. ప్రస్తుతం కల్చర్ టెస్ట్ ఫలితాలు రావడానికి 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది. అనంతరం వ్యాధి నియంత్రణకు అవసరమైన ఔషధాన్ని వినియోగించడం ప్రారంభిస్తారు. చదవండి: విశాఖ పూర్ణామార్కెట్ ఆశీలు వసూలులో ‘మహా’ మాయ! ఈ సమయాన్ని తగ్గిస్తూ 6 గంటల్లోనే కల్చర్ టెస్ట్ ఫలితాలు అందించే విధానాన్ని ఆవిష్కరించి పరికరాన్ని సైతం రూపొందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధకురాలు బొల్లాప్రగడ కీర్తిప్రియ. ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ విభాగంలో ఆచార్య డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ ఎ.డైసీరాణిల సంయుక్త మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ సైతం అందుకున్నారు. తాను రూపొందించిన పరికరంతో కీర్తి ప్రియ ఖర్చు తక్కువ.. సమయం ఆదా ప్రస్తుతం వైద్యపరీక్షల కేంద్రాల్లో కల్చర్ టెస్ట్ చేయడానికి వినియోగించే విదేశీ పరికరాలు రూ.25 లక్షలకుపైగా విలువ చేస్తాయి. ఇవి 4 నుంచి 18 గంటలల్లోగా ఫలితాలను అందిస్తాయి. వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చుకూడా ఎక్కువే. సంప్రదాయ విధానాల్లో కల్చర్ టెస్ట్ చేసే సాంకేతిక పరికరాల విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చులు కొంతవరకు మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బొల్లాప్రగడ కీర్తిప్రియ చేసిన పరిశోధనలో భాగంగా తక్కువ ఖర్చుతో దేశీయంగా ఒక నూతన పరికరాన్ని అభివృద్ధి చేశారు. పేటెంట్కు దరఖాస్తు చేశారు. ఇప్పటికే పేటెంట్ పబ్లిష్ కాగా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుదిదశ పేటెంట్ను మంజూరు చేస్తారు. ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశాలను తన పరిశోధనలో ఉపయోగించి కల్చర్ టెస్ట్ ఫలితాలను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రాథమికంగా ఆవులు, గొర్రెలు, మేకల నుంచి నమూనాలను సేకరించారు. వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగించాల్సిన యాంటీ బయోటిక్స్ను గుర్తించడానికి సంప్రదాయ సాంకేతిక విధానాలను ఉపయోగించి ఇమేజ్ బ్యాంక్ను అభివృద్ధి చేసుకున్నారు. వీటికి డీప్లెర్నింగ్ అల్గారిథమ్స్ను ఉపయోగించి 99 శాతం కచ్చితమైన ఫలితాలను ఇచ్చేవిధంగా పరికరాన్ని తీర్చిదిద్దారు. రూ.లక్ష ఖర్చుతోనే ఈ పరికరాన్ని తయారుచేశారు. ప్రాథమిక నైపుణ్యం ఉన్నవారు సైతం దీన్ని ఉపయోగించి కచ్చితమైన వివరాలు పొందే అవకాశం ఉంది. పరీక్ష ఫలితాలను నేరుగా మన మొబైల్ ఫోన్ను అనుసంధానం చేసుకుని తెలుసుకునే అవకాశం ఉంది. టెలిమెడిసిన్ ఉపయోగిస్తూ ఈ–చీటీ (ఈ–ప్రిస్కిప్షన్)ను వైద్యుడి సలహాతో పొందవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను సైతం సిద్దం చేశారు. రూ.10 వేలతో రూపొందించాలని ఉంది భవిష్యత్తులో కేవలం రూ.10 వేలతో ఈ పరికరాన్ని తయారు చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు, పేద, మధ్యతరగతి వారికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న కల్చర్ టెస్ట్కు అధిక సమయం పడుతోంది. పరీక్ష ఫలితాలు వచ్చేలోగా వైద్యులు విభిన్న యాంటీ బయోటిక్స్ను రోగిపై వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీన్ని నివారిస్తూ, కచ్చితమైన ఔషధాన్ని రోగికి అందించడం వలన మెరుగైన ఫలితాలు, సత్వర ఉపశమనం లభిస్తాయి. ముఖ్యంగా పశువుల్లో మరణాలను నియంత్రించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – బొల్లాప్రగడ కీర్తిప్రియ, పరిశోధకురాలు -
ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్: పెళ్లింత.. తుళ్లింత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... ఇదీ ఆత్రేయ రాసిన పాట.. ఇప్పటి పరిస్థితులను బట్టి రాస్తే వాటి సరసన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేర్చేవాడేమో మనసుకవి! నాటికీ నేటికీ పెళ్లి సంప్రదాయాల్లో ఎన్నో మార్పులు ఎప్పటికప్పుడు సరికొత్తగా చేరుతున్నాయి. ఉత్తర భారతంలో మెహందీ ఫంక్షన్ మన ప్రాంతాలకూ విస్తరించింది. ఇదో వేడుకలా చేసి పెళ్లి ఖర్చులను తడిసిమోపెడు చేస్తుంటే.. కొద్దికాలంగా ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్ క్రేజీగా తయారైంది. మధ్యతరగతి వర్గాలనూ ఇది ప్రభావితం చేస్తోంది. మన పరిసరాలు షూటింగులకు అనుకూలం కావడంతో దూరం వెళ్లకుండా జిల్లావాసులు ఇక్కడే ప్రీవెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. (చదవండి: వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ) సినిమా ప్రభావంతోనే ప్రీవెడ్డింగ్ షూట్ వచ్చింది. సినిమాలోని హీరో హీరోయిన్లు పెళ్లికి ముందు పలు అందమైన లొకేషన్లు తిరుగుతూ డ్యూయెట్లు పాడుకుంటారు. ఈ నాటకీయతకు .. అందమైన కలలకు నిజ జీవితంలోనూ దృశ్యరూపం ఇవ్వడం ఈ షూట్ ఉద్దేశం. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి ఇందులో పాల్గొంటారు. జిల్లాలో వీటిపై ఇటీవల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మన జిల్లాలో అందమైన లోకేషన్లను వెతుక్కోనక్కరలేదు. గోదావరితోపాటు రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం తదితర ఏజెన్సీ ప్రాంతాలూ రా..రమ్మంటూ స్వాగతిస్తున్నాయి. దేవీపట్నంలోని తీగల బ్రిడ్జి వద్ద తప్పకుండా ఒక్క షాటైనా తప్పనిసరిగా తీస్తున్నారు. గోదావరి అందాలు, కడియం పూల నర్సరీలను బ్యాక్గ్రౌండుగా ఎంపిక చేసుకుంటున్నారు. ఫొటోగ్రాఫర్ల ఫోకస్ ప్రీవెడ్డింగ్ షూట్ ఒక కళ. వీడియోగ్రాఫర్ లేదా ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతపై ఆధారపడి ఉంటుంది. జిల్లాలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఈ షూట్లపై దృష్టి పెట్టారు. శిక్షణ పొందారు. థీమ్లు ఎంచుకుని వీడియో షూట్ చేస్తారు. కొన్నిచోట్ల డ్రోన్ కెమెరాలనూ వాడుతున్నారు. వధూవరుల హావభావాలు.. నేపథ్య గీతాలు.. అందమైన లొకేషన్లతో ఇది క్లిక్ అవుతుంది. ఈ షూట్కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వెచ్చిస్తున్నా రు. ఖరీదైనప్పటికీ తమ అభిరుచికి అనుగుణంగా ఉండటంతో మారుమాట్లాడటం లేదు చాలామంది. వధూవరుల సేఫ్టీ కూడా చూడాలి 20 ఏళ్ల కిందటి వరకూ ఫొటోలు తీసుకునేవారు. తరువాత వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేరాయి. కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నాయి. అలాంటిదే ఈ ట్రెండ్ కూడా. కొన్ని లొకేషన్లలో వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూ ప్రమాదాలపాలవుతున్నారు. ఏదైనా పరిధిలో.. పరిమితిలో ఉండాలి. షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. – ఏపీ నారాయణరావు, రావ్ అండ్ రావ్ ఫొటో స్టూడియో, రాజమహేంద్రవరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ప్రీ వెడ్డింగ్ షూట్ల ద్వారా వధూవరులకు ఒకరిపై ఒకరికి అవగాహన వస్తోంది. అదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఇద్దరిలో బెరుకు పోతుంది. షూట్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా వారి సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. – దారా మణి, వెడ్డింగ్ షూటర్ రాంగ్ ట్రెండ్ మన దేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే మంచిదే. కానీ ఈ రకంగా వీడియోలు, ఫొటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుంటాయి. కొద్ది కాలం తరువాత అభిప్రాయ భేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోవలసి వస్తే ఆ వీడియోలు ప్రతిబంధకంగా మారతాయి. – నాగిరెడ్డి దారపు, వ్యక్తిత్వ జీవన, మానసిక వికాస నిపుణుడు చదవండి: ప్రమాద సమయంలో సాయి తేజ్కు సాయం చేసింది ఈ ఇద్దరే -
ఫ్రెంచ్ ఆస్కార్ వేడుకలో నటి నగ్నంగా నిరసన తెలిపింది
-
అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి
పారిస్: 'ఫ్రెంచ్ ఆస్కార్' వేడుకలో అనూహ్య పరిణామం సభికులను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో సంస్కృతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తూ నటి కోరిన్ మాసిరో (57) నగ్నంగా మారిపోయారు. సీజర్ అవార్డుల వేడుక సందర్బంగా శుక్రవారం ఈ సంచలన నిరసనకు కోరిన్ దిగారు. ఫ్రాన్స్లో ఆస్కార్తో సమానంగా భావించే వేదికపైకి ఉత్తమ దుస్తులకు అవార్డును అందజేయడానికిమాసిరోను ఆహ్వానించారు. ఈ సమయంలో రక్తంతో తడిసిన గాడిదను పోలిన దుస్తులతో వచ్చారు. వేదికపై మాట్లాడుతూనే పూర్తిగా నగ్నంగా మారిపోతున్నానంటూ ప్రకటించి అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్లో "సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు" అనే నినాదంతో ఆమె దర్శనమిచ్చారు. ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ‘మా కళను మాకు తిరిగి ఇవ్వండి... జీన్’ అంటూ బాడీ అంతా రాసుకొని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్కు విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా మూడు నెలలకు పైగా ఫ్రాన్స్లో సినిమాలు మూతపడ్డాయి. గత డిసెంబరులో, వందలాది మంది నటులు, థియేటర్ డైరెక్టర్లు, సంగీతకారులు, ఫిల్మ్ టెక్నీషియన్లు, క్రిటిక్స్ అనేక మంది సాంస్కృతిక కేంద్రాల మూతకు వ్యతిరేకంగా పారిస్ , ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది
ఒక దేశ సంస్కృతి కబళింపబడి, రూపుమాసిపోతే ప్రజలలో విచ్చలవడితనం పెరిగిపోతుంది. అది అనాచారానికి, పతనానికి కారణమవుతుంది. రాజులు పరిపాలించినా, ప్రజాస్వామిక ప్రభుత్వాలు పాలించినా సంస్కృతికి విశేష ప్రాధాన్యమిచ్చి దానిని కాపాడుకోవడం ఒక ఎత్తయితే... ప్రజలు తమంత తాముగా తమ కళలపట్ల, తమ సంస్కృతి పట్ల జాగరూకలై దానిని రక్షించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. భారతీయ సంస్కృతికి సంబంధించిన వైభవంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. బాహ్యంలో అంటే పైకి మనోరంజకత్వం ఉంటుంది. రంజకత్వం లేకుండా ‘కళ’ అనేది ఉండదు. అది మనలను రంజింప చేయాలి. అని చెప్పి కేవలంగా మనోరంజకత్వం కోసమని హద్దు లేకుండా పరిధి దాటిపోయి అర్థం లేకుండా దిగజారుడుతనంతో కిందకొచ్చేసి...‘ఇదిగో మేం మనసులను రంజింప చేస్తున్నాం చూడండి’ అన్న మాట భారతీయ కళలకు వర్తించదు. మన కళల్లో పైకి మనోరంజకత్వం కనిపించినా... తుట్టతుది ప్రయోజనం మాత్రం అపురూపమైన శరీరాన్ని ఉపయోగించి ఆ కళల ద్వారా పరమేశ్వరుడిలో ఐక్యం కావడమే లక్ష్యంగా ఉంటుంది. దానికోసం ఉపాసన, దానికోసం అనుష్ఠానం, దానికోసం సాధన, దాని కోసం సమస్త కళలు... వాటిని అందించడానికి ‘సంస్కృతి’. అంతే తప్ప కేవలం మనోరంజకత్వం కోసం దేనినీ ప్రతిపాదన చేయరు.అందుకే నవరసాలుంటాయి. వాటి చివరి ప్రయోజనం... భక్తిమార్గంలో మనిషిని ప్రయాణింపచేసి, భక్తితో కూడిన కర్మాచరణలు చేసిన కారణం చేత ప్రీతిపొందిన పరమేశ్వరుడు చిత్తశుద్ధిని ఇస్తే, ఆ పాత్రత ఆధారంగా జ్ఞానాన్ని కటాక్షిస్తే, ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కోసం కళలు ఉపయోగపడతాయి. కేవలం మనోరంజకత్వం కోసం కళలను, సంస్కృతిని ఉపయోగించడం ఈ దేశ ఆచారం కాదు. ఈ దేశ ప్రజలు ఏ కళని అభ్యసించినా, దాని ప్రయోజనం భగవంతుడిని చేరడమే. అది లేని నాడు ఆ జీవితానికి అర్థం లేదు. మీరు సంగీతమే తీసుకోండి. సంగీతమంటే కంఠాన్ని ఉపయోగించి పాడడం అనుకుంటాం. కానీ శాస్త్రం దీన్ని ఎలా చెబుతున్నదంటే... వాద్యంచ, నృత్యంచ, గీతంచ...సంగీతమదిముచ్యతే’ అంటున్నది. అంటే వాద్యం, గీతం, నృత్యం... ఈ మూడూ కలిస్తేనే సంగీతం.. అంటున్నది. అంతేతప్ప గొంతుతో పాడే పాట ఒక్కదాన్నే సంగీతమనలేదు. శబ్దాన్ని సహకారంగా తీసుకుని, భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరిస్తుంది...లేదా శబ్దాన్ని సృజిస్తుంది. శబ్దానికీ, ధ్వనికీ తేడా ఉంది. ధ్వని అర్థాన్నివ్వదు. పిల్లవాడు ఆడుకుంటూ నోటితో చేసే ధ్వనులకు అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ సూచించకపోతే దాన్ని ధ్వని అంటారు. అర్థాన్ని ప్రతిపాదిస్తే దాన్ని శబ్దం అంటారు. సనాతన ధర్మం తాలూకు జీవం అంతా శబ్దం మీద ఆధారపడి ఉంది. వేదానికి కూడా శబ్దమనే పేరు. వేదాన్ని ‘శబ్దరాశి’ అని కూడా అంటారు. వేదంలో ఏ శబ్దానికి పట్టాభిషేకం చేసారో,..శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి..అని సరస్వతీ దేవిని ఎలా ప్రార్థన చేసారో, అటువంటి ఆ తల్లి స్వరూపమయిన శబ్దంలో సంగీతానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భారతీయ సంగీతపు చరమ ప్రయోజనం పరమేశ్వరుని చేరుకొనుటయే. అందుకే నాదోపాసన అంటారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇదేనా బెంగాల్ సంస్కృతి?
బర్ధమాన్: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిప్పులు చెరిగారు. తన పేరును హేళన చేయడం, తన కాన్వాయ్పై దాడి చేయడం.. ఇదేనా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని నిలదీశారు. చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల బహిర్గతమైంది. జె.పి.నడ్డా శనివారం పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోకి బయటి వ్యక్తులు వస్తున్నారంటూ టీఎంసీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, మరి వారి అరాచకాలు, అవినీతి, దోపిడీ మాటేమిటని ప్రశ్నించారు. టీఎంసీ నేతలు బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బొగ్గు, పశువులు, ఇసుక అక్రమ రవాణాతోపాటు కట్ మనీ వసూలు చేయడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరారని, ఇదేనా బెంగాల్ సంస్కృతి అని నడ్డా మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతి గురించి మాట్లాడే హక్కును టీఎంసీ కోల్పోయిందని తేల్చి చెప్పారు. మమతా ఇక ఇంటికే.. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వారసత్వాన్ని బీజేపీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలదని జె.పి.నడ్డా ఉద్ఘాటించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ అనుసరిస్తోందని గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. బర్ధమాన్లోని సర్వమంగళ ఆలయంలో నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అరాచకానికి, అవినీతికి, వేధింపులకు మారుపేరు తప్ప బెంగాల్ సంస్కృతికి ప్రతినిధి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చారని విమర్శించారు. పిడికెడు బియ్యం ఇవ్వండి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని నడ్డా గుర్తుచేశారు. ఆయన శనివారం బెంగాల్లో కృషక్ సురక్ష యోజన, ఏక్ ముట్టీ చావల్(పిడికెడు బియ్యం) కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు బెంగాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి పిడికెడు బియ్యం సేకరించనున్నారు. ఈ బియ్యం వండి, పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించారు. -
‘నేను ఉన్నాను’...అనడానికి గుర్తు అది
మంగళ సూత్ర ధారణ చేస్తూ వరుడు ‘‘మాంగల్య తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశ్శతమ్’’. ఈ మాట మరెవరితోనూ అనడు. కానీ ఆ ఆడపిల్లతో అంటాడు. ‘‘నేను నీ మెడలో కడుతున్న ఈ మంగళ సూత్రం – నేనున్నాను అనడానికి గుర్తు. ఇది నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేనున్నానని గుర్తు. నేను ఈ ఊళ్ళో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనపడకపోవచ్చు. ఆయన ఉన్నాడా... అన్న అనుమానం లేదు. ఆమె మెడలోని మంగళ సూత్రం ఆయన ఉన్నాడనడానికి సంకేతం. మంగళ సూత్రం కంఠం లోనే ఎందుకు కట్టాలి ...అంటే పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వానికి అది తగులుతుంటే ఆ మంగళ సూత్రానికి ఎప్పుడూ ఏ ఆపదా రాదని నమ్మకం. ఈ కంఠం పైన ఉన్న జ్ఞానేంద్రియాలకు, బుద్ధిస్థానానికీ, కింద ఉన్న కర్మేంద్రియాల సంఘాతానికీ మధ్యలో ఉన్న కవాటం అది. నేను మాట్లాడుతున్నప్పుడు నా కాలిపై దోమ కుడుతున్నదనుకోండి. నాకు బాధ పుడుతున్నదని కాలు బుద్ధి స్థానానికి మొరపెట్టుకుంటుంది. ‘మాట్లాడడానికి అవసరమైన బుద్ధి ప్రచోదనం చేస్తున్నాను... ఇప్పడు కుదరదు’’ అని బుద్ధి అనదు. ఒక పక్క వాక్య నిర్మాణానికి అవసరమయిన విషయాన్ని ఇస్తూనే పక్కనే ఉన్న రెండవ కాలిని ‘‘నువ్వు వెళ్ళి దోమను తరుము, దోమ కుట్టిన చోట ఉపశమనం కలుగచేయి’’ అని ఆజ్ఞాపిస్తుంది. కింద ఉన్న శరీర సంఘాతం గురించి పైన బుద్ధి స్థానంలో ఉన్న తల పట్టించుకుంటుంది. వాటి సహకారానికి గుర్తు కంఠం. అంతే కాదు, కంఠంలోంచి అన్నం కడుపులోకి చేరుకుంటుంది. అది శక్తిగా మారి శరీరావయవాలన్నీ బలం పొందుతాయి. అలా భార్యాభర్తలు కలసి ఉండాలి. అవి ఎలా కలిసి ఉన్నాయో మనం కూడా అలా కలిసి ఉండెదము గాక... అందుకు మంగళ సూత్రం కంఠంలో కడతారు. తరువాత తలంబ్రాలు. ఇది ఒకరిమీద ఒకరు పోసుకుంటూ హాస్యం కోసం చేసే వేడుక కాదు. బియ్యం మీద పాలచుక్కలు వేసి తీసుకొస్తారు. నడుము విరగని బియ్యం(అ–క్షతలు) ఎలా ఉంటుందో అలా మేము కూడా కలిసి ఉండెదము గాక. పూర్ణత్వాన్ని, మంగళప్రదత్వాన్ని పొందెదము గాక. అందుకే ‘‘ప్రజామే కామస్సమృద్యతామ్ (మాకు ధార్మికమైన సంతానం పుష్కలంగా కలుగుగాక), పశవో మే కామస్సమృధ్యతామ్ (పాడిపంటలు మాకు పుష్కలంగా కలుగు గాక), యజ్ఞో మే కామస్సమధ్యతామ్ (మాకు యజ్ఞాలు చేసే ఆలోచన సమృద్ధిగా కలుగు గాక), శ్రియో మే కామస్సమృధ్యతామ్ (మాకు ఐశ్వర్యానికి వైక్లబ్యం కలుగకుండుగాక).. అని దేవతలను కోరుతూ ఈ తలంబ్రాలు పోసుకుంటారు. అవి పోసుకున్న వేళ దేవతలు కటాక్షిస్తారు. సభంతా ప్రశాంతంగా వారిని తలంబ్రాలు పోసుకోనివ్వాలి. అది వాళ్ళ జీవితం. వాళ్ళు వృద్ధిలోకి రావలసిన వాళ్ళు. మూడుసార్లు అయిపోయిన తరువాత వేడుక కోసం పోసుకోవడానికి శాస్త్రం కూడా అంగీకరించింది. అప్పుడు సంతోషం కొద్దీ మనం ప్రోత్సాహ పరిచినా, ఉత్సాహ పరిచినా ఏదో వేడుక చేసినా అందులో దోషం రాదు. కానీ వాళ్ల జీవితానికి అభ్యున్నతి కోసం జరుగుతున్న మంత్ర భాగాన్ని జరగనివ్వాలి. శాస్త్రీయమైన కర్మ జరుగుతుండగా దాన్ని ఆక్షేపించే రీతిలో ప్రవర్తించడం సభామర్యాద కాదు. రాక్షస గణాలు చేసే అల్లరి అనిపించుకుంటుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిచ్చెన కైలాసం.. గచ్చకాయలు తెలుసా?
జూబ్లీహిల్స్: వామనగుంటలు, పచ్చీస్, అష్టాచెమ్మా, దాడి, పాము, నిచ్చెన కైలాసం, గచ్చకాయలు ఈ పేర్లు వింటే పెద్దలందరికీ తమ చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. వీటి గురించి ఈ తరం పిల్లలకు కొంచెం కూడా తెలియదు. అందుకే పురాతన సంప్రదాయ ఆటలను చిన్నారులకు తెలియజెప్పడానికి, వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న గుడ్ ఓల్డ్ గేమ్స్ సంస్థ ‘ హెరిటేజ్ గేమ్స్ ఆఫ్ ఇండియా ’ పేరుతో విభిన్నమన సాంప్రదాయ ఆటలను నగరంలో పరిచయం చేసింది. బంజారాహిల్స్ సప్తపర్ణిలో శుక్రవారం ఎగ్జిబిషన్ ప్రారంభించింది. కనుమరుగవుతున్న 101 సాంప్రదాయ ఆటలను వెలిగితీసి ఆటకు సంబంధించిన పరికరాలను తయారు చేయించి ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు సునీతా రాజేష్, అర్చన తెలిపారు. జెయింట్ పచ్చీస్, త్రీ ఇన్ వన్ పచ్చీస్ సహా పలు ఆట పరికరాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఆయా ప్రాంతాల కళాకారులతో తయారు చేయించామని వారు తెలిపారు. ఆధునిక సాంకేతిక సమాచార ప్రపంచంలో కొట్టుకుపోతున్న నేటి తరానికి భారతీయ సాంప్రదాయ ఆటపరికరాలను పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 250 రూపాయల నుండి 60వేల రూపాయల వరకు ఆట పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. -
నేడే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్డార్ఫ్ శిష్యు డు మైకేల్ యోర్క్ జాతరకు రానున్నారు. -
బతుకుపై ఆశ రేపే బతుకమ్మ
బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని 9 రోజులు ప్రతి మనిషి ప్రకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ గొప్పతనం. ఎంగి లిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలం గాణలో సాయంకాలం వేళ ఊరూ వాడా ఏకమై బతుకమ్మ పాటలతో పులకించిపోతుంది. తీరొక్క పువ్వులతో సింగారించుకొనే బంగరు కల్ప వల్లిగా బతుకమ్మను పూజిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడు, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పువ్వుల్ని పేర్చుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరి స్తారు. సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, తనను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా!‘ అని దీవించారంట. బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ ఇది. తెలంగాణ సమాజం అమరత్వాన్ని ఆలింగనం చేసుకుంటుంది కానీ అవమానానికి సుదూరంగా ఉంటుంది. అందుకే ఆత్మహత్యకు పాల్పడిన ఆ బాలికను కీర్తిస్తూ బతుకమ్మను ఆడుతారని బాగా వాడుకలో ఉన్న కథనం. బంగారు తెలంగాణలో ఉయ్యాలో బ్రతుకులు ఛిద్రమయ్యే ఉయ్యాలో/ రాష్ట్రం ఏర్పడితే ఉయ్యాలో ఉద్యోగాలన్నారు ఉయ్యాలో/ నౌకరి లేకే ఉయ్యాలో మరణాన్ని ముద్దాడితిమి ఉయ్యాలో అని విద్యార్ధినులు తమ ఆవేదనంతా బతుకమ్మ పాటలోకి ఒంపి నిరసన తెలిపే రోజు ల్లోనే ఇంకా బతుకమ్మ ఆడటం బాధాకరం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితురాలు లక్ష్మి బతుకమ్మ పాట ద్వారా ప్రభుత్వానికి ఆవేదనను తెలిపితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించినోళ్లకు బతుకమ్మ ఆడే నైతికత ఎక్కడిదని తెలం గాణ మహిళా సమాజం ప్రశ్నిస్తోంది. బతుకమ్మ అంటే మహిళలంతా ఒక్కచోట కూడి రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, పాట పాడే గొప్ప సంస్కృతి అని మరిచి బతుకమ్మ అంటే డీజేలతో దుమకడమని ఓ కొత్త శైలిని నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, స్వపరిపాలనకు కారణమైన సోనియాగాంధీకి కాంగ్రెస్ సారథ్యంలో బతుకమ్మ చీరను కానుకగా ఇస్తారని విశ్వసిస్తూ... ఇందిరా శోభన్, టీపీసీసీ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ మెంబర్ -
పాలు – మురిపాలు
సంస్కృతి సాంప్రదాయాలకు, సనాతన సదాచారాలకు భారతావని కాణాచి అనే విషయం జగద్విదితం. ఆహార ద్రవ్యాలలోను, పవిత్ర పూజా ప్రక్రియలలోను ‘పాలు’ ప్రధాన పదార్థం. గోమాతకు దైవత్వం సిద్ధించడానికి ముఖ్య కారణం గోక్షీరపు విశిష్టతే. ఆయుర్వేద పరిభాషలో ఏ విశేషణమూ వాడకపోతే క్షీరం అంటే గోక్షీరమే. తైలం అంటే నువ్వుల నూనే. అదేవిధంగా నవనీతం, ఘృతం (వెన్న, నెయ్యి) కూడా ఆవు పాలకు సంబంధించినవే. నవ జాత శిశు పోషణలో మాతృ స్తన్యం తర్వాత అతి ముఖ్య పాత్ర మేక, ఆవు పాలదే. ఎన్నో ఓషధుల్ని శుద్ధి చేయటానికి ఆవు పాలను వాడతారు. అన్ని వయసుల వారికీ ఆవు పాలు ఉత్తమ రసాయనంగా (సప్తధాతు పుష్టికరంగా) ఉపకరిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. తద్వారా ఓజోవర్థకంగా పనిచేస్తాయి. ఆవుపాల గుణగణాలు: (సుశ్రుతుడు)‘‘స్వాదు శీతం మృదు స్నిగ్ధం బహలం శ్లక్ష్య పిచ్ఛిలంగురు మందం ప్రసన్నం చ గవ్యం దశ గుణం పయః’’(చరకుడు): ‘‘తదేవ గుణమేవ ఓజః సామాన్యాత్ అభివర్థయేత్ ప్రవరం జీవనీయం క్షీర ముక్తం రసాయనం’’చిక్కగా, జిడ్డుగా, మృదువుగా ఉంటాయి. (గేదె పాలతో పోలిస్తే పలచగా ఉంటాయి). తియ్యగా ఉండి, శరీరానికి చలవ చేస్తాయి. ఆలస్యంగా జీర్ణమై, ఆకలిని తీర్చి, మనసుకి ప్రసన్నంగా, బలవర్థకంగా పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జీవనీయ’ గుణ ప్రధానంగా ఉంటాయి. వాత హరంగా, పిత్త హరంగా, ఉండి, రక్త స్రావాలను అరికట్టే లక్షణం కలిగి ఉంటుంది. తక్షణ శుక్రకరం, వీర్య వర్థకం. గేదె పాలు: ‘మహీషీణాం గురుతరం గవ్యాత్, శీతతరం పయ: స్నేహాన్యూనం అనిద్రాయ హితం అత్యగ్నియేచ తత్’’ఆవు పాల కంటె అధిక గుణాలు కలిగి, నిద్రాజనకంగా పనిచేస్తాయి. అత్యాకలిని అరికట్టి తృప్తినిస్తాయి. మేక పాలు: (చరకుడు) ‘‘ఛాగం కషాయం మధుర శీతం గ్రాహి పయాలఘురక్తపిత్త అతి సారఘ్నం క్షయ కాస జ్వరాపహం’’ (చరకుడు)తీపితో పాటు కొంచెం వగరుగా ఉండి తేలికగా జీర్ణం అవుతాయి. రక్త స్రావం, విరేచనాలు, దగ్గు, జ్వరాలను అరికడతాయి. గాడిద పాలు (భావ మిశ్రుడు):శ్వాస వాతహరం స అమ్లం లవణం, రుచి దీప్తి కృత్కఫకాస హరం, బాల రోగఘ్నం గార్ధభీ పయఃదీనికి ఔషధ గుణాలు ఎక్కువ. వయసుని బట్టి పావు చెంచా నుండి ఐదు చెందాల వరకు మాత్రమే సేవించాలి. వాతహరంగా పని చేసి ఉబ్బసం వంటి ఆయాసాలను తగ్గిస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. శిశువులకు కలిగే అన్ని రోగాలకూ ఇది ఉత్తమ ఔషధ తుల్యం.ఈ విధంగా ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు శరీర పోషణకు ఉపకరిస్తాయి. నేరుగా పాలు తాగటం, పాయసాలు తయారు చేయటం, శాకపాకాలలో వాడటం వంటి వివిధ పద్ధతుల్లో సేవిస్తుంటాం. గాడిద పాలను కేవలం ఔషధ పరంగా వాడుతుంటాం. పాల మీగడ చాలా ఎక్కువ స్నిగ్ధంగా ఉండి, అతి చిక్కగా, మృదువుగా గురుతరంగా శరీర పోషణకు ఉపకరిస్తుంది. పెరుగును చిలకడం ద్వారా వెన్న లభిస్తుంది. దీనినే సంస్కృతంలో నవనీతం అంటారు. అతి మృదువుగా ఉండి, కొవ్వుని కరిగించే గుణం కలిగి ఉంటుంది. అందుకే ఇది స్థౌల్య హరం. అంటే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. వెన్నను మరిగించి నెయ్యి (ఘృతం) తయారు చేస్తారు. ఇది అగ్నివర్ధకం. పిత్తహరం. గమనిక: పచ్చ గడ్డి, తెలగ పిండి, చిట్టు, తౌడు, ఆహారంగా సేవించే దేశీ ఆవుల పాలు, వాటి ఉత్పత్తులు మాత్రమే ఆరోగ్యకరమని గుర్తుంచుకోవాలి. ఈనాడు జెర్సీ ఆవులు, వాటికి ఇచ్చే విచిత్ర ఆహారాలు, అధిక పాల కోసం వాటికి ఇచ్చే కెమికల్ ఇంజక్షన్లు... వీటి వల్ల పేరుకి ఆవు పాలైనా అనర్థాలే అధికం అని శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కనిపిస్తోంది. ఆధునిక జీవ రసాయనిక శాస్త్రం రీత్యా:పాలు మంచి బలవర్థక సమీకృత ఆహారం. ఇందులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు సమతుల్యంగా ఉంటాయి. డి, బీ 12, బీ6, బీ2 విటమిన్లు లభిస్తాయి. ఎ, డీ లు కూడా కొంతవరకు లభిస్తాయి. సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియమ్లు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలకు, ఇతర ధాతువులకు బలాన్ని కలుగచేస్తాయి. స్థూలకాయులు, మధుమేహ రోగులు కూడా పాలు సేవించవచ్చని, చెడు కాదని పరిశోధకుల పరిశీలన. ఒకవేళ పాలలోని లాక్టోజు ( ్చఛ్టిౌట్ఛ) పడకపోతే మాత్రం వాంతులు, విరేచనాల వంటివి కలుగుతాయి. వైద్యుని సంప్రదించడం, పాలు సేవించడం మానెయ్యటం వంటి జాగ్రత్తలు అవసరం.గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య సారాంశం:భూరి రసధాతు సారంబె క్షీరమనగశుభము బల్యంబు మేధ్యంబు శుక్రకరముసప్తధాతు పుష్టికర రసాయనంబుదేశియావు పాలకు సదా తిరుగు లేదు.పాల మీగడ వెన్నలున్ పరమ బలముకూర్మి సేవింప నవనీత గుణము జూచిస్థూలకాయంబు తగ్గును శోష లేకభతర భూమికి గోమాత వరము సుమ్ము! డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
మన కులతూరు భాష.. సాయిమంతే!
నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం.. – బుట్టాయగూడెం :భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధానమైనది. వీరి భాష, సంస్కృతి, సంప్రదాయ విధానం భిన్నంగా ఉంటుంది. కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు. మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు–దేవుని వర్గం), రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరిగానే తమను తాము వారి పరిభాషలో “కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ, కమ్మరకోయ, ముసరకోయ, గంపకోయ, పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7 వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధకులు చెప్తున్నారు. డోలు కోయలు, కాక కోయలు, మట్ట కోయలు, లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి “్ఙదూడ తింతిన్ఙే్ఙ, నీ పేరు ఏంటి అనడానికి “మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి “మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి “మీకు ఎరికి వత్తే ‘, ఇటురా అని పిలవడానికి “ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడుతున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70 శాతం కోయ భాష మాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60 వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు. అతి ప్రాచీన భాషల్లో ఒకటి తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేకపోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ తెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటున్నారు. -
భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగం
భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా పూజిస్తారు. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపచెట్టు కలపను తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగు సేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేపచిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. వేపపువ్వును ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు ఉగాది పచ్చడిలో చేదు రుచికోసం వాడతారు. వేపచెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా ఎంపికయింది. వేపగాలి పీల్చని, వేపపుల్లతో పళ్లు తోమని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలలో వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి శుభకార్యంలోనూ మొదటగా వేపచెట్టునే పూజిస్తారు. ఇలా వేపచెట్టు మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగమయింది. -
రేపటి నుంచి చరిత్ర, సాహిత్యాలపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: చరిత్ర, సాహిత్యాలపై ఈ నెల 23 నుంచి రెండ్రోజుల పాటు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. చర్రితలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, వారధి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల నుంచి అసఫ్జాహిల వరకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం అనే అంశాలపై సదస్సు జరుగుతుందన్నారు. నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్రను పరిశోధకులు రాజారెడ్డి, మనం మరిచిన తెలంగాణ చరిత్రపై జితేంద్రబాబు, కాకతీయుల నాటి లిపి విశేషాలు, లేఖన సంప్రదాయాలపై ఉమామహేశ్వర శాస్త్రి పత్ర సమర్పణ చేస్తారన్నారు. ప్రముఖ చరిత్రకారులు సూర్యకుమార్ కాకతీయుల కొత్త శాసనాలపై, ఆచార్య ఎం. సుజాతరెడ్డి కుతుబ్షాహి కాలం నాటి తెలుగు భాషా వికాసంపై, స్వతంత్ర కాకతీయ పాలకుల వివరాలపై శ్రీనివాసులు పత్ర సమర్పణ చేస్తారన్నారు. సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
భారత్పర్వ్లో ఆకట్టుకున్న ‘తెలంగాణ’
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన భారత్పర్వ్ లో తెలంగాణ సంస్కృతి, కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్క చోటుకి చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ఏటా 6 రోజుల పాటు భారత్పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణకు సంబంధించిన పేరిణీ శివతాండవం, ఒగ్గు రవి శిష్యబందం డోలు విన్యాసాలు, కళాకారుల సాంస్కతిక నత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్కుమార్, ఏఆర్సీ వేదాంతం గిరి పాల్గొన్నారు. -
కోనసీమలో ఆక్వా పంజా
-
సంస్కృతిని మించింది ఏదీ లేదు : సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ ఆలోచింపజేసే ట్వీట్లు చేస్తూ మనం ట్విట్టర్ కింగ్ గా ముద్దుగా పిలుచుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరొకసారి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ అందరిని ఆలోచనలో పడేసింది. క్రికెట్కు గుడ్ బై చెప్పిన తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఒకవైపు వ్యాఖ్యాతగా, మరొకవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టులతో అభిమానులకు టచ్లో ఉంటున్నాడు. దీనిలో భాగంగానే ఓ ఆసక్తికరమై ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రపంచం ఓవైపు ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతోంది. రోజు రోజుకు కొత్త కొత్త మోడల్లతో వస్త్రరంగం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అయితే మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో తెలిపే ఓ సంఘటనకు సంబంధించి ఓ ఫోటోను వీరేంద్రసెహ్వాగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఓ కామెంట్ పెట్టారు. ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన వేదికపై పూర్తి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో హాజరయిన వ్యక్తి ఫోటోను పోస్ట్ చేసి.. సంస్కృతిని మించిది ఏదీ లేదు అంటూ ఓ కామెంట్ పెట్టారు. Culture se badhkar kuch nahi A post shared by Virender Sehwag (@virendersehwag) on Nov 12, 2017 at 8:24am PST దీనిపై స్పందించిన నెటిజన్లు.. వేసుకున్న దుస్తులనుబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయలేం... ఆ వ్యక్తి వస్త్రాధరణ మనకు చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నా వారి దేశంలో అది సర్వసాధారణం..అంటూ స్పందించారు. 21వ శతాబ్ధంలోనూ వెస్టర్న్ కల్చర్ను ఫాలో కాకుండా ఉన్నారంటే ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి అంటూ మరో నెటిజన్ పొగడ్తలతో ముంచెత్తారు. న్యూయార్క్లోని యూనైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో 'గ్లోబల్ వార్మింగ్' పై ఈ ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో వెస్టర్న్ గునియా(పపువా)కు చెందిన ఓ అధికారి పూర్తి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అప్పుడు ఆయన వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. వివిధ దేశాల నుంచి హాజరైన అధికారుల మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తి న్యూ గునియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. -
మతం పేరుతో భయపెడుతున్నారు: ప్రకాశ్రాజ్
చెన్నై: మతం, సంస్కృతి, నైతికత పేరుతో కొందరు ప్రజలను భయపెడుతున్నారంటూ నటుడు ప్రకాశ్రాజ్ శుక్రవారం ఆరోపించారు. ‘నైతికత పేరుతో నా దేశపు వీధుల్లో యువ జంటలపై దాడులు చేయడం భయపెట్టడం కాకపోతే మరేమిటి? గోవధ చేశారేమోనన్న చిన్న అనుమానంతో మనుషులపై సామూహిక దాడులు చేసి హతమార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భయపెట్టడం కాక మరేంటి? అసమ్మతితో చిన్న స్వరం వినిపించినా వారిని బెదిరించడం, దూషించడం అంటే భయపెట్టడం కాదా?’ అని ట్వీట్లు చేశారు. -
అదిగో పులి
‘అదిగో పులి’ అని నాన్నను ఆట పట్టిద్దాం అన్నా.. ‘ఏదీ పులి? అని నాన్నే అడుగుతున్నాడు. లక్షకు పైగా ఉండేవట! 96 వేల పులుల్ని మనమే చంపేసుకున్నామట! అప్పటికి గానీ బుద్ధి రాలా. ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం. వాటిని కాపాడుకోలేకపోతే అడవి వెలవెల పోదూ! అవును. పులిని కాపాడుకోవాలి. మొక్కల్ని పెంచుకున్నట్లే పులినీ కాపాడుకోవాలి. వినాయకుడి వాహనం ఎలుక. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ విష్ణుమూర్తి వాహనం గద్ద. శివుడి వాహనం ఎద్దు. అగ్నిదేవుడి వాహనం మేక. ఇంద్రుడి వాహనం తెల్ల ఏనుగు. కాలభైరవుడి వాహనం కుక్క. శనైశ్చరుడి వాహనం కాకి. సరస్వతి వాహనం హంస కుమారస్వామి వాహనం నెమలి. ఆంజనేయుడి వాహనం ఒంటె. దుర్గాదేవి వాహనం సింహం. పార్వతి వాహనం పులి. అంత గొప్ప దేవతలు ఇలా పక్షులను, జంతువులను వాహనాలుగా ఎందుకు చేసుకున్నారంటారు? సృష్టిలో ప్రతి ప్రాణికీ సముచిత స్థానం ఉంది, దేని విలువ దానిదే, దేని గొప్ప దానిదే... దేనినీ తక్కువగా చూడకూడదని చెప్పడానికే. అందుకే... నీతినిజాయితీలతో ఉన్న వారిని పులిలా బతికాడంటారు. ధైర్యసాహసాలు గల స్త్రీని ఆడపులితో పోలుస్తారు. పులి కడుపున పులే పుడుతుందంటూ పులి గురించి గొప్పగా చెబుతారు. అంటే అనాదిగా పులికి భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానముంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటేనే మన సంస్కృతి సుసంపన్నం అవుతుంది. హి ఈజ్ డెడ్! సంసార్ చంద్ చనిపోయినట్లు జైపూర్లోని ఎస్.ఎం.ఎస్. ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పులులు పండగ చేసుకోవలసిన రోజది! ఆ రోజు.. మార్చి 18, 2014. అప్పటికి వారం క్రితమే సంసార్ చంద్ని రాజస్థాన్లోని ఆళ్వార్ సెంట్రల్ జైలు నుంచి ఎస్.ఎం.ఎస్. ఆసుపత్రికి తరలించారు. అతడి ఊపిరి తిత్తులు, మెదడు, వెన్నెముక అప్పటికే పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. ఆసుపత్రికి తెచ్చాక చివరి దశ క్యాన్సర్తో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోంచి అట్నుంచటే మరణంలోకి! మరణం అతడితో పాటు, అతడి శిక్షా కాలాన్నీ తీసుకెళ్లి పోయింది. సంసార్ చంద్ నటోరియస్ పోచర్! పేరుమోసిన పులుల హంతకుడు. చంపేస్తాడు. చర్మాన్ని అమ్మేస్తాడు. పులి గోరు నుంచి, పులి కోర వరకు దేన్నీ వదలడు. 2003 అక్టోబర్ నుంచి 2004 సెప్టెంబర్ వరకు ఆ ఒక్క ఏడాదిలోనే సంసార్ చంద్ 40 పులి చర్మాలు, 400 చిరుతపులి చర్మాలు దేశం నుంచి తరలించినట్లు అతడి డైరీలో ఉన్న వివరాలను చూసి రాజస్థాన్ పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. తర్వాత రెండేళ్లకు జరిగిన సీబీఐ విచారణలో తను మొత్తం 470 పులిచర్మాలను, 2,130 చిరుతపులుల చర్మాలను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సంసార్ చంద్ ఒప్పుకున్నాడు. అప్పటికి భారతదేశంలో మిగిలి ఉన్న పులుల జనాభా కేవలం 1400 మాత్రమే! పులి దొరికితే సంసార్ చంద్లాంటి వాళ్లు పండగ చేసుకుంటారు. కానీ మనిషి దొరికితే పులి అలా పండగ చేసుకోదు. కనీసం తోకతో కూడా చూడదు. కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే మార్జాలమైనా ‘మ్యావ్’ అంటుందేమో కానీ పులి మనుషుల్ని పట్టించుకోదు. తను డిస్టర్బ్ కానంత వరకూ తను ఎవర్నీ డిస్టర్బ్ చెయ్యదు. అది పులి స్వభావం! ఇదొక్కటే కాదు పులి స్వభావం. పులి ఇంకో పులిని చూసో, సింహాన్ని చూసో, ఏనుగును చూసో గాండ్రించడం కూడా చాలా అరుదు. ఒక దానితో ఒకటి మాట్లాడుకోవడానికి మాత్రమే పులులు గాండ్రిస్తాయి. వాటికి విపరీతమైన సంతోషం వేసినప్పుడు కూడా అవి మనిషిలా కెవ్వున అరవ్వు. ధ్వనులు చెయ్యవు. జస్ట్ కళ్లు మిటకరిస్తాయి. అంతే. లేదంటే తన్మయత్వంతో కాసేపు కళ్లు మూసుకుంటాయి. ధ్యానుల్లా ఉంటాయి. వాటి ధ్యాసలో అవి ఉంటాయి. పులుల లైఫ్ స్టెయిల్లో ప్లానింగ్ ఉండదు. అప్పటికప్పుడే ఏదైనా. ఆకలైతేనే వేటాడతాయి తప్ప, ఆటకోసం వేటాడవు. చెట్లు ఎక్కాలనిపిస్తే ఎక్కే ప్రయత్నం చేస్తాయి. నీటిలో ఈదాలనిపిస్తే ఈదుతాయి. స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. స్వేచ్ఛగా రాజ్యాలనూ ఏర్పరచుకుంటాయి! సరిహద్దు గుర్తులుగా మనుషులు కంచెలు ఏర్పాటు చేసుకుంటే.. పులులు తమ మూత్ర విసర్జనతో బోర్డర్స్ను గీసుకుంటాయి. ఆ ‘వాసన గీతల్ని’ గుర్తుపెట్టుకుంటాయి. ఈ గీతల మధ్య మగ పులి రాజ్యం 60–100 చ.కి. మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఆడ పులి రాజ్యం 20. చ.కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది. వందేళ్ల క్రితం వరకు ఈ భూమ్మీద పులి రాజ్యాలు ఉండేవి! టర్కీ నుంచి రష్యా వరకు ఆ రాజ్యాలు వ్యాపించి ఉండేవి. ప్రపంచం మొత్తం మీద లక్ష పులులు ఉండేవి. అడవులు తగ్గిపోతూ, అక్రమ వేటగాళ్లు ఎక్కువైపోయాక ఈ వందేళ్లలో పులిరాజ్యం తగ్గి తగ్గి వంద నుంచి ఏడుశాతానికి వచ్చేసింది. పులుల సంఖ్య తగ్గి తగ్గి మూడు వేలకు వచ్చేసింది. జాతులు కూడా అంతే. తొమ్మిది జాతులు ఉండేవి. ఇప్పుడు ఆరు జాతులే మిగిలాయి. ఆ ఆరింటిలో రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి. అదే ఇప్పటి మన జాతీయ జంతువు. షి ఈజ్ నాట్ డెడ్ దగ్గరగా వెళ్లి చూశాడు అర్జన్ సింగ్. అందమైన చిరుత! ఇంకా చనిపోలేదు. చనిపోతూ ఉంది! ఆ రాత్రి ఆ ఘాట్ రోడ్పై అంతకు కొన్ని క్షణాల క్రితమే ఆ చిరుత అతడికి కనిపించింది. హెడ్లైట్స్ తాకిడికి అది తన కళ్లను చికిలించింది. జీపులోంచి తుపాకీ తీసి దాని గుండెల్లోకి కాల్చాడు అర్జన్ సింగ్. తూటా తాకిడికి నేలపై నెమ్మదిగా ఒరిగిపోతూ చివరి చూపు చూసింది చిరుత అతడిని. ఆ బేల చూపుకు, ఆ జాలి చూపుకు అర్జన్ సింగ్ గుండె పగిలిపోయింది. దుధ్వా అడవుల్లో అతడి హృదయ రోదన ప్రతిధ్వనించింది! పశ్చాత్తాపంతో అతడి మనసుకు అయిన గాయం ఆ రాత్రంతా కారుణ్యాన్ని స్రవిస్తూనే ఉంది. తెల్లారే సరికి ఆ ఆకతాయి వేటగాడు, పులుల సంరక్షకుడిగా పునర్జన్మించాడు! ‘భూమ్మీద ఎక్కడా క్రూరమైన జంతువులు లేవు. క్రూరమైన మనుషులు మాత్రమే ఉన్నారు’.. రాత్రంతా మేల్కొనే ఉండి, మర్నాడు ఉదయాన్నే అతడు రాసుకున్న మాటలవి! ఆ తర్వాత మనిషే మారిపోయాడు. ‘తార’ అనే పులిని తెచ్చుకుని పెంచుకున్నాడు. దానికి పుట్టిన తొమ్మిది పులి పిల్లల్నీ తనే సాకాడు. పులిని పెంచుకోడానికి చట్టం అడ్డుపడింది. ఇందిరా గాంధీ నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇది జరిగింది 1970లలో. అప్పటికి అతడు తన 50లలో ఉన్నాడు. ఆ తర్వాత 93 మూడేళ్ల వయసులో చనిపోయాడు. అర్జన్ ఒక వేళ తన పాప పరిహారం వల్ల ఇప్పటికింకా జీవించే ఉంటే వచ్చే ఈ ఆగస్టు 15కి అతడు నూరేళ్ల నిండు మనిషి అయి ఉండేవాడు. ఏటా మనం జరుపుకుంటున్న పులుల పండగను చూసి సంబర పడి ఉండేవాడు. ‘టైగర్స్ డే’ని ప్రపంచం 2010 నుంచి జరుపుకుంటోంది. అదే ఏడాది జన వరి 1న ఆయన చనిపోయారు. కనుక ఆయనకు ఈ పండగ గురించి తెలీదు. ఇంకో సంగతి కూడా ఆయనకు తెలిసే అవకాశం లేదు. పులుల సంతతి పెరుగుతోంది. బహుశా ఆయన ఆత్మ దుధ్వా అడవుల్లో సంచరిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఈ మాట విని ఉప్పొంగిపోయే ఉంటుంది. అర్జన్ సింగ్ చనిపోయేనాటికి మన దేశంలో ఉన్న పులుల జనాభా కేవలం 1700 మాత్రమే. పులి పక్కన ఉంటే ధైర్యంగా ఉండదు. భయం వేస్తుంది. కానీ పులి పక్కన ఉన్నామంటే లోకం మనల్ని ధైర్యవంతులుగా చూస్తుంది. అది పులి గొప్పతనం. బలం ఉండీ క్రౌర్యాన్ని ప్రదర్శించకపోవడం గొప్పే కదా! ఈ రోజు పులుల్ని ప్రేమించే మనుషుల పండుగ. ‘ఇంటర్నేషనల్ టైగర్స్ డే’. అయినా పులుల్ని ప్రేమించని మనుషులు ఎక్కడైనా ఉంటారా? ఆ లుక్కుకే పడిపోతారు. వన్యమృగం అయిపోయింది కానీ.. మనతో పాటు షికారుకీ, షాపింగుకీ వచ్చే మచ్చికే ఉంటే.. ముద్దొచ్చినప్పుడల్లా పులి చంక ఎక్కేయమూ! అప్పటికీ వెచ్చగా ఒక ‘హగ్’ ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నాం. పులికి షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నాం. పులితో సెల్ఫీకూడా దిగేస్తున్నాం. పులిని టచ్ చేయడం అంటే.. చిన్నప్పుడు పోలీసును చూసి స్నేహపూర్వకంగా నవ్వే ధైర్యం చేయడం లాంటిది. ఇలాంటి ధైర్యవంతులు ఎక్కువవడంతో అమెరికాలో మూడేళ్ల క్రితమే పులిని టచ్ చెయ్యడం బ్యాన్ చేశారు. ఎవరైనా టచ్ చేశారా.. పులేం చేయదు. పులుల చట్టం 500 డాలర్లు (32 వేల రూపాయలు) ఫైన్ వేస్తుంది. మిగతా దేశాలు కూడా పులుల క్షేమ, సంక్షేమం కోసం ఇలాంటి చట్టాలు తేవాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ టచ్ చేయనిస్తే, రేపు వేటాడ్డానికి చూస్తాడు మనిషి. అలాంటిది వాడి క్యారెక్టర్. అందుకే ఈ జాగ్రత్తలు. ఈ పండగలు. సంసార్ చంద్.. అర్జన్ సింగ్ వీళ్లిద్దరూ లేకుండా పులుల చరిత్రే లేదు. సంసార్ చంద్ భారతదేశ చరిత్రలోనే పేరుమోసిన పులుల స్మగ్లర్. అర్జన్ సింగ్ పరివర్తన చెందిన పులుల వేటగాడు. 1940లలో సంసార్ చంద్ కుటుంబీకులు ఢిల్లీలో ఉన్ని వస్త్రాలను విక్రయిస్తుండేవారు. ఆ విధంగా ఇండియా, నేపాల్, టిబెట్లలో ఏర్పడిన సంబంధాలను సంసార్ చంద్ పులుల అక్రమ వేటకు, స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నాడు. తొలిసారి 1974లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. 1982లో శిక్ష పడింది. కానీ ఆ తీర్పును సవాలు చేసి, చివరికి పదేళ్ల తర్వాత 18 నెలల స్వల్పకాల జైలు శిక్షతో బయటపడ్డాడు. పులుల అక్రమ వేటపై అతడి మీద మూడు రాష్ట్రాలలో 21 కేసులు నమోదై ఉన్న సమయంలో పరారై పోయి నేపాల్లో తలదాచుకున్నాడు. చివరికి అతడిని జైపూర్లో పట్టుకున్నారు. జైలు శి„ý అనుభవిస్తుండగా ఆనారోగ్యంతో 2014లో మరణించాడు. ఇక అర్జన్ సింగ్ కనికరం లేని వేటగాడు. వన్యప్రాణలును పొట్టన పెట్టుకుని, అడవి తల్లికి కడుపుకోత మిగిల్చినవాడు. కానీ ఒకరోజు మారిపోయాడు. (ప్రధాన వ్యాసం చూడండి) ఉత్తర ప్రదేశ్ అడవుల్లో ఇల్లు కట్టుకుని, పులుల సంరక్షణ కోసం జీవితాంతం అక్కడే ఉండిపోయాడు. భారత్–నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని లఖింపూర్–ఖెరీ అటవీ ప్రాంతం ‘దుధ్వా నేషనల్ పార్క్’గా అవతరించడం వెనుక అర్జన్ సింగ్ కృషి మాత్రమే ఉంది. ఉత్తర భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన ‘జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్) తర్వాత, అంత పెద్ద పులుల సంరక్షణ కేంద్రం దుధ్వానే! ‘మనిషిలోని మానవత్వానికి మూగ జీవుల స్థితిగతులే కొలమానం’ అని అర్జన్ ఎప్పుడూ అంటుండేవారు. మే నెలలో నో ఎంట్రీ అభయారణ్యాన్ని సందర్శించడానికి మే నెలలో ప్రజలను అనుమతించరు. అరణ్యంలోని పులులను లెక్కించడానికి ఆ నెలను అనువైన సమయంగా పరిగణించి అందుకు ఉపయోగిస్తారు. ఆ నెలలో పులులు మండే వేసవి తాపం కారణంగా లోతట్టు ప్రాంతాల నుంచి కదిలి, నీళ్ల కోసం అడవి అంచులకు వస్తాయి. మే నెలాఖరు నాటికి క్షేత్ర సిబ్బంది వాటి సంఖ్యా వివరాలను తమ అధికారులకు సమర్పిస్తారు. (భారతదేశంలో పులులను చూడ్డానికి బంధవ్ఘర్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్), రణథంబోర్ నేషనల్ పార్క్ (రాజస్థాన్), కన్హా నేషనల్ పార్క్ (మధ్య ప్రదేశ్), జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్), సాత్పురా నేషనల్ పార్క్ (మధ్య ప్రదేశ్) బెస్ట్ స్పాట్లు అని ఈ నెల ప్రారంభంలో ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో సి.ఎన్.ఎన్. టూర్ చానల్ పేర్కొంది) వీటితో కలుపుకుని ఇండియాలో సుమారు 50 వరకు పులుల అభయారణ్యాలు ఉన్నాయి. పాదముద్రల సేకరణ పులుల గణాంకాలను సేకరించడానికి అటవీ సిబ్బంది అనుసరించే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. అసలు ఈ గణాంకాల సేకరణ కోసమే అటవీశాఖ 1973లో ప్రాజెక్టు టైగర్ ప్రారంభించింది. అప్పట్నుంచీ పులుల పాద ముద్రలను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. మనిషికీ మనిషికీ మధ్య వేలి ముద్రలు ఎలాగైతే భిన్నంగా ఉంటాయో, పులికీ, పులికీ మధ్య పాదముద్రలు అలాగే భిన్నంగా ఉంటాయి. కాబట్టి వీరు అడవులలో తిరుగుతూ పులి అడుగుజాడ ఏదైనా కనిపిస్తే, దాని అంచుల ఆకృతిని కాగితం మీద ట్రేస్లా గీసుకుని ప్లాస్టర్ ద్రవాన్ని ఆ ట్రేస్ నుంచి తీసిన మూసలో పోసి, అది గట్టి పడిన తర్వాత తీసి భద్రపరుస్తారు. మొత్తం మీద ఎన్ని రకాల పాద ముద్రలు లభించిందీ లెక్క చూసుకుని అడవిలోని పులుల కనీస సంఖ్యను వారు గణాంకాలలో చేరుస్తారు. అయితే అన్ని అభయారణ్యాలలోనూ పులుల లెక్కల్ని ఇలాగే తీస్తారనేం లేదు. రణథంబోర్ అభయారణ్యంలో పులుల పాద ముద్రలను కంప్యూటర్ సాయంతో శోధిస్తారు. కర్నాటక లోని అభయారణ్యంలో రేడియో కాలర్ విధానాన్నీ, రహస్య కెమెరాల సాయంతో పరారుణ కిరణాల ఆధారంగా పులులను ఫొటో తీసే విధానాన్ని కూడా అనుసరిస్తారు. టైగర్ జోలికి వెళితే.. చట్టం తాట తీస్తుంది వైల్డ్లైఫ్ (ప్రొటెక్షన్) అమెండ్మెంట్ యాక్ట్, 2006 ప్రకారం దేశంలో ఎక్కడైనా సరే పులులను వేటాడితే తొలిసారి నేరానికి 3 ఏళ్లకు తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలుశిక్ష. దాంతో పాటు 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా 2 లక్షల వరకు జరిమానా. రెండోసారి, ఆ తర్వాతి వరుస నేరాలకు 7 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, దాంతో పాటు 5 లక్షలకు తక్కువ కాకుండా 50 లక్షల రూపాయల వరకు జరిమానా. టైగర్ ఇండియా ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్య 4000 వేల లోపే. అందులో సగానికి పైగా భారత్లోనే ఉన్నాయి. భారత్ తర్వాతి స్థానాలలో రష్యా, ఇండోనేషియా, మలేషియా ఉన్నాయి. (గ్లోబల్ వైల్డ్ టైగర్ స్టేటస్ లెక్కల ప్రకారం) పులి వేట అడవికి రాజుగా వర్ణిస్తారే కానీ, పులిని వేటాడడం మాత్రం చాలా తేలికగా జరిగిపోతోంది. అక్రమ వేటగాళ్లు అనుసరించే విధానం ఇలా ఉంటుంది. జాడ కనిపెట్టడం: పులుల రాకపోకలను తెలుసుకోడానికి అక్రమ వేటగాళ్లు పులల పార్కుల పరిసర గ్రామాల్లో ప్రజలకు డబ్బు ఎరగా వేస్తారు. తుపాకీతో కాల్చడం: పులిని చంపడానికి సాధారణమైన బారు తుపాకులనే సర్వ సాధారణంగా ఉపయోగిస్తారు. వీలైనంత దగ్గర్లోకి వచ్చి, పులి గుండెకు గురి పెట్టి తుపాకీ పేలుస్తారు. వల పన్నడం: ఇనుప సంకెళ్లను నేల మీద అమర్చి, పైకి కనిపించకుండా ఆకులు, అలములు కప్పుతారు. పులి కాలు దాని మీద పడడంతోటే అందులో చిక్కుకు పోతుంది. చర్మం వలవడం: చనిపోయిన పులి దేహం నుంచి మొదటగా చర్మాన్ని వొలుస్తారు. తర్వాత దాని ఎముకలను బయటకు లాగి, గోనె సంచులలో నిల్వ చేస్తారు. ►భారతదేశంలోని దుధ్వా, వాల్మీకి సరిస్కా, రణథంబోర్, మేల్ఘాట్, ఇంద్రావతి, నాగార్జున సాగర్, పెరియార్, సిమిలి పాల్, పన్నా, పలమావూ, మానస్ అభయారణ్యాల నుంచి పులల అక్రమ వేటగాళ్లు పులులలను హతమార్చి నేపాల్, టిబెట్ల మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తుంటారు. ►చైనా చేరిన భారతదేశపు పులుల శరీర భాగాలు, ఆ దేశపు అవసరాలకు సరిపడిన తర్వాత, మిగిలినవి జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాంలకు సరఫరా అవుతుంటాయి. ►పులి దేహ భాగాలకు అతి పెద్ద టోకు సరఫరాదారు భారతదేశం కాగా, వాటికి అతి పెద్ద రిటైల్ వ్యాపారి మాత్రం చైనానే. నివేదన పులి చర్మాల అక్రమ రవాణా ప్రపంచంలో ఏ విధంగా జరుగుతోందో చాటుతూ లండన్కు చెందిన ఎన్విరాన్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఇ.ఐ.ఏ) 2004 అక్టోబర్లో ‘ది టైగర్ స్కిన్ ట్రెయిల్’ అనే సచిత్ర నివేదికను రూపొందించింది. అది ఎప్పటికీ ఒక ప్రామాణిక పత్రం. ఇన్పుట్స్ wwf., ఇతర సంస్థల నివేదికలు -
తెలంగాణ సంస్కృతి గొప్పది
హుజూరాబాద్ రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన, జానపద కళోత్సవాలు–17 వేడుకలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటంలో కళాకారుల కృషి అభినందనీయమన్నారు. కళల ప్రదర్శన చాలా కష్టంతో కూడుకున్న పనిఅని, వాటిని ప్రదర్శించడంలో కళకారులు పడుతున్న కష్టాలను ప్రజలు గుర్తించి ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. సంస్కృతిలో ఆట, పాటకు గుర్తింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళకారులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకుందన్నారు. కళాకారులు ఆట, పాటల ద్వారా ప్రజలను ఆకర్షిస్తారన్నారు. మహిళలు గుట్కా, గుడుంబాను అరికట్టడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి అడుగంటిపోయాయని, వాటికి పునర్జీవం పోయాల్సిన బాధ్యత కళాకారులపై ఉందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రస్థాయి పునరంకిత పురస్కార గ్రహితలకు అవార్డులను ప్రదానం చేశారు. మంత్రిని గిరిజన సంప్రదాయ వేషధారణతో అలంకరించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అ«ధ్యక్షుడు తాళ్లపల్లి రమేశ్, టీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, స్పందన సేవా సొసైటీ అధ్యక్షురాలు అనుమాండ్ల శోభారాణి, కళారవళి అసోసియేషన్ అధ్యక్షుడువిష్ణుదాస్ గోపాల్రావు, ప్రధాన కార్యదర్శి కన్నన్ దురైరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ సమ్మయ్య, రచయిత, గాయకుడు వానమామలై జగన్మోహనాచారి, గాయకులు మురళీమధు, కళాకారులు పంజాల రాంనారాయణరావు, ఎండీ.వహిదుల్లాఖాన్, బండ కిషన్, అనిల్కుమార్ గౌడ్ తదితరులున్నారు. -
మన ఆటలు ఆడుకుందాం
దాగుడు మూతా దండాకోర్ తాటికాయలకు పుల్లగుచ్చి దర్జాగా దొర్లించుకుంటూ వెళ్లే రెండు చక్రాల బండి, ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని క్షణాల్లో సృష్టించే పొగలేని రైలుబండి, ఒకటి నుంచి వంద ఒంట్లు లెక్కబెట్టిన బుజ్జి దొంగ కళ్లు తెరిచి చేసే భీకర వెతుకులాట, ఝుమ్మని తిరిగే బొంగరం, కూత ఆపకుండా గోదాలో నిలిచే ఆటగాడి పనితనం, పెచ్చులుగా పగిలే గోళీలు, పెరటి కొమ్మలకు ఊగే ఊయలలు, వరండాల్లో అష్టాచెమ్మా, వీ«థుల్లోన కుందుడుగుమ్మా... మన ఆటలు నిజంగా బంగారం. మన పిల్లల కోసం సంప్రదాయం సృష్టించిన తెలుగుదనపు సింగారం. బొద్దుగా ముద్దుగా ఉండే కుమారరత్నం పొద్దున లేస్తే టీవీకి అతుక్కుపోతాడు. నోరు తెరిస్తే పవర్ రేంజర్స్, పొకెమాన్ మాట్లాడతాడు. అవసరమైతే బేబ్లేడ్లు అడుగుతాడు. కాదంటే చాక్లెట్ ఫ్యాక్టరీ చదువుతానంటాడు. అమ్మాయికి ఎస్ఎంఎస్ల పిచ్చి. చాటింగ్లో తప్ప క్లోజ్ ఫ్రెండ్ ఎదురుగా నిల్చున్నా మాట్లాడదు. టైముంటే ట్వంటీ ట్వంటీ, నో అంటే టామ్ అండ్ జెర్రీ. వీళ్ల ఇష్టాలు వీళ్లవే. వీళ్ల కోసం పిజ్జాలు బర్గర్లు కాదనక్కర్లేదు... కాకపోతే అప్పుడప్పుడన్నా మన సద్దిబువ్వ సంగతి తెలియాలి. వాటర్ పార్కులు, హారర్ హౌస్లు ఎంజాయ్ చేయాల్సిందే... కానీ ఏడాదికోమారన్నా వరిచేల మీద నుంచి వీచే చల్ల గాలి వీళ్ల ఒంటికి తగలాలి. అమ్మమ్మ కలిపే ఆవకాయ ముద్ద నోటికి అందాలి. మట్టివాసన తెలియని వాళ్లకి మరే పరిమళం అంటదంటారు. మన సంస్కృతి తెలియనివారికి మరే సంస్కృతైనా అర్థం అవుతుందా? తెలుగు భాష తీయదనం పిల్లల నాలుకకు తగలాలని ఉద్యమిస్తున్నట్టే తెలుగు ఆటల రుచి వారికి చేరువ కావాలని ఎందుకు ఉద్యమించకూడదు? ప్రతిదీ ఒక ముచ్చట... పిల్లలంతా గోలగా మూగుతారు. జట్లు జట్లుగా పంటలు వేస్తారు. ఒక్కొక్కరూ ‘పండు’గా మారి చివరకు ఒకరిని దొంగ చేస్తారు. ఆ దొంగతో దాగుడుమూతలు ఆడతారు. ఆ దొంగతో కోతి కొమ్మచ్చి ఆడుతారు. ఆ దొంగను కుంటుకుంటూ వచ్చి కుందుడుగుమ్మలో అందరినీ పట్టుకోమంటారు. ఆ దొంగ మెడలు వంచి ‘ఒంగుళ్లూ దూకుళ్లూ’ వినోదిస్తారు. ప్రతిదీ ఒక ముచ్చట. జీవితంలో గెలుపోటములను నేర్పే కళ. అందని వాటిని అందుకోవడం, దొరకనివాటిని వెతుకులాడటం, అనువుకాని చోట తలను వంచడం, అడ్డంకులు ఉన్న చోట ఒంటికాలితోనైనా సరే గమ్యాన్ని చేరుకోవడం... మన ఆటల్లో నిగూడార్థాలు... నిబ్బరాన్ని నింపే రహస్య సూచనలు. ఖర్చు లేని వినోదం... ఒక క్రికెట్ కిట్ కొనాలంటే ఎంతవుతుంది? ఒక టెన్నిస్ రాకెట్కు ఎంత వెచ్చించాలి. ఒక సాయంత్రానికి షటిల్కాక్లు ఎన్ని సమర్పించాలి? వీడియో గేమ్స్ వెల ఎంత? కానీ మన ఆటల్లో ఎంత ఖర్చవుతుంది? చింతపిక్కలు, ఇటుక ముక్కలు, వెదురుకర్రలు, రూపాయికి ఇన్నేసి వచ్చే గోళీలు... అందుబాటులో వున్న వస్తువులనే క్రీడాసామాగ్రిగా చేసుకొని ఖర్చులేకుండా వినోదించడం మన గ్రామీణులు నేర్చిన విద్య. బాదం ఆకులు కుట్టుకోవడం తెలిసినవాడు పేపర్ప్లేటు వచ్చేదాకా తలగీరుకుంటూ నిలుచోడు. గమనించి చూడండి... మన ఆటలన్నీ ఇలాంటి నేటివ్ ఇంటెలిజెన్స్ను పెంచేవే. మళ్లీ చిగురించాలి... దాగుడు మూతలు, దొంగ పోలీస్, చుకు చుకు పుల్ల దాంకో పుల్ల, అణాకు రెండు బేరీ పండ్లు, ఒప్పుల కుప్ప వయ్యారి భామ, గిన్నె గిరగిరా, ఎత్తు పల్లం, చీర్ ఆట, ఏడు పెంకుల ఆట, బజారు బంతి, తొక్కుడు బిళ్ల, అష్టా చెమ్మా... ఇంకా ఎన్నో ఆటలు, తెలుగు నేల మీద ప్రాంతాల వారీగా ప్రాచుర్యం పొందిన ఆటలు ఉన్నాయి. గత తరాలు ఆడిన ఈ ఆటలు నేటి తరాలకు అందించకపోవడం వల్ల ఇవన్నీ అంతరిస్తున్నాయి. నేటి పెద్దలకు కథలు చెప్పే తీరిక లేనట్టే, ఈ ఆటలు ఆడించే తీరిక కూడా లేదు. మంచి అందుకోవడానికి పిల్లలు సదా సిద్ధంగా ఉంటారు. వారికి మన ఆటలు అందిస్తే ఆడుకుంటారు. లేదంటే మనది కాని బ్యాటు బాల్ అందుకుంటారు. క్రూరత్వాన్ని నేర్పే వీడియో గేముల్లో మునిగిపోతారు. గుంపు నుంచి విడివడి ఏకాంతంలో ఉంచే టీవీని ఆరాధిస్తారు. కనీసం ఈ వేసవి వారికి మన ఆటలు నేర్పాలని కోరుకుందాం. అందుకోసం కొన్ని ఆటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాం. గోళీలు: గోళీలతో నాలుగైదు ఆటలు ఆడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గోళీలను వృత్తంలో పెట్టి దూరం నుంచి కొడతారు. మరికొన్ని చోట్ల ‘దెబ్బ కొట్టి జానా’, ‘దెబ్బలూ జానాలూ’ ఆడతారు. ఆటలో పద్ధతులు ఎన్ని ఉన్నా గోళీల ఆటకు మాత్రం గ్రామాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ఆటలో కొందరు తమ గోళీలను పందెం కాస్తారు. దీనిలో ఓడేవారికి చిత్రవిచిత్రమైన శిక్షలను అమలు చేస్తుంటారు. ఇవి ఆడుదామా... వామనగుంటలు: ఆడపిల్లలు చింతపిక్కలతో ఆడే ఇష్టమైన ఆట వామనగుంటలు. ఈ ఆటలో చెక్క ఉంటుంది. చెరోవైపు ఏడు గుంటల చొప్పున 14 గుంటలు ఉంటాయి. మధ్యలో చెరోవైపు ఉన్న గుంటలను కాశీ అంటారు. వీటిలో పదమూడు చొప్పున చింతపిక్కలు వేస్తారు. వామనగుంటను ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఆడే అవకాశం ఉంది. ముందుగా ఒకరు గుంటలో ఉన్న పదమూడు చింతపిక్కలను తీసి మిగిలిన వాటిలో సర్దుతారు. చింతపిక్కలను సర్దుతున్నప్పుడు ఎవరైనా మధ్య గుంట దగ్గర ఆగిపోతే, మిగిలిన వారు ఆటను ప్రారంభించాల్సి ఉంటుంది. తమ వద్దనున్న చింతపిక్కలను ఆటలో పోగొట్టుకోవడం ద్వారా ఒకరు తరువాత ఒకరు చొప్పున ఈ ఆటలో ఓడిపోతారు. ఆట పూర్తవడానికి సుమారు గంటకు పైగా సమయం పడుతుంది. తొక్కుడు బిళ్ళ: తొక్కుడు బిళ్ళను ఎవరికి వారుగా, ఇద్దరు చొప్పన ఒక జట్టుగా ఆడతారు. ఇది పూర్తిగా ఆడపిల్లల ఆట. చెరోవైపు ఐదేసి గడులుంటాయి. ఆటకు వినియోగించే రాతి బిళ్ళను మొదటి గడిలో వేసి ఆటను ప్రారంభిస్తారు. గడి దాటుకుని మిగిలిన గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ వెళతారు. మొత్తం గడులను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత బిళ్ళను చేతులపైనా, తలపైనా, కాళ్ళపైనా, నుదుటిపైనా పెట్టుకుని గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ దాటాల్సి ఉంది. ఇవన్నీ విజయవంతంగా పూర్తిచేసిన వారు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అష్టాచెమ్మా: అడ్డంగా, నిలువుగా ఐదు చొప్పున గడులుంటాయి. నాలుగు చింతపిక్కలను సగానికి అరగదీసి ఆటను ఆడతారు. లేకుంటే సముద్రపు గవ్వలను వినియోగిస్తారు. ఒక్కొక్కరికి నాలుగు చొప్పున కాయలు ఉంటాయి. వీటిని అన్ని గడులను దాటుకుంటూ మధ్యలో ఉండే గడి(పంటగడి)లోకి తీసుకుని వెళ్ళాలి. నాలుగు చింతపిక్కలు పైకి పడితే చెమ్మా (నాలుగు), బోర్లా పడితే అష్టా (ఎనిమిది) చొప్పున పాయింట్లు ఇస్తారు. మధ్యలో ఒకరి మప్పులను మరొకరు చంపుకుంటారు. ఆట మధ్యలో కాయలను సేఫ్టీ(రక్షణ) గడిలో ఉంచుకునే అవకాశం ఉంది. ముందుగా ఎవరి కాయలైతే పంటగడిలో చేరతాయో వారే విజేతలవుతారు. అష్టాచెమ్మా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కర్రాబిళ్ళ: నిజానికి ఇది క్రికెట్కు జేజమ్మ. కర్రాబిళ్లను ఆడేందుకు చిన్న పిల్లలు పోటాపోటీగా ముందుకు వస్తారు. ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. మొదటి గ్రూపు చేసిన స్కోర్ను రెండో గ్రూప్ ఛేజ్ చేస్తుంది. మొదటి గ్రూపు చేసిన స్కోరును పూర్తి చేయలేకపోయినా, చేసేలోపలే ఆటగాళ్లందరూ అవుటైనా మొదటి గ్రూపు విజేతగా మారుతుంది. -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్పాష, తహసీల్దార్ టి.మైఖేల్రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
శివరాత్రి ,ఏం చేయాలి? ,ఎలా జరుపుకోవాలి?
ఎలా ఉండాలి? పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అదే మన సనాతన సంస్కృతి. ఏ పండుగ జరుపుకోవడానికైనా, అసలు కారణాలు తెలుసుకుంటే కానీ, ఆంతర్యం బోధపడదు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు పెద్దలు. • జీవారాధన ముఖ్యం మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. ఎందుకంటే, అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అన్నారు. అందుకే ‘జీవారాధనే శివారాధన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. • ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం. బాలలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధ సేవనం చేయాల్సిన వారికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయడం వల్ల ఉపవాస ఫలం ఉండదు. ⇒ ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను’ అని సంకల్పం చెప్పుకోవాలి. ⇒ ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. ⇒ మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతునివైపు మనసును తిప్పడం కష్టం. ⇒ శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. ∙ఆహారానికి, నిద్రకే కాదు... మాటలకు కూడా..! ⇒ శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. ⇒ వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారికి ఆరోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటప్పుడు అవసరమైనంతవరకే మాట్లాడండి, ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. • మహిమాన్వితం... మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ⇒ శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. -
ఇతిహాసాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు
–జిల్లా తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గన్నమరాజు సాయిబాబ కర్నూలు సీక్యాంప్: పురాణ ఇతిహాసాలే భారతీయ సంస్కృతికి ప్రతీకలని కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు గన్నమరాజు సాయిబాబ అన్నారు. వీపూరి వెంకటేశ్వర్లు రచించిన పోతన భాగవతము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం స్థానిక మద్దూర్నగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నమరాజు సాయిబాబ మాట్లాడుతూ పోతన భాగవత పుస్తకంలో భక్తి మార్గం, దేశ సంస్కృతికి సంబంధించిన అంశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రచయితల సంఘం సభ్యులు లక్ష్మయ్య, సుబ్బలక్ష్మి, రామారావు ప్రవీణ్, ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతిని మంటగలుపుతున్న సీఎం
– ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమాదేవి, ప్రభావతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిపేందుకు బీచ్ లవ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి ఆరోపించారు. భోపాల్లో డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఐద్వా జాతీయ మహాసభలు విజయవంతం కోసం చేపట్టిన చేపట్టిన ఆలిండియా జాతా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలుకు చేరుకుంది. జాతాలో వచ్చిన రాష్ట్ర నాయకులకు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సీక్యాంపు సెంటర్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్లను రద్దు చేసి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.నిర్మలమ్మ మాట్లాడుతూ..కర్నూలు జిల్లా కలెక్టర్ నియంతృత్వ పోకడలతో గోరుకల్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలివేలు, పి. నిర్మల, నగర అధ్యక్షురాలు ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
క్లస్టర్ విధానంలో సేంద్రియ సాగు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు విజయ్కుమార్ గోకవరం : క్లస్టర్ విధానం ద్వారా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతిసేద్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయ్కుమార్ తెలిపారు. గోకవరం మండలం వీరలంకపల్లిలోని కొరిపల్లి అప్పలస్వామి అనే రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 131 క్లస్టర్లలో రెండు లక్షల మంది రైతులతో సేంద్రియ సాగు చేపట్టామన్నారు. సుమారు 300 రైతులతో మండలాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఒక్కొక్క క్లస్టర్ నుంచి 30 మంది రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా మిగిలిన చోట్ల సేంద్రియ సాగును విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న పొలాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేకపోతున్నాయని విజయ్కుమార్ తెలిపారు. వాటితో పోలిస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలే ప్రకృతి వైపరీత్యాల వల్ల సోకుతున్న అనేక చీడపీడలను తట్టుకుని నిలబడగలుగుతున్నాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాల విక్రయ షాపులను త్వరలో అన్నిచోట్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ కేఎస్వీ ప్రసాద్, వ్యవసాయశాఖ సంచాలకుడు లక్ష్మణ్రావు, ఆత్మా పీడీ పద్మజ, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుబ్బారావు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ యువతా ప్రకృతి సాగు వైపు.. ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం): సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన యువత కూడా సేంద్రియ సాగుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు, రైతు సాధికారిక సంస్థ ఉపాధ్యక్షుడు పి.విజయ్కుమార్ అన్నారు.రైతులంతా సేంద్రియ సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయనన్నారు. వ్యవసాయశాఖ, కదలిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని చందా సత్రంలో నిర్వహిస్తున్న సహజ సేద్యం కళాజాతాలో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిరోధించి నాణ్యమైన దిగుబడిలే లక్ష్యంగా రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ప్రకృతి సేద్య ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జేడీఏ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యం కోసం వివిధ మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. అనంతరం ఆర్అండ్ బీ అతిథి గృహంలో జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు, ఏఈవో, ఎంపీఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ, ప్రకృతి సేద్య నిపుణులు వైవీ సుబ్బారావు, పవన్, రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేష్ పాల్గొన్నారు. -
ప్రశ్నించడం మంచి కల్చర్ కాదా?
న్యూఢిల్లీ: ప్రశ్న...ప్రశ్న...ప్రశ్న నుంచే ప్రపంచం ఇంతగా అభివద్ధి చెందిందని, ప్రశ్నతోనే మానవ వికాసం ప్రారంభమైందని కారల్ మార్క్స్ నుంచి ఖగోళశాస్త్రవేత్తల వరకు చెప్పారు. నేటి విజ్ఞాన సర్వస్వానికి ప్రశ్ననే ప్రాతిపదికని విజ్ఞులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మరి మన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిరణ్ రిజీజుకు మాత్రం ప్రశ్నించడమంటే అదో చెడ్డ అలవాటన్నది అభిప్రాయం. ‘తొలుత మనమంతా సందేహించడం, అధికారులను, పోలీసులను ప్రశ్నించడం మానుకోవాలి. ఇది ఎంతమాత్రం మంచి సంస్కతి కాదు. ఎప్పటి నుంచో మన భారతీయులు అనవసరంగా సందేహించడం, ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు’ అని రిజీజు మంగళవారం ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. భోపాల్లో జరిగిన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్పై నెలకొన్న సందేహాలను నివత్తి చేసుకోవడానికి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కనే విషయాన్ని కూడా ఆయన విస్మరించారు. సోమవారం నాడు జరిగిన సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ వివాదాస్పదం అవడం, రాజకీయ నాయకులు, అధికారులు చెబుతున్న కథనాలకు మధ్య పొంతన ఉండకపోవడం, నిర్జీవులపైకి కాల్పులు జరపుతున్న దశ్యాలు, లొంగిపోతామని చేతులూపుతున్న నిరాయుధులపై పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో పలు సందేహాలు, పలు ప్రశ్నలు తలెత్తిన విషయం తెల్సిందే. ప్రశ్నించడం ద్వారానే పత్రికా రంగంలో రాణించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఇస్తున్న గోయెంకా ఎక్స్లెన్స్ అవార్డులు బుధవారం ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన కేబినెట్లోనే ప్రశ్నించడం మంచి అలవాటుకాదన్న మంత్రి ఉన్నారన్న విషయం తెలుసా? -
విదేశాలకు బతుకమ్మ సంస్కృతి
కామారెడ్డి రూరల్ : తెలంగాణ సంస్కృతిని దేశ విదేశా ల్లో చాటి చెప్పేందుకు బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కల్వకుం ట్ల కవిత తెలిపారు. దుబాయ్లో తెలంగా ణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాటానికి వెళ్లిన ఆమెను అక్కడ శుక్రవారం కామారెడ్డి డివిజన్ ప్రాంత వాసులు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటామ ని ఎన్ఆర్ఐలు కవితతో పేర్కొన్నారు. ఎంపీని కలిసిన వారిలో కామారెడ్డి వాసులు ఆకుల సురేందర్, కళ్యాణి, దొంతి సురేష్రెడ్డి, రమణ, మొసర్ల శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
మన సంప్రదాయం – మన పండుగలపై ర్యాలీ
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం కేంద్రంలోని కాకతీయ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మన సంప్రదాయం – మన పండుగల ప్రాముఖ్యత తెలుపుతూ గురువారం ర్యాలీ నిర్వహించారు. హిందూవులకు బోనాలు, బతుకమ్మ పండుగలు, ముస్లింలకు పీర్లు, క్రైస్తవులకు సిల్వలను విద్యార్థులచే తయారు చేసి స్థానిక రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, వైస్ ఎంపీపీ పుల్లంల పద్మ ముత్తయ్య, సర్పంచ్ పుల్లంల అచ్చాలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రహీంఖాన్, మాజీ ఎంపీపీ బాజ యాదయ్య, సట్టు సట్టయ్య, ప్రజ్ఞాపురం సైదులు, పాఠశాల ప్రిన్సిపాల్ నడింపల్లి వెంకటేశ్వర్లు, రాపర్తి మధు, జినుకల కార్తీక్ పాల్గొన్నారు. -
సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
అహోబిలం (ఆళ్లగడ్డ): మన సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందామని కేరళ రాష్ట్రానికి చెందిన గురువాయర్ మందిర్ ప్రధానార్చకులు కూనంపల్లి శ్రీరాంనంభూదిరి స్వామి అన్నారు. లోక సంరక్షణార్థం వారం రోజుల పాటు భాగవత్ పారాయణం చే సేందుకు కేరళలోని ఎర్నాకులం భక్త సేవా సంస్థ సభ్యులు 150 మంది ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలానికి వచ్చారు. ముందుగా స్వామిని దర్శించుకుని పారాయణం ప్రారంభించారు. కార్యక్రమంలో మాలోల అతిథి గృహ మేనేజర్ భద్రినారాన్, అనంతకృష్ణన్, కృష్ణన్ పాల్గొన్నారు -
తెలంగాణ కల్చర్లో ఓ ఎనర్జీ ఉంది
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్లో ఓ ఎనర్జీ ఉంది. అది ఏంటీ? ఎలా ఉంటుంది? అనేది మాటల్లో చెప్పలేం. ఇక్కడ వారిలో ఒక ఉత్సుకత, ఆప్యాయత, మంచితనం ఉంటుంది. ఈ ప్రాంతలో చోటుచేసుకున్న ఉద్యమాల విశిష్టతను విని తెలంగాణ సంస్కృతికి ఆకర్షితురాలినయ్యాన’ని చెప్పారు ప్రముఖ అంతర్జాతీయ థియేటర్ స్పెషలిస్ట్ డాక్టర్ మాయటెంగ్ బెర్గ్ గిరిస్చిన్. ఈ నూతన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి నాటక విధానం తీసుకురావడమే తన లక్ష్యమంటున్న చిన్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. హైదరాబాద్కు రావడం ఇది రెండోసారి. చైనాలో పరిచయమైన ఇక్కడి ప్లానెట్ జీ సంస్థ సలహాదారు కుమారస్వామి తెలంగాణ సంస్కృతి, దాని ప్రాశస్త్యం గురించి వివరించారు. తొలిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిశాయి. ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు జరిగా యి. వాటి గురించి విన్నాక ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉందనిపించింది. థియేటర్ నిర్మాణానికి ఇక్కడ బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా మంచి ఆలోచనలతో ఉండడం గొప్ప విషయం. ఈ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. నాటక రంగ అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. తెలంగాణలో కొత్త నాటక విధానం తీసుకొచ్చేందుకు నా వంతు సహాయం చేస్తాను. 300 నాటకాలకు డైరెక్షన్.. మా స్వస్థలం స్విట్జర్లాండ్. పిన్లాండ్లో ఫిజికల్ థియేటర్ ఆర్ట్స్లో రీసెర్చ్ చేశాను. జర్మనీలో స్థిరపడ్డాను. మొదటి నుంచి ఆసియా, ఇండియా సంస్కృతిపై ఆసక్తి ఎక్కువ. చైనా, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, పిన్లాండ్, ఇండియా.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగాను. 300లకు పైగా నాటకాలకు డైరెక్షన్ చేశాను.యూరప్లో ఎంతో మంది నటీనటులను తీర్చిదిద్దాను. తెలంగాణ ప్రభుత్వం ‘న్యూ వేవ్ థియేటర్’కి శ్రీకారం చుట్టింది. జాతీయ ప్రమాణాలతో కథలు, డ్రామాలు సరికొత్తగా వస్తాయి. కథ, కథనం, నాటకీయత, శైలి, లైటింగ్, సెట్టింగ్.. లాంటి అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తాం. ఇక్కడ యువ నటులకు కొదవలేదు. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంది. -
శేఖర్బాబును ఆదర్శంగా తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండో రోజుకు చేరిన తెలంగాణ రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం అలరించిన వీరపాండ్య కట్టబ్రహ్మన నాటకం హన్మకొండ కల్చరల్ : పద్యనాటకం కోసం పందిళ్ల శేఖర్బాబు ఎన్నో త్యాగాలు చేశారని, తెలంగాణ కళాకారులందరూ ఆయనను ఆదర్శం గా తీసుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో పం దిళ్ల శేఖర్బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో హ న్మకొండ పబ్లిక్గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం శనివారం రెండో రో జుకు చేరింది. ఈ సందర్భంగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నమరాజు గిరిజామనోహర్బాబు అధ్యక్షతన జరిగిన ప్రదర్శనను ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించి మాట్లాడా రు. శేఖర్బాబు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన వారు కా వడం తమకు గర్వకారణమన్నారు. గ్రామీణ కళాకారులకు తెలంగా ణ ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ పౌరాణిక నాటక ప్రదర్శనలను చూడడం ద్వా రా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో శేఖర్బాబు తమతో కలిసి పనిచేశారని తెలిపారు. శేఖర్బా బు కళారంగానికి ఎనలేని సేవలు అందించారన్నారు. అనంతరం సా మాజిక చైతన్య కళాకారుడు, వల్లంపట్ల ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు వల్లంపట్ల నాగేశ్వర్రావును.. ఎమ్మెల్యే, సీపీ శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బోయినపల్లి పురుషోత్తమరావు(పంథిని), పందిళ్ల అశోక్కుమార్, వనం లక్ష్మీకాంతారావు, డాక్టర్ ఇందారపు కిషన్రావు,బూరవిద్యాసాగర్, జ్యోతి జయకర్రావు, ఆకుల సదానందం, బిటవరం శ్రీధర స్వామి, ఎం.సదానందచారి, ఎ.శ్యామ్సుందర్ పాల్గొన్నారు. అలరించిన నాటక ప్రదర్శన.. శౌర్య పరాక్రమాలకు మారుపేరుగా, స్వాతంత్య్రయోధుడిగా కీర్తిగాం చిన వీరపాండ్య కట్టబ్రహ్మన చరిత్రను ఆర్.గుండయ్య సమర్పణ లో, కె.విశ్వనాథశాస్త్రి, డాక్టర్ నర్సయ్య దర్శకత్వంలో ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహæనాట్యమండలి కళాకారులు అద్భుతంగా ప్రదర్శిం చారు. ఇందులో కె. నరహరి, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, బి. కిశో ర్, ఎస్. రామకిష్టయ్య, ఎస్. కిషన్, పి. బాలకృష్ణ, కె. అనిల్కుమార్, కె. అమ ర్. బి. నరహరి, ఎస్. విజయ్కుమార్, వి. పురుషోత్తం, కె. శివప్రసా ద్, ఎం. శ్రీనివాస్ తదితరులు నటించారు. కె.దత్తాత్రేయశర్మ సంగీ తం, కె.దత్తాత్రి, కె.వి.రమణ నిర్వహణ సహకారం అందజేశారు. కా గా, ఆదివారం సాయంత్రం నగరంలోని కాకతీయ నాటక కళాపరిష త్ సభ్యులు మకుటాయమానం భావించే గయేపాఖ్యాన ం నాటకం ప్రదర్శించనున్నారు. -
సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్షాప్లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్షాప్లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంతోనే సంస్కృతీ సంప్రదాయాలు
ప్రముఖ రచయిత డాక్టర్ లక్ష్మీనర్సమ్మ కొత్తగూడెం అర్బన్ : దేశ సంస్కృతీ సంప్రదాయాలు సాహిత్యం ద్వారానే అలవడుతాయని ప్రముఖ రచయిత డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ అన్నారు. కొత్తగూడెం క్లబ్లోని రాళ్లబండి కవితాప్రసాద్ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో లక్ష్మీనర్సమ్మ మాట్లాడారు. పుస్తక పఠనం విద్యార్థి దశ నుంచి ప్రారంభం కావాలని, దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల ప్రతి విషయంపై అవగాహన పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత స్థానిక చరిత్ర, పోరాటయోధుల గాధలు, కవులు, రచనలు, సాహిత్యం వెలుగు చూశాయన్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, రచయిత జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని, ఇష్టమైన పుస్తకం చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని అన్ని గ్రామాలకు పుస్తకాలు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. కొత్తగూడెం క్లబ్లో 4వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన అతిథులు పుస్తక పఠనంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి చంద్రమోహన్, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్బాబు, కవులు శీరంశెట్టి కాంతారావు, హనీఫ్, నలందా విద్యా సంస్థల చైర్మన్ ఎంవీ.చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’ సంస్కృతి ప్రతిబింబించాలి
జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు జోడేఘాట్ సందర్శన కెరమెరి : గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా పేయింటింగ్ వేయాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని అమర వీరుని గ్రామమైన జోడేఘాట్ను ఏపీవో జనరల్ నాగోరావుతో కలిసి సందర్శించారు. జోడేఘాట్లో కొనసాగుతున్న భీమ్ స్మారక పనులు పరిశీలించారు. మ్యూజియం, హంపీథియేటర్, స్మారక స్థూపం తదితర నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లో జరిగే కొమరం భీమ్ వర్ధంతి లోపు జీవం ఉట్టి పడేలా పేయింటింగ్ వేయాలన్నారు. ఆయా గోడలపై గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆభరానాలు, ఆచార వ్యవహరాలు, క్లుప్తంగా కనిపించేలా పేయింటింగ్ ఉండాలన్నారు. టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్, ఏఈ ఆంజనేయులు, ఐటీడీఏ ఏపీఆర్వో దశరథ్, కొమరం భీమ్ మనవడు సోనేరావు, కొమరం భీమ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. -
భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల అమరావతి (గుంటూరు రూరల్) : సంప్రదాయాలను కాపాడుకోవటం మన ధర్మమని, భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని ప్రముఖ సినీ గేయరచయిత, పేరడీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. మంగళవారం అమరావతిలోని అమరలింగేశ్వర ఘాట్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల పుణ్యంతోపాటు ఆరోగ్యం లభిస్తుందన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి వ్యక్తికి ఉందన్నారు. అనంతరం అమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కళా ప్రేమికులకు గూగుల్ కొత్త యాప్!
న్యూఢిల్లీః ఇంటర్నెట్ దిగ్గజం.. గూగుల్ సెర్ష్ ఇంజిన్ మరో కొత్త యాప్ ను ప్రారంభించింది. భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి సేకరించిన ప్రసిద్ధ రచనలు, కళాఖండాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ కొత్త యాప్ ను కళా ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకోసం గూగుల్ కొత్తగా 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ను సృష్టించింది. యాప్ తో పాటు వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోని అనేక కళలకు సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచి కళాభిమానులకు దగ్గరయ్యేందుకు.. సెర్చ్ ఇంజన్ వినూత్న ప్రయత్నం చేసింది. విశ్వవ్యాప్తంగా 70 దేశాల్లోని మ్యూజియాల్లోని అనేక కళాఖండాలు, సుప్రసిద్ధ రచనలను గురించి తెలుసుకునేందుకు సహాయపడేట్లుగా ఈ కొత్త యాప్ ను గూగుల్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన అనువర్తనం ద్వారా.. ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన బీహార్లోని నలంద విశ్వవిద్యాలయ చరిత్ర వంటి ఏదైనా కళలు, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు శోధించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రముఖ చిత్రకారులు, ఆధునిక భారతీయ చిత్రకళ వంటి అనేక విషయాలను కళా ప్రేమికులు గూగుల్ 'ఆర్ట్ అండ్ కల్చర్' యాప్ ద్వారా తెలుసుకోవచ్చని గూగుల్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ ప్రొడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్బోర్న్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశం లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను కూడా గూగుల్ కార్డ్ బోర్డ్ అందుబాటులోకి తెస్తోంది. ఈ హెడ్ సెట్ ద్వారా 1978 లో స్థాపించిన అతిపెద్ద భారత కళా, సాంస్కృతిక సంగ్రహాలయంలో వినియోగదారులు వాస్తవిక కళా, సాంస్కృతిక పర్యటన చేసే అవకాశం ఉంటుందని చెప్తోంది. అలాగే ఈ కొత్త గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ను యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
భాషను... యాసను మరువకూడదు
‘‘కళ అనేది నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉండాలి. కళలు మన సంస్కృతిలో అంతర్భాగం. మన భాషను, యాసను మరువకూడదు’’ అని ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. యునెటైడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా లండన్లో నిర్వహించిన ‘జయతే కూచిపూడి జయతే బతుకమ్మ’ సాంస్కృతిక వేడుకలకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళలు, సంస్కృతి ప్రపంచానికి చేరువ కావడానికి తాను ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్)గా ఉండటానికి సిద్ధమే అన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ - ‘‘సినిమాల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తాను. తెలుగునాట వివిధ ప్రాంతాలకు చెందిన జానపద గీతాలు నా సినిమాల్లో ఉండేలా చూసుకుంటాను. మన సంప్రదాయాల్ని భావితరాలకు చేరువ చేయడంలో ఈ తరహా ఉత్సవాలు ఎంతో సహాయపడతాయి. దీనికి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జానపద నృత్య ప్రదర్శన ఆహూతులను, ప్రేక్షకులను అలరించింది. ఈ వేడుకల్లో పవన్ లుక్ అందర్నీ ఆకర్షించింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఈ లుక్తో కనిపిస్తారని సమాచారం. -
కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి
లండన్: తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో ఆదిమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కష్టమే! దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న మానవ జాతి పూర్వికుల సంస్కృతి, సంప్రదాయాలు ఈ తరానికే కాకుండా భవిష్యత్తులో మరే తరానికి తెలియకుండా కాలగర్భంలో కలసిపోయే ప్రమాదం ఏర్పడింది. శ్యాన్ తెగగా పిలిచే వీరే మానవ తొలి జాతి వారసులని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిపుణులు తేల్చారు. వీరు 20 వేల ఏళ్ల కిందటి నుంచే దక్షిణాఫ్రికా అటవి ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు దక్షిణాఫ్రికా నుంచి బోట్స్వానా, అంగోలా, నమీబియా వరకు విస్తరించి ఉన్నారు. బోట్స్వానాలో వీరిని బసర్వాలని పిలుస్తారు. వీరు సంచార జీవితమే ఎక్కువగా గడుపుతారు. బోట్స్వానా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి ప్రభుత్వం మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. వారికి పునరావాసం కల్పిస్తోంది. ఆధునిక ఆరోగ్య వసతులతోపాటు పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. దీంతో వారి సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా మారిపోనున్నాయి. శ్యాన్ తెగ పిల్లలు ఇంగ్లీషు చదువులు నేర్చుకుంటే క్రమంగా మారి ఆదిమ భాష కనుమరుగై పోతుంది. ఇప్పటికే వారి నృత్య రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వారి సంప్రదాయ కళలు కూడా నశించి పోతున్నాయి. ఎంతో మంది చరిత్రకారులు, కళాకారులు ఆదిమ జాతుల కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఆదిమ జాతుల సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. ఎప్పటికో ఓ నాటికి అంతరించిపోయే సంస్కృతిని మనం క్రియాశీలకమని గుర్తించాలని, అప్పుడే అది ఏదో రూపంలో బతికి ఉంటుందని లండన్లోని బోట్స్వానా హై కమిషన్లో పనిచేసిన బిహేలా సెకిరే వ్యాఖ్యానిస్తున్నారు. -
నాటి ప్రాభవం ఫణిగిరి
ఈ నెల 21న బుద్ధ పూర్ణిమ ఫణిగిరి అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన ప్రాంతం 400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు మహాస్థూపంలో గత చరిత్ర ఆనవాళ్లు అరుదైన నాణేం, అపురూప శిల్పకళ తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం ఫణిగిరి. నల్గొండ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పరిమాణం, చారిత్రక ఆనవాళ్లను బట్టి ఒకప్పుడు బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తవ్వకాలు జరిపేకొద్ది చరిత్ర ఆనవాళ్లు తెలిపే కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బౌద్ధ క్షేత్రం గల ఈ కొండ పాము తల ఆకారంలో ఉండడంతో ఫణిగిరి అనే పేరు వాడుకలోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ద క్షేత్రాలలాగే బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు ఫణిగిరిలో అధికంగా వున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో మహాస్థూపం, చైత్య గృహాలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధ పాదాలు, ప్రతిమలు, బౌద్ద చిహ్నాలు, జాతక కలలు, సిద్దార్థ గౌతముడి జీవిత ఘట్టాలు, అపురూప శిల్పాలు, శాతవాహన, ఇక్ష్వాకుల మహావతరణ నాణేలు, మట్టి సున్నపు బొమ్మలు ఇలా ఎన్నో.. ఇక్కడ బయట పడ్డాయి. చరిత్రను తెలిపే ఆధారాలు శ్రీపర్వత విజయపురి (నాగార్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకరాజు ఎహుబలశాంతమూలిని 18 సంవత్సరాల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు ఇప్పటి వరకు దొరకగా 18 సంవత్సరాలు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది. ఇదే శాసనంలో శ్రీకృష్ణుని ప్రస్తావన కూడ ఉంది. ఇలా శ్రీకృష్ణుణ్ణి పేర్కొన్న తొలిశాసనం దొరకడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఫణిగిరిలో 2001 నుంచి 2007 వరకు వరకు 42 శాసనాలు, క్రీ.పూ 5 వ శతాబ్దికి చెందిన నాణేలు దొరికాయి. అంతే కాకుండా 400 బౌద్ధ గదులు, 40 ధ్యానమందిరాలు వెలుగుచూశాయి. శాతవాహనుల కన్నా బౌద్ధమతం ముందే ఇక్కడ ప్రవేశించిందనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. 1944లో నిజాం ప్రభుత్వం ఈ బౌద్ధ క్షేత్రాన్ని గుర్తించగా, ఇప్పటి వరకు బయటపడిన బౌద్ధ క్షేత్రాలలో ఫణిగిరి అతిపెద్దదని నాటి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. గతవైభవాన్ని తెలిపే అద్భుతమైన శిల్పకళ నాటి సంస్కృతిని నేటికీ కళ్లకు కడుతూనే ఉంది. తవ్వకాలలో బంగారునాణెం సాధారణంగా బౌద్దరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కాని ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96-98) విడుదల చేసిన 7.3 గ్రాముల బరువుగల బంగారునాణెం బయటపడింది. అంటే ఇక్కడ నుంచి బౌద్ధులు రోమ్కు వ్యాపారలావాదేవీలు జరిపారనేది తెలుస్తోంది. కొండ పక్కనే చెరువు ఫణిగిరి కొండపైన బౌద్ధారామం కింద కోదండరామ స్వామి అలయం పక్కనే పెద్ద చెరువు రాతిగుట్టల మధ్య ఉండడం గొప్ప విశేషం. నిజానికి ఇది మూడు చెరువుల కలయిక. ఒక చెరువు పై నుండి ఎస్సారెస్పి కాలువ వెలుతుండడంతో ప్రతి యేటా ఈ చెరువు నీటితో కళకళలాడుతుంది. ఈ చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకులు ఇందులో బోటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. పర్యాటక కేంద్రం ఈ బౌద్ధారామాన్ని సందర్శించడానికి చైనా, భూపాల్, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ తదితర దేశాలనుండి బుద్ధుని చరిత్ర పై పరిశోధనలు చేయడానికి వేలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, బౌద్ధ్ద సన్యాసులు, పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు. రక్షణలేని సంపద కొండ పై జరిగిన తవ్వకాలలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో వీటి కి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరాబాద్లోని మ్యూజియంకు తరలించారు. మిగిలిన వాటిని గ్రామంలోని ఓ పాత భవనంలో వుంచారు. ఘనమైన చరిత్ర వున్నా అటు ఆర్కియాలజీ శాఖ కాని, ఇటు దేవదాయ శాఖ, పర్యాటక శాఖగాని పట్టించుకోకపోవడంతో భావితరాలకు నాటి సంస్కృతి అందకుండా శిథిలమైపోతున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. - కొమ్మిడి సుధీర్రెడ్డి, సాక్షి, తిరుమలగిరి ఇలా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరికి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 82 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 84 కిలోమీటర్లు దూరం ఉంది. సమీప రైల్వే స్టేషన్ నల్గొండ. -
ఘనంగా డాక్టర్ రాజ్కుమార్ జయంతి
కోలారు : కన్నడ సినీ నటుడు డాక్టర్ రాజ్కుమార్ జయంతి వేడుకలను ఆదివారం నగరంలోని గాంధీవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నడ సేన అధ్యక్షుడు కళావిద విష్ణు మాట్లాడుతూ... రాజ్కుమార్ జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్నారు. కన్నడ భాష , సంస్కృతికి అనిరత సేవలు అందించిన డాక్టర్ రాజ్కుమార్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండు చేశారు. నగరంలో కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంకు డాక్టర్ రాజ్కుమార్ పేరు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ అభిమానుల సంఘం అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్కుమార్ అభిమానుల సంఘం గౌరవా ద్యక్షుడు ధన్రాజ్, పాత్రికేయుడు గణేష్, చేతన్బాబు, కోనా మంజునాథ్ తదితరులు ఉన్నారు. ముళబాగిలులో... ముళబాగిలు : కన్నడ నటుడు డాక్టర్ రాజకుమార్ జయంతి వేడుకలను ఆదివారం జయ కర్ణాటక ఆధ్వర్యంలో పట్టణంలోని సంత మైదానంలో ఘనంగా నిర్వహించారు.అ భిమానులు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కసాప మాజీ కార్యదర్శి శంకర్ కేసరి మాట్లాడుతూ... డాక్టర్ రాజ్కుమార్ చిత్రాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయక ర్ణాటక అధ్యక్షుడు నందకిశోర్, శక్తి ప్రసాద్, రాజు, శివప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో బెంగుళూరులో మరణించిన క సాప మాజీ అధ్యక్షుడు పుండలీక హాలంబి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
జీవానాభ్యుదయం
♦ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం ♦ రామనగరంలో కొనసాగుతున్న ‘జీవా గురుకులం’.. ♦ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2009లో ప్రారంభం.. ♦ కుల, మతాలకు అతీతంగా వేదపఠనం ‘విద్య లేని వాడు వింత పశువు’ అనేది నానుడి.. నేటి ఆధునిక సమాజంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా కొన్ని సందర్భాల్లో పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటప్పుడు విద్యతో మనిషి తెలుసుకున్న జ్ఞానమేమిటో బోధపడదు.. చుట్టూ ఉన్న సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేసే పాఠ్యాంశాలు ఉన్నప్పటికీ.. అవి కేవలం చదువుకోవడానికి పరిమితమయ్యాయి. ఇలాంటి విద్యకు భిన్నంగా.. చదువు, సంస్కారంతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ‘జీవా గురుకులం’ వేదికగా మారింది. మండలంలోని ‘జీవా’ ప్రాంగణంలో జీయర్ ఎడ్యుకే షన్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ‘వేద పాఠశాల’ ప్రత్యేకతపై ‘సాక్షి’ అందిస్తోన్న కథనం.. శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్ సమీపంలో గల శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో 2009లో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ‘జీవా గురుకులం’ ప్రారంభమైంది. ఈ వేద పాఠశాల చైర్మన్గా మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు వ్యవహరిస్తున్నారు. మొదట్లో 50 మంది విద్యార్థులతో ఆరంభించిన ఈ వేద పాఠశాలలో ప్రస్తుతం 186 మంది వేద విద్యను అభ్యసిస్తున్నారు. విలువలతో కూడిన విద్యాబోధనే ఈ గురుకులం ప్రత్యేకత. ఇక్కడ వేద విద్యతో పాటు నిత్య జీవితంలో అనుసరించాల్సిన మార్గాలను బోధిస్తున్నారు. విద్యార్థులు ఆంగ్లం, సంస్కృత భాషల్లో తర్ఫీదునిస్తున్నారు. 10 ఏళ్ల వ్యవధి కోర్సుతో విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్, డిజిటల్ తరగతులతో విద్యార్థులకు బోధన చేపట్టారు. విద్యార్థులకు ఇక్కడ ఉచిత భోజన, వసతి కల్పిస్తున్నారు. అన్ని వర్గాల వారికి అవకాశం.. గురుకులంలో ప్రవేశానికి కుల, మతాలకు అతీతంగా అవకాశం కల్పిస్తున్నారు. 8 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న వారిని రాత, మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రవేశ రుసుంగా రూ.5 వేలు రీ ఫండ్ డిపాజిట్ తీసుకుంటారు. చెల్లించే స్తోమత లేని వారికి మినహాయింపు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడి శా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ దేశానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. క్రీడల్లో రాణిస్తూ.. గురుకులం విద్యార్థులకు యోగా, కరాటే , ఎన్సీసీ, వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన పది మంది సభ్యుల బృందం ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి విద్యార్థులకు ఆయా అంశాల్లోతర్ఫీదునిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో యాదవ్ బుడోకాన్ కరాటేక్లబ్ నిర్వహించిన వైబీకేసీఐ ఇంటర్ డోజో చాంపియన్ షిప్ పోటీల్లో జీవా గురుకులం విద్యార్థులు 10 బంగారు, 17 వెండి, 12 కాంస్య పతకాలు సాధిం చారు. దీంతో పాటు సుమన్ బుడోకాన్ ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ, 18వ జాతీయ కరాటే, కుంగ్ఫూ చాంపియన్ పోటీల్లో ఒక బంగారు పతకం, 3 వెండి, 7 కాంస్య పతకాలు పొందారు. దినచర్య ఇలా మొదలు.. గురుకులంలో విద్యార్థుల దిన చర్య తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలవుతుంది. నిద్రలేచిన తర్వాత గంట పాటు యోగా, ఉదయం 6.30 గంటలకు స్వానుష్టానం, సంధ్యావందనం చేస్తారు. 8 గంటలకు ప్రార్థన, అల్పాహారం, 8.30 నుంచి తరగతులకు హాజరవుతారు. 11.30కు భోజనం, మధ్యాహ్న ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత సేవా కార్యక్రమాలు, రాత్రి 8.30కు ప్రార్థన, అనంతరం భోజనం, చదువుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అభిరుచి మేరకు.. గురుకులంలో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు ఫౌండేషన్, ప్రిలిమినరీ కోర్సులు నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో వారికి విలువలు, కట్టుబాట్లు, అలవాట్లను నేర్పిస్తారు. విద్యార్థులు ఇక్కడి వాతావరణం, బోధన తీరుకు అలవాటు పడితేనే పైతరగతులకు పంపుతారు. రెండేళ్ల తర్వాత విద్యార్థులకు ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇస్తారు. వేద అధ్యయనంతో పాటు అకాడమిక్ చదువులో బోధన చేపడతారు. విద్యార్థుల పరిజ్ఞానం ఆధారంగా ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అదర్వణవేదంతో పాటు సంస్కృతం, సాహిత్యం, వేదాంతం, దివ్య ప్రబంధం అంశాలతో పాటు అకాడమిక్ తరగతులను నిర్విహ స్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇక్కడి నుంచే దూరవిద్యాతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. 2012-13 నుంచి ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జ్ఞానం ఆచరణాత్మకంగా ఉండాలి.. మనిషి సంపాదించే జ్ఞానం ఆచరణాత్మకంగా ఉండాలి. తద్వారా సమాజానికి ఉపయోగకరంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే గురుకులం ఆశ యం. దేశానికి మంచి పౌరులను అందించడంమే ముఖ్య ఉదే ్దశం. - నీలం, వేద పాఠశాల ఇన్చార్జ్ శాస్త్ర అధ్యయానికి వేదిక.. కుల, మతాలకు అతీతంగా శాస్త్ర అధ్యయనం చేయడానికి వేద గురుకులం చక్కనివేదిక. ఇక్కడ విద్యార్థులు ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా తక్కువే అవుతుంది.గురుకులం నుంచి వెళ్లిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. - గోవర్ధనాచార్యులు, వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామవేదం నేర్చుకుంటున్నాను.. నేను ఇక్కడ 2010లో చేరాను. నేపాల్లోని ఖాట్మాండులో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఇందులో చేరాక తెలుగు, హిందీ, సంస్కృతం నేర్చుకున్నాను. ఇక్కడ అభ్యాసం పూర్తయిన తర్వాత నేను కూడా పురోహితం చేస్తాను. - ఖగేంద్ర, వేద పాఠశాల విద్యార్థి, నేపాల్ వాసి డిగ్రీ చదువుకుంటున్నాను.. వేద పాఠశాలలో నాలాయిరా దివ్య ప్రబంధం (తమిళం)తో పాటు దూర విద్యా విధానంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతున్నా. 8వ తరగతి వరకు చదవి మానేసిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చదువును కొనసాగిస్తున్నాను. - అభిషేక్ ఆచారి, వేద పాఠశాల విద్యార్థి, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వాసి -
కల్చర్ తక్కువ అఫైర్స్ ఎక్కువ!
అక్షర తూణీరం ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ఉగాది పండగవేళ పలకరిద్దామని కవి మిత్రులకు ఫోన్ చేస్తే, మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ నినదించాయి. మహా సంతర్పణలోనే ఒక విస్తరి దొరక్కపోతే, ఇక విడిగా ఏం దొరుకుతుందని వాపోయారు. ముఖ్యంగా రెండు, మూడు పద్యకవులు... దోషం వ్యాకరణ దోషం- ఇద్దరు ముగ్గురు పద్యకవులు ఛందస్సుకి ఆంధ్రరాష్ట్రంలో శాలువా మాత్రం చోటు దొరక్కపోవడం శోచనీయమన్నారు. గళాలు విప్పి నిప్పులు కురిపించాం. అన్యాయం నించి కరువు దాకా అన్నిటి మీదా స్పం దించాం, ‘‘ఏదీ మాకో నూలుపోగు’’ అంటూ ఓ గుప్పెడు అభ్యుదయ కవులు ఉద్రేకంగా మాట్లాడారు. ఎప్పుడైనా ఇది మామూలే. కొన్ని సత్కారాలు కొన్ని భంగపాట్లకి చోటిస్తాయి. అసంతృప్తులు మంత్రి వర్గ విస్తరణప్పుడే కాదు, ఉగాది తరుణంలోనూ పుట్టుకొస్తారు. ఈ అసంతృప్తులు ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి కొంచెం ఊరట చెందుతారు. ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన చాలా యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ‘‘... పురుషులు, స్త్రీలు, ఇతరులు అనడం అలవాటు. వాటీజ్ దిస్, ఇతరములు ఏవిటండీ? సాహిత్యం, సంగీతం, శిల్పం, తోటకూర, గోంగూర ఏదో చెప్పాలిగా. ఇతరములు అంటే ఏమిటవి? తెలుగు జాతికి తెలియాలి కదా! ’’అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మేస్టారూ! ఇవేనా కళలు? చెక్క భజన గొప్పదే. చేనేత కళ గొప్పది కాదా? బుర్రకథ గొప్పదే. కానీ తాపేశ్వరం కాజా తయారీ మరింత విశేషం కాదా చెప్పండి! నెల్లూరు కోమల విలాస్లో మజ్జిగ పులుసు అద్భుతం కదా! ఏది దానికి గుర్తింపు-’’ క్లాసు పీకాడొకాయన. ‘‘మీరు ఎన్ని చెప్పండి (నిజానికి నేనసలేం చెప్పలేదు), ఈ ముఖ్యమంత్రి వచ్చాడంటే కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ ఉంటాయండీ’’ అని ముక్తాయించాడింకో పెద్దాయన. అసలెందుకొచ్చిన గొడవ. ఇప్పుడెలాగూ మనం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఉగాది సన్మానాలను సైతం ఘనంగా చేసుకోవచ్చు. కళాకారులకు కవులకు వ్యాపార సంస్థలతో పరిచయాలుంటాయి. కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ కంపెనీలు, సినిమా సంస్థలు మొదలైనవి. ఆయా సంస్థలు ఒకరి పేరు సూచించి, లక్ష రూపాయలు విరాళం ఇస్తుంది. ఇలా ఒక వంద పేర్లు, వంద లక్షలు సేకరిస్తాం. ఓ పది పేర్లు నిజంగానే ఎవరి ఆసరా లేని నిజం కళాకారుల్ని ఎంపిక చేస్తాం. దీనిలో వంద మీద వంద లక్షలు వసూలవుతుంది. అర లక్ష చొప్పున పురస్కారం ఉంటుంది. వాళ్ల మీద ఓ అయిదు ఖర్చవుతుంది. సభకి, శాలువలకి, దండలకి ఇంకో నాలుగైదులకారాలవుతుంది. కాగా పోగా, తరుగులు పోగా పాతిక ముప్పయ్ లక్షలైనా కల్చరల్ ఎఫైర్స్కి జమ పడుతుంది. పైగా ఎక్కువమందిని సంతృప్తి పరిచిన సంతృప్తి కూడా సీయమ్కి మిగు ల్తుంది. నేను ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంటే ఒకాయన లైన్లోకి వచ్చి అసలు పురస్కారాలు జరగాల్సింది కాడి మోస్తున్న లిక్కర్ షాపు యజమానులకండీ. రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా కస్టమర్లను చైతన్యపరుస్తూ... ఆయన గొంతు గద్గదమై పూడుకుపోయింది. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి
► సామ్రాజ్య విష సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమించాలి ► హామీలను నెరవేర్చని చంద్రబాబు ► పీవైఎల్ జిల్లా మహాసభలో వక్తలు టెక్కలి: సామ్రాజ్య వాద విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న యువతను అణగదొక్కేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ఉద్యమాలు కొనసాగించాలని వివిధ ప్రజా సంఘాలకు చెందిన వక్తలు పిలుపునిచ్చారు. ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా ప్రథమ మహాసభను టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. తొలుత పీవైఎల్ మహాసభల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథం మాట్లాడుతూ హిందూ మతోన్మాదం, కులోన్మాదం పెట్రేగిపోతున్నాయన్నారు. విశ్వ విద్యాలయాల్లో సైతం విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతోన్మాద శక్తులు మరింత బలపడ్డాయని ఆరోపించారు. యువతకు సరైన శాస్త్రీయ భావజాలం లేకుండా ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పైల చంద్రమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం రాగానే వారిని మోసగించే చర్యలు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమాలకు యువత సిద్ధం కవాలని పిలుపునిచ్చారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధి కోత ధర్మారావు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ హక్కును తమ చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమాజంలో మార్పు కోసం యువత సన్మార్గంలో నడచి ఉద్యమాలు కొనసాగించాలన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ సామ్రాజ్య వాద విష సంస్కృతికి వ్యతిరేకంగా యువత పోరాటాలు చేయాలన్నారు. మహాసభలో పీఓడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు పోతనపల్లి జయమ్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.సోమేశ్వరరావు, ప్రతినిధులు రామారావు, పీడీఎస్యూ ప్రతినిధులు ఎం.వినోద్, పెంటయ్య, భాస్కరరావు, ఇంద్ర పాల్గొన్నారు. -
మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...
గిరిజనులు పైకొస్తున్నారు పిల్లల్ని బాగా చదివించండి గిరిజన మహిళలతో గవర్నర్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గవర్నర్ హోదాలో తొలిసారి సీతంపేటకు వచ్చిన ఈఎస్ఎల్ నరిసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ గిరిజన సంస్కృతిని చూసి ఉప్పొంగిపోయారు. గిరిజనులు, వారి పిల్లలతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. కుశల ప్రశ్నలు వేస్తూ వారి భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం శ్రీకూర్మనాధుడిని దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలందజేశారు. దేవుడి చరిత్ర అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం నుంచి మల్లి గ్రామంలోని గురుకులాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. ఆరో తరగతికి వెళ్లి ఓ విద్యార్థి పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం ద్వారా సవర లిపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తరువాత అక్కడి ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో మహిళలు, అధికారులతో మాట్లాడారు. కుశల ప్రశ్నలేసిన గవర్నర్ కిలారు గ్రామానికి చెదిన కె.వరలక్ష్మిని పిలిచి ఏం చేస్తున్నావని, ఎంత సంపాదిస్తున్నావని, మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారని గవర్నర్ అడగ్గా తమ గ్రూపులో 15 మంది ఉన్నారని, బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకున్నామని, పుట్టగొడుగులు పెంచుతున్నామని చెప్పింది. మాలతి అనే మరో మహిళనుద్దేశించి గవర్నర్ కుశల ప్రశ్నలడిగారు. ఆమె మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నామని, జీడి, చింతపండు విక్రయిస్తుంటామని, ఉపాధి హామీ పనులకు వెళ్తుంటామని చెప్పింది. మద్యం మానేయూలి మహిళలతో గవర్నర్, కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఎంతమంది మద్యం సేవిస్తున్నారంటూ ఈ రోజు నుంచి వారంతా మద్యం మానేయాలని, మళ్లీ తాను వస్తానని, అప్పుడు మళ్లీ మాట్లాడతానన్నారు. తాగుడు మానేస్తే ఆదాయం రెండింతలు అవుతుందని, ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు పెడుతోందని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని గవర్నర్ కోరారు. చదువు ఆపేయొద్దని, అలాంటి వాళ్లతో మాట్లాడొద్దని సూచించారు. మద్యం సేవించేవారిని గ్రామం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించండంటూ హితవు పలికారు. గిరిజనులు పైకి వస్తున్నారని, బాగా మాట్లాడగలుతున్నారని, వారు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, గవర్నర్ కార్యదర్శి ఎస్. రమేష్కుమార్, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న పలు రాష్ట్రాల శకటాలు ...
-
హైదరాబాద్ పాతబస్తీలోడ్రగ్కల్చర్
-
’మాఫియా గన్ కల్చర్ మొదలైంది అక్కడే’
-
పూల పండగొచ్చింది..
సిటీలో బతుకమ్మ సందడి షురూ అయింది. ఆనవాయితీ ప్రకారం కూకట్పల్లి గ్రామం ప్రధాన చౌరస్తాలో ఆదివారం తొలి బతుకమ్మ కొలువుదీరింది. ఇక్కడ పది రోజులపాటు వైభవంగా ఉత్సవాలు కొనసాగుతాయి. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా... బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడుతూ సందడిగా ఉత్సవాన్ని ప్రారంభించారు. కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా బతుకమ్మ వేడుకలను కూకట్పల్లి ప్రాంతం ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కాలం నాటి నుంచే బతుకమ్మకు ఇక్కడ ఆజ్యం పోశారు. ఆనాటి నుంచి ఎన్నో తరాలు మారినా చెక్కు చెదరని బతుకమ్మ సంస్కృతి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అమావాస్యకు ముందు రోజు ఇక్కడ బతుకమ్మ వేడుకలను ఆరంభించడం ఆనవాయితీ. అందులో భాగంగా కూకట్పల్లి గ్రామం ప్రధాన చౌరస్తా కేంద్రంగా జరిగిన బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. రంగురంగుల బతుకమ్మలతో కూకట్పల్లి ప్రాంత మహిళామణులు, యువతులు, చిన్నారులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి ఓ చందమామా..... బతుకమ్మ.... బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ సాగిన పాటలతో కూకట్పల్లి గ్రామంలో సందడి నెలకొంది. అనంతరం స్థానికం ఉన్న ఐడిఎల్ చెరువులో నిమజ్జనం చేసి వెంట తెచ్చుకున్న పలహారాలను మహిళలు ఇచ్చిపుచ్చుకున్నారు. -
తెలంగాణ సంస్కృతి తొలగింపుపై టీఆర్ఎస్ సీరియస్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తరగతి పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతిని తొలగించడంపై టీఆర్ఎస్ మండిపడింది. ఈ జీవోను తక్షనమే ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ తెలిపారు. ఒకవేళ అలా చేయకుంటే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై విగ్రహాలను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తమ ఉద్యమం ప్రజలపై కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. -
వేడుకలో ప్లాటినం జువెల్లరీ..
కస్టమర్లలో 85% యువతే - చిన్న నగరాలకూ పాకిన సంస్కృతి - 2020 నాటికి 4 రెట్ల అమ్మకాలు - సాక్షితో ప్లాటినం గిల్డ్ ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాటినం.. అమూల్యమైన ఈ లోహం ఇప్పుడు భారత్లో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. వేడుకల్లో ప్లాటినం ఆభరణం ఉండాల్సిందేనని యువత అంటోంది. 2014లో భారత్లో 5 టన్నుల ప్లాటినం ఆభరణాలు అమ్ముడయ్యాయి. అయిదారేలళ్ల క్రితం విక్రయాలతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికమని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ తెలియజేశారు. కస్టమర్లలో 85 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఈ అంశమే ప్రస్తుత ట్రెండ్కు అద్దం పడుతోందని అన్నారు. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ప్లాటినం అమ్మకాలను పీజీఐ ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆభరణాల విపణి తీరుతెన్నులను ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ప్రత్యేక సందర్భంలో.. నిశ్చితార్థం, వివాహం, పెళ్లి రోజు వంటి ప్రత్యేక వేడుకల్లో ప్రాధాన్య బహుమతిగా ప్లాటినం నిలుస్తోంది. మొత్తం ప్లాటినం ఆభరణాల్లో ఉంగరాల వాటా అత్యధికంగా 60% కావడం గమనార్హం. రూ.30-35 వేల మధ్య లభించే ఉంగరాలకు భారత్లో అధిక డిమాండ్ ఉంది. కపుల్ రింగ్స్లో రూ.60-70 వేల ధరవి అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లాటినం విక్రయాల్లో 12-15% వాటా పురుషుల ఆభరణాలు కాగా మిగిలిన వాటాను మహిళల ఆభరణాలు కైవసం చేసుకున్నాయి. వధూవరుల కోసం ప్రత్యేకంగా ‘ఎవరా’ శ్రేణిలో ఆభరణాలను తీసుకొచ్చాం. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ.. ప్రత్యేకత కోరుకునేవారు ఈ లోహానికి మళ్లుతున్నారు. గతంలో వజ్రాలతో కూడిన ప్లాటినం ఆభరణాల వాటా 95% ఉండేది. ఇప్పుడు ఇది 65 శాతానికి వచ్చింది. సాదాగా ఉండే ప్లాటినం ఆభరణాలను కూడా కస్టమర్లు కొనుగోలు చేయడం పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాల కూ ఇది పాకింది. భారత్లో 77 నగరాల్లోని 920 స్టోర్లకు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ ధ్రువీకరణ ఉంది. సగం స్టోర్లు మెట్రోయేతర నగరాల్లో ఉన్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. బంగారం, ప్లాటినం విభాగాలు రెండూ కూడా వేర్వేరుగా మార్కెట్లో వృద్ధి చెందుతాయి. నాల్గవ స్థానంలో భారత్.. ప్లాటినం ఆభరణాల విక్రయంలో చైనా, జపాన్, యూఎస్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్లో 2014లో 28 శాతం వృద్ధితో 5 టన్నుల ఆభరణాలు అమ్ముడయ్యాయి. విలువ సుమారు రూ.2,800 కోట్లు. ఈ ఏడాది 23 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్లో 14 కంపెనీలు ఆభరణాల తయారీలో నిమగ్నమయ్యాయి. మధ్యప్రాచ్య దేశాలు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నాయి కూడా. -
భక్తిశ్రద్ధలతో జగన్నాథుని వనజాగరణ యాత్ర
జగన్నాథుడు అందరి వాడు. ఆయన ప్రతి సేవ, పూజ, నైవేద్యం, సంప్రదాయం అంతా అద్వితీయం. అపురూపం. మనిషే దైవం, దైవమే మనిషి అనే మహత్తర అనుబంధం స్వామి ఆచార వ్యవహారాల్లో ఉట్టిపడుతుంది. శ్రీజగన్నాథుని సంస్కృతిలో ‘నవ కళేబరం’ మహత్తర ఘట్టం. పాత శరీరం వీడి కొత్త శరీరంలోకి బ్రహ్మని ప్రతిష్టింపజేసుకోవడం నవ కళేబరం సరళమైన భావనగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీమందిరం దేవస్థానంలో రత్న వేదికపై చతుర్థామూర్తులు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుడు) భక్తులు, యాత్రికులకు నిత్యం దర్శనమిస్తారు. ఈ మూర్తులన్నీ దారు విగ్రహాలే. ఆలయ పంచాంగం లెక్కల ప్రకారం పుణ్యతిథుల్లో రత్న వేదికపై కొలువు దీరిన దారు మూల విరాట్లని మార్చే ప్రక్రియ నవ కళేబర ఉత్సవం. బాడొగ్రాహిల నేతృత్వంలో నవ కళేబరం రూపు దిద్దుకుంటుంది. చతుర్థామూర్తుల తరపున ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహించే వర్గాన్ని బాడొగ్రాహిగా పరిగణిస్తారు. నవ కళేబర ఉత్సవంలో వన జాగరణ యాత్ర ఆది ఘట్టం. నవ కళేబరానికి అవసరమైన పవిత్ర దారు అన్వేషణని వన జాగరణ యాత్రగా పేర్కొంటారు. ఈసారి దళపతిగా హల్దర్ దాస్మహాపాత్రొ వన జాగరణ దళానికి సారథ్యం వహించారు. ఈ దళంలో నలుగురు ఉప దళపతులు ఉంటారు. ఇలా దళంలో సుమారు 150 మంది సభ్యులు ఉంటారు. రత్న వేదిక నుంచి చతుర్థా మూర్తుల ఆజ్ఞా మాలలు అందడంతో వన జాగరణ యాత్ర వాస్తవంగా ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీజగన్నాథుని ప్రథమ సేవకునిగా పరిగణించబడే గజపతి మహారాజా దివ్య సింగ్దేవ్ రాజ మందిరంలో రాజ గురువుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజాదుల్లో పవిత్ర వక్కని వన జాగరణ దళపతికి అందజేస్తారు. అక్కడ నుంచి దళం నిరవధిక పాదయాత్ర ఊపందుకుంటుంది. ఈ యాత్రలో తొలి మజిలీ పూరీ పట్టణంలో శ్రీజగన్నాథ వల్లభ మఠం. తొలి రోజు రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ప్రాతఃకాలంలో బయల్దేరి మలి మజిలీ కోణార్కు/రామచండీ మందిరంలో బస చేసి విశ్రమిస్తారు. అక్కడ నుంచి చివరి మజిలీ దెవుళి మఠానికి దళం చేరుతుంది. మఠానికి చేరువలో మా మంగళా దేవీ పీఠం ఉంది. మా మంగళా దేవీ కటాక్షం అత్యద్భుతం జగతి నాథుని నవ కళేబర ఉత్సవం శక్తి, శ్రీమన్నారాయణుల ఉమ్మడి ఉపానతో ముడి పడి ఉంది. కాకత్పూర్ మంగళా దేవి కటాక్షంతో శ్రీజగన్నాథుని నవ కళేబరానికి అవసరమైన దారు సంకేతాలు లభిస్తాయి. దేవీ కటాక్షం మేరకు వన జాగరణ దళం అన్వేషణ యాత్ర ప్రారంభిస్తుంది. శ్రీమందిరం నుంచి బయల్దేరిన వన జాగరణ దళం అంచెలంచెలుగా దెవుళి మఠానికి చేరుతుంది. అది మొదలుకొని మంగళా దేవీ కటాక్షం కోసం జపతపాలు ప్రారంభిస్తారు. దేవీ పీఠంలో స్వప్న ఆదేశం కోసం స్వప్నేశ్వరి మంత్ర జపాన్ని నిరవధికంగా నిర్వహిస్తారు. పవిత్ర దారు ఆచూకీ స్వప్నంలోనే ప్రాప్తిస్తుంది. దేవీ అనుగ్రహంలో దళంలో సభ్యులకు స్వప్న ఆదేశం అందేటంత వరకు స్వప్నేశ్వరి మంత్ర జపం నిరవధికంగా సాగాల్సిందే. స్వప్న ఆదేశంతో తక్షణమే అన్వేషణకు యాత్ర బలం పుంజుకుంటుంది. దళంలో సభ్యులు 6 జట్లుగా విడిపోయి అన్వేషిస్తారు. ప్రాతఃకాలం నుంచి అపరాహ్ణం వరకు 4 జట్లు, అపరాహ్ణం నుంచి సంధ్య వేళ వరకు 2 జట్లు దారు కోసం అన్వేషిస్తాయి. ఈ జట్లుకు తారసపడిన దారు వివరాల్ని నిత్యం సంధ్య వేళలో దళపతి, ఉప దళపతి, దైతపతులంతా కలిసి దెవుళి మఠంలో సమీక్షిస్తారు. ఇలా 100 పైబడి వేప చెట్ల వివరాల్ని సేకరించిన మేరకు చివరగా 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. ఈ వృక్షాల దారుని చతుర్థా మూర్తుల తయారీకి వినియోగిస్తారు. నవ కళేబరం దారు వెలసిన ప్రాంతం, అర్హత కలిగిన దారు చిహ్నాల్ని స్వప్న ఆదేశంలోనే పొందుతారని దైతపతుల సమాచారం. నవ కళేబరం దారుకు సంబంధించి శాస్త్రీయంగా కూడ ప్రత్యేక మార్గదర్శకాలు ఆచరణలో ఉన్నాయి. నదీ తీరాన స్మశాన వాటికకు చేరువలో ఆఘాతం లేకుండా ఎదిగిన వేప వృక్షం నవ కళేబరానికి అర్హత కలిగిన కల్పంగా పరిగణిస్తారు. ఈ కల్పం పాద ప్రాంతంలో పుట్ట, నాగ సర్ప సంచారంతో చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక పరిసరాల మధ్య పశు పక్ష్యాదులు తాకకుండా శంఖం, గద, చక్రాదులు వంటి చిహ్నాలు కలిగిన నింబ వృక్షం దారుని పవిత్ర నవ కళేబరం కోసం వినియోగిస్తారు. వీటితో మరికొన్ని గోప్యమైన సంకేతాల్ని కూడ పరిగణనలోకి తీసుకున్న మేరకు కొత్త మూల విరాట్ల తయారీకి అర్హమైన దారు వివరాల్ని వన జాగరణ దళం ప్రకటిస్తుంది. వన జాగరణ దళం సూచన మేరకు శ్రీమందిరం దేవస్థానం తొలుత సుదర్శనుని దారుకు సంబంధించి వివరాల్ని అధికారికంగా బహిరంగపరుస్తుంది. తర్వాత అంచెలంచెలుగా బలభద్రుడు, దేవీ సుభద్ర, చివరగా శ్రీజగన్నాథుని దారు వివరాల్ని ప్రకటిస్తారు. శ్రీచక్ర నారాయణుని తోడుగా .... నవ కళేబరం దారు అన్వేషణలో వన జాగరణ దళానికి శ్రీ చక్ర నారాయణుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడంతో చీకటి, వెలుగులు, ఎండ, తాపం వంటి అలసత్వం లేకుండా యాత్ర నిర్భయంగా, నిరవధికంగా సాగుతుందని దళంలో సభ్యులు వివరించారు. బస చేసిన ప్రతి చోట నిరంతరాయంగా శ్రీ చక్ర నారాయణుని సేవించడంలో వన జాగరణ దళం తల మునకలై ఉంటుంది. దారు అన్వేషణలో దైతపతులు శ్రీ చక్ర నారాయణుని చేత పట్టుకుని ముందుకు సాగుతారు. ఆయన శక్తితో పాదయాత్ర అవలీలగా సాగిపోతుంది. దారు అన్వేషణని విజయవంతం చేస్తుంది. వన జాగరణ యాత్ర దళం సభ్యులు యాత్ర ఆద్యంతాల్లో ఒంటి పూట (మహా ప్రసాదం) భోజనంతో అత్యంత నియమ నిష్టలతో మంత్ర జపతపాలు, పూజాదుల్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. పాద యాత్రలో వీరు బస చేసే మజిలీల్లో వసతి, ఆరోగ్యం, శాంతి భద్రత ఏర్పాట్లని శ్రీమందిరం దేవస్థానం పర్యవేక్షిస్తుంది. నిత్యం శ్రీమందిరం నుంచి శ్రీజగన్నాథుని మహా ప్రసాదాలు (అన్న ప్రసాదాలు) వన జాగరణ దళం బస చేసే చోటుకు సాయంత్రం సరికి చేరేలా దేవస్థానం అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. దేవస్థానం ప్రధాన పాలనాధికారి ఈ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దిగువ స్థాయి అధికారులతో వన జాగరణ దళానికి ఎటువంటి ప్రమేయం ఉండకపోవడం విశేషం. లోగడ నవ కళేబర ఉత్సవం 1969, 1977, 1996 సంవత్సరాల్లో జరిగినట్లు దేవస్థానం రికార్డుల సమాచారం. - ఎస్.వి. రమణమూర్తి, సాక్షి, భువనేశ్వర్ -
సంస్కతం - సంస్కతి
కవర్ స్టోరీ: తాను సంస్కరించబడినది, తనను చదివేవారిని సంస్కరించేది కనుక ఈ భాషకు సంస్కృత భాష అనే పేరు వచ్చింది. పది ఇంద్రియాలను, నవరసాలను, అష్టకష్టాలను, సప్త వ్యసనాలను, ఆరు రుచులను శత్రువులను, పంచ భక్ష్యాలను, నాలుగు దశలను, మూడు గుణాలను, రాగద్వేషాది ద్వంద్వాలను ఒక్కటిగా ఎలా ఎదుర్కొని పరిష్కరించుకొని ఆనందమయంగా జీవించాలో నేర్పే భూలోక పారిజాతం సంస్కృత భాష. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా’ (భారతదేశానికి సంస్కృత భాష, సంస్కృతి రెండు ప్రతిష్ఠాత్మకమైనవి) అనే తీర్మానం ద్వారా పెద్దలు సంస్కృతభాష అధ్యయనం భారతీయులందరికీ అత్యవసరమనీ, లాభదాయకమనీ ఎప్పుడో చెప్పారు. భారతీయ సంస్కృతి పరిరక్షణకు సంస్కృత భాష, సంస్కృత భాష పరిపుష్టికి భారతీయ సంస్కృతి పరస్పరం అన్యోన్యాశ్రయ పద్ధతిలో వర్ధిల్లుతాయి. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికత, భారతీయ సంస్కృతి సమాచారం స్పష్టంగా, సమగ్రంగా తెలుసుకోవడానికి అన్ని భాషలవారికీ, అన్ని సంస్కృతుల వారికీ ముఖ్యాధారం సంస్కృతమే. ప్రపంచంలో వున్న కొన్ని వేల భాషల్లో అతి ప్రాచీనమైన అభివృద్ధి చెందిన భాషగా సంస్కృతం భాషాశాస్త్రవేత్తలచే అంగీకరించబడింది. కేవలం వ్యవహారానికి మాత్రమే పనికివచ్చే భాషల్లో కొన్నింటికి మాత్రమే లిపి, పఠన లేఖనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి మాత్రమే విలువైన సాహిత్యం, గ్రంథాలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. అటువంటి ఉన్నతస్థాయి వాఙ్మయంతో మానవజాతి ప్రగతిని, ఆలోచనాశక్తిని, సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించే ఏకైక ప్రాచీనభాష సంస్కృతం. కనుక భారతీయులందరూ తప్పనిసరిగా సంస్కృత భాషను నేర్చుకోవాలని బాలగంగాధర తిలక్, మహాత్మాగాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్, స్వామి వివేకానంద, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి భారతీయ మేధావులు, ఆధ్యాత్మిక, విజ్ఞానవేత్తలు ప్రబోధించారు. ఎందరో పాశ్చాత్య మేధావులు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు సంస్కృతాన్ని అభ్యసించారు. ఇండియా గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ వార్న్ హేస్టింగ్స్ సంస్కృతభాషాధ్యయనం అవసరమని ప్రోత్సహించారు. ‘వివాదార్ణవ సేతువు’ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాయించాడు. ఇది పెర్షియన్, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడింది. సంస్కృత భాషా వాఙ్మయ విశేషాలను ఆంగ్లంలో ప్రకటించిన తొలి గ్రంథం ఇది. పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో పాశ్చాత్యులు సంస్కృత భాషను నేర్చుకొని వారి భాషల్లోకి ఎన్నో సంస్కృత గ్రంథాలను అనువదించారు. వారిలో మొదటివాడు చార్లెస్ విల్కిన్స్. ఈయన చాలా శ్రమపడి సంస్కృతం నేర్చుకొని దాని గొప్పదనాన్ని యూరప్ ఖండానికి తెలియచేశాడు. భగవద్గీతను, హితోపదేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రకాశించాడు. సర్ విలియమ్ జోన్స్ సంస్కృతంలో మహాపండితుడై మనుస్మృతిని, శాకుంతలాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. యూరప్లో నాగరలిపి అక్షరాలు పోత పోసి గ్రంథ ముద్రణ చేసిన మహానుభావుడు. ెహ న్రీ థామస్ కోలే బ్రూక్ సంస్కృత భాషలోని ధర్మశాస్త్ర, దర్శన, వ్యాకరణ, గణిత, జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. జర్మనీ, ఫ్రాన్సు దేశీయులు ఎంతోమందిని ఈయన సంస్కృత పండితులుగా తయారుచేశాడు. అలెగ్జాండర్ హేమిల్టన్, ఫ్రెడిరిక్ ష్లెగల్, ఆగష్ట్ విల్హెల్మ్వాన్ ష్లెగల్, ఫ్రాంజ్ బాప్ప్, బర్నాఫ్, లాసెన్, రోసెన్, థియొడర్ బెన్పీ, మాక్స్ముల్లర్, రుడోల్ఫ్ రాఢ్, ఆటో బోయిట్లింగ్, థియొడర్ ఔఫ్రెట్, జార్జి బ్యూలర్, గెల్డ్నర్, చార్లెస్ రాక్వెల్ లాన్మన్, మెక్డానెల్, బెరిడేల్ కీత్ మొదలైన పాశ్చాత్య పండితులు ఎందరో సంస్కృత గ్రంథాలను, వేద శాస్త్రాలను జర్మన్ భాషలోకి, ఆంగ్లంలోకి అనువదించి సంస్కృత భాష గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. తాను సంస్కరించబడినది, తనను చదివేవారిని సంస్కరించేది కనుక ఈ భాషకు సంస్కృత భాష అనే పేరు వచ్చింది. సంస్కృత భాషలో ఖగోళ, భౌతిక, రసాయన, వృక్ష, జంతు, గణిత శాస్త్రాల వంటి ఆధునిక శాస్త్ర విషయాలెన్నో నిక్షిప్తమై ఉన్నట్టు నిరూపింపబడుతున్నాయి. ఐన్స్టీన్ ప్రతిపాదించిన రిలేటివిటీ సిద్ధాంతం, భౌతికశాస్త్ర శక్తి పరిణామ సిద్ధాంతం, పరమాణు స్వరూపం మొదలైన సిద్ధాంతాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలలో సంస్కృతంలో గోచరిస్తున్నాయి. అణువిస్ఫోటన కాంతిని చూడగానే భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగంలోని దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాస్సదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మనః॥ (ఆకాశంలో ఒక్కసారిగా వేయి మంది సూర్యులు ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ మహాత్ముని తేజస్సుకు సాటి వస్తుంది) అనే శ్లోకం పాశ్చాత్య శాస్త్రవేత్తలకు గుర్తు వచ్చినట్లు చె ప్పారంటే సంస్కృత భాషాధ్యయన ఫలితం ఎంత గొప్పదో గ్రహించవచ్చు. సంస్కృత గ్రంథాలను ఆంగ్లంలో చదివిన ఆంగ్లేయ పండితులు మళ్లీ జన్మ ఉంటే భారతదేశంలో పుట్టి ప్రత్యక్షంగా సంస్కృతం చదువుకోవాలని కోరుకున్నారంటే భారతీయులు ఎంత అదృష్టవంతులో చెప్పేదేముంది? మనస్తత్వం, వ్యక్తిత్వ వికాసం, ధైర్యం, కార్యశీలత, కర్తవ్య బోధతో ఎన్నో శాస్త్రాలకు అనుసంధానమైన భగవద్గీత ద్వారా ప్రపంచంలో ఎందరో మహానుభావులు, నాయకులు, శాస్త్రవేత్తలు ఉత్తేజితులైనారు. బాలగంగాధర తిలక్ వ్రాసిన గీతాభాష్యంలో ఖగోళ, భౌగోళిక, సామాజిక, సాంకేతిక శాస్త్ర విషయాలను ప్రస్తావించి నిరూపించారు. గాంధీ మహాత్ముడు తనకు ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో ఏదో ఒక శ్లోకం పరిష్కారం చూపిస్తుందని చెప్పాడు. అపారమైన సంస్కృత భాషా సాహిత్యాల పరిచయం, అవగాహన నేటి సమాజానికి మరింత అవసరం. దానిలో కనీస పరిజ్ఞానం పిల్లలకూ పెద్దలకూ ఎంతో అవసరం. ‘అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయష’ అని ఎగతాళిగా వెక్కిరింపుగా మాట్లాడిన మాట అక్షరసత్యంగా అనేక పరిశోధనల్లో నిరూపితమౌతోంది. జాతి కుల మతాలకు అతీతంగా సంస్కృతభాష జ్ఞానభాండాగారమనే దృష్టితో అత్యంత ఆధునికమైన ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అమెరికా, జర్మనీ వంటి దేశాలలో ఎన్నో విశ్వవిద్యాలయాలు సంస్కృత భాషా పీఠాలు స్థాపించి అధ్యయనం చేయిస్తున్నాయి. వేదం అంటే జ్ఞానం. శాస్త్రం అంటే శాసించేది. పురాణం అంటే నిత్యనూతనమైనది. కావ్యం అంటే మనోహరంగా సందేశాన్ని ఇచ్చేది. ఇతిహాసం అంటే జరిగినదాన్ని యధాతథంగా అందించేది. ఇలా సాగే సంస్కృతభాషా సాహిత్యం కోట్లాది సంవత్సరాల మానవజాతి ప్రగతికి మణిదర్పణంలా వెలుగొందుతోంది. ‘సంస్కృతం మృత భాష’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది. దండయాత్రలతో పరాయి పరిపాలనలో ఇతర భాషల ఆధిపత్యం భారతదేశంలో పెరిగింది. ఒకప్పుడు రాజకీయపాలనా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలు సమస్తమూ సంస్కృత భాషలో జరిగిన చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ‘జననీ సంస్కృతంబు సకల భాషలకును’ అనే భావనతో, గౌరవంతో భారతదేశంలోని అన్ని భాషలూ వర్ధిల్లుతున్నాయి. అందరికీ అనుసంధాన భాషగా, అంతర్జాతీయ భాషగా సంస్కృత భాష భిన్నత్వంలో ఏకత్వ కేంద్రంగా జాతిని తీర్చిదిద్దుతోంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం నాటి గ్రీకుల నుండి క్రీస్తుశకం పద్దెనిమిది పందొమ్మిది శతాబ్దాల వరకూ ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, ఇంగ్లీషు మొదలైన విదేశీ బృందాలు భారతదేశం పైకి దండయాత్రల రూపంలోనో, వర్తక వాణిజ్యాల పేరుతోనో ప్రవేశించారు. దానికి కారణం ఊహాతీతమైన ధనసంపదే కాక అనంతమైన విజ్ఞానం, సంస్కృతి ఈ దేశాల్లో విలసిల్లటమే. ఇక్కడి సంపదను వారి దేశాలకు తరలించినట్లే సంస్కృత భాషనూ, వాఙ్మయాన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారి ఫిలిపోశాసెట్టి సంస్కృతానికీ ఐరోపా ఖండంలోని ప్రధాన భాషలకూ సంబంధాన్ని చూపించాడు. పద్దెనిమిదో శతాబ్దంలో సర్ విలియం జోన్స్ సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషలు ఒకే కుటుంబానికి చెందినవని సోదాహరణంగా చుట్టరికాన్ని కలుపుకొన్నాడు. ఉదా: మాతా - మదర్, పితా - ఫాదర్, భ్రాతా - బ్రదర్ వంటివి. ప్రాచీన భారతీయ నాగరికతకు, వికాసానికి సజీవ చిహ్నాలయిన వేదాలు, శాస్త్రాలు, శ్రుతి స్మృతి పురాణేతిహాసాలు అధ్యయనం చేయటానికి నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు అనాదిగా వేలాదిమంది విదేశీయులు భారతదేశానికి వచ్చారు. నాటి నుంచి నేటి కంప్యూటర్ విజ్ఞానం వరకూ సంస్కృత భాష మానవజాతికి మార్గదర్శకమౌతోంది. కంప్యూటర్ సాంకేతిక భాషగా సంస్కృత భాష మాత్రమే పనికి వస్తుందని దాన్ని కంప్యూటర్ భాషగా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. నేడు సంస్కృత భాషాధ్యయన ఆవశ్యకత మరింతగా పెరిగింది. మీమాంసా శాస్త్రానికీ కంప్యూటర్ విజ్ఞానానికీ ఉన్న పోలికలు ‘వేదాలలో కంప్యూటర్ విజ్ఞానం’ అనే గ్రంథంలో నిరూపిస్తూ శ్రీవేదభారతి సంస్థ ప్రచురించింది. అలాగే ‘వేదాలలో శాస్త్రీయ సాంకేతిక విషయాలు’ అనే పుస్తకంలో గణితశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, వృక్ష, జంతు శాస్త్రాలు, వ్యవసాయ విధానాలు మొదలైనవాటి మూలాలను గుర్తించి ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఇటీవల ప్రకటించిన ‘వేద శాస్త్రాల సంక్షిప్త పరిచయం’లో డా.రేమెళ్ల అవధానులు గారు ‘వేద శాస్త్రాలు - ఆధునిక విజ్ఞానం’ అనే శీర్షికలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. స్వామి వివేకానంద మానవజాతి ప్రగతిని, ఆలోచనాశక్తిని, సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించే ఏకైక ప్రాచీనభాష సంస్కృతం. కనుక భారతీయులందరూ తప్పనిసరిగా సంస్కృత భాషను నేర్చుకోవాలని బాలగంగాధర తిలక్, మహాత్మాగాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్, స్వామి వివేకానంద, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి భారతీయ మేధావులు, ఆధ్యాత్మిక, విజ్ఞానవేత్తలు ప్రబోధించారు. చార్లెస్ విల్కిన్స్ చార్లెస్ విల్కిన్స్ చాలా శ్రమపడి సంస్కృతం నేర్చుకొని దాని గొప్పదనాన్ని యూరప్ ఖండానికి తెలియచేశాడు. భగవద్గీతను, హితోపదేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రకాశించాడు. హెన్రీ థామస్ కోల్బ్రూక్ ెహ న్రీ థామస్ కోలే బ్రూక్ సంస్కృత భాషలోని ధర్మశాస్త్ర, దర్శన, వ్యాకరణ, గణిత, జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. జర్మనీ, ఫ్రాన్సు దేశీయులు ఎంతోమందిని ఈయన సంస్కృత పండితులుగా తయారుచేశాడు. అమీబా అనే పదం కృష్ణయజుర్వేదంలో ‘ఇషేత్వా.... ...అనమీవాః’ అనే మంత్రంలో ఉంది. ‘ష్టీమ ఆర్ద్రీకరణే’ అనే వ్యాకరణ సూత్రంలో ‘స్టీమ్’ సంస్కృత పదమని తెలుస్తోంది. మంత్ర పుష్పంలో ‘తిర్యగూర్ధ్వమధశ్శాయీ’ అనే వాక్యం గణిత సూత్రం. ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అనే తైత్తరీయ ఉపనిషత్తు పరమాణువును చెబుతోంది. ఒకటి తరువాత పన్నెండు సున్నాల వరకు అంకెలు రుద్రాభిషేక మహాన్యాసంలో ఉన్నాయి. సూర్యచంద్రులు ఒకే రాశిలోకి వచ్చి చంద్రుడు కనిపించక పోవడాన్ని అమావాస్య పేరుతో సూచించిన ఖగోళ విజ్ఞానం, భూకంపాలను గుర్తించటానికి వరాహమిహిరుడు రాసిన ‘బృహత్సంహిత’ అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంథంలో చూడవచ్చు. వైద్యశాస్త్రంలో సూదిమందు (ఇంజెక్షన్) విధానం అధర్వణ వేదం చెప్పింది. హైడ్రోజెన్కు చెందిన ఐసోటోప్సు ‘ఏకతాయ స్వాహా, ద్విత్వాయ స్వాహా, త్రితాయ స్వాహా’ అనే కృష్ణయజుర్వేద మంత్రంలో ఉన్నాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక విషయాల కోసం మాత్రమే కాక, మానవుడు ఆరోగ్యంగా ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకటానికి కావలసిన ఎన్నో సూత్రాలు, సూక్తులు ధర్మన్యాయ నీతి శాస్త్రాలుగా సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నాయి. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ’ అన్న నాలుగు మాటలే మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ‘స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్’ (చదువుకో, చదువు చెప్పు), ‘నా శ్లీలం కీర్తయేత్’ (అశ్లీలం పలుకరాదు)... ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’(ఫలితంకోసం ఆందోళన పడితే పని మీద ఏకాగ్రత చెదురుతుంది. పని ఏకాగ్రతతో చెయ్యి. ఫలితం గురించి ఆలోచించకు) అనే గీతావాక్యం మానసిక ఆందోళనలకు, నిరాశ నిస్పృహలకు, ఆత్మహత్యలకు, అహంకారానికి, ఆత్మాధిక్య న్యూనతా భావాల వంటి మానసిక రుగ్మతలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. మానవ సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తీకరణ నైపుణ్యం వంటి ఆధునిక పరిభాషలన్నీ సంస్కృత భాషలోని భారత, భాగవత, రామాయణాల్లో, మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వంటి స్మృతి గ్రంథాల్లో, భర్తృహరి సుభాషితాలు, పంచతంత్రం, హితోపదేశం వంటి అనేక గ్రంథాల్లో ఉదాహరణలతో సహా లభిస్తాయి. క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం, అత్యుత్తమ బుద్ధి జీవనం లాంటివన్నీ నిశ్శబ్దంగా అందచేసే స్థాయిలో సంస్కరించబడిన భాష సంస్కృత భాష. పది ఇంద్రియాలను, నవరసాలను, అష్టకష్టాలను, సప్త వ్యసనాలను, ఆరు రుచులను శత్రువులను, పంచ భక్ష్యాలను, నాలుగు దశలను, మూడు గుణాలను, రాగద్వేషాది ద్వంద్వాలను ఒక్కటిగా ఎలా ఎదుర్కొని పరిష్కరించుకొని ఆనందమయంగా జీవించాలో నేర్పే భూలోక పారిజాతం సంస్కృత భాష. ‘వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే’(మానవజాతిని సంస్కృత భాష మాత్రమే తీర్చిదిద్దుతుంది). ‘జయతు సంస్కృతమ్’ - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
కళాపర్వం
పనితోపాటే పుట్టింది పాట. పనీపాటా జతకట్టింది జన పదం. అదే జాన పదం. అచ్చమైన పల్లె సంస్కృతికి దృశ్యరూపం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని భిన్న కళలు, విభిన్న సంస్కృతులు మన సొంతం. ఈ కళాకృతులన్నింటికి వేదికయ్యింది శిల్పారామం. ‘పర్వ పూర్వోత్తర్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంత ఆహూతులను అలరించింది... - ఎస్. శ్రావణ్జయ ఆనందమైనా.. విషాదమైనా... సంబరమైనా.... పాండిత్యానికి అతీతంగా పరవశమే పరమపద సోపానంగా సాగే కళ జానపదం. అచ్చమైన గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం. భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ప్రాంతానికో ఆటపాటా. అఖిల భారత రంగస్థల ఉత్సవం సందర్భంగా సంగీత నాటక్ అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శిల్పారామంలో శుక్రవారం ప్రారంభమయిన ఈ అద్భుత నృత్య ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. రాధాకృష్ణుల నృత్యం... ‘ఏడే ళ్ల వయసులో ఈ నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల పాటు క్రమం తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు నా వయసు 38. కొన్ని సార్లు ఈ నాట్యం గంట పాటు ఉంటుంది. బృందంలో ఏ ఒక్కరూ అలసిపోయినా ప్రమాదమే. మా మణి పూర్ రాష్ట్రంలో ప్రతి యాసాంగ్(హోలీ) పండుగకి మా బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తుంది. హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణులు చేసే నృత్యమే ఈ డోల్ చోలమ్కి ప్రధాన నేపథ్యం’ అన్నారు డోల్ చోలమ్ కళాకారుడు జ్ఞానేశ్వర్. నవ వసంత వేడుక... ‘అసోంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తాం. అసోం మహిళలు ఈ నాట్యాన్ని ఎంతో ఇష్టపడి చేస్తారు. దేశ వ్యాప్తంగా మా బృందం చాలా చోట్ల ప్రదర్శన ఇచ్చింది’ అంటోంది బిహు నృత్య దళం. వీటితోపాటు మణిపూర్కే చెందిన ‘థాంగ్ థా’, మిజోరం నృత్యం చెరా, బెంగాల్ - బౌల్ గాన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
బోయలు, కాయితీ లంబాడీలపై అధ్యయనం
ప్రభుత్వం ఆదేశిస్తే మిగతా కులాలపై కూడా అధ్యయనం ఎస్టీ కమిషన్ చైర్మన్గా చెల్లప్ప బాధ్యతల స్వీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వాల్మీకి బోయ, కాయితీ లంబాడీల జీవనశైలి, సంస్కృతి, ఉద్యోగస్థాయి తదితర అంశాలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆరునెలల్లో నివేదికను సమర్పించేందుకు కృషి చేస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎస్.చెల్లప్ప తెలిపారు. ప్రధానంగా ఈ రెండు తె గలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకే తమకు బాధ్యత అప్పగించారన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎస్.చెల్లప్ప, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగు సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం చెల్లప్ప విలేకరులతో మాట్లాడుతూ, మిగతా కులాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలిస్తే వాటిపై అధ్యయనానికి కూడా అభ్యంతరం లేదని చెప్పారు. ఈ రెండు తెగల జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యుడు కె.జగన్నాథరావు మాట్లాడుతూ తమకు అప్పగించిన అంశంపై క్షేత్రస్థాయిలో అధ్యయనంకోసం పర్యటనలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ, కమిషనర్ బి.మహేశ్దత్ ఎక్కా, బంజారా సోషియో కల్చరల్ రీసెర్చీ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రొఫెసర్ వి.రామకోటి, ప్రొఫెసర్ రాంప్రసాద్, ప్రొఫెసర్ భట్టురమేష్, కృష్ణనాయక్ చౌహాన్, వివిధ దళిత సంఘాల నాయకులు అభినదనలు తెలిపారు. -
విందామా నది గీతం
మన సంస్కృతిలో నదీ జలాలు అత్యంత పవిత్రమనే భావన ఉంది. కేవలం అవసరాల కోసమే నదీ జలాలనీ, అదే వాటి ఉపయోగమనీ భారతీయులు భావించరు. నదిలో ఒక్కసారి మునిగితే పాపప్రక్షాళన అవుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. తల్లి తర్వాత పుణ్యస్థలిగా నదీమతల్లులను కొలిచే దేశం మనది. ఆధ్యాత్మిక జీవనానికి ప్రధాన భూమిక పోషించేవి నదులే! దేవతాస్వరూపాలుగా ప్రతి భారతీయుడూ భావించే నదుల సందర్శన జీవితకాల ధన్యతను చేకూర్చుతుందని నమ్మేవారెందరో! ప్రకృతి ప్రేమికులూ నదుల చుట్టూ అల్లుకుపోయిన ఆహ్లాదకరవాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఆ విధంగా నదులు పర్యాటకరంగంలో ఓ భాగమయ్యాయి. మార్చి 14 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్’ సందర్భంగా మన దేశంలో నదీ విహారం గురించి ఈ ప్రత్యేక వ్యాసం.. -నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నాగరికతలన్నీ నదీ తీరాన వెలసినవే. పంట పొలాలకు నీరందించి, వాటిని సస్యశ్యామలం చేయడమే కాకుండా రవాణా, విద్యుచ్ఛక్తి, చేపల పెంపకం.. ఇంకా అనేకానేక మానవావసరాలకు ఉపయోగపడుతున్నవి. హిమాలయాల్లో పుట్టి భారతదేశాన్నంతటినీ పలకరిస్తున్న నదుల జాబితా మన దగ్గర పెద్దదే! ఒక కొత్త అనుభూతి కోసం మన దేశంలో నదీ ప్రయాణం ఓ ప్రత్యేకమైన మార్గాన్ని చూపుతోంది. నదుల ఉపయోగం తెలుసుకోవాలన్నా, నదీ జలాలను కాపాడడానికి మనదైన గొంతుకను వినిపించాలన్నా వాటిని దగ్గరగా సందర్శించాలి. అందుకే, రండి నదీ విహారానికి... ఆధ్యాత్మిక ప్రయాణం గంగ... మనదేశంలో అతి ప్రధానమైనది, అత్యంత పవిత్రమైనది గంగానది. ఒక్కసారి ఈ నదిలో మునిగితే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మిక. హిమాలయాల్లో పుట్టిన ఈ నదీ తీరాన ఎన్నో పుణ్యక్షేతాలు వెలిశాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది కాశీ పుణ్యక్షేతం. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న ఈ నది బెంగాల్లోని ఫరక్కా, కలకత్తాల మధ్య పడవ ప్రయాణం యాత్రికులు మర్చిపోలేనిది. ఈ ప్రయాణంలో ఉత్తర భారతదేశంలోని వారసత్వ కట్టడాలతో పాటు ఇతర సందర్శనీయ స్థలాల వీక్షించవచ్చు. అయితే, ఎంతో ఘన ఖ్యాతి గంగా నది మానవ తప్పిదాల వల్లే కాలుష్యం బారిన పడిందని పర్యావరణ నివేదికలు చెబుతున్నాయి. అయినా ఎన్నో మార్గాలలో ఆహ్లాదంగా పలకరించే ఈ నది రిషీకేష్ దగ్గర శివపురి నుంచి లక్ష్మణ్ ఝూలా వరకు ఏడాది పొడవునా తెప్పల పోటీలు జరుగుతాయి. ఈ రివర్ రాఫ్టింగ్ సాహసకృత్యాలలో పాల్గొనేవారి సంఖ్య ప్రతీ ఏడాదీ పెరుగుతూనే ఉంది. పొడవైన ప్రయాణం బ్రహ్మపుత్ర... హిమాలయాలలోని మానస సరోవరం సమీపంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తున్నది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రా నదీ ప్రయాణం ప్రధానంగా అస్సామ్లో 850 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కజిరంగా జాతీయ ఉద్యానంలోని ఎలిఫెంట్ సఫారీ చెప్పుకోదగినది. నదీ తీరాన ఎన్నో దేవాయాలు, తేయాకు తోటలు, గ్రామాలలో పట్టు పరిశ్రమలు.. చూడదగినవి. బ్రహ్మపుత్రా నది పసిఘాట్ వద్ద 180 కిలోమీటర్ల పొడవున సాగే తెప్పల ప్రయాణం అత్యంత ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 300 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయాలను ఈ న దీ ప్రయాణ గమనంలో వీక్షించవచ్చు. ప్రాచీన నాగరికత ప్రయాణం సింధు... సింధునది హిమాలయాలలోని కైలాస పర్వత సానువులలో పుట్టి.. మార్గంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులను కలుపుకుంటూ పాకిస్థాన్లో అరేబియా సముద్రంలో కలుస్తున్నది. భారత, పాకిస్తాన్లు రెండు దేశాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ నది వల్ల మనదేశంలో పంజాబీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు అధిక ప్రయోజనం పొందుతున్నాయి. కైలాసగిరి నుంచి మొదలైన సింధు నది ప్రయాణం జమ్మూ, కాశ్మీర్లో 550 కి.మీ ఉంటుంది. ఇక్కడే లడాఖ్, జన్స్కర్ ప్రాంతాలలో ప్రతి జులైలో సింధు నదీ ఉత్సవాలు జరుపుతారు. వేసవిలో ఈ నదీ ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి స్థాయి హెచ్చుగా ఉండటంతో తెప్పల (రివర్రాఫ్టింగ్) పోటీలతో ఈ నదీ ప్రాంతం కళకళలాడుతుంటుంది. నదీ విహారం ఎందుకంటే... ప్రకృతి సౌందర్య వీక్షణకు. నదుల పరిరక్షణ అవసరం తెలుసుకోవడానికి. తమ వంతు ప్రయత్నంగా పరిశోధనకు పూనుకోవడానికి. నదీ జలాలు కలుషితం అవడానికి గల కారణాలను వెతకడానికి. అందమైన ప్రకృతి దృశ్యాలను కెమెరా కన్నుతో వీక్షించడానికి. ఫిల్మ్ డాక్యుమెంటరీ నిర్మాణానికి. సూర్యోదయ, సూర్యాస్తమయాల వీక్షణకు. ఆధ్యాత్మికంగా మన గురించి మనం తెలుసుకోవడానికి. పర్యాటకులు ప్రధానంగా వీటిని దృష్టిలో పెట్టుకొని టూర్ప్యాకేజీలు, టూర్ గైడ్లను ఎంచుకుంటారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలలో ఉన్న నదీ సౌందర్యాన్ని బట్టి పర్యాటకుల ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా విదేశీ పర్యాటకులు నదీ తీరాలలో, నదీ జలాలలో విహరించడానికి వస్తుంటారు. ఎంచుకున్న ప్రాంతం, వారికున్న పని, బడ్జెట్ను బట్టి ప్యాకేజీలు ఉంటాయి. సురక్షిత ప్రయాణం గోదావరి... పక్షుల కువకువలు వింటూ, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ పెద్ద పెద్ద కొండలను దాటుకుంటూ, నదీ తీరంలో గిరిజన గ్రామాలను చూస్తూ సాగే ప్రయాణంలో గోదావరిది అగ్రతాంబూలం. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన గోదావరి నాసిక్ సమీపంలోని త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉపనదులు కలుపుకుంటూ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వద్ద మొదలయ్యే ఈ పడవ ప్రయాణం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. చిన్న చిన్న పడవల ద్వారానూ ప్రయాణికులు నది ఆవలి ఒడ్డుకు చేరుకుంటూ ఆనందోల్లాసాలను పొందుతుంటారు. ప్రకృతి ఆరాధకుల్లో చాలా మంది ఒక్కొక్కరుగానే ఈ నదీ తీర సందర్శనకు చేరుకునేవారుంటారు.ఆహ్లాదకర ఆనందాలను, ఆధ్యాత్మిక సౌరభాలను ఎద నిండా నింపే గోదావరి పర్యాటకులకు సురక్షితమైనదిగా పేరుంది. అయితే, మధ్య భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో నదీ విహారం అనేది చాలా పరిమితంగానే ఉంటోంది. గోదావరి నదీ తీరంలో ఉన్న దేవాలయాలు, కొన్ని సాంస్కృతిక కేంద్రాలకే పర్యటనలు పరిమితమయ్యాయి. ఇక్కడితో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలోని బ్యాక్వాటర్ క్రూయిజ్ విహారం అత్యద్భుతంగా ఉంటోంది. ఇక్కడి క్రూయిజ్ ప్యాకేజీలు, వినోదకార్యక్రమాలు సెలవుదినాల్లో ప్రత్యేక ఆఫర్లతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.నదుల ప్రయాణంలో మమేకమైన వారికి ఎన్నో ఆనందాలే కాదు.. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, విజ్ఞానమూ చేరువవుతుంది. పచ్చందనాల పరవశం కృష్ణ... పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. తుంగభద్ర, భీమ, మూసీ, ఘట ప్రభ, మున్నేరు ఉపనదులను కలుపుకుంటూ ఈ ప్రయాణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిలో పడవ ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ లాంచీ సదుపాయాన్ని కల్పిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి సాగే పడవ ప్రయాణంలో ప్రకృతి సోయగాలను, గిరిజన గ్రామాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తూ ఉల్లాసంగా గడపవచ్చు. -
ఐర్లాండ్
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్, వైశాల్యం: 84,421 చ.కి.మీ జనాభా: 64,00,000 (తాజా అంచ నాల ప్రకారం) రాజధాని: డబ్లిన్, ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్ కరెన్సీ: యూరో, భాషలు: ఇంగ్లిష్, ఐరిష్, మతం: క్రైస్తవులు సరిహద్దులు: మూడు వైపులా అట్లాంటిక్ సముద్రం, ఉత్తరం వైపు ఉత్తర ఐర్లాండ్. వాతావరణం: జనవరి, ఫిబ్రవరిలో 4 నుండి 7 డి గ్రీలు, జూలై, ఆగస్టులో 14 నుండి 16 డిగ్రీలు. పంటలు - పరిశ్రమలు: తృణ ధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, కూరగాయలు. సహజ వాయువు, సీసం, జింకు, బెరైట్లు, జిప్సమ్, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్, యంత్ర పరికరాలు, రసాయనాలు, ఎరువులు, దుస్తులు, ఫాబ్రిక్స్. సామ్యవాద శకంలో పారిశ్రామీకరణ వల్ల భారీ పరిశ్రమలు లోహయంత్రాల ఉత్పత్తి, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు, నూనెశుద్ధి కర్మాగారాలు మొదలైన వాటి వల్ల 20 శతాబ్దం చివరలో బల్గేరియా ఆధిపత్యం కొనసాగింది. స్వాతంత్య్రం: డిసెంబర్, 1921 చర్రిత: క్రీస్తుశకం 432లో ఈ ప్రాంతాన్ని సెయింట్ పాట్రిక్ పాలించాడు. ఆ తర్వాత వైకింగ్లు ఈ ప్రాంతంలో వలస వచ్చి స్థిరపడిపోయారు. వీరిదే అక్కడ ఆధిపత్యం. ఐర్లాండ్ దేశానికి చెంది బ్రయాన్ బోరు అనే మాతృదేశ భక్తుడు క్రీస్తుశకం 1024లో వైకింగ్లను ఓడించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడు. కాని అది ఎంతో కాలం నిలువలేదు. క్రీ.శ.1168లో ఇంగ్లండ్ రాజు రెండవ హెన్రీ ఐర్లాండ్ను ఆక్రమించాడు. ఇక అప్పటి నుండి నిన్న మొన్నటిదాకా ఐర్లాండ్ ఇంగ్లండ్ అధీనంలో ఉండేది. 16, 17 శతాబ్దాలలో ఇక్కడి ప్రజల భూములను ఆంగ్లేయులు లాక్కున్నారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్కు చెందిన ప్రొటెస్టెంటులు ఇక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇది క్యాథలిక్కులకు ప్రొటెస్టెంటులకు మధ్య ఆధిపత్యపోరు. 1801లో యూనియన్ ఆక్ట్ రూపొందించారు. దాని ప్రకారం ఐర్లాండ్లో పార్లమెంటు రద్దు కాబడింది. కేవలం అక్కడి నుండి సభ్యులు ఎన్నికై బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు వెళ్లాలి. బ్రిటిష్ రాజులు ఐర్లాండ్లో క్యాథలిక్కులు ఎలాంటి అధికారాలను, కార్యాలయాలను కలిగి ఉండరాదని నిషేధం విధించారు. అయితే 1828లో క్యాథలిక్కు అయిన డేనియల్ ఓ కానెల్ సభ్యుడుగా గెలిపొందినపుడు బ్రిటిష్ ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించవలసి వచ్చింది.1845లో అనూహ్యమైన కరువు కాటకాలు ఏర్పడి దాదాపు పది లక్షల మంది ఆకలితో మరణించారు. 1847లో రెండున్నర మిలియన్ల ప్రజలు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ రాజులు ఐర్లాండ్లో హోమ్ రూల్ అమలు చేశారు. 1916 నుండి 1921 వరకు ఐరిష్ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల మీద యుద్ధం చేశారు. చివరికి 1921లో ఐర్లాండ్ స్వాతంత్రం పొందింది. ప్రజలు - సంస్కృతి సాధారణంగా ప్రజలు తెలుపు రంగులో ఉంటారు. సంవత్సరం పొడుగునా వేడిమి తక్కువగా ఉంటుంది. జనవరి కాలంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలను తాకుతుంది. మహిళలు పని సమయంలో ఏప్రాన్ లాంటి కోటు ధరిస్తారు. తలకు ఒక పట్టీ కట్టుకుంటారు. పురుషులు, మహిళలు సమానంగా పనిచేస్తారు. ఇక్కడి ప్రజలు స్నేహభావంతో ఉంటారు. తీరిక సమయాల్లో మహిళలు కుట్లు, అల్లికల పని చేస్తారు. జనాభా అంతా క్రిస్టియన్లే. వీరంతా ఆదివారం తప్పకుండా చర్చికి వెళతారు. గ్రామాల్లో చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 50 శాతానికి పైగా ప్రజలు దేవుని నమ్ముతారు. జాతీయ పండుగల సమయంలో గ్రామస్థాయి నుండి రాజధాని నగరం దాకా ప్రజలు ఆట పాటల్లో మునిగిపోతారు. ప్రతి కుటుంబానికి ఇల్లు తప్పకుండా ఉంటుంది. పొలం పనులు మగవాళ్లు ఎక్కువగా చేస్తారు. వీరు ఆధునిక య్రంతాలతో వ్యవసాయం చేస్తారు. మహిళలకు నాట్యం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడి ప్రజలు తేనెను అధికంగా ఉపయోగిస్తారు. బ్రెడ్డు, కూరగాయల ముక్కలు అల్పాహారంగా తింటారు. మాంసం ముఖ్య ఆహారం. వీటితో పాటు బాక్సిటీ, బారమ్ బ్రాక్, సోడా బ్రెడ్, ఛాంప్ కూరగాయల రోస్ట్, కోల్కనన్, స్ట్యూ, బెకన్ కాబే జి, కాడిల్, చేడర్, బంగాళ దుంపలు, ఉల్లిపాయల చిప్స్, చీజ్ కేక్ మొదలైన పదార్థాలను అధికంగా తింటారు. పరిపాలనా రీతులు ఐర్లాండ్ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు ప్రావిన్స్లుగా విభజింపబడి ఉంది. అవి కొన్నాచెట్, లీన్స్టర్, మున్యటర్, ఉల్స్స్టర్లు. వీటిలో ఉల్స్స్టర్ ఉత్తర ఐర్లాండ్ భాగం. ఈ నాలుగు ప్రావిన్స్లు తిరిగి 32 సాంప్రదాయక కౌంటీలుగా విభజింపబడి ఉన్నాయి. 28 ఐర్లాండ్లో, 6 ఉత్తర ఐర్లాండ్లో ఉన్నాయి. దేశంలో దాదాపు పది పెద్ద నగరాలు ఉన్నాయి. అవి డబ్లిన్, బెల్ఫాస్ట్, కార్క్, లిమరిక్, డెర్రీ, గాల్వే, వాటర్ ఫోర్డ్, క్రేగనోన్, డ్రోగెడా, డుండాల్క్లు. చూడదగిన ప్రదేశాలు... 1. డబ్లిన్ వైకింగ్ రాజులు ఈ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేశారు. నగరం గుండా లిఫ్సీనది ప్రవహిస్తుంది. నగరం ఎంతో అందమైన భవనాలతో నిండి చూడడానికి ఎన్నో పురాతన రాచరిక కట్టడాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి డబ్లిన్ కాజిల్, ఫీనిక్స్ పార్క్, ఐర్లాండ్ అధ్యక్షుడి నివాస భవనం - అరస్ అనే ఉచ్చారిస్, మెరియన్ వీధిలో ప్రభుత్వ భవనాలు, ఓ కానెల్ వీధిలో శతాబ్దం నాటి జనరల్ పోస్టాఫీస్ భవనం, నేషనల్ గాలరీ, నేషనల్ లైబ్రరీ, గ్లాస్నెవిన్ సిమెట్రీ, ఐరిష్ నేషనల్ వార్ మెమోరియల్, శతాబ్దం క్రిందటి కిల్మెన్హమ్ గోల్ జైలు భవనం, డబ్లిన్ లిటి ల్ మ్యూజియం, సుప్రీంకోర్టు భవనం, నేషనల్ బొటానికల్ గార్డెన్, సెయింట్ మేరిస్, క్రైస్ట్ చర్చ్ క్యాథడ్రల్లు, సెయింట్ పాట్రిక్స్ క్యాథడ్రల్, ఎలిజబెత్ రాణి నిర్మించిన డబ్లిన్ విశ్వవిద్యాలయ భవనం, 18వ శతాబ్దపు నిర్మాణం ఫిట్జ్ విలియం, మెరియన్ స్క్వేర్లు హాఫెనీ బ్రిడ్జి, రాయల్ కెనాలు ఇలా నగరం నిండా చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. 2. బోయ్నే ప్యాలస్ కౌంటీ మీట్ ప్రాంతంలో బ్రూనా బోయినె లేదా బోయ్నా ప్యాలస్గా పిలవబడే ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక కట్టడం ఉంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది అత్యంత పురాతన కట్టడం. ఈజిప్టులోని గీజా పిరమిడ్ల కన్నా పురాతనమైనవి. డిసెంబర్ 21వ తేదీన ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టూంబులోకి సూర్యకిరణాలు నేరుగా వెళతాయి. సన్నటి దారిలోంచి సూర్యకిరణాలు వెళ్లడం ఒక గొప్ప అద్భుతం. కేవలం డిసెంబర్ 21న మాత్రమే ఇది జరుగుతుంది. ఇదొక అంతు తెలియని కట్టడం అని అందరూ అనుకుంటారు. ఈ నిర్మాణం క్రీస్తు పూర్వం 330లో జరిగిందని చరిత్ర చెబుతోంది. ఈ పరిసరాల లో దాదాపు 40 ఇలాంటి టూంబులు ఆ కాలంలో నిర్మించారు. వీటి నిర్మాణంలో నిర్మాణ శైలి, ఇంజనీరింగ్ , ఖగోళ వింత అనేది ఇప్పటికీ సృష్టంగా తెలుస్తుంది. ఆ రోజున మాత్రమే సూర్యకిరణాలు లోపలికి వెళ్లడం అనేది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. క్రీస్తు పూర్వం 2900 నుండి ఇవి నిరుపయోగం అయిపోయాయి. క్రీస్తు పూర్వం 500 క్రీస్తు శకం 400 మధ్య కాలంలో తిరిగి ఇక్కడ ప్రజలు నివసించారని చెప్పే ఆనవాళ్లు ఉన్నాయి. 3. కార్క్ దేశానికి దక్షిణ భాగంలో అట్లాంటిక్ సముద్రతీరంలో నెలకొని ఉన్న మరో పెద్ద నగరం కార్క్. ఈ నగరం 18వ శతాబ్దంలో సెయింట్ మేరీ, సెయింట్ అన్నే, సెయింట్ ఫిన్ బర్రే క్యాథ్రడల్లు నిర్మితమయ్యారు. సెయింట్ అన్నే కాథడ్రల్ పైన నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ఒక్కొక్క గడియారం ఒక్కొక్క సమయాన్ని చూపిస్తుంటాయి. అలా ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. దీనినే ‘నాలుగు ముఖాల అబద్ధాల కోరు’ అని పిలుస్తుంటారు. ఈ నగరంలో ఫొటో ైవె ల్డ్లైఫ్ పార్కు, 17వ శతాబ్దంలో నిర్మితమైన ఎలిజబెత్ ఫోర్ట్, కార్క్ ఓపెరా హౌస్, ఇంగ్లీష్ మార్కెట్, బ్లార్నీ క్యాజిల్, ఐర్లాండ్ నేషనల్ యూనివ ర్సిటీలు ఉన్నాయి. ఈ నగరం లీనది తీరంలో నిర్మించబడింది. నది రెండు పాయలుగా చీలి మధ్యన భూభాగం ఒక ద్వీపంలా కనబడుతోంది. నగరంలో ఉన్న సిటిహాల్ భవనం, షాన్డోన్ స్టీఫుల్ చూడదగ్గవి. వైకింగ్ రాజులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 900 శతాబ్దంలో పాలించినపుడు ఈ నగరం నిర్మితమైంది. ఈ నగరం ఇప్పుడు గొప్ప వ్యాపార కేంద్రంగా వృద్ధి చెందింది. 4. లిమెరిక్ ఐర్లాండ్ దేశంలో మూడో అతిపెద్ద నగరం లిమెరిక్. ఇది షన్నన్ నదీ తీరంలో ఉంది. క్రీస్తు శకం 800 శతాబ్దం నుండి ఈ నగరం ఉనికిలో ఉంది. 12వ శతాబ్దంలో నార్మన్ రాజులు ఈ నగరాన్ని మరింత మెరుగు పరిచారు. ఇక్కడే శతాబ్దాల నాటి భవనాలు, సెయింట్ మేరీ క్యాథడ్రల్ ఉన్నాయి. నగరంలో హాంట్ మ్యూజియం, బెల్టబుల్ ఆర్ట్ సెంటర్, షన్నన్ ఎయిర్ ఫోర్ట్, లిమెరిక్ సిటీ మ్యూజియం, కింగ్ జాన్ క్యాజిల్, సెయింట్ మేరీ క్యాథడ్రల్, ట్రీటీ స్టోన్, తోమండ్ బ్రిడ్జి... ఇలా ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో మనకు దర్శనమిస్తాయి. ఓ కాన్నెల్ వీధిలో ఉన్న కన్నాక్ డిపార్టుమెంటల్ స్టోర్ భవనం ఎంతో విశాలంగా ఎంతో పొడవుగా, తెలుపు రంగులో దర్శనమిస్తుంది. -
హోలీ టూర్
- నిర్మలారెడ్డి యాంత్రికంగా సాగిపోయే జీవితాల్లో పండగ ఒక ఆనందసౌరభాన్ని నింపుతుంది. అందుకే పండగను బంధుమిత్రుల మధ్య ఆకాశమే హద్దుగా అనిపించే ఆనందాన్ని సొంతం చేసుకునేలా జరుపుకుంటారు. దాంట్లో భాగంగా మన దగ్గర పండగల సంఖ్య ఎక్కువే ఉంది. వాటన్నింటిలో ప్రత్యేకమైనది హోలీ. కొత్త అందాలు నింపుకున్న ప్రకృతి సిరులలో తడిసి ముద్దవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో భాగంగానే రంగులను చల్లుకొని, ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుంటారు. వయసు తేడా లేకుండా జరుపుకునే ఈ ఆనందకేళీ విలాసానికి మూలం మన భారతదేశమే! ఆ సౌరభాలను తమ జీవితంలోనూ నింపుకోవడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపుతుంటారు. ఉత్తర భారతదేశంలో ఇంపుగా సాగి, దక్షిణభారత దేశాన్ని అందంగా పలకరించి, విదేశాలలోనూ కాలు మోపిన రంగుల పండగను వీక్షించడానికి మన దగ్గరా కొంతమంది బయల్దేరుతారు. వారిలో పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులు, చిత్రకారులూ.. ఉంటారు. వారం రోజుల ముందుగానే... ఉత్తరప్రదేశ్లో మథురకు దగ్గరగా ఉండే బర్సానా, నంద్గావ్లలో విభిన్నంగా హోలీని జరపుకుంటారు. హోలీకి వారం రోజుల ముందు నుంచే ఉత్సవాలను జరపుతారు. ఆ విధంగా ఫిబ్రవరి 27 నుంచే ఉత్సవాలు జరుపుతారు. ఇందులో ముందుగా నంద్గావ్ గ్రామం నుంచి మొదలైన ఉత్సవం మార్చి 1 నాటికి బృందావనంలోని బాంకే బిహారీ మందిరం వద్ద అత్యంత వైభవంగా జరుపుతారు. హోలీ రోజున లడ్డూలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు. రాధాకృష్ణులకు సంబంధించిన ఆధ్యాత్మిక బృందగీతాలను మధురంగా ఆలపిస్తారు. నలభై రోజుల ముందుగానే.. మథుర, బృందావనాల్లో నలభై రోజుల ముందుగానే వసంత పంచమి రోజున హోలీని వేడుకగా నిర్వహిస్తారు. ఢిల్లీ నుంచి మథుర, బృందావనం చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. కృష్ణుడు జన్మించిన స్థలం మధుర. పెరిగింది బృందావనంలో. అందుకే ఇక్కడ వేడుక అత్యంత వైభవంగా ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో వసంతం అత్యంత వేడుకగా జరుపుతారు. బెంగాల్ చరిత్రలో, సంస్కృతిలో హోలీకే అత్యంత ప్రాధాన్యం. హోలీ నాటికి ఇక్కడకు అధికసంఖ్యలో విదేశీ యాత్రికులు వస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీనకాలం నుంచే ఇక్కడ హోలీ ఉత్సవాలు జరుపుతున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లాలో హోలీ వేడుక కనులారా చూడాల్సిందే, ఆ రంగుల్లో మునిగితేలాల్సిందే అని యాత్రికులు చాలా ఉత్సాహపడతారు. ఇక్కడ జానపద కళలు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా చావ్ నృత్యం, దర్బారి ఝుమర్, నటువా డ్యాన్స్తో పాటు జానపద పాటలను ఉత్సాహభరితంగా ఆలపిస్తారు. కలకత్తా నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి 5-6 గంటల సమయం పడుతుంది. కలకత్తా నుంచి ప్రైవేటు రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. వసతి సదుపాయాల కోసం ఇక్కడ టెంట్లు అద్దెకు ఇస్తారు. పంజాబ్ రాష్ట్రంలోని ఆనందపూర్లో సిక్కులు అత్యంత వైభవంగా హోలీని జరుపుతారు. పంజాబ్ పర్యాటక శాఖ చంఢీగఢ్ నుంచి నాలుగు రోజుల పాటు ‘హోలా మొహల్లా టూర్’ను ఆఫర్ చేస్తోంది. రాచరికపు హంగుల హోలీ... ఉదయపూర్లో రాచరికపు హంగుల మధ్య హోలీని వేడుకగా జరుపుతారు. హోలీ ముందురోజు అంటే పౌర్ణమి రాత్రిలో దుష్టశక్తులను దూరం చేయడానికి జరిపే ఈ వేడుకలో మేవాడ్ రాజరిక కుటుంబం పాల్గొంటుంది. పట్టణంలోని మేనక్ చౌక్ ప్యాలెస్ పరిసరప్రాంతాలలో రాత్రిపూట గుర్రపు డెక్కల చప్పుడు, బ్యాండ్ వాయిద్యాల హోరు హృదయాన్ని లయ తప్పిస్తాయి. రాచరికపు హంగుల మధ్య సంప్రదాయ పద్ధతిలో హోలికా దహనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంత సందర్శనకు టూరిజమ్ వారిని సంప్రదించాలంటే ఫోన్: +919910900630 మురికివాడల సహజత్వం హోలీ... ముంబయ్లో హోలీ వేడుకను చూడాలంటే ధారావి ప్రాంతానికి వెళ్లాల్సిందే! ధారావి ముంబయ్లోని అతి పెద్ద మురికివాడ. ఇక్కడ ఉండే సహజత్వం నడుమ... మురికివాడల బాలల ఉత్సాహాన్ని చూడాలనుకునే యాత్రికులు ఇక్కడకు లెక్కకు మించి వస్తారు. అంతేకాదు ఇక్కడ అన్ని చోట్ల కన్నా అత్యంత సురక్షితంగా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పూర్తిగా రంగులు, సంగీతపు హోరును ఆస్వాదించవచ్చు. అలాగే ఆధ్యాత్మికులలో 80 శాతం మంది ఈ ప్రాంతానికి విచ్చేసి మురికివాడల జనాలకు సహాయాలు చేస్తుంటారు. ఏనుగమ్మ ఏనుగు... జైపూర్లో హోలీ పండగ రోజునే ఏనుగుల పండగ జరుపుతారు. ఆ విధంగా హోలీ అంటే జైపూర్లోనే చూడాలనుకునే యాత్రికులు ఎంతోమంది. ఏనుగుల విన్యాసాలు, జానపద నృత్యాలు... కన్నుల పండువగా జరుగుతాయి. స్థానికులతో పాటూ విదేశీయాత్రికులూ ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. దీంతో ఇక్కడ హోలీ సంబరం రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ హోలీ వేడుక అత్యంత ఆధునికంగా ఉంటుంది. దగ్గరలోని పహడ్గంజ్లో రంగులు అమ్మే దుకాణదారులు, కొనుగోలు దారులు, పిల్లలతో అత్యంత సందడిగా ఉంటుంది. ఇక్కడ రంగుల కేళీ, సంగీతపు హోరు పట్టణానికి కొంత దూరంలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పర్యావరణ హితంగా వేడుకను జరపుకోవడం విశేషం. సహజమైన రంగులతో పాటు వీధుల్లో అమ్మే ఆహారపదార్థాలు సైతం కల్తీ లేకుండా ఉండటం ప్రత్యేకత. ఉత్తరాదితో పోల్చితే దక్షిణభారతదేశంలో హోలీ హంగామా కొంత తక్కువనే చెప్పాలి. కర్నాటకలోని హంపిలో ఉదయం వేళలో మాత్రమే హోలీ జరుపుకుంటారు. విదేశీ యాత్రికులు ఆ సమయానికి ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడ డప్పు వాద్యాలు, నృత్యాలు, పరుగుల మధ్య రంగులు జల్లుకోవడం.. నాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కడతాయి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక అందరూ నదీ స్నానం చేసి ఇళ్లకు చేరుకుంటారు. విదేశాలలోనూ కనులకు విందుగా... ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్లోనూ హోలీ వేడుకలను అక్కడక్కడా తిలకించవచ్చు. బంగ్లాదేశ్లో హిందూ, బౌద్ధం కూడా ప్రధానంగా కనిపిస్తుంటాయి. హిందువులతో పాటూ ఇక్కడ ముస్లింలూ హోలీ పండగలో పాల్గొని మత సామరస్యతను చాటుతుంటారు. హిందూ దేవాలయాలు, కూడలిలో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ దేశాలతో పాటు మారిషస్, నేపాల్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, అమెరికాలోనూ రంగుల పండగను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాలలో భారతీయులు స్థిరపడటమే! బృందాలుగా ప్రయాణం... సాంస్కృతిక పరంగా ప్రత్యేక పండగలను స్పెషలైజ్డ్ టూర్లు అంటాం. ప్రత్యేకమైన హోలీ ఉత్సవాన్ని తిలకించడానే కాదు, పండగలో తామూ భాగవం కావడానికి ఎక్కువగా యురోపియన్, అమెరికా యాత్రికులు మనదేశానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. మన దగ్గర నుంచి కొంతమంది బృందాలుగా ఏర్పడి హోలీ పండగ బాగా జరపుకునే ప్రాంతాలను ఎంచుకొని వెళుతుంటారు. ఒక్కో బృందంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. రంగుల నడుమ వచ్చే ఉత్సాహాన్ని ఒక్కొక్కొరు ఒక్కోవిధంగా వెంట తెచ్చుకుంటారు. - ఎస్.శంకర్ రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్, ఇండియాటూరిజమ్ మరిన్ని వివరాలకు... ఇండియాటూరిజమ్, పర్యాటకభవన్, బేగంపేట్, హైదరాబాద్ ఫోన్: 040-23409199 -
టూకీగా ప్రపంచ చరిత్ర..48
రచన: ఎం.వి.రమణారెడ్డి నాగరికత చైనాలోని ‘హ్వాంగ్ హో’ లేదా ‘ఎల్లో నది’ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది ‘చైనా నాగరికత’. ఈ నది ‘బేయన్హార్' పర్వతశ్రేణిలో పుట్టి, కొన్నిచోట్ల ఉత్తరానికీ, కొన్నిచోట్ల దక్షిణానికీ మెలికలు తిరుగుతూ, చివరకు తూర్పుముఖంగా సాగి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీని మలుపుల్లో అత్యంత ప్రధానమైన ‘ఆర్డోస్ వంపు’ చైనా నాగరికతకు పీఠం. ఇప్పుడు బీడుభూమిగా మారిన ‘టారిం నది’ లోయ క్రీ.పూ. 7000 కాలం నాటి నాగరికతకు మూలస్థానమనీ, క్రమంగా అది ఎల్లో నదిని అనుసరించి తూర్పుదిశగా జరిగిందనీ చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశంలో లాగే పురాతన చరిత్రకు సంబంధించిన విశేషాల్లో కల్పనలూ, అతిశ,ఞక్తులూ, మహాత్మ్యాలూ కొల్లలుగా కలిసిపోయిన చైనా గాథలను ఆధారం చేసుకుని వాస్తవ చరిత్రను నిర్మించడం అసాధ్యమైన ప్రయత్నం కావడంతో, చైనా నాగరికతను గురించి కూడా చరిత్ర అందుకోగలిగింది చాలా స్వల్పమే. శిథిలాలను బట్టి, ఆర్డోస్ వంపులో వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవించిన గ్రామాలు విస్తారంగా ఉండేవనీ, వాళ్ళు జొన్న పైరును ప్రధానంగా సాగుచేసేవాళ్ళనీ తెలుస్తూ వుంది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఇది పట్టుగూళ్ళకు ప్రపంచంలో మొదటి స్థావరంగా ఏర్పడడం మినహా, మిగతా విషయాల్లో వాళ్ళ జీవితం ఇతర నాగరికతలకు పోలిందే. ప్రధానమైన ఈ నాలుగు నాగరికతలకు తోడు, ఎక్కడో విసిరేసినట్టు మరో రెండు నాగరికతలు - ఒకటి ఉత్తర అమెరికాలోని మెక్సికోలో, రెండవది దక్షిణ అమెరికాలోని పెరూలో - అభివృద్ధికావడం అబ్బురపాటు కలిగించే విషయం. విస్తీర్ణంలో చిన్నవైనా, పురాతనత్వంలో ఇవి తక్కినవాటికి ఏమాత్రం తీసిపోయేవిగావు. అమెరికా ఖండంలో మానవుని పరిణామం జరుగలేదనీ, దక్షిణాసియా నుండి చైనా, కొరియా, సైబీరియాల మీదుగా కొత్తరాతియుగం మానవుడు మొదట ఉత్తర అమెరికా, ఆపైన దక్షిణ అమెరికా చేరుకున్నాడని ఇదివరకే మనం అనుకున్నాం. అదే మానవుడు ఇంతగా ఎదిగి, ఆ కొత్తనేల మీద వ్యవసాయదారుడై నాగరికతను నెలకొల్పుతాడని మనం ఊహించైనా ఉండం. కానీ అది జరిగింది. ‘యాండియెన్' పేరుతో పిలువబడే పెరూ దేశపు నాగరికతలో క్రీ.పూ. 7000 నాడే మొక్కజొన్న, పత్తి పైర్లను సాగుచేశారు. చిన్నసైజు ఒంటెల్లా కనిపించే ‘ల్లామా'లను పెంపుడు జంతువులుగా పోషించారు. అదే సమయంలో మెక్సికో దేశపు దక్షిణభాగంలో ‘ఆజ్టెక్' పేరుతో పిలువబడే నాగరికతలో మొక్కజొన్న, గుమ్మడికాయలు సాగయ్యాయి. మరింత ఆశ్చర్యం కలిగించే విశ్లేషణ ఏమిటంటే - పురాతన నాగరికతలకు మూలమైన ప్రజలందరూ నల్లజాతీయులేగానీ ఏవొక్క తావులోనూ తెల్లజాతీయులు కాకపోవడం. ‘‘చర్మంరంగు గోధుమ ఛాయ (చామనఛాయ) దగ్గరినుండి మసకతెలుపు వరకు పలు వైవిధ్యాలుండే ద్రవిడులు దక్షిణభారతదేశం నుండి కొత్తరాతియుగంలో బయలుదేరి, సముద్ర తీరాల వెంట పొడవాటి పట్టీలా విస్తరిస్తూ, ఒకవైపు ఈజిప్టు, స్పెయిన్ ప్రాంతాలనూ, మరోవైపు పసిఫిక్ తీర ప్రాంతాలనూ చేరుకుని మనం ఈనాడు ‘నాగరికత' అని పిలుస్తున్నదానికి మూలపురుషులైనార’’ని డార్విన్ సమకాలికుడైన ప్రఖ్యాత యాంత్రోపాలజిస్టు థామస్ హెన్రీ హక్స్లే చెప్పింది నిజమేనేమో! ఈ విస్తరణను ‘బెల్ట్ ఆఫ్ హక్స్లే’గా ‘ది ఔట్ లైన్ ఆఫ్ హిస్టరీ’లో హెచ్.జి.వెల్స్ ప్రస్తావించారు. కానీ, మన దురదృష్టంకొద్దీ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాకకు ముందటికాలం చరిత్రలో ఉత్తరభారతదేశానికున్న ప్రాముఖ్యత దక్షిణాదికి కరువయింది. (సశేషం) -
టూకీగా ప్రపంచ చరిత్ర 44
నాగరికత అతలాకుతలమైన భూగోళపు ఉపరితలం కుదురుబాటుకు చేరుకుంటున్న తరుణంలో మానవుని పరిణామంలో ‘నాగరికత’ మోసెత్తింది. ఏ పదివేల సంవత్సరాలకు పూర్వమో విల్లనమ్ములు చేత్తో పట్టుకుని దశదిశలా విస్తరించిన మానవునితో మనకు ‘సంస్కృతి’ ప్రారంభం కాగా, నాగలి పట్టిన మానవునితో నాగరికత మొదలయింది. సంస్కృతి వేరు, నాగరికత వేరు. ఉమ్మడి ఆచార విశ్వాసాలు సంస్కృతి; ఉమ్మడిగా అనుభవించే సౌకర్యాలు నాగరికత. సంస్కృతి సంచార జాతుల్లోనూ ఉంటుంది. నాగరికత స్థిరనివాసుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏడాది పొడవునా నీటికి కొరత ఉండని జీవనదులను ఆశ్రయించి క్రీ.పూ.7000 ప్రాంతంలో నాగరిక నివాసాలు మొదలైనట్టు మనకు దొరుకుతున్న ఆధారాలు నిరూపిస్తున్నాయి. చిత్రమేమిటంటే - ఈ రెండు దశలూ కొత్తరాతియుగం అంతర్భాగాలే. లోహం గురించి అప్పటికి తెలీకపోవడంతో, కర్రు లేని నాగలితో సాగిందే సేద్యం; రాతి కొడవలితో బరుక్కున్నదే కోత! అతి పురాతనమైన నాగరికతలుగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల్లో బహు విస్తారమైనవి - 1. మెసొపొటేమియా, 2. ఈజిప్టు, 3. సింధూ, 4. చైనా నాగరికతలు. వీటిల్లో ముందుగా చెప్పుకోదగింది ‘మెసొపొటేమియా’. యూఫ్రాటెస్,టైగ్రిస్ పేరుగల రెండు నదుల మధ్య విస్తరించిన ప్రాంతం కావడంతో దీనికి ఆ పేరొచ్చింది. ఈ నదుల మూలంగా, సిరియా మొదలు పర్షియల్ గల్ఫ్వరకు చాపంలా విస్తరించిన పీఠభూమి (ఫెర్టైల్ క్రిసెంట్) ప్రపంచంలోకెల్లా అత్యంత సారవంతమైనదిగా ప్రసిద్ధి. చరిత్రకు పితామహుడైన ‘హెరొడోటస్’ ప్రకారం, ఆ భూముల్లో విత్తిన ప్రతి గోధుమ గింజ రెండు వందల రెట్లు ఫలసాయం ఇచ్చేదట. అంతేగాదు, ఆరోజుల్లోనే గోధుమను ఇరుగారు పండించేవాళ్ళనీ, కోతలు పూర్తయిన తరువాత ఆ పొలాల్లో పశువులకు మేత పుష్కలంగా దొరికేదనీ, ఖర్జూరం మొదలు ఎన్నోరకాల పండ్ల చెట్లు ఆ ప్రాంతంలో విస్తారంగా ఉండేవనీ బైబిల్ కాలంనాటి చరిత్రకారులు చెబుతున్నారు. హెరొడోటస్ నాటికి గోధుమ బహుళ ప్రచారం పొందిన పంట కావచ్చుగానీ, తొలితరం వ్యవసాయదారునికి ఆ పైరును గురించి అవగాహన లేదు. అప్పట్లో తెలిసిన తృణధాన్యాలు జొన్న, బార్లీ మాత్రమే. గోధుమను తెలుసుకునేందుకు మరో రెండువేల సంవత్సరాలు పట్టింది. ఆహారంలో భాగంగా పప్పుదినుసులు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పలేం గానీ, పలురకాల పప్పుధాన్యాలు మెట్టపైర్లుగా మెసొపొటేమియాలో ప్రవేశించాయి. వాళ్ళ వ్యవసాయం తడిపైర్లకు మాత్రమే పరిమితం కాలేదనీ, అది బహుముఖంగా విస్తరించిందనీ ఈ పప్పుదినసులు నిరూపిస్తున్నాయి. వీటిల్లో ‘నువ్వులు’ కూడా ఉండడం మరింత అపురూపం. నువ్వుల నుండి వచ్చింది ‘నూనె’. సంస్కృతంలో ‘తిల’ నుండి వచ్చింది ‘తైలం’. నూనెనిచ్చే పదార్థాలకు నువ్వుగింజ మొదటిది కావడంతో, ఆ తరువాత ఏ గింజనుండి అలాంటి పదార్థం లభించినా దాన్ని నూనెగానే వ్యవహరిస్తున్నాము - అవిసె నూనె, ఆవనూనె, కుసుమనూనె, వేరుసెనగ నూనె - ఇలా. మరో మూడువేల సంవత్సరాల తరువాత సింధూనది తీరంనుండి దిగుమతులు మొదలయ్యేవరకూ ‘పత్తి’ని గురించి మెసొపొటేమియాకు తెలీదు. దుస్తులుగా వాళ్ళు ధరించినవి ఉన్నితోనూ, నారతోనూ తయారైన బట్టలు. ‘మగ్గం’ ఇంకా అందుబాటులోకి రానందున, పడుగునూ పేకనూ చేతికర్రల సహాయంతో మార్చుకుంటూ నేసేదే నేత. లడక్, మేఘాలయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈతరహా నేత మనకు కనిపిస్తుంది. వాడుకునే దినుసులన్నీ ఒకే తావులో పండవు కాబట్టి ప్రయత్నం లేకుండా ప్రవేశించిన విధానం ‘వస్తుమార్పిడి’. దరిమిలా, సంతల రూపంలో వర్తకానికి పునాది ఏర్పడింది. వర్తకం అనగానే ప్రామాణికమైన కొలతలూ, తూకాలూ అవసరమౌతాయి. ఒకే పరిణామంలో తయారుచేసుకున్న గంపలతోనూ, ఇంచుమించు ఒకే బరువుండే గుండ్రాళ్ళతోనూ బహుశా వాళ్ళు ఆ అవసరాన్ని తీర్చుకోనుండొచ్చు. గింజకూ గింజకూ తూకంలో తేడా స్వల్పాతిస్వల్పమైన కారణంగా గురువింద గింజలను ఇటీవలి కాలందాకా బంగారు తూకానికి వినియోగించడం మనం చూసేవున్నాం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
షైన్ విత్ వైన్
రేపు డ్రింక్ వైన్ డే పసందైన విందు భోజనానికి ‘వైన్ అండ్ డైన్’ అని ఇంగ్లిషులో వాడుక. వైన్ లేని విందు అసలు విందే కాదనేది పాశ్చాత్యుల భావన. వారి సంస్కృతిలో వైన్కు అంతటి ప్రాధాన్యత ఉంది మరి. మన దేశంలోనూ సురార్చకులకు కొదవ లేకపోయినా, మిగిలిన మధువులతో పోల్చి చూస్తే వైన్ వాడుక మాత్రం చాలా పరిమితం. ‘బీరాధిబీరు’లైన హైదరాబాదీలు ఎక్కువగా బీరు సాగరంలోనే ఓలలాడేందుకు ఇష్టపడతారు తప్ప, వెరైటీగా వైన్ టేస్ట్ చేయాలని కోరుకోవడం కాస్త అరుదే. నిజానికి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇతరేతర మధుపానీయాల కంటే వైన్ చాలా శ్రేష్టమైనది. పరిమితంగా, క్రమం తప్పకుండా వైన్ సేవించే వారికి చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరవు. మధువులన్నింటిలోనూ ‘సారా’శం ఒకటే కదా, అలాంటప్పుడు వైన్ వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమిటని ప్రశ్నించే ‘మందు’మతుల అవగాహన కోసం ఒక చిన్న ఉదాహరణ. ఫ్రాన్స్ను మినహాయిస్తే, చాలా పడమటి దేశాల్లో కూడా విస్కీ, వోడ్కా, బీరు వంటి పానీయాల వినియోగమే ఎక్కువ. అమెరికన్లు వినియోగించే కొవ్వు పదార్థాలతో పోలిస్తే, ఫ్రెంచి ప్రజలు ఆరగించే కొవ్వు పదార్థాలు 30 శాతం ఎక్కువ. అయినా, ఫ్రాన్స్తో పోలిస్తే కొవ్వు ఎక్కువ కావడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడే అమెరికన్లు 40 శాతం ఎక్కువ. అమెరికా కంటే పుష్కలంగా ద్రాక్షలు పండే ఫ్రాన్స్లో వైన్ వినియోగం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ వైచిత్రికే ఫ్రెంచి వైద్యుడు డాక్టర్ సెర్జే రెనాడ్ ‘ఫ్రెంచ్ పారడాక్స్’ అని పేరు పెట్టాడు. వైన్ సేవనం వల్ల ఫ్రెంచి ప్రజలు పొందుతున్న ఆరోగ్య లబ్ధిని గమనించిన అమెరికన్ ‘మందు’మతులు వైన్ కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని సృష్టించారు. ఏటా ఫిబ్రవరి 18న అమెరికాలో దేశవ్యాప్తంగా జరుపుకొనే ‘నేషనల్ డ్రింక్ వైన్ డే’ సందర్భంగా బార్లు, పబ్బులు రకరకాల వైన్లతో కస్టమర్లకు ‘మదిరా’నందం కలిగిస్తాయి. రోజూ 8 ఔన్సులకు మించకుండా వైన్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రపంచవ్యాప్తంగా వైద్యుల ఉవాచ. మన భాగ్యనగరంలో ఇప్పుడిప్పుడే వైన్ వైపు మొగ్గుతున్న వారు నెమ్మదిగా పెరుగుతున్నారు. జంటనగరాల్లో నెలకు రూ.3 కోట్ల మేరకు వైన్ విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ గణాంకాల భోగట్టా. ‘సిటీ’జనులలో వైన్ ప్రశస్తిపై అవగాహన కల్పించేందుకు ‘హైదరాబాద్ వైన్ క్లబ్’ కూడా ఇతోధికంగా కృషి చేస్తోంది. భాగ్యనగర సురార్చకులారా! ఇంకెందుకాలస్యం.. డ్రింక్ వైన్ డే సందర్భంగా మీరు కూడా వైన్తో చీర్స్ చెప్పండి. - వైన్తేయుడు -
లెన్స్ - ఎసెన్స్
చల్లటి ఛాలెంజ్ ఈ మధ్యనే ప్రపంచమంతా ‘ఐస్బకెట్ ఛాలెంజ్’ తో వణికి ఆనందించింది. చైనాలో ఇలాంటి సంప్రదాయమే ఒకటుంది. దీన్ని ‘ఐస్వాటర్ ఛాలెంజ్’ అంటారు. ఐస్తో ఉండే కొలను లోకి దిగి, చేతులతో పెద్ద మంచుపలకను పట్టుకొని, ఐస్ క్రీమ్ తినాలి. దీనికి తోడు పక్కనుంచి చల్లటి గాలి విసిరే ఫ్యాన్ఎఫెక్ట్ అదనం. ఇలాంటి చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు హనాన్ ప్రావీన్స్లోని జాంగ్జియాజీ పట్టణవాసులు. సరదాగా సాగే ఈ పోటీలో ఎక్కువసేపు ఆ కొలనులో ఉన్నవారే విజేతలు. దానమహోత్సవం దానం ఇవ్వడం ఎక్కడైనా గొప్ప పనే. ఈ పనికి ప్రత్యేకంగా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, సందర్భాలు కూడా ప్రతి సంస్కృతిలోనూ ఉంటాయి. తన ఆస్తులన్నింటినీ దానంగా ఇచ్చి సన్యాసిగా మారిన 19వ శతాబ్దపు స్పెయిన్ ధనవంతుడు సాన్ ఆంటోనియో అబాద్ స్ఫూర్తితో స్పెయిన్లో ప్రతి ఏడాదీ జనవరి 25న దానోత్సవం మొదలవుతుంది. 36 గంటలపాటు స్పెయిన్ ప్రజలు తమకు చేతనైనంత దానం చేస్తూ ఆంటోనియో స్ఫూర్తిని చాటుతారు. ఈ సందర్భంగా ఇటీవల స్పెయిన్ దక్షిణ ప్రాంతంలోని ట్రిగ్యురోస్ అనే గ్రామంలో సంబరాల్లో భాగంగా ఒక మహిళ ఇంటి కిటికీలోంచి బ్రెడ్రోల్స్ను విసురుతోంది. సైకిలెక్కిన సాహసం టూ వీలర్ నడపడం ఈజిప్షియన్ మహిళ ధైర్యసాహసాలకు నిదర్శనం. మహిళలు సైకిల్ తొక్కడం, మోటర్ సైకిల్ నడపడంపై చాలా అరబ్ దేశాల్లో నిషేధం ఉంది. అయితే ఈజిప్టులో అధికారికంగా నిషేధం ఏమీ లేకపోయినా సంప్రదాయవాదుల తీరుతో ఈ దేశంలో వీటిపై అప్రకటిత నిషేధం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా రాజధాని కైరో వీధుల్లో కొంతమంది యువతులు సైకి ల్లో దూసుకుపోతూ కనిపిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి వీరిది పెద్ద సాహసమే. -
నిఘా నీడలో టీవీవీ మహాసభలు
నల్లగొండలో మొదలైన సమావేశాలు అనుమతికి ససేమిరా అన్న పోలీసులు హరగోపాల్ జోక్యంతో అనుమతి నల్లగొండ అర్బన్: నల్లగొండ వేదికగా గురువారం ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలు నిఘానీడలో కొనసాగాయి. తొలుత అసలు మహాసభల నిర్వహణకే అంగీకరించని పోలీసులు, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య అనుమతినిచ్చారు. కానీ పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి సభావేదిక వసుంధర ఫంక్షన్హాల్ వరకు ర్యాలీకి అంగీకరించలేదు. దీంతో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలు గురువారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య వక్త ఖరగ్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే మాట్లాడుతూ సభకు అనుమతివ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇది భార త రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలో ఒకే సంస్కృతి, ఒకే మతం అనే విధంగా మోదీ సర్కారు పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఫాసిజాలను తలపిం చే విధంగా పరిపాలిస్త్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక విలువల కోసం విద్యార్థులు, యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రొఫెసర్ అన్వర్ఖాన్, ఎ.నర్సింహ్మారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళామండలితో పాటు ఆర్.నారాయణమూర్తి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. హరగోపాల్ చొరవతో.. తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మహాసభల నిర్వహణకు స్థానిక పోలీసులు ససేమిరా అన్నారు. మహాసభ నిర్వహించాల్సిన ఫంక్షన్హాల్కు పోలీసులు తాళం వేశారని నిర్వాహకులు ఆరోపిం చారు. మహాసభల నిర్వహణలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్న నెపంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మహాసభలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని టీవీవీ నేతలు ప్రశ్నిం చారు. కాగా, నిర్వాహకులను పిలిపించి సభకు సంబంధించిన అన్ని వివరాలను జిల్లా పోలీస్ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ చొరవ కారణంగానే సభకు పోలీసులు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో ఈ విషయమై ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అయితే, వేదిక వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాశారు. మఫ్టీలో నిఘా పెట్టారు. మహాసభల నిర్వహణను వీడియో తీయించారు. -
నమస్కారం ఎందుకు చేయాలి?
మన సంస్కృతిలో ఎవరిని కలిసినా మొదట నమస్కారం చేస్తాం. అసలు నమస్కారం ఎందుకు చేయాలి? ఇది కేవలం సాంస్కృతిక అంశమేనా లేక మరేదైనా కారణం ఉందా? - ధూర్జటి భాగ్యలక్ష్మి, హైదరాబాద్ నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశం మాత్రమే కాదు. దాని వెనక ఓ విజ్ఞానం ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతిసారీ ఓ చిన్న శక్తి విస్ఫోటనం సంభవిస్తుంది. మీరొక వ్యక్తిని చూసినప్పుడు, అది మీరు పనిచేసే చోటైనా, వీధిలో అయినా, ఇంట్లో అయినా లేదా మరెక్కైడనా సరే, మానవ బుద్ధి నైజం ఎలాంటిదంటే, అది చూసిన క్షణమే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికొచ్చేస్తుంది. ఆ మనిషిలో ఇది బాగుంది, ఈ మనిషిలో ఇది బాగోలేదు; అతను మంచివాడు, ఇతను మంచివాడు కాదు, అతను అందంగా ఉన్నాడు, అతను వికారంగా ఉన్నాడు ఇలా ఎన్నో నిర్ణయాలకు వచ్చేస్తుంది. వీటన్నిటినీ మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలు, తీర్మానాలు జరిగిపోతాయి. మీ తీర్మానాలు పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ జీవితంలోని మీ గతానుభవాలనుండీ వస్తున్నాయి. దేన్నయినా, ఎవరినైనా వాళ్ళు ప్రస్తుతమున్నట్టుగా మీరు గ్రహించడానికి ఇవి అనుమతించవు. ప్రస్తుతమున్నట్టుగా విషయాలని, మనుషులని గ్రహించడం చాలా ముఖ్యం. మీరు ఏ రంగంలో అయినా సమర్థవంతంగా పని చేయాలంటే, మీ ముందుకు ఎవైరనా వచ్చినప్పుడు, వారిని ప్రస్తుతం వారు ఉన్నట్టుగా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. వారు నిన్న ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. వారు ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి, మొదట మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఒక్కసారి మీరలా చేస్తే, మీ ఇష్టాయిష్టాలు బలపడకుండా, మెత్తబడతాయి. ఎందుకంటే వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యమిదే. సృష్టికర్త హస్తం సృష్టికర్త హస్త ప్రమేయం లేనిదేదీ సృష్టిలో లేదు. సృష్టి మూలం, ప్రతి కణంలోనూ ప్రతి అణువులోనూ పనిచేస్తోంది. అందుకే భారత సంస్కృతిలో, మీరు పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, మీ సంస్కృతి ప్రకారం శిరస్సు వంచి అభివాదం చేయమని చెబుతారు. మీరొక స్త్రీని కాని, పురుషుడిని కాని, పిల్లాడిని కాని, ఆవుని కాని, చెట్ట్టుని కాని చూశారనుకోండి, మిమల్ని శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది ఈ సంస్కృతి. మీలో కూడా సృష్టి మూలం ఉందన్న విషయాన్ని ఇది నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తిస్తే, మీరు నమస్కారం చేసిన ప్రతిసారి మీరు మీ సహజ ప్రవృత్తి ైవైపు అడుగులు వేస్త్తున్నట్టే. దీనికి మరో కోణం కూడా ఉంది. మీ అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి. దీన్ని ఈనాటి వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది. వాస్తవానికి మీ నాలుక కన్నా, కంఠం కన్నా మీ చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగ ముద్రలకు సంబంధించి పూర్తి శాస్త్రమే ఉంది. మీ చేతిని కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మీరు మీ పూర్తివ్యవస్థనే భిన్నంగా పనిచేసేటట్లు చేయవచ్చు. మీరు మీ చేతులని జోడించిన క్షణమే, మీ ద్వంద్వభావనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ కోరికలు, మీరు ఈసడించుకునే విషయాలు, ఇవన్నీ సమమై, తొలగిపోతాయి. ఇలా మీరెవరో వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మీలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి. నమస్కారం... మిమ్మల్ని మీరే సమర్పించుకునే సంస్కారం! నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు... దాని వెనకాల ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరగతోంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు కేవలం ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. ఇది ప్రతిజీవికీ వర్తిస్తుంది. ఏ జీైవైనా దాని చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, ఎదగగలుగుతుంది. ప్రెజెంటేషన్: డి.వి.ఆర్. భాస్కర్ -
మండలానికో ‘కేజీ టు పీజీ’
విధివిధానాలపై సమీక్షలో సీఎం 27న విద్యావేత్తలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాలను మండలానికొకటి ఏర్పాటు చేయాలని టీ సర్కార్ యోచిస్తోంది. తొలుత నియోజకవర్గానికొకటి ఏర్పాటుచేయాలనుకున్నా, మండలానికొకటిచొప్పున నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డితో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 27న విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని సూచించారు. మండలానికొకటి చొప్పున కేజీ టు పీజీ విద్యాలయాలు 2016-17 విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించినట్లు సమాచారం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ప్రవేశం పొందే వీలు కల్పించేందుకు 3 వేల నుంచి 4 వేల సీట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతి ఉన్న గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామస్థాయిలో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఈ ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తేవాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్తు పేర్లతో ఉన్న స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలనే అంశంపైనా సీఎం ఆలోచించినట్లు సమాచారం. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పందెం.. పరుగు
పక్క జిల్లాకు వెళ్తున్న కోడిపందేల రాయుళ్లు సత్తుపల్లి బిర్రు శీతానగరంలో... మరోవైపు లక్షల్లో పేకాట పల్లెల్లో సందడే సందడి సత్తుపల్లి : సంక్రాంతి వచ్చేసింది. పండుగ సరదాలు తీర్చుకునేందుకు పందెం రాయుళ్లు పక్క జిల్లాలకు తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో కోడిపందాల సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈసారి పందాలు జరుగుతాయో.. లేదో అంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారి కోడిపందాలకు అనుమతి వస్తుందని పందెం రాయుళ్లు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ డబ్బులతో ఆంధ్రలో పందాలు కాయాల్సి వస్తోందని సరదా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శీతానగరంలో సత్తుపల్లికి చెందిన కొందరు పందెం రాయుళ్లు బిర్రు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోతునూరు, ఉండీ భీమవరం, నాగిరెడ్డిగూడెం, కళ్లచెరువు, చింతంపల్లి, ముల్కలంపాడు, ధర్మాజీగూడెం, కలరాయిగూడెం, కృష్ణాజిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్సాహంగా.. ఉల్లాసంగా సంక్రాంతి సందర్భంగా మూడురోజులు పందాలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎక్కడ చూసినా చంకలో కోడిపుంజు పట్టుకొని పందాలకు వెళ్లేవాళ్లే ఈ ప్రాంతంలో కనిస్తున్నారు. కోడి పందాలను వేసేందుకు.. తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో పల్లె ల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద యం నుంచే పందాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆరా తీసే పనిలో పందెం రాయు ళ్లు నిమగ్నమయ్యారు. పట్టణాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. లక్షల్లో కోడి కోసాట ఉదయం పూట కోడి పందాలు అయిపోగానే రాత్రి వేళ్లల్లో ప్లడ్లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతోందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోన, బయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందాలు ఓవైపు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసాహారం, బిర్యానీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. రాత్రి వేళ్లల్లో జనరేటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ నిఘా ఉన్నా.. కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినా పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గురు, శుక్రవారాల్లో సత్తుపల్లి డివిజన్లో చిన్నచిన్న పందాలు ఎక్కడపడితే అక్కడ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది పండుగ మూడురోజులు పోలీసులు పందాలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ చేస్తున్నా పందెం రాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందాల స్థావరాలను చేరుకుంటున్నారు. ఒక్కోసారి పోలీసులకు పందాలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి అటు పోలీసులను పంపించి వేరేచోట దర్జాగా పందాలు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పండగ మూడురోజులు కోడిపందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు డిమాండ్ చేయడం గమనార్హం. -
సంక్రాంతి సంబురం
నేడు సంక్రాంతి రేపు కనుమ నిజామాబాద్కల్చరల్: మూడు రోజుల ముచ్చటైన పండుగలో మొదటిరోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే చిన్నా,పెద్దా అందరూ లేచి, ఒంటికి నువ్వులనూనె రుద్దుకొని స్నానాలు ఆచరించారు. పిల్లలకు నేరేడుపళ్లు, చెరుకుముక్కలు, బంతిపూలతో భోగి(బోడు) పళ్లను పోశారు. యువతులు, మహిళలు పొద్దున్నే లేచి ఇళ్లముందు ముగ్ధమనోహరమైన ముగ్గులు వేశారు. అందమైన రంగులు అద్ది.. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టారు. పాలను పొంగించి భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. భగవద్భక్తి పూజా కార్యక్రమాలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు ఇంటిం టికి తిరుగుతూ హరినామస్మరణ చేస్తూ.. బసవన్నను ఆడిస్తూ.. సందడి చేశారు. వారికి తోచిన ధనధాన్యాలను దానం చేశారు. హరిదాసులు సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ముందుకు సాగారు. బసవన్న సైతం అందరినీ దీవించారు. గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ పర్వదినాలను జిల్లావాసులు సంబురంగా జరుపుకోనున్నారు. పతంగులు ఎగరేసిన యెండల వినాయక్నగర్ : పండుగ కంటే నెల రోజుల ముందు నుంచే చిన్నారులు పతంగులతో సందడి చేస్తున్నారు. ఇక భోగి నాడు వీరి జోరు మరింత ఎక్కువైంది. యువకులు,చిన్నారులు దాబాలపెకైక్కి గాలిపాటలను పోటాపోటీగా ఎగురవేశారు. ‘పతంగుల పండుగ’ కార్యక్రమంలో భాగంగా గాయత్రీనగర్లో బీజేపీ మాజీ శాసనసభా పక్షనేత యెండల లక్ష్మీనారాయణ కూడా యువకులతో కలిసి పతంగులను ఎగురవేశారు. యువమోర్చ నగర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్లో స్థానిక యువకులతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించే పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో యువ మోర్చ జిల్లా అధ్యక్షుడు గాదె కృష్ణ, నాయకులు రోషన్బోరా, సంతోష్గౌడ్, సుభాష్గౌడ్, అనిల్, చరణ్, సృజన్గౌడ్, టింకుల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బెటాలియన్లో అంబరాన్నంటిన సంబురాలు డిచ్పల్లి : డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్లో సంకాంత్రి సంబురాల్లో భాగంగా బుధవారం భోగి పర్వదినాన్ని సం ప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే సందడి మొదలైంది. కమాండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకట్రాములు, అమృతరావు, ప్రసన్న కుమార్ దంపతులతో పాటు బెటాలియన్ సిబ్బంది భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కమాండెంట్ శ్రీనివాసరావు ముం దుగా భోగి మంటలు వెలిగించారు. కమాండెంట్ సతీమణి రజిని ఆధ్వర్యంలో మహిళలు కొత్త కుండల్లో పాలు పొంగించారు. అనంతరం బెటాలియన్లో ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, యువతులు కోలాటం ఆడారు. సంప్రదాయబద్ధంగా చిన్నారులపై భోగి(బోడు) పండ్లు పోశారు. సంప్రదాయ పిండి వంటలు తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళలు మంగళహారతులతో శ్రీలక్ష్మి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వారు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ సంబరాల్లో బెటాలియన్ బీడబ్ల్యుఓ మహేందర్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
రచయిత విషాద ‘మరణం’
ఎన్నడో 1927లో అమెరికన్ రచయిత్రి కేథరిన్ మయో ‘మదర్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశారు. మూర్తీభవించిన జాత్యహంకారంతో ఆమె హిందూ మతాన్ని, సమాజాన్ని, ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అమెరికా పౌరులు భారత స్వాతంత్య్రోద్యమాన్ని తమ దేశ విప్లవంతో పోల్చుకుంటూ మద్దతు పలుకుతున్న వేళ బ్రిటిష్ పాలకులకు ఈ పుస్తకం రావ(య)డం అవసరమైంది. వారు దాన్ని ఎంతగానో ప్రచారంచేసి తమ వలస పాలనను సమర్థించుకున్నారు. మహాత్మా గాంధీ ఈ పుస్తకాన్ని ‘డ్రైనేజ్ ఇన్స్పెక్టర్ రిపోర్టు’గా అభివర్ణించారు. అంతేకాదు... భారతీయులంతా ఆ పుస్తకాన్ని చదివి తీరాలని సూచించారు. మనకు నచ్చని అంశాలున్నా, మన అభిప్రాయాలతో విభేదించే విషయాలున్నా రాజ్యాంగాన్నీ, రాజ్యాంగదత్తమైన భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించేవారంతా చేయాల్సిన పని అది. దురదృష్టవశాత్తూ దేశంలో అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి రోజురోజుకూ కరువవుతున్నది. తమ మనోభావాలను దెబ్బతీశారని వీధులకెక్కి గొడవచేసి దేన్నయినా సాధించుకునే ‘మాబోక్రసీ’ విస్తరిస్తున్నది. సామాజిక అసమానతలపైనా, దురాచారాలపైనా సమరశంఖం పూరించిన ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి నాయకర్ జన్మించిన తమిళనాట సైతం అలాంటి అవాంఛనీయ ధోరణులు ప్రబలుతున్నాయని సుప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రకటన వెల్లడిస్తున్నది. నూటపాతికేళ్ల క్రితంనాడు ఉందంటున్న ఒక ఆచారం ప్రధానాంశంగా చేసుకుని ఆయన రాసిన ‘మధోరుభాగన్’ నవలపై హిందుత్వ సంస్థలు, కొన్ని కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసి దాన్ని నిషేధించాలని, ఆ రచయితను అరెస్టు చేయాలని కొన్నాళ్లుగా ఆందోళన సాగిస్తున్నాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. స్థానికంగా బంద్లు జరిగాయి. తన రచన ఈనాటి సమాజానికి సంబంధించినది కాదని... అందులో పేర్కొన్న ఆచారాలను, సంప్రదాయాలను ఇప్పటి ప్రమాణాలతో పోల్చిచూడటం తగదని పెరుమాళ్ చేసిన వినతి అరణ్యరోదనే అయింది. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ‘శాంతి సంఘం’ సమావేశంలో నవలలోని వివాదాస్పద భాగాలను తొలగించడానికి అంగీకరించిన తర్వాత ‘రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించాడు. ఇకపై పి. మురుగన్ అనే సాధారణ టీచర్ మాత్రమే మిగులుతాడు’ అంటూ ఫేస్బుక్ మాధ్యమంద్వారా ఆయన ఉంచిన ప్రకటన అందరినీ కలవరపరిచింది. సృజనాత్మక రంగంనుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పడంతోపాటు తనను ఇకపై ఎలాంటి సాహితీ సమావేశాలకూ పిలవొద్దని, ఒంటరిగా విడిచిపెట్టాలని మురుగన్ విన్నవించుకున్నారు. నిరసనలకు, ఆందోళనలకు నాయకత్వంవహించినవారికి స్వప్రయోజనాలున్నాయని... తనను లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలున్నాయని మురుగన్ అంతక్రితం మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు అవాస్తవం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వివాదానికి కారణమైన నవల తమిళ భాషలో అచ్చయి నాలుగేళ్లవుతున్నది. దాని ఇంగ్లిష్ అనువాదాన్ని పెంగ్విన్ ప్రచురణల సంస్థ నిరుడు వెలువరించింది. అది ప్రముఖ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వస్తుందని కూడా పలువురు సాహితీవేత్తలు భావించారు. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన కొంగునాడు ప్రాంతం సంగతి అటుంచి తమిళనాట ఎక్కడా ఇన్నేళ్లుగా దాన్ని నిషేధించాలని కోరినవారు లేరు. ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన ఉద్యమం వెనక ఉద్దేశాలున్నాయని మురుగన్ అన్నది ఇందుకే. రచయితలైనా, కళాకారులైనా సమాజాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప లేనిది సృష్టించలేరు. ఏకదంత ప్రాకారంలో సృజన ప్రభవించదు. ఈ విషయాన్ని గ్రహించలేనివారే అనవసర ఆవేశాలకు పోయి రాతపైనో, గీతపైనో విరుచుకుపడతారు. కొన్నేళ్లక్రితం తన పెయింటింగ్లపై పెను వివాదం రేగినప్పుడు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తీవ్రంగా కలతచెంది ఈ గడ్డపై మళ్లీ అడుగుపెట్టబోనని ప్రతినబూని వెళ్లిపోయారు. ఆయన మరో దేశంలో తనువు చాలించారు. బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్సింగ్ ‘జిన్నా:భారత్ విభజన, స్వాతంత్య్రం’ అనే గ్రంథం వెలువరించి మహ్మదాలీ జిన్నా పెట్టిన పాకిస్థాన్ డిమాండు రాజకీయపరమైనదని, అందులో ఉన్న మతస్పర్శ ఆయన ఉద్దేశించని పరిణామమని తేల్చిచెప్పారు. అప్పుడు కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనకు కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యేముందు మళ్లీ ఆ పార్టీలో చేరారు....అది వేరే విషయం. ‘మతముల న్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటె నిలిచివెలుగును’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంలో సాంఘిక దురాచాలను పెంచిపోషిస్తున్నవారిపైనా, అలాంటివారి ఆచార వ్యవహారాలపైనా తీవ్ర విమర్శలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దాన్ని నిషేధించాలంటూ ఉద్యమం నడిచేదేమో! ‘కన్యాశుల్కం’ రచననాటికీ, ఇప్పటికీ పోల్చి చూసుకుంటే మనం ముందుకు నడిచామో, కొన్ని యుగాలు వెనక్కుపోయామో అర్థంగాని స్థితి. ఫ్రాన్స్లో ‘చార్లీ హెబ్డో’ పత్రికపై ఉగ్రవాదులు దాడికి తెగబడి కార్టూనిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలు తీస్తే ఇక్కడ ఆ పని చేయకుండానే ఒక వ్యక్తి ‘రచయితగా నేను మరణించాన’ని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. తమిళనాట ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న అన్నా డీఎంకే, విపక్షంగా ఉన్న డీఎంకే... పెరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించినవి. ప్రస్తుత వివాదంలో ఆ పార్టీలు రెండూ తటస్థతను పాటించడంద్వారా పెరియార్ స్ఫూర్తికి తాము యోజనాల దూరంలో ఉన్నామని నిరూపించు కున్నాయి. ఫలితంగా ఒక రచయిత గొంతు నులమదల్చుకున్నవారిదే పైచేయి అయింది. ఇది విచారకరమైన విషయం. -
గ్రామీణ జీవన పునర్వికాసానికి అద్భుత అవకాశం...
సంక్రాంతి! ఏడాదిలోని 365 రోజులకూ 365 పండుగలున్న దేశం మనది. ఎప్పుడూ పండుగ వాతావరణంతో నిండి ఉండే సంస్కృతి మనది. ఈరోజు దుక్కిదున్నే రోజైతే, అదో రకమైన పండుగ. దుక్కిదున్నే కార్యక్రమానికి ఓ పాట... అందుకు తగ్గ ఆటా ఉండేవి. మరునాడు నాట్లువేసే రోజైతే, అది మరొక పండుగ. దానికీ ఓ పాటా, అందుకు తగ్గ ఆటా ఉండేవి. ఆ మరునాడు కలుపు తీసే రోజైతే, అదీ పెద్దపండగే. ఇక పంటకోత కోస్తే, అది కూడా ఓ గొప్ప పండుగే. అదే సంక్రాంతి పండుగ. ముందటి తరం వరకు కూడా మన దేశంలోని పల్లెల్లో ఆ సంబరమే వేరు. ఆటలు, పాటలు, గెంతులు, నాట్యాలతో మన జీవితాలు నిండి ఉండేవి. ఉదాహరణకు సంక్రాంతి పండుగ రోజుల్లో తమ ఎడ్ల కొమ్ములకు, కాలి గిట్టలకు రంగులు వేసి, ముఖానికి నామాలు పెట్టి, మెడలో గంటలు కట్టి వీధుల్లో చాలా ఆనందంగా ఊరేగేవారు. బక్కచిక్కిన రెండే ఎడ్లున్న పేదరైతు కూడా తనకు చేతనైనంతగా వాటిని అలంకరించి సగర్వంగా వెంట నడుస్తూ, అందరికీ చూపిస్తూ పొంగిపోయేవాడు. ఓ పది పదిహేనేళ్ల కిందటి వరకు కూడా నాట్లువేసే రోజులు వచ్చాయంటే అందరూ కలసిమెలసి నాట్లు వేసేవారు. మొత్తం పంట పండేవరకు కలసిమెలసే అన్నీ చేసుకొనేవారు. గ్రామం మొత్తం మీ పొలం దగ్గరకు వచ్చి అంతా పూర్తయ్యే వరకు సాయపడేవారు. రేపు మరొకరి పొలానికి, ఇలాగే అందరితో పాటు నువ్వూ పోయి సాయపడేవాడివి. అందరితో కలిసి ఆడిపాడేవాడివి. ఇప్పుడా ఆటపాటలే కనుమరుగైపోయాయి. వ్యవసాయం పండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం దండగ అనే దుస్థితి దాపురించింది. అందువల్ల గ్రామీణ పునర్వికాసం ఇప్పటి తక్షణావశ్యకత. ప్రభుత్వం చేయగలిగే పనికాదు ఇది. ప్రభుత్వం విధానాలు మార్చగలదు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఇవ్వగలదు. కానీ ప్రతీ వ్యక్తి జీవితాన్నీ ఏ ప్రభుత్వమూ మార్చలేదు. ఈ దిశగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని జాగరూకం చేసే పనిని స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, కంపెనీలు కూడా చేపట్టాలి. అక్కడి జీవనంలోని వెనకటి ధైర్యోత్సాహాలను తీసుకురావడానికీ, వారి సరళమైన సామాజిక జీవనాన్ని పరిపుష్టం చేయడానికి నడుం బిగించాలి. దిక్కులేక నువ్వొక్కడివే ఈ ఊర్లో మిగిలావు అని కాకుండా బతకడానికి పల్లెపట్టును మించిందిలేదు అనే విధంగా మార్పు తేవడానికి ప్రయత్నించాలి. ఇందుకు ఈ సంక్రాంతి పండుగ ఓ సువర్ణావకాశం. దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. గ్రామీణులకు కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించాలి. -
అనంతకు అన్యాయమే!
కవి, గాయకుడు గోరేటి వెంకన్న అనంతపురం కల్చరల్ : ‘పల్లె కన్నీరు పెడుతోందే.. కనిపించని కుట్రల’ అంటూ పల్లె సంస్కృతిని దెబ్బ తీసిన ప్రపంచీకరణ వైనాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన కవి, గాయకుడు గోరేటి వెంకన్న. బలహీన వర్గాల పక్షాన బలమైన సాహిత్యంతో గళం విప్పిన ఆయన.. తెలంగాణ , సీమ అంటూ తేడా లేకుండా సుమధుర సాహిత్యంతో ప్రజల గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నారు. నగరంలోని ఓ సాహితీ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వెంకన్న ‘సాక్షి’తో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలు, ప్రపంచీకరణ నేపథ్యంలో తగ్గుతున్న పల్లె సంస్కృతి, సినిమా పాటలు, కొత్త తరం రచయితలు, రచయితల బాధ్యత తదితర అంశాలపై ఆయన చెప్పిన సంగతులు ఇలా... సాక్షి : ‘అనంత’తో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది కదా... గోరేటి వెంకన్న : ‘అనంత’ ను చూస్తే మా మహబూబ్నగర్ను చూసినట్లే ఉంటుంది. ‘సీమ’ సాహిత్యం, ఇక్కడి రచయితలతో నాకు విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. చాలా మంది ‘సీమ’ రచయితలు నన్ను ప్రభావితం చేస్తారని నేను సగర్వంగా చెబుతా. సాక్షి : ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యముంది.. గో.వె : ఒకరే ంటి? శాంతి నారాయణ, బండి నారాయణస్వామి, చిలకూరి దేవపుత్ర, సింగమనేనని నారాయణ వంటివారే కాకుండా ఇతర జిల్లాల్లోని రాసాని, కేశవరెడ్డి వంటి వారి రచనలు భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేశాయి. వారి రచనలంటే నాకు ఎక్కువ గౌరవం. వారి కథలు చదువుతుంటే మా జిల్లాలోని సమస్యలపై కథలు రాసినట్లే ఉంటాయి. ఎందుకంటే అనంత, మహబూబ్నగర్, కర్నూలులో దాదాపు ఒకే పరిస్థితులు కన్పిస్తాయి. సాక్షి : సీమ సంసృతి ఎలా ఉంటుందనిసిస్తుంది.. గో.వె : మాది మహబూబ్నగర్ కావడంతో చాలా వరకు రాయలసీమతో సన్నిహిత సంబంధాలున్నాయి. కర్నూలుకు కూత వేటంత దూరంలోనే ఉండడంతో భాష, సాహిత్యం, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు చాలా వరకు సీమను పోలి ఉంటాయి. భాషలోని చాలా పదాలు కూడా తెలంగాణ యాస కన్నా సీమను ఎక్కువగా పోలివున్నాయి. కాబట్టే మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం దాదాపు ఒకటే అని నా భావన. సాక్షి : రాయలసీమ కరువు మాటేమిటి... గో.వె : నిస్పందేహంగా రాయలసీమలో కరువు కరాళనృత్యం చేసింది. అయితే తెలంగాణలోని మా మహబూబ్నగర్ ప్రాంతం కూడా ఏమి తీసిపోలేదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయో...సీమకు న్యాయం జరగాలని కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు జరిగాయి. కచ్చితంగా ‘సీమ’ వెనుకబడి ఉంది. న్యాయం జరగాలి. ముఖ్యంగా నదీ జలాల కేటాయింపులో ట్రిబ్యునల్ తీర్పుల మేరకు కచ్చితంగా ‘సీమ’కు వాటా దక్కాలి. అదే పరిస్థితుల్లో మహబూబ్నగర్ కరువును కూడా జలాలతో తీర్చాలి. సాక్షి : ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉందంటారు.. అభివృద్ధి చెందుతోందా.. గో.వె : ప్రపంచీకరణను నేను తీవ్రంగా వ్యతిరేకించినవాడిని. దాని వల్ల ఎంతో నష్టం జరిగింది. కొద్దిగా మేలు కూడా జరిగింది. ప్రపంచీకరణతో కొద్దిగా ఆర్థిక వెసలుబాటు కల్గినా చాలా భాగం విధ్వంసమే జరిగింది. కుల వృత్తులు నాశనమయ్యాయి. సహజంగా ఉన్న వాతావరణం స్థానంలో కృత్రిమత్వం తాండవిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ఒడిలో హాయిగా ఒదిగే కన్నబిడ్డకు... అద్దె ఆయాల పెంపకంలో పెరిగే పిల్లలకు ఉన్నంత తేడా ఉంది. వెన్నెల వెలుగులో చల్లగాలి ఆనందానికి... ఏసి గదులకు ఉన్నంత తేడా ఉంది. చేత్తో పీకేసి మట్టి తుడుచుకుని తినే వేరుశనగ కాయలకు, హాల్దీరామ్ విత్తనాలకు ఉన్నంత తేడా ఉంది. సాక్షి : పల్లెల్లోని సంస్కృతి, సంప్రదాయాలపై కూడా ఆ ప్రభావం ఉందంటారా? గో.వె : కచ్చితంగా.. సమస్యలు, ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో ఉద్యమాలు ఎలా వచ్చాయో.. ప్రపంచీకరణపై కూడా అదే స్థాయిలో ఉద్యమం వస్తుంది. సంస్కృతి విఛ్చిన్నం అవుతోంది. ఇంటర్నెట్లో లభించే నీలి చిత్రాలే ఉదాహరణ. అలాంటి చిత్రాలు అందరూ చూసేలా ఇంటర్నెట్లో ఉంచడం అవసరమా.. అని నా ప్రశ్న. ఇదే తరహాలో ప్రతీ రంగంపై ప్రపంచీకరణ ప్రభావం ఉంది. దాని ప్రభావం భాషపై కూడా పడింది. వీటి ఒడిదుడుకల మధ్య రచనలు తగ్గిపోతున్నాయి. ఇది కూడా భాషపై, భావ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతుంది. సాక్షి : మిమ్మల్ని ప్రజాకవి అంటారు.. మీ కవిత్వంలోని ప్రత్యేకత వల్లేనా? గో.వె : నన్ను ప్రజాకవి అంటే వంద శాతం తప్పు అంటాను. కవులందరూ ప్రజాకవులే. నేను ప్రజాకవిని అంటే తక్కిన వారు పాలకుల కవులా? అది కరెక్టు కాదని నేను చాలా సార్లు చెప్పాను. నాలోని కవిత్వానికి ప్రత్యేకంగా గొప్పదనం అంటూ ఏదీ లేదని నేను అనుకుంటాను. ఏ కవికైనా ఏదైనా సందర్భంలో గుండెలో ఉద్భవించిన భావనకు అక్షర రూపం ఇస్తే మంచి కవిత్వం అవుతుంది. పనిగట్టుకుని రాయాలనుకుంటే అందులో ‘ప్రాణం’ కనిపించదు. కవితా ధారలు ప్రవహించడానికి ఆయా సందర్భాలు, అనుభూతులు దోహదపడతాయే కానీ వ్యక్తుల సిద్ధాంతాల వల్ల కాదు. ప్రజా పక్షాన నిలిచే సాహిత్య మార్గాన్ని ఎంచుకున్న కవులంతా సాహితీ సేవకులే. సాక్షి : విభజనతో సీమకు అన్యాయం జరిగిందని భావించడం లేదా.. గో.వె : కొంత వరకు నేను దానితో ఏకీభవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా తెలంగాణకు సామ్యమున్న ‘అనంత’, ‘కర్నూలు’ కలిసి ఉంటే బాగుండేదని నేను కూడా భావించాను. అయితే అనాదిగా తెలంగాణలో జరిగిన అన్యాయం ఉద్యమబాటకు అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏమైనా భాషా సాహిత్యాల వరకైతే తెలంగాణ, రాయలసీమ భావజాలం ఒకటేనన్నది సత్యదూరం కాని మాట. సాక్షి : కవిత్వంలో భాగమే పాట అనడం సబబేనా.. గో.వె : ఎంతమాత్రం కాదు.. ఎన్నో దశాబ్దాల కిందట గురుజాడ రాసిన గేయాలు సాహిత్యానికి వరమాలగా మారాయి. తర్వాత ఎందరో కవులు, కళాకారులు గేయం, జానపదం, పాట అన్నింటిలో సాహిత్యాన్ని చక్కగా ఒదిగిపోయేలా చేశారు. అందరికి అందుబాటులో ఉండేది..ప్రజాసమస్యలను చిత్రించేది కవిత్వమంటే తప్పు లేదని నా భావం. చివరగా సినిమా అయినా.. భావ కవిత్వమైనా దేనిని రచిస్తున్నా వారందరూ ధన్యులే. ఎక్కువ, తక్కువ భేధాలు లేవన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. సాక్షి :సినిమా పాటలు రాయడంలో బాగా బిజీగా ఉన్నారా! వెంకన్న: గతంలో శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, నగరంలో నిద్రపోతున్న వేళ తో పాటు పలు సినిమాలకు రాశాను. ఇప్పుడు కూడా రాజ్యాధికారం, కీచక, బంధుకతో పాటు పది సినిమాలకు రాస్తున్నాను. సినిమాకు నా పాట అవసరం ఉందనుకుంటే తప్పకుండా రాస్తాను. -
నో కన్ఫ్యూజన్
Guest Time అందరిలోనూ సృజన అంతర్లీనంగా దాగి ఉంటుంది. సాధనతో మనకు మనమే దానిని వెలికి తీసుకోవాలి అంటారు ప్రముఖ సంతూర్ వాద్యకారుడు పండిట్ రాహుల్ శర్మ. సాధనతోనే రాణింపు వస్తుందనేది ఆయన మాట.ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘జాదవ్పూర్ యూనివర్సిటీ హైదరాబాద్ చాప్టర్ అలుమ్ని’ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సాక్షి సిటీప్లస్ పలకరించినపుడు తన సంగీత ప్రయాణం గురించి ఇలా వివరించారు. నాన్న, ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ నా తొలిగురువు. సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు లేరు. నేను 13వ ఏట నుంచే సంతూర్ వాయించడం నేర్చుకున్నాను. నాన్నతో కలసి ఎన్నో ప్రదర్శనలిచ్చాను. సంగీతం నేర్చుకోవటంతో పాటు పాటలు పాడటం, వేదికలపై ప్రదర్శలివ్వడం చిన్న వయసులోనే ప్రారంభించాను. ఏ రంగమైనా సృజన ముఖ్యం సృజనతో మాత్రమే ఏ రంగంలోనైనా రాణించగలం. క్రియేటివిటీతోనే ప్రతి సందర్భాన్నీ సంగీతమంత అందంగా మలుచుకోవచ్చు. సాధనతోనే హోదా, గుర్తింపు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి చదువుతో పాటే సంగీతం లేదా మరేదైనా అంశాన్ని హాబీగా మలచుకోవాలి. హిందుస్థానీ మ్యూజిక్తో పాటు ఫ్యూజన్ మ్యూజిక్లోనూ నా ముద్ర ఉంది. ముఖ్యంగా ఫ్యూజన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. కచేరీకి ముందు పరికరాల శబ్దాలను, మైకుల నుంచి వచ్చే ధ్వనులను సరిచేసుకోవాలి. అప్పుడే ఫ్యూజన్ సూటిగా హృదయాలను తాకుతుంది. ఇక్కడ ధ్వని బదలాయింపు చాలా ముఖ్యం. వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్ల తీరు వేరు. ఫ్యూజన్ మ్యూజిక్ తీరు వేరు. మై ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రాంతం. నేను సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడకు వస్తూనే ఉన్నాను. ఖాదర్ అలీ బేగ్తో పాటు ఆయన కుమారుడు మహ్మద్ అలీ బేగ్ ప్రోగ్రామ్లకు ఎన్నోసార్లు వచ్చాను. హైదరాబాదీలు సంగీతప్రియులు. వారు చూపించే ఆదరణ కళాకారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. యువత ఇటు వైపు రావాలి మన సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవి. వీటి పరిరక్షకులు యువతే. అన్నింటా, అంతటా సంగీతమే ప్రాముఖ్యం వహిస్తుంది. యువత దీనినో కెరీర్గా మలచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నేను ముంబైలోని మిథిబాయి కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశాను. కానీ, విచిత్రంగా సంగీత ప్రపంచం వైపు అడుగులు వేశాను. 1996 నుంచి నా సంగీత ప్రదర్శనలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నుంచి సొంతంగా కచేరీలు ఇస్తున్నాను. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. హిమాలయశర్మ, భవానీశంకర్, తబలా ఉస్తాద్ అహ్మద్ఖాన్తో కలిసి చేసిన ప్రదర్శనలు రికార్డులు సృష్టించాయి. 2002లో నా సంగీత ప్రదర్శనలకు సంబంధించి ఆరు టైటిల్స్ గెలుచుకొన్నాను. ‘ముసే దోస్తీ కరోగే’ సినిమాకి సంగీతం అందించినందుకు ‘ఉత్తమ తొలి సంగీత దర్శకుడు’ అవార్డ్ అందుకున్నాను. -
పోతన, పాల్కురికి ఉత్సవాలు
భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు నిర్విహ స్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ సాక్షిగా ప్రకటించడం హర్షదాయకం. గత పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిరాదరణకు గురయ్యారు. కనీసం తెలంగాణ ప్రాంతం ఇంతమంది ప్రజాకవులకు, పండితులకు, విద్వత్కవులకు జన్మని చ్చిందన్న ఎరుకను కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ఆకరమైన ఇలాంటి మహనీయులను జ్ఞప్తికి తెస్తూ సాంస్కృతిక కార్యక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం ముదావహం. ఈ నేపథ్యంలో పోతన జన్మస్థలానికి ప్రాభవం తీసుకువస్తామని, ఆనాడు బమ్మెర పోతన దున్నిన నాలుగు ఎకరాల్లో స్మారకమందిరాన్ని నిర్మి స్తామని, రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలి. దీంతో పాటు తెలంగాణ రైతులు, ప్రజలు తమ విముక్తి కోసం అరవైఏళ్ల క్రితం చేపట్టిన మహత్తర సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. - దౌడ్ విజయకుమార్ పరకాల, వరంగల్ జిల్లా -
గుడ్ మార్నింగ్... 2015!
బాధ జీవితానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నింటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం కాబట్టే, నర కాన్ని అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహ లోక కాలంలోని కొన్ని రోజులను ఏటా తాత్కాలిక స్వర్గం కోసం కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవ దూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. మానవుడు భగవంతుని అద్భుత సృష్టి. మనం భగవంతుణ్ణి విశ్వసించడానికి కారణం మాత్రం అది కాదు. నైతికంగా రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉన్న మానవ జాతి ఇంతవరకు తాను సాధించిన దాని నుండి ఇంకా నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. గతంలో సుల్తాన్ మొహ్మద్ గజనీ భారత దేశాన్ని కొల్లగొట్టి వెళ్లాక, సూఫీ శాంతి ప్రబోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చాడు. వర్తమానంలోనైతే నరహంతక తాలిబాన్కు ముందటి గాంధేయ వాది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను అలాగే చెప్పుకోవచ్చు. ఇలాంటి పోలిక తేవడం... ఉద్రిక్తపూరితమైన ఈ భూమి అనే తిరిగే గోళం మీద మంచీచెడు సగం-సగం, ఒకదానికొకటి సరి అనే బూటకపు సమానత్వా న్ని సూచించనూ వచ్చు. హింసను, దాని ఆటవిక చుట్టపట్టాలను చల్లార్చడంతోనే లేదా వ్యవహరించడంతోనే మన సమయంలో చాలా ఖర్చయిపోతోంది. బాధ జీవించడానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నిటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం. కాబట్టే నర కాన్ని మనం అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహలోక కాలంలోని కొన్ని రోజుల భాగాన్ని ఏటా తాత్కాలిక స్వర్గం కోసం విడిగా కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవదూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. దాతృత్వం అనే పదం దర్పాన్ని సూచించే చికాకైన పదం. అందుకు ఇస్లాం సిద్ధాంతం పరిష్కారాన్ని సూచించింది. చీదర పుట్టించే విధంగా అహంకార ప్రదర్శనకు తావే లేకుండా నిర్మూలించడం కోసం దాతృత్వం గుప్తంగానే జరగాలని శాసించింది. ఇవ్వడానికి తగిన పద్ధతి ఉండేట్టయితే, తీసుకోడానికి కూడా అలాగే తగిన పద్ధతి ఉండాలి. తీసుకునేదాన్ని అది బాల దృష్టితో, హృదయంతో చూసేదిగా ఉండాలి. బాలలు కోరినది కావాలనుకుంటారంతే. డబ్బు విషయం వారికి పట్టదు. అలాంటప్పుడు విలువను లెక్కగట్టేది సంతోషంతోనే తప్ప, వ్యయంతో కాదు. మనకు కనిపించేదానికి భిన్నంగా పిల్లలు వాస్తవికవాదులు. పెద్దవారు దురాశతో లేదా ఆకాంక్షతో లేదా పైకి ఎగబాకడం లేదా కిందికి దిగజారడం వల్ల ప్రేరేపితులై ఉంటారు. కాబట్టి బెలూన్ అవసరమైన చోట అంతరిక్ష నౌక కావలసి వస్తుంది. అదే పిల్లాడైతే బెలూన్నే రోదసి నౌకగా మార్చేసుకోగలుగుతాడు. పిల్లవాడికి అతి మంచి కానుక... ఏ చెట్టుకో వేలాడదీసినది, చక్కగా ప్యాకింగ్ చేసి ఉన్నది కానవసరం లేదు. దాన్ని ఇచ్చిన సమయమనేదే ముఖ్యం. క్రిస్మస్కు కేంద్ర బిందువు జీసస్ క్రిస్ట్ జననం. ఆ కథనం స్థానికతను ఎప్పుడో అరుదుగా గానీ ప్రశ్నించరు. ఎందుకంటే పాత నిబంధన దాన్ని ముందుగానే చెప్పింది. రాజులు భగవంతుని పాదాల ముందు బంగారం, సాంబ్రాణి, గుగ్గిలం సమర్పించి కొలవడం ఆ వేడుక పాటలో ఉన్నాయి. ఆ బిడ్డకు తల్లి మేరీ అతను తన ఒడి నుండి శిలువనెక్కేవరకు ఏం ఇచ్చింది? ముగ్గురు జ్ఞానులు లేదా రుషులు లేదా రాజులు సమర్పించిన మూడు ద్రవ్యాలు అప్పటికే చాలా కాలంగా ఏ ఒక్క మతానికో చెందనివి అన్న గుర్తింపును పొందిన సుప్రసిద్ధ కానుకలు. జ్ఞాపకాలన్నిటిలాగే, ఈ విషయంలో కూడా ఒకటికి మించిన కథనాలున్నాయి. ఒక నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు రాజులు బెత్లహామ్కు చేరారని సెయింట్ మాథ్యూ నిబంధన తెలుపుతోంది. విశ్వాసాన్ని నిర్దిష్టమైన పుట్టుపూర్వోత్తరాల గొలుసుగా చూపాలని పండితులకు తెగ ఆత్రుత. ఆ ముగ్గురు రుషులు పర్షియాకు చెందినవారని, పవిత్రాగ్నికి కావలిదారులని, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఉద్దండులని వారు భావిస్తున్నారు. పర్షియా లేక భారతదేశం నుండి వారు వచ్చి ఉండాలి. నేడు దేవుడేలేని చైనా, కమ్యూనిస్టు వ్యామోహంతో వెంటబడుతున్న సిల్క్ రూట్ వెంబడే వాళ్లు అక్కడికి చేరి ఉండాలి. ఏదేమైనా వాళ్లు తూర్పు దిక్కు నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు. క్రైస్తవ మతం పాశ్చాత్య విశ్వాసంగా ఎంత ప్రబలంగా విస్తరించిందంటే... అది మనం దాని ఆసియా మూలాలను మరిచిపోయేట్టు చేస్తుంటుంది. ఆ మతానికి చెందిన ప్రథమ కుటుంబాన్ని గోధుమ వర్ణపు ఛాయలతో ప్రాచీన చర్చి మత చిత్రకళ సరిగ్గానే చిత్రించింది. ఆ తదుపరి తొలి పునరుజ్జీవనోద్యమ కాలంనాటి శ్వేత వర్ణ ఛాయలతో కూడిన చిత్రాలకు అవి భిన్నమైనవి. మేరీ తల అప్పుడూ, ఇప్పుడూ నిరాడంబరమైన శిరోవస్త్రాన్ని ధరించి ఉంటుంది. అది ఆమె యుగపు అలవాటు. ఖురాన్లో మేరీ గురించి ఒక అధ్యాయం ఉన్నదని, ముస్లింలు జీసన్ను (ఇసాగా పిలుస్తారు) తమ గొప్ప ప్రవక్తలలో ఒకరిగా మన్నిస్తారని కూడా మనం అంతే సులువుగా మరుస్తుంటాం. ఖురాన్, ఇసాను రుహుల్లా లేదా అల్లా ఆత్మగా స్తుతిస్తుంది. జీసస్ను శిలువ వేశారని ముస్లింలు అంగీకరించరు. ఆయనను రక్షించి, తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారని, ఆ తదుపరి ఆయన రోమన్ సామ్రాజ్యానికి వెలుపల తన బోధనను కొనసాగించడానికి తూర్పు దిశకు వెళ్లాడని చెబుతుంది. క్రిస్మస్ వివాదాలకు సంబంధించినది కాదు. ముస్లిం టర్కీ ఒకప్పటి తమ అత్యంత సుప్రసిద్ధ పూర్వీకులలో ఒకరైన శాంతాక్లాజ్ ఖ్యాతికి సంతోషించనిద్దాం. క్రిస్మస్ కానుకలకు ఉండే దైవాంశను కలిగిన స్లెడ్జిబండిపై పయనించే ముసలాయన నార్డిక్ జాతివాడు కాదు. ఆయన సెయింట్ నికోలస్. 270లో దక్షిణ టర్కీలో, అది ప్రధానంగా క్రైస్తవ ప్రాంతంగా ఉన్న కాలంలో జన్మించి, మైరాకు బిషప్గా ఎదిగాడు. నేడు ఆ పట్టణాన్ని దెమ్రెగా అని పిలుస్తారు. స్థానికులు తమ హీరోను ‘‘నోయెల్ బాబా’’గా గౌరవిస్తారు. ఆయన చ ర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. బిషప్ తన మహిమతో తండ్రులు నరికేయగా మరణించిన ముగ్గురు కుమారులను బతికించాడు. అందుకే మరణించిన కొద్దికాలానికే ఆయనను పవిత్ర ప్రబోధకునిగా గుర్తించారు. మరొక గాథ, వరకట్నం చెల్లించలేక బానిసలుగా అమ్మేస్తున్న ముగ్గురు కుమార్తెలకు సంబంధించినది. ఆయన సంచి నిండా బంగారాన్ని వారి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా సంతోషంగా గడిపారు. ఆసక్తి ఉన్నవారికి మరొక విశేషం... సెయింట్ నికోలస్ ఎన్నడూ ఎర్ర గౌను వేసుకొని ఎరగడు. అది కోకా కోలా మార్కెటింగ్ శాఖ పాప్ సంస్కృతికి చే సిన చేర్పు. ఎప్పటిలాగే మనమంతా భవిష్యత్తుపట్ల ఆత్రుతతో 2015 కోసం వేచి చూస్తూ, సుహృద్భావాన్ని కోరడం, శాంతి కోసం ప్రార్థించడం మరీ పెద్ద కోరికేమోనని ఎవరైనాగానీ ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి నేను కూడా ఓ పిల్లవాడిలాగా సాధ్యమైనదానితోనే సరిపెట్టుకుంటాను. భారతదేశంలో శాంతి విలిసిల్లాలని, వచ్చే 51 వారాల్లో భారతీయులందరి మధ్యనా సుహృద్భావం నెలకొనాలని కోరుకుంటాను. ఇక ఆ 52వ వారం సంగతి అదే చూసుకుంటుంది. -
కూచిపూడికి పట్టాభిషేకం
నృత్యసాగరంగా మారిన గచ్చిబౌలి స్టేడియం సమూహ నాట్య ప్రదర్శనతో కొత్త రికార్డు పాలుపంచుకున్న వేలాదిమంది కళాకారులు గిన్నిస్బుక్లోకి మహా బృంద నాట్యం! ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హైదరాబాద్: అచ్చతెలుగు కూచిపూడి నృత్యానికి భాగ్యనగరం పులకించిపోయింది. ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు వేలాదిమంది నృత్యకారులు పాదం పాదం కలిపి ఒకేసారి చేసిన నృత్యానికి ‘రికార్డులు’ తలవంచాయి. ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర నాల్గో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా చివరిరోజైన ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మహాబృంద నాట్యం అద్భుతంగా సాగింది. కడలి అలలా సాగిన వేలాది మంది కళాకారుల నాట్యం ఆహూతులను ఆకట్టుకుంది. ఈ నృత్య ప్రదర్శన త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాదం కలిపిన 6,327 మంది... మహాబృంద నాట్యంలో మొత్తంగా 6,327 మంది కళాకారులు భాగస్వాములయ్యారు. నృత్య గురువులను అనుసరిస్తూ మొదట స్టేడియంలో నిలబడ్డారు. ఢమరుక శబ్ధం వినిపించగానే పాదం పాదం కలుపుతూ ఒకేసారి మహాబృంద నాట్యం ప్రారంభించారు. శివుడి జటాఝూటం నుంచి భగీరథుడు గంగను భూమిపైకి రప్పించిన ఘట్టాన్ని తలపించేలా కళాకారులు అందెల సవ్వడితో ఏకకాలంలో చేసిన నృత్యానికి ఆహుతులు మైమరిచిపోయారు. అనంతరం నిర్వహించిన రామాయణ శబ్ధం బృంద నృత్యం నయనానందకరంగా సాగింది. రామాయణ శబ్ధం (రామకథ) పేరుతో రాముని జీవిత ఘట్టాలు తెలుపుతూ ఈ నృత్యం సాగింది. చివరగా వేదాంతం రాఘవ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాగిన మహారుద్ర నాట్యం ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం నృత్యాలలో పాలుపంచుకున్న కళాకారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి: ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు, సంస్కృతికి నిదర్శనం కూచిపూడి అని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమ ప్రభుత్వం కూచిపూడి నృత్య అభివృద్ధికి కేంద్రంగా ఉంటుందన్నారు. కాగా, ఆరో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలోని నాట్యారామంలో 2016 డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తామని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి.. మహాబృంద నాట్య ప్రదర్శనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని కూడా అందజేశారు. అనివార్య కారణాల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రాలేకపోయారని, వారికి రికార్డ్స్కు సంబంధించిన వివరాలు పంపుతామని సిలికానాంధ్ర నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు శేషుబాబు, మామిడి హరికృష్ణ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ యామినీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మడగాస్కర్
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం వైశాల్యం : 5,87,041 చదరపు కిలోమీటర్లు జనాభా : 2,37,52,887 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని : అంటనానారివో కరెన్సీ : మలగాసీ అరియారీ ప్రభుత్వం : యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ భాషలు : అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు మతం : {Mైస్తవులు 40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం. వాతావరణం : సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్లో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది. పంటలు : వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క జొన్న, కాఫీ, మిరియాలు. పరిశ్రమలు : వస్త్ర, సముద్ర ఉత్పత్తులు, పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి. సరిహద్దులు : నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది. స్వాతంత్య్రం : 26 జనవరి, 1960 చరిత్ర: తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు. అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది. అంటనానారివో: రాజధాని అంటనానారివో సందర్శకులను ఆకర్షించే ఒక గొప్ప నగరం. ఈ నగరం సముద్ర మట్టానికి 2643 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నగర ప్రదేశమంతా కొండలతో ఉండడం వల్ల ఇళ్ళ సముదాయాలు కూడా అలాగే నిర్మించడంతో ఒక కొత్త నిర్మాణశైలి కనబడుతుంది. నగరంలో క్యాథిడ్రిల్లు అనేకం ఉన్నాయి. నగరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అప్పర్టౌన్ రెండోది లోయర్టౌన్. నగరంలో ఉన్న జకరండా చెట్లు వేసవికాలంలో గొడుగుల మాదిరిగా ఉండి ఎంతో ఆకర్షణీయమైన ఊదా రంగులో దర్శనమిస్తాయి. మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణం విచిత్రమైన శైలిలో ఉంటుంది. నగరంలో 17వ శతాబ్దంలో నిర్మించిన ఇమెరినా రాణి రాజ భవనం ‘రోవా’ చూడదగ్గది. దీనికి సమీపంలోనే ప్రధానమంత్రి భవనం ఉన్నాయి. రాజధాని నగరానికి సమీపంలో అండిసిబె-మంటాడియా, రానోమఫానా, అంకారనా జాతీయ పార్కులు ఉన్నాయి. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. చూడదగిన ప్రదేశాలు సింగీ రోగ్ ఈ సింగీ రోగ్ ఎర్రమట్టి రెడ్ లాటరైట్తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది. వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది. బావోబాబ్ చెట్లు మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే వాటర్ఫాల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. నోసీ బే మడగాస్కర్ దీవికి ఉత్తర ప్రాంతంలో ఈ నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గధామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న కెమిలియన్ కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి. నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి. రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఈ ప్రాంతంలో నోసీనింజా, రదమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ముఖ్య భూభాగంనుండి బోటులో గానీ, హెలికాప్టర్లో కాని వెళ్ళవచ్చు. ప్రజలు- సంస్కృతి - పాలన రీతులు ప్రజలు- సంస్కృతి: ఈ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్డ్రాయ్ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ముస్లిం మతం కూడా ఉంది. భారతీయులు కూడా మడగాస్కర్లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. ముఖ్యంగా క్రిస్టియన్ మిషినరీలు విద్యావ్యాప్తిని బాధ్యతగా కొనసాగిస్తున్నాయి. పరిపాలనరీతులు: మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్లను ఫరిత్ర అంటారు. అంట్సిరనానా, అంటనానారివో, మహజంగ, టోమాసినా, ఫియానారంట్సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి - అంటనానారికో, టోమాసిన, అంట్సిరాబే, ఫియానారంట్సోవా, మహజంగ, టోలియారా, అంట్సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా. -
రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
సంస్కృతి రక్షణ పేరుతో దాడులకు పాల్పడొద్దు: ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: నైతిక విలువల రక్షణ పేరిట రాజ్యాధికారాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఎవరికీ లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తన కార్లో కూర్చొని ఓ స్నేహితురాలితో కలసి మద్యం సేవిస్తున్న వ్యక్తిని కాల్చేసిన గన్మన్కు యావ జ్జీవ కఠిన జైలు శిక్ష విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 2011 లో అశోక్ విహార్లో హరియాణాకు చెందిన సందీప్కుమార్ అనే 32 ఏళ్ల గన్మన్.. వీరేందర్ అనే వ్యక్తిని లెసైన్స్డ్ రైఫిల్తో కాల్చడంతో అతను మరణించాడు. కోర్టు కుమార్కు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రూ. లక్ష వీరేందర్ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు సున్నితమైన సామాజికాంశాల్ని దెబ్బతీస్తాయన్నారు. దేశ సంస్కృతి పరిరక్షణ పేరుతో పలువురు వ్యక్తులు, సంఘాలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అధిక సందర్భాల్లో యువతులే లక్ష్యంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన సవ్యంగా ఉండాలని.. అదే సందర్భంలో అలా లేనివారిని శిక్షించే అధికారం ఏ ఒక్కరికీ లేదని అన్నారు. -
వైభవం పోయింది,సంస్కృతి మిగిలింది
పాతకాలపు ‘ఆయిరన్’ వేషం ధరించిన యువతుల్ని ఫొటోలో చూడవచ్చు. ఆయిరన్ అంటే అత్యున్నత శ్రేణి వేశ్య. వీళ్లు సాధారణ వేశ్యల్లాగా కేవలం శరీరసుఖానికే పరిమితం కారు. వాళ్లు మనసుల్ని రంజింపచేయడంలో నేర్పరులు. పుష్పాలంకరణ(ఇకెబెనా) తెలియడం, గ్రీన్ టీ కాయగలగడం, అందమైన దస్తూరి కలిగివుండటం వీరి కనీసార్హతలు. వీళ్ల వస్త్రధారణ సమాజాన్ని ప్రభావితం చేసేది. వీళ్లు ‘పామర’ భాష మాట్లాడరు; సభాభాషలోనే సంభాషిస్తారు. 1600 నుంచి 1868 దాకా జపాన్లో కొనసాగిన ‘ఎడో పీరియడ్’లో ఆయిరన్లు ఒక వెలుగు వెలిగారు. కాలపు మార్పుల్లో ఈ వృత్తి కనుమరుగై, ‘సంస్కృతి’గా నిలిచిపోయింది. దానికి గుర్తుగానే ‘ఆయరన్ డోచు’గా పిలిచే ఈ ప్రదర్శన టోక్యోలోని ప్రాచీన వేశ్యావాటికల సమీపంలో ప్రతి ఏడాదీ జరుగుతుంది. -
రొమేనియా
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్ వైశాల్యం: 2,38,391 చదరపు కిలోమీటర్లు జనాభా: 2,33,72,101 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: బుఖారెస్ట్ ప్రభుత్వం: యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: ల్యూ అధికారిక భాష: రొమేనియన్, మతం: 80 శాతం క్రైస్తవులు వాతావరణం: చలికాలంలో 2 డిగ్రీలు, వేసవిలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. పంటలు: చిరుధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, పళ్లు, కూరగాయలు, ద్రాక్ష, పశుపోషణ, చేపలవేట. పరిశ్రమలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు, గనులు, రసాయనాలు, ఓడల నిర్మాణం, యంత్రపరికరాలు, చమురు సహజ వాయువులు, బొగ్గు, లిగ్నైట్, ముడి ఇనుము, ఉప్పు, రాగి, సీసం, బంగారం, వెండి. సరిహద్దులు: రష్యా, హంగేరీ, యుగోస్లేవియా, బల్గేరియా, నల్లసముద్రం. స్వాత ంత్య్ర దినం: 1878, మే 9 (దీనిపై భిన్నస్వరాలున్నాయి) చరిత్ర - పరిపాలనా విధానాలు చరిత్ర: రొమేనియన్లు ఒకప్పుడు బానిసలుగా ఉన్నా, వారి భాషను, సంస్కృతిని నేటికీ కాపాడుకుంటున్నారు. చుట్టూ ఉన్న దేశాల వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వీరు తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా టర్కీ రాజులతో రొమేనియన్లు ఎక్కువగా పోరాటాలు చేశారు. 14వ శతాబ్దం నుండి టర్కీయులు, రొమేనియన్లను ఎన్నో హింసలకు గురిచేశారు. 1877లో పాక్షిక స్వాతంత్య్రం లభించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. దేశంలో డాన్యూబ్నది పరీవాహక ప్రాంతం మంచి సారవంతమైన భూమి. ఈ నది నల్లసముద్రంలో కలుస్తుంది. ఈ డెల్టా ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా సాగు అవుతుంది. శతాబ్దాల నాటి సంస్కృతి ప్రస్తుతం మారామూర్స్, మోల్డావియా, వాల్లాబియా ప్రాంతాలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. రొమేనియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 41 కౌంటీలుగా విభజించారు. ప్రతి కౌంటీ కూడా తిరిగి సిటీ, కమ్యూన్లుగా విభజింపబడి ఉంటాయి. ప్రతి స్థాయిలో ప్రభుత్వ అధికారులు పాలన కొనసాగిస్తారు. పెద్ద నగరాలను మున్సిపాలిటీలుగా పిలుస్తారు. రాజధాని బుఖారెస్ట్ నగరం ఆరు సెక్టార్లుగా విడిపోయి ఉంటుంది. దేశంలో 54 శాతం మంది ప్రజలు పట్టణాలలో నివసిస్తారు. దేశ రాజధానితో పాటు అతి పెద్ద నగరాలు దేశంలో 20కి పైగా ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం సంస్కృతి, సంప్రదాయాలు: దేశంలో స్వాతంత్య్రదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నృత్యాలు, ఆటపాటలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రజలు సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు. క్రిస్మస్ రోజున పందులను బలి ఇవ్వడం వీరి సంప్రదాయం. అలాగే ఈస్టర్ రోజున గొర్రెలను బలి ఇస్తారు. ఈ రోజున అందంగా పెయింటింగ్ చేసి గుడ్లను ప్రతి కుటుంబం కొనుగోలు చేసి ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటుంది. ప్రజలు సంప్రదాయరీతిలో తెల్లటి దుస్తులు, వాటిమీద రకరకాల అల్లికలు చేసిన వేస్ట్కోట్లలాంటివి ధరిస్తారు. తలకు చిత్రవిచిత్ర ఆకారాలలో ఉండే టోపీలు ధరిస్తారు. ప్లుగుసోరులుల్, సోర్కొవా, ఉర్సుల్, కాప్రా అనే నృత్యాలను ప్రదర్శిస్తారు. ఆహారం: వీరి ఆహారం అంతా గ్రీకు, బల్గేరియా, టర్కిష్ ఆహార రీతులను తలపిస్తుంది. పుల్లగా ఉండే సూప్లను బాగా తాగుతారు. వీటిని కియోర్బా అంటారు. పందిమాంసం, చేపలు, ఎద్దుమాంసం, గొర్రె,, చేప వీరికి ముఖ్యమైన ఆహారం. మాంసంతో దాదాపు 40 రకాల వంటకాలు చేస్తారు. చేపలతో 8 రకాల వంటకాలు చేస్తారు. కూరగాయలతో 25 రకాల వంటకాలను చేస్తారు. బ్రెడ్డు, చీజ్ ఎక్కువగా తింటారు. బ్రెడ్డుతో రకరకాల వెరైటీలు తయారుచేస్తారు. క్రిస్మస్ సమయంలో వీరు మాంసం అధికంగా తింటారు. ఈ సీజన్లో ప్రతిరోజూ మత్తు పానీయాలు తప్పనిసరిగా సేవిస్తారు. చూడదగిన ప్రదేశాలు 1. ప్యాలెస్ ఆఫ్ కల్చర్: రాజధాని నగరంలో నిర్మించబడిన ఒక గొప్ప కట్టడం ప్యాలెస్ ఆఫ్ కల్చర్. 3 లక్షల 90 వేల చదరపు అడుగుల స్థలంలో 290 గదులతో ఎంతో విశాలంగా, అద్భుతంగా నిర్మితమైంది. 1906వ సంవత్సరంలో ఈ భవనం నిర్మించబడింది. దాదాపు 20 సంవత్సరాల సమయంలో దీని నిర్మాణం పూర్తయింది. ఈ భవనంలోనే నాలుగు విశాలమైన అద్భుతమైన మ్యూజియంలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది దేశ చారిత్రక కట్టడంగా వెలుగొందుతోంది. 2. బుఖారెస్ట్: ఈ నగరం 1459లో నిర్మితమైంది అని చరిత్ర చెబుతోంది. ఇది డాంబోవిటా నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ముప్పై లక్షలకు పైగా జనాభా ఉంటుంది. దాదాపు 500 కి.మీ. పరిధిలో ఈ నగరం విస్తరించి ఉంది. నగరంలో రకరకాల మ్యూజియమ్లు, బొటానికల్ గార్డెన్లు, సరస్సులు ఉన్నాయి. ఈ నగరం ఆరు సెక్టార్లుగా విభజింపబడి ఉంది. ఈ నగరంలోనే ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ భవనం ఉంది. ఫ్లోరెస్కా సిటీసెంటర్, షెన్రీకోండా అంతర్జాతీయ విమానాశ్రయం, విక్టరీ అవెన్యూ, నేషనల్ లైబ్రరీ, అర్కుల్ డి ట్రంఫ్, నేషనల్ మ్యూజియం, రొమేనియా అథేనియం, సియసి ప్యాలెస్, ప్యాలెస్ ఆఫ్ పార్లమెంట్. రాజధాని నగరం చాలా విశాలంగా ఉంటుంది. జనాభా కూడా ఎక్కువే. అయితే ఏ రోడ్డు చూసినా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. చెత్తా చెదారం ఎక్కడా కనబడదు. 3. ట్రాన్స్ పగరాసన్: ఇది ఒక పర్వత భాగం. ఇది సిబియు, పిటేస్టి నగరాల మధ్యన ఉంటుంది. ఈ పర్వత భాగాన్ని ఓ వైపు నుండి బయలుదేరి మరోవైపు దిగడానికి నిర్మించిన రోడ్డు మార్గం తప్పనిసరిగా చూసితీరవలసిందే. దీని పొడవు 60 మైళ్ళు ఉంది. 1970-1974 మధ్యకాలంలో నిర్మించిన ఈ రోడ్డు మొదట మిలిటరీ అవసరాలకు ఉద్దేశించారు. కాని ఇప్పుడు అది యాత్రీకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగించే మార్గంగా మారిపోయింది. ఈ రోడ్డు నిర్మాణానికి 13 వేల పౌండ్ల ైడైనమైట్ పదార్థాలను ఉపయోగించారు. విహంగవీక్షణం చేస్తే ఈ మార్గం ఓ పొడవాటి సర్పం మెలికలు తిరుగుతూ పాకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించడం గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది. ఈ రోడ్డు మార్గాన్ని అక్టోబర్ నుండి జూన్ నెలల మధ్యకాలంలో మూసివేస్తారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తుంది. 4. నీమెట్ సిటాడెల్: ఇది దేశానికి ఉత్తర తూర్పు భాగంలో ఉంది. టర్గు నీమెట్ నగరానికి సమీపంలో ఉంది. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణశైలి అత్యంత పటిష్టంగా, శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. నదీ గర్భంలో లభించే రాళ్ళు, ఇసుకతో దీనిని నిర్మించారు. ఇదొక పెద్ద కోట. భవనం మధ్యభాగంలో ఒక విశాల ప్రదేశం ఉంది. దీనికి చుట్టు అనేక నిర్మాణాలు ఉన్నాయి. ప్రతిభవనం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ కోట తూర్పు భాగంలో ఆనాటి రాజుల భోజనశాలలు, భాండాగారాలు, జైలుగదులు కోశాగారం, ఆయుధాగారం, న్యాయశాల ఇలా ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణశైలి ఎంతో పటిష్టంగా ఉండడం వల్ల నేటికీ అది ఒక గొప్ప చారిత్రక ప్రదేశంగా నిలిచి ఉంది. ఎతైన, గోడలు ఇప్పటికీ నిలిచి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 5. బాలియా ఐస్ హోటల్: ఐస్తో నిర్మితమైన అద్భుతమైన హోటల్ ఇది. ఇది ఫరాగాస్ పర్వత ప్రాంతంలో ఉంది. దేశం మొత్తంలో యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన, సహజ సిద్ధమైన కట్టడంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ హోటల్ను చలికాలంలోనే తెరిచి ఉంచుతారు. ఈ హోటల్ కొంత సమయాన్ని గడపడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. పెద్ద పెద్ద ఐస్ బ్లాకులను దీని నిర్మాణానికి ఉపయోగించారు. గోడలు, స్తంభాలు, ఇతరత్రా అన్నీ ఐస్తోనే నిర్మించారు. దీనిని చేరుకోవడానికి కేబుల్కారులో వెళ్లాల్సి ఉంటుంది. 6. బుసెగి పర్వతాలు: కొండశిఖరం చూస్తే ఒక పెద్ద మనిషి తలలా కనిపించే ఈ బుసెగి పర్వత ప్రాంతాలను చూసితీరవలసిందే. బ్రాసోవ్ నగరానికి సమీపంలో దక్షిణ భాగంలో ఇవి ఉన్నాయి. ఒక పర్వత అగ్రభాగం సింహపు తలను పోలి ఉంటుంది. దీనినే స్ఫింక్స్ అంటారు. మరొకటి కూడా ఇలాగే ఉంటుంది. దానిని బబేలే అంటారు. ఈ పర్వత శిఖరాలలో కొన్ని 7519 అడుగుల ఎత్తు ఉంటాయి. వేలాది సంవత్సరాలుగా ఈ పర్వత అగ్రాలు వాతావరణ మార్పులకు లోనై తలల మాదిరిగా రూపాంతరం చెందాయి. ఒక పర్వత శిఖరం పుట్టగొడుగులా కనబడుతుంది. వేలాది సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఈ పర్వత శిఖరాలు నేటికి మానవులకు ఒక ప్రశ్నగా మిగిలి ఉన్నాయి. రొమేనియా దేశంలో ఇంకా ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన స్థలాలు చూడాల్సినవి ఉన్నాయి. డాన్యూబ్నది నల్ల సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన డెల్టా భాగం కూడా ఎంతో మనోహరంగా కనబడుతుంది. -
దేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు?
నైలునది పరీవాహక ప్రాంతంలోని ఈజిప్టు నాగరికత, టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల మధ్య వెలసిన మెసపటోమియా నాగరికత, హొయాంగ్హో పరీవాహక ప్రాంతంలోని చైనా నాగరికతలను మాత్రమే ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలుగా పరిగణించేవారు. కానీ ప్రస్తుత పాకిస్థాన్లోని పంజాబ్లో ఉన్న హరప్పా ప్రాంతంలో 1921లో చేసిన తవ్వకాల వల్ల సింధూ నాగరికత కూడా ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతగా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన తొలి తవ్వకాలు హరప్పా ప్రాంతంలో జరిగాయి.అందువల్ల దీన్ని హరప్పా నాగరికత అంటారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా పట్టణాలు ప్రారంభమైనవి ఈ నాగరికతలోనే. భౌతికంగా సింధూ నగరాలు కాలగర్భంలో కలిసినా నాటి సంస్కృతి మాత్రం అంతం కాలేదు. నేటికీ మన సంస్కృతుల్లో భాగంగా అది కొనసాగుతూనే ఉంది. పోటీ పరీక్షల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ మహానాగరికతకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సింధూ నాగరికత సింధూ నాగరికతకు సమకాలీన ప్రపంచ నాగరికతలకంటే విశాలమైన పరిధి ఉంది. ఇది భారతదేశంలో దాదాపు 1.3 మిలియన్ల చ.కి.మీ. ప్రాంతం లో విస్తరించింది. దీనికి సంబంధించి భారత్, పాకిస్థాన్లో 1400 స్థావరాలు బయటపడ్డాయి. ప్రధానంగా సింధూనది, దాని ఐదు ఉపనదులైన రావి, బియాస్, సట్లేజ్, జీలం, చీనాబ్ పరీవాహక ప్రాం తాల్లో విలసిల్లినందువల్ల దీన్ని సింధూ నాగరికత లేదా సింధూలోయ నాగరికతగా వ్యవహరిస్తారు. ఈ నాగరికత సరిహద్దులు తూర్పున-అలంఘీర్పూర్ నుంచి పశ్చిమాన - సుట్కజెండార్ వరకు, ఉత్తరాన - మాండా నుంచి దక్షిణాన - దాయిమాబాద్ వరకు విస్తరించాయి. పట్టణ నాగరికత ఈ నాగరికతా కాలాన్ని మొదటి నగరీకరణ యుగంగా పేర్కొంటారు. దీని తర్వాత మళ్లీ బుద్ధు ని కాలం వరకూ నగరాలు కనిపించవు. సింధూ నాగరికతకు సంబంధించి దాదాపు 250 వరకు పట్టణాలను కనుగొన్నారు. వీటిలో ముఖ్యమైనవి.. హరప్పా: దయారాం సాహ్ని ఆధ్వర్యంలో తొలిసారిగా తవ్వకాలు చేసింది హరప్పాలోనే. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణాలు.. ఒకే వరుసలో నిర్మితమైన ఆరు ధాన్యాగారాలు, హెచ్ ఆకారం లో ఉన్న శ్మశాన వాటిక, కోట మొదలైనవి. మొహెంజొదారో: ఈ పదానికి సింధీలో ‘మృతదేహాల మట్టిదిబ్బ’ అని అర్థం. ఇక్కడ తవ్వకాలకు నేతృత్వం వహించింది ఆర్.డి. బెనర్జీ. ఇక్కడ బయటపడిన ప్రధాన నిర్మాణం మహాస్నానవాటిక. దీంతోపాటు ధాన్యాగారం, పాలనా భవనం, అసెంబ్లీ హాలు వంటి కట్టడాలు వెలుగు చూశాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం, నేసిన వస్త్రం మొదలైనవి ఇక్కడ బయటపడిన ఇతర ముఖ్య అవశేషాలు. చన్హుదారో: ఇది మొహెంజొదారో లానే సింధూ తీరంలో వెలసిన మరో నగరం. ఇక్కడ మొదట ఎం.జి.మజుందార్ తర్వాత మాకే తవ్వకాలు నిర్వహించారు. దీనికి కళాకారుల నగరమని పేరు. అంతేకాకుండా ఇది కోట గోడలేని ఏకైక నగరం. లోథాల్: దీనికి కూడా మృతులదిబ్బ అని పేరు. ఇక్కడ తవ్వకాలు చేసింది ఎస్.ఆర్.రావు. ఇది భొగావో అనే నదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లింది. ఇక్కడ ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు బయటపడినందువల్ల సతీ సహగమనం దురాచారం అమల్లో ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధూ నాగరికతకు సంబంధించిన ఏకైక కృత్రిమ ఓడరేవు ఇక్కడ వెలుగుచూసింది. ఇంకా హోమగుండాలు, చదరంగం ఆటకు సంబంధించిన ఆధారాలు, కాంస్య కొలబద్ధలు, వస్త్రం గుర్తును కలిగి ఉన్న ముద్రలు (సీల్స్) ఇక్కడ లభించాయి. కాలీబంగన్: రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఉంది. ఇది ఘగ్గర్ (ప్రాచీన సరస్వతి) నది ఒడ్డున వెలసింది. ఇక్కడ మొదట తవ్వకాలు చేసింది డాక్టర్ ఎ.కె.ఘోష్. కాలీబంగన్ అంటే ‘నల్లని గాజులు’ అని అర్థం. భూమిని నాగలితో దున్నినట్లుగా ఆధారాలు లభించిన ఏకైక నగరం కాలీబంగన్. బనావలి: హరప్పా నగరాలన్నింటిలోకి గ్రిడ్ పద్ధతిని పాటించని ఏకైక నగరమిదే. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. తవ్వకాలు చేసింది ఆర్.ఎస్. బిష్త్. సింధూ ప్రజలు నాగలిని ఉపయోగించారనడానికి ఇక్కడ లభించిన మట్టితో చేసిన నాగలి బొమ్మను ప్రధాన ఆధారంగా పేర్కొంటారు. కోట్డిజి: పాకిస్థాన్లోని సింధూ రాష్ట్రంలో ఉంది. తవ్వకాలు నిర్వహించింది గురే. ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి. ధోలవీర: గుజరాత్లో ఉంది. తవ్వకాలు చేసినవారు ఆర్.ఎస్.బిష్త్, జె.పి.జోషి. ఈ నగరం వర్షాభావ ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడ కృత్రిమ రిజర్వాయర్ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక స్టేడియం కూడా బయటపడింది. మిగిలిన సింధూ నగరాలకు భిన్నంగా ఈ నగరం రెండుకు బదులు 3 విభాగాలుగా విభజితమై ఉంది. సింధూ నాగరికత ముఖ్య లక్షణాలు పట్టణ ప్రణాళిక: సింధూ ప్రజలు ప్రధానంగా నగరవాసులు. ఈ నగరాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా వాటి నిర్మాణశైలి, నగర ప్రణాళిక మొదలైన అంశాల్లో ఏకరూపత కనిపించడం విశిష్ట లక్షణంగా చెప్పొచ్చు. ప్రతి నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఎగువభాగంలో ఉన్న త వర్గాలవారు నివసించేవారు. నగర నిర్మాణానికి గ్రిడ్ పద్ధతిని అనుసరించారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించారు. నిర్మాణా ల్లో కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. ఎగు వ పట్టణం చుట్టూ పటిష్టమైన కోటగోడను నిర్మించారు. వీధులన్నీ సూటిగా 90ని లంబ కోణంలో ఉండి నగరాన్నంతా అనేక చతురస్ర బ్లాకులుగా విభజించేవి. సామాజిక వ్యవస్థ: సింధూ సమాజం భిన్న జాతుల కలయికతో ఏర్పడింది. మెడిటరేనియన్ జాతికి చెందినవారు అధిక సంఖ్యాకులు కాగా, మంగోలాయిడ్, ఆస్ట్రలాయిడ్, అల్పిన్నాయిడ్ జాతులకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసించారు. వైదిక యుగంలో ఉన్నట్లుగా కుల, వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో ఇంకా ఏర్పడలేదు. అయినప్పటికీ ఆర్థికస్థాయిని బట్టి సమాజం వివిధ వర్గాలుగా విభజితమైంది. ఈ కాలంలో స్త్రీలు మంచి గౌరవ మర్యాదలు పొందినట్లుగా తెలుస్తోంది. నాటి సమాజం మాతృస్వామిక వ్యవస్థను అనుసరించినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పశుపోషణ, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలకు కూడా ప్రాధాన్యం ఉండేది. ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి కూడా పండించినట్లు లోథాల్, రంగపూర్లో ఆధారాలు లభించాయి. సింధూ పరీవాహక ప్రాంతం అత్యంత సారవంతంగా ఉండేది. పశుపోషణలో భాగంగా ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. పట్టణాల్లో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. ఖేత్రి, బెలూచిస్థాన్ నుంచి రాగిని, అఫ్గానిస్తాన్ నుంచి తగరాన్ని, ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల లోహాలను దిగుమతి చేసుకుని వాటితో ఆయుధాలు, ఆభరణాలు తయారు చేసేవారు. వస్త్ర పరిశ్రమ కూడా ప్రముఖంగానే ఉంది. వీరు నూలు, ఉన్ని వస్త్రాలు తయారు చేశారు. తవ్వకాల్లో చాలాచోట్ల రాట్నాలు బయటపడ్డాయి. ఇటుకలు, సీళ్లు, కుండలు, ఆటబొమ్మలు, పూసలు, గవ్వలతో ఆభరణాల తయారీ, నౌకల నిర్మాణం వంటివి ఇతర పరిశ్రమల్లో ముఖ్యమైనవి. వీరు దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించారు. మొహెంజొదారో ప్రముఖ వాణిజ్య కేంద్రం గా ఉండేది. తవ్వకాల్లో బయటపడిన ధాన్యాగారాలు, సీళ్లు, తూనికలు, కొలతలు, ఎడ్లబండ్ల బొమ్మలు, నౌకల బొమ్మలు మొదలైనవి వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలను అందిస్తున్నాయి. దేశీ య వ్యాపారానికి ఎడ్లబండ్లు, పడవలనూ, విదేశీ వ్యాపారానికి భారీ నౌకలనూ ఉపయోగించారు. వీరి విదేశీ వాణిజ్యం ప్రధానంగా మెసపటోమియాతో కొనసాగింది. అక్కడి శాసనాలు సింధూ ప్రాంతాన్ని ‘మెలూహ’అని పేర్కొన్నాయి. రాజకీయ వ్యవస్థ: సింధూ నాగరికత భౌగోళికంగా 1.3 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. అయినా అనేక అంశాల్లో ఏకరూపత, సమగ్రత కనిపిస్తుంది. ఉదాహరణ: గ్రిడ్ పద్ధతిలో పట్టణాల నిర్మాణం, భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ. ఇటుకల నిర్మాణంలో ప్రమాణాలు, 16 లేదా దాని గుణకాలను తూనికలు, కొలతలకు ప్రమాణంగా ఉపయోగించడం మొదలైన అంశా ల్లో ఉన్న ఏకరూపత వల్ల కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరి ప్రకారం 4 లేదా 5 పాలనా కేంద్రాలతో ఈ నాగరికత వర్థిల్లింది. డి.డి. కౌశాంబి ఇది మతరాజ్యమనీ, మతాధిపతుల పాలన కొనసాగిందని అభిప్రాయపడ్డారు. ఆర్. ఎస్. శర్మ.. వ్యాపార, వాణిజ్యాలకు అమిత ప్రాధాన్యమిచ్చిన వ్యాపార వర్గాలే పాలకులుగా ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధూ ప్రజల రాజకీయ వ్యవస్థపై నిర్దిష్ట ఆధారాలు లభించడం లేదు. కాబట్టి చరిత్రకారుల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మత వ్యవస్థ: సింధూ ప్రజల ప్రధాన దైవం అమ్మతల్లి. మొహెంజొదారోలో ‘పశుపతి’ మహాదేవుడి ముద్ర లభించింది. ఈ దైవాన్నే జాన్ మార్షల్ తర్వాతి కాలపు పరమశివుడుగా పేర్కొన్నారు. సింధూ ప్రజలు జంతువులు, వృక్షాలను కూడా పూజించారు. మూపురమున్న ఎద్దు, రావిచెట్టు వీరికి పరమ పవిత్రమైనవి. మానవ జననేంద్రియాలనూ ఆరాధించారు. భూతప్రేతాలు, మంత్రతంత్రాలపై విశ్వాసం ఉంది. రక్షా రేకులు, తాయెత్తులను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. వీరి దహన సంస్కారాలు భిన్న రకాలుగా ఉండేవి. దహనం చేయడం, పూడ్చిపెట్టడం, కళేబరాలను పశుపక్ష్యాదులు తినగా మిగిలిన అవశేషాలను పూడ్చడం మొదలైన పద్ధతులుండేవి. సింధూ లిపి: భారతదేశంలో లిపిని ఉపయోగించిన తొలి ప్రజలు వీరే. ఇది నేటి లిపిలా అక్షర రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉన్నందువల్ల నేటి వరకూ దీన్ని చదవడం సాధ్యపడలేదు. వీరి లిపిలో 400 దాకా చిత్రాలున్నాయి. ఇది ఎడమ నుంచి కుడికి, మళ్లీ కుడి నుంచి ఎడమకి రాసి ఉంది. ఎస్.ఆర్ రావు ఈ చిత్రలిపిని ఆర్యభాషకు మాతృకగా పేర్కొన్నారు. కంప్యూటర్ సహాయంతో ఈ లిపిని పరిశోధించిన మహదేవన్ మాత్రం ఇది ద్రావిడ భాషతోనే పోలికలు కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. అధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం కూడా ఇదే. సింధూ ప్రజల సీళ్లు (ముద్రలు): సింధూ ప్రజల కళాభిరుచికి నిదర్శనం వారి సీళ్లు. తవ్వకాల్లో దాదాపు 2000కు పైగా సీళ్లు లభించాయి. వీటిలో అత్యధికం మొహెంజొదారోలోనే లభించాయి. 1-2.5. సెం.మీ. ఎత్తుతో వివిధ ఆకారాల్లో వీటిని తయారుచేశారు. ప్రతి సీలు పై ఏదో ఒక జంతు బొమ్మతోపాటు చిత్రలిపిలో శాసనం కూడా ఉండేది. పులి, ఎద్దు, గేదె, మేక, జింక, ఖడ్గమృగం, ఏనుగు వంటి జంతువుల బొమ్మలు సీళ్లపై ముద్రించారు. పతనానికి కారణం: ఈ నాగరికత క్రీ.పూ. 18వ శతాబ్దం నాటికి అంతమైంది. అయితే దీని పతనానికి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఇది చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారి తీసింది. విపరీతమైన వరదలు ఈ నాగరికత అంతానికి కారణమని కొందరి వాదన. నదుల ప్రవాహ దిశల్లో మార్పు వల్ల ఏర్పడిన నీటిఎద్దడి కారణమని మరికొందరు అభిప్రాయం. పక్కనున్న ఎడారి విస్తరించి, భూసారం తగ్గడం వల్ల పతనమైందని మరికొందరి వాదన. ఆర్యుల దాడి ఈ నాగరికత ముగియడానికి ప్రధాన కారణమని ఎం.ఎం. వీలర్ అభిప్రాయం. భూకంపాల వల్ల ఈ నాగరితక అంతమైందని రైస్ వాదన. -
హ్యామ్ టామ్
సెల్ఫోన్లు... ల్యాండ్ లైన్లు పనిచేయని చోట కూడా రింగ్మంటుంది అమెచ్యూర్ రేడియో. ఈ సాధనంతోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు సిటీ కుర్రాడు టామ్ కె.జోస్. రెండేళ్ల క్రితం ఎనిమిది నెలల్లో... వంద దేశాల్లోని వారితో మాట్లాడటమే ఆ రికార్డు. ప్రపంచంలోనే ఇలా మాట్లాడిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు టామ్. ఇతడి హ్యామ్ రేడియో ఐడీ నంబర్ ‘వీయూ3టీఎంవో’. ఇటీవల విలయం సృష్టించిన హుదూద్ తుపాన్ సమయంలో విశాఖలోని కంట్రోల్ స్టేషన్ నుంచి హ్యామ్ రేడియోతో సేవలందించిన టామ్తో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు. నాన్న జోష్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో అసిస్టెంట్ డెరైక్టర్. అమ్మ లిసీ టెక్నికల్ అసిస్టెంట్. మాది కేరళ. నా చిన్నప్పుడే సిటీకి వచ్చాం. అమ్మానాన్నలతో పాటు తాతయ్య కూడా అమెచ్యూర్ రేడియోలు వాడుతుండటంతో నాకు కూడా ఆసక్తి పెరిగింది. ఆ ఉత్సాహంతోనే హ్యామ్ రేడియో లెసైన్స్ తెచ్చుకున్నా. అంతేకాదు... ఇప్పటివరకు 150 దేశాలకు పైగా వ్యక్తులతో మాట్లాడాను. హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియోలోని పరికరాల సాయంతో మాట్లాడుతున్నా. చదువుకు ఇబ్బంది కలగకుండా మాట్లాడుతూ ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి, వాతావరణం వివరాలు సేకరించా. పదేపదే ఈ సంకేతాలు అందాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అదే మొదటిసారి... 12 ఏళ్ల వయసులో హ్యామ్ ఆపరేటర్గా లెసైన్స్ వచ్చింది. అప్పుడే ఇలా ఇతర దేశాల వారితో మాట్లాడా. ప్రస్తుతం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నా. విశాఖలో హుదూద్ తుపాను అనగానే బయలుదేరా. చాలా వరకు పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొన్ని స్టేషన్లలో హ్యామ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. విశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని కంట్రోల్ స్టేషన్ నుంచి సేవలందించా. ఇలా సామాజిక సేవలో భాగస్వామినవడం ఎంతో గర్వంగా ఉంది. నేను తీసుకున్న లెసైన్సు ఈ తరహాలో ప్రజల అవసరాలకు ఉపయోగపడటం సంతోషాన్నిస్తోంది. ఇదీ సంగతి... అభిరుచి, ఆసక్తి కొద్దీ హ్యామ్ రేడియోను వాడేవారంతా కలసి ‘అమెరికన్ రేడియో లీగ్’ సంస్థగా ఏర్పడ్డారు. వీళ్లు ఏటా ‘డైమండ్ డీఎక్స్సీసీ చాలెంజ్’ సర్టిఫికెట్ పేరుతో పోటీ నిర్వహిస్తారు. అమెచ్యూర్ కావాలనుకున్నవాళ్లు ఏడాది కాలంలో వంద దేశాలలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఇతర అమెచ్యూర్లతో మాట్లాడాలి. అలా టామ్ 2012లో 8 నెలల్లోనే ఇది పూర్తి చేశాడు. ఈ రేడియో వాడాలంటే... ఆ దేశ ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందాలి. అందుకు మనవాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లెసైన్సు తెచ్చుకున్నాడు. - వాంకె శ్రీనివాస్ -
గజేంద్ర ఘోష..!
యాచనం... భారతదేశంలో తరతరాలుగా ఇది కూడా ఒక వృత్తి. మన సంస్కృతిలో యాచకులకు తోచింది ఇవ్వడం ‘ధర్మం’ కాబట్టి యాచకత్వం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు... చుట్టపక్కలున్న దక్షిణాసియా దేశాల్లో కూడా యాచకత్వం చాలా సహజమైనదే. అయితే ఈ దేశాల్లో మనుషులు మాత్రమే కాదు.. దయగల ప్రభువులు చేసే దానం కోసం జంతువులు కూడా ఎదురు చూస్తుంటాయి. ఆలయాల దగ్గర వానరాలు... అక్కడకు వచ్చే భక్తులు ఇచ్చే కొబ్బరిచిప్పలు, అరటిపండ్ల మీద ఆధారపడి జీవిస్తుంటాయి. ఏం వేస్తారా అని మనుషులవైపు ఆశగా చూస్తూంటాయి. ఏమీ వేయకపోతే చోరీకి కూడా వెనుకాడవు. అవి మాత్రమే కాదు... ఒక మోస్తరు పట్టణాల్లో ఆవులు వీధుల వెంట తిరుగుతూ ఉంటాయి. అవి ప్రతి దుకాణం ముందుకూ వెళ్లి ఆగుతాయి. షాపు యజమాని ఏదో ఒకటి నోటికి అందిస్తాడు. అందుకొని మరో షాపు ముందుకు వెళ్తాయి. కడుపు నిండే వరకూ అలా ఎన్ని షాపులు వీలైతే అన్ని షాపులు తిరుగుతాయి ఆ ఆవులు. ఈ వానరాలు, ఆవులు మన దేశంలో సంగతి. అదే శ్రీలంకలో అయితే వాటి స్థానంలో ఏనుగులు ఉంటాయి. టూరిస్టులతో అలరారే అటవీ ప్రాంతాల్లో ఉండే ఏనుగులకు పర్యాటకులు పెట్టే తిండి తినడం అలవాటు అయ్యింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు... పదుల సంఖ్యలో గజరాజులు రోడ్డు పక్కకు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి తినిపించి వెళ్లకపోతారా అని వాహనాల వంక ఆశగా చూస్తుంటాయి. కొంత వరకూ ఇది ముచ్చటగానే ఉంది. వాటికి సరదాగా అవీ ఇవీ తినిపించడం టూరిస్టులకు మొదట్లో మురిపెంగానే అనిపించింది. కానీ రానురాను ఇలా వచ్చే ఏనుగుల సంఖ్య ఎక్కువ కావడం, అన్నీ కలిసి రోడ్లకు అడ్డంగా వచ్చేయడం మాత్రం సమస్యగా మారింది. దాంతో ఈ‘బెగ్గింగ్ ఎలిఫెంట్స్’ని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగని వీటిని మరో చోటికి తరలించడం, పట్టి బంధించడం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి శోభ కూడా ఇవే కదా! పైగా ఇవి పర్యాటకులకు ఎలాంటి హానీ చేయడం లేదు. వారి నుంచి తిండిని మాత్రమే ఆశిస్తున్నాయి. దాంతో వాటికి బాధ కలిగించకుండా, కేవలం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటే చాలనుకుంటున్నారు అధికారులు. చూడాలి మరి గజరాజులు వారి మాట ఎంత వింటాయో! -
అలుపెరుగని పర్యాటకురాలు
భారతీయ ప్రాచీన కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడే ప్రతిష్టాత్మక సంస్థ పేరు ‘ఇన్టాక్.’ హైదరాబాద్లోని వారసత్వ సంపద విశేషాలు తెలుసుకోవడానికి, ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరించడానికి ఈ ప్రతిష్టాత్మక సంస్థ ముప్పై ఏళ్ల క్రితం ఓ గృహిణిని ఆహ్వానించింది. తమ సంస్థలో ముఖ్య సభ్యురాలిగా స్థానమిచ్చింది. గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తల్లిగా పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, ట్రావెలర్గా ప్రపంచమంతా పర్యటిస్తూ తనదైన కలను నెరవేర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు తరగని సంపదను కానుకగా ఇస్తున్న ఆమె పేరు పి.అనూరాధా రెడ్డి. కాసేపు ఆమెతో మాట్లాడితే మన జీవితానికీ ఓ కొత్త ప్రయాణమార్గం కళ్లకు కడుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అటు నుంచి ప్రపంచ దేశాల వరకు.. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, అపురూపమైన వాటిని కెమరా కన్నుతో వీక్షించడం అనూరాధారెడ్డి ప్రత్యేకత. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకోవడం ఆమెకున్న మరో ఆసక్తికరమైన అలవాటు. పాతికేళ్ల వయసు నుంచే ఒంటరిగా దేశాలు చుట్టిరావడం, అక్కడి ప్రత్యేకతలను తెలుపుతూ పుస్తకం రూపంలో తీసుకురావడం ఆమె ఒక దైవ కార్యంగా భావిస్తూ వచ్చారు. సాలార్జంగ్ మ్యూజియంలో వారసత్వ ప్రదేశాల వివరాలు తెలిపే ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ఏం చేయాలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ‘హిస్టారికల్ వాక్’కు తీసుకెళుతుంటారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు ఒక ‘హెరిటేజ్ క్లబ్’ ఏర్పాటు చేయాలి అని సూచించే అనూరాధారెడ్డి ‘జీవితమంతా పర్యటనలతో ముడిపడింది’ అంటూ తన ప్రయాణమార్గం గురించి ఇలా వివరించారు... గొప్పతనం తెలియజేయాలని... ‘‘మనం ఇప్పుడు జీవిస్తున్నది ముందు తరాలకు మార్గదర్శనం చేయడానికే అన్నది నా అభిమతం. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఉద్యోగాలంటూ ఏమీ ఎంచుకోలేదు. పెళ్లై అత్తవారింట అడుగుపెట్టినా, ఇద్దరు అబ్బాయిలకు తల్లినైనా నా చూపు మన ప్రాచీన సంపద పరిరక్షణ వైపే ఉండేది. హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అవన్నీ నిర్లక్ష్యానికి లోనవుతున్నాయి. వాటి చారిత్రక నేపథ్యం మరుగునపడకూడదని నా తాపత్రయం. అందుకే వాటి గురించి తెలుసుకోవడం, సందర్శించడం, ఫొటోలు తీసి పత్రికలకు అందజేయడం విధిగా పెట్టుకున్నా. ఈ పని ఎంతో మందిని కలిసే అవకాశాన్నిచ్చింది. హైదరాబాద్ ఇన్టాక్ సంస్థకు కన్వీనర్నీ చేసింది. పరిశోధక విద్యార్థులకు నా ప్రయత్నం ఉపయోగపడుతున్నందుకు ఆనందిస్తుంటా. ఇదంతా మా అమ్మ నాలో నింపిన స్ఫూర్తి! పొత్తిళ్లలోనే పునాది మా అమ్మ స్నేహలతా భూపాల్. ఆమె తొంభై ఏళ్లకు చేరువలో ఉన్నారు. నాన్న శ్రీరామ్ భూపాల్ (ఆరు నెలల క్రితం మరణించారు) హెచ్.సి.ఎస్ ఆఫీసర్గా కొనసాగారు. వారు సిరినపల్లి సంస్థానాధీశులు. ఆ రోజుల్లో అమ్మకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆసక్తితో లెక్కల టీచర్గా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. అమ్మాయిల చదువుపై ఆమె అమితమైన శ్రద్ధ పెట్టేవారు. నన్నూ, తమ్ముడినీ చూసుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడలలో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే బ్యాడ్మింటన్లో జాతీయ స్థాయిలో రాణించారు. సంగీతంలో మేటి అనిపించుకున్నారు. మా ఇంట మహిళా జాగృతికి సంబంధించిన చర్చలు జరుగుతుండేవి. అమ్మ, అమ్మమ్మల ధైర్యం, జీవితం పట్ల వారికున్న ఎనలేని గౌరవం ప్రతి దశలో నాకూ స్ఫూర్తిగా నిలిచాయి. వారి నుంచే తెలుగు, తమిళం, ఉర్దూ, మరాఠీ, కన్నడం నేర్చుకున్నా. పర్యటనలతో విదేశీ భాషలు పరిచయమయ్యాయి. అమ్మాయిల పురోభివృద్ధిలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది అనడానికి మా అమ్మే ఉదాహరణ. నిరంతర శోధనా భాండాగారం ఐదేళ్ల వయసులో నాన్నగారిచ్చిన చిన్న కెమెరాతో నా శోధన మొదలైంది. నాన్నతో కలిసి ఎన్నో ప్రాంతాలు సందర్శించా. వ్యవసాయం, కళలు, ధనిక, పేద.. - అన్నింటినీ దగ్గరుండి చూశా. విషయాలన్నీ వివరంగా నాకు తెలియజేసేవారాయన. నాటి నుంచి ఎక్కడికెళ్లినా అక్కడి ప్రత్యేకతలు, వాతావరణం, చారిత్రక కట్టడాలు - ఇలా ప్రతి అంశాన్నీ ఫొటోలు, వీడియోలు తీయడం అలవాటుగా మారింది. చారిత్రక అంశాలను క్రోడీకరిస్తూ వ్యాసాలుగా భావితరాలకు అందించడం వ్యాపకమైంది. జగమంత కుటుంబం ఏ దేశానికి వెళ్లినా అక్కడ కొన్ని కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. నలభై ఏళ్ల వయసులో జర్మనీ వెళ్లినప్పుడు అక్కడ స్థానిక రైలులో ప్రయాణిస్తున్నాను. ఒంటరి ప్రయాణం... ఒక స్టేషన్లో ఒక పెద్దావిడ రెలైక్కి, సీట్ కోసం అడిగింది. 90 ఏళ్లుంటాయి ఆమెకు. జర్మన్ భాషలోనే ఆమెకు సమాధానమిస్తూ సీట్ ఇచ్చాను. ఆమె నా వేషధారణ చూసి ఇండియన్ అని గుర్తుపట్టింది. ఆశ్చర్యపోయి, ‘మీరు ఇండియన్. అయినా జర్మన్ భాష బాగా మాట్లాడుతున్నారే’ అంది. అలా ఆమెతో మాట్లాడు తుండగా ‘మీరు మా దేశానికి అతిథిగా వచ్చారు. ఎక్కడ ఉండబోతున్నారు?’అనడిగింది. ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పాను. ఆవిడ తన కుమారుడి ఇంటికి వెళుతున్నట్టు చెబుతూ నన్నూ రమ్మని ఆహ్వానించింది. నేను తన వెంట వాళ్లింటికి వెళ్లేంతవరకు నన్ను వదల్లేదు. ఆతిథ్యంతో పాటు ఆ ప్రాంతంలో చూడదగిన ప్రాచీన కట్టడాలు, అందమైన ప్రదేశాలన్నింటినీ వారి కుటుంబసభ్యులంతా దగ్గరుండి మరీ చూపించారు. ఇప్పటికీ వారింటి మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది. ఆ పెద్దావిడ మరణించేంతవరకు నన్ను బిడ్డగా భావించేది. ఇండియాకు వారు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. మన వంటలు నేర్చుకుంటారు. ఏడాదికి రెండు టూర్లు... ఇప్పుడైతే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు కానీ వారు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడూ సెలవుల సమయంలో టూర్లు ప్లాన్ చేసుకునేదాన్ని. నా పరిశోధనల కోసమే కాదు, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకూ ఉత్సాహం చూపేదాన్ని. ఇందుకు నా భర్త జనార్దనరెడ్డి పూర్తి సహకారం అందించేవారు. పన్నెండేళ్ల క్రితం వరకు అయితే ఒంటరిగానే విదేశీ ప్రయాణాలు చేసేదాన్ని. ఆ తర్వాత ఒక ట్రావెల్ గ్రూప్ను ఏర్పాటు చేశా. వారితో కలిసి ఇప్పటికీ ఏడాదికి రెండు విదేశీ టూర్లు ఉండేలా ప్రణాళిక వేసుకుంటా. నిజానికి మా గ్రూప్ ఏర్పాటు కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకసారి టాంజానియాలోని మా కజిన్ కుమారుడి పెళ్లికి నన్ను ఆహ్వానించారు. అక్కడికి దక్షిణ ఆఫ్రికా దగ్గర కావడంతో ఈ రెండు ప్రాంతాల వారసత్వ సంపదను కూడా చూసి రావాలనుకున్నాను. స్నేహితులు, బంధువులలో ఆసక్తి గలవారు తామూ వస్తామని ఉత్సాహం చూపారు. అలా పన్నెండు మందితో కలిసి కిలిమంజారో, జాంజిబార్ ఐలాండ్, అరుషా, గో రంగోరో నేషనల్ పార్క్, లేక్ విక్టోరియా, నైల్ రివర్ మొదలయ్యే ప్రాతం నుంచి మెడిటేరియన్ వరకు.. ఇవన్నీ ప్లాన్ చేసి మరీ చూసొచ్చాం. తర్వాత్తర్వాత ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, వియత్నాం, కాంబోడియా, భూటాన్, థాయ్లాండ్, చైనా, రష్యా, ఇండొనేషియా, మెక్సికో, బర్మా, దుబాయ్ చూసొచ్చాం. ఇవన్నీ కాలానుగుణంగా ప్లాన్ చేసుకోవడం, వెళ్లి రావడం చేస్తూనే ఉన్నాం. మొదట 12 మందితో మొదలైన గ్రూప్ ఇప్పుడు 40 మందికి చేరింది. మా గ్రూప్లో 80 ఏళ్ల వయసున్నవారూ ఉండటం విశేషం!’’ అంటూ తమ పర్యటన అనుభవాలను తెలిపారు ఆమె. టైమ్ గడవడం లేదు అంటూ ఖాళీ చేతులతో కాలాన్ని వెళ్లదీయడం కాదు. భావితరాలకు సుసంపన్నమైన ప్రాచీన భాండాగారాన్ని అందజేయాలి అనే ఆలోచన కలిగించే ఇలాంటి స్త్రీ మూర్తుల కృషి ఎప్పుడూ అనుసరణీయమే! సంభాషణ: నిర్మలారెడ్డి ఏ ప్రదేశానికి వెళ్లినా మనం మాట్లాడే భాష, ఎదుటివారికి ఇచ్చే మర్యాద, అలాగే వారితో స్నేహంగా ఉండటం.. బాగా తోడ్పడతాయి. అయితే, ఒక స్త్రీ గా అప్పుడూ ఇప్పుడూ నా జాగ్రత్తల్లో నేనుంటా. స్వచ్ఛందంగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఓ సూచిక అవుతుందని ఆనందిస్తుంటా. చదువు క్రమశిక్షణను నేర్పుతుంది. తల్లితండ్రులు కొంతవరకు దారి చూపుతారు. ఆ తర్వాత క్రమశిక్షణతో మన దారిని మనమే వెతుక్కుంటూ ముందుకెళ్లాలి. మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థి. నేర్చుకున్నదాంట్లో కొంతైనా భావితరాలకు అందజేయడం ఆ విద్యార్థి కనీస బాధ్యత. నేను చేస్తున్నది అదే. -
పందెం కాస్కో!
దీపావళి ముసుగులో కోడిపందేలు కోడి పందేల సంస్కృతి జిల్లాకు కూడా పాకింది. పోలీసుల అనుమతితో ఈ జూదం నిర్వహిస్తూ బెట్టింగ్రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న పందెంరాయుళ్లకు మందు, విందు సకల సౌకర్యాలు సమకూర్చుతున్నారు. పోలీసులు, కొందరు మీడియా ప్రతినిధులు, ఓ ప్రజాప్రతినిధి అండతో సాగుతున్న చీకటి ఆటలో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. వీపనగండ్ల శివారులో యథేచ్ఛగా సాగుతున్న కోడిపందేల బాగోతమిది..! సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దీపావళి పండుగ ముసుగులో పది రోజులుగా వీపనగండ్ల శివారులో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వీపనగండ్ల నుంచి తూంకుంటకు వెళ్లే దారిలో సుమారు 2కి.మీ దూరంలో గుంతవంపు అనే ప్రదేశాన్ని నిర్వాహకులు అడ్డాగా మార్చుకున్నారు. చుట్టూ దట్టంగా చెట్లుండడంతో సామాన్యులకు ఈ ప్రదేశం అంత సులువుగా కని పించదు. దీపావళి సందర్భంగా ఏటా ఈ పందేలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీపనగండ్లకు చెందిన బోయ బాలచంద్రయ్య అనే వ్యక్తితో పాటు మరో నలుగురు యువకులు బెట్టింగుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని బరి గీసి మరీ కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11గంటలకు మొదలయ్యే బెట్టింగు రాయుళ్ల సందడి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతోంది. బైక్లు, ఆటోలతో పాటు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుకుని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వాలిపోతున్నారు. సకల సౌకర్యాలు మహబూబ్నగర్, కొల్లాపూర్, వనపర్తి తది తర ప్రాంతాలతోపాటు కర్నూల్, ఒంగోలు, గుంటూరు వంటి సుదూరప్రాంతాల నుంచి బెట్టింగురాయుళ్లు పెద్దసంఖ్యలో వస్తున్నారు. పందేల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి చి కెన్ బిర్యానీ,చికెన్ రైస్,ఉడికించిన కోడిగుడ్లు, మద్యం, ఇతర తినుబండారాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పందెం రూ.5వేల నుంచి మొదలుకుని రూ.50వేల వరకు సాగుతోంది. రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు పందేలు నిర్వహిస్తుండడంతో రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగురాయుళ్లు రూ.500 నుంచి రూ.5వేల వరకు పందెంగా ఒడ్డుతున్నారు. పందెంలో ఓడినా కోడిమాంసం రుచిచూసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తూ మరీ పోటీపడుతున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే! వీపనగండ్ల సాగుతున్న కోడిపందేల వ్యవహారం పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. పందెం జరిగే ప్రాంతానికి వెళ్లే కొత్తవారిపై నిర్వాహకులు నిఘాపెడుతూ శల్య పరీక్ష చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులు చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి కనిపిం చింది. జిల్లా ఎస్పీ బదిలీ కావడం, కొత్త ఎస్పీ బాధ్యతలు తీసుకోకపోవడం స్థానిక పోలీసులు, బెట్టింగు నిర్వాహకులకు వరంగా మారింది. స్థానిక పోలీసులకు భారీ మొత్తంలో ముట్టజెప్పిన నిర్వాహకులు పది రోజులుగా యథేచ్ఛంగా కోడిపందేలు కొనసాగిస్తున్నారు. పైగా తాము పోలీసుల అనుమతితోనే బెట్టిం గులు నిర్వహిస్తున్నట్లు బహిరంగంగా చెప్పడం శోచనీయం. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఈ అనుమతుల వ్యవహారం వెనుక కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. స్థానిక మీడియాతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ముడుపులు అందినట్లు తెలిసింది. దీపావళి పండుగ ముసుగులో ప్రారంభమైన ఈ దందా మరికొంత కాలం సాగే అవకాశం కనిపిస్తోంది. -
పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పాలి
తిరుపతి : ప్రాథమిక విద్యా స్థాయి నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలని ఎస్వీయూ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.కృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటైన క్లస్టర్ లెవెల్ సోషియల్ సైన్స్ ఎగ్జిబిషన్, జాతీయ సమైక్యతా శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్న విద్యార్థులకు దేశం గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, సంస్కృతి సంప్రదాయాలను నేర్పడానికి కేంద్రీయ విద్యాలయాలు కృషి చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ, సంప్రదాయ నృత్యం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ లెవెల్ పోటీల్లో విజేతలు డిసెంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్ బేగంపేటలో జరిగే రీజనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. తిరుపతి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 2014 సెంట్రల్ సీనియర్ సెకండరీ, సెంట్రల్ సెకండరీ సర్టిఫికెట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించారన్నారు. అనంతరం తిరుపతి, వెంకటగిరి, ఒంగోలు, సూర్యలంక, గుంటూరు, నెల్లూరు కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నమూనాల ఎగ్జిబిషన్ను కృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్న ధీర వనితల చిత్రపటాలు, స్మార్ట్సిటీ నమూనాలు, ఈజిప్టు దేశానికి చెందిన పిరమిడ్లు, పగోడాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధిచిన నమూనాలు చోటు చేసుకున్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం గా విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
అమృతమూర్తి
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిస్సాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! వెంటనే మదర్కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ‘‘ప్రేమ అలా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటారు మదర్ థెరిస్సా. ఇండియా వచ్చి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (కోల్కతా) స్థాపించి మదర్ థెరిస్సాగా భారతీయ సంస్కృతిలో మమేకం అయిన అల్బేనియా సంతతి అమ్మాయి.. యాగ్నెస్ గాంగ్జే బోయాజూ (మదర్ అసలు పేరు). మదర్ సాధించిన నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డులు రెండూ కూడా ‘మానవతావాది’గా ఆమెకున్న ప్రఖ్యాతికి ఇంచుమించు మాత్రమే సరిసాటి అనాలి. మదర్ ఏనాడూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదు. ప్రేమ కోసం తపిస్తున్న వారికి తన ఆప్యాయమైన అమృత హస్తాన్ని అందించడమూ మానలేదు. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరవవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందనీ ప్రబోధించారు. ఓసారి కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు కోల్కతాలో మదర్ థెరిస్సా నడుపుతున్న మిషనరీ హోమ్లను సందర్శించడానికి వచ్చారు. అక్కడ.. మరణావస్థలో ప్రశాంతంగా కన్నుమూసినవారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘‘ఎలా సాధ్యం?’ అని అడిగారు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘మదర్... గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి’’ అని అడిగారు. ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం చిరునవ్వుతో చూసుకోండి. ఇందులో సాధ్యం కానిదేమీ లేదు. మొదట కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’ అని చెప్పారు మదర్. విస్మయంగా చూశారు వాళ్లు. ‘‘దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పతనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అంటారు మదర్. విశ్వమాతగా అవతరించిన ఈ క్యాథలిక్కు మతస్థురాలు 1910 ఆగస్టు 26న మేసిడోనియాలో జన్మించారు. 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న కోల్కతాలో కన్నుమూశారు. -
చాంప్స్ స్మృతి, సంస్కృతి
జూనియర్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ జూనియర్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్మృతి బాసిన్, సంస్కృతి సింగిల్స్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు. బోయిన్పల్లిలోని పల్లవి స్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలికల అండర్-12 టైటిల్ను స్మృతి, అండర్-14 టైటిల్ను సంస్కృతి గెలుచుకున్నారు. అండర్-12 ఫైనల్లో స్మృతి బాసిన్ 8-6తో సంస్కృతిపై గెలుపొందగా, అండర్-14 ఫైనల్లో సంస్కృతి 8-5తో లాస్యపై నెగ్గింది. అండర్-10 ఫైనల్లో తనుశిత రెడ్డి 8-3తో వేద వర్షితపై విజయం సాధించింది. బాలుర అండర్-10 ఫైనల్లో సుంకర రుషికేష్ 8-1తో ముకుంద్ రెడ్డిపై, అండర్-12లో ప్రీతమ్ 8-7 (7/4)తో అన్నే ఆకాశ్పై, అండర్-14లో హర్షిత్ కొసరాజు 8-7 (7/1)తో ప్రీతమ్పై గెలుపొందారు. చీఫ్ రిఫరీ ఎ.ఆర్.రావు, నిర్వాహకులు వెంకటరామన్ ట్రోఫీలు అందజేశారు. -
ఫుడ్ లవర్స్
కల్చర్, హిస్టరీతో పాటు ఫుడ్ అండ్ ఫుడ్ లవర్స్కి కేరాఫ్ సిటీ భాగ్యనగరం. హైదరాబాదీ బిర్యానీ, హలీం లాంటి వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ వునకే సొంతం. అందుకే హైదరాబాదీలే కాదు, నగరానికి వచ్చిన అతిథులూ ఇక్కడి వంటకాలు ఒక్కసారి రుచి చూస్తే వురి వదలరు. కానీ హైదరాబాద్తో దోస్తీ చెయ్యడానికి కొత్తగా వచ్చిన విద్యార్థులకు, ఉద్యోగులకు, కుటుంబాల వారికి ఇక్కడి రుచులన్నింటితో పాటు ఫేమస్ ఫుడ్ స్పాట్ల గురించి తెలియాలంటే ఎలా..! ఇదే ఆలోచనతో హెచ్సీయుూ స్టూడెంట్స్ ఫేస్బుక్లో ‘హైదరాబాద్ ఫుడీస్ గ్రూప్’ ప్రారంభించారు. 2012 బెన్నీ, కేసీ గ్యాబీ హైదరాబాద్ వర్సిటీలో చదివేందుకు నగరానికి వచ్చారు. వారికి నగరం చాలా కొత్త. నగరంలో ఎక్కడ ఎలాంటి రుచులు లభ్యమవుతాయో బొత్తిగా తెలియదు. అప్పుడు యూనివర్సిటీలో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఈ క్లబ్ని స్టార్ట్ చేశారు. తర్వాత బయట వాళ్లు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవుతూ ఉండటంతో ఈ క్లబ్ని విస్తరించారు. ఇప్పుడు దీనిలో 15,000కి పైగా మెంబర్స్ ఉన్నారు. వీరు రోడ్డు పక్కన బళ్ల నుంచి ఫైవ్స్టార్ హోటల్స్ వరకు ఎక్కడైనా మీటప్స్ నిర్వహిస్తారు. రుచికరమైన ఆహారానికే ప్రాధాన్యంకానీ ప్లేస్కి కాదు. ఈ మీటప్ గురించిన వివరాలు ఫేస్బుక్ పేజ్లో పెట్టిన తర్వాత ఒక 40 మంది దాకా ఈ మీటప్లో పాల్గొనవచ్చు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఫేస్బుక్లో తమ ఆసక్తిని తెలపవచ్చు. ఇప్పటికి 150 ఈవెంట్లు హైదరాబాద్ ఫుడీస్ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమ్యూనిటీ ఇది. ఇక్కడ ఫుడ్ గురించి తప్ప ఏది మాట్లాడినా తప్పే అంటారు ఈ క్లబ్ నిర్వాహకులు. క్లబ్ ప్రారంభించిన రెండున్నరేళ్లలో 150 ఈవెంట్లు నిర్వహించారు. ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారా గ్రూప్ మెంబర్స్కి తెలియజేస్తారు. ఈవెంట్లో ఫుడ్ మెనూ, మెంబర్స్ కోసం అందిస్తున్న స్పెషల్ ఫుడ్ వివరాలు కూడా తెలియజేస్తారు. కేవలం ఫుడ్ తినడం ఆనందించటమే కాదు, అనేక చారిటీ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుంటారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక ఆహారం అందించడం, అనాథ ఆశ్రమం పిల్లల కోసం ఆహారం వండి పెట్టడం, రెస్టారెంట్స్కి తీసుకువెళ్లటం లాంటి యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. ఫుడ్ రెసిపీస్, ఫుడ్ గురించిన చర్చలు, ఫుడ్ స్పాట్స్ ఇలా ఫుడ్ గురించిన ఏ ఆసక్తికర అంశమైనా ఈ గ్రూప్తో షేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ గ్రూప్ అనేక రెస్టారెంట్లు, రుచులు టేస్ట్ చేయటం చూసి ఇప్పుడు చాలా మంది హోటల్ వాళ్లే ఈ గ్రూప్ వారిని పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు. మీరు ఫుడ్ లవర్ అయితే, హైదరాబాద్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయితే చాలు. మీరు సోలో అయినా, ఫ్యామిలీ అయినా సరే ఈ క్లబ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు అసలు ఫుడ్ అంటే ఇష్టమైన వారు ఎవరైనా ఈ ఠీఠీఠీ.జ్చఛ్ఛిఛౌౌజు.ఛిౌఝ/జటౌఠఞట/జిడఛ్ఛీట్చఛ్చఛీజౌౌఛీజ్ఛీటఛిఠఛ లింక్ ద్వారా గ్రూప్లో మెంబర్స్ కావచ్చు. ఓ మధు ఈ క్లబ్లో వున్న 15 వేల మంది గ్రూప్లో ప్రతి మెంబర్కి హైదరాబాద్ ఫుడ్ గురించి ఆసక్తి, నాలెడ్జ్ బాగా ఉన్నారుు. ఈ గ్రూప్లో రెస్టారెంట్ ఓనర్స్, మేనెజర్స్ కూడా మెంబర్స్గా వున్నారు. విదేశాల్లో, వివిధ నగరాలకు చెందిన వారు కూడా క్లబ్ యాక్టివిటీస్లో పాల్గొంటూ లోకల్ ఫుడ్ని టేస్ట్ చేస్తుంటారు. ఎవరికైనా, ఎప్పుడైనా, హైదరాబాద్లో ఎలాంటి రుచి గురించిన సమాచారం కావాలన్నా ఈ క్లబ్లో ఒక చిన్న క్వెరీ పెడితే చాలు. నిమిషాల్లో వివరాలు తెలిసిపోతాయి. - సంకల్ప్ ఫేస్బుక్పేజ్ గ్రూప్ అడ్మిన్ ఈ గ్రూప్ ద్వారా ఒకేసారి 30, 40 మంది ఫుడ్ స్పాట్ విజిట్ చేస్తుండటంతో, నిర్వాహకులు ఈ గ్రూప్కి డిస్కౌంట్ ధరల్లో చక్కటి భోజనం సర్వ్ చేయటమే కాకుండా ప్రత్యేక అతిథి మర్యాదలుచేస్తుంటారు. ఈ ఈవెంట్స్ ద్వారా కొత్త వ్యక్తులను కలవటం, నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చెయ్యటం మెంబర్గా మరువలేని అనుభూతిని కల్పిస్తుంది. - హర్షిత్, ట్విట్టర్ గ్రూప్ అడ్మిన్ -
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
ప్రభుత్వ పాలన సమర్థవంతంగా ఉండాలి ఉద్యోగుల్లో పని సంస్కృతి పెరగాలి బాలగోపాల్ను స్ఫూర్తిగా తీసుకోవాలి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్కుమార్ కేయూ క్యాంపస్ : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా ప్రభుత్వ విధానాలు, పాలన ఉండాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్కుమార్ అన్నారు. మానవ హక్కుల నేత దివంగత కె.బాల్గోపాల్ వర్ధంతిని పురస్కరించుకుని మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల సెమినార్హాల్లో ‘ప్రభుత్వ విధానాలు -ప్రజల ఆకాంక్షలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా ఆయన మాట్లాడుతూ ఆకాంక్షలు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారన్న విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం చిన్న నీటి వనరులపై దృష్టి పెటాలని, వైద్య వ్యవస్థను మెరుగుపర్చాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ‘ఫ్రెండ్లీ పోలీస్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సహజ వనరులను కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి పాలన కొనసాగించాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో వలసవాద దోపిడీ వల్లే తెలంగాణ వెనుకబడిందని చెప్పుకొచ్చామని, ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో నిబద్ధతతో పని చేయాలని కోరారు. ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించినప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. ఉద్యోగుల్లోమార్పు రాకుం టే గత పాలకులే నయం అన్న భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. హక్కుల నేతగా మానవ హక్కుల ఉల్లంఘనలపై బాలగోపాల్ పోరాడారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో హక్కుల ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతాలు సాధ్యం కావు.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందేనని సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే గడిచిందని, ఇప్పుడే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాదన్నారు. రూ.25వేల కోట్లతో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అంతగా సాధ్యం కాదన్నారు. చిన్ననీటి వనరులను అభివృద్ధి చేస్తే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని విస్తృత ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క దాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్ చేసిన పనులను పలువురు సమర్థిస్తుండడంతో వాటికి ప్రజామోదం లభించినట్లుగా భావించడం సరికాదన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి రావడానికి యూపీఏ ప్రభుత్వ వైఫల్యమూ కారణమేనన్నారు. ఉద్యమ సమయంలో మావోయిస్టుల ఎజెండా తన ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తన పాలనలో హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు, హైదరాబాద్ను న్యూయార్క్ చేస్తానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించేవారు కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పాలకు ల విధానాలను ప్రశ్నించే విధంగా పౌర సమాజం ఉండాలని, అందుకనుగుణంగా ఉద్యమా లు నిర్మించాలన్నారు. హక్కుల ఉల్లంఘనపై బాలగోపాల్ నిష్కర్షగా, నిర్మొహమాటంగా మాట్లాడేవారనిగుర్తు చేశారు. సదస్సులో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, బాదావత్రాజు, సాధు రాజేష్, టి.నాగయ్య పాల్గొన్నారు. -
అబిద్ హసన్ శాఫ్రానీ! ‘తెహజీబ్’కి నిషానీ!!
తెహజీబ్ అనే ఉర్దూ పదానికి అర్థం సంస్కృతి. ‘గంగ-యమున ’ (సరస్వతి) హిందూ సంస్కృతికి ప్రతీక. ఈ రెండు సంస్కృతులు పాలూ-నీళ్లలా కలసిపోవడమే గంగా జమునా తెహజీబ్. ఈ ప్రవాహంలో ‘గర్వంగా చెప్పు నేను హిందువునని/ గర్వంగా చెప్పు నేను ముస్లింనని’ లేదా ఫలానా అనే నినాదాలు నిశ్శబ్దంగా లుప్తమవుతాయి! మానవత్వం సంగమించిన భారతీయత మాత్రమే ధ్వనిస్తుంది! గంగా జమునా తెహజీబ్కు అపూర్వ ఉదాహరణగా నిలిచిన ఒక వ్యక్తిత్వం గురించి ఈ వారం. అబిద్ హసన్ శాఫ్రానీ (కాషాయం).. వింతైన పేరు కదా! వివరాల్లోకి కథ మూలాల్లోకి వెళదాం! హైదరాబాద్ స్టేట్ దీవాన్గా (1853-83)పని చేసిన మొదటి సాలార్జంగ్ పాలనా వ్యవస్థను ఆధునీకరించాలని భావించాడు. ఈ క్రమంలో బ్రిటిష్ ఇండియా నుంచి ఇంగ్లిష్ పరిజ్ఞానం కలిగిన ఉన్నతాధికారులను హైదరాబాద్కు రప్పించారు. వారిలో నవాబ్ మొహిసిన్-ఉల్-ముల్క్ ఒకరు. అతని చిన్న తమ్ముడు అమీర్ హసన్ కలెక్టర్గా పనిచేశారు. ఆయనకు హజియా బేగం (ఇరానీ)కు 1911లో అబిద్ హసన్ జన్మించాడు. అప్పట్లో కులీనుల పిల్లలు ఇంగ్లండ్లో చదవడం ఫ్యాషన్! హసన్ తల్లికి ఇంగ్లండ్ అంటే అయిష్టత. హసన్ ఇంజనీరింగ్ చదివేందుకు జర్మనీ వెళ్లాడు. రెండో ప్రపంచయుద్ధం. బ్రిటిష్ వారితో పోరాడుతోన్న జర్మనీకి నేతాజీ సుభాష్చంద్రబోస్ వెళ్లాడు. జర్మనీకి ఖైదీలుగా దొరికిన భారతీయ సైనికుల శిబిరాలు సందర్శిస్తూ బోస్ వారిలో దేశభక్తిని రగిలిస్తున్నాడు. భారతీయ యువకులనూ కలుస్తున్నాడు. ఆ సందర్భంలో తన చదువు పూర్తయ్యాక స్వాతంత్య్ర సమరంలో చేరతానని అబిద్ హసన్ బోస్తో అన్నాడు. చదువు త్యాగం చేయలేని వారు ప్రాణాలు త్యాగం చేస్తారా’ అన్నాడు బోస్. తక్షణం పుస్తకాలను విసిరేసి బోస్కు సెక్రటరీగా, దుబాసీగా నియుక్తుడయ్యాడు. జర్మన్-జపాన్ జలాంతర్గాముల్లో అబిద్, బోస్ వెంట సింగపూర్ వెళ్లాడు. జపాన్ మద్దతుతో 1943 అక్టోబర్ 21న ప్రవాసంలో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని నెలకొల్పిన నేతాజీ సరసన అబిద్ ఉన్నాడు! ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) మేజర్గా నియుక్తుడై బర్మా రంగంలో సైన్యానికి నాయకత్వం వహించారు. ‘జైహింద్, సృష్టికర్త! ఆ సందర్భంలో సైనికులు ఇతర భారతీయులు పరస్పరం విష్ చేసుకునేందుకు ‘హలో’కు ప్రత్యామ్నాయంగా ఒక దేశీపదం ఉంటే బావుండునని బోస్ భావించాడు. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చాయి. అబిద్ హసన్ ‘జై హింద్’ అన్నాడు! తక్షణ స్పందనగా నేతాజీ ‘జైహింద్’ అన్నాడు. స్వతంత్ర భారతదేశపు జెండా ఏ రంగులో ఉండాలి? హిందువుల్లో ఎక్కువ మంది కాషాయం (శాఫ్రాన్) అని ముస్లింలలో ఎక్కువ మంది ఆకుపచ్చ అనీ వాదులాట! వైరుధ్యాలు తీవ్రదశకు చే రాయి. ‘హిందూ శ్రేణులు’ కాషాయపు వాదనలు వదులుకుని ఆకుపచ్చకే సమ్మతి తెలిపాయి. ఈ సంఘటనకు అబిద్ హసన్ చలించిపోయాడు. ఆ క్షణం నుంచి తన పేరుకు ‘శాఫ్రాన్’ చేర్చుకున్నాడు. ‘ఐఎన్ఎస్ ట్రయల్’ అనంతరం సింగపూర్లో బ్రిటిషర్లకు ఖైదీగా చిక్కిన అబిద్ హసన్ శాఫ్రానీ 1946లో హైద్రాబాద్ వచ్చారు. కాంగ్రెస్లో చేరి ముఠాతగాదాలకు రోసిల్లి ‘బెంగాల్ ల్యాంప్ కంపెనీ’ ఉన్నతోద్యోగిగా కరాచీ వెళ్లాడు. దేశవిభజన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి హైద్రాబాద్ వచ్చేసిన అరుదైన వ్యక్తి! భారత విదేశాంగశాఖలో ఉన్నతోద్యోగిగా చైనా-స్విట్జర్లాండ్-ఇరాక్-సిరియా-డెన్మార్క్ దేశాల్లో పనిచేశారు. 1969లో రిటైరైన తర్వాత హైద్రాబాద్కు విచ్చేసి దర్గాహుసేన్ షా వలి ప్రాంతంలో వ్యవసాయక్షేత్రం నెలకొల్పారు. జీవితాంతం బ్రహ్మచారి. ముగ్గురు బాలలను పెంచి ప్రయోజకులను చేశారు. అమెరికాలో ప్రఖ్యాత మ్యూజియాలజిస్ట్గా పేరు తెచ్చుకున్న హహబాజ్ శాఫ్రానీ ముగ్గురిలో ఒకరు. ! మరొకరు ఇస్మత్ మెహది, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో అరబిక్ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. మలీహా కూడా ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. నడచిన నేలనంతా హరితమయం చేసి అబిద్ హసన్ శాఫ్రానీ 1984లో 73వ ఏట పరమపదించారు. గంధపు చెక్క అరిగిపోయినా పరిమళిస్తుంది కదా! -
జమ్మి చెట్టుని చూడాలని..
సంస్కృతిని భావి తరాలకు అందించడానికి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యుషన్’ పనిచేస్తోంది. ఏటా విజయ దశమి సందర్భంగా జమ్మి మొక్కలను ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగేళ్లుగా పంపిణీ చేస్తూ వచ్చింది. పంచ మహా వృక్షాల్లో భాగమైన జమ్మితోపాటు... మారేడు, మర్రి, రావి, మేడి మొక్కలనూ అందజేస్తోంది. ప్రకృతి - సంస్కృతి.. నీలా లక్ష్మారెడ్డి ‘గ్రీన్ రెవల్యూషన్’ సంస్థను 2010లో స్థాపించారు. వాస్తవంగా ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిర్భవించింది. అంతటితో ఆగకుండా ప్రకృతితో ముడిపడిఉన్న సంస్కృతిని భావితరాలకు అందించడం కోసం నడుంబిగించింది. 2011 నుంచి ‘ప్రకృతి - సంస్కృతి’ పేరుతో ఐదు రకాల మొక్కలు పంపిణీ చే స్తోంది. ఇప్పటి వరకు నగరంలో మూడు వేలకుపైగా మొక్కలు నాటిం చారు. పార్కులు, ఆలయాల ప్రాంగణాల్లో, వీధుల వెంట నాటారు. కొన్ని ప్రాంతాల్లో మొదట్లో నాటిన మొక్కలు ఓ మోస్తారుగా ఎదిగాయి. ఈ దసరాకు అక్కడి స్థానికులకు జమ్మి దర్శనభాగ్యం కలుగనుంది. జమ్మితో పాటు.. రామాయణం, మహాభారతం నుంచి పంచమహావృక్షాలను పూజించే సంస్కృతి ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. నగరంలో ఆ చెట్లు లేక పోవడంతో పూజలు చేయలేకపోతున్నారు. అందుకే మేం జమ్మితో పాటు.. పంచ మహా వృక్షాల జాబితాలోని ఇతర మొక్కలను పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 29, 30 తేదీల్లో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం వద్ద మొక్కలను పంపిణీ చేశాం. - లీలా లక్ష్మారెడ్డి, ట్రస్ట్ ప్రెసిడెంట్ -
పరిశోధన చేసినందుకు..గర్వంగా ఉంది
తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచి ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ‘బతుకమ్మ’కే దక్కుతుంది. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలతో మమేకమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల జీవనంలో కలిసిపోయిన ఈ పండుగపై 24ఏళ్ల క్రితమే పరిశోధన చేశారు చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఉపాధ్యాయుడు తాటికొండ విష్ణుమూర్తి. బతుకమ్మ పండుగపై పరిశోధన చేపట్టిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన ఆయన తన పరిశోధన నేపథ్యాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. హన్మకొండ కల్చరల్ : బతుకమ్మతో నా అనుబంధం చిన్నప్పుటి నుంచి ఉంది. బతుకమ్మ పండుగను ఆసక్తిగా గమనించేవాడిని. మా ఇంట్లో బతుకమ్మను నేనే పేర్చేవాడిని. మా అమ్మ బతుకమ్మ పాటలు బాగా పాడుతుంది. ఆ పాటల్లోని సాంఘిక, పౌరాణిక అంశాలు నన్ను ఆకర్షించాయి. అప్పుడే ఈ పండుగకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించింది. నేను ఆకునూరులోనే చదువుకున్నా. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశా. 1985లో డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుగుశాఖలో ఎంఏలో చేరి 1987లో పూర్తిచేశాను. అనంతరం ఎల్ఎల్బీ చేశాను. బతుకమ్మపై పరిశోధన 1990లో కాకతీయ యూనివర్సిటీ తెలుగుశాఖలోనే ఎంఫిల్ విద్యార్థిగా చేరాను. ఎంఫిల్ డిసర్టేషన్ పూర్తిచేయాల్సిన సమయంలో అధ్యాపకులను కలిసినప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం సార్.. నీకు ఏ సాహిత్యమంటే ఇష్టమని నన్ను అడిగారు. నేను జానపద సాహిత్యం అని చెప్పాను. ఆయనకు కూడా అదే ఇష్టం. దీంతో వెంటనే ఆయన బతుకమ్మ పండుగపై పరిశోధన చేయమని సలహా ఇచ్చారు. అలా.. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం.., సార్ చెప్పిన టాపిక్.. ఒకటే అయింది. ఆ సమయంలో అక్కడే ప్రొఫెసర్ జ్యోతి, ఫ్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ఆచార్య రుక్మిణి ఉన్నారు. జానపద సాహిత్యమంటే క్షేత్ర పర్యటన విస్తృతంగా చేయాల్సి ఉంటుందని జ్యోతి మేడం చెప్పారు. మగాడివి.. మహిళల దగ్గరికి వెళ్లి పాటలు ఎలా సేకరిస్తావయ్యా.. అని కాత్యాయనీ మేడం అన్నారు. కానీ నేను చేయగలనని చెప్పా. అలా బతుకమ్మ టాపిక్ ఓకే అయింది. తీపిగుర్తుగా మిగిలిపోయింది బతుకమ్మపై పరిశోధన మరిచిపోలేని అనుభవాలను మిగిల్చింది. మొదటిసారి పాటలు సేకరించడానికి పోయినప్పుడు పాడేవారు కాదు. వారి అన్నదమ్ములను, తండ్రులను దోస్తీ చేసుకుని వారి ద్వారా పాడమని చెప్పించేది. బచ్చన్నపేటలో నేను టీచర్గా పనిచేస్తున్న జయ్యారం గ్రామంలోనే మొదట పాటలు సేకరించాను. మా సొంతూరులో మా అమ్మ జయలక్ష్మి ఎన్నో పాటలు పాడారు. మెట్పల్లిలోని గుడిదగ్గర ఎంగిలిపూవు బతుకమ్మ ఆడుతున్న మహిళల పాటలు రికార్డు చేయాలని టేప్రికార్డర్తో వెళ్లాను. వాళ్లు పాడలేదు. బతుకమ్మ ఆడడం పూర్తయి వారు వెళ్లిపోతున్న సమయంలో అంతకుముందు నేను రికార్డు చేసిన పాటలను వినిపించాను. దీంతో వారుకూడా ముందుకొచ్చి పోటీపడి మరీ పాటలు పాడారు. అక్కడి నుంచి సైకిల్పై బొమ్మలమేడిపల్లికి వెళ్లాను. ప్రముఖ సినీరచయిత, గాయకుడు సుద్దాల అశోక్తేజ అక్కడే టీచర్గా పనిచేసేవారు. ఆ రాత్రి వాళ్లింట్లోనే ఉన్నాను. మరుసటిరోజు ఆయన నన్ను బీడీల కంపెనీకి, హరిజన కాలనీకి తీసుకెళ్లారు. రాత్రి 12గంటల వరకు అక్కడి మహిళలతో పాటలు పాడించారు. అలాగే కోరుట్లలో శ్రీవేంకటేశ్వర భజనమండలి నిర్వహిస్తున్న వెంకట్రాజం సార్ మహిళలను పిలిపించి పాటలు పాడించారు. అలా మెదక్, వరంగల్ , కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 50గ్రామాల్లో తిరిగి 400 పాటలు సేకరించా. వీటిలో 380 పాటలను పరిశోధనకు ఎంచుకున్నాను. పాటల సేకరణ సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మన సంస్కృతీసంప్రదాయాలు కనుమరుగవుతున్న తీరు కన్పించింది. జయ్యారంలో ఓ అమ్మాయి రెండుగంటలపాటు పాడింది. దీంతో విసుగొచ్చి రికార్డింగ్ ఆపుచేశాను. మా గైడ్ ప్రొఫెసర్ పి.జ్యోతి వద్ద చర్చిస్తున్నప్పుడు ఆమె అదే పాట కావాలని అనడంతో మళ్లీ వెళ్లాను. అప్పటికే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. దీంతో వాళ్ల నాన్నను కలిసి విషయం చెప్పి ఆమెను పిలిపించి మళ్లీ పాట రికార్డు చేశాను. మొదటి పుస్తకంగా .. 1991లో ఎంఫిల్ అవార్డు అయింది. బతుకమ్మపై మొదటిసారి పరిశోధన చేసినందుకు గర్వంగా ఉంది. చేర్యాల మిత్రులు బతుకమ్మ పాటల పుస్తకాన్ని ప్రచురించాలని ప్రోత్సహించారు. అప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్గా ఉన్నారు. ఆయనే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక సహకారం అందజేశారు. 1993లో పుస్తకావిష్కరణసభ చేర్యాల మండల పరిషత్ ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా జగన్నాథం సార్, స్థానిక ఎమ్మెల్యే నాగపురి రాజలింగం(ప్రస్తుతం ఎమ్మెల్సీ), ఎంపీ డాక్టర్ పరమేశ్వర్, తెలుగు లెక్చరర్ బాసిరి సాంబశివరావు, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి,విమర్శకుడు వేముగంటి నరసింహాచార్యులు, కవితిరునగరి, విద్యావేత్త కృష్ణాజీరావు, లెక్చరర్ అబ్బు రామయ్య(నెహ్రూ యూత్ కోఆర్డినేటర్, నిజామాబాద్) పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ఇంత వైభవంగా ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెలిసిందని చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో జానపద విజ్ఞానంపై జాతీయస్థాయి సమావేశం జరిగినప్పుడు ప్రొఫెసర్ బిరుదరాజు రామరాజు బతుకమ్మ పుస్తకాన్ని చూసి ‘నాకోరిక ఇన్నాళ్లకు సఫలమయింది’ అనడం మర్చిపోలేను. ప్రస్తుతం సాక్షిపత్రికలో బతుకమ్మ పండుగపై వస్తున్న కథనాలు బాగుంటున్నాయి. -
సల్లంగ బతుకమ్మ
దేశంలో అనేక పండుగలు - పర్వాలు కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ ఇది. ‘జీవించు-బ్రతికించు’. అన్నదే ఈ బతుకమ్మ అర్థం. అదే తెలంగాణ సంస్కృతికి ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్త్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే ఆ మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది. బతుకమ్మ పండుగ... చారిత్రక ఆధారం... తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయరాజు ‘గుండన’ పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడి తోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించడం మొదలుపెట్టారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేటట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పే దేవతాస్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ శబ్దమే కాలక్రమంలో ‘బతుకమ్మ’గా మారి ఉండొచ్చన్నది పరిశోధకుల మాట. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. ఆమే అందరికీ బతుకనిచ్చే తల్లిగా మారడం చారిత్రక పరిణామం. ఇంకో జానపదగాథ బతుకమ్మ చుట్టూ తిరుగుతున్నది. భట్టు నరసింహకవి రచించిన పాటే ఈ బతుకమ్మ పేరుకు ఆధారంగా ఉంది. ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తూ ‘లక్ష్మీదేవి’యే అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించడానికి దేవాధిదేవతలు, మహర్షులు వచ్చి ‘బ్రతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో’’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అని నామకరణం చేశారని ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది. బతుకమ్మ ఏ దేవి స్వరూపం? శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ...అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే కాకతీయుల సేనాని అయిన జాయప సేనాని రచించిన ‘నృత్తరత్నావళి’ లోని ఒక చిందు (దరువు) ‘బతుకమ్మ ఆట’కు మూలం అని కూడా పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మ సందేశం... ప్రకృతి నుండి సేకరించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్ళీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న అధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకటిన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుంది. అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం ఈ పండుగలో కన్పిస్తుంది. వర్ష ఋతువు సమాప్తమై శరదృతువు ప్రారంభం అయ్యే సూచనను బతుకమ్మ ఇస్తుంది. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. మొదటి బతుకమ్మను- ‘ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క ఝామాయె చందమామ శివుడింక రాడాయే చందమామ శివపూజ యాల్లాయె చందమామ’ అని పాడుతూ 9వ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. మధ్య మధ్యలో సందర్భానికి తగినట్లు పాటలుంటాయి. ఈ పాటలు ‘ఉయ్యాల పాటలు’గా బతుకమ్మ పాటలుగా ఎన్నో రూపాలను సంతరించుకొన్నాయి. బతుకమ్మ స్త్రీల పండుగ. బతుకమ్మ కన్నా ముందు ‘బొడ్డెమ్మ’ ఆడటం యువతులకు అలవాటు. ‘బోణి’ అంటే స్త్రీ శ్రీమూర్తిని స్త్రీమూర్తులు ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళానైపుణ్యం, సహజీవనతత్వం, ప్రకృతి తాదాత్మ్యం కనిపిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బ్రతుకునివ్వమనీ కోరుకొనే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం ‘మన బతుకమ్మ’. -డా॥పి. భాస్కరయోగి రోజుకో రూపం... రూపానికో నైవేద్యం మొదటిరోజు: ‘ఎంగిలిపూల బతుకమ్మ’ నైవేద్యం: తులసి ఆకులు, వక్కలు. రెండవరోజు: ‘అటుకుల బతుకమ్మ’ నైవేద్యం: సప్పిడిపప్పు, బెల్లం, అటుకులు మూడవరోజు: ‘ముద్దపప్పు బతుకమ్మ’ నైవేద్యం: ముద్దపప్పు, బెల్లం, పాలు నాల్గవరోజు: ‘నానబియ్యం బతుకమ్మ’ నైవేద్యం: నానేసిన బియ్యం, పాలు, బెల్లం అయిదోరోజు: ‘అట్ల బతుకమ్మ’. నైవేద్యం: అట్లు (దోసెలు) ఆరోరోజు: ‘అలిగిన బతుకమ్మ’ నైవేద్యం: ఈ రోజు బతుకమ్మ ఆడరు. ఏడోరోజు: ‘వేపకాయల బతుకమ్మ’ నైవేద్యం: సకినాల పిండిని వేపకాయల్లా చేసినూనెలో వేస్తారు. ఎనిమిదోరోజు: ‘వెన్నముద్దల బతుకమ్మ’ నైవేద్యం: నువ్వులు, వెన్న ముద్ద, బెల్లం చివరిరోజు: సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. నైవేద్యం: పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వుపొడి. -
మీరు సంగీత ప్రియులు
‘మార్వాడీ, గుజరాతీ, హిందీ... భిన్నత్వంలో ఏకత్వం హైదరబాద్లో కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. అందుకే ‘హైదరాబాద్ ఈజ్ గ్రేట్’ అన్నారు ఇండియన్ ఐడల్ ఫేం విశాల్, బాలీవుడ్ గాయకులు అర్చనా మహాజన్, సుచిత్ర, నిగమ్ రాథోడ్ల. శంషాబాద్ మల్లిక గార్డెన్లో గురువారం నుంచి నిర్వహించే ‘దిల్దార్ దాండియా’లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా కాసేపు వారు మీడియాతో ముచ్చటించారు. ‘హైదరాబాదీలు సంగీత ప్రియులు. దాండియాతో దుమ్ము రేపి వారిని అలరించడానికి సిద్ధమయ్యాం. దిల్దార్ దాండియా నిర్వహించడం సిటీలో ఇదే మొదటిసారి. అందుకే ఇక్కడివారికి మరుపురాని దాండియా అనుభూతిని మిగిల్చేలా ఉంటుందీ కార్యక్రమం. మహిళలకు ప్రవేశం ఉచితం’ అని చెప్పారు. - శంషాబాద్ -
ఉదయాన్నే లేవండి! ఉత్సాహాన్ని సొంతం చేసుకోండి!
మనలో చాలామందికి పొద్దెక్కాక లేవడం అలవాటు. దీన్ని సమర్థించుకోవడానికి కూడా బోలెడు కారణాలు ఉంటాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే...త్వరగా లేవడం, త్వరగా పడుకోవడం మన ఆరోగ్య సంస్కృతిలో భాగం. అదే ఆరోగ్య రహస్యం కూడా! ‘‘మేము కూడా పొద్దున్నే లేవాలి అనుకుంటాం. ఎందుకో మరి వీలుకావడం లేదు!’’ అంటారా? అయితే కింద ఇచ్చిన సలహాలను పాటించి చూడండి. త్వరగా నిద్రపోండి! రాత్రి పది లేదా పదకొండుకల్లా నిద్రపోండి. మొదట్లో నిద్ర రాక పోవచ్చు. వారం రెండు వారాల్లో అది అలవాటుగా మారి నిద్రపడుతుంది. అలారం... కాస్త దూరంగా! మీ మంచం పక్కనే చేతికి అందుబాటు దూరంలో అలారం ఉండకూడదు. మనం సెట్ చేసిన టైమ్కు - ‘‘నిద్ర లే గురూ’’ అని అలారమ్ మనల్ని మేల్కొలుపుతుంది. మనమేమో నిద్రమత్తులో, దాని పీక నొక్కేసి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోతాం. అలారం దూరంగా ఉందనుకోండి... బెడ్ మీది నుంచి లేచి అలారం ఆఫ్ చేసే లోపు నిద్ర ఎగిరిపోతుంది. పని చేయండి! నిద్ర లేవగానే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం కండి. లేకపోతే మళ్లీ నిద్ర చుట్టుముడుతుంది. అందుకే బ్రష్ చేయడం, టీ చేయడం, తోటపని చేయడంలాంటివి చేయాలి. ఒక విషయం ఇటీవల జర్మనీలోని హైడెల్బెర్గ్కు చెందిన జీవశాస్త్ర ప్రొఫెసర్ ఒకరు వేకువజామునే నిద్ర లేచే విద్యార్థులు, ఆలస్యంగా నిద్ర లేచే విద్యార్థుల మీద ఒక అధ్యయనం నిర్వహించారు. ఆలస్యంగా నిద్ర లేచే విద్యార్థులతో పోలిస్తే, త్వరగా నిద్ర లేచే విద్యార్థులు చదువుతో పాటు అనేక విషయాల్లో చురుగ్గా ఉన్నట్లు కనుగొన్నారు. -
హిందూ ధర్మాన్ని రక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హిందూ ధర్మం, సంస్కృతులను పరిరక్షించడం కర్తవ్యంగా భావించాలని అఖిల భారతీయ సాధ్వీ శక్తి పరిషత్ ప్రధాన కార్యదర్శి వైష్ణవీ ప్రజ్ఞా భారతీయా పిలుపునిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. హిందూ సమాజంపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారు ఎక్కడోలేరని, మన మధ్యన ఉంటూనే ప్రమాదం తల పెట్టవచ్చని అన్నారు. హైదరాబాదీ హిందువుల ఐక్యత యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. ప్రధానంగా హైదరాబాద్లో గోమాతను రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. చొరబాటుదారులను తరిమి కొట్టాలి భారతదేశంలో చొరబాటుదారులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్కు చెందిన సాధ్వీ విభానందగిరి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని పునరుద్ఘాటించారు. గోవధ నిషేధానికి కృషి గోవధ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఒక్క గోమాత ప్రాణం కూడా పోకుండా రక్షించి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి. బీజేపీ జాతీయ నాయకుడు చింత సాంబమూర్తి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు తదితరులు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు: బండారు దత్తాత్రేయ అబిడ్స్: గణేష్ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానన్నారు. సోమవారం ఎంజే మార్కెట్-అబిడ్స్ రోడ్డులో ఎమ్మెల్యే రాజాసింగ్లోథ ఏర్పాటుచేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. కేంద్ర మంత్రిప్రకాష్ జవదేకర్తో సమావేశమై గణేష్ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విధంగా ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లక్షలాది మంది జనం మధ్య గణేష్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణేష్ ఉత్సవాలను చిన్న ఘటనలు లేకుండా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాలు పంచుకున్నారని దత్తాత్రేయ ప్రశంసించారు. అకృత్యాలను అడ్డుకోండి దత్తాత్రేయనగర్: లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని సాధ్వీ విభానందగిరీజీ, వైష్ణవీ ప్రజ్ఞలు అన్నారు. సోమవారం ఎంజేమార్కెట్లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికవద్ద విభానంద గిరీజీ మాట్లాడుతూ అల్లా, దేవునిపై నమ్మకం లేనివారే ఉగ్రవాదులుగా మారుతున్నారన్నారు. వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ దేశద్రోహ వ్యవహరాలకు పాల్పడే వారికి భారత్లో ఉండే అర్హత లేదన్నారు. వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. ‘వందేమాతరం’ పాడండి యాకుత్పురా: హిందుస్థాన్లో ఉండాలంటే వందేమాతరం గేయాన్ని పాడాలని అఖండ సంప్రదాయక్ సంస్థ ఉపాధ్యక్షురాలు సాత్వీ విభానందగిరి అన్నారు. చార్మినార్ కట్టడం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆమె పాతబస్తీ నుంచి తరలివచ్చిన వినాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ శక్తిపీఠం అధ్యక్షురాలు వైష్ణవీ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని సూచించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తులకు గంట కొట్టనివ్వకపోవడం తగదన్నారు. -
కేరళ పండగ సంబరానికి వెళ్లొద్దాం...
మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్ 10 వరకు జరిగే ఈ పండగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం కేరళ చేరుకుంటారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి. వారం రోజులు వేడుకగా.. కేరళ పర్యాటక సంస్థ ఓనమ్ పండగ సందర్భంగా రాష్ట్రరాజధాని అయిన త్రివేండ్రానికి దగ్గరలోని కోవళం గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతోంది. దీంట్లో భాగంగా నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు, ఆహార శాలలు, హస్తకళల కేంద్రాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి. విందు భోజనం.. సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 7న (తిరు ఓనమ్) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి. స్నేక్ బోట్ రేస్... ఓనమ్ పండగలో ప్రధాన ఆకర్షణ స్నేక్ బోట్ రేస్. అరన్ముల బోట్ రేస్ పార్థసారధి దేవాలయం దగ్గర పంపానదిలో సెప్టెంబర్ 10న జరుగుతుంది. పులి వేషాలు... శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్లో ఈ వేడుకలు సెప్టెంబర్ 9న ఘనంగా జరుగుతాయి. తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండగకు చిహ్నాలు. ఇలా చేరుకోవచ్చు: త్రిసూర్ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు. స్వరాజ్ రౌండ్/త్రిస్సూర్ రౌండ్ అని ఇక్కడి ప్రాంతాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. వసతి: ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్నా, పెద్ద హోటల్స్ ఉన్నాయి. కేరళ టూర్ ప్యాకేజీ 5 రాత్రుళ్లు/6 పగళ్లు దేశంలో ఏ ప్రాంతం నుంచైనా కొచ్చిన్ చేరుకోవాలి. కొచ్చిన్లో విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు ఉన్నాయి. కొచ్చిన్ నుంచి మున్నార్, తేక్కడి, కుమరకోమ్, అలెప్పీ సందర్శన. ఎ.సి హౌజ్బోట్లో షికార్లు. డబల్రూమ్ వసతి+ అల్పాహారం+రాత్రి భోజనం, కారులో చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల సందర్శన. మున్నార్లో మిస్టీ మౌంటేయిన్, తేక్కడిలో అరణ్యా నివాస్, కుమరకోమ్లో వాటర్స్కేప్స్ రిసార్ట్, అలెప్పీలో ఎ.సి డీలక్స్ హౌజ్బోట్లో వసతి సదుపాయాలు. ఈ మొత్తం ప్యాకేజీ రూ.34,000/- మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్ పార్క్ వ్యూ, తిరువనంతపురం టోల్ ఫ్రీ నెం. 1-800-425-4747 ఫోన్: +4712321132 -
సంప్రదాయానికి పట్టుగొమ్మ
ఓనమ్ స్పెషల్ ప్రకృతి అంతా ఒక చోటే కొలువుదీరిందా అని ఆశ్చర్యపోయేటంత అందం కేరళ సొంతం. ప్రాకృతిక పరంగానే కాకుండా సంప్రదాయానికీ ఈ నేల పెట్టింది పేరు. ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ తమ సంస్కృతినీ సంప్రదాయాన్నీ కాపాడుకోవడం మలయాళీల ప్రత్యేకత. తెలుగురాష్ట్రాలలో మలయాళీలూ సందడి చేస్తున్నారు. వారి పండగలలో ప్రధానమైన ఓనమ్, వారి ఆహార్యమూ తెలుగువారినీ ఆకట్టుకుంటుంది. ఓనమ్ సందర్భంగా మలయాళీల కట్టూబొట్టు గురించి... పాల మీగడను పోలి ఉండే పంచెకు బంగారపు జరీ అంచు, అదే పోలికతో ఉండే ఉత్తరీయం మలయాళీల సంప్రదాయ వస్త్రధారణలో ప్రధానమైనవి. చెడు ఆలోచనలను, చెడు భావనలను తొలగించి హృదయాన్ని నూతనంగా చేయటమే ఈ వస్త్రాలు ధరించడంగా కేరళవాసులు భావిస్తారు. ప్రాచీనం.. ముండు.. కసవు అంటే బంగారు అంచు. ముండు అంటే పంచె, నెరయాతుమ్ అంటే ఉత్తరీయం. కసవు చీరలు, పంచెలు, ఉత్తరీయం.. తేలికగా ఉండటమే కాదు, జరీ అంచులు మెరుస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూల కాటన్ వస్త్రాలు. వీటిని సంప్రదాయ చీరలుగా, డ్రెస్లుగా ఉపయోగిస్తారు. ముండు, నెరయాతుమ్ ధరించి నూనె పెట్టి విడిచిన పొడవాటి కురులలో మల్లెపూలను ధరించిన మలయాళీ మహిళ అందానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. నుదుటిపై చిన్న బొట్టు, కళ్లకు కాటుక, బంగారు ఆభరణాలు ప్రత్యేకతను చాటుతుంటాయి. ఈ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మగవారు ముండును లుంగీగాను, నెరయాతుమ్ను భుజాల చుట్టూ ధరిస్తారు. ఈ వస్త్రాలు ఒక్క ఓనమ్ పండగకే కాదు, వారంలో రెండు సార్లు ధరించాలి అనే నియమం కూడా కేరళలో అనుసరిస్తున్నారు. ప్రతి వేడుకలోనూ ‘కసవు’ చీరలకు ప్రథమ స్థానం ఇవ్వడం వీరి ప్రత్యేకత. కేరళ చేనేత వస్త్రాలకు ఓ ప్రత్యేకత ఉందని, శిశువు గర్భస్థ దశలో ఉండగా స్త్రీ ఈ వస్త్రాలను ధరిస్తే పుట్టబోయే బిడ్డకు కామెర్లు రావని చెబుతారు. అంటే ఈ వస్త్రం ఆరోగ్య ప్రదాయిని అన్నమాట. ఆధునిక పద్ధతుల్లో ముండు వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని, నెరియాతు ఎడమ భుజం మీదుగా పమిటలా వేసుకుంటున్నారు. ఇది తెలుగింటి లంగా ఓణీని తలపిస్తుంది. చేనేత చీరలకు కేరళ పెట్టింది పేరు. ఇక్కడ బలరాం పురం, కన్నూర్, కూతంపల్లి, చెన్నమంగళం, కాసర్ గోడ్ వస్త్రాలకు అక్కడి రాష్ట్రంలోనే గాక విదేశాలలో కూడా మంచి పేరుంది. కేరళ సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఈ చీరల నేత ఉంటుంది. బలంపురంలో వెదురుతో సూపర్ ఫైన్ కాటన్ను తయారుచేస్తారు. ఈ ప్రాంతం చీరలకు, ఇతర నూలు వస్త్రాలకు ప్రసిద్ధి. పర్యావరణానికి అనుకూలంగా వస్త్రాల నేత ఉంటుంది. కన్నూర్ ప్రాంతం నుంచి జపాన్, హాంగ్కాంగ్, యూరప్, మధ్య ఆసియా దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తారు. త్రిసూర్ జిల్లాలోని కూతంపల్లి ‘కసవు’ చేనేతకు ప్రసిద్ధి. డబుల్ ధోతి, సెట్ ముండు, వేస్టీ, సెట్ శారీ, లుంగీ, చుడీదార్ వస్త్రాలను తయారుచేస్తారు. ఓనమ్, విషు, క్రిస్ట్మస్ పండుగల సమయాల్లో కూతంపల్లి వస్త్రాలకు ప్రజలు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ‘కసవు’ చీరల వైపు ఆసక్తిచూపుతారు. వీటి ధరలు ఒక్కొక్కటి రూ.300/- నుంచి లభిస్తాయి. మహాబలి కేరళ రాజ్యానికి రాజు. ఇతని పరిపాలన కేరళలో స్వర్ణయుగంగా భావిస్తారు. బలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకునే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగ విశిష్టతను పొందింది. మలయాళీల ప్రాచీన వస్త్ర వైభవంగా ముండు, నెరియాతుమ్ పద్ధతులను విశేషంగా చెప్పుకుంటారు. జరీ అంచు గల ‘కసవు’ చీరలను అతివలు వేడుకలలో తప్పనిసరిగా ధరిస్తారు. స్త్రీలు, పురుషులు ముండు పంచెలను ధరిస్తారు. స్త్రీలు సంప్రదాయ పద్ధతిలో ముండు (పంచె)ను ధరించి, ఉత్తరీయం (నెరియాత్తు) కుచ్చిళ్లుగా మలచి, జాకెట్టులోకి ముడుస్తారు. ఈ పద్ధతి బౌద్ధ, జైన విధానాలను అనుసరించి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆభరణాల ప్రత్యేకత కేరళ ఆభరణాలలో పెద్ద పెద్ద హారాలు ప్రత్యేకమైనవి. వీటిలో ముఖ్యమైనవి- కసు మాల(కాసులపేరు), పలాక్కమాల, నాగపడగ తాళి, కరిమని మాల, ముళ్లమొట్టు మాల, చేరుతళి, అడ్డియాల్, కశలి, పూతలి, జుంకీలు.. మొదలైనవి. కేరళ స్త్రీ వద్ద వీటిలో కనీసం ఒక్కటైన తప్పనిసరిగా ఉంటుంది. కేరళ కుటుంబాలు ఇప్పటికీ సంప్రదాయ ఆభరణాలనే ఇష్టపడుతున్నాయి. దాదాపు అన్ని రకాల ఆభరణాలలోనూ దేవాలయ శిల్ప కళ కనబడుతుంది. టెంపుల్ జువెల్రీలో విళక్కు మాల, ఎరుక్కుంపుమాల, సరపోలి మాల, వివదల మాల, మణి మాల.. ముఖ్యమైనవి. దాదాపు అన్ని ప్రసిద్ధ దేవాలయాలలోనూ తిరువాభరణం ధరించిన దేవతా మూర్తులు కనిపిస్తారు. మన సంప్రదాయ వైభవాన్ని కళ్లకు కట్టే ఓనమ్ లాంటి వేడుకలకు వన్నెతెచ్చేవి సంప్రదాయ వస్త్రాలే. అలాంటి వస్త్రకళను వేనోళ్ల పొగడటమే కాదు, వేనవేలఏళ్లు ఆ కళను కాపాడుకుందాం అనే మలయాళీల మాట ఆచరణలో చూపాల్సిందే! - నిర్మలారెడ్డి తెలుపు, బంగారు వర్ణంలో ఉండే కేరళ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చీరగానే కాకుండా వీటిని అనార్కలీ డ్రెస్, లంగా ఓణీలుగానూ తీర్చిదిద్దుకోవచ్చు. జరీ అంచుపైన జర్దోసి, మిర్రర్ వర్క్.. చేయవచ్చు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా ముదురు రంగు కాంబినేషన్స్ ఎంచుకొని కేరళ చీరలు, డ్రెస్ల మీద ధరించవచ్చు. - అర్చితా నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్ ముండు అంటే పంచె. నెరియాతుమ్ అంటే పై వస్త్రధారణ. ఈ రెండు వస్త్రాలను ఉపయోగించి చేసే కట్టును ‘ముండు నెరియాతుమ్’ అంటారు. కేరళవాసుల సంప్రదాయ వస్త్రమైన ముండు దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన సాంప్రదాయికతకు మిగిలిన ఆనవాలు. -
గణనాయకం భజే..!
ఎన్నో విశేషాలకు నిలయమై, అగణిత శుభాలను అందించే ఏకదంత గణపతిని వివిధ రూపాల్లో, పలు నామాలతో కొలుచుకుంటారు. ప్రత్యేకంగా ‘వినాయక చవితి’ ఆరాధనలో గణనాథునికి అర్పించే దివ్యనీరాజనం మన సంస్కృతిలో, సంప్రదాయంలో భాగం. గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వదేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది. శుభకరుడు గణపతి ‘గణ్యంతే బుధ్యంతే తే గణాః ’ అన్నట్లు సమస్త దృశ్యమాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు. దేవతా గణాలు ఉద్భవించి, సృష్టి ప్రారంభం అయినప్పటినుండీ ఆది పురుషునిగా గణపతి పూజలందుకుంటున్నట్టుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణు స్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అన్న శ్లోకం సూచిస్తుంది. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో ఏకదంతుడై సంపదబొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధి వీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు. విఘ్నేశ్వరుని సంసారం గణేశుని పుట్టుకే ఒక అద్భుత సంఘటన. నలుగు పిండిని నలచి వినాయకుడిని చేసి ద్వారపాలకునిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడక తనను అడ్డగించినందుకు శివుడు కోపించి అతని తల దునిమేశాడు. పార్వతి విచారం చూడలేక తర్వాత శివుడే తన గణాలను పంపి ఏనుగు తల తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. సుందరతర శుభవదనుడై అరుణ కాంతితో అలరారుతూ జ్యోతి ప్రభలతో, ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలగణపతి బ్రహ్మవిష్ణుశంకరులకు నమస్కరించి ‘క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చై వేదృశో నృణామ్’ అంటూ అభిమానవంతుడనై ప్రవర్తించిన తన అపరాధమును మన్నించమని కోరతాడు. పార్వతీదేవి ఆ బాలుని దగ్గరగా తీసుకొని ‘‘గజవదనా! నీవు శుభకరుడవు. శుభప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలోనూ ప్రథమార్చన నీకే లభిస్తుందని’’ ఆశీర్వదిస్తుంది. ఆనాటి నుండి గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికీ గణేశుని ఆవిర్భావానికీ తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది. ప్రజాపతి తన పుత్రికలైన సిద్ధిని, బుద్ధినీ గణపతికిచ్చి వివాహం జరిపించాడు. సిద్ధి బుద్ధి గణపతుల సంతానం క్షేముడు, లాభుడు అనేవారు. కార్యసాధనలో సిద్ధి, బుద్ధి తోడుగా ఉంటే లాభం, క్షేమం కలుగజేసే సందేశాత్మక ఆధ్యాత్మిక దృక్పథం వినాయకుని సంసారం. తొలిపూజతో ఆరాధనాఫలం వినాయకుడిని పూజించడం వలన శ్రీమహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించేవారు సర్వరోగ విముక్తులై, ఆరోగ్యప్రద జీవనాన్ని గడుపుతారు. సమృద్ధినీ, మేధాశక్తినీ, విద్యాజయాన్నీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దేవుడు గణనాథుడు. - డా.ఇట్టేడు అర్కనందనాదేవి నిమజ్జన ఆంతర్యం తొమ్మిదిరోజుల పాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి, ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపివేయడం బాధగానే ఉంటుంది కానీ, అది ఒక నియమం, సంప్రదాయం. ఆలయాల్లో, ఇంటిలోని పూజామందిరాల్లో పంచలోహాలతో చేసినవి లేదా కంచు, వెండి, బంగారు లోహాలతో చేసిన విగ్రహాలను ఉపయోగిస్తారు. అవి శాశ్వతంగా పూజించడానికి అనువుగా ఉంటాయి. కానీ నవరాత్రి ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను మట్టితో, రంగులతో, ఇతర పదార్థాలతో పెద్ద పెద్ద ఆకారాలుగా తీర్చిదిద్దుతారు. ఆలయాల్లో తప్ప ఇళ్లలోగానీ మరేచోట కూడా తొమ్మిది అంగుళాలకి మించిన విగ్రహాలు వాడరాదంటారు. వాటిని కూడా రోజూ నియమ నిష్ఠలతో పూజించాలి. అందుకే 3, 5, 9 రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ లోతైన నీటిలోగానీ నిమజ్జనం చేస్తారు. ఎన్నో అలంకరణ లతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేననీ, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసి పోవలసిందనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది. -
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
ఇంట్లో పూజకు చిన్న వినాయక విగ్రహాలను ఉచితంగా ఇస్తాం డీజేల సంస్కృతి మనది కాదు జిల్లా కలెక్టర్ జి.కిషన్ హన్మకొండసిటీ : మట్టి వినాయక విగ్రహాల నే ప్రతిష్టించాలని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలకు కలెక్టర్ జి.కిషన్ సూచించారు. మట్టి విగ్రహాలపై ప్రచారాన్ని ఉద్యమంగా చేపట్టాలని అన్నారు. శుక్రవారం హన్మకొం డ ఏకశిల పార్కులో కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల వినియో గ ప్రోత్సాహక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసే విగ్రహాల్లో విషతుల్యమైన రసాయనాలు వినియోగించటం వల్ల నిమజ్జ నం అనంతరం నీటి కాలుష్యం ఏర్పడుతుం దని చెప్పారు. దీంతో జంతువులకు, జలచరాలకు ప్రాణాంతకంగా మారడమేకాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాల ను వినియోగించి పర్యావరణాన్ని రక్షించాల ని కోరారు. నిమజ్జనం రోజు డీజేల వాడకా న్ని గణపతి మండళ్లు నియంత్రించాలని, అది మనసంస్కృతి, సంప్రదాయం కాదన్నారు. భక్తితో పూజించాలని అన్నారు. నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు. ఇంటిలో పూజించే చిన్న వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించి ఉచితం గా అందజేయనున్నట్లు చెప్పారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విజయరాం మా ట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 4 అడుగుల 5 ఇంచుల ఎత్తు కలిగిన 360 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి సిద్ధంగా ఉంచామని, ఒక్కో విగ్రహం ధర రూ.4,200 ఉంటుందని అన్నారు. వరంగల్ లో రెండు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామ ని, మట్టితో విగ్రహాల తయారీపై డిసెంబర్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. విగ్రహాల తయారీని వృత్తిగా స్వీకరించి న వారు శిక్షణ ద్వారా నేర్చుకొని ఉపాధి పొందవచ్చని సూచించారు. శ్రీరామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి ఆత్మచైతన్య మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు కావాలనుకునే వారు రూ.వెయ్యి చెల్లించి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్హౌస్ రోడ్డులోని శ్రీరామకృష్ణ మఠంలో బుకింగ్ చేసుకోవాల ని, మిగతా మొత్తాన్ని విగ్రహం తీసుకెళ్లే రోజు చెల్లించాలన్నారు. ఈసందర్భంగా పీసీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూర్ణచందర్రావు మట్టి విగ్రహాల ఆవశ్యకతపై రూపొందించి న పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంత కు ముందు ఏకశిల పార్కులో తయారు చేసిన మట్టి విగ్రహాలను కలెక్టర్ కిషన్ స్వయం గా పరిశీలించారు. సమావేశంలో కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, డీఆర్ఓ సురేంద్రకరణ్, గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ భాస్కర్రావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జయపాల్రెడ్డి, ఇంటాక్ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్డీఓ మాధవరా వు, కుడా పరిపాలన అధికారి అజిత్రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణ సుమగంధం
బిజీలైఫ్.. పొట్టి జడను, పోనీ టెయిల్ను సపోర్ట్ చేసినా, అకేషనల్ షెడ్యూల్ మాత్రం వాలుజడ.. పూలజడనే సవరిస్తోంది! ఇందుకు సాక్ష్యం.. ఈ వరలక్ష్మీ వ్రతమే! అయితే ఈ అలంకరణను ఇదివరకటిలా అమ్మ.. అత్తమ్మ... అమ్మమ్మలు చేయట్లేదు స్పెషల్ డిజైనర్లు అల్లుతున్నారు అందంగా.. సంస్కృతిని చాటే పండుగపబ్బాలకు సంప్రదాయ సోకులే అసలైన ఆకర్షణ. అందుకే మామూలప్పుడు ఎలా ఉన్నా పర్వదినాలకు మాత్రం బారెడు జడ.. మూరెడుపూలతో కాంతులీనుతుంటారు కాంతలు. ఈ అలంకరణ ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మల దాకా అందరికీ ప్రీతిపాత్రమే! ఇంతకుముందు ఈ జడల్లో మల్లెలు, మరువాలు, బంతులు, చేమంతులు, కనకాంబరాలు చేరేవి. కట్టేది చీరైనా, పరికిణీ జాకెట్టయినా.. ఓణీ అయినా పూలు ఇవే! జడలో తురిమే వైనమూ అదే! ఇపుడు.. కాలం మారింది. అభిరుచి పాతదే అయినా అమలయ్యే తీరు కొత్తందాన్ని సంతరించుకుంది. విదేశీపుష్పాలు సైతం కురులకు కలరింగ్ ఇస్తున్నాయి. కొంచెం సృజన ఉన్నవాళ్లు ఈ జడను అప్డేట్ చేసి పూలజడ డిజైనర్లుగా అడ్రస్ చాటుకుంటున్నారు. పువ్వులతో పాటు.. బుజ్జిబుజ్జి నడకల తన బుజ్జాయి బుల్లి జడకు పువ్వులు భారమవుతాయని అమ్మలు భావిస్తే.. వీసమెత్తు బరువులేని కనకాంబరంలాంటి పూలతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలను జడ ఒంపుల్లో చేర్చి ఆ బిడ్డల్ని బంగారు బొమ్మల్లా తీర్చిదిద్దుతున్నారు. అరచేతి వెడల్పున డిజైన్లు సృష్టించి, వాటిని జడ పొడవునా పొదుగుతున్నారు. సిగ్గులొలికే పెళ్లికూతురి కోసం మల్లెమొగ్గలతో జడను కుడుతున్నారు. అత్తారింట జరిగే రిసెప్షన్కి ఆ అపరంజి ఇంకాస్త అందంగా కనిపించడానికి ఆమె జడపై నెమళ్లను నాట్యమాడిస్తున్నారు. ఇలా ఒక్కో వేడుకకు ఒక్కో విధమైన వైవిధ్యాన్ని పూలజడల్లో చూపిస్తున్నారు. రంగులను బట్టి.. చీర.. లంగా ఓణీల రంగులను బట్టి పువ్వులను.. వాటి చుట్టూ వాడే పూసలను ఎంచుకుంటున్నారు. తెలుపు చీరకు ప్రకృతి ఇచ్చిన మల్లె, లిల్లీ సుమాలు.. మధ్య మధ్యలో ముత్యాలు, కృత్రిమంగా చేసిన గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్ని జతచేర్చి జడలో కూర్చుతున్నారు. ఆకుపచ్చ రంగు చీరయితే సంపంగి, మరువాన్ని అల్లేసి ఇతర పువ్వులను, మోటివ్స్ను, రకరకాల జడబిళ్లలను కలిపేస్తున్నారు. వంకాయ రంగుకు ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడుతున్నారు. ఈ పూలజడలు డిజైన్ను బట్టి ధర.రూ.2,000/- నుంచి 3,500/- వరకు లభిస్తున్నాయి. మరింత ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ మన హైదరాబాద్లోనే దొరుకుతాయి. - విజయారెడ్డి ‘ఏ చిన్న వేడుకైనా అమ్మాయిల అలంకరణ కోసండిజైనర్ పూల జడలను అడుగుతున్నారు. ఈ మాసం నోములు, వ్రతాలలో అమ్మాయిలను లక్ష్మీదేవిలా అలంకరించాలనుకుంటారు. రాబోయే దసరా, నవరాత్రి, దీపావళి వేడుకల్లో.. పెళ్లి సంబరాల్లో డిజైనర్ పూలజడలకు మంచి గిరాకీ ఉంటోంది. ఆర్డర్ మీద వీటిని తయారుచేస్తుంటాం.’ - కల్పన రాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్