Electric Scooter
-
రెండువారాల్లో 50000 బుకింగ్స్.. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం
అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన.. రెండు వారాల్లోనే 50,000 బుకింగ్లను అందుకుంది. లాంచ్ సమయంలో ప్రకటించిన ధర మొదటి 10000 యూనిట్లకు మాత్రమే పరిమితం అని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ ఆఫర్ను 50000 బుకింగ్లకు పొడిగించింది. మొత్తం బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి.రెండు వారాల క్రితం షాక్వేవ్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్తో పాటు అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ను కూడా లాంచ్ అయింది. లాంచ్ సమయంలో, టెస్సెరాక్ట్ను రూ. 1.20 లక్షల ప్రారంభ ధరకు ఆవిష్కరించారు. ఈ ధర మొదటి 10,000 ప్రీ బుకింగ్లకు మాత్రమే చెల్లుతుందని బ్రాండ్ వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత కేవలం 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందింది. దీంతో కంపెనీ ఈ ఆఫర్ను మరో 30,000 ప్రీ-బుకింగ్లకు విస్తరిస్తున్నట్లు నిర్ణయించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్బోర్డ్ నావిగేషన్తో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్క్యామ్లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్బార్ కోసం హాప్టిక్ ఫీడ్బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
Ola Flash Sale: ఓలా స్కూటర్లు కొనేవారికి ‘పండగ’
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన పాపులర్ ఎస్ 1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తూ ప్రత్యేక హోలీ ఫ్లాష్ సేల్ను ప్రారంభించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నవారు అద్భుతమైన ఆఫర్ను వినియోగించుకోవచ్చు.ఈ లిమిటెడ్ టైమ్ ప్రమోషన్ లో భాగంగా ఓలా కస్టమర్లు ఎస్ 1 ఎయిర్ పై రూ.26,750 వరకు, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.22,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు ఎస్ 1 ఎయిర్ ధర రూ .89,999, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) రూ .82,999 అని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అంతేకాకుండా, తాజా ఎస్ 1 జెన్ 3 మోడళ్లతో సహా మిగిలిన ఎస్ 1 శ్రేణిపై రూ .25,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.తగ్గింపు తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 శ్రేణి స్కూటర్ల ధరలు రూ .69,999 నుంచే ప్రారంభమవుతాయి. గరిష్టంగా రూ .1,79,999 ఉంటుంది. కాగా ఎస్ 1 జెన్ 2 స్కూటర్ల కొత్త కొనుగోలుదారులకు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీరు రూ .2,999 విలువైన మూవ్ ఓఎస్ + కు ఒక సంవత్సరం ఉచిత సబ్ స్క్రిప్షన్, కేవలం రూ .7,499 లకే రూ .14,999 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీని పొందవచ్చు.ఎస్ 1 జెన్ 3 పోర్ట్ ఫోలియోలో ఫ్లాగ్ షిప్ ఎస్ 1 ప్రో ప్లస్ 5.3 కిలోవాట్, 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది. వీటి ధరలు వరుసగా రూ .1,85,000, రూ .1,59,999. ఎస్ 1 జెన్ 3 శ్రేణిలోని ఇతర మోడళ్లలో ఎస్ 1 ప్రో (4 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్లలో లభ్యం) ధరలు వరుసగా రూ .1,54,999, రూ .1,29,999. ఇక 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ ఆప్షన్లలో లభించే ఎస్ 1 ఎక్స్ శ్రేణి ధరలు వరుసగా రూ.89,999, రూ.1,02,999, రూ.1,19,999 కాగా, 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర రూ.1,24,999. మునుపటి ఎస్ 1 జెన్ 2 స్కూటర్లపై ఆసక్తి ఉన్నవారి కోసం ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్ వంటి మోడళ్లను 2 కిలోవాట్ల నుండి 4 కిలోవాట్ల వరకు బ్యాటరీ ఎంపికలతో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్ 1 ప్రో రూ .1,49,999. ఎస్ 1 ఎక్స్ (2 కిలోవాట్) రూ .84,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్వి, అలాగే ఫేమ్ ఇండియా ప్రోత్సాహకాల వర్తింపు తుది ధరలని ఓలా ఎలక్ట్రిక్ వివరణ ఇచ్చింది. -
48 గంటల్లో 20000 బుకింగ్స్
మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్బోర్డ్ నావిగేషన్తో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్క్యామ్లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్బార్ కోసం హాప్టిక్ ఫీడ్బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్లో (మార్చి 1, ఉదయం 7 గంటల నాటికి) అందుబాటులో ఉన్న సేల్స్ డేటా ప్రకారం.. 21,335 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, 'బజాజ్ చేతక్' 81 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది.ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 10,18,300 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు, మోపెడ్ల మొత్తం రిటైల్ అమ్మకాలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగం ఒక ఆర్ధిక సంవత్సరంలో మొదటిసారి.. 10 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ అమ్మకాలు అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ. ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో.. బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, మొదలైనవి ఉన్నాయి.ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీలు➤బజాజ్ ఆటో: 21,335 యూనిట్లు➤టీవీఎస్ మోటార్ : 18,746 యూనిట్లు➤ఏథర్ ఎనర్జీ: 11,788 యూనిట్లు➤ఓలా ఎలక్ట్రిక్: 8,647 యూనిట్లు➤గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ: 3,700 యూనిట్లు➤విడా (హీరో మోటోకార్ప్): 2,677 యూనిట్లుఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఎక్కువ స్టోరేజ్.. ఉత్తమ ఫీచర్స్: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..
ఇండియన్ మార్కెట్లో.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్లను మాత్రమే కాకుండా, అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.ఏథర్ రిజ్టా (Ather Rizta)ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ రిజ్టా ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్, ఇతర వస్తువులను ఉంచవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.రివర్ ఇండీ (River Indie)ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఏకంగా 43 లీటర్లు. కాబట్టి రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచవచ్చు. ఇది కాకుండా అదనపు బాక్సులను అటాచ్ చేయడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 1.43 లక్షలు.బజాజ్ చేతక్ (Bajaj Chetak)35 లీటర్ల అండర్ సీట్ కలిగిన ఈ బజాజ్ చేతక్ కూడా.. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఎక్కువ స్టోరేజ్ కోసం కంపెనీ బ్యాటరీని ఫ్లోర్బోర్డ్లో ఫిక్స్ చేసింది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 (Ola S1 Pro Plus Gen 3)ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్టోరేజ్ కెపాసిటీ ఇతర ఓలా స్కూటర్ల కంటే ఎక్కువ అందిస్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 32 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
ఈవీ వాహనాల్లో గేమ్ఛేంజర్.. నానో పీసీఎం
రవాణా రంగంలో విద్యుత్తు వాహనాలు ఒక సంచలనం...పర్యావరణ హితమైనవి. ఖర్చు తక్కువ. లాభమెక్కువ!ఈ కారణంగానే ఇటీవలి కాలంలో స్కూటర్లు మొదలుకొని..ఆటోలు, మోటార్బైకులు, కార్లు అనేకం విద్యుత్తుతోనే నడుస్తున్నాయి!అయితే... వీటిల్లో సమస్యలూ లేకపోలేదు.కొన్ని స్కూటర్లు రోడ్లపైనే కాలి బూడిదవుతూంటే..ఇంకొన్నింటి బ్యాటరీలు టపాసుల్లా పేలిపోతున్నాయి!ఈ సమస్యలకు కారణాలేమిటి? పరిష్కారం ఉందా?విద్యుత్తు వాహనాల్లో ఇప్పుడు వాడుతున్న...లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ‘సాక్షి.కాం’డాక్టర్ నిశాంత్ దొంగరి.. (Nishanth Dongari) విద్యుత్తు వాహన రంగంలో చిరపరిచితమైన పేరిది. హైదరాబాద్లోని ఐఐటీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూనే.. ఇక్కడ మొట్టమొదటి విద్యుత్తు వాహన స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఈయన. ప్యూర్ ఈవీ (Pure EV) పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్తు స్కూటర్లు డాక్టర్ నిశాంత్ సృష్టే. ఇటీవలి కాలంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అనేక సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి.కాం’ ఆయన్ను సంప్రదించింది. ఆ వివరాలు..బ్యాటరీలు ఎందుకు కాలిపోతున్నాయి?ఛార్జ్ చేసేటప్పుడు.. వినియోగించే సమయంలోనూ అన్ని బ్యాటరీలూ వేడెక్కుతూంటాయి. ఇది సహజం. అయితే సక్రమంగా నియంత్రించకపోతే ఈ వేడి కాస్తా ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు వాహనాల బ్యాటరీలు అన్నింటిలోనూ వేడిని పసికట్టేందుకు సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి.‘‘ప్యూర్ -ఈవీలో మేము ఇంకో అడుగు ముందుకేశాము. బ్యాటరీల్లో వేడిని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారి ఫేజ్ ఛేంజ్ మెటీరియల్ (PCM)ను ఉపయోగించాం. వేడి ఎక్కువైనప్పుడు ఈ పదార్థం ద్రవరూపంలోకి మారిపోతుంది. వేడిని బ్యాటరీల నుంచి దూరంగా తీసుకెళుతుంది. తరువాతి కాలంలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాము. నానోస్థాయి పదార్థాన్ని చేర్చడం ద్వారా బ్యాటరీల్లోని వేడి మరింత సమర్థంగా తగ్గించగలిగాం. ఈ నానోపీసీఎం కారణంగా ప్యూర్-ఈవీ బ్యాటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలిపోవు అని గ్యారెంటీగా చెప్పగలం.’’విద్యుత్తు వాహనాల్లో ఏఐ వాడకం ఎలా ఉండబోతోంది?వాహనాల్లో కృత్రిమ మేధ వాడకం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. విద్యుత్తు వాహనాల్లో కూడా. ప్రస్తుతం ప్యూర్-ఈవీలో బ్యాటరీ ప్యాక్లలోని ఒక్కో సెల్ను పరిశీలించేందుకు మేము కృత్రిమ మేధను వాడుతున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు పరిష్కార మార్గాలు సూచించేందుకూ జనరేటివ్ ఏఐను వాడే ఆలోచనలో ఉన్నాం. ఉదాహరణకు.. మీ వాహనం అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయిందనుకుందాం. స్మార్ట్ఫోన్లోని అప్లికేషన్లో మీ సమస్య వివరాలు ఎంటర్ చేస్తే జనరేటివ్ ఏఐ ‘‘స్విచ్ ఆన్/ఆఫ్ చేసి చూడండి’’ లేదా ఇంకో పరిష్కార మార్గం సూచిస్తుంది.లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకెంత కాలం?విద్యుత్తు వాహనాలతోపాటు అనేక ఇతర రంగాల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలే అధికం. రానున్న 30 - 50 ఏళ్ల వరకూ ఇదే పంథా కొనసాగనుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది 20 - 25 ఏళ్ల ముందు మాత్రమే. కాథోడ్, ఆనోడ్, ఎలక్ట్రొలైట్, సెపరేటర్ వంటి అనేక అంశాల్లో మెరుగుదలకు చాలా అవకాశాలున్నాయి. నిల్వ చేయగల విద్యుత్తు, భద్రత అంశాలు కూడా బాగా మెరుగు అవుతాయి. సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో 220 వాట్ల విద్యుత్తు నిల్వ చేయగలిగితే సాలిడ్ స్టేట్ బ్యాటరీల్లో ఇది 800 వాట్లకు చేరుకోగలదు. రానున్న ఐదేళ్లలో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు అవసరమైనంత వేగాన్ని ఇచ్చే టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత్ లాంటి దేశాలు లిథియంపై మౌలిక రంగ పరిశోధనలు మరిన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముడి ఖనిజం నుంచి లిథియం అయాన్ను మరింత సమర్థంగా వెలికితీయగలిగితే, వాడేసిన బ్యాటరీల నుంచి మెరుగ్గా రీసైకిల్ చేయగలిగితే బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ ఈ విషయాల్లో చొరవ చూపాలి. ముడి ఖనిజం ద్వారా వెలికితీసే లిథియంకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదు. లిథియం అయాన్ బ్యాటరీల్లో మరింత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసేందుకు కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం (మైలేజీ) మరింత పెరుగుతుంది. కాబట్టి.. సమీప భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదనే చెప్పాలి.హోండా లాంటి కంపెనీలు హైడ్రోజన్పై దృష్టి పెడుతున్నాయి కదా?నిజమే. కానీ హైడ్రోజన్తో వ్యక్తిగత వాహనాలు నడుస్తాయని నేను భావించడం లేదు. లారీలు, ట్రక్కులు, రైళ్లు, చిన్న నౌకల వంటి భారీ వాహనాలకు హైడ్రజన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ కూడా ఇటీవలి కాలంలో హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకునే విషయంలో చొరవ చూపుతోంది. పరిశోధనలపై దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో రవాణా రంగంలో హైడ్రోజన్ కీలకం కాగలదు. చిన్న వాహనాల విషయానికి వస్తే హైడ్రోజన్ను నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. -
ఓలాకు బజాజ్ గట్టి దెబ్బ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్గా అవతరించింది. వాహన్ పోర్టల్లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్లో కంపెనీ మార్కెట్ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్గా తన స్థానాన్ని నిలుపుకొంది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్లను అందించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్షిప్ ఐ-క్యూబ్ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్లెట్లతో సహా దాదాపు 4,000 స్టోర్లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్ బ్యాటరీ వెర్షన్ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్వర్క్ను 800 నుండి 4,000 స్టోర్లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. -
ఒకటే బ్రాండ్.. 4 లక్షల మంది కొనేశారు
2024 ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అనేక కొత్త వాహనాలను దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. ఇందులో టూ వీలర్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టినా.. ప్రజలు మాత్రం 'ఓలా ఎలక్ట్రిక్' స్కూటర్స్ కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ ఈ ఒక్క ఏడాది (2024) సుమారు నాలుగు లక్షల స్కూటర్లను విక్రయించింది. దీంతో దేశంలోనే అత్యధిక రిటైల్ విక్రయాలను సాధించిన స్కూటర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాహన్ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ 15 ఉదయం 7 గంటల సమయం నాటికి దేశంలో అమ్ముడైన మొత్తం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏకంగా 4,00,099 యూనిట్లు అని తెలిసింది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ ఈవీ దినోత్సవం (సెప్టెంబర్ 9) నాటికి 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తరువాత మంచి ఎక్కువ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్వర్క్ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
రూ. 39999కే ఎలక్ట్రిక్ స్కూటర్: ఓలా సరికొత్త వెహికల్స్ చూశారా..
భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.ఓలా గిగ్: రూ. 39,999ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999ఓలా గిగ్రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.ఓలా గిగ్ ప్లస్కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.ఓలా ఎస్1 జెడ్ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 జెడ్ ప్లస్ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా పవర్పాడ్ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్గా ఉపయోగపడుతుంది. 500W అవుట్పుట్ను కలిగిన ఓలా పవర్పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPodReservations open, deliveries Apr’25!🛵⚡🔋Ola S1 Z: https://t.co/jRj8k4oKvQOla Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024 -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ప్రముఖ కంపెనీ
'హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా' ఆల్ ఎలక్ట్రిక్ యాక్టివాను నవంబర్ 27న ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత కంపెనీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది.ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రేంజ్, డిజైన్, ఫీచర్స్ వంటి చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి నవంబర్ 27న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో 100 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందవచ్చని భావిస్తున్నారు. -
ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
భారతదేశం ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్లో.. ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. తక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.బ్రిస్క్ ఈవీ ఆరిజన్ ప్రో: హైదరాబాద్కు చెందిన బ్రిస్క్ ఈవీ కంపెనీ మార్చి 2023లో ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసింది. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 333 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల ధర మధ్య లభించే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ.రివోట్ ఎన్ఎక్స్100: భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మరొకటి రివోట్ ఎన్ఎక్స్100. ఈ స్కూటర్ టాప్ వేరియంట్.. ఒక సింగిల్ చార్జితో 300 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 110 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1,59,000 (ఎక్స్ షోరూమ్).సింపుల్ వన్: బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. రూ. 1.54 లక్షల ధర వద్ద లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీ. ఇది కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 ప్రో జెన్ 2: దేశీయ టూ వీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎస్1 ప్రో జెన్ కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.1,47,499 ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ.ఇదీ చదవండి: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్లో అత్యుత్తమ కార్లు ఇవే..హీరో విడా వీ1 ప్రో: సింగిల్ చార్జితో 165 కిమీ రేంజ్ అందించే హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 80 కిమీ. ఇందులో 3.94 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. -
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
ఓలా ఎలక్ట్రిక్కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ రూ.5 వేలేనా?
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.‘ఫేమ్’లో భారీగా సబ్సిడీఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్ను 2019 ఏప్రిల్లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది. -
కైనెటిక్ ఫ్యామిలీ ఈ-స్కూటర్.. త్వరలో లాంచ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్ను మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చిలోగా ఎల్5 విభాగంలో ప్యాసింజర్ త్రీ–వీలర్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.మోటార్సైకిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్ గ్రీన్ గత నెలలో గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ) నుంచి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్ కార్ట్ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్ కోసం అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్ను కంపెనీ అభివృద్ధి చేసింది. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్స్టర్, రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్తో వేరియంట్నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్ను ప్రవేశపెట్టనుంది. -
బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్.. అమెజాన్లో కోనేయండి
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారైంది. ఆగష్టు 5నుంచి అమెజాన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. అయితే డిజైన్ మాత్రం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్.. ప్రీమియమ్ వేరియంట్ మాదిరిగానే అదే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 136 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ కావడం గమనించదగ్గ విషయం. మార్కెట్లో ఈ స్కూటర్.. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొని.. తంటాలు పడి
హైదరాబాద్: ఎలక్ట్రిక్ స్కూటర్కి నాసిరకం బ్యాటరీ అమర్చినందుకు పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్–1 ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా కంపెనీ, షోరూం సిబ్బంది అలసత్వమే అని స్పష్టం చేసింది. కంపెనీ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి తప్పులకు తావు లేకుండా ఉండేదని సూచించింది. వినియోగదారుడి ఇబ్బందుల దృష్ట్యా రూ.20 వేల నష్ట పరిహారంతో పాటు రూ.5 వేలు కోర్టు ఖర్చులు ఇవ్వాలని కంపెనీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్–1 కమిషన్ అధ్యక్షురాలు ఉమా వెంకట సుబ్బలక్ష్మి , సభ్యులు లక్ష్మీప్రసన్న, మాధవిలతతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. 22 నెలల్లో 8 సార్లు బ్యాటరీ సమస్య.. హైదరాబాద్ (మారుతీనగర్ ఓల్డ్ బోయిన్పల్లి)కి చెందిన శ్రీనివాస్ రెడ్డి 2021లో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించి ఈ డ్రైవ్ మున్నంగి మోటర్స్ షోరూంలో ఎలక్రి్టకల్ స్కూటర్ (పీయూఆర్ – ఈ – ప్లూటో – 7జీ) ను రూ. 90 వేలతో కొనుగోలు చేశాడు. ఒకసారి చార్జింగ్ పెడితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ రాకపోవడం, ఎక్కడపడితే అక్కడ అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి పలు రకాల సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దాదాపు 22 నెలల కాలంలో 8 సార్లు బ్యాటరీ సమస్యతో సరీ్వస్ సెంటర్కి వెళ్లాల్సి వచ్చింది. చాలాసార్లు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. కొంత కాలానికి పరిశీలించిన సర్వీస్ సెంటర్ సిబ్బంది సాఫ్ట్వేర్ సమస్య ఉందని చెప్పినా దానికి సరైన పరిష్కారం మాత్రం చూపలేదు. అనంతరం షోరూం సిబ్బంది ఆగస్టు, 2022లో మరో బ్యాటరీని అమర్చారు. దీంతో ఆనందంతో స్కూటర్ తీసుకొని వెళ్లిన శ్రీనివాస్ రెడ్డికి తిరిగి 9 నెలల కాలంలో మళ్లీ అదే సమస్య ఎదుర్కొన్నాడు. దీంతో తిరిగి మళ్లీ షోరూం సిబ్బంది సంప్రదించాడు. అయితే వారు బ్యాటరీని కంపెనీకి టెస్టింగ్ కోసం పంపాలని, తిరిగి బ్యాటరీ అమర్చాలంటే దాదాపు 3 నుంచి 4 నెలల కాలం పడుతుందని, అంతవరకు ఆగాలని జులై, 2023లో చెప్పారు. అయితే ఇప్పటికీ ఏడాది కాలం దాటినా బ్యాటరీ మాత్రం అమర్చలేదు. ఆ స్కూటర్ బ్యాటరీ లేకుండా నిరూపయోగంగానే ఉన్నది. దీంతో బాధితుడి సంబంధిత షోరూంకి వెళ్లి స్కూటర్ని తీసుకెళ్లి డబ్బును ఇవ్వండి, లేదా బ్యాటరీ అయినా మార్చి ఇవ్వండి అని అడిగారు. కంపెనీ యాజమాన్యం, షోరూం సిబ్బంది çపట్టించుకోకపోవడంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్–1ను ఆశ్రయించి తన గోడును విన్నవించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులకు సరైన సౌకర్యం ఇవ్వకుండా కాలయాపన చేయడమేంటని మండిపడింది. బాధితుడి ఎలక్ట్రిక్ స్కూటర్కు వెంటనే కొత్త బ్యాటరీ అమర్చాలని సూచించింది. అంతేకాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది. దీంతో పాటు అతనికి చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
భారత్లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్లను కలిగి ఉంది. ఈ షోరూమ్లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ రివర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. బుధవారం హైదరాబాద్లో తొలి స్టోర్ను ప్రారంభించగా మార్చి నాటికి వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి స్టోర్స్ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో అరవింద్ మణి తెలిపారు. ప్రస్తుతం ఇండీ పేరిట స్కూటర్లు విక్రయిస్తున్నామని, 2026 నాటికి ఏటా 1,00,000 వాహన విక్రయాల లక్ష్యం సాధించాక రెండో మోడల్ను కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. యమహా మోటర్ కార్పొరేషన్, టయోటా వెంచర్స్ తదితర దిగ్గజాల నుంచి ఇప్పటివరకు రూ. 550 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 500 యూనిట్లుగా ఉన్న అమ్మకాలను వచ్చే మార్చి నాటికి 3,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. హైదరాబాద్లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,45,000గా ఉంటుందని, ఒకసారి చార్జింగ్తో 120 కి.మీ. వరకు రేంజి ఉంటుందని మణి చెప్పారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
చార్జింగ్ టెన్షన్ లేదిక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఒప్పందం
హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి (స్వాపింగ్) కోసం 25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్ స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్ ఈ–స్కూటర్స్ డైరెక్టర్ సి. చేతన తెలిపారు. చార్జింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా యూజర్లు రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చార్జ్ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు. ఈ తరహా బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ విధానం వల్ల జీవితకాలం పూర్తయిన బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే వ్యయాలు తగ్గుతాయని తెలిపారు. బ్యాటరీ స్మార్ట్ స్వాపింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా అధిక జన సాంద్రత, ట్రాఫిక్ ప్రాంతాలకు సమీపంలో ఉంటాయి. దీంతో క్వాంటం ఎనర్జీ స్కూటర్లకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వాహనదారులకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. -
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
OLA ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
-
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్కు చెల్లించాలని లేదా స్కూటర్ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే..
దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. 2022లో 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా.. 2023లో అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు(3 కోట్లు) చేరుకుంటుందని అంచనా. 2023లో అమ్ముడైన మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. అందులో ఓలా కంపెనీ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2022లో 1.1 లక్షల మేరకు అమ్ముడైన ఓలా వాహనాలు 2023లో మాత్రం 140శాతం పెరిగి ఏకంగా 2.62 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. తర్వాతి స్థానంలో టీవీఎస్, ఏథర్, బజాజ్ కంపెనీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగనున్న నేపథ్యంలో ఈ సంస్థలకు భారీగా లాభాలు రాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలో వారీగా 2023లో రిజిస్టర్ అయిన విద్యుత్ వాహనాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇదీ చదవండి: రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా? ఓలా ఎలక్ట్రిక్: 2,62,020 టీవీఎస్: 1,65,190 ఏథర్: 1,03,804 బజాజ్: 70,274 యాంపెర్: 42,909 ఒవినావా: 31,519 హిరో ఎలక్ట్రిక్: 29,925 హిరో: 10,967 ప్యూర్: 7,141 రెవోల్ట్: 6,922 లెక్ట్రిక్స్: 6,185 జితేంద్ర ఎలక్ట్రిక్: 2,597 -
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. -
భారత్లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
TS: విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులుబాటు కల్పించింది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థునులకు సైతం బస్సు చార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది. మరోవైపు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ పథకం వర్తించనుండటంతో వారికి మరింత పెద్దపీట వేస్తునట్లవుతుంది. దీంతో కాలేజీ విద్యార్థినులకు ‘ఎలక్ట్రిక్ స్కూటీ’లపై ఆశలు రేకెతిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఇచ్చిన హామీల అమలుకు ఒక్కో అడుగు పడుతుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీల పథకానికి కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పథకం కోసం మార్గదర్శకాలు రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. రెగ్యులర్ విద్యార్థునులకే.. పేద కుటుంబాలకు చెందిన 18 ఏళ్లు నిండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది. విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లక్షల మందికిపైనే... 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గణాంకాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5,279 డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, వృత్తి, వివిధ మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉన్నాయి. మొత్తమ్మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ, ఇతరత్రా కోర్సులు చదువుతున్న పేదల విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉండగా.. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సైతం ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. ˘ పెద్ద మొత్తంలోనే ఖర్చు.. ఎలక్ట్రిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. బహిరంగ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం బట్టి రూ.40 వేల నుంచి రూ. 1.5 లక్షకు పైగా పలుకుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ టు వీలర్లపై ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ టు వీలర్కు దాని ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలకు అనుగుణంగా ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే సుమారు 70 వేల మంది వరకు లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక్క స్కూటీకి సగటున రూ. 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీ లేకుండా మాత్రం లెక్కిస్తే «ఖర్చు రెట్టింపు కావచ్చని అధికారులు అంచనా వెస్తున్నారు. లైసెన్సులు కత్తిమీద సామే.. ఎలక్ట్రిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్లు తప్పనిసరి కానుంది. లైసెన్స్ తీయడం విద్యార్థునులకు కత్తిమీద సామే. చాలా మందికి వాహనం నడపడం వచ్చినప్పటికీ.. డ్రైవింగ్ లైసె¯న్సులు లేవు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లు ఎక్కుతున్నారు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో.. రోడ్డు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ సిగ్నళ్లు, డ్రైవింగ్ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యల గురించి అవగాహన అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ లేదా పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, టెన్త్ మెమో, పాన్ కార్డు అవసరం ఉంటుంది. డ్రైవింగ్ పరీక్షలో నెగ్గితే ముందుగా లెర్నింగ్ లైసెన్స్..ఆ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. ట్రాఫిక్జాం సమస్య మరింత.. మహా నగరంలో కోటిన్నర జనాభా ఉండగా.. నిత్యం 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. అందులో ద్విచక్ర వాహనాలు 40 లక్షల వరకు ఉన్నాయి. ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్తో కిటకిటలాడుతున్నాయి. ఇక స్కూల్స్, కాలేజీ సమయంలో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. ఇక విద్యార్థినులకు ఎల్రక్టానిక్ స్కూటర్లు అందుబాటులో వస్తే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశముంది. ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం.. 18 సంవత్సరాలకు పైబడిన వారు అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటారు. మహానగర పరిధిలో డిగ్రీ, పీజీ, వివిధ మేనేజ్మెంట్, వృత్తి కోర్సులు అభ్యసిస్తున్న వారికంటే ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యారి్థనులే అధికం. అందులో సైతం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కారు కాలేజీ విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యారి్థనులు అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఓటర్లు 4.5 లక్షలపైనే.. గ్రేటర్ పరిధిలో సుమారు 1.08 కోట్ల వరకు ఓటర్లు ఉండగా అందులో 18 సంవత్సరాలు నిండిన నమోదైన కొత్త ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 3 లక్షల మంది వరకు ఉండగా.. అందులో కాలేజీ చదువుతున్న విద్యార్థినులు 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులనుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. విద్యార్థునులకు ఎంతో ఉపయోగం ఉచిత ఎలక్ట్రికల్ వెహికల్ విద్యారి్థనులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారీ రవాణా ఖర్చు ఇబ్బందులు తప్పుతాయి. పెట్రోల్ ఖర్చు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్ను వాడుకోవచ్చు. – టి.శ్వేత–హబ్సిగూడ సంక్రాంతి వరకు అందజేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఎలక్ట్రికల్ స్కూటీలు అందించాలి. విద్యార్థినుల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకోవచ్చు. సంక్రాంతి వరకు బైకులను పంపిణీ చేయాలి – పుష్ప–ఓయూ పీజీ విద్యార్థాని కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి.. అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రికల్ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్ మాట దనిలబెట్టుకోవాలి. – షేక్ తబ్సుమ్ -
FAME-3: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్లోకి ఎప్పటికీ రావు.. రానీయను’ ఆర్థిక శాఖ వ్యతిరేకత దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సబ్సిడీలో కోత ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 104 కిమీ రేంజ్ - ధర ఎంతంటే?
దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్కు తెలియజేస్తుంది. ఆన్బోర్డ్లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
మంటల్లో చిక్కుకున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో వైరల్!
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే సంఘటనలు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అనుకోకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై కాలిపోయిన సంఘటన మరిచిపోక ముందే.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగిన నేషనల్ గ్రీన్ ఆటోమొబైల్ వినియోగదారు తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పెద్దగా మంటలు రావడం చూడవచ్చు. నడిరోడ్డులో కాలుతున్న స్కూటర్లో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగటానికి సంబంధించిన వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు, గత రెండు సంవత్సరాల్లో, ఓలా ఎలక్ట్రిక్, ఆంపియర్ ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ వంటి అనేక బ్రాండ్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: గేర్బాక్స్ రిపేర్కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్.. ఈ సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కంపెనీ అధికారులతో చర్చలు జరిగి.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మీద కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. స్కూటర్ కాలిపోవడానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది. @futureiselectr2 @GreavesCottonIN @airnewsalerts @ABPNews @aajtak @ampere_ev @EVehiclesindia @NITIAayog @rushlane @NetflixIndia @OlaElectric Ampere Battery Blast in Ampere magnus ex, Why companies playing with the life of innocent customers, GOI must take strict action against . pic.twitter.com/FsVMTlGYET — Nagina National Green Automobile (@SanjayChou89866) November 20, 2023 -
ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - క్లారిటీ ఇచ్చిన సంస్థ!
Ola Electric: రెండు రోజులకు ముందు (అక్టోబర్ 28) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన సంఘటన మీద కంపెనీ (ఓలా ఎలక్ట్రిక్) స్పందిస్తూ, ప్రమాదానికి కారణాలను వెల్లడించింది. దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణేలోని పింప్రి - చించ్వాడ్ ప్రాంతంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇందులో స్కూటర్ నుంచి పొగలు రావడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు వంటి దృశ్యాలను చూడవచ్చు. ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా? ఈ విషయంపై ఓలా కంపెనీ స్పందిస్తూ.. కంపెనీకి చెందినవి కాకుండా ఇతర పరికరాలను స్కూటర్లో ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి, ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు, బ్యాటరీ కూడా చెక్కుచెదరకుండా ఉపయోగించడానికి అనువుగానే ఉందని స్పష్టం చేసింది. Important update pic.twitter.com/K7pw71Xoxo — Ola Electric (@OlaElectric) October 29, 2023 -
నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో
ఎలక్ట్రిక్ వెహికల్స్లో అకారణంగా మంటలు చెలరేగడం, తద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించడం గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో పూణే మిర్రర్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. పూణే మిర్రర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్కూటర్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ విచారణ చేపట్టనుంది. బాధితునికి కొత్త స్కూటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలపై సంబంధిత కంపెనీలు సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఈ పరిశోధన చేపట్టి కొన్ని బ్యాటరీ ప్యాక్లు, మాడ్యూల్స్ డిజైన్లతో సహా బ్యాటరీలలో కొన్ని లోపాలను నివేదించింది. One more incident of an Ola electric scooter catching fire has been reported near the parking lot of D.Y Patil College in Pimpri Chinchwad. This alarming event occurred near the Institute's parking area, igniting at approximately 8:30 in the morning. Upon receiving the report,… pic.twitter.com/tr0K3yn9pp — Pune Mirror (@ThePuneMirror) October 28, 2023 -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఎథేర్ స్కూటర్ కొనుగోలు దారులకు ఎక్స్చేంజ్, కార్పొరేట్, ఫెస్టివల్ ఆఫర్లతో పాటు పలు స్కీమ్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎక్ఛేంజ్ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథేర్ ప్రో వెర్షన్ మోడల్ 450 ఎక్స్ (2.9 కిలోవాట్ అండ్ 3.7 కిలోవాట్), 450ఎస్ (2.9 కిలోవాట్). మోడళ్లపై రూ .40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో వాహనదారుల పాత పెట్రోల్ వేరియంట్ టూ వీలర్, కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలైంది. బండి కండీషన్, కొనుగోలు చేసే సమయంలో దాని ఒరిజనల్ ప్రైస్ ఎంత ఉందనే దానిని పరిగణలోకి తీసుకుని ఈ భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎథేర్ ప్రతినిధులు తెలిపారు. ఏథర్ 450 ఎస్ ప్రో వెర్షన్పై రూ .5,000 ఫెస్టివల్ బెన్ఫిట్స్, రూ .1,500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. మరోవైపు, 450 ఎక్స్ వేరియంట్లు కూడా అదే కార్పొరేట్ స్కీమ్ను అందిస్తుంది. చివరగా, ఏథర్ 5.99శాతం వడ్డీ 24 నెలల ఈఎంఐని అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లన్నీ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లో గరిష్టంగా రూ.40,000 డిస్కౌంట్, ఇతర స్కీమ్స్ కలిపి ఏథర్ 450 ధరలు గణనీయంగా తగ్గాయి. ఏథర్ 450ఎస్ అసలు ధర రూ.1,32,550 నుంచి రూ.86,050కు తగ్గింది. ఏథర్ 450 ఎక్స్ 2.9 కిలోవాట్ అండ్ 450 ఎక్స్ 3.7 కిలోవాట్ల ధరలు వరుసగా రూ.1,01,050, రూ.1,10,249 (ఢిల్లీలో అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) గా ఉన్నాయి. -
ఈవీ రంగంలోకి ప్రముఖ ల్యాప్టాప్ కంపెనీ.. తొలి ఈ-స్కూటర్ విడుదల
తైవాన్కు చెందిన ప్రముఖ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్ను విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించింది, తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్గో. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఏసర్ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది. MUVI 125 4G ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లు గరిష్ట వేగం 75 kmph. ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ తేలికపాటి ఛాసిస్ 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్ డిజైన్ డబుల్ డిస్క్ బ్రేక్స్ MUVI 125 4G సాంకేతిక వివరాలను మాత్రం ఏసర్ వెల్లడించలేదు. అయితే, ఇది మార్చుకోదగిన (స్వాపింగ్) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రీ-బుకింగ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్లు, డీలర్షిప్పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. 🚨 Taiwanese laptop maker 'Acer' has entered into the electric scooter market in India by launching its e scooter at ₹99,999/- pic.twitter.com/Fa3sqEjOVr — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్తో వస్తుంది కాబట్టి ఆఫర్లో ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్వర్క్ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
ఈ స్కూటర్ కొనే డబ్బుతో 'హిమాలయన్' బైక్ కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?
TVS X Electric Scooter: చాలా రోజుల తరువాత టీవీఎస్ కంపెనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.50 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్తో 140 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం (హోమ్ ర్యాపిడ్ ఛార్జర్), 4 గంటల 30 నిమిషాల్లో 950 వాల్స్ పోరాటబుల్ ఛార్జర్ సాయంతో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. పోర్టబుల్ ఛార్జర్ ధర రూ. 16,275. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) 11 kW పీక్ పవర్, 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ముందువైపు 220 మిమీ డిస్క్, వెనుకవైపు 195 మిమీ డిస్క్ ఉంటుంది. 12 ఇంచెస్ చక్రాలమీద 100 సెక్షన్ టైర్స్ ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫీచర్స్.. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ XLETON ప్లాట్ఫారమ్పై తయారై 770 మిమీ ఎత్తుగల సీట్ పొందుతుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో 40 కిమీ/గంట వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటాకు 105 కిమీ కావడం గమనార్హం. ఇందులో Xtealth, Xtride, Xonic అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతే కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు.. ఈ లేటెస్ట్ బైక్ 10.25 ఇంచెస్ TFT డ్యాష్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ నావిగేషన్ అలర్ట్లను ఎనేబుల్ చేసే ఫీచర్లను పొందుతుంది. వీటితో పాటు రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటివి ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్19 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు రాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపైన ఎలాంటి ఫేమ్ 2 సబ్సిడీ లభించదు.డెలివరీలు నవంబర్ నెలలో (బెంగళూరులో) ప్రారంభమవుతాయి. 2024 మార్చి తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుటాయి. కాగా మొదటి 2000 మంది కస్టమర్లకు స్మార్ట్వాచ్ అండ్ రూ. 18,000 విలువైన 'క్యూరేటెడ్ కన్సైర్జ్' ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. -
Electric Scooter: బైక్ లాంటి స్కూటర్ భలే ఉందే.. లాంచ్ చేస్తున్న టీవీఎస్
భారత్కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది. తాజా టీజర్లో స్కూటర్పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్లో స్పీడోమీటర్ క్లైంబింగ్ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా) కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్లైట్ కన్సోల్గా పనిచేసే నాలుగు ఎల్ఈడీ ల్యాంప్లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్టీ స్క్రీన్తో వస్తుంది. ఈ-స్కూటర్లో బ్లూటూత్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్వాచ్-కనెక్ట్ కంట్రోల్లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది. -
ఒడిస్సీకి భారీ ఆర్డర్.. 10వేల ఎలక్ట్రిక్ కొనుగోలు చేయనున్న బడ్–ఈ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ నుంచి విద్యుత్ వాహనాల రెంటల్ సంస్థ బడ్–ఈ 10,000 వాహనాలను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్డరు విలువ రూ. 100 కోట్లుగా ఉండనుంది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఒడిస్సీ సీఈవో నెమిన్ వోరా, బడ్–ఈ సహ వ్యవస్థాపకులు ఆదిత్య టేకుమళ్ల, విజయ్ మద్దూరి ఈ విషయాలు తెలిపారు. 18–24 నెలల వ్యవధిలో ఈ వాహనాలను అందుకోనున్నట్లు ఆదిత్య తెలిపారు. వ్యాపార సంస్థలతో పాటు వినియోగదారులకు లీజింగ్, రెంటల్ ప్రాతిపదికన వాహనాలను అందిస్తున్నట్లు, త్వరలో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం నెలకు గరిష్టంగా 5,000 వాహనాలుగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే 10,000కు పెరగనున్నట్లు నెమిన్ వోరా తెలిపారు. 68పైగా ఉన్న డీలర్ షిప్లను వచ్చే ఏడాది ఆఖరు నాటికి 150కి పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
షాకింగ్: ఓలా ఎస్1 స్కూటర్కు గుడ్ బై, కస్టమర్లు ఏం చేయాలి?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. 2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుండి ఎస్1 వేరియంట్ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్ 1 ఎయిర్ మోడల్స్ ఫోకస్ పెట్టనుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ లాంచింగ్ సందర్బంగా ఎస్1 స్కూటర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్ఫోలియోలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్ 1 వేరియంట్ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఎస్1 బుక్ చేసుకున్న వారు ఏంచేయాలి? ఎస్1 వేరియంట్ను బుక్ చేసిన కస్టమర్లు ప్లాన్లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్కి అప్గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్ను రద్దు చేసి మనీ రీఫండ్ పొందడం. ఎస్ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్గ్రేడ్ని ఎంచుకున్న కస్టమర్లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఓల్ ఎస్1 ఎయిర్ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్ షురూ అవుతుంది. ఎస్1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. After S1 Air, buying an ICE scooter means losing money every month. BUY EV and save money!! pic.twitter.com/GkBVThEyN1 — Bhavish Aggarwal (@bhash) July 28, 2023 ఫ్యూచర్ ప్లాన్స్ అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్వేర్ను ప్రారంభించనుందని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 3000! I’m also heading to the factory now 😳 https://t.co/q89piwCOfA — Bhavish Aggarwal (@bhash) July 27, 2023 -
మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!
Electric Scooter Fire: దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ మధ్యలో కొన్ని అవాంతరాలను కూడా ఎదుర్కొంది. ఇందులో బ్యాటరీ ఫైర్ అవ్వడం, ముందు భాగంలో ఉండే పోర్క్ ఇస్స్యూ వంటివి ఉన్నాయి. కాగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూసుకుంటామని కంపెనీ సీఈఓ భవిష్ అగార్వల్ తెలిపారు. అయితే మళ్ళీ కేరళలో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైన జులై 19న నెడుమంగడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దిశలో విచారణ జరుగుతోంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రూ. 1.49 లక్షల ఖరీదైన స్కూటర్ దాదాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో టీవీ వంటివి కాలిపోయి మొత్తం మీద సుమారు రూ. 4.49 లక్షలు నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయం మీద కంపెనీలు మెయిల్ పంపినట్లు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలో చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సంబంధిత కంపెనీలు దీనిమీద స్పష్టమైన రిపోర్ట్ అందించాలని అప్పట్లోనే ఆదేశించింది. కానీ చాలా రోజుల తరువాత మళ్ళీ స్కూటర్ కాలిపోయిన సంఘట వెలుగులోకి రావడం మళ్ళీ ప్రశార్థకంగా మారింది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. Ola S1 pro burnt in Thiruvananthapuram Kerala, details awaited @OlaElectric pic.twitter.com/z6JC1IUuZC — fasil (@fasilfaaaz) July 22, 2023 -
లాంగ్రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క చార్జ్తో 200 కిలోమీటర్లు!
నోయిడా: ఎనిగ్మా ఆటోమొబైల్స్ కంపెనీ యాంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్ను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక్క చార్జ్తో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాటరీని వేగంగా 2–4 గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొంది. మార్కెటింగ్లో పనిచేసే వారు, రెండు పట్టణాల మధ్య ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాంబియర్ ఎన్8ను తీసుకొచ్చినట్టు తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనా న్ని ఆకర్షణయమైన ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ.1,05, 000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంది. 100 వాట్ మోటార్తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీటు కింద 26లీటర్ల స్టోరేజీ స్పేస్ కూడా ఉంది. -
స్కూఈవీతో జత కట్టిన క్వాంటమ్ ఎనర్జీ - కారణం ఇదేనా!
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన క్వాంటమ్ ఎనర్జీ.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రెంటల్ కంపెనీ (అద్దెకు ఇచ్చే) అయిన స్కూఈవీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్వాంటమ్ ఎనర్జీ 1,000 యూనిట్ల ‘బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను సమకూర్చనుంది. ఈ భాగస్వామ్యంపై క్వాంటమ్ ఎనర్జీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ.. ఈ కామర్స్ విభాగంలో పెరుగుతున్న డెలివరీ అవసరాలకు మెరుగైన పరిష్కారాలను అందించాలన్న ప్రయత్నమే స్కూఈవీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో ఉద్దేశ్యమని చెప్పారు. లాస్ట్మైల్ డెలివరీని ఎలక్ట్రిక్గా మార్చడమే తమ సంయుక్త కృషి అని, ఇది బీటూబీ విభాగం మరింత బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. బీటూబీ అవసరాలకు వీలుగా అత్యంత సమర్థతతో కూడిన, మన్నికైన ఈ–బైక్లను అందించడంలో క్వాంటమ్ ఎనర్జీ తమకు కీలక భాగస్వామి అని స్కూఈవీ రెంటల్స్ సీఈవో అమిత్ పేర్కొన్నారు. -
ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!
Ola S1 Air introductory price: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా లేటెస్ట్ ఓలా S1 ఎయిర్. దీనికి సంబంధించి ఒక కీలకవిషయాన్ని ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. పరిచయ ఆఫర్గా 10వేల తగ్గింపును ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.ఎస్1 ఎయిర్ జూలై 28- 30 తేదీల మధ్య కొనుగోలు చేసిన వారికి ప్రారంభ ధర రూ. 1,09,999కే లభిస్తుందని పేర్కొన్నారు. జూలై 31 తరువాత దీని ధర రూ. 1,19,999గా ఉంటుదని, అందుకే ఇపుడే మీ ఎలాఎస్1 ఎయిర్ను తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోమ్మని సూచించారు. అలాగే S1ఎయిర్ డెలివరీ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవు తుందని చెప్పారు. 500,000 కి.మీ వరకు పరీక్షించామని కూడా ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా వ్యక్తిగతంగా ఎస్1 ఎయిర్ని చాలా ఎక్కువగా నడిపాను.. ఇది నిజంగా అద్భుతమైన స్కూటర్ అతి త్వరలో వస్తుందిన ట్వీట్ చేశారు. ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించారు. 999 రూపాయల వద్ద ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా FAME సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 3 kWh బ్యాటరీతో లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ పూర్తి ఛార్జ్పై 125 కిమీ రేంజ్ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. Purchase for S1 Air will open from 28th July-30th July for reservers and all our existing community, at an introductory price of ₹1,09,999. Everyone else can purchase from 31st July at ₹1,19,999. Reserve now to get the introductory price! Deliveries start early August! pic.twitter.com/EBM35oSh0B — Bhavish Aggarwal (@bhash) July 21, 2023 -
మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించి ఒక వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి, ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్పై తాజాగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ చార్జింగ్, క్వాలిటీ దుమారం మరోసారి వెలుగులోకి వచ్చింది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) 20 శాతం చార్జ్కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ సమస్యలను పరిష్కరించడంలో ఓలా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు ఒక బ్యానర్తో సహా స్కూటర్ను నిలిపాడు. ఏడాది కాలంగా స్కూటర్ను ఉపయోగిస్తున్నాను..ఈ స్కూటర్ను వదిలి వెళ్లినప్పటి నుంచి తనకు సర్వీస్ సెంటర్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని పేర్కొన్నాడు. అలాగే స్కూటర్లోని అలైన్మెంట్ బుష్ ఐదుసార్లు మార్చానని కూడా పేర్కొన్నాడు. (సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు.. తగ్గేదేలే!) దీనికి సంబంధించి ఫొటోను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ అనే ట్విటర్ ఖాతాలో ఇది పోస్టు అయింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకాదు.. ఇదో అధ్వాన్నమైన సర్వీస్ సెంటర్ అని కమెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పోస్ట్ క్రింద, తమ కెదురైన అనుభవాలను ఓలా స్కూటర్ కస్టమర్లు ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. ఓలాను స్కామ్ కంపెనీ అని మరొకరు పేర్కొన్నారు. అయితే దీనిపై ఓలా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం వివరాలను కోరినట్టు తెలుస్తోంది. #News #OLAElectricComplaints #OLAElectric #CustomersProtesthttps://t.co/PhFDv1dulT — Ola Electric #Parody (@OlaEV_parody) July 19, 2023 అయితే ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. గతంలో ఓలా S1 స్కూటర్లపై కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ స్కూటర్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. Calicut ola service center work overload approx 200 scooters work pending Service slot not available now We also need two service centers Please resolve this as soon as possible@bhash @OlaElectric pic.twitter.com/mhT7vD3ltJ — fasil (@fasilfaaaz) July 19, 2023 -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా?
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కొనసాగించడం లేదా దాన్ని ప్రయోజనాలను అలాగే అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ హనిఫ్ ఖురేషి తాజాగా తెలిపారు. సుస్థిర పారిశ్రామిక వృద్ధికి సమర్థ నిర్వహణ వ్యవస్థలపై నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఖురేషీ మాట్లాడుతూ.. వినియోగదారుల సంతృప్తి, స్థిరమైన పారిశ్రామిక వృద్ధిని నడపడంలో నిర్వహణ వ్యవస్థల ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. 150 బిలియన్ డాలర్ల మేర ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చింది. మూడేళ్ల కాల పరిమితి ముగిశాక మళ్లీ రెండేళ్లు పొడిగించింది. అయితే ఇటీవల ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. దీంతో జూన్ నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచేశాయి. కాగా మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై పునరాలోచించడం కొనుగోలుదారులు సంతోషాన్నిచ్చే విషయం. ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
టీవీఎస్, జొమాటో జోడీ.. డెలివరీల కోసం 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో ప్లాట్ఫామ్పై డెలివరీల కోసం వచ్చే రెండేళ్లలో టీవీఎస్ తయారీ 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడతారు. 2030 నాటికి డెలివరీల కోసం పూర్తిగా ఈవీలను ఉపయోగించాలని జొమాటో లక్ష్యంగా చేసుకుంది. అలాగే వచ్చే రెండేళ్లలో ఒక లక్ష ఈవీలతో కార్యకలాపాలను సాగించేందుకు 50కిపైగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. 2020లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన టీవీఎస్ మోటార్ ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా యూనిట్లను విక్రయించింది. -
క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్లో మూడో షోరూం
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న క్వాంటమ్ ఎనర్జీ హైదరాబాద్లో మూడవ షోరూంను ప్రారంభించింది. ఇంపాక్ట్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 1000 చదరపు అడుగుల విశాలమైన షోరూమ్ హైదరాబాద్లోని కూకట్పల్లి అందుబాటులో ఉందని, దీంతో సంస్థ మొత్తం ఔట్లెట్ల సంఖ్య 23కు చేరుకుందని కంపెనీ డైరెక్టర్ సి.కుశాల్ తెలిపారు. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా క్వాంటమ్ ఎనర్జీ ఎనమిది రాష్ట్రాల్లో విక్రయాలు సాగిస్తోంది. ప్లాస్మా, ఎలెక్ట్రాన్, మిలన్, బిజినెస్ పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ, విక్రయం చేపడుతోంది. ప్లాస్మా స్కూటర్ ఒకసారి చార్జింగ్తో 135 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. -
మరో ఓలా స్కూటర్ రానుందా? భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?
Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. Announcing our next product event in July. Calling it the #endICEAge show, Part 1! Part 1 of the show would end ICE age in scooters! With S1 Pro, S1 Air and … XXXX 😉😎 And maybe one more thing!😀 pic.twitter.com/7Qz5JRg9I7 — Bhavish Aggarwal (@bhash) June 19, 2023 -
తక్కువ ధరలో విడుదలకానున్న సింపుల్ ఎనర్జీ స్కూటర్లు - వివరాలు
Simple Energy Electric Scooters: సుదీర్ఘ విరామం తరువాత 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) కంపెనీ దేశీయ మార్కెట్లో 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' లాంచ్ చేసింది. కాగా సంస్థ ఇప్పుడు వచ్చే త్రైమాసికంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో సింపుల్ ఎనర్జీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న సింపుల్ వన్ స్కూటర్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన సింపుల్ వన్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్య ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ డెలివరీలు కూడా మొదలయ్యాయి. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) కంపెనీ విడుదలచేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు బహుశా రూ. 1 లక్ష నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ధర తక్కువగా ఉంటుంది కావున బ్యాటరీ చిన్నగా ఉంటుంది, తద్వారా రేంజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలైన తరువాత టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ!) సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. -
కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!
ఆటోమొబైల్ దిగ్గజం కేటీఎం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ర్యాలీలో దూసుకొస్తోంది. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకు రానుంది. బజాజ్ సహకారంతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇటలీ మిలాన్లో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీన్ని ఆవిష్కరించనుందదని భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టెస్ట్ మ్యూల్లో ఎటువంటి బ్రాండింగ్ లేనప్పటికీ, కేటీఎం లివరీతో కూడిన జాకెట్తో రైడర్ ఉండటంతో ఈ స్కూటర్ను విదేశాలలో పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. (మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో) కేటీఎం ఈ-స్కూటర్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. విండ్స్క్రీన్ కూడా పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్, TFT డిస్ప్లే , ట్విన్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, ఎయిర్ డక్ట్, ఫ్రెంట్, రేర్ వీల్స్కు డిస్క్ బ్రేక్స్ ముఖ్య ఫీచర్లుగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో తేలికపాటి అల్యూమినియం స్వింగార్మ్ , సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెంతో లాచ్కానుందని అంచనా. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) 2025 ప్రారంభంలో లాంచ్ కానున్న ఈ కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ను బజాజ్ చకాన్ ప్లాంట్లో చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
బంఫర్ ఆఫర్: ‘ఉద్యోగులకు’ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరా ముందుకొచ్చింది. ఈ మేరకు నెడ్క్యాప్తో అవేరా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నెడ్క్యాప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే -
సింపుల్ వన్ డెలివరీలు మొదలయ్యాయ్ - అక్కడ మాత్రమే
Simple One Electric Scooter: గత కొన్ని నెలల నిరీక్షణ తరువాత 'సింపుల్ ఎనర్జీ' దేశీయ మార్కెట్లో ఇటీవల 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సింపుల్ ఎనర్జీ సుమారు ఒక లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. అయితే ఇప్పుడు కేవలం 15 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డెలివరీలు కేవలం బెంగళూరులో మాత్రమే ప్రారంభమయ్యాయి. త్వరలోనే దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) సింపుల్ ఎనర్జీ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 నుంచి 50 నగరాల్లో 160 నుంచి 180 రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటి ద్వారానే కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరాయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ధరలు - ఇలా ఉన్నాయి
Ola Electric Price Hiked: భారతదేశంలో రోజు రోజుకి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పుడు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను అమాంతం పెంచినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త ధరలను గురించి మరికొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ధరలు.. నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 & ఎస్1 ప్రో ధరలు మాత్రమే పెరిగాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన 'ఎస్1 ఎయిర్' ధరలు మారలేదు. ఓలా మిడ్-స్పెక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లనులో లభిస్తుంది. అవి ఒకటి 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్, రెండు 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్. గతంలో ఎస్1 3kWh ధర రూ. 1.15 లక్షలు కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ. 15,000 పెరిగి రూ. 1.30 లక్షలు చేరింది. అదే సమయంలో S1 ప్రో ధర రూ. 1.40 లక్షలకు చేరింది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) ఇక ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎయిర్ విషయానికి వస్తే, ఇది 2kWh, 3kWh, 4kWh అనే మూడు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 84999, రూ. 99999, రూ. 1.10 లక్షలు. రేంజ్ విషయానికి వస్తే 85 కిమీ, 125 కిమీ, 165 కిమీ. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జూన్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ల ధరలు జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్ 2 (FAME-II) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్-అవర్ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్ (FAME) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది. ఇదీ చదవండి: Heavy Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్కి 150 కిలోమీటర్లు! -
ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్కి 150 కిలోమీటర్లు!
సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్ బండి (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి పరిశీలించండి.. పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. రేంజ్, ఫీచర్లు, ధరలు కోమకి ఎక్స్జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్ట్రా క్యారియర్, బీఎల్డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్లెస్ అప్డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత. ఇక కోమకి ఎక్స్జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
భవిష్ అగర్వాల్ ట్వీట్.. ఇలా చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే..!
Ola S1 Pro Special Edition: ఆధునిక కాలాన్ని సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎలేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. అంతే కాకుండా కొన్ని సంఘటన మీద ట్రోల్స్ అండ్ మీమ్స్ మరింత ఎక్కువవుతున్నాయి. మీమ్స్ చేసేవారికి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా ఐసీఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయడానికి ట్రై చేయండి, అందులో ఒక బెస్ట్ మీమ్స్ చేసిన ఒకరికి ఓలా ఎస్1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే కొంత మంది మీమ్స్ చేయడం ప్రారంభించి పోస్ట్ కూడా చేస్తున్నారు. Trying to make some funny ICE and petrol vehicle memes. If you have some, share here! Best one today will get an Ola S1 Pro special edition 🙂 — Bhavish Aggarwal (@bhash) May 27, 2023 ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా కావాలనుకునేవారు ఐసీఈ, పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయవచ్చు. ఇది మీమ్స్ చేసేవారికి మంచి సువర్ణావకాశమనే చెప్పాలి. ఎందుకంటే రూ. లక్ష కంటే ఎక్కువ ఖరీదైన స్కూటర్ ఒక్క మీమ్స్ చేయడం ద్వారా ఉచితంగా పొందవచ్చు. బహుశా ఈ అవకాశం ఈ రోజు మాత్రమే అని తెలుస్తోంది. -
మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ–స్ప్రింటో కొత్తగా ఎమెరీ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్ల రేంజి (మైలేజీ) ఇస్తుంది. 6 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0–40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Uber Green: ఉబర్లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 20–35 ఏళ్ల వయస్సు గల చోదకులు లక్ష్యంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. ఇందులో రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ–థెఫ్ట్ అలారం, మొబైల్ చార్జింగ్ సాకెట్ తదితర ఫీచర్లు ఉంటాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు అతుల్ గుప్తా తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్ షోరూం)గా ఉంటుంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది. సున్నితమైన ధర.. ‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. మార్కెట్ వృద్ధి చెందే వరకు కస్టమర్కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్మార్క్ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు. సమయం ఆసన్నమైంది.. సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్ ఉందని స్పష్టమైందని వోల్టప్ కో–ఫౌండర్ సిద్ధార్థ్ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు. హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ నిఖిల్ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) కాగా ఓలా ఎస్1 ఎయిర్ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) Test drove the first S1 Air vehicles!! Loving them 🙂 Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62 — Bhavish Aggarwal (@bhash) May 23, 2023 -
ఇక సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ రేపే!
Simple One Electric Scooter: బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ని రేపు అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. సుదీర్ఘ విరామం తరువాత విడుదలకానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. డెలివరీలు కూడా బహుశా రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు పరిచయమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు రెండు సంవత్సరాల తరువాత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఇబ్బందులు కస్టమర్లు ఎదుర్కోకూడదని చాలా రోజులుగా టెస్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం చరమ దశకు చేరింది. కావున విడుదలకు సన్నద్ధమైపోయింది. రేంజ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. కావున మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ధర & ప్రత్యర్థులు ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందిన ఈ స్కూటర్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ. 1.09 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గతంలోనే ప్రకటించింది. ఇది మార్కెట్లో ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఎలక్ట్రిక్ బైక్లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ప్రస్తుతం ఫేమ్ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
Enigma హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కమింగ్ సూన్!
నోయిడా: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా త్వరలో ఆరు హై–స్పీడ్ టూ వీలర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఇవిఅందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ అన్మోల్ బోహ్రీ తెలిపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలిగే కెఫే రేసర్-ఎనిగ్మా సీఆర్22 వీటిలో ఉండనున్నట్లు వివరించారు. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 105 కి.మీ. రేంజి ఇస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: (యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!) గిఫ్ట్ నిఫ్టీగా ఎస్జీఎక్స్ నిఫ్టీ జూలై 3 నుంచి అమల్లోకి సింగపూర్లో ట్రేడయ్యే నిఫ్టీ సూచీ పేరు ఎస్జీఎక్స్ నిఫ్టీ నుంచి గిఫ్ట్ నిఫ్టీగా మారనుంది. జూలై 3 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. ఎస్జీఎక్స్ ఆర్డర్లు అన్నీ మ్యాచింగ్ కోసం గిఫ్ట్ సిటీలోని ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎక్స్ఛేంజీకి బదలాయించనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ఎక్స్ఛేంజీ ఉంది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ) -
500వ షోరూమ్ ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ - ఎక్కడంటే?
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్ను జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. -
ఓలాకి ధీటుగా ఏథర్ సరసమైన స్కూటర్ - త్వరలో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఇప్పటికే ఏథర్ 450, 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే వీటి ధరలు రూ. లక్ష కంటే ఎక్కువ కావడం వల్ల చాలా మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకాడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ మార్కెట్లో మరో సరికొత్త సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ ఎనర్జీ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు '450ఎస్' (450S) అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ స్కూటర్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అంతే కాకుండా ఈ స్కూటర్ మార్కెట్లో 'ఓలా ఎస్1 ఎయిర్'కి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ట్రేడ్మార్క్ కోసం కంపెనీ గత మార్చిలో అప్లై కూడా చేసింది. ఈ స్కూటర్ డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?) త్వరలో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది. కావున ఇందులో 7 ఇంచెస్TFT టచ్స్క్రీన్, ఆటో హోల్డ్, రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ బహుశా లభించకపోవచ్చు. అంతే కాకుండా రేంజ్ కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సాగరంలో సౌరవిహారం.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
మామూలు మరపడవలు నడవాలంటే పెట్రోలు లేదా డీజిల్ కావాల్సిందే! వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల సముద్రాలకు, నదులకు కాలుష్యం తప్పదు. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో మారిషస్కు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్’ (ఎస్పీఈఎస్) పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవను రూపొందించింది. ‘ఫోక్లోరిక్ ఎక్స్ప్లోరర్’ పేరుతో తయారు చేసిన ఈ పడవ పైకప్పు మీద 48 సౌరఫలకాలు ఉంటాయి. ఒక్కో ఫలకం నుంచి 110 వాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. సౌరఫలకాల నుంచి వెలువడే విద్యుత్తును ఈ పడవలోని ఆరు లిథియం అయాన్ బ్యాటరీలు నిల్వచేసుకుంటాయి. బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయితే, ఈ పడవ ఏకధాటిగా 25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ పడవ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నదులు, సరస్సుల్లో ప్రయాణాలకు ఈ పడవ బాగా అనువుగా ఉంటుంది. -
భారత్లో టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఇవే!
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తారా స్థాయిలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలన్నీ ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి వివరాలేంటి అనే మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం. ఓలా ఎస్1 భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన 'ఎస్1 ప్రో' ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఈ స్కూటర్ ధర ఈ 99,999. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీల ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. ఇది 2.98 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్తో 121 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 1.05 లక్షలు. ఇందులో 3.04 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు. టీవీఎస్ ఐక్యూబ్ 5 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఏథర్ 450ఎక్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన ఏథర్ మార్కెట్లో '450ఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.17 లక్షల నుంచి రూ. 1.39 లక్షలు మధ్య ఉంది. ఇందులోని 2.23 కిలోవాట్ బ్యాటరీ 70 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 80 కిమీ కాగా, ఛార్జింగ్ టైమ్ 5.45 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రూ. 72,240 వద్ద లభిస్తున్న హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ మార్కెట్లోని ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది 1.87 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ స్కూటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. బజాజ్ చేతక్ బజాజ్ ఆటో భారతదేశంలో విక్రయిస్తున్న 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఒక ఛార్జ్తో 85 నుంచి 95 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్లో 3 కిలోవాట్ బ్యాటరీ నిక్షిప్తమై ఉంటుంది. ఇది 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు మాత్రమే. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి, కావున ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు తప్పకుండా ఆ రాష్ట్రంలో అందించే సబ్సిడీ, ఇతర వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే 'డ్రైవింగ్ లైసెన్స్' అక్కర్లేదు - అవేంటో ఇక్కడ (ఫొటోలు)
-
ఈ వెహికల్స్ కొంటే డ్రైవింగ్ లైసెన్స్తో పనే లేదు - మరెందుకు ఆలస్యం..
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ప్రజా రహదారులలో డ్రైవ్/రైడ్ చేయడానికి తప్పకుండా లైసెన్స్ అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అవాన్ ఇ ప్లస్ (Avon E Plus) భారతదేశంలో లభించే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'అవాన్ ఇ ప్లస్'. దీని ధర కేవలం రూ. 25,000 కావడం గమనార్హం. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 50 కిమీ రేంజ్ అందిస్తుంది. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా చెప్పుడోదగ్గ మోడల్ ఈ అవాన్ ఇ ప్లస్ కావడం గమనార్హం. డీటెల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus) మన జాబితాలో మరో టూ వీలర్ 'డీటెల్ ఈజీ ప్లస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40,000 మాత్రమే. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుంది. 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఆంపియర్ రియో ఎలైట్ (Ampere Reo Elite) రూ. 44,500 ధర వద్ద లభించే ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి గంటకు 25 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 (Hero Electric Flash E2) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్ కావడం గమనార్హం. రూ. 52,500 ఖరీదైన హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్ వినియోగించడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులోని 51.2v/30ah బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఇది ఒక ఛార్జ్తో గరిష్టంగా 65 కిమీ రేంజ్ అందిస్తుంది. లోహియా ఓమా స్టార్ లి (Lohia Oma Star Li) రూ. 41,444 వద్ద లభించే ఈ 'లోహియా ఓమా స్టార్ లి' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రైడింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్స్ లో ఇది ఒకటి. ఇందులోని 48V/20 Ah బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఒకినావా లైట్ (Okinawa Lite) దేశీయ విఫణిలో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఒకినావా లైట్ మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 67,000. ఇందులోని 1.25 కిలోవాట్ బ్యాటరీ ఇక ఫుల్ ఛార్జ్తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఓకినావా ఆర్30 (Okinawa R30) మన జాబితాలో చివరి ఎలక్ట్రిక్ బైక్ 'ఓకినావా ఆర్30'. దీని ధర రూ. 62,500. ఈ స్కూటర్ రేంజ్ 65 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 5 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు) నిజానికి దేశంలో వినియోగించే చాలా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే తక్కువ వేగంతో లేదా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇలాంటి స్కూటర్లు లాంగ్ రైడ్ చేయడానికి ఉపయోగపడవు, కానీ రోజు వారి ప్రయాణానికి, నగర ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కొత్త హంగులతో ముస్తాబైన కొత్త యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ యమహా తన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని అప్డేట్ చేసింది. ఈ 2023 మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా కంపెనీ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది, కావున చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులోని స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వెనుక భాగంలో టెయిల్ లాంప్ మాత్రం నెంబర్ ప్లేట్ మీద అమర్చి ఉండటం చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్ల మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. అంతే కాకుండా 2.03 కిలోవాట్ మోటార్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల మాత్రమే. ఇది పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి గరిష్టంగా 8 గంటల సమయం తీసుకుంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది బ్యాటరీ స్టేటస్, రూట్ ట్రాకింగ్, కాల్స్ అండ్ మెసేజస్ వంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఎంపిక చేసిన కొన్ని డీలర్షిప్లలో ప్రదర్శించారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో విక్రయానికి రానున్నట్లు భావిస్తున్నారు. -
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ - నిరీక్షణకు తెర పడ్డట్టే..
ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో మొదటిసారి తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలచేసినప్పుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు అనేక విధాలుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. సింపుల్ ఎనర్జీ 2023 మే 23న తన ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్ వన్ స్కూటర్ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్ వన్ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో అమ్మకానికి రానున్న అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. (ఇదీ చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కోలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది, కాగా త్వరలో లాంచ్ అవుతుంది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. -
వైరల్ వీడియో: సరుకులు ఇలా కూడా తీసుకెళ్తారా?
-
పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'ఓలా' ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభంలో కొన్ని సమస్యలకు గురైనప్పటికీ, ప్రస్తుతం మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ అనే చెప్పాలి. ఇందులో ఆ ఫీచర్స్ ఇటీవల దొంగతనం సమయంలో కూడా గుర్తించడానికి సహాయపడ్డాయి. నివేదికల ప్రకారం, జోధ్పూర్ ప్రాంతానికి చెందిన 'అంజలి పాల్' అనే మహిళ ఓలా స్కూటర్ను గుర్తుతెలియని దుండగులు దొంగలించి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సహాయంతో వేరే నగరానికి పంపించాలి నిర్చియించుకుని దానిని పూర్తిగా ప్యాక్ చేసి ఉంచారు. అయితే స్కూటర్ పోగొట్టుకున్న అంజలి తన ఎలక్ట్రిక్ స్కూటర్లోని జిపిఎస్ నావిగేషన్ ద్వారా పోలీసుల సహాయంతో పట్టుకుంది. స్కూటర్ దొంగిలించబడిన తర్వాత అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ఓనర్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగానే అంజలి పాల్ తన స్కూటర్ కనిపెట్టగలిగింది. దీనికి కంపెనీ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. జోధ్పూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్లో ఈ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆధునిక ఫీచర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి కార్లలో, బైకులలో యాంటీ తెఫ్ట్ అలారం వంటివి అందిస్తారు. దీనితో పాటు నావిగేషన్ అందుబాటులో ఉన్నప్పుడు దొంగతనం జరిగిన తర్వాత కూడా కనిపెట్టడానికి సహాయపడుతుంది. (ఇదీ చదవండి: Boult Rover Pro: కేవలం రూ. 2499కే స్మార్ట్వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్) లేటెస్ట్ వాహనాల్లో యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగిలించడానికి దొంగలు కూడా అధునాతన సాధనాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి సమయంలో దొంగతనాలకు చెక్ పెట్టడానికి స్టీరింగ్ లాక్స్, గేర్ లాక్స్, వీల్ లాక్స్ & జిపిఎస్ ట్రాకర్స్ చాలా ఉపయోగాడతాయి. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) గతంలో కూడా జిపిఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అలాంటి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మాత్రమే పోయిన స్కూటర్ మళ్ళీ పొందగలిగారు. ఇది నిజంగా కంపెనీ కస్టమర్లకు అందించిన వరమనే చెప్పాలి. I GOT MY OLA SCOOTER BACK🥰 special thanks to @OlaElectric @ola_supports @bhash they provided us the ola location several times. And special thanks to the sub inspector @SulochanaJaat and rajendra sir posted in basani police station jodhpur @CP_Jodhpur @JdprRuralPolice https://t.co/qxH3AERtk1 pic.twitter.com/DnfYeylXLD — Anjali Pal (@anjalipal8477) April 13, 2023 -
ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ల విస్తరణలో పెరిగిన వేగం! ఒకే రోజు..
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ దేశ వ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో మూడు సెంటర్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు హైదరాబాద్ మాదాపూర్ శ్రీరామకాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో మొత్తం మూడు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఓలా కస్టమర్లకు మరింత చెరువులో ఉండటానికి లేదా కొత్త కస్టమర్ల సందేహాలను తీర్చడానికి గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మీద అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారభినానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్: ఈ నెల 16 వరకే..!) నిజానికి ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఈ సెంటర్ల ద్వారా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఎంపికల గురించి కూడా సమచారం అందించడంలో సహాయపడతాయి. -
ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపైన కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కావున కొనుగోలుదారుడు సాధారణ ధర కంటే తక్కువకే ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ రూ. 5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనాలనుకునే కస్టమర్ రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 2021లో రూ. 10,000 వరకు పెరిగాయి. ఆ సమయంలో కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో దేశీయ మార్కెట్లో ప్రత్యులకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ స్కూటర్ల మీద మంచి ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రూ. 5వేలు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి అమ్మకాల్లో 27,000 యూనిట్లను విక్రయించి మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. -
టీవీఎస్ ఐక్యూబ్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్పాయింట్లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. -
స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్
సాక్షి, ముంబై: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో సరికొత్త ఫీట్ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లి అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. ఇది ఐపీఎల్లో అతని 50వ 50-ప్లస్ స్కోరుతో ఆకట్టుకునే ఫీట్ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అయితేఈ లిస్ట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్ధసెంచరీలు. 5 సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ఆదివారం ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.దీంతో ఆంపియర్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. (NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను గిప్ట్గా అందుకున్నాడు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన కోహ్లి (82 నాట్ అవుట్)గా నిలిచాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (73)తో కలిసి 148 ఓపెనింగ్ పార్టనర్షిప్తో శుభారంభం చేసి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను సంస్థ కోహ్లీకి అందించింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ను కోహ్లికి అందించారు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. (Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?) కాగా ఆర్సీబీ ఆడే ప్రతి IPL మ్యాచ్ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను 'ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కి ఆర్సీబీ ప్లేయర్కు అందజేస్తుంది. ఆర్సీబీకి అధికారిక భాగస్వామి ఆంపియర్. The Limited Edition RCB themed Primus is set to be unveiled today. And the most electrifying RCB player of the match will get his very own Limited Edition scooter! Pre-booking for the Limited Edition RCB themed Primus at just ₹499 is live on our website NOW! pic.twitter.com/xkzeEEBPZd — Ampere Electric Vehicles (@ampere_ev) April 2, 2023 మరోవైపు గత వారమే లాంచ్ చేసిన ఆంపియర్ ప్రైమస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏప్రిల్ మొదటి వారం నుండి పరిమిత కాలానికి రూ. 499 ప్రీ-బుకింగ్లకు అందుబాటులో ఉంటుంది. తమ కంపెనీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ ప్రైమస్ అని సంజయ్ వెల్లడించారు.లిమిటెడ్ ఎడిషన్ ఆంపియర్ ప్రైమస్ జట్టు స్ఫూర్తిని, క్రీడను, హర్ గల్లీని ఎలక్ట్రిక్గా మార్చాలనే తమ ఉద్దేశ్యానికి జీవం పోసిందన్నారు. తమకు 1.80 లక్షల మంది వినియోగదారులున్నారని కంపెనీ పేర్కొంది. -
పేలిన బ్యాటరీ స్కూటర్
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి కాలిపోయింది. శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, స్థానిక పరీక్షా కేంద్రానికి ప్రకాశ్ అనే ఉపాధ్యాయుడు తన బ్యాటరీ స్కూటర్లో వచ్చాడు. దానిని బయట పార్కు చేసి ఉంచాడు. సుమారు 12 గంటల సమయంలో బ్యాటరీ స్కూటర్ పెద్ద శబ్ధంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. పక్కనున్న మరో నాలుగు పెట్రోల్ బైక్లకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదగా మారిన తమ వాహనాలను చూసి యజమానులు లబోదిబోమన్నారు. -
ఓలా స్కూటర్లపై భారీ తగ్గింపు... ఆఫర్ ఒక్క రోజే!
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకో అదిరిపోయే ఆఫర్. పాపులర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే సొంత చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా మార్చి 31 ఒక్క రోజు మాత్రమే. (బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మరి పాత బంగారం సంగతేంటి?) విద్యార్థులు, ఉద్యోగులు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ.61,999, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్ను రూ. 69,999 లకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. వాస్తవంగా ఓలా ఎస్1 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,900. అలాగే ఎస్1 ప్రో ధర రూ. 1,39,999. ఈ డీల్ 5.99 శాతం వడ్డీతో నెలకు రూ. 2,199 నో కాస్ట్ ఈఎంఐలో లభిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఓలా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఎస్1 స్కూటర్పై రూ. 3,000, అలాగే ఎస్1 ప్రో స్కూటర్పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఇవి మాత్రమే కాక రూ. 10,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) ఈ ఆఫర్ను పొందడానికి విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు (ID)లో ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించాలి. అక్కడ కొనుగోలుదారులకు ఆఫర్ నిబంధనలు, షరతుల గురించి తెలియజేస్తారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) -
గోగోరోతో చేతులు కలిపిన జొమాటో.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు కొన్ని ఈ కామర్స్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో గోగోరో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆ కంపీనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కాగా ఇప్పుడు జొమాటో 2023 చివరి నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలని కంకణం కట్టుకుంది. ఈ కారణంగానే గోగోరోతో చెయ్యి కలిపింది. జొమాటో డెలివరీ ఏజంట్లకు మరింత అనుకూలంగా ఉండటానికి కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ లోన్ సదుపాయం కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతే కాకుండా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ ఆప్సన్ కలిగి ఉండటం వల్ల వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: జిమ్నీ డెలివరీలు అప్పుడే అంటున్న మారుతి సుజుకి) ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీ ఉండటం వల్ల ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒక బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినప్పుడు స్వాపింగ్ సెంటర్ వద్ద ఇంకో బ్యాటరీ తీసుకోవచ్చు. ఇది వినియోగదారునికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. -
హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్నాటకలోని నర్సాపుర ప్లాంటులో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు వెల్లడించింది. ఈ ఫెసిలిటీ నుంచి తొలి రెండు ఎలక్ట్రిక్ మోడళ్లు 2023–24లో రోడ్డెక్కనున్నాయి. మధ్యస్థాయి మోడల్తోపాటు వాహనం నుంచి వేరు చేయగలిగే బ్యాటరీతో సైతం ఈవీ రానుంది. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) 2030 నాటికి 10 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. బ్యాటరీ, మోటార్, పీసీ యూ వంటి కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సు షి ఒగటా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6,000 కంపెనీ టచ్ పాయింట్లలో చార్జింగ్ సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఫిల్లింగ్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, ఇతర ప్రాంతాల్లో సైతం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు. రెండు కొత్త మోడళ్లు.. గుజరాత్లోని విఠలాపూర్ ప్లాంటులో స్కూటర్ల తయారీకై కొత్త లైన్ను జోడించనున్నట్టు ఒగటా వెల్లడించారు. తద్వారా అదనంగా 6 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం తోడవుతుందని చెప్పారు. నర్సాపుర ప్లాంటు నుంచి యాక్టివా స్కూటర్ల తయారీని గుజరాత్ ప్లాంటుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా 160 సీసీ బైక్, 125 సీసీ స్కూటర్ను మూడు నెలల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. పండగల సీజన్ నాటికి 350 సీసీ బైక్ ఒకటి రానుంది. (జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్గా మాధవన్) కాగా, భారత్లో కంపెనీకి ఉన్న నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 52 లక్షల యూనిట్లు. 2022–23లో హెచ్ఎంఎస్ఐ దేశీయంగా 40 లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీ 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 మోడళ్లను 58 దేశాలకు చేర్చాలన్నది సంస్థ ఆలోచన. అంతర్జాతీయంగా 2040 నాటికి ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ మోడళ్ల విక్రయాలు 100 శాతానికి చేర్చాలన్నది హోండా ధ్యేయం. -
రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. అదే ‘గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్. అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంఆర్పీ రూ.65,999గా ఉండగా దీన్ని ఇప్పుడు రూ. 38 వేలకే కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రూ.65,999 ఎంఆర్పీ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ ప్రస్తుతం భారీ డిస్కౌంట్తో రూ. 43,499లకే అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. రూ. 5 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 38 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. కళ్లు చెదిరే ఫీచర్స్ గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్లో 48వీ 13 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కిలోమీటరు వెళ్లేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈబేబికార్ట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఆన్లైన్ కొనుగోలుపై సందేహం అక్కర్లేదు. 7 రోజుల రిటర్న్ పాలసీ ఉంటుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు. 130 కేజీల వరకు లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్, 250 వాట్ 48 వోల్ట్ బీఎల్డీసీ హబ్ మోటార్ ఇందులో ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బ్రేక్ సెన్సార్లు, బ్యాటరీ ఇండికేటర్ ఆకట్టుకుంటున్నాయి. ట్యూబ్లెస్ టైర్లు, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ లాక్ వంటివి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఫుల్గా చార్జింగ్ చేసేందుకు 6 నుంచి 7 గంటలు పడుతుంది. -
Electric Scooter Explodes: త్రుటిలో తప్పించుకున్న కుటుంబం
ఎలక్ట్రిక్ స్కూటర్కి చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటిలోని అన్ని గృహోపకరణాలన్ని దగ్ధమయ్యాయి. ఐతే ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలో మండ్యా జిల్లాలో ఓ కుటుంబం చార్జింగ్ కోసం అని ఇంటి లోపలే ఎలక్ట్రిక్ స్కూటర్ని పార్క్ చేశారు. వారు ప్లెగ్ఇన్ చేసిన కొద్దిసేపటిలోనే స్కూటర్ పేలింది. దీంతో ఇంటిలోని విలువైన వస్తువులన్ని దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు ఇంటిలోనే ఉన్నారు. ఐతే అందరూ స్కూటర్ దూరంగా ఉండటం వల్ల వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి టీవీ, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులన్ని ఆహుతైపోయాయి. స్కూటీకి మంటలు అంటుకున్నప్పడు సమీపంలోనే తమ చిన్నారి కూడా ఉన్నాడని, కానీ మంటలను అదుపు చేయలేకపోయామని ఇంటి యజమాని ముత్తురాజ్ చెప్పుకొచ్చారు. తాను రూట్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆరు నెలల క్రితమే షోరూం నుంచి రూ. 85 వేలకు కొనుగోల చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ..దించేసినా దక్కని ప్రాణం) -
త్వరలో విడుదలకానున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ను కంపెనీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో హీరో కొత్త స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉందని తెలుస్తోంది. ఇది ఈ నెల 15న (2023 మార్చి 15) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కౌల్ టాప్ పొజిషన్లో ఎల్ఈడీ హెచ్ల్యాంప్, సెంటర్లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వ స్థానంలో ఉంటుంది. A new era of intelligent and sustainable mobility is all set to dawn! Are you ready to experience the newest electrifying ride from Hero Electric? Watch this space to know more 🛵⚡#TheSmartMove pic.twitter.com/0nH6eSvFkO — Hero Electric (@Hero_Electric) March 12, 2023 -
ఫోటో పెట్టు.. ఓలా స్కూటర్ పట్టు: భవిష్ అగర్వాల్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ఇటీవల హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ తీసుకువచ్చింది. కంపెనీ ఈ స్కూటర్లను కేవలం 5 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ స్కూటర్ కావాలనుకునే వారు కేవలం హోలీ సెలబ్రేషన్స్ ఫోటో పెట్టి సొంతం చేసుకోవచ్చు. హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ కేవలం ఎస్1 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఎస్1 వేరియంట్కి ఉన్న డిమాండ్ కారణంగా దీనిని విడుదల చేయడం జరిగిందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్కూటర్ వివిధ రంగుల కలయికతో చూడటానికి కొత్తగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ) ఓలా ఎస్1 హోలీ ఎడిషన్ ఖాకీ, గెరువా, నియో మింట్, మార్ష్మల్లో, కోరల్ గ్లామ్ వంటి కలర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 2 kWh వెర్షన్ 90 కిమీ/గం వేగంతో 90 కిలోమీటర్ల పరిధిని, 3 kWh వెర్షన్ 141 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 2 కిలోవాట్ వెర్షన్ ధర రూ. 90,000 కాగా 3 kWh వెర్షన్ ధర రూ. 1.08 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది, ఎటువంటి మార్పులు లేదు. డబ్బు చెల్లించకుండా కేవలం ఫోటో పెట్టి 5 యూనిట్లను మాత్రమే పొందవచ్చు, అంటే ఐదు మంది కస్టమర్లు మాత్రమే స్కూటర్లను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. Due to popular demand, we will build 5 of these as a special Holi edition! Comment with pic/video of how you celebrated holi with your S1 and best 5 will get one! pic.twitter.com/y2VEoMPUWT — Bhavish Aggarwal (@bhash) March 9, 2023 -
తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్పై భారీగా.. ప్రస్తుతం ఓలా ఎస్1 వేరియంట్పై రూ.2వేలు, ఎస్1 ప్రో వేరియంట్పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్వాలా పేర్కొన్నారు. ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరుస్తోంది. -
హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్ బైక్ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమెరికాకు చెందిన జీరో మోటర్సైకిల్స్తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మేరకు హీరో మోటర్ కార్ప్.. జీరో మోటర్సైకిల్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న జీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందిస్తుంది. గతేడాది సెప్టెంబర్లో జీరో మోటార్సైకిల్స్ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. ఈ తాజా ఒప్పందం గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. జీరో మోటార్సైకిల్స్తో తమ భాగస్వామ్యాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్సైకిల్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తమను భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నామని జీరో మోటార్సైకిల్స్ సీఈవో శామ్ పాస్చెల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో హీరో సంస్థ లక్ష్య సాధనకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుంది. హీరో సంస్థ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రానిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, జైపూర్లలో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు నగరాల్లో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు వాహనాలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇందులో భాగంగానే ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ చేతక్ 'ప్రీమియం ఎడిషన్'లో విడుదలైంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ని మూడు కలర్ ఆప్సన్స్లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్రెస్ట్ కాస్టింగ్లు, హెడ్ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటి వాటిని పొందుతుంది. భారతదేశంలో కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి డీలర్షిప్లను విస్తరించనుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ డీలర్షిప్ నెట్వర్క్ భారతదేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది. అంతే కాకుండా 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 85 కంటే ఎక్కువ నగరాల్లో 100 కంటే ఎక్కువ స్టోర్లకు విస్తరించడానికి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి కంపెనీ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర ప్రీమియం ఎడిషన్ కంటే తక్కువ. ఇప్పుడు ఈ వేరియంట్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో అనే నాలుగు కలర్ ఆప్సన్స్లో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2kW పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్పై 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎక్కువ అమ్మకాలు జరపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తున్నాయి, కొనుగోలుదారులు కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున చేతక్ క్లెయిమ్ చేసిన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (IDC) పరిధిని 20 శాతం పెంచి 108కిమీలకు పెంచబోతున్నట్లు బజాజ్ ఆటో గత నెలలో ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఇదే జరిగితే చేతక్ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. -
డెలివరీ బాయ్తో భవిష్ అగర్వాల్ సెల్ఫీ: ఓలా స్కూటర్తో చాలా అదా అంటూ..
ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సజావుగా ముందుకు సాగిపోతోంది. క్రమంగా కంపెనీ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల భవిష్ అగర్వాల్ ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్తో ఉన్న జొమాటో డెలివరీ బాయ్ని చూడవచ్చు. ఈ డెలివరీ బాయ్ 9 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఖర్చులను ఆదా చేసాడని, అతడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నాడని కూడా భవిష్ ట్విట్టర్ పోస్ట్లో రాశాడు. జొమాటో డెలివరీ బాయ్ ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకదానిలో ఛార్జింగ్ పూర్తయినప్పుడు, ఇంకోదానిని ఉపయోగిస్తాడు. అప్పుడు ఛార్జింగ్ కాలీ అయిన స్కూటర్కి ఛార్జింగ్ వేసుకుంటాడు. ఈ విధంగా రెండు స్కూటర్లను నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నాడు డెలివరీ బాయ్ సంతోష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో సాధారణ 9 నెలల్లో లక్షకంటే ఎక్కువ ఆదా చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా కంపెనీ స్కూటర్లు ఉండటం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో 4 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీతో 181 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్తో దాదాపు 6 గంటల్లో, ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. Met Santosh at a traffic junction. Very enterprising guy! Owns 2 @OlaElectric scooters and has driven more than 50000 kms! Drives the second one when the first is on charging at our hyper charging station. Has saved more than ₹1 lakh in just 9 months! pic.twitter.com/89OxmM2uy9 — Bhavish Aggarwal (@bhash) February 28, 2023 -
చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది. ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్గా అందుబాటులో ఉండేవి. చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి. కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు. -
River Indie: ఎక్కువ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ రివర్ తన 'ఇండీ' (Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ఫుట్పెగ్లు, క్రాష్ గార్డ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది, డెలివరీలు 2023 ఆగష్టులో ప్రారంభమవుతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక ఛార్జ్పై 150 కి.మీ పరిధిని అందిస్తుంది, అయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో 120 రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 5 గంటలలో 0-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. రివర్ ఇండీ బ్యాటరీ ప్యాక్ 8.98 బిహెచ్పి పవర్, 26 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.9 సెకన్లలో గంటకు 90 కిమీ వేగంతో ముందుకు వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది, కావున లో మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ టైల్లైట్ వంటి వాటితో పాటు కాంట్రాస్ట్ డిస్ప్లే, ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. ఇందులోని పన్నీర్ మౌంట్స్ లగేజ్ మోయడానికి సహాయపడతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది, కావున ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్, 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మాన్సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో వంటి మూడు కలర్ ఆప్సన్స్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కిమీ వారంటీ అందిస్తోంది. -
Okaya Faast F2F: సింగిల్ ఛార్జ్తో 80 కి.మీ.. ధర లక్ష కంటే తక్కువే
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో 'ఒకాయ ఎలక్ట్రిక్' దేశీయ మార్కెట్లో 'ఫాస్ట్ ఎఫ్2ఎఫ్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 83,999 (ఎక్స్-షోరూమ్). ఒకాయ ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ స్కూటర్ 800డబ్ల్యు బిఎల్డిసి హబ్ మోటార్ & 2.2 కిలోవాట్ లిథియం అయాన్ ఎల్ఎఫ్పి బ్యాటరీ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ 4 నుంచి 5 గంటల సమయంలో 0-100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ మీద 2 సంవత్సరాలు లేదా 20,000 కి.మీ వారంటీ అందిస్తుంది. ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ అనే ఆరు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హైడ్రాలిక్ స్ప్రింగ్-లోడెడ్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఈ స్కూటర్లో ఉన్నాయి. ఒకాయ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిఆర్ఎల్ హెడ్ల్యాంప్, షార్ప్ టెయిల్ల్యాంప్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇందులో స్కూటర్ గురించి మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ఇది 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లతో నడుస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూమ్లలో అందుబాటులో ఉంటుంది. -
షాకింగ్ న్యూస్.. ఓలా బ్యాటరీ కొనాలంటే అంత చెల్లించాలా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ బాగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రారంభం నుంచి కొన్ని సమస్యల ఉన్నప్పటికీ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. తరుణ్ పాల్ అనే వ్యక్తి ట్విటర్లో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి. కావున వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 వరకు (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే, తరుణ్ పాల్ చెప్పినట్టు ఓలా బ్యాటరీ ధరలు ఎంతమేరకు ఉంటాయనేది క్లారిటీ లేదు. అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. -
Ampere Zeal EX: సింగిల్ ఛార్జ్ 120 కి.మీ రేంజ్.. ధర కూడా తక్కువే!
భారతీయ మార్కెట్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 'ఆంపియర్ జీల్ ఈఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 69,900 (ఎక్స్-షోరూమ్). ఈ ధర కేవలం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్). 2023 మార్చి 31 లోపు కొనుగోలు చేసే కస్టమర్లు ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రూ.6,000 బెనిఫీట్స్ పొందవచ్చు. ఇది స్టోన్ గ్రే, ఐవరీ వైట్, ఇండిగో బ్లూ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవల్ మోడల్, కావున 2.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి 1.8kW ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ పరిధి అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎంట్రీ లెవెల్ స్కూటర్ కేవలం 5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఉంటుంది. -
ఏకంగా108 కి.మీ. రేంజ్తో 2023 బజాజ్ చేతక్ ఈవీ.. వచ్చేస్తోంది!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది. బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. -
మార్కెట్లోకి ఒకాయా ఫాస్ట్ ఎఫ్౩ ఎలక్ట్రిక్ స్కూటర్
-
ఓలా కొత్త స్కూటర్లు వచ్చేశాయి.. ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్లను ఆవిష్కరించింది. ఎస్1 శ్రేణిలో రూ. 99,999 ధరలో నూతన వేరియంట్ను అందుబాటులోకి తెచ్చింది. 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 91 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. ఎస్1 ఎయిర్ పేరుతో మూడు వేరియంట్లను సైతం ఓలా పరిచయం చేసింది. రూ.84,999 ధర గల 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్తో 85 కిలోమీటర్లు పరుగెడుతుంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 3 కిలోవాట్ అవర్ వేరియంట్ 125 కిలోమీటర్లు, 4 కిలోవాట్ అవర్ రకం 165 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999 ఉన్నాయి. ఎస్1 ఎయిర్ వేరియంట్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. Mike drop. Actually, the bike drop!! So excited about this❤️🏍️ pic.twitter.com/0VVRhdz8pm — Bhavish Aggarwal (@bhash) February 9, 2023 -
ఫ్లోరోసిస్ విముక్తి పోరాట యోధుడి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మర్రిగూడ: ఫ్లోరోసిస్ విముక్తి పోరాట యోధుడు అంశాల స్వామి (37) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ఎలక్ట్రిక్ (3 చక్రాల) సైకిల్పై తండ్రితో కలసి ఊరికి వెళ్లి వచ్చి ఇంటి ముందు ర్యాంప్ ఎక్కే క్రమంలో ఆయన కింద పడిపోయారు. శనివారం ఉదయం రక్తపు వాంతులతో స్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించగా, స్వామిని పరీక్షించిన ఆయన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి స్వామిని పరీక్షించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. ట్రైకిల్ పై నుంచి పడినప్పుడు స్వామి తలలో అంతర్గతంగా గాయాలైనట్లు భావిస్తున్నారు. స్వామి మృతిచెందడంతో ఆయన స్వగ్రామం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య ప్రస్తావన రాగానే వెంటనే అంశాల స్వామి గుర్తుకు వస్తారు. దీనితోనే ఫ్లోరైడ్ సమస్యపై జిల్లాలో ఉద్యమం జరిగిన తీరు, అందులో స్వామి పాత్ర ఎంత కీలకమన్నది అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరోసిస్ బాధితుల తరఫున ఆయన ఢిల్లీలో తన గళం వినిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఫ్లోరోసిస్ సమస్య కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అందులో అంశాల స్వామి కీలక భూమిక పోషించారు. అనేక ఏళ్లపాటు ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో భాగస్వామి అయ్యారు. అంశాల స్వామి గర్భస్థ ఫ్లోరైడ్ బాధితుడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల వెంకటమ్మ, సత్యనారాయణకు నలుగురు సంతానం. అందులో పెద్దవాడైన స్వామికి 37 ఏళ్లు. ముగ్గురు చెల్లెళ్లలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే, మరొకరు ఫ్లోరోసిస్తోనే మృతి చెందారు. కాగా, శనివారం సాయంత్రం స్వామి అంత్యక్రియలను నిర్వహించారు. ప్రతిపోరాటంలో ముందున్న స్వామి నదీ జలాల ద్వారానే ఫ్లోరైడ్ సమస్య పీడ విరగడవుతుందన్న భావనతో ఏర్పాటైన జల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ స్వామి కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధానమంత్రులు వాజ్పేయి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవెగౌడ, చంద్రశేఖర్ను కలిశారు. పలువురు ముఖ్యమంత్రులను కలసి ఫ్లోరైడ్ సమస్యను వివరించారు. 17 సార్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. ఐక్యరాజ్యసమితి వరకు ఫ్లోరైడ్ సమస్యను తీసుకెళ్లగలిగారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్ను కలసి ఫ్లోరోసిస్ సమస్యకు కృష్ణా జలాలతోనే పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎన్నికల్లో పోటీ ఫ్లోరైడ్ సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు అంశాల స్వామి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అప్పట్లో నాంపల్లి మండల జెడ్పీటీసీగా పోటీ చేశారు. వారణాసిలో ఎంపీగా పోటీ చేసి సమస్యను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రత్యేక కార్పొరేషన్ కావాలని.. ఫ్లోరోసిస్ బాధితులు మంచానికే పరిమితమై కుటుంబానికి భారమవుతున్నందున ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్పొరేష¯న్ ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ వికలాంగులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని స్వామి అడుగుతుండేవారు. కాగా, శివన్నగూడెం ప్రాజెక్టుకు అంశాల స్వామి పేరు పెట్టాలని జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బ్యాటరీ ట్రైసైకిల్లో డిజైన్ లోపం వల్లనే అంశాల స్వామి ప్రమాదానికి గురై మృతి చెందాడని వారు ఆరోపించారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామికి ఓ సంస్థ ఈ ట్రైసైకిల్ను ఇచ్చిందని వారు తెలిపారు. స్వామి మృతిపై మంత్రి జగదీశ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా ఫ్రాంక్లిన్ ఈవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఫ్రాంక్లిన్ ఈవీ దేశవ్యాప్తంగా డిసెంబర్కల్లా 200 షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ తదితర 30 నగరాల్లో 54 షోరూంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోనే 14 షోరూంలు ఉన్నాయి. 2021లో అమ్మకాలను ప్రారంభించి రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లకు చేరువయ్యామని ఫ్రాంక్లిన్ ఈవీ ఫౌండర్ డాక్టర్ శశిధర్ కుమార్ మంగళవారమిక్కడ తెలిపారు. నెలకు 3,000 యూనిట్లు.. కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయని కో–ఫౌండర్ రంజిత్ కుమార్ తెలిపారు. ‘నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాం. ఇతర దేశాల్లో అడుగు పెడతాం. 2023 చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరాలన్నది లక్ష్యం. ఇందుకు రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. కంపెనీలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్లో ప్లాంటు ఉంది’ అని చెప్పారు. తొలి డ్యూయల్ బ్యాటరీ.. కోరో మోడల్కు డి మాండ్ బాగుందని కో–ఫౌండర్ నవీన్ కుమార్ తెలిపారు. ‘దక్షిణాదిన రిమూవ బుల్ డ్యూయల్ బ్యా టరీతో తయారైన తొలి మోడల్ ఇదే. ఒకసారి చార్జింగ్తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పవర్ ప్లస్, నిక్స్ డీలక్స్ మోడళ్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్కల్లా మరో 2 స్కూటర్లను ప్రవేశపెడతాం. కస్టమర్ల ఇంటి వద్దే సరీ్వస్ అందిస్తున్నాం. 2.1–3 కిలోవాట్ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ రిమూవబుల్ బ్యాటరీలను పొందుపరిచాం. వీటికి ఐక్యాట్–ఏఐఎస్ 156, బీఐఎస్, సీఈ, ఐఎస్వో, ఆర్వోహెచ్ఎస్ ధ్రువీకరణ ఉంది. ధర రూ.75 వేల నుంచి ప్రారంభం’ అని చెప్పారు. -
నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి రూ.90,000 విలువైన..
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్ అనే దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు. దీంతో అతనికి రూ.90,000 విలువైన ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్ సుమిత్కుమార్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్కుమార్ ఆ వాహనాన్ని ఖలీల్కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: (నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల) -
ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కు ఓలా ఎలక్ట్రిక్ గుడ్ న్యూస్ చెప్పింది.డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ టు రిమెంబర్ అంటూ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్పై భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్పై ఈ ఆఫర్ వర్తించదు. అలాగే 10 ఈ స్కూటర్లను ఉచితంగా అందించనుంది. గతంలో అక్టోబర్లోప్రకటించిన ఈ ఆఫర్ను తర్వాత నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్ను డిసెంబర్ 31 2022 వరకు పొడిగించింది. ఓలా ఎస్1 ప్రోపై డిస్కౌంట్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్పై రూ.10వేల తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ స్కూటర్ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,39,999. జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్తో నెలకు కనిష్టంగా రూ.2,499 ఈఎంఐ ఆప్షన్తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయవచ్చు. 8.99 శాతం వడ్డీరేటుతోపాటు, వెహికల్ ఫైనాన్స్పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా లభ్యం. 10 ఎస్1 ప్రో స్కూటర్లు ఉచితంగా పది ఎస్1 ప్రో స్కూటర్లను కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు కాంటెస్టును నిర్వహిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. లక్ష యూనిట్ల విక్రయాలను అత్యంత వేగంగా సాధించిన సంస్థగా ఓలా అవతరించింది, అలాగే ఈ సెగ్మెంట్లో 50 శాతానికి పైగా ఆదాయ మార్కెట్ వాటాతో వరుసగా 3 నెలలో( నవంబరు) కూడా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్గా కూడా అవతరించింది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నవంబర్ 2022లో 20,000 యూనిట్లను దాటేశాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే విస్తరణలో భాగంగా 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా భావిస్తోంది. From winning an Ola 🛵, to endless offers while buying it...if there weren’t enough reasons to switch to the Ola S1, here are some more. Own the #1 EV in India and make it a December to remember! 🎁🥳🎄 #EndICEage ⚡️ pic.twitter.com/8aZyqcy9pq — Ola Electric (@OlaElectric) December 5, 2022 -
100 పైగా షోరూమ్ల ఏర్పాటులో ఈవీయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ ఈవీయం 2023 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూమ్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 1,000 పైచిలుకు ఈవీ స్కూటర్లను విక్రయించినట్లు ఎలీజియమ్ ఆటోమోటివ్స్ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 11 డీలర్షిప్లు ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 8 రాష్ట్రాల్లోని 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాజ్ వివరించారు. కొత్త షోరూమ్లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, ఫైనాన్సింగ్ సేవలు, యాక్సెసరీలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ మెటా4 గ్రూప్లో భాగమైన ఎలీజియం ఆటోమోటివ్స్ .. ఈవీయం బ్రాండ్ కింద మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు తయారు చేస్తోంది. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ బ్రాండ్ యమహా మెటార్ ఇండియా..తనకున్న యూత్ క్రేజ్ను అంతకంతకూ పటిష్టం చేసుకునేలా ఉత్పత్తుల్ని అందిస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో గత ఏడాది ఆర్ 15వి4, ఆర్ 15ఎమ్ వంటి స్పోర్ట్స్ మోడల్స్ను, లిక్విడ్ కూల్ ఇంజన్తో ఎఇఆర్ఒఎక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్ను దేశీయంగా విడుదల చేసింది. మరోవైపు దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఇవి)లకు సంబంధించి, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా, భారతదేశంలోని యమహా కంపెనీ ఇంజనీర్లు జపాన్లోని యమహా హెడ్క్వార్టర్స్లోని బృందం సమన్వయంతో భారతీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్ఫారమ్పై దృష్టి సారించారు. భారతీయ రైడింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా మా మోటార్ / బ్యాటరీ ప్రమాణాలపై మేం మళ్లీ పని చేయాల్సి ఉంటుంది. భారతీయ సరఫరాదారులను ఉపయోగించడం ద్వారా అందుబాటులో ధర నిర్ణయించగలమని ఆశిస్తున్నామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లు ఎల్లప్పుడూ యమహాకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని ఇక్కడి 18–26 ఏళ్ల మధ్య ఉన్న అద్భుతమైన, స్టైలిష్ స్పోర్టీ మోటార్సైకిళ్లను ఇష్టపడే యువ కస్టమర్ల బలమైన ఆదరణతో తాము మార్కెట్ను విస్తరిస్తున్నామన్నారు. -
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కిస్బీ’ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే దేశీయంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా. కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట. లాంచింగ్ ముందు ఇండియాలో ప్రత్యేకంగా తీసుకురానున్న కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది. కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ వచ్చేసింది..సర్ప్రైజ్ ఆఫర్
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్ బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్1 ఎయిర్ను తీసుకురావడం గమనార్హం. రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎస్ 1 ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే లాంచింగ్ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లాంచింగ్ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు. అధునాతన డిజైన్తో అప్డేట్ చేసిన ఎస్1 ఎయిర్ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్తో సహా మూడు రైడింగ్ మోడ్స్లో, అయిదు రంగుల్లో లభించ నున్నాయి. ఏడు అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం. A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 🥳🥳 pic.twitter.com/KmV0DGRs3Z — Ola Electric (@OlaElectric) October 22, 2022 -
బిగాసస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంత?
హైదరాబాద్: బిగాసస్ సరికొత్త బీజీ డీ15 ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. పూర్తి మెటల్ బాడీతో భారత మార్కెట్ కోసం భారత్లోనే తయారు చేసిన స్కూటర్ ఇదని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్తో 115 కిలోమీటర్లు ప్రయాణించే డీ15 రోజువారీ కమ్యూటింగ్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. 16 అంగుళాల అలాయ్ వీల్స్తో బిగాసస్ నుంచి వచ్చిన తొలి స్కూటర్ ఇదే. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, 20కు పైగా బ్యాటరీ భద్రతా సదుపాయాలు, 77 సెంటీమీటర్ల పొడవైన సీట్, సైడ్ స్టాండ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.99,999. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో
సాక్షి, ముంబై: దీపావళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అతి చౌకధరలో కొత్త వేరియంట్ను వినియోగ దారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రూ.80 వేల లోపు ధరకే ఈ కొత్త వేరియంట్ స్కూటర్ను అందుబాటులోకి తేనుందని సమాచారం. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ను కొత్త వేరియంట్ను తీసుకొస్తున్నట్టు కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోంది. తమ అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలో కలుద్దాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా వదిలారు. ఇందులో ఆగస్ట్ 15 ఈవెంట్లో వాగ్దానం చేసినట్లుగా కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్అవుట్గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా. (హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు) ఓలా ఎలక్ట్రిక్ ..ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,999లకు భారత్ మార్కెట్లో ప్రస్తుతం లభిస్తోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీఎస్ జూపిటర్ , సుజుకి యాక్సెస్ వంటి ప్రముఖ 125సీసీ స్కూటర్లకు పోటీ ఇస్తోంది. దీనికితోడు హీరో మోటాకార్స్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడా బ్రాండ్ కింద రెండు వేరియంట్లలో విడా వీ1, వీ1 ప్రొను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. Our Diwali event will be on 22nd Oct. One of the biggest announcements ever from Ola. See you soon! pic.twitter.com/389ntUnsDe — Bhavish Aggarwal (@bhash) October 8, 2022 -
హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్లు ప్రారంభమవుతాయి. బుకింగ్లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్లతో పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హోండా ఈవీ స్కూటర్ వచ్చేస్తోంది.. యాక్టివాకంటే తక్కువ ధరలో
సాక్షి,ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు,హోండా మోటార్సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను అతి త్వరలో విడుదల చేయనుంది. యాక్టివా కంటే తక్కువ ధరతో హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుండటం విశేషం. సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లే లక్క్ష్యంగా దీన్ని లాంచ్ చేయనుంది. (డిష్ టీవీ ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!) తాజా నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్తో నడిచే ప్రస్తుత తరం యాక్టివా కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా వెల్లడించారు. స్థానిక మార్కెట్ నుండి విడిభాగాలను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను తక్కువగా అందించనుందట.అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీని మార్చుకునే సదుపాయంతో వివిధ మోడళ్లలో తీసుకురానుందని అంచనా. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ చేస్తుంది. (ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ) దశాబ్దం చివరి నాటికి ఈ విభాగంలో 30శాతం వాటానుటార్గెట్గా పెట్టుంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్టంగా గంటకు 60 కి.మీ. మించదట. అలాగే 72,000-75,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. కాగా ప్రస్తుతం, ఎలక్ట్రిక్ టూ వీలర్ స్పేస్లో కేవలం బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ టూ వీలర్ బ్రాండ్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటితోపాటు ఒకినావా, అథర్ ,ఓలా వంటి స్టార్టప్లు తమ హవాను చాటుకుంటున్నాయి. తాజా హోండా కూడా ఎంట్రీ ఇస్తుండటంతో మారుతి సుజుకీ సహా దాదాపు అన్నీకంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనున్నాయి. ఇటీవల యమహా ఇండియాఎలక్ట్రిక్ స్కూటర్లపై పని చేస్తున్నట్లు ప్రణాళికలను ధృవీకరించిన సంగతి తెలిసిందే. -
కూలింగ్తో ఈ–బైక్స్ ఫైరింగ్కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్తో ఫైరింగ్కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్లో ఈ–బైక్స్కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్బాబు వివరించారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు,బైక్స్తో ఎల్ఎంఎల్ కొత్త ఇన్నింగ్స్
సాక్షి,ముంబై: టూవీలర్ మార్కెట్లో సంచలనం ఎల్ఎంఎల్ (లోహియా మెషీన్స్ లిమిటెడ్) స్కూటర్స్ గుర్తున్నాయా? ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-స్కూటర్లతో మళ్లీ మర్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధునిక డిజైన్, రెట్రో లుక్లో ఈ-స్కూటర్లు, బైక్స్ను లాంచ్ చేయనుంది. కాన్పూర్కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ యాజమాన్యం కింద, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తన కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్తో మూడు వాహనాలను పరిచయం చేయనుంది. బైక్స్, ఇ-స్కూటర్లు రెండింటికీ సంబంధించి ప్రకటన ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ బైక్లు 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. అంతేకాదు వీటిని దేశీయ మార్కెట్కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. రానున్న 3-5 ఏళ్లలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హర్యానా మనేసర్లోని హార్లే-డేవిడ్సన్ తయారీ యూనిట్లోనే ఈ బైక్లను ఉత్పత్తి చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000ఎల్ఎమ్ఎల్ డీలర్షిప్లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది. కాగా 90లలో ఎల్ఎంఎల్ వెస్పా పేరు తెలియని వారుండరు. 100 సీసీ శ్రేణితో బజాజ్ స్కూటర్లతో పెద్ద పోటీనే ఉండేది. ఈ పోటీని తట్టుకోలేక 2018లో మూతపడింది ఎల్ఎంఎల్. -
రూబీ లాడ్జ్: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు
సాక్షి, రాంగోపాల్పేట్: సికింద్రాబాద్లోని రూబీ లాడ్జ్లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక, లాడ్జీ లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. దీంతో లాడ్జీలో ఉన్న వారంతా మెట్ల మార్గంలో కిందకు రాలేకపోయారు. దట్టమైన పొగ కారణంగా హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనం ఉన్న 9 మందిని కాపాడినట్టు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలానికి క్లూస్ టీమ్, స్థానిక తహసీల్దార్ కూడా చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కారణాలపై విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాదంలో స్పాట్లోని ముగ్గురు చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కాగా, మృతదేహాలు గాంధీ ఆసుప్రతిలో ఉండగా.. మరికొందరు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక, మృతుల్లో విజయవాడకు చెందిన హారీశ్, ఢిల్లీకి చెందిన వీరేందర్, చెన్నైకి చెందిన సీతారామన్, పలువురు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదం అనంతరం పోలీసులు.. రూబీ లాడ్జీని సీజ్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారి రంజిత్ సింగ్పై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు చేపటినట్టు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హోటల్లో బస చేసిన కొందరి పేర్లు ఇవే.. 1) అబ్రహం వాల్తాలా 2) ఆర్త్ పటేల్ 3) మహేందర్ సింగ్ భట్ 4) అశ్వని శిలా 5) ఠాకూర్ 6) పృథ్వీరాజ్ 7) చందన్ ఈతి 8) అషోత్ మామిదువాట్ 9) దేబాషిస్ గుప్త 10) ఇర్ఫాన్ ఉస్మా 11) అశుతోష్ సింగ్ 12) మొహమ్మద్ జావిద్ 13) లావర్ యాదవ్ 14) సునీల్ కుమార్ 15) వర్మ 16) బిన్ శియల. -
ఎలక్ట్రిక్ స్కూటర్కు ‘పొల్యూషన్’ జరిమానా.. నవ్వులపాలైన పోలీసులు
మలప్పురం: పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్కు పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదని జరిమానా విధిస్తే?! కేరళ పోలీసులు ఇదే పనిచేసి నవ్వులపాలయ్యారు. మలప్పురం జిల్లాలో కరువరాకుండు పోలీసు స్టేషన్ పరిధిలోని నీలాంచెరీలో గతవారం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్పై వస్తుండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపేశారు. పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ చేతిలో పెట్టి, రూ.250 వసూలు చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల నిర్వాకంపై జోకులు పేలాయి. టైపింగ్ మిస్టేక్ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. స్కూటర్ యజమాని డ్రైవింగ్ లైసెన్స్ చూపించలేకపోయాడని చెప్పారు. మెషిన్లో తప్పుగా టైప్ చేయడంతో పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ వచ్చిందని అన్నారు. -
40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్లో తన మార్క్ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని భారత రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్ మోడల్తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్లో 200, 350సీసీ ఇంజిన్స్తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి. కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్ మార్కెట్లో ఈ స్కూటర్ బ్రాండ్కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్, లుక్, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్లు హై-ఎండ్ మోడల్స్గా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్ను భారత్లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. -
భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సత్తా చాటుతున్నాయి. అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈవీ వెహికల్స్లో లోపాలు తలెత్తినా తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల్ని నివారించ వచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఓలా ఎస్1 కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే ఈవీ వెహికల్స్ స్కూటర్ల జాబితాలో ఓలా నిలిచింది. ఓలా ఎస్1 121కేఎం స్పీడ్, ఓలా ఎస్ 1 ప్రో 181కేంఎ స్పీడ్ను కలిగి ఉంది. ఓలా ఎస్1 టాప్ స్పీడ్ గంటలకు 115కేఎంపీఎహెచ్ వేగంతో వెళ్లొచ్చు. ఈ వెహికల్ 0కిలో మీటర్ల నుండి 40కిలోమీటర్ల చేరుకోవడానికి 3 సెకన్ల సమయం పడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ వెహికల్స్లో ఎలక్ట్రిక్ వాహనాలు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్ ఆప్షన్లు, క్రూయిజ్ మోడ్ ఫీచర్ల ఉన్నాయి. 10 వేరియంట్ కలర్స్లో లభ్యం అవుతుంది. అథర్ ఎనర్జీ 450ఎక్స్ జనరేషన్ 3 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ జాబితాలో అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు పేరు గడించాయి. వీటి రైడింగ్ రేంజ్ 146 కిలోమీటర్లకు 8.7బీపీహెచ్ పవర్ను ప్రొడ్యూజ్ చేస్తుంది. అథర్ ఎనర్జీ డిజైన్ చేసిన ఈ స్కూటర్లో డిజిట్ డ్యాష్ బోర్డ్, టైర్ ప్రెజర్ మానిటర్, మ్యాప్, కాలింగ్ డీటెయిల్స్తో పాటు ఇతర సదుపాయాలుండగా.. ఈ స్కూటర్ మోస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో నిలిచింది. ఓకినావా ఒకి 90 ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావాకు చెందిన ‘ఓకినావా ఒకి 90’ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో సిగ్నల్స్, వెహికల్స్ ఓవర్ టేక్ చేసే సమయంలో వాహనదారుల్ని సురక్షితంగా ఉంచేలా డే టైం రన్నింగ్ లైట్స్, ఫాస్ట్ ఛార్జింగ్, 140కేఎం రైడింగ్ రేంజ్, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 16 అంగుళాల వీల్తో ..లార్జెస్ట్ వీల్ సెగ్మెంట్లో ఈ వెహికిల్ నిలిచింది. దీంతో పాటు బూట్ స్పేస్ 40 లీటర్ల సౌకర్యం ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో హీరో ఎలక్ట్రిక్ డిఫరెంట్ డిజైన్లతో వెహికల్స్ను విడుదల చేస్తుంది. వాటిలో హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ ప్రత్యేకం. ఈ వెహికల్స్లో మ్యాక్సిమం రైడింగ్ రేంజ్ 85కేఎం ఉండగా టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్గా నిలిచింది. ఈ స్కూటీలో యాక్సిలేటర్తో పనిలేకుండా స్థిరమైన వేగంతో నడింపేందుకు ఉపయోగపడే క్రూయిస్ కంట్రోల్, డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్, బ్లూటూత్ ట్రాకింగ్, ఫాలోమీ హీడ్ ల్యాంప్, ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.72వేలుగా ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ సైతం హీరో ఎలక్ట్రిక్ సంస్థ వెహికల్స్లో మోస్ట్ పాపులర్ బ్రాండ్గా పేరు సంపాదించింది. ఈ స్కూటర్ను సింగిల్ ఛార్జ్తో 140కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. డిటాచ్బుల్ ఎలక్ట్రిక్ బ్యాటరీ. ఈ సౌకర్యంతో మీ పనిపూర్తయిన వెంటనే వెహికల్ నుంచి ఆ బ్యాటరీని వేరే చేయొచ్చు. టాప్ స్పీడ్ 45కేఎంపీహెచ్ ఉన్న ఈ స్కూటర్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,యూఎస్బీ పోర్ట్ సౌకర్యం ఉంది. చదవండి👉 రతన్ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్! ఎనిమిదేళ్ల తర్వాత.. -
బీడీల కంపెనీ ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా...
దుబ్బాక: లంగర్ బీడీ కంపెనీ ఎదుట పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన దోర్నాల హరిబాబు బీడీ కంపెనీ టేకేదార్గా పని చేస్తున్నాడు. ఏడాది కిందట పట్టణంలోని ఓ వాహన షోరూం నుంచి ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ప్రతీరోజు బీడీల గంపను స్కూటీపై పెట్టుకొని రామక్కపేట నుంచి లచ్చపేట లంగర్ బీడీ కంపెనీకి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం స్కూటీని కంపెనీ ఎదుట నిలిపి ఉంచగా, స్కూటీ బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా దగ్ధమ వడంతోపాటు పక్కనే నిలిపి ఉన్న సైకిల్ పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. -
ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ స్కూటర్ సేవా లోపంతో మానసిక వేదనకు గురైన ఫిర్యాదు దారుడికి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఊరట లభించింది. లోప భూయిష్టమైన పాత వాహనం స్థానంలో కొత్త స్కూటర్ ఇవ్వడం.. లేదంటే స్కూటర్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం, మరమ్మతు ఖర్చులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రూ.77,657ను 6 శాతం వడ్డీతో వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించాలంటూ కిషోర్కుమార్, నారాయణరెడ్డి, నజీమాకౌర్తో కూడిన కర్నూలు జిల్లా కమిషన్ ఈనెల 25న తెలుగులో తీర్పు వెలువరించింది. ఫిర్యాదీ కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శంకరశర్మ మానసిక వేద నకు గురైన కారణంగా రూ.10 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేలు అదనంగా అందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు నజీమా కౌర్ తీర్పు చదవి వినిపించారు. శంకరశర్మ రాజస్థాన్లోని ఒకినావా ఆటో టెక్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని 2018 మే నెలలో రూ.72,900కు కొనుగోలు చేయగా.. అదే ఏడాది ఆగస్టులో డెలివరీ చేశారు. కొన్నప్పటి నుంచీ వాహనం మొరాయించేది. మరమ్మతులు చేసినా ఫలి తం లేపోయింది. ఈ క్రమంలో ఆయన తనకు న్యాయం చేయాలంటూ 2021 సెప్టెంబర్ 25న కమిషన్ను ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్ ఈ నెల 10న తుది విచారణ చేపట్టి.. తయారీసంస్థతోపాటు ఇద్దరు డీలర్లు కొత్త వాహనం లేదా తాము సూచించిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్ స్కూటర్, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 (Ola S1)ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్తో 500 పైగా కిలోమీటర్లు!
ముంబై: ఇండియన్ మల్టీనేషన్ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్ను ఆవిష్కరించనుంది. ఆగస్టు 15న స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారుతో పాటు స్కూటర్ను కూడా కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఓలా ఆవిష్కరించనున్న స్పోర్టీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సమాచారం. ఇందుకోసం మెరుగైన ఆధునాతన బ్యాటరీలను వాడుతున్నారని తెలిసింది. లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అత్యుత్తమంగా స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించినట్టు ‘కార్ అండ్ బైక్’ వెల్లడించింది. (క్లిక్: Swift S-CNG వచ్చేసింది.. ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) కాగా, తమ తాజా ఆవిష్కరణలకు సంబంధించి ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆగస్టు 15న తాము ఏం ఆవిష్కరించబోతున్నామో ఊహించగలరా అంటూ ట్విటర్లో పోల్ కూడా పెట్టారు. స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయబోతున్నారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తక్కువ రేటుతో కొత్త ఎస్1 తెస్తున్నారని మరికొంత మంది పేర్కొన్నారు. ఓలా సెల్ ఫ్యాక్టరీ, సరికొత్త కలర్లో ఎస్1 ఆవిష్కరిస్తారని ఇంకొందరు ఊహించారు. (క్లిక్: కియా మరోసారి అదరగొట్టింది) -
ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్లకు భారీ షాకిచ్చిన బజాజ్
సాక్షి, ముంబై: బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కి షాక్ ఇచ్చింది. భారతదేశంలో తన ద్విచక్ర వాహనాల పోర్ట్ ఫోలియోలో చాలా వాటిపై భారీగా ధరలను పెంచింది. పల్సర్ అవెంజర్ బైక్లతోపాటు, ఎలక్ట్రిక్ స్కూటర్ - చేతక్ ధరలను కూడా గణనీయంగా పెంచింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్పై ధరను 9 శాతం పెంచింది. దీని ధరను 12,749 రూపాయలు పెంచింది. పుణేలో (ఎక్స్-షోరూమ్) 1.41 లక్షలతో రూపాయలతో పోలిస్తే ప్రస్తుత ధర 1.54 లక్షలుగా ఉంది. అయితే, ధర పెరిగినప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్, ఫీచర్లును అలానే ఉన్నాయి. కాగా 2019లో బజాజ్ అకుర్దిలోని పూణే ప్లాంట్లో చేతక్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 75 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను విక్రయిస్తోంది. అప్పటినుంచి 14,000 యూనిట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. -
ఎల్లీసియం మేడిన్ ఇండియా ‘ఈవీయం ఈ-స్కూటర్లు’ త్వరలోనే
సాక్షి, ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘ఈవీయం’ అనే బ్రాండ్ పేరుతో మూడు మేడ్ ఇన్ ఇండియా ఈ-స్కూటర్లను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. 250 ఏకరాల్లో తెలంగాణలోని జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లోనే వీటిని తయారు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ పంచామృత విజన్తో ఇ-మొబిలిటీ మిషన్లో ఎల్లీసియం ఆటోమోటివ్స్ 100 శాతం భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ను లాంచ్ చేశామని వెల్లడించింది. అలాగే EVeium సొంత టెలిమాటిక్స్ యాప్ అందజేస్తుందని, ఇది డీజీ-లాకర్, సమీప ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, జియో-ఫెన్సింగ్ లాంటి ఫీచర్లను అందిస్తుందని పేర్కొంది. గ్లోబల్ ఇంధన ధరల సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ అవగాహనతో దేశీయ మార్కెట్లో మూడు ఈ-స్కూటర్లను పరిచయం చేస్తున్నామని సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్లతో సహా అత్యుత్తమ EV ఆఫర్లను అందించడానికి పని చేస్తుందన్నారు. భారత ప్రహుత్వ ఫేమ్-II నిబంధనలకనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం సరసమైన ధర, నాణ్యతతో ఈవీలను తీసుకురావాలని భావిస్తున్నట్టు META4 గ్రూప్ సీఈవో ముజమ్మిల్ రియాజ్ అన్నారు. తెలంగాణలో ఈ-వెహికల్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా స్మార్ట్ గ్రీన్ మొబిలిటీలోవోల్ట్లీ ఎనర్జీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 15ఎకరాల సబ్సిడీ భూమిని అందిస్తున్న ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఓలా ఫ్యాక్టరీ టూర్.. ఎప్పుడంటే?
అతి తక్కువ కాలంలోనే ఇండియన్ మార్కెట్పై చెరగని ముద్ర వేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లు ఉన్నాయి ఈ స్కూటర్ కోసం. డెలివరీ, సర్వీసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తంగా ఓలా స్కూటర్కి క్రేజ్ అయితే తగ్గలేదు. కాగా తమ కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చారు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉంది. భారీ ఎత్తున ఇక్కడ స్కూటర్లు తయారు చేస్తున్నారు. తమ కస్టమర్లు స్కూటర్లు ఎలా తయరవుతున్నాయో నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు భవీశ్ అగర్వాల్. 2022 జూన్ 19 ఆదివారం ఓలా ఫ్యాక్టరీలో ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన వెయ్యి మంది కస్టమర్లను పిలవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సంఖ్యపై పరిమితి ఎత్తేశారు. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు యాభై వేల మందికి పైగా డెలివరీ అయ్యాయి. వీరందరూ ఈవెంట్కు రావొచ్చంటూ భవీశ్ ట్విటర్లో పేర్కొన్నారు. For our customer event at the Ola Futurefactory on Sunday 19th June, earlier plan was to invite 1000 customers. Now we’ve decided to invite ALL our Ola S1 customers, more than 50,000! We’ll have a factory tour, customer celebrations and MoveOS 2 launch!!#EndICEAge pic.twitter.com/WSiJZnQVV9 — Bhavish Aggarwal (@bhash) June 11, 2022 చదవండి: కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం! -
సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది. దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్లో పెట్టాడు. అయితే అనూహ్యంగా బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. చదవండి: ట్యాంక్బండ్పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
‘హీరో’ ఆఖరికి నువ్వు కూడా ఇంతేనా?!
దేశమంతటా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు, ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా.. ప్రముఖ కంపెనీల నుంచి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు రావడం లేదు. ముఖ్యంగా టూవీలర్ సెగ్మెంట్లో ఈ సమస్య ఉంది. ఇప్పటికే టీవీఎస్, బజాజ్, ఓలాలు మార్కెట్లోకి వచ్చినా అందరి చూపు దేశీ టూ వీలర్ రారాజు హీరో మోటార్ కార్ప్ నుంచి రాబోతున్న విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదనే ఉంది. ఫస్ట్లుక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్కి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హీరో సంస్థ విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి తేబోతున్నట్టు గతేడాది ప్రకటించింది. హీరో పదో వార్షికోత్సవం సందర్భంగా పవన్ ముంజాల్ విడా పక్కన నిల్చుని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని అంచనాలను రెట్టింపు చేశారు. ముందుగా జులై హీరో విడాకు సంబంధించి ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ స్కూటర్ వస్తుందా? ఎప్పుడు సొంతం చేసుకుందామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. చివరకు 2022 జులైలో ఈ స్కూటర్ను రిలీజ్ చేయబోతున్నట్టు ఫీలర్ వదిలింది హీరో. ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో తిరుగులేని హీరో నుంచి ప్రకటన పట్ల పోటీ సంస్థలు ఆసక్తి చూపించాయి. సారీ ఫ్యాన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్పై పెట్టుకున్న ఆశలపై చివరకు నీళ్లు గుమ్మరించింది హీరో మోటార్ కార్ప్. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయని చెబుతూ 2022 జులైలో హీరో విడా రావడం లేదంటూ ప్రకటించింది. నిరాశ పరచం స్కూటర్ తయారీలో ఉపయోగించే కాంపోనెంట్స్ కొరత కారణంగా సకాలంలో విడా మార్కెట్లోకి రావడం లేదంటూ హీరో మోటార్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ కస్బేకర్ ప్రకటించారు. ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా విడాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయబోమంటూ తెలిపారు. చదవండి: బిజినెస్ ‘బాహుబలి’ భవీశ్ -
ఈవీ ప్రమాదాలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్ కారణం కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి తొలుత. అయితే కారణం అది కాదని డీఆర్డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్డీవో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్సైకిల్ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో.. కంపెనీల వైఖరి బయటపడడంపై మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో చూడాలి. -
హైదరాబాద్లో టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆన్రోడ్ ధర ఢిల్లీలో రూ.98 వేల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 100–140 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్లో మూడు చార్జింగ్ ఆప్షన్స్, 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, క్లీన్యూఐ, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్సెట్, ఇన్ట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్డేట్స్, ఫాస్ట్ చార్జింగ్, మల్టిపుల్ బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ, 32 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం వంటి హంగులు ఉన్నాయి. రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 33 నగరాల్లో ఐక్యూబ్ లభిస్తుంది. త్వరలో మరో 52 నగరాలను జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. చదవండి: ‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్వ్యాగన్లు -
బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ అయితే కష్టం.. భవీశ్కి ఎన్ని తిప్పలో..
కార్పోరేట్ ప్రపంచంలో బ్రాండ్ వ్యాల్యూ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని కంపెనీలు ఈ బ్రాండ్ వ్యాల్యూ సాధించేందుకు ఏళ్లకేళ్లు కష్టపడతాయి. ఒక్కసారి బ్రాండ్ ఇమేజ్ వచ్చాక దాన్ని కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తాయి. తాజాగా ఓలా బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ నడుం బిగించాడు. గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూశారు. 2021 అక్టోబరు నుంచి 2022 మార్చి వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్థుకుపోయారు. ఓలా బ్రాండ్పై నమ్మకం కనబరిచారు. కష్టాలు మొదలు వేసవి ఆరంభం కావడంతోనే ఓలాకు కష్టాలు వచ్చిపడ్డాయి. మొదట పూనేలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి తగలబడిపోయింది. ఆ తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో ఓలాతో పాటు ఇతర ఈవీ స్కూటర్లు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకోవడం మొదలైంది. మరోవైపు కొన్ని స్కూటర్లలో బ్యాటరీ ఛార్జింగ్ తదితర సమస్యలు వెంటాడాయి. కానీ వీటిని సకాలంలో పరిష్కరించడంలో ఓలా విఫలమైంది. ఫలితంగా ఒక యూజర్ తన ఓలా స్కూటర్ను గాడిదతో కట్టి ఊరేంగిచగా మరొకరు పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఏకీ పారేస్తున్నారు ఈవీ స్కూటర్లలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలకు పై రెండు ఘటనలు తోడవటం ఓలాకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఓలా కస్టమర్ కేర్ తీరును ఎండగడుతూ కొందరు, డెలివరీలో ఆలస్యాన్ని నిరసిస్తూ మరికొందరు, ముందుగా చెప్పిన ఫీచర్లు ఎప్పుడు అన్లాక్ చేస్తారంటూ మరికొందరు ఓలాను ఏకీ పారేస్తున్నారు. దీంతో బ్రాండ్కు చెడ్డ పేరు రాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు భవీశ్ అగర్వాల్ అప్రమత్తమైన భవీశ్ ఓలా స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని చెబుతూనే ఈ ఏడాది ఏప్రిల్లో ఓలా ఇండియాలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్గా మారిందంటూ వివరించారు. ఆ తర్వాత రోజు ప్రధానీ మోదీ కంటే కూడా మమ్మల్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి కంపెనీలు మా మీద విషం చల్లడం ఆపి వాళ్ల పని చూసుకుంటే బెటర్ అంటూ తమపై వస్తున్న విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. డ్యామేజ్ కంట్రోల్ యత్నాలు తాజాగా గిగ్ ఎకానమీగా రోజురోజుకు పెరుగుతున్న డెలివరీ సర్వీసులను ఉద్దేశిస్తూ ప్రపంచంలోనే డెలివరీ సర్వీసులకు ఓలా స్కూటర్లు ఉత్తమం అంటూ ఓ ఫోటోను జోడించి ట్వీట్ చేశారు. డెలివరీ బ్యాగును వీపుకు మోయం కాకుండా స్కూటర్ ముందు భాగంలో పెట్టుకోవచ్చని అక్కడ కావాల్సినంత లెగ రూమ్ ఉందన్నట్టుగా ఫోటోలో చూపారు. మొత్తంగా నలువైపులా ఓలాపై వస్తున్న విమర్శలు భవీశ్ అగర్వాల్లో కాక రేపాయి. దీంతో బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. Probably the best looking food delivery vehicle in the world 😍 pic.twitter.com/611oc2JOoc — Bhavish Aggarwal (@bhash) May 4, 2022 చదవండి: Bhavish Aggarwal: ఆ విషయంలో ప్రధాని మోదీ కంటే నేనే తోపు! -
ఈవీ టూ వీలర్ మార్కెట్లో నంబర్ వన్ ఓలా
వివాదాలు ఎన్ని చుట్టు ముట్టినా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ క్రేజ్ తగ్గడం లేదు. కస్టమర్ సర్వీస్ చెత్తగా ఉందంటూ రోజుకు ఫిర్యాదులు వస్తున్నా అదే స్థాయిలో స్కూటర్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి. మొత్తంగా మార్కెట్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపే దేశంలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్గా ఓలా అవతరించింది. 2021 ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత అక్టోబరు చివరి వారం నుంచి డెలివరీలు చేస్తున్నారు. గత ఆరేడు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓలా స్కూటర్ల అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్ వాహన్లో ఉన్న వివరాల ప్రకారం 2022 ఏప్రిల్లో 12,869 ఓలా స్కూటర్లు దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ రెండో స్థానానికి పడిపోయింది. ఓలా తర్వాత స్థానంలో 10,000 టూ వీలర్ల రిజిస్ట్రేషన్లతో ఒకినావా ద్వితీయ స్థానంలో ఉంది. ఇక యాభై శాతం అమ్మకాలు పడిపోగా ఏప్రిల్లో హీరో ఎలక్ట్రిక్ 6,571 స్కూటర్ల అమ్మకాలు జరిపి మూడో స్థానానికి పరిమితమైంది. నాలుగో స్థానంలో అథర్, ఐదో స్థానంలో యాంపియర్ ఈవీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఓలా సీఈవీఓ భవిశ్ అగర్వాల్ స్పందిస్తూ.. ప్రత్యర్థి కంపెనీలు మాపై చెడు ప్రచారం చేయడం ఆపి వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బెటర్ అంటూ ట్వీట్ చేశారు. Ola market share: No.1! We’re shaking up the incumbents and vested interests. They better focus on their products rather than fake narratives against us! Customers and markets have voted for facts and truth. We’re just getting started.#EndICEAge #MissionElectric pic.twitter.com/v5ZTc4lj0b — Bhavish Aggarwal (@bhash) May 2, 2022 ఓలా ఎలక్ట్రిక్ కారు రూ.10 లక్షలు? త్వరలోనే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి తెస్తామంటూ ఓలా ప్రకటించింది. ఇండస్ట్రీ వర్గాల అంచానా ప్రకారం ఈ కారు 2023 చివర్లో లేదంటే 2024 ఫస్ట్ క్వార్టర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి దేశీయంగా తయారు చేసిన ఈ ఈవీ కారుని ఓలా పరిక్షీస్తోంది. మార్కెట్లో వచ్చే నాటికి ఒక కారు ధర కనిష్టంగా రూ. 10 లక్షల దగ్గర ఉండేలా ఓలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. చదవండి: Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం..! -
Electric Scooter: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్
బనశంకరి: కర్ణాటకలోని బెంగళూరులో ఆనేకల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైన ఘటన శనివారం జరిగింది. జూజువాడికి చెందిన సతీశ్ అనే కార్మికుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకుని బొమ్మసంద్ర వద్ద గల పారిశ్రామికవాడలో ఉద్యోగానికి బయలుదేరాడు. కొంతదూరం ప్రయాణించగానే స్కూటర్ బ్యాటరీలో నుంచి పొగలు, మంటలు రావడంతో దానిని రోడ్డు పక్కన నిలిపేశాడు. క్షణాల్లో స్కూటర్ కాలిపోయింది. స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: యువతి డెడ్ బాడీ కలకలం.. వీడియో వైరల్ -
మీ చెత్త సర్వీస్ భరించడం నా వల్ల కాదు.. చివరికి ఏం జరిగిందంటే?
దేశ ప్రజలు ముఖ్యంగా టూ వీలర్ ఉన్న వారిలో నూటికి తొంభై మంది ఎలక్ట్రిక్ బైకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశారు. కానీ నాణ్యతా లోపాలు, సమస్యకు పరిష్కారం చూపని కస్టమర్ కేర్ సర్వీసులతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కస్టమర్ ఈవీ స్కూటర్ వల్ల ఎదురవుతున్న ఒత్తిడి తట్టుకోలేక పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తమిళనాడులో అంబుర్కి చెందిన పృధ్విరాజ్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. 2022 జనవరిలో ఓలా స్కూటర్ అతనికి డెలివరీ అయ్యింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున సంతోషం అతనిలో ఎక్కువ కాలం నిలవలేదు. బ్యాటరీ మేనేజ్మెంట్లో లోపాల కారణంగా ఆ స్కూటర్ దారి మధ్యలోనే ఆగిపోయేది. కంపెనీ సింగిల్ ఛార్జ్తో 181 కిలోమీటర్ల దూరం వస్తుందని చెప్పగా ఎప్పుడూ 60 కి.మీలకు మించి వచ్చింది లేదని పృధ్విరాజ్ అంటున్నాడు. 90 పర్సంట్ చూపించే బ్యాటరీ క్షణాల్లోనే జీరోకి చేరుకునేది. దీంతో ఎన్నోసార్లు నడిరోడ్డుపై నిలబడి పోవాల్సి వచ్చేది. కస్టమర్ కేర్ విఫలం ఈ క్రమంలో అనేక సార్లు తన స్కూటర్ సమస్యను పరిష్కరించాలంటూ పృధ్విరాజ్ ఓలా కస్టమర్ కేర్ను వేడుకున్నాడు. వందల కొద్ది కాల్స్, మెసేజ్ చేశారు. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. ఆఖరికి సోషల్ మీడియాలో ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ను ట్యాగ్ చేస్తేనే అప్పుడప్పుడు రెస్పాన్స్ వచ్చేది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరికేది కాదు. ఒత్తిడి భరించలేక ఇలా అనేక ఇబ్బందుల నడుమ ఓలా స్కూటర్తో ప్రయాణం చేస్తున్నాడు పృధ్విరాజ్. ఈ క్రమంలో 2022 ఏప్రిల్ 26న ఓలా స్కూటర్తో బయటకు వెళ్లగా దారి మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి వాహనం ఆగిపోయింది. తనకు తక్షణ సాయం అందివ్వాలంటూ ఎంతగా వేడుకున్నా ఓలా కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన రాలేదు. నడిరోడ్డులో అది ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఆగిపోయిన బైకుతో గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం రాకపోవడంతో పృధ్విరాజ్లో ఆక్రోషం కట్టలు తెంచుకుంది. నాలుగు నెలలుగా పడుతున్న ఇబ్బందులకు ఏదో రకంగా పులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. దీంతో రెండు లీటర్ల పెట్రోలు కొనుక్కుని వచ్చి ఓలా స్కూటర్పై పోసి ఆ తర్వాత నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న స్కూటర్ను వీడియో తీశాడు. దృష్టి పెట్టండి ఓలా స్కూటర్తో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఓలా కస్టమర్ కేర్ స్పందించిన తీరును ఏకరువు పెడుతూ ట్విటర్లో ఫోటోలు, స్క్రీన్షాట్స్తో సహా షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది. బ్యాటరీ పేలిపోవుడు సమస్యలకు తోడు కొత్తగా కస్టమర్ సపోర్ట్ అందివ్వడంలోనూ ఈవీ సంస్థలు విఫలమవుతున్నాయనే అభిప్రాయం నెలకొంటుంది. ఇప్పటికైనా ఈవీ సంస్థలు వాహనాల నాణ్యత, కస్టమర్ సపోర్ట్పైన దృష్టి పెడితే మంచిది. @OlaElectric @Hero_Electric @atherenergy @bhash awaited for long time frustrated with your idiotic service it’s show time thank u pic.twitter.com/pFNGSEkySw — Prithv Raj (@PrithvR) April 26, 2022 చదవండి: మా దగ్గర డబ్బులు తీసుకుని.. మా ఇబ్బందులు పట్టించుకోరా ? -
కంపెనీలు జాగ్రత్త! కస్టమర్లతో పెట్టుకోవద్దు
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్కి కొత్త ఊపు తీసుకొచ్చిన బ్రాండ్గా ఓలాకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలని లక్షల మంది కలలుకన్నారు. ఓలా స్కూటర్ కోసం ఫ్రీగా మౌత్ పబ్లిసిటీ కూడా చేశారు. ఇదే సమయంలో తమ ఇబ్బందులు పట్టించుకోకపోతే ఆగ్రహం కూడా అదే స్థాయిలో కస్టమర్లు కూడా చూపిస్తారు. మూడు రోజుల మురిపెం మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని పర్లికి చెందిన సచిన్ గిట్టే అనే వ్యాపారి 2021 సెప్టెంబరులో ఓలా స్కూటర్ను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల నిరీక్షణ తర్వాత 2022 మార్చి 26న అతనింటికి ఓలా స్కూటర్ డెలివరీ అయ్యింది. నాలుగు రోజుల పాటు బాగానే నడిచిన స్కూటర్ ఆ తర్వాత ముందుకెళ్లనంటూ మొరాయించడం మొదలెట్టింది. కస్టమర్ కేర్ నిర్లక్ష్యం తన స్కూటర్కి వచ్చిన సమస్యను పరిష్కరించాలంటూ అనేక సార్లు కస్టమర్ కేర్ను సంప్రదించడు సచిన్ గిట్టే. ఒకసారి మెకానిక్ వచ్చి చూసి వెళ్లాడు కూడా. అయినా స్కూటర్లో తలెత్తిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మళ్లీ కస్టమర్ కేర్ను సంప్రదిస్తే ఇసారి అటునుంచి సరైన సమాధానం లభించకపోగా కఠువైన మాటలు వినాల్సి వచ్చింది. వినూత్న నిరసన నాణ్యత పాటించకుండ స్కూటర్ తయారు చేయడమే కాకుండా లక్ష రూపాయలు వెచ్చించిన కొనుగోలుదారుడి హక్కులను గుర్తించకపోవడంతో సచిన్ గిట్టే మనస్తాపం చెందాడు. దీంతో ఓలా స్కూటర్ తయారీదారులకు ప్రత్యేక పద్దతిలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. గాడిదతో 2022 మార్చి 24న ఓలా స్కూటరకు తాళ్లు కట్టాడు. ఆ తాళ్ల మరో చివర ఓ గాడిదకు కట్టాడు. ముందు గాడిద నడుస్తుంటే వెనుకాలే స్కూటర్ను తోసుకుంటూ పర్లీ పట్టణ వీధుల్లో నిరసన క్యాక్రమం చేపట్టాడు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులు కాలిపోతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో ఈ వినూత్న నిరసన ప్రజల కంట పడింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్క రోజు వ్యవధిలోనే ట్రెండింగ్ వార్తగా మారిపోయింది. చదవండి: Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం..! View this post on Instagram A post shared by LetsUpp Marathi (@letsupp.marathi) -
అన్నీ పరిస్థితులను తట్టుకునేలా.. యమహా ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్ ఎంతంటే..?
Yamaha E01 Electric Scooter: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్స్ సిద్దమవుతోంది. తాజాగా యమహా తన కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈ01ను పరీక్షించడం మొదలుపెట్టింది. థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా ఈ01 లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా..! యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ01ను అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా రూపొందించనుంది. అందుకోసమే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ01ను పరీక్షించనుంది. రానున్న రోజుల్లో యూరప్, జపాన్లో కూడా ఈ స్కూటర్పై పరీక్షలు నిర్వహించనున్నారు. సిటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ డిజైన్ చేసింది యమహా. రేంజ్ విషయానికి వస్తే.. యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ సహాయంతో 5000 ఆర్పీఎం వద్ద వద్ద 8.1 kW మరియు 1,950 rpm వద్ద 30.2 Nm టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటర్ సుమారు 100కి.మీ రేంజ్ను అందించనుంది. Yamaha E01 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు పవర్ మోడ్లతో పాటు రివర్స్ మోడ్లో వస్తుంది. స్కూటర్లో మూడు ఛార్జింగ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఇటీవలే భారత్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను యమహా ఆవిష్కరించింది. ఐతే ఈ స్కూటర్ల లాంచ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: హల్చల్ చేస్తోన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్..! -
10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెలివరీ సేవల్లో ఉన్న ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ చేతులు కలిపింది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 మందికిపైగా మహిళలను ఈవెన్ కార్గో వేదికపైకి తీసుకు వచ్చేందుకు హీరో ఎలక్ట్రిక్ సాయం చేస్తుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూరుస్తారు. ఈవెన్ కార్గో డెలివరీ ప్రతినిధులుగా పూర్తిగా మహిళలే ఉండడం విశేషం. పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..! -
ఆ స్కూటర్లు కూడా రీకాల్.. ఒకినావా బాటలో ప్యూర్ ఈవీ
ఎన్నో అంచనాల మధ్య మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకి ఫైర్ యాక్సిడెంట్లు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీంతో తమ కంపెనీకి చెందిన స్కూటర్ల నాణ్యతను పరిశీలించేందుకు అనేక ఈవీ కంపెనీలో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే హర్యానాకు చెందిన ఒకినావా తమ కంపెనీ స్కూటర్లను రీకాల్ చేయగా తాజాగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ కూడా రీకాల్ బాట పట్టింది. హైదరాబాద్ స్టార్టప్ కంపెనీగా ఇప్పుడిప్పుడే మార్కెట్లో దూసుకుపోతుంది ప్యూర్ ఈవీ సంస్థ. అనతి కాలంలోనే మార్కెట్లో పట్టు సాధించింది. అయితే ఇటీవల చెన్నైలో ప్యూర్ ఈవీకి చెందిన ఓ స్కూటర్ తగలబడిపోయింది. మరుసటి రోజే నిజామాబాద్లో ఛార్జింగ్లో ఉండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఇప్పటికే అమ్ముడైన స్కూటర్లను రీకాల్ చేసి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. ప్యూర్ ఈవీకి చెందిన ఎంట్రన్స్ ప్లస్, పీ ప్లూటో 7జీ మోడల్స్కి సంబంధించి మొత్తం 2,000 స్కూటర్లను రీకాల్ చేయాలని నిర్ణయించారు. ఈ కంపెనీకి చెందిన డీలర్ల ద్వారా స్కూటర్లను వెనక్కి తెప్పించుకుని బ్యాటరీల పనితీరు ఛార్జింగ్ అవుతున్న విధానం గురించి మరోసారి పరిశీలించనున్నారు. చదవండి: ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం