home
-
మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి
మలప్పురం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికీ మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి ఇవి వికటించి, మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కేరళ(Kerala)లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లికుండా ఇంటిలోనే పురుడు పోసుకునేందుకు ప్రయత్నించిన 34 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.కేరళలోని మలప్పురం జిల్లా(Malappuram district)లో ఈస్ట్ కోడూర్ ప్రాంతానికి చెందిన అస్మా(34)కు ఇంటిలోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తన ఐదవ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్మా ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబావూర్కు చెందినది. అయితే ఆమె భర్త సిరాజుద్దీన్తో కలిసి మలప్పురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం అందకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. అస్మా భర్త సిరాజుద్దీన్ మత సాంప్రదాయాలను పాటిస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే మూఢాచారాలను ఆశ్రయించే ఆయన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటన తర్వాత సిరాజుద్దీన్ తన భార్య మృతదేహాన్ని పెరుంబావూర్కు తీసుకెళ్లి, అక్కడ సమాధి చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెరుంబావూర్ పోలీసులు(Perumbavoor Police) వెంటనే రంగంలోకి దిగి, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. కాగా అస్మాకు జన్మించిన నవజాత శిశువు (బాలుడు) ప్రస్తుతం పెరుంబావూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అస్మా మరణంచడానికి గల కారణాలను, ఆమెకు సరైన వైద్య సదుపాయాలు ఎందుకు అందలేదనే అంశంపై విచారిస్తున్నారు. ఈ దుర్ఘటన కేరళలో ఇంటి వద్ద జరిగే ప్రసవాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సరైన వైద్యవ్యవస్థ ఉన్నప్పటికీ, మలప్పురం జిల్లాలో ఇంటి వద్ద ప్రసవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2019-2024) కేరళలో 2,931 ఇంటి ప్రసవాలు నమోదయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో మలప్పురం జిల్లాలోనే 1,244 కేసులు ఉన్నాయి. 18 నవజాత శిశువుల మరణాలు కూడా జిల్లాలో సంభవించాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఎవరైనా సరే తమ ఇంటి లోపలికి అడుగు పెడితే అలంకారానికి ముగ్ధులైపోవాలని కోరుకుంటారు. ఇంటి గుమ్మం ఆహ్వానం పలికేలా ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూద్దాం..భారతీయ హస్త కళలు లేదా ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్స్తో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ గుమ్మం ముందు వేలాడదీస్తే తక్షణమే ప్రవేశ ద్వారం అలంకరణ కళాత్మకంగా మారిపోతుంది. అంతేకాదు, మనదైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుంది. గణేశుడు లేదా బుద్ధుని విగ్రహాలు గుమ్మం దగ్గర ఉంచడంతో ప్రవేశ ద్వారానికి ఆధ్యాత్మికత అలంకారంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ విగ్రహాలు ప్రశాంతతను కలిగిస్తాయి.మొక్కలు లేదా చిన్న నీటి సౌకర్యంతో మీ ప్రవేశ ద్వారంలోకి ప్రకృతిని తీసుకువచ్చి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. తక్కువ కాంతిపడినా ఏపుగా పెరిగే ఇండోర్ మొక్కలను ఇందుకు ఎంచుకోవాలి.చిన్నా పెద్ద గంటలున్న హ్యాంగింగ్ను వేలాడదీయడం వల్ల తలుపు తెరిచినప్పుడల్లా గంటలు శ్రావ్యంగా మోగుతూ, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. గంటలు ప్రతికూల శక్తిని దూరం చేసి ఇంటికి సానుకూలతను తీసుకువస్తాయని మనలో చాలామందికి నమ్మకం.బంతిపూలు లేదా మల్లెపూలు వంటి తాజా పువ్వులు మీ ప్రవేశ ద్వారానికి సువాసనను, అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని కుండీలో అలంకరించినా, దండగా అల్లి ద్వారానికి వేలాడదీసినా చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయి.డిజైన్లలో ఉన్న కుండలు, టెర్రకోట శిల్పాలు.. వంటి సాంçస్కృతిక కళాఖండాలతో ప్రవేశ ద్వారానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకురావచ్చు. (చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?) -
తగ్గుముఖం పట్టిన హోమ్ లోన్స్: క్రెడిట్ కార్డుల్లోనూ..
ముంబై: గృహ రుణాలు డిసెంబర్ త్రైమాసికంలో సంఖ్యా పరంగా చూస్తే 9 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 3 శాతం క్షీణించినట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఎక్కువ రిస్క్తో కూడిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లోనూ రుణాల సంఖ్య తగ్గినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.అన్ సెక్యూర్డ్ రుణాల విషయంలో దూకుడు తగ్గించి, నిదానంగా వెళ్లాలంటూ ఆర్బీఐ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలను కొన్ని త్రైమాసికాలుగా సూచించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అదే సమయంలో సెక్యూర్డ్ రుణ విభాగం, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, బ్యాంక్లకు కీలకంగా ఉన్న గృహరుణాల్లోనూ స్తబ్దత నెలకొనడాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.గృహ రుణాల్లో బాకీలు (మొత్తంగా జారీ అయి, తిరిగి వసూలు కావాల్సిన మొత్తం) క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 15 శాతంగా ఉంటే, అవి 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 13 శాతానికి తగ్గినట్టు తెలిపింది. రుణ వితరణ పరంగా 2024 అక్టోబర్-డిసెంబర్ కాలం రెండేళ్లలోనే అతి తక్కువ డిమాండ్ను చూసినట్టు పేర్కొంది. మెట్రోల్లో రుణ విచారణలు తగ్గాయి.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి. మొదటిసారి రుణ గ్రహీతలు, ప్రధాన కస్టమర్ల (ఎన్టీసీ)కు రుణ వితరణ 2023 డిసెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంటే, 2024 డిసెంబర్ చివరికి 17 శాతానికి తగ్గింది. ఎన్టీసీ రుణ గ్రహీతల్లో 41 శాతం మంది జెనరేషన్ జెడ్ వారు (1995 తర్వాత జని్మంచిన వారు) కావడం గమనార్హం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను వీరు ఎక్కువగా తీసుకున్నారు. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
నడి సముద్రంలో 95 రోజులు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం. పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్బుక్లో రాసింది. సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్ మెర్సిడెస్ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్ నాపా టొర్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్ సోదరులారా>, నా తండ్రి గాటన్ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
చిటికెలో ఇంటి పనులన్నీ ఫినిష్ ఎలాగో తెలుసా..!
మహిళలు కూడా ఉద్యోగాలు చేయడంతో ఇంట్లో పనిమనిషి లేకపోతే చాలా కష్టం. ఆమె ఒక్క రోజు డ్యూటీకి రాలేదా..? ఇంట్లో ఉండే హడావిడి అంతఇంత కాదు. ఎప్పుడు ఈ పనిమనిషి లీవ్ పెడుతుందోనన్న టెన్షన్తో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది మహిళలు. ఇక ఆ బాధ లేకుండా మన ఇంటిలో పనులన్నీ చకచక చేసిపట్టే రోబో మన జీవితంలో భాగం కానుంది త్వరలో. మరీ ఆ ఇంటి పనుల రోబో విశేషాలేంటో చూద్దామా..!.రోబోలు మన ఇంట్లో తిరుగాడే రోజులు సుదూర కల కాకపోవచ్చు. నార్వేకు చెందిన రోబోటిక్స్ కంపెనీ ‘1 ఎక్స్’ వివిధ రకాల పనులు చేయగల కొత్త రోబోను మార్కెట్లోకి తీసుకు వచ్చింది.‘నియో గామా’ అనే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఇంటిపనులకు సహాయపడుతుంది. సహజ కదలికలతో ఆకట్టుకుంటుంది. కంపెనీ షేర్ చేసిన ప్రమోషన్ క్లిప్లో... నైలాన్ నిట్ సూట్ ధరించిన రోబో కాఫీసర్వ్ చేయడం, పెయింటింగ్ వేలాడదీయడం, బుట్ట మోయడం, అద్దాలు శుభ్రం చేయడం, బయటినుంచి వచ్చిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం... మొదలైన దృశ్యాలు ఉన్నాయి. ఇంటి పనులు సరే... ఈ హ్యూమనాయిడ్ రోబోట్లు సాంకేతికపరంగా ఎంత వరకు భద్రం అనే అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని...‘నియో గామా భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకున్నాం’ అని ప్రకటించింది కంపెనీ. (చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
మెడిటేషన్కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్లు..) -
ఇంట్లో వ్రతం చేసుకున్న సుకుమార్ దంపతులు (ఫోటోలు)
-
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్టాప్ టెంట్కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
హోం.. స్వీట్ హోం.. భర్తతో సింగపూర్లో పీవీ సింధు (ఫొటోలు)
-
మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..
ఇటీవల కాలంలో వివిధ సాంప్రదాయ భారతీయ కళారూపాలు గృహాలంకరణ ద్వారా కొత్త వ్యక్తీకరణ, గుర్తింపును పొందాయి. ఇవి మన దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘లైఫ్ ఎన్ కలర్స్’ దేశం గుర్తింపుతో రూపొందించిన విభిన్న కళారూపాలను అందిస్తోంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని తిరిగి ఊహించుకోవడానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్స్ బెస్పోక్ వాల్పేపర్లు, వాల్ ఆర్ట్, ప్రాచీన వారసత్వ కట్టడాలు కళ్లకు కడతాయి. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తాయి. భారతీయ కళాత్మకతకు ప్రపంచవ్యాప్త ప్రశంసను అందిస్తున్నాయి. రాజస్థాన్ రాజభవన కుడ్యచిత్రాలు, క్లిష్టమైన పెయింటింగ్స్ చాలా కాలంగా మన దేశీయ సంపదకు పర్యాయపదంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ గంభీరమైన కోట గోడలను అలంకరించాయి. శౌర్యం, శృంగారం, ఆధ్యాత్మికత కథలను కళ్లకు కడుతున్నాయి. ఉదాహరణకు.. మేవార్ ఇండియన్ ఎంబ్రాయిడరీ వాల్ ఆర్ట్ తీసుకుంటే ఇది రాజ్పుత్ పెయింటింగ్స్ శైలిలో పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపుల స్పష్టమైన చిత్రణతో ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ రాజస్థానీ కళాత్మకత కాలాతీత ఆకర్షణను కలిగిస్తుంది. ఇవి ఏ ఇంటికి అయినా అందమైన వెలుగును నింపుతున్నాయి.పహారీ కళ.. ప్రతి స్ట్రోక్లో ప్రశాంతతపహారీ (కాంగ్రా) మినియేచర్ పెయింటింగ్ స్కూల్ వివరణాత్మక ప్రకృతి దృశ్యాలు, రాధా–కృష్ణ ఇతివృత్తాల భావోద్వేగ చిత్రణలకు ప్రసిద్ధి చెందింది. ఈ సున్నితమైన కళాత్మకత లైఫ్ ఎన్ కలర్స్ సృష్టిలో సజీవంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లో ప్రకృతి, పహారీ కళ ప్రశాంతత ఏ గదినైనా స్వర్గధామంగా మారుస్తుంది.సంప్రదాయాల కోల్లెజ్భారతీయ మినియేచర్ పెయింటింగ్లు, వాటి శక్తివంతమైన రంగులు, సంక్లిష్టమైన వివరాలతో, చాలా కాలంగా రాజ న్యాయస్థానాలు, దైవిక ప్రేమ, ప్రకృతి సౌందర్యం కథలను చెబుతున్నాయి. మొఘల్, రాజ్పుత్, ఇత ప్రాంతీయ కళా పాఠశాలల నుండి ఉద్భవించిన ఈ మినియేచర్ కళాఖండాలు, వాటి గొప్ప షేడ్స్తో ఆధునిక డిజైన్ను ప్రేరేపిస్తాయి. లైఫ్ ఎన్ కలర్స్ ఈ గొప్ప సంప్రదాయాలను దాని శుద్ధి చేసిన సేకరణల ద్వారా జీవం ΄ోస్తున్నాయి. షాన్, ఇండియన్ సీనిక్ డిజైన్ కస్టమైజ్డ్ వాల్పేపర్ మొఘల్ మినియేచర్ల సున్నితమైన ఆకర్షణ నుండి తీసిన పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపు చిత్రణను అద్భుతంగా అందిస్తుంది. (చదవండి: ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!) -
సైఫ్అలీఖాన్కు కత్తిపోట్లు: కరీనా, సైఫ్ లగ్జరీ బంగ్లా ఇదే (ఫోటోలు)
-
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్తోపాటు పుణెలో ఆల్టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల వారీ విక్రయాలు.. ⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. ⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. ⇒ అహ్మదాబాద్లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ⇒ కోల్కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ⇒ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది.. ‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్ఫ్రాంక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు. -
టాలీవుడ్ హీరో అడివిశేష్ ఇంట్లో చండీ హోమం (ఫోటోలు)
-
చదివే చోటు సరిగ్గా ఉందా?
వంట గది చప్పుళ్లు... టీవీ సౌండు... తల్లిదండ్రుల కబుర్లు, వాదనలు,... చిన్న తమ్ముడో, చెల్లెలో మధ్యలో దూరి ఆటలు... ‘మంచి మార్కులు తేవాలి’ అంటారు గాని చదివేందుకు మంచి చోటును చూపిస్తున్నారా? సంక్రాంతి దాటితే పిల్లలందరూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి.ఇంట్లో మీ పిల్లలు చదివే చోటును చూడండి.వారు శ్రద్ధగా చదువుకునేలా ఆ చోటును ఎలా ఏర్పాటు చేయాలో నిపుణుల మాట వినండి.ఇల్లు సర్దుకుంటే ఇల్లు ఎంత విశాలమో అర్థమవుతుంది. చిన్న ఇల్లయినా పెద్ద ఇల్లయినా సర్దుకోవడంలోనే స్థలం బయట పడుతుంది. ముంబై వాసులు అతి చిన్న ఇంటిలో కూడా అన్నీ అందంగా అమర్చుకుంటారు. కాని మనకు ఎంత విశాలమైన ఇల్లు ఉన్నా అవసరం లేని సామాను, వాడని సామాను, పారేయని సామాను ఉంచుకుని పిల్లల చదువుకు, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా తయారు చేస్తాం. మళ్లీ వాళ్లు బాగా చదవాలని డిమాండ్ చేస్తాం. శుభ్రమైన చోటు చదువు తలకెక్కే చోటు అలాంటి చోటును మీ ఇంట్లో మీ పిల్లలకు చదువు కోసం కేటాయిస్తున్నారా?అబ్రహం లింకన్ వీధి దీపాల కింద చదివాడు. ఎనభైల నాటి పిల్లలు డాబాల మీద లైట్లు లాగి చదివారు. కాని ఇప్పటి పిల్లలు అలా చదవడం లేదు. ఇంటిలోనే నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్లకు యోగ్యమైన చోటును ఏర్పాటు చేయాలి. కామన్ ఏరియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇంటికి వచ్చి వెళుతున్నా కన్ను పడని చోటు ఇంటిలో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఆ చోటును పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. పిల్లలు కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు చూసి చదువుకుంటున్నారు. వారికి డెస్క్టాప్ లేదా లాప్టాప్ ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఫోన్లో అన్నా తగినంత డేటా వేయించి ఇవ్వాలి.పిల్లలు చదివి అలసి పడుకోవాలంటే ఆ దాపునే బెడ్ ఉంటే మరీ మేలు. అది వాలగానే నిద్రపోయేలా తప్పక శుభ్రంగా సౌకర్యంగా ఉండాలి. కష్టపడి చదివి నిద్ర పట్టక ఇబ్బంది పడితే చదివింది నిద్ర లేమి వల్ల వృధా అవుతుంది.పిల్లలు చదువుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో తగాదాలు పూర్తిగా బంద్ చేయాలి. తల్లిదండ్రులు మంచి మూడ్లో కనిపిస్తూ పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంచాలి. బయట తిండి కాకుండా ఇంటి తిండి ఇవ్వాలి.∙పిల్లలు చదువుకునే సమయంలో దగ్గర కూచుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే వాళ్లూ ఆ ప్రెజెన్స్ ఇష్టపడతారు. అయితే రోజూ నువ్వు 99 పర్సెంట్ తేవాలి... టాపర్గా నిలవాలి అనే మాటలు ఎత్తి స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. న్యాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడమని మాత్రమే చెప్పాలి.∙గంటకోసారన్నా చదివే చోట నుంచి లేచి కాస్త అటూ ఇటూ నడిచేలాగా, నీరు తాగేలా, బాల్కనీలోనో కారిడార్లోనో కాస్త గాలి పీల్చేలా చూడాలి.∙ -
గృహ విక్రయాలు 21% తగ్గొచ్చు !
న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో డిసెంబర్ క్వార్టర్లో గృహ అమ్మకాలు 21 శాతం తగ్గి 1.08 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని స్థిరాస్తి డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ అంచనా వేసింది. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్లో (ఎన్సీఆర్) మాత్రం విక్రయాలు పెరుగుతాయని వెల్లడించింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్కతా, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో గృహ విక్రయాల వివరాలను ప్రాప్ఈక్విటీ శనివారం విడుదల చేసింది. మొత్తం తొమ్మిది నగరాల్లో 2024 డిసెంబర్ క్వార్టర్లో 1,08,261 యూనిట్ల ఇళ్లు అమ్ముడు కావొచ్చు.గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,37,225 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే 2024 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ అమ్మకాలు 5% పెరిగే అవకాశం ఉందని వివరించింది. అధిక బేస్ ధరల ప్రభావం కారణంగానే క్యూ3లో ఇళ్ల ధరలు తగ్గాయి. పండుగ డిమాండ్ కలిసిరావడంతో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మూలాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉన్నాయని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు సీఈవో సమీర్ జసుజా తెలిపారు. ⇒ హైదరాబాద్ పరిధిలో విక్రయాలు 47% తగ్గొచ్చని అంచనా వేసింది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 24,044 గృహ విక్రయాలు జరిగితే ఈ ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు. ⇒ బెంగళూరులో 13 శాతం తగ్గి విక్రయాలు 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు. కోల్కతాలో అమ్మకాలు 33% తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు దిగిరావచ్చు. ⇒ ముంబై నగరంలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27% పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13% విక్రయాలు తగ్గొచ్చు. కాగా 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 8,607 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 7,478 గృహాలకు పరిమితం కావచ్చు. థానేలో 26,099 యూనిట్ల నుంచి 21,893 యూనిట్లకు పడిపోవచ్చు. పుణేలో ఇండ్ల విక్రయాలు 24 శాతం తగ్గే చాన్స్ ఉంది.⇒ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతాల్లో గురుగ్రాం పరిధిలో లగ్జరీ ఇళ్లకు కొన్నేళ్లుగా డిమాండ్ అసాధారణ రీతిలో పెరుగుతోంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 10,354 గృహ అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య 12,915 ఇళ్ల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. అంటే 25% అమ్మకాలు పుంజుకోవచ్చు. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరింత ముదరుతోంది. జల్పల్లిలోని ఇంటికి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు. గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోసుకుని వెళ్లారు మనోజ్. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇప్పటికే తమకు రక్షణ కల్పించాలంటూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు మంచు మనోజ్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం మొదలైన గొడవ మరింత ముదిరి చివరికీ పోలీస్స్టేషన్కు చేరింది.(ఇది చదవండి: ‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి)పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్న మనోజ్ దంపతులు..తమ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని మంచు మనోజ్, మౌనిక సెక్యూరిటీ సిబ్బందితో తెలిపారు. వారికోసమే తాము వచ్చామని.. లోపలికి అనుమతించాలని కోరారు. అయినప్పటికీ మనోజ్ దంపతులను ఇంటి గేటు బయటే సెక్యూరిటీ సిబ్బంది నిలిపేశారు. దీంతో మనోజ్ బలవంతంగా గేట్ తోసుకుని లోపలికి వెళ్లారు. -
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ ఎలా?
వంట గదిలో కూరగాయలు, పండ్ల తొక్కలు, వ్యర్థాల నుండి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కంపోస్ట్ ఎరువు ఇంటిపంట మొక్కలకు సులభంగా, త్వరగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇది అద్భుతమైన ఎరువు కూడా.మూత ఉండే డస్ట్ బిన్కు చుట్టూ బెజ్జాలు పెట్టి గాలి పారాడేలా (ఎరేటెడ్ బిన్) చేస్తే చాలు. అందులో వంటగది వ్యర్థాలను ప్రతి రోజూ వేస్తూ ఉండాలి. వారానికోసారి ఆ చెత్తపైన కాస్త మట్టిని చల్లి, కదిలియ తిప్పండి. తడి వ్యర్థాలతోపాటు కొన్ని ఎండిన ఆకులు లేదా చిత్రిక పట్టిన చెక్క వ్యర్థాలు వంటివి కూడా కలపాలి. తడి, పొడి చెత్త కలిపి వేయాలి. కొంచెం శ్రద్ధ, తగుమాత్రం తేమ ఉండేలా చూసుకుంటూ ఉంటే వాసన, పురుగులు రాకుండా చూసుకోవచ్చు. గాలి తగులుతూ ఉండే బిన్లో చేసిన కం΄ోస్టు కాబట్టి దీన్ని ఏరోబిక్ హోమ్ కంపోస్టు అంటున్నాం. వంటింటి వ్యర్థాలను, ఎండు ఆకులను మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా.. వాటితో ఇంటి దగ్గరే మనం తయారు చేసే కం΄ోస్టు వల్ల భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రతి కిలో కం΄ోస్టుకు 3.8 కిలోల ఉద్గారాల విడుదలను నిరోధించిన వాళ్లం అవుతాం. ఈ పని మన భూమికి మంచిది!ఇదీ చదవండి: హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు! -
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్ను కోల్పోవడం హమాస్కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?
తన సొంతింటికి సంబంధించిన చేదు అనుభవాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంచుకున్నారు. తన ఇంటి నిర్మాణం పూర్తయినా ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకోని కారణంగా సొంతిట్లోకి ప్రవేశించలేకపోయానని పేర్కొన్నారు.సిడ్నీలో జరిగిన క్రెడాయ్-నాట్కాన్ ఈవెంట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. "2012 చివరి నాటికి నా ఇల్లు సిద్ధమైనప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కారణంగా దాదాపు ఐదారు సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ప్రవేశించలేకపోయాను" అన్నారు. కేంద్రమంత్రికి ఎదురైన ఈ అనుభవాన్ని చాలా మంది గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఉంటారు. ఈ అనిశ్చితి దేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేది. డెవలపర్ల తప్పుల కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు.అప్పట్లో ఇళ్ల కొనుగోలుదారులు పడే ఇబ్బందులు అలా ఉండేవని, అయితే 2016లో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం (రెరా) ప్రవేశపెట్టడంతో పరిస్థితి గణనీయంగా మారిపోయిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇది అవసరమైన పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్కు చెందిన రోషన్కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.ఇంటి హాల్లో పడుకుంటూ వాచ్మన్గా, సర్వెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్పూర్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్తో ఉన్న రోషన్, ఉదయ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది. -
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్కుమార్ ఠాకూర్గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
ఇద్దరు చిట్టి గణపతులు: ఇంట్లోనే నిమజ్జనం చేసిన సూర్యకుమార్ యాదవ్ (ఫొటోలు)
-
రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే !
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్వీర్ సింగ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. బేబీ బంప్తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.రూ.100 కోట్లతో భవనం..అయితే బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్వీర్సింగ్ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మన్నత్కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్వీర్ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.దీపికా- రణ్వీర్ ప్రేమకథ..2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్పై మెరవనుంది. సింగం ఎగైన్లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్వీర్సింగ్ డాన్ 3లో కూడా నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
సొంతిల్లు సామాన్యుడి కల.. కొందరికి అది పరువు మర్యాద.. ఇంకొందరికి తలకు మించిన భారం. కొత్తగా ఉద్యోగం వచ్చిన వారు బంధువుల ఇంటికి వెళితే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావని అడుగుతారు. పిల్లల పెళ్లిల్లు చేసినవారు వెళితే ‘అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా ఇల్లు తీసుకోండి’ అంటారు. సరపడా డబ్బు ఉండి సమాజంలో మరింత గౌరవం కోసం ఇల్లు తీసుకునే వారు కొందరైతే.. సమాజానికి భయపడి పక్కవారికి ఎక్కడ లోకువవుతామోనని ఇల్లు కొనేవారు కొందరు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్తోమతకు మించి అప్పుచేసి ఇల్లు కొంటారు. అయితే చాలీచాలని జీతాలతో కాలం నెట్టుకొస్తున్నవారు ఇల్లు తీసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకుంటారు. వచ్చే జీతంలో సగానికిపైగా ఈఎంఐలకు పోతుంది. కాబట్టి, ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ముందుగా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండాలి.ప్రతినెల వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి.మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి.పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి.ఉద్యోగం చేస్తూంటే ఏదైనా అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు.ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.ఇదీ చదవండి: కంటెంట్ తొలగించకపోతే అరెస్టు తప్పదు!కుటుంబం అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగి మనం చనిపోతే ఈఎంఐలు, అప్పులని ఇతర కుటుంబ సభ్యులను వేధిస్తారు. కాబట్టి మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మనకు ఏదైనా జరిగితే మొత్తం డబ్బును చెల్లించేలా ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. -
నేల మీద కాకుండా.. నీటిలో తేలియాడే ఇల్లును ఎప్పుడైనా చూశారా!
నేల మీద ఇల్లు కట్టుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా స్థలాల ధరలు చుక్కలను తాకే నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే, నేల మీద కాకుండా నీటిలో తేలియాడే ఇల్లుకు చైనీస్ ఆర్కిటెక్ట్లు రూపకల్పన చేశారు. బీజింగ్కు చెందిన ‘క్రాస్బౌండరీస్ ఆర్కిటెక్చర్ స్టూడియో’కు చెందిన నిపుణులు సాధారణమైన ఇంటికి కావలసిన అన్ని వసతులతో కూడిన పడవలాంటి ఈ ఇంటిని తయారు చేశారు.నదుల్లోను, సముద్రంలోనూ తేలుతూ ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. పడవలాంటి ఈ ఇంటికి ‘ఫాంగ్ సాంగ్’ అని పేరు పెట్టారు. పడవలు నడవాలంటే ఇంధనం కావాలి. పడవలాంటి ఈ 667 చదరపు అడుగుల ఇంటికి మాత్రం ఇంధనం అక్కర్లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీని పైకప్పుల మీద అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ ఇంటి అవసరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. ఈ ఇంటి ధర 26 వేల డాలర్లు (రూ.21.85 లక్షలు). ఈ తేలే ఇంటిని కొనేందుకు యూరోపియన్లు సైతం ఎగబడుతుండటం విశేషం. -
పంద్రాగస్టున ప్రతి ముస్లిం ఇంటిపై త్రివర్ణ పతాకం
దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంద్రాగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామన్నారు. మదర్సాలు, విద్యాసంస్థలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లిం సంఘాలు సహకారం మరువరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందన్నారు. పంద్రాగస్టున ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టాలని ఆయన సూచించారు. -
Sravana Masam 2024: నేటి నుంచే శ్రావణ సందడి
పెద్దపల్లిరూరల్: శుభ ముహూర్తాలకు వేళయింది. సోమవారం నుంచి మొదలయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలామంది సన్నద్ధమయ్యారు. శుక్ర మౌఢ్యమి, ఆషాడం, గురుమౌఢ్యమి కారణంగా మూడునెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్తో పాటు నగల వ్యాపారులు శ్రావణమాస ముహూర్తాలకు శ్రీరెడీశ్రీ అయ్యారు. మూడునెలల పాటు ఖాళీగా ఉన్న వీరంతా ఇప్పుడు బిజీ కానున్నారు.శ్రావణంలో పండుగలుశ్రావణమాసంలో వచ్చే పండుగలిలా ఉన్నాయి. సోమవారం (ఈనెల 5) నుంచే శ్రావణం మొదలవుతోంది. 8న నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఈనెల 5న తొలి సోమవారంతో పాటు 12,19,26న సోమవారాల్లో శివుడిని, 9,16,23,30వ తేదీల్లో (శుక్రవారాల్లో) లక్ష్మీదేవి, 10,17,24,31వ తేదీల్లో (శనివారాల్లో) విష్ణువును పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజా కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.శుభ ముహూర్తాలుఈనెల 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3తో ముగియనుండగా, ఈ నెల 31లోపే శుభకార్యాలను ముగించుకోవాలని అర్చకులు సూచిస్తున్నారు. ఈనెల 7,8,9,10,11,15,16,17,18,21,22,23,24,28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. మూడునెలల ముందు నుంచే వేచి ఉన్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇంటింటా పండగే..శ్రావణమాసంలో అందరూ భక్తితో పరవశిస్తారు. ఈ మాసంలో ఇంటింటా పండగ వాతావరణమే. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణం. అందుకే ఈ మాసంలో అందరూ భక్తి, పవిత్రతో ఉంటూ శుభ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈ నెల 28వరకే శుభముహూర్తాలున్నాయి.– కొండపాక శ్రీనివాసాచార్యులు, అర్చకుడు, పెద్దపల్లి -
దర్శన్కు ఇంటి భోజనం ఇస్తారా.. లేదా?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులో ఉన్న హీరో దర్శన్ తనకు ఇంటి భోజనం కావాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో ఈ అర్జీపై జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి ఆస్కారం ఉందని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్కు పౌష్టికాహారం అవసరం ఉందని చెబుతూ ఆగస్టు 20కి వాయిదా వేశారు. స్టార్ హీరో అయిన దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు జూన్ 10 నుంచి హత్య కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి జైలు తిండితో ఇబ్బంది పడుతున్నారు.చిక్కుల్లో సిద్ధారూఢపరప్పన అగ్రహార జైలులో దర్శన్కు టీవీతో పాటు వీఐపీ సౌకర్యాలు కల్పించారని చెప్పిన మాజీ ఖైదీ సిద్ధారూఢపై చర్యలు తీసుకోనున్నారు. తాను జైలులో దర్శన్కు యోగ నేర్పించానని, ఆయనకు సకల సౌకర్యాలు అందుతున్నాయని ఇటీవల సిద్ధారూఢ మీడియా ముందు చెప్పారు. సత్ప్రవర్తన కింద విడుదలైన సిద్ధారూఢ ఇలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.జైలు తిండి బాగుంటుంది: చేతన్తనకు జైలులో వడ్డించే భోజనం నచ్చిందని, అయితే అదే భోజనం నటుడు దర్శన్కు ఎందు నచ్చలేదో అర్థం కావడం తేదని నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అన్నారు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన చేతన్ తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులను ఎవరినీ చూడడానికి అనుమతించలేదన్నారు. తనను జైలులో ఆరుమంది ఉన్న సెల్లో ఉంచారని, రెండవసారి జైలుకు వెళ్లినప్పుడు నలభైమంది ఉన్న బ్యారెక్లో ఉంచారన్నారు. అందరిలాగే తానూ జైల్లో పని చేశానన్నారు. జైలులో పెట్టే భోజనం బాగా ఉండేదన్నారు. మరి దర్శన్కు ఎందుకు నచ్చడం లేదో, పదే పదే ఇంటి భోజనం కావాలని ఎందుకు కోరుతున్నాడో తెలియడం లేదన్నారు. -
మార్వెలస్.. మ్యూరల్స్..
రాజుల కోటలు, ప్యాలస్ల వైభవాన్ని మన ఇంటికీ తీసుకురావచ్చు మ్యూరల్స్తో! చిన్న చిన్న ఆర్ట్ పీస్ల నుంచి గోడ మొత్తం పరచుకునేలా రూపుదిద్దుకునే మ్యూరల్స్ ఇప్పుడు ఇంటీరియర్లో అందమైన పాత్రను పోషిస్తున్నాయి. మన అభిరుచి.. సృజనకు అద్దం పడుతున్నాయి.మ్యూరల్స్ని గోడ లేదా పైకప్పుకు డిజైన్ చేసే ఒక గ్రాఫిక్ ఆర్ట్గా చెప్పవచ్చు. ఖాళీ గోడను కాన్వాస్గా మార్చే అద్భుతమైన కళ ఇది. చిన్న చిన్న ఆకృతుల నుంచి గ్రాండ్ స్టేట్మెంట్ వరకు, పారిస్ వీధుల నుంచి మాల్దీవుల ప్రశాంతమైన బీచ్ల వరకు కళ్లను కట్టిపడేసే గ్రాఫిక్స్ను గోడల మీద కొలువుదీరుస్తుంది. మరో ప్రపంచానికి కిటికీ వంటిదిగా పేరొందిన ఈ కళ ద్వారా ఒక కథనే చెప్పవచ్చు.మ్యూరల్స్.. వాల్పేపర్స్..మ్యూరల్స్ వ్యయప్రయాసలతో కూడుకున్నవనిపిస్తే వాటిని తలపించే వాల్ పేపర్స్ని ఎంచుకోవచ్చు. నచ్చిన ఆకృతులు, దృశ్యాల వాల్ పేపర్స్ లివింగ్ రూమ్, ఆఫీసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జలపాతాలు, పచ్చటి మైదానాలతో పెయింట్ అయిన వాల్ పేపర్స్ ఏ గదినైనా ప్రశాంతంగా కనిపించేలా చేస్తాయి. గెలాక్సీలు, కోటలతో వాల్ పేపర్స్ పిల్లల గదులను మురిపిస్తాయి. వీటిని మార్చేసుకోవడమూ సులువే. కాబట్టి మ్యూరల్స్ భారం అనుకున్న వాళ్లు వాల్ పేపర్స్కి స్టిక్ అవొచ్చు. మ్యూరల్స్కే ఓటు వేసే వాళ్లు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి..కుడ్యచిత్రాలను స్థలాన్ని బట్టి డిజైన్ చేయించుకునే వీలుంటుంది. విశాల మైదానాలున్న కుడ్యచిత్రాల అలంకరణ వల్ల ఆ గది కూడా విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ముదురు రంగులు పెద్ద పెద్ద హాల్స్కు బాగుంటాయి. చిన్న గదులకైతే లైట్ షేడ్స్నే ఎంచుకోవాలి.నిర్వహణ విషయానికొస్తే.. కుడ్యచిత్రం తాజాగా కనిపించాలంటే మెత్తని తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఆ కళాఖండం దీర్ఘకాలం మన్నాలంటే రసాయనాలు, స్క్రబ్స్ వంటివి వాడకూడదు.మ్యూరల్ పెయింటింగ్ డిజైన్స్ని చిత్రించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో గోడలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో రంగులే కాదు ఎలక్ట్రిక్ వెలుగులూ జతచేరాయి కొత్తగా! -
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
లగ్జూరియస్ ఆర్ట్.. ఇంటి అలంకరణలో హస్తకళల శోభే వేరు!
ఇంటి అలంకరణలో హస్తకళల శోభే వేరు! ఆ జాబితాలో ‘సుజానీ’నీ చేర్చొచ్చు. అత్యంత లగ్జూరియస్ ఆర్ట్గా భావించే ఈ కళ ఆల్టైమ్ హోమ్ డెకర్గా పేరొందింది. ముఖ్యంగా సోఫా కుషన్స్, బెడ్ స్ప్రెడ్స్ మీద సుజానీ అమితంగా ఆకట్టుకుంటుంది.మధ్య ఆసియాలోని శతాబ్దాల కిందటి ఎంబ్రాయిడరీ కళే ‘సుజానీ’. సుజానీ అంటే పార్శీలో ‘సూది’ అని అర్థం. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల సంచార తెగలలో పుట్టిన కళ ఇది. అక్కడి సంప్రదాయ వస్త్రాలపైన ఈ కళను చూస్తాం.ఒక బెడ్ స్ప్రెడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ పూర్తి చేయడానికి కనీసం 40 గంటల సమయం పడుతుంది. కళాకారుల నైపుణ్యం, అంకితభావం ఈ డిజైన్లలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. గతకాలపు కథలతో.. గొప్పదైన వారసత్వంతో.. ముచ్చటగొలిపే ఈ ఎంబ్రాయిడరీ వస్త్రాలను సుజానీ రెట్రో కలెక్షన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్.. -
చక్కనైన చెక్క ఇల్లు (ఫొటోలు)
-
Home Food: హోమ్ ఫుడ్స్లో షీరో..
ఆన్లైన్లో అమ్మకాల జోష్ లక్షలు సంపాదిస్తున్న మహిళలు స్వయం ఉపాధిగా శిక్షణా తరగతులు షీరో హోమ్ ఫుడ్స్ కొత్త ప్రయత్నం వంటగది నుంచే వ్యాపారంమహిళలు నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు మహిళలు వివిధ కారణాల రీత్యా ఇంటిగడప దాటలేని పరిస్థితి. కానీ ఏదో ఒక్కటి చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమకు తెలిసిన వంటలతో ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలని ఎందరో ఆలోచిస్తుంటారు. కానీ వాటిని ఎక్కడ? ఎలా? అమ్మాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అటువంటి మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తామంటూ నాలుగు సంవత్సరాల క్రితం ముందుకొచి్చన సంస్థే షీరో హోమ్ ఫుడ్స్. దీని పనేంటి? మహిళలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది? ఎలాంటి మెళకువలు నేర్పిస్తుంది? తెలుసుకుందాం.. తమ వంట గది నుండే మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేలా షీరో హోమ్ ఫుడ్ సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రతి మహిళ తాము చేసే వంట రుచికరంగా ఉండాలనే తపన పడుతుంది. అయితే వారు చేసే వంట అమీర్పేటలో చేసినా, అనకాపల్లిలో చేసినా, అమెరికాలో చేసినా ఒకే రంగు.. ఒకే రుచితో పాటు.. ఒకేలా కనబడేలా ఉండేందుకు అన్ని రకాల వంటకాలకూ షీరో హోమ్ ఫుడ్స్ ఉచిత శిక్షణను అందిస్తోంది. దీంతో మహిళలు ప్రతి నెలా ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.10వేల నుండి లక్ష రూపాయల పైబడి సంపాదిస్తున్నారు. చెన్నై కేంద్రంగా ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఆన్లైన్ ద్వారా మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో తిలక్ వెంకటస్వామి, జయశ్రీ తిలక్ దంపతులు చెన్నైలో 2019లో షీరో హోమ్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించారు. మహిళలు తమకు తెలిసిన వంట నైపుణ్యానికి షీరో సంస్థ అందించే మెళకువలను జోడించి దక్షిణ, ఉత్తరాది వంటకాలను రుచికరంగా, శుచికరంగా తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు.అందుబాటులో అనేక వంటకాలుతెలుగు వంటకాలే కాకుండా తమిళనాడు, కేరళ, ఉత్తరాది రుచులతో 150 రకాలకు పైగా వంటలను అవలీలగా నిర్ణీత సమయంలో చేసేలా తరీ్ఫదుని ఇస్తోంది. అంతే కాకుండా వారు చేసిన వంటకాలని తమ వెబ్సైట్, యాప్తో పాటు స్విగ్గీ, జొమాటో, వాయు, ఓఎన్డిసీ వంటి అనేక ఫుడ్ డెలివరీ పార్టనర్స్తో భాగస్వామ్యాన్ని కల్పించి, చక్కని ఆదాయాన్ని పొందేలా షీరో హోమ్ ఫుడ్స్ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. పప్పు, పచ్చడి, సాంబారు వంటి ఇంటి భోజన వంటకాలనే కాకుండా, వారు నిష్ణాతులుగా ఉన్న తినుబండారాలు, ఇతర అనేక వంటకాలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించుకుని స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది.స్వయంశక్తితో ఎదుగుతున్న మహిళలు షీరోలో చేరి ఎందరో మహిళలు తమ స్వయం శక్తితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు. పిల్లల ఫంక్షన్లు గర్వంగా చేసుకుంటున్నారు. దీంతోపాటు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండగలిగే స్థాయిలో నిలుస్తున్నారు. నలుగురిలో తాము భిన్నమని నిరూపిస్తూ గర్వపడుతున్నారు. మా ఇంట్లో నాన్న హీరో అయితే అమ్మ షీరో అని పిల్లలు తలెత్తుకుని చెప్పేలా చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మంది మహిళలకు చేయూతగా నిలిచిన షీరో హోమ్ ఫుడ్స్ సంస్థ కొద్ది సంవత్సరాల్లోనే పది లక్షల మంది మహిళలకు చేయూతగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఉచిత సెమినార్ వివరాలు.. ఆసక్తి గల మహిళలు ఉచిత సెమినార్లో పాల్గొనేందుకు సెల్ : 6309527444లో తమ పేరు, ఏరియా, సిటీని వాట్సాప్ చేస్తే ఏ తేదీల్లో సెమినార్లో పాల్గొనాలో తెలియజేస్తామని ఆ సంస్థ కన్వీనర్ విజయ్ వర్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ప్రధాన నగరాల మొదలు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ఈ కిచెన్ని ప్రారంభించి మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. నగరంలో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం.. హైదరాబాద్, మెహిదీపట్నం, రేతి»ౌలిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం ఉంది. ప్రతి వారం మహిళలకు వంటలపై ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యాపార మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్లో 100 కిచెన్ పార్టనర్స్ ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మంది కిచెన్ పార్టనర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మాస్టర్ ప్రాంచైజ్ ఓనర్గా సువర్ణదేవి పాకలపాటి ఉంటూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా అహర్నిశలూ శ్రమిస్తున్నారు.పెట్టుబడి లేకుండా... షీరో హోమ్ ఫుడ్స్ సంస్థ ప్రస్తుతం రెండు మోడల్స్గా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పెట్టుబడి లేకుండా ఇంట్లో వుండే స్టవ్, గిన్నెలతో వ్యాపారాన్ని ప్రారంభించే విధానం ఒకటి. ఈ మోడల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకూ సంపాదించవచ్చు. కొద్దిపాటి పెట్టుబడితో నలుగురు లేదా ఐదుగురు మహిళలు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కమ్యూనిటీ కిచెన్ని ప్రారంభించి సంపూర్ణ వ్యాపార మోడల్ మరొకటి. సంపూర్ణ వ్యాపార మోడల్లో రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారికి ముందుగా ఓ సెమినార్ నిర్వహించి వ్యాపార నమూనాను వివరిస్తారు. తాము ఇందులో వ్యాపారం చేయగలం అని ముందుకొచ్చిన మహిళా మణులకు షీరో కుటుంబంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. -
కారు ఇళ్లు.. అదిరిపోయే ఫొటోలు
-
కదిలే ఇళ్లు.. ఆసక్తికర ఫొటోలు
-
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
చార్ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్కు చేరుకున్న తరువాత కూడా చార్ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. -
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
ఇంటి వద్ద ఓటింగ్ నేటి నుంచే..
జైపూర్: రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రాజస్థాన్లో మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. -
హోమ్ ఓటింగ్.. పోలింగ్ స్టేషన్..
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్స్టేషన్కు వచ్చిగానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
స్మృతి ఇరానీ ఇంట శుభకార్యం.. 20 వేల అతిథులు!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు. సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!
ఇంటీరియ్లో వుడెన్ వర్క్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్ ఆర్ట్గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్గా, ఫెదర్స్గా, బెడ్ ల్యాంప్స్గా, ఎంబ్రాయిడరీ వర్క్తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి. స్కెలిటన్ లీవ్స్ తయారీకి.. 1. ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 2. ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 3. ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్ బ్రష్తో మెల్లగా రబ్ చేస్తూ, పై పొట్టును తీసేయాలి. 4. పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 5. తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్ భాగం తయారవుతుంది. 6. ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు. -
కొద్ది స్పేస్లోనే హ్యాపీగా చేసుకునే 'హోమ్ జిమ్ మెషిన్'!
‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు... కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్సైజ్కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్కు వెళ్లడం అనేది కుదిరేది కాదు. రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్గఢ్లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్లు జిమ్కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్మెంట్లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్మెంట్లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు. కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది. డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్ను ఉపయోగిస్తుంది. జిమ్లో చేసే ప్రతి వర్కవుట్కు ఈ మెషిన్ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్లు మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్బ్యాక్ను కంపెనీ ఫౌండర్లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చి ప్రోటోటైప్లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు. ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
తేనెని నేరుగా వేడిచేస్తున్నారా?
మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా! తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది. ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాల ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్ని నీటితో కడిగి ఫ్రిజ్లో పెట్టడం మంచిది. వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది. పైనాపిల్ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి. బటర్ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఐస్క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి. (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!
..అవును, ఇళ్లు కదులుతాయి. ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలనో... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్ నిర్మించుకోవాలనో... ప్రతిచోటా ఆఫీస్ పెట్టడం కుదరడం లేదనో...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్ను తరలించే సదుపాయం ఉంటే బాగుండనో అనుకుంటారు. ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కంటైనర్ హోమ్లు. కొన్నిరోజులు లేదా నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తర్వాత ఉంటున్న ఇంటిని వేరే చోటుకు మార్చాలనుకునేవారికి కంటైనర్హోమ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్దగా నిర్మాణ వ్యయం లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని తయారుచేస్తున్నారు. దాంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఫాంహౌస్లు, కాఫీషాపులు, టీస్టాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. తయారీ ఇలా.. కంటైనర్ హోమ్ అనగానే ప్రధానంగా ఇవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి. ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా. పైకప్పు, ఫ్లోర్ తుప్పుపడతాయేమో..విద్యుదాఘాతం జరిగితే.. ఇలా అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరని తయారీదారులు సూచిస్తున్నారు. సౌకర్యాలు ఇలా.. గాల్వనైజింగ్ స్టీల్, ఎండీఎఫ్ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చినవారు టైల్స్ వేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా వాటర్ఫ్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు. టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్బోర్డులు, ఎల్ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే. విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్సర్క్యూట్కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్కు అనుసంధానిస్తున్నారు. పైన 50 ఎంఎం ఇన్సులేషన్ చేయడంతో షార్ట్సర్క్యూట్కి అవకాశం ఉండదు. నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ హోమ్లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్రూమ్, కిచెన్ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు. పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. ఖర్చు తక్కువ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. -
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
కుకింగ్ టు కామెడీ క్వీన్స్..
ఒకరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు. సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్స్టాగ్రామ్లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా. హోమ్ చెఫ్ నాజ్ అంజుమ్ హైదరాబాద్లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్. గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది. చేతి కళకు ఆదరణ నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది. గృహిణి నిర్వచనంలోనే మార్పు.. కరోనా లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది. -
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అందించనుంది. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
ఇంపుసొంపుల ఇత్తడి
ఇత్తడి .. పుత్తడి ఒక్కటేనా అంటారు. కాని ఇంటి అలంకరణ విషయంలో మాత్రం ఇత్తడి.. పుత్తడి కన్నా మిన్న.. నాడు.. నేడూనూ! ఆ కళావైభవం ఎట్టిదనిన.. పూజా సామాగ్రే కాదు ఇప్పుడు సెంటర్ కన్సోల్ టేబుల్స్, సోఫా సెట్స్, కార్నర్ స్పేస్లలోనూ ఇత్తడి అందాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇంటీరియర్ పట్ల అత్యంత శ్రద్ధ కనబరచేవాళ్లు ఖరీదు గురించి పట్టించుకోకుండా ఇంటికి ఇత్తడి తెచ్చే కళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆధునిక డిజైన్స్ ఇంటీరియర్లో మోడర్న్ మెరుపు కావాలనుకుంటున్న వారు బ్రాస్ వెస్ట్రన్ డిజైన్స్ పట్లే మక్కువ చూపుతున్నారు. ల్యాంప్స్, వాల్ డెకర్ సెట్స్ మాత్రమే కాదు పార్టిషన్ వాల్స్, రూమ్ డివైడర్స్కీ బ్రాస్మెటల్ డిజైన్స్నే ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇత్తడిని ఇతర లోహాలైన రాగి, వెండి, అల్యూమినియం వంటివాటితో జతచేసి ఇంటి అలంకరణకు అదనపు సోయగాన్ని అద్దుతున్నారు. ఇలా డోర్ నాబ్స్ నుంచి వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్, రూఫ్ డెకర్ వరకు ఇంచ్ ఇంచ్కు ఇత్తడి ఇచ్చే సొంపు ఎంత చెప్పినా తక్కువే! మరింకెందుకు ఆలస్యం.. ఇంట్లో పాత ఇత్తడి సామానును అటక మీద నుంచి కిందకు దించండి.. ఇంటీరియర్లో భాగం చేయండి!! -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
క్యారట్లు వాడిపోకుండా తాజాగా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్న రకాల కాయగూరలు నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఫ్రిజ్లో ఉన్నా కూడా పాడైపోతుంటాయి. అలాగే పాల గిన్నెలు లేదా డబ్బాలు ఓ పట్టాన వాసన పోవు అలాంటప్పుడు సింపుల్గా ఉంటే చిట్కా ఏదైనా ఉంటే బావుండననిపిస్తుంది. అలాంటి వారికి కోసం ఈ హోం రెమిడ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి. క్యారట్స్ ఎండిపోయినట్లు, వాడిపోయినట్లుగా ఉంటే ఒక గిన్నెలో వేసి, క్యారట్స్ మునిగేలా నీళ్లు పోయాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. పన్నెండు గంటల తరువాత నీటిలో నుంచి క్యారట్స్ తీసి చూస్తే తాజాగా ఉంటాయి. ఇప్పుడు తొక్క తీసి చక్కగా వాడుకోవచ్చు. క్యారట్ మీద నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఎంత కడిగినా పాల బాటిల్స్ వాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాల బాటిల్లో టేబుల్ స్పూను వంటసోడా, కొన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం బాటిల్ను షేక్ చేసి కడిగితే పాల వాసన పోతుంది. ఇదే విధంగా పాల బాటిల్లో కొద్దిగా వెనిగర్ వేసి షేక్ చేసి పక్కన పెట్టాలి. ఆరు గంటల తరువాత వేడి నీటితో కడగాలి. పాల వాసన పోతుంది. 200 ఎమ్ఎల్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపాలి. ఈ నీటిని కుండీల్లోని మొక్కల మట్టిపైన, ఆకులపైన చల్లాలి. ఈ నీరు కీటక నివారిణిగా పనిచేయడమేగాక, మొక్కలకు పునరుజ్జీవాన్ని ఇస్తుంది. (చదవండి: ఐస్వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!) -
పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..
నవ్వుతోనే ముఖం ఆకట్టుకుంటుంది. తెల్లని పలువరుస ఆ నవ్వును ప్రభావితం చేస్తుంది. కానీ పళ్లపై పసుపు గారలు.. నోటి దుర్వాసన వల్ల నవ్వు సంగతి అటుంచి అసలు నోరు తెరవడానికే భయపడుతుంటారు ఆ సమస్యలున్న వాళ్లు. అలాంటి వాళ్లు ఈ హోం రెమిడ్సి పాటిస్తే చాలా ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొయొచ్చు. అవేంటంటే.. వీటికి ఓ చిన్న చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రసం తీసిన నిమ్మతొక్కతో పళ్ళను రుద్దుకుంటే క్రమంగా పసుపు మరకలు పోవడమే కాదు.. నోటి దుర్వాసనా తగ్గుతుంది. అయితే నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఎక్కువ రుద్దితే పళ్ళు బలహీనమవుతాయి. ఏదైనా అతి మంచిది కాదుకదా! సో.. తులసి ఆకులు- ఎండిన నారింజ తొక్కలు: ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే త్వరితగతిన దంతాలు తెల్లగా మారతాయి. బేకింగ్సోడా నీరు: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బేకింగ్సోడాల నీరు పోసి పేస్ట్లా చేసి దీన్ని పళ్లకు అప్లై చేసి రుద్దిన పసుపు మచ్చలు పోతాయి. అలాగే ఉప్పు నిమ్మరసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. ఈ చక్కటి ఇంటి చిట్కాలను పాటించి స్థైర్యంగా నవ్వండి. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!
వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. కానీ, అహ్మదాబాద్ వాసులైన ప్రియాంషి, యశ్వి అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల క్రితం తల్లి ఇచ్చిన పాకెట్మనీ 2,500 రూపాయలతో జార్ క్యాండిల్స్ తయారీని ప్రారంభించారు. నేడు ఏడాదికి 25 లక్షల టర్నోవర్ని సాధిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటూనే జాయిస్ బీమ్ క్యాండిల్ వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా మారిన ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘మా జీవితాల్లో మేమే వెలుగులను నింపుకుంటున్నాం’ అని తమ వెంచర్ గురించి ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచుతున్నారు. అక్కా చెల్లెళ్లలో ముందుగా యశ్వి మాట్లాడుతూ – ‘అహ్మదాబాద్లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివాను. కోర్సులో పారిశ్రామిక శిక్షణా యూనిట్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. ఇందులో మెలకువలు నేర్చుకున్నాను. ఏడాది పొడవునా సీజన్కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే వాళ్లం. వీటి ద్వారా మొదట్లో నెలకు వెయ్యి రూపాయలే వచ్చేది. ఆ తర్వాత ఈ పనే ప్రధానంగా చేసుకున్నాం. దీపావళి సమయంలో కొవ్వొత్తులతో పాటు సోప్ సొల్యూషన్స్, లిప్ బామ్లు అమ్మేవాళ్లం. చాలా సార్లు పెద్ద కంపెనీలకు, ఇంటింటికీ వెళ్లి ఉత్పత్తులను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేదానిని. ఈ సమయంలో మా స్వంత కలను గుర్తించాం. కాలేజీ సమయంలో మూడేళ్ల పాటు చేసిన ఈ ప్రయత్నానికి మా అక్క ఆలోచనలు కూడా తోడయ్యాయి. అమ్మ కూడా మాకు సపోర్ట్గా నిలిచింది. ఐదుగురితో క్యాండిల్స్ తయారీ ప్రారంభించి, 50 కొవ్వొత్తులను మాత్రమే తయారు చేశాం. వాటిని ఒక ఫెయిర్లో ప్రదర్శించాను. అన్ని ఖర్చులు తీసివేస్తే 700 రూపాయల లాభం వచ్చింది. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మా నాన్నకు నచ్చలేదు. ఇరవై ఏళ్లు దాటుతూనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడమే ప్రధానంగా భావించేవారు. ఆడపిల్లలు సొంతంగా ఆలోచించడానికి వీలు లేని చోటు. దీంతో నాన్న మమ్మల్ని ఆదుకోలేదు. కానీ, ఈ రోజు మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మొదట్లో మా బంధువుల్లో ఫలానా వాళ్ల కూతుళ్లు ఇంట్లో టైమ్ పాస్ చేస్తున్నారు అనుకునేవారు. కానీ, ఈ రోజు మా ఎదుగుదల చూసి బంధువులకు కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఆంక్షలు ఉన్నప్పటికీ సాధించాలన్న మా తపనకు అవేవీ అడ్డంకి కాలేదు’ అని వివరిస్తుంది. నిశితంగా పరిశీలన ముడిపదార్థాలను కలపడం, మ్యాజికల్ ఫార్ములాను సెట్ చేయడం యశ్వి చూస్తుంటే, ఆన్లైన్–ఆఫ్లైన్ ప్రచారాల మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించే బాధ్యత అక్క ప్రియాంషి తీసుకుంది. తమ ఉత్పత్తుల గురించి ప్రియాంషి మాట్లాడుతూ – ‘మా చేతితో తయారుచేసిన జార్ కాండిల్స్ మాకో ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆర్గానిక్, నాన్ టాక్సిక్ ముడి పదార్థాలను మాత్రమే ఈ తయారీలో ఉపయోగించడం వల్ల పర్యావరణ అనుకూలమైనవని మా అభిప్రాయం. ఇందుకు మేం గర్వపడుతున్నాం. తయారీ నుంచి ప్యాకేజ్, కస్టమర్లకు మా ఉత్పత్తులను చేర్చడం వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షిస్తాం. కచ్చితమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మా జాడీలను ఎనిమిదిసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దీని వల్ల కస్టమర్లకు నాణ్యమైన జార్ క్యాండీలను అందించగలుగుతున్నాం. కొవ్వొత్తులు కేవలం కాంతిని మాత్రమే అందించవు. మేం తయారు చేసే క్యాండిళ్లలోని కంటికి ఇంపైన రంగులు, హాయి గొలిపే పరిమళాలు మనసును ఆనందానికి లోను చేస్తాయి. ఈ పనిలో శ్రద్ధ చాలా కీలకం. నమ్మి చేస్తాం కనుక ఫలితం కూడా చూస్తున్నాం’ అని ఆనందంగా వివరిస్తుంది. ఒక చిన్న ఆలోచనను అమలులో పెట్టి, దానికి సృజనాత్మకతను జోడించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. (చదవండి: కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి) -
ఇంటి పంటగా కుంకుమ పువ్వు!
కశ్మీర్లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు. రూ. 4 లక్షల పెట్టుబడి శైలజారెడ్డి తన మూడు బెడ్రూమ్లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్లలో ఫైబర్ టబ్లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి. ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు. ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు. గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు ఎయిరోపోనిక్స్..? కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే. నవంబర్– డిసెంబర్లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు. మొదటి ఏడాదే పెట్టుబడి! ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశాను. – కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా . మొబైల్: 94912 33492. (సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు) www.youtube.com/ @ShanviSaffronFarms – దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్చార్జ్, గుంటూరు (చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!) -
ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!
ఈ రోజుల్లో ఇంట్లోనే పిజ్జా మేకర్ ఉండాలని కోరుకుంటున్నారు పిజ్జా లవర్స్. ఈ ప్రొఫెషనల్ ఓవెన్ వంటగదిలో ఉంటే.. ఇష్టమైన పిజ్జాలను నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మెషిన్ దిగువన ఉండే డ్యూయల్ హీటింగ్ ఎలిమెంట్స్ పైనున్న సిరామిక్ పిజ్జా ట్రేని వేడి చేస్తాయి. ఈ బేకింగ్ స్టోన్ పిజ్జాని వేగంగా గ్రిల్ చేస్తుంది. లో, హై, మీడియం అనే ఆప్షన్స్తో రూపొందిన ఈ మేకర్.. ఉపయోగించడం చాలా సులభం. పై మూడు ఆప్షన్స్తో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో సుమారుగా 11 అంగుళాల పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇదే మోడల్లో కలర్స్, ఆప్షన్స్ వేరువేరుగా ఉండే డివైస్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. (చదవండి: డబుల్ సైడ్ మల్టీమేకర్! నూనె లేకుండా..) -
కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!
మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. కాగా.. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన భామ కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. గతేడాదిలోనే ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బీజీగా ఉంటోన్న ముద్దుగుమ్మ.. తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన భర్త, కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాజల్ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబ కోసం ఈ వారంలోనే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్నఇల్లు. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖ సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!
ఫిష్ కేకు తయారీకి కావాల్సినవి: శుభ్రం చేసిన చేప ముక్కలు – మూడు కప్పులు(చర్మం, ముల్లు తొలగించి చిన్న ముక్కలు చేయాలి) బ్రెడ్ ముక్కల పొడి – అరకప్పు నూనె – టేబుల్ స్పూను స్ప్రింగ్ ఆనియన్ తరుగు – కప్పు బంగాళ దుంపలు – రెండు మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, తొక్కతీసి చిదుముకోవాలి. చేప ముక్కలను గిన్నెలో వేసి, పచ్చిమిర్చిని తరిగి వేయాలి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర తరుగు, చిదుముకున్న బంగాళ దుంపల మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముక్కలు పట్టేలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మిశ్రమాన్ని టిక్కీల్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల పొడిలో ఈ టిక్కీలను అద్దాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకు నూనె రాసి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దిన ఫిష్ కేక్స్ను బేకింగ్ ట్రేలో పెట్టి అరగంటపాటు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ కేక్ రెడీ. (చదవండి: అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!) -
దసరోత్సాహం! ఈ పండుగవేళ ఇంటిని ఇలా అలంకరిస్తే..
ఇంటి లోపల అడుగుపెట్టగానే మన దృష్టి ముందుగా హాలు, వంటగదివైపే ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్పేస్లో అలంకరణ ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అందమైన గంటలను వేలాడదీయవచ్చు. అలాగే, గుమ్మం ముందూ వివిధ మోడల్స్లో దొరికే గంటలు వేలాడదీయవచ్చు. వాటికి నచ్చిన రంగులతో పెయింట్ చేయవచ్చు. ఇంటి లోపల మెట్లు ఉంటే ఫెయిరీ లైట్లను, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రమిదలనూ అమర్చుకోవచ్చు. బొమ్మల కొలువు ఏర్పాటుచేసుకోవచ్చు. కర్టెన్స్ .. పెయింటింగ్స్ గాడీగా కాకుండా సింపుల్గా ఉండాలనుకుంటే లివింగ్ రూమ్లో సంప్రదాయ ప్రింట్స్తో ఉన్న కర్టెన్లను ఎంచుకోవాలి. ప్లెయిన్గా ఉండే గోడలపై పౌరాణిక పాత్రలున్న పెయింటింగ్స్ను అలంకరించుకోవచ్చు. లివింగ్ రూమ్ ఫ్లోర్ డల్గా ఉంటే వెంటనే కళాత్మకమైన డిజైన్ ఉన్న కార్పెట్ను వేసి గది శోభను పెంచొచ్చు. మరింత లుక్ రావాలంటే సెంటర్ టేబుల్ని ఒక సైడ్గా ఉంచి.. ప్రమిదలను ఏర్పాటు చేసుకోవచ్చు. మండపం అలంకరణ దేవుడిని పెట్టుకునే మండపానికి డార్క్ బ్రౌన్ కలర్ వేస్తే బాగుంటుంది. అలాగే పసుపు, గులాబీ, నారింజ రంగుల్లో పూల దండలతో అలంకరించుకోవాలి. మండపం ముందు రంగోలీకి బదులు సంప్రదాయ కార్పెట్ను వాడొచ్చు. మధ్యలో రాగి లేదా ఇత్తిడి గిన్నెను నీళ్లతో నింపి పువ్వులతో అలంకరించాలి. పూజగది గుమ్ముం ముందు రెండు ఏనుగు బొమ్మలను ఉంచితే ఇంట్లో ఆలయం కొలువుదీరిన అనుభూతి కలుగుతుంది. క్రొషే కళ పండగ ప్రత్యేక అలంకరణలో మరో ఆకర్షణీయమైన హంగు క్రోషే డిజైన్. ప్లెయిన్ గోడలపై క్రోషే వాల్ హ్యాంగింగ్స్ను వేలాడదీస్తే అద్భుతంగా ఉంటుంది. క్రోషే హ్యాంగింగ్స్ వద్దనుకుంటే క్రోషే తోరణాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. (చదవండి: థాయిలాండ్లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!) -
పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారామె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటిగా పురస్కారం లభించింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అయితే తాజాగా ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పంచుకుంది. సోనమ్ కపూర్ అహూజా పండుగ రోజే ముంబయిలోని కొత్త ఇంటికి చేరింది. ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్కు ఏడాది వయసున్న వాయు కపూర్ అహుజా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇది తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోనమ్కు అభినందనలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్స్టాలో రాస్తూ..'మేము ఈ వారంలో మా కొత్త ఇంటికి మారాం . ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మనసులు ఆశతో నిండి ఉన్నాయి. ఇక్కడ కొత్త జ్ఞాపకాలను కోసం మేము వేచి ఉండలేము' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్తో పాటు తాను ఇంట్లో కూర్చొని ఉన్న అందమైన ఫోటోలు పంచుకుంది. (ఇది చదవండి: ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
కొత్తింట్లో చేరిన బిగ్ బాస్ శివజ్యోతి.. వీడియో చూశారా?
తీన్మార్ వార్తలతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలంగాణ ముద్దుబిడ్డ శివజ్యోతి. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని అందరి దృష్టని ఆకర్షించింది. వెంటితెరపై యాంకర్గానే పరిచయమైన శివజ్యోతి.. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా మరింత ఫేమస్ అయింది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: తన ఇంటిని చూపించిన శివజ్యోతి.. ఆ బాధతో కంటతడి!) అయితే ప్రస్తుతం తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్తో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన చెందిన శివజ్యోతి.. గంగూలీ అలియాస్ గంగులుని ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని గతంలో ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తాజాగా తన ఛానెల్ ద్వారా గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. వీడియో చూస్తే గేటేడ్ కమ్యూనిటీలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో శివజ్యోతి ఫ్రెండ్స్, బుల్లితెర నటీనటులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివజ్యోతి, గంగూలీ దంపతులు అతిథులందరికీ అద్భుతమైన వంటకాలతో స్వాగతం పలికారు. అయితే గతంలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసిన శివజ్యోతి కొన్ని రోజులకే అమ్మేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!) -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్తో గది కార్నర్ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
‘ఫ్లోరా’ ఎయిర్ ప్యూరిఫైయర్ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పచ్చదనానికి లోటు రాకుండా, గాలిని ఇట్టే పరిశుభ్రం చేసేస్తుంది. చాలా ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీలో ప్లాస్టిక్, లోహాలను విరివిగా వాడతారు. అమెరికన్ కంపెనీ ‘ఫ్లోరా’ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రం సహజసిద్ధమైన పదార్థాలతోనే తయారు కావడం విశేషం. దీని తయారీలో అత్యధిక భాగం కలప, గాజు, సిరామిక్ వంటి ప్రకృతికి హాని కలిగించని పదార్థాలనే వాడారు. దీని లోపలిభాగంలో నిత్యం పచ్చగా ఉండే సజీవమైన సముద్రపు నాచును ఉపయోగించారు. ఇది రెండంచెల్లో గాలిని శుభ్రం చేస్తుంది. ఒక అంచెలో నాచు, మరో అంచెలో ఇందులో కొబ్బరిపీచుతో ఏర్పాటు చేసిన కార్బన్ ఫిల్టర్ గాలిలోని సూక్ష్మకణాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇందులో బెడ్లైట్కు సరిపోయే బల్బును కూడా అమర్చడంతో గదిలో ఒక మూల పెట్టుకుంటే, ఇంటి అలంకరణకే వన్నె తెచ్చేలా కనిపిస్తుంది. దీని ధర 141.85 డాలర్లు (రూ.11,806) మాత్రమే! -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్లో ఉన్న పిల్లల మూడ్స్ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్పల్లిలోని భూదేవిహిల్స్లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
ఉత్సాహంగా టిడ్కో గృహ ప్రవేశాలు
కాకినాడ : టీడీపీ పాలనలో జరిగిన అసంపూర్ణ నిర్మాణాలు, లోపాలను సరిచేసి ప్రైవేటు లేఅవుట్లలో ఉండే బహుళ అంతస్తుల భవనాల తరహాలో రూపుదిద్దుకున్న టిడ్కో గృహాలను శుక్రవారం జిల్లా కేంద్రం కాకినాడలో లబ్ధిదారులకు అప్పగించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి విడత 1,152 మందికి ఇళ్ల పత్రాలు, తాళాలు అప్పగించారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఇళ్లను చూసుకుని లబ్ధిదారులు మురిసిపోయారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్న చొరవ వల్ల లబ్ధిదారుల సొంతింటి కల సాకారమైందన్నారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రూ.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమకూర్చిన రెండు ఉచిత బస్సులను మంత్రి సురేష్ ప్రారంభించారు. అవినీతిపరుడిని వెనుకేసుకొస్తున్న పవన్ టీడీపీ, జనసేన పొత్తుకు ఎలాంటి అజెండా లేదని, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబును పవన్కళ్యాణ్ వెనకేసుకురావడాన్ని మంత్రి తప్పుబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలిస్తున్నట్టు చెప్పారు. అమ్మఒడి వంటి ప్రయోజనాలు కల్పించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
వడ్డీ రేట్లు పెరిగితే ఇళ్ల కొనుగోలుపై ప్రభావం
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరిగి 9.5 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, మెజారిటీ ఔత్సాహిక కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇండియా నిర్వహించిన ‘కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే’తో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఈ వివరాలను అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. మెజారిటీ ప్రజలు మధ్యస్థ, ప్రీమియం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది మూడు పడకల ఇళ్లకు తమ ప్రాధాన్యం అని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంతో 66 శాతం మంది (సర్వేలో పాల్గొన్న) ఖర్చు చేసే ఆదాయంపై ప్రభావం పడినట్టు తెలిపారు. వడ్డీ రేటు 9.5 శాతం దాటితే అది తమ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావిం చేస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం సగటు గృహ రేటు 9.15 శాతంగా ఉంది. 59 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్ పరిధిలోని ఫ్లాట్ల కోసం చూస్తున్నట్టు చెప్పారు. రూ.45 - 90 లక్షల మధ్య ఇళ్ల కొనుగోలుకు 35 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఇంటి కోసం 24 శాతం మంది చూస్తున్నారు. 48 శాతం మంది 3బీహెచ్కే ఇళ్లకు, 39 శాతం మంది 2బీహెచ్కే ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 3బీహెచ్కే ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారు 41 శాతం నుంచి 48 శాతానికి పెరిగారు. రూ.40 లక్షల్లోపు ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 2020 మొదటి ఆరు నెలల్లో ఈ తరహా కొనుగోలు దారులు 40 శాతంగా ఉంటే, 2021 అర్ధ భాగంలో 28 శాతానికి, 2023 మొదటి ఆరు నెలల్లో 25 శాతానికి తగ్గారు. -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
మనం చేసే కొన్ని రెసిపీలు ఎంత బాగా చేసినే ఏదో లోపంతో సరిగా రావు. ఒక్కోసారి బాగా వచ్చిన వంటకం కూడా దెబ్బేస్తుంది. అలాంటప్పుడూ పెద్దలు చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మన కుటుంబసభ్యులకు ఎలాంటి ఢోకా లేకుండా మంచి రుచికరంగా వండిపెట్టొచ్చు. ఆ వంటింటి చిట్కాలు ఏంటో చూద్దాం!. ఇలా చేయండి.. గోరు వెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారుగంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. అప్పడాలు, వడియాలు, పల్లీలు, కరివేపాకు వంటివి నూనె ఎక్కువ పీల్చకుండా డీప్ఫ్రై చేయాలంటే.. ముందుగా వాటిని ఇనుప జాలీ గరిటలో వేసి గరిటను కాగిన నూనెలో ముంచుతూ పైకి లేపుతూ ఫ్రై చేయాలి. ఇలా చేస్తే నూనె తక్కువగా పీల్చడంతో పాటు క్రిస్పీగా, రుచిగా వస్తాయి. పకోడి, బజ్జీల పిండి కలిపేటప్పుడు పదార్ధాలన్నివేసి కలుపుకున్నాక... చివరల్లో వంటసోడా కలపాలి. ఇలా కలపడం వల్ల బజ్జీలు నూనె తక్కువగా పీల్చడంతోపాటు మంచి రంగులో కనిపిస్తాయి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
కూరల్లో గ్రేవీ కోసం..చల్లటి నీళ్లు పోస్తున్నారా..!
కూరలు వండేటప్పుడే ఒక్కొసారి బాగా రావు. లేదా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న ఈ చిట్కాలు పాటిస్తే వాటినిపడేయాల్సిన అవసరం లేకుండా మంచిగా వాడుకోవచ్చు. అలాగే రుచి పోకుండా చేయొచ్చు కూడా. అవేంటో చూసేద్దామా!. గ్రేవి రుచికరంగా పోషకాలు పోకుండా ఉండాలంటే.. పాలకూరలో టీస్పూను పంచదార, కాసిన్ని నీళ్లుపోసి పది నిమిషాలపాటు మరిగించి, తరువాత చల్లటి నీటిలో వేయాలి. చల్లారాక గ్రైండ్ చేసి గ్రేవీల్లోకి వాడుకుంటే పాలకూరలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. కూరల్లో గ్రేవీ కోసం కొన్నిసార్లు నీళ్లు పోస్తుంటాము. అయితే ఇలా పోసే నీళ్లను కాస్త మరిగించి పోస్తే కూర వేడికి వేడినీళ్లు చక్కగా సరిపోయి గ్రేవీ మరింత రుచికరంగా వస్తుంది. చల్లటి నీళ్లుపోస్తే ఆ నీరు కూర ఉష్ణోగ్రతలకు చేరుకోవడానికి సమయం పట్టి గ్రేవీ అంత రుచిగా రాదు. కారం ఎక్కువైతే.. ఆలు పరాటా చేసేటప్పుడు .. ఉడికించిన బంగాళదుంపలను ఇరవై నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక దుంపల తొక్కతీసి ఆలు పరోటా చేస్తే దుంపల మిశ్రమం అతుక్కోకుండా, జిగట లేకుండా పరాటాలు చక్కగా వస్తాయి. కూరలో కారం, మసాలా ఘాటు ఎక్కువైనప్పుడు, పెరుగు, ఫ్రెష్క్రీమ్, పాలు... వీటిలో ఏ ఒక్కటైనా కూరను బట్టి రెండు మూడు టే బుల్ స్పూన్లు వేసి కలిపితే ఘాటు తగ్గుతుంది. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న నగరాలేంటో తెలుసా?
పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్లో ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే, కోల్కతాలు ఉన్నాయి. ఇంటి ధరను, ఏడాదికి ఓ కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వారి ఆదాయంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో వివరిస్తుంది. వాటిలో 23 శాతం నిష్పత్తితో పుణె, కోల్కతా 26 శాతం చొప్పున ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ సందర్భంగా ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న 8 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ముంబై, ఢిల్లీ - ఎన్సీఆర్, బెంగళూరు,చెన్నై, కోల్కతా, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్లు మోస్ట్ అఫార్డబుల్ ఇండెక్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నాయి. నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఒక నగరంలో ఇల్లు కొనుగోలు స్థాయి 40 శాతం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు ఆ యూనిట్ కోసం హౌసింగ్ లోన్ ఈఎంఐకి చెల్లించేందుకు వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఆదాయ నిష్పత్తి భరించలేనిదిగా పరిగణిస్తుంది. -
స్వాతంత్య్ర వేడుకల్లో సీమా హైదర్.. జేజేలు కొడుతూ..
లక్నో: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేనా(ఎమ్ఎన్ఎస్) సీమా హైదర్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. #Pakistan national #SeemaHaider was seen hoisting the Tricolour at her house in #Noida as part of #HarGharTiranga campaign ahead of #IndependenceDay.https://t.co/NUvcWcZMeB — IndiaToday (@IndiaToday) August 14, 2023 తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. సీమా మిస్టరీ.. 2019లోనే సిమా హైదర్, సచిన్ ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: అజిత్తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్ పవార్ -
కాంతి వంతమైన ముఖం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!
మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కటి మేని సౌందర్యాన్ని, కురులు అందాన్ని పెంపొందించుకోవచ్చు. వాటి ముందు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా పనికిరావనే చెప్పాలి. కాస్త ఓపికతో చేసుకుంటే ఇంట్లో వంటి వాటితోటే సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం! అందులో ముందుగా మనం జ్యూస్గానూ, కూరగాను ఉపయోగించే కాయగూర అయిన బీట్రూట్ ముఖ్య సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బీట్రూట్లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందం దృష్ట్యా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మంచి యాంజీ ఏజింగ్గా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహయపడుతుంది కూడా చర్మానికి రోజీ గ్లో ఇస్తుంది. మెరిసే మేని కాంతి కోసం బీట్రూట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం! తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పదినిమిషాలు నానబెట్టాలి. పదినిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈనీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. (చదవండి: మీ ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే..జీలకర్రతో..) -
అధికారిక బంగ్లాలోకి రాహుల్ ఎంట్రీ.. కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: పార్లమెంటేరియన్గా మళ్లీ గుర్తింపు పొందిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాస భవనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇండియా అంతా నా ఇల్లే అని వ్యాఖ్యానించారు. 2019 నాటి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో రాహల్ గాంధీకి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు రద్దు అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాలీ చేయాల్సి వచ్చింది. రాహుల్ గాంధీకి ఇంతకు ముందు ఇచ్చిన తిలక్ లేన్లోని బంగ్లా 12నే మళ్లీ ఆయనకు అధికారిక నివాసంగా కేటాయిస్తూ లోక్సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పు అనంతరం ఆయన తన అధికారిక నివాసాన్ని ఏప్రిల్లో ఖాలీ చేశారు. కానీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సందర్భంగా ఆయన తన పార్లమెంటరీ పదవికి మళ్లీ అర్హత సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్సభలోకి అడుగుపెట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం -
జర్నీలో వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్నెస్ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీల వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో ఒకటి రెండు యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. అరగ్లాసు నీటిలో చెంచాడు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి పరగడుపున తాగితే వాంతులు రావు. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తీసుకుని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తిన్నా సమస్య నుంచి బయటపడచ్చు..ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు రాకుండా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చర్మం కాంతిమంతంగా... మృదువుగా తయారవుతుంది. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా! ఇలా చేసి చూడండి!) -
పాపమని పనిలో పెట్టుకుంటే.. రాత్రికి రాత్రే..
వరంగల్: అపరిచిత వ్యక్తిని పనిలో పెట్టుకుంటే చివరికి గోదాంనే లూఠీ చేశాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని పరిమళ కాలనీలో జరిగింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నగరంలోని ప్రశాంత్నగర్కు చెందిన చక్రవర్తి హనుమకొండ టైలర్ స్ట్రీట్లో ఓ గార్మెంట్ (బట్టల)షాపు నిర్వహిస్తున్నాడు. అందుకు సంబంధించిన గోదాం పరిమళ కాలనీలో ఉంది. బట్టల షాపులో పనిచేయడానికి ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపల్లి గూడేనికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని పనిలో కుదుర్చుకున్నాడు. రోజూ ఉదయం షాపుకు వెళ్లి రాత్రి గోదాం ముందు రూంలో వచ్చి నిద్రించేవాడు. రోజు మాదిరిగా సుబ్రహ్మణ్యాన్ని యజమాని రాత్రి గోదాం వద్ద వదిలి పెట్టాడు. శుక్రవారం ఉదయం గోదాం వద్దకు వచ్చిచూసే సరికి పని మనిషి కనిపించలేదు. ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్. గోదాంలో సుమారు రూ.2.50లక్షల స్టాక్ మాయమైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. -
సెలూన్కి వెళ్లే పని లేకుండా..మీ హెయిర్ని స్ట్రయిట్ చేసుకోండిలా..!
కర్లీ హెయిర్ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్కి వెళ్తూ వారి చెప్పిన సెషన్లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్ పెట్టి జస్ట్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నేచురల్గా చేసుకునే హోం ప్యాక్లు ఏంటంటే.. మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపిం బ్రెష్తో జుట్టుకి ప్యాక్ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్ అవుతుంది. మరొకటి యాపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లెన్సర్ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్లా వేసిన స్ట్రయిట్గా అవుతుంది. ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్ అవ్వడానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ముందుగా ఈ ప్యాక్కి కావాల్సినవి: బియ్యం ఒక కప్పు కొబ్బరి ముక్కలు పావు కప్పు నీరు కప్పు నానబెట్టిన మెంతులు 3 చెంచాలు అలోవేరా జెల్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓ చెంచా తయారీ విధానం: ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్ అయ్యి, ధృఢంగా ఉంటుంది. (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా
సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన ఇంట్లో చోరీ జరిగింది. ఈమె చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాసకాలనీలో తల్లితో కలిసి ఉంటుంది. రెండస్తుల భవనంలో పైభాగంలో వీరు నివశిస్తూ, కింది భాగంలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కాగా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పరిచర్యలు కోసం కడలూరు జిల్లా, కొట్టుమన్నార్ కోవిల్కు చెందిన విజయ అనే మహిళను పనికి చేర్చుకున్నారు శోభన. (ఇదీ చదవండి: వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల.. దుస్తులు తొలగించి ఆపై..) కాగా గత కొద్దిరోజులుగా తల్లి డబ్బు చోరీకి గురవుతున్న విషయాన్ని శోభన గుర్తించారు. వారి ఇంటికి ఇతరులెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో పనిమనిషి విజయను ఆమె ప్రశ్నించింది. ఆమె తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో శోభన స్థానిక తేనాంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారించారు. (ఇదీ చదవండి: తమ్ముడిని పక్కన పెట్టిసిన సూర్య.. అసలు ప్లాన్ ఇదేనా?) గత మార్చి నెల నుంచి రూ.41 వేల వరకు దొంగలించినట్లు అంగీకరించింది. డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ద్వారా కూతురికి గూగుల్ పే చేసినట్లు చెప్పింది. పేదరికం కారణంగానే దొంగతనం చేశానని, తనను పని నుంచి తప్పించవద్దని, పోలీసుల ద్వారా శోభనను వేడుకుంది. దీంతో ఆమైపె కేసు నమోదు చేయొద్దని పోలీసులకు చెప్పిన శోభన పనిమనిషిని పనిలో నుంచి తీయకుండా ఆమె చోరీ చేసిన రూ.41 వేలను తన జీతంలో కట్ చేయనున్నట్లు పోలీసులకు తెలిపారు. మరోసారి ఇలాంటి పనులు చేయద్దని, డబ్బు అవసరం అయితే తనను అడగాలని పని మనిషికి శోభన సూచించిందట. దీంతో శోభన తీసుకున్న నిర్ణయాన్ని తన ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. తప్పులు ఎవరైన చేస్తారు. ఒక అవకాశం ఇచ్చి చూడటంలో తప్పులేదని వారు తెలుపుతున్నారు. -
ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది. వేపాకు, యాంటీ సెప్టిక్గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. పసుపును పేస్ట్గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా కాళీఘాట్లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు. పోలీస్ స్టిక్కర్తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది. మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు. బీఎస్ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్గా మారిన బెంగళూరు ఏసీపీ! -
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..
గత ఏడాదిలో సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఆమె కొత్త ఇల్లు కొనడంతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో జాక్వెలీన్ కొత్త ఇంటిని కొనింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్-ఆలియా భట్, కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి బడా హీరోలు నివసించే ప్రాంతంలో 'మర్డర్-2' బ్యూటీ కొత్త ఇంటిని తీసుకుంది. (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) ఇదే ప్రాంతంలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారని తెలిసిందే. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్లో ఇంటిని కొనుగోలు చేసింది ఈ బ్యూటీ. వ్యాపారా నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో 3 BHK, 4 BHK ఇళ్లు కొనాలన్నా రూ. 12 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ బ్యూటీ ఎన్ని బెడ్ రూమ్స్ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఇంకా తెలియరాలేదు. కానీ సుమారు రూ. 20 కోట్లతో కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. జాక్వెలిన్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వచ్చాయి. సుకేష్ బహుమతిగా పంపించాడా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇదంతా సుకేష్ నుంచి వచ్చిన ప్రాప్తం అంటూ మరోకరు కామెంట్ చేశారు. మరోకరు అయితే ఏకంగా 'సుకేష్ డబ్బుతోనా లేక సల్మాన్ భాయ్తోనా?' ఇని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆమెకు బెమధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్ మాత్రం జైళ్లోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: జాక్వెలిన్కు కాకుండా నాటునాటుకు ఆస్కార్.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) (ఇదీ చదవండి: (Kajal Aggarwal: నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్) -
పోర్చుగల్లో ఈ ఇళ్లు చాలా ఫేమస్.. అంతలా ఏముందంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్లోని గిమెరెస్లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్హౌస్లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్హౌస్ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్లో పర్యాటక ఆకర్షణగా మారింది. -
చెప్పులు లేకుండా అమితాబ్.. ఆ సీక్రెట్ రివీల్
సినీ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ . ఎంతో మంది నటులకు ఆయన స్ఫూర్తి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయనకు బాలీవుడ్ వరకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసమే, అమితాబ్ గత 41 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం తన ఇంటి బయట అభిమానులను పలకరించే ఆచారం ఉంది దానిని అందరూ 'జల్సా' బంగ్లా అంటారు.! ఇదీ చదవండి: (ఇదీ చదవండి: పెళ్లికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అమ్మాయిల పనే అదట!) ప్రతి ఆదివారం, ముంబైలోని అమితాబ్ బచ్చన్ యొక్క జల్సా బంగ్లా వెలుపల వందలాది మంది అభిమానులు గుమికూడుతారు. ఆ సమయంలో తను చివరన నిలబడి అభిమానులను పలకరిస్తాడు. ఈ సమయంలో అమితాబ్ ఎప్పుడూ చెప్పులు లేకుండానే కనిపిస్తాడు. తాజాగా దాని వెనుక ఉన్న కారణాన్ని ఆయన వెల్లడించాడు. ఈ విషయంపై కొందరు వివాదాస్పదంగా కూడా తనను ప్రశ్నించినట్లు తెలిపాడు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఎవరైనా గుడికి చెప్పులు వేసుకుని వెళ్తారా? వెళ్లరు కదా అంటూ.. ' ప్రతి ఆదివారం నా కోసం వచ్చే అభిమానులే నా శ్రేయోభిలాషులు.. వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తాను. అలాంటప్పుడు వారు నిల్చున్న ప్రాంతం గుడితో సమానం అని భావించాను కాబట్టే నాలుగు దశాబ్ధాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను' అని తెలిపాడు. తన కోసం వచ్చిన అభిమానులు తీవ్రమైన ఎండలో నిల్చోని ఉంటే.. చెప్పులు వేసుకుని దర్జాగా ఎలా ఉండగలుగుతానని అమితాబ్ పేర్కొన్నారు. బచ్చన్ ఇటీవల ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్నా ' ప్రాజెక్ట్ కె ' షూటింగ్లో ఉండగా గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు. -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి
చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్ నగర్లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్ అన్నారు. ‘మన దేశానికి సుందర్ పిచాయ్ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా. రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్పూర్కు వెళ్లేవరకు సుందర్ పిచాయ్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్ పిచాయ్ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు. -
జగనన్న లేఔట్లు : ఇవీ ఆధారాలు, నమ్మకండి అవాస్తవాలు
కంకిపాడు (పెనమలూరు): జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సకల హంగులు సమకూరుతుండటంతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలతో లే అవుట్లు కాస్తా ఊళ్లను తలపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన లే అవుట్లు కార్పొరేట్ సంస్థలు నిర్మించే లే అవుట్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు నిధులు కేటాయింపులు, పరిపాలనా ఆమోదం లభించాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 670 లే అవుట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 93,245 గృహాలు మంజూరు చేయగా, 91,250 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది నాటికి 13వేల గృహాలు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 14,023 గృహాలు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయటంతో జిల్లా ప్రథమస్థానం దక్కటం తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 362.15 కోట్ల సొమ్మును లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం చెల్లింపులు చేశారు. వేగంగా వసతుల కల్పన.. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా జగనన్న లే అవుట్లు (జగనన్న కాలనీలు)లో వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయా లే అవుట్ల మెరక పనులు, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ పనులకు ఇప్పటికే రూ. 82.66 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో కాలనీలకు విద్యుత్ వసతి, రహదారి వసతి సమకూరింది. మెరక పనులతో ముంపు సమస్య నుంచి లబ్ధిదారులకు ఊరట లభించింది. తాగునీటి వసతుల కల్పనకు గానూ రూ. 64.88 కోట్లు నిధులు వెచ్చించి వసతులు కల్పించారు. దీంతో నివేశనస్థలం కేటాయించిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో పాటుగా డ్వాక్రా మహిళలకు రూ. 35 వేలు, సీఐఎఫ్ కింద రూ. 35 వేలు, ఉన్నతి పథకం కింద రూ. 50 వేలు రుణాలను బ్యాంకుల నుంచి అందిస్తుండటంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా జగనన్న లే అవుట్లు వసతులతో కూడిన ఊళ్లను తలపిస్తున్నాయి. కార్పొరేట్కు దీటుగా.. పేదలకు కేటాయించిన జగనన్న లే అవుట్లలో వసతుల కల్పనతో పాటుగా కార్పొరేట్కు దీటుగా కాలనీలను తయారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆయా కాలనీలకు ఆకర్షణీయంగా కార్పొరేట్ సంస్థలు నిర్మించే రియల్ వెంచర్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో తొలి విడత 63 లే అవుట్లలో స్వాగత ద్వారాల ఏర్పాటుకు రూ. 2.90 కోట్లు నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించటంతో గృహనిర్మాణ సంస్థ ఆర్చ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించింది. వారంలో పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అయ్యింది. సకల వసతులు కల్పిస్తున్నాం.. జగనన్న లే అవుట్లను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే 15వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. వసతుల కల్పనలో రాజీ పడకుండా సమర్థంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నాం. స్వాగత ద్వారాల పనులు వారంలో ప్రారంభమవుతాయి. – జి.వి.సూర్యనారాయణ, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ, కృష్ణాజిల్లా -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
Anchor Syamala Photos: ఏడాది తిరగకముందే మరో ఇల్లు కడుతున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..
భార్యభర్తలిద్దరు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఆయన లేని జీవితం తనకూ వద్దంటూ మృతుడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అజయ్ పాల్(37), మౌనిక (32) ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బుధవారం మౌనిక పాల్ భర్త నోటి నుంచి నురగతో స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, ఇటీవలే అతను ఎయిర్ ఫోర్స్ జాబ్ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత) -
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ సేకరించింది. ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. చదవండి: రింగ్ మాస్టర్కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా! -
కియారాకు సిద్ధార్థ్ మ్యారేజ్ గిఫ్ట్ అదే..!
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని జైసల్మీర్ ప్యాలెస్లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్లో ఇప్పటికి వరకు జరిగిన పెళ్లిల్లలో ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది. కాగా.. షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రాజస్థాన్, దిల్లీ పర్యటన తర్వాత ప్రస్తుతం ముంబయికి చేరుకుంది కొత్త జంట. తాజాగా వీరి ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 కోట్లు అని బీ టౌన్లో చర్చ నుడుస్తోంది. త్వరలోనే నూతన వధూవరులు ఆ ఇంటిలోకి మారనున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఈ భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ తన భార్య కియారా కోసం ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. జైసల్మీర్లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత శనివారం ముంబయికి తిరిగి వచ్చింది జంట. ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటులు, స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
'అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది'? నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన కౌంటర్
సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కవర్ సాంగ్స్, డబ్స్ మ్యాష్తో గుర్తింపు పొందిన దీప్తి బిగ్బాస్ సీజన్-2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. రీసెంట్గా ఏమోనో అనే కవర్ సాంగ్తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీప్తి సునయన తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం అదిరికపోయే కౌంటర్ ఇచ్చింది. మీరు కొత్త ఇల్లు కొన్నారు కదా అంత డబ్బు ఎక్కడది అని నెటిజన్ అడగ్గా.. యూట్యూబర్గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నేను సంపాదించిన దాంట్లో ముప్పై శాతం ఖర్చు పెట్టుకొని మిగతా డెబ్బై శాతం సేవ్ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బులతో ఇల్లు కొన్నాను అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక రీసెంట్గా కొత్త ఇంట్లోకి కూడా షిఫ్ట్ అయినట్లు ఆమె చెప్పుకొచ్చొంది. -
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
అంత్యక్రియల సమయంలో ఊపిరి పీల్చుకున్న మహిళ ..ఆ తర్వాత..
అంతక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది ఓ వృద్ధ మహిళ. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కంగుతిన్న అంత్యక్రియ నిర్వాహకులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ మహిళ ఆస్పత్రికి తరలించిన ఐదు రోజుల తర్వాత అనుహ్యంగా మరణించింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలో అయోవా రాష్ట్రంలో 66 ఏళ్ల మహిళను గ్లెన్ ఓక్స్ అల్జీమర్స్ స్పెషల్ కేర్లో చనిపోయినట్లు ధృవీకరించింది. దీంతో ఆమెను మృతదేహాలు ఉంచే బ్యాగ్లో ప్యాక్ చేసి శ్మశానానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా..అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది సదరు వృద్ధ మహిళ. దీంతో కంగారు పడిన కార్మికులు వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ కేర్ హోమ్ సెంటర్కు దాదాపు రూ. 8 లక్షలు జరిమానా విధించారు అధికారులు. అయితే విచారణలో..ఆస్పత్రి సిబ్బంది ఆమె జనవరి 3 నుంచి మహిళ శ్వాస తీసుకోవడం లేదని, పల్స్ నమోదు కాలేదని చెప్పారు. ఆ రోజు రాత్రంత సదరు మహిళను నర్సు పర్యవేక్షణలో ఉంచారు. ఐతే వృద్ధురాలి పల్స్ రికార్డు కాకపోవడం, శ్వాస తీసుకోకపోవడతోనే ఆమె చనిపోయినట్లు ధృవీకరించినట్లు దర్యాప్తులో తేలింది. అది కూడా ఆమె హెల్త్ రిపోర్టు వచ్చిన 90 నిమిషాల తర్వాత మరణించినట్లు ఆస్పత్రి ప్రకటించింది. కానీ చనిపోయిందని ప్రకటించడానికి చేయాల్సిన తగిన సంరక్షణ సేవలను అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఆమె డిసెంబర్ 28 నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐతే ఆమె శ్మాశన వాటికి నుంచి తీసుకువచ్చిన రెండు రోజుల అనంతరం జనవరి 5న ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కానీ ఆ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డ్రైరెక్టర్ లిసా ఈస్టమన్ తమ పేషెంట్లను బహు జాగ్రత్తగా పర్యవేక్షిస్తామని వాళ్ల ప్రాణ సంరక్షణకు కావల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిచడానికే తమ సిబ్బంది కట్టుబడి ఉంటారని చెప్పడం గమనార్హం. (చదవండి: దొంగతనానికి వచ్చి బాత్టబ్లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..) -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్!
సాక్షి, హైదరాబాద్: కరోనాతో సొంతింటి అవసరం పెరిగింది. దీంతో గతేడాది గృహ విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అందుబాటు వడ్డీ రేట్ల, ప్రభుత్వ రాయితీలు, డెవలపర్ల ఆఫర్లు వంటివి ఈ రంగంలో డిమాండ్ను మరింత పెంచాయి. దీంతో గృహ కొనుగోలుదారులలో సానుకూల దృక్పథం నెలకొందని నో బ్రోకర్.కామ్ వార్షిక నివేదిక వెల్లడించింది. లగ్జరీ గృహాలకు డిమాండ్, అద్దెలు పెరగడం, ప్రవాసుల ఆసక్తి, స్థలాలకు గిరాకీ పెరగడం ఇవే ఈ ఏడాది స్థిరాస్తి రంగానికి చోదకశక్తిలా మారతాయని అంచనా వేసింది. గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి రంగంలోని పలు ఆసక్తికర అంశాలివే.. ► ఈ ఏడాది సొంతిల్లు కొనుగోలు చేయాలని 82% మంది ఆసక్తిగా ఉన్నారు. 31% మంది అద్దెలు పెరిగిపోతుండటంతో సొంతిల్లు కొనాలని భావిస్తుండగా.. 34% సెక్యూరిటీ, 21% అందుబాటు ధరలు, 6% డబ్బు ఆదా, 8% పెళ్లి కోసం ఇల్లు కొనాలనుకుంటున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు 75% మంది ఆసక్తి చూపిస్తుండగా.. నిర్మాణంలో ఉన్న వాటిల్లో 8%, ప్లాట్ కొనేందుకు 17% మంది సిద్ధంగా ఉన్నారు. ► 50% మంది వ్యక్తిగత గృహాలు కొనాలని భావిస్తుండగా 38% మంది గేటెడ్ కమ్యూనిటీలో, 12 శాతం మంది ప్లాట్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి కొనుగోలు సమయంలో నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడట్లేదు. 64 శాతం మంది క్వాలిటీ గురించి వాకబు చేస్తుండగా.. 39 శాతం అనుమతులు, 25 శాతం డెవలపర్ పాత చరిత్ర, 25 శాతం బిల్డర్ నమ్మకం మీద ఆధారపడి కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. 78 శాతం మంది వాస్తు ఉన్న ఇళ్లకు మొగ్గుచూపించగా.. 22 శాతం మంది అవేవీ పట్టించుకోవట్లేదు. ► సొంతింటి కొనుగోలులో పెద్దలదే పైచేయి. 37 శాతం మంది 50 ఏళ్ల పైబడిన కొనుగోలుదారులే ఉండగా.. 36 శాతం 25–40 ఏళ్ల వయస్కులు, 25 శాతం 40–50 ఏళ్లు, 2 శాతం 18–15 ఏళ్ల వాళ్లున్నారు. 65 శాతం మంది పురుషులే కాగా.. 35 శాతం మహిళా యజమానులున్నారు. ఉద్యోగాల వారీగా చూస్తే.. 53 శాతం ప్రైవేట్ ఉద్యోగస్తులే గృహ కొనుగోలుదారులు కాగా.. 28 శాతం మంది వ్యాపారస్తులు, 19 శాతం ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ► నగరంలో 59 శాతం మంది తొలిసారి గృహ కొనుగోలుదారులే. 84 శాతం మంది సొంతంగా ఉండేందుకు ఇళ్లను కొనుగోలు చేస్తుంటే.. 16 శాతం పెట్టుబడిరీత్యా కొంటున్నారు. ఇందులోనూ 79 శాతం మంది నివాస సముదాయాలలో ఇన్వెస్ట్మెంట్స్కు ఆసక్తి కనబర్చగా, 21 శాతం వాణిజ్య పెట్టుబడులకు జై కొట్టారు. ఎంపికలో ‘కీ’లకమైనవివే.. నగరవాసుల సొంతింటి ఎంపికలో అత్యంత కీలకమైనది ధర ఎంతనేదే. 68% బడ్జెట్ ఆధారంగా కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యధికంగా 46% మంది రూ.60 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు ఆసక్తిగా ఉండగా.. 25% మంది రూ.60–80 లక్షలు, 18% రూ.80 లక్షలపైన, 11 శాతం రూ.కోటి పైన ధర ఉన్న ఇళ్లు కొనాలని భావిస్తున్నారు. బడ్జెట్ కాకుండా 30% నీటి సరఫరా, 32% ఆఫీసు నుంచి దూరం, 22% ప్రజా రవాణా సదుపాయాలు, 19% ఇంటి విస్తీర్ణం, 24% వసతులు, 22% మంది ధరలో వృద్ధి ఆధారంగా ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
దుమ్మురేపుతున్న ఇళ్ల అమ్మకాలు.. హైదరాబాద్లో ఎన్నంటే!
దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో గతేడాది 3,12,666 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 34 శాతం అధికం కాగా, తొమ్మిదేళ్లలో ఇదే గరిష్టం కావడం విశేషం. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ స్థాయి వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ‘ముంబై అత్యధికంగా 85,169 యూనిట్లతో 35 శాతం వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ 58,460 యూనిట్లతో 67 శాతం, బెంగళూరు 53,363 యూనిట్లతో 40 శాతం, 43,410 యూనిట్లతో పుణే 17 శాతం అధికంగా విక్రయాలు నమోదు చేసింది. 28 శాతం వృద్ధితో హైదరాబాద్ 31,046 యూనిట్లు, 19 శాతం అధికమై చెన్నైలో 14,248 యూనిట్లు, 58 శాతం ఎక్కువై అహ్మదాబాద్లో ఇళ్ల అమ్మకాలు 14,062 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్కత 10 శాతం క్షీణించి 12,909 యూనిట్లకు పరిమితమైంది. 2022లో ఆఫీస్ లీజింగ్ స్థలం స్థూలంగా 36 శాతం అధికమై 5.16 కోట్ల చదరపు అడుగులుగా ఉంది’ అని నివేదిక వివరించింది. -
ఇంట్లోనే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే అదిరిపోయే గాడ్జెట్స్.. ధర ఎంతంటే?
పర్యావరణానికి అతిపెద్ద బెడద ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ చెత్త సమస్య పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వాటిలో భాగమే ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఇప్పటివరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ భారీగా పారిశ్రామిక స్థాయిలోనే అరకొరగా జరుగుతోంది. అయితే, ఇంటిపట్టునే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యంత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ బహుళజాతి సంస్థ ‘క్లియర్డ్రాప్’ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసే ‘సాఫ్ట్ ప్లాస్టిక్ కాంపాక్టర్’ను రూపొందించింది. వాషింగ్ మెషిన్లా కనిపించే ఈ యంత్రంలో ప్లాస్టిక్ సంచులు వంటి మెత్తని ప్లాస్టిక్ చెత్తను పడేసి, స్విచాన్ చేస్తే, నిమిషాల్లోనే రీసైక్లింగ్కు పనికొచ్చే ఇటుకలుగా తయారు చేస్తుంది. ఈ యంత్రం పనిచేసేటప్పుడు ఎలాంటి పొగ వెలువడదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తయారీదారులు చెబుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. -
రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు.. దేశంలోనే దూసుకుపోతున్న హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: 2022 హైదరాబాద్ రియల్టీ నామ సంవత్సరంగా నిలిచింది. గృహ విక్రయాలు, ప్రారంభాలలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. కరోనా, గృహాల ధరలు, వడ్డీ రేట్లు పెరుగుదల ఉన్నప్పటికీ.. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 47,487 అమ్మకాలు, 68 వేల యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021తో పోలిస్తే విక్రయాలలో 87 శాతం వృద్ధి రేటుతో నగరం తొలిస్థానంలో నిలిచింది. 2021లో హైదరాబాద్లో 25,406 గృహాలు అమ్ముడుపోగా.. 2022లో దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో 87 శాతం వృద్ధి రేటు నమోదయింది. 2022లో విక్రయాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో 44 శాతం మాత్రమే వృద్ధి కాగా.. ఎన్సీఆర్లో 59 శాతం, బెంగళూరులో 50%, పుణేలో 59 శాతం, చెన్నైలో 29 శాతం, కోల్కత్తాలో 62 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది హైదరాబాద్లో 51,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఈ ఏడాది 32% పెరుగుదల కనిపించిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. లాంచింగ్స్లో 51 శాతం పెరుగుదల.. దేశంలో గతేడాది 3,57,600 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021లో 2,36,700 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 51 శాతం వృద్ధి. అయితే 2014తో పోలిస్తే మాత్రం 2022లో లాంచింగ్లు తక్కువే. 2014లో 5.45 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. లాంచింగ్స్లో ముంబై, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఈ రెండు నగరాల వాటా 54 శాతంగా ఉంది. 2014 రికార్డు బద్దలు.. 2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3,64,900 గృహాలు విక్రయమయ్యాయి. 2021లో 2,36,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదిలో 54 శాతం వృద్ధి. 2014 తర్వాత ఈ స్థాయిలో గృహాలు అమ్ముడుపోవటం ఇదే తొలిసారి. 2014లో 3.43 లక్షల ఇళ్లు విక్రయమయ్యాయి. ఇళ్ల అమ్మకాలలో ముంబై తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ 1,09,700 యూనిట్లు అమ్ముడుపోగా.. 63,700 యూనిట్లతో ఎన్సీఆర్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. -
కరోనా లాక్డౌన్ నుంచి ఇంట్లోనే.. మూడేళ్లుగా బయటకు రాని తల్లీకూతుళ్లు
సాక్షి, కాకినాడ(కాజులూరు): మండలంలోని కుయ్యేరులో మానసిక అనారోగ్యంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్ల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి అనారోగ్యం పాలవ్వటంతో విషయం తెలసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, స్థానికుల సహకారంతో బలవంతంగా వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలివీ.. కుయ్యేరు గ్రామ పంచాయతీ సమీపంలో నివాసముంటున్న కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో అందరితోపాటు ఇంటికే పరిమితమైన అతని భార్య మణి, కూతురు దుర్గాభవాని మానసిక వ్యధతో నేటికీ బయటకు రాకుండా తలుపులు బిగించుకు ఉండిపోయారు. చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి పిలిచినా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండేవారు. దీంతో క్రమేపీ ఎవరూ వీరిని పలకరించటం మానేశారు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ వీరికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తున్నాడు. కొన్ని రోజులు అతని భార్య ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో సూరిబాబు తన భార్యకు వైద్యం అందించమని దుగ్గుదుర్రు పీహెచ్సీలో సిబ్బందిని కోరాడు. చదవండి: (మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ) మంగళవారం వైద్యసిబ్బంది వచ్చి పిలిచినా తలుపులు తియ్యలేదు. గ్రామ సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, స్థానికుల సహకారంతో తులపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. అయితే తల్లి, కూతుళ్లు వైద్యానికి నిరాకరిస్తూ సిబ్బందిపై దాడి చేశారు. సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి ఫోన్లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు సమాచారమందించగా ఆయన ఆదేశాల మేరకూ గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భార్య, కుమార్తె మానసిక పరిస్థితి బాగోలేదని, ఎప్పటికైనా సరౌతుందనే భావనతో మూడేళ్లుగా ఎవ్వరికీ చెప్పలేదని భర్త సూరిబాబు తెలిపాడు. -
ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ వెల్లడించింది. 2023–24లో 3–5 శాతం ధరలు దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తోంది. ముడి సరుకు వ్యయాలు, కూలీ, స్థలాల ధరలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు, పుణే, కోల్కత నగరాల ఆధారంగా క్రిసిల్ రూపొందించిన నివేదిక ప్రకారం.. రెసిడెన్షియల్ విభాగంలో పెద్ద రియల్టర్లు 2022–23లో 25 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయబోతున్నారు. అమ్మకం కాని ఇళ్ల స్థాయి 4 నుండి 2.5 సంవత్సరాలకు వచ్చి చేరింది. ఇది పెద్ద రియల్టర్ల క్రెడిట్ ప్రొఫైల్ను బలపరుస్తుంది. ఖరీదైన ఇళ్లకు డిమాండ్.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మహమ్మారి ముందు పెద్ద రియల్టర్ల వాటా 30 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 40–45 శాతం ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలో పెద్ద రియల్టర్ల వాటా 2022–23లో 24 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి చేరనుంది. మహమ్మారి ముందు కాలంలో ఇది 14 శాతం నమోదైంది. 2020కి ముందు రూ.1.5 కోట్లు ఆపైన ఖరీదు చేసే ఇళ్ల వాటా 25–30 శాతం. ఇప్పుడు ఇది ఏకంగా 40–45 శాతానికి ఎగసింది. రూ.40 లక్షల లోపు ఉండే అందుబాటు ధరల గృహాల వాటా 30 నుంచి 10 శాతానికి పరిమితం అయింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద రియల్టర్లు వాటాల విక్రయం,ఆస్తుల అమ్మకం ద్వారా రూ.18,000 కోట్లు అందుకున్నారు. ఈ సంస్థల ఆస్తుల్లో అప్పుల నిష్పత్తి 2023 మార్చి నాటికి 23 శాతం, 2024 మార్చికల్లా 21 శాతంగా ఉండనుంది. చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం.. ఫోటోలు వైరల్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనంతో స్టార్ యాంకర్గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా హోస్ట్గా ఎక్కువగా శ్రీముఖినే కనిపిస్తుంది. పలు టీవీ ఛానెళ్లలో తనదైన యాంకరింగ్తో ఆకటుకుంటున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఓవైపు యాంకరింగ్గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
తక్కువ ఖర్చుతో ఇండోర్ గార్డెనింగ్: ఈ విషయాలు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మన కలలకు ప్రతిరూపమైన స్వీట్హోంను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా, ఆరోగ్యంగా తీర్చుకోవడం కూడా ఒక కళ అవసరం కూడా. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇంట్లో స్వచ్చమైన గాలి కోసం మొక్కలను పెంచడం పెరిగి పోయింది. దీంతో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగానూ ఉంటాయి. (హైదరాబాద్లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని నిర్వహణ అత్యంత సులువు. చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్ను ఇస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. (యాపిల్ గుడ్న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది. గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, ఆమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచుగా నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే దీనికి నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి. ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువ. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్లో అలంకారప్రాయంగాను వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
తప్పతాగి బెడ్ మీద నగ్నంగా.. పోలీసులు షాక్
ఆయనో ప్రముఖ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తాగుడు అలవాటుకు బానిసయ్యాడు. ఆ మత్తులో తప్పతాగి పరాయి వాళ్ల ఇంట్లో నిద్రపోయాడు. అదీ నగ్నంగా!. ఆ ఇంటి ఓనర్ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. అమెరికాలోని ఫాయెట్విల్లే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...‘‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడంటూ కాల్ వచ్చింది. దీంతో మేము హుటాహుటినా ఆమె ఇంటికి వెళ్లాం. ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి. మేము బలవంతంగా పైకి లేపి కూర్చొబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా అతను మాట్లాడే స్థితిలో లేడు’’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్ చేసే టైసన్ ఫుడ్స్ కంపెనీ వ్యవస్థాపకుడి మనవడు జాన్ ఆర్ టైసన్గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారాయన. ఈ వ్యవహారంతో జాన్ను.. అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాత పేరుప్రఖ్యాతలు, పరువు పొగొట్టిన మనవడిగా ఇప్పుడతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయమే కంపెనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఐతే సదరు ఆఫీసర్ మాత్రం తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు జాన్ టైసన్. ప్రసుతం తాను డ్రింకింగ్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని చెప్పారు. (చదవండి: కాంట్రవర్సీ: తాగుబోతు స్టాంప్ కోసం పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే చాలట!) -
బంగారాన్ని ఇంట్లో దాచుకుంటున్నారా? ఈ పన్నుల కథేంటో తెలుసా?
సాక్షి,ముంబై: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు భారత్. మన దేశంలో బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు పెట్టబడికి ఒక కీలకమైన మార్గం కూడా. బంగారాన్ని లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. పసిడి ఇంట్లో శుభప్రదమని నమ్ముతారు. అందుకే ఆభరణాల నుండి నాణేల వరకు ఇళ్లలో బంగారాన్ని దాచుకోవడానికి ఇష్టపడతారు. అయితే బంగారాన్ని ఇట్లో ఎంతమేరకు ఇంట్లో ఉంచుకోవాలి. అసలు దానికి సంబంధించిన ఏమైనా ఆంక్షలున్నాయా? చట్టప్రకారం ఇంటిలో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు? దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏం చెబుతోంది? అనేది పరిశీలించడం చాలా అవసరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, ఒక వ్యక్తి వెల్లడించిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా పొదుపు చేసిన మొత్తంతో కొనుగోలు చేసినా లేదా చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి పన్ను వర్తించదు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని సెర్చ్ ఆపరేషన్ల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకోలేరు. నిబంధనల మేరకు దాచుకున్న బంగారంపై ఎలాంటి పన్ను వర్తించనప్పటికీ, కానీ దానిని విక్రయించే సమయంలో మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని, అవివాహిత మహిళ 250 గ్రాముల బంగారాన్ని, కుటుంబంలోని పురుషులకు పరిమితి 100 గ్రాములు మాత్రమే. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బంగారం మన దగ్గర ఉంచుకుని తర్వాత దానిని విక్రయించాలనుకుంటే ఆ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం.. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (ఎల్టీసీజీ)కి లోబడి ఉంటుంది, ఇది ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం. బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, ఆ లాభం వ్యక్తి ఆదాయానికి కలిపి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను (SGB) విక్రయించిన సందర్భంలో కూడా లాభాలు మీ ఆదాయంగా లెక్కించి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, లాభాలపై ఇండెక్సేషన్తో 20 శాతం, ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్ని ఉంచితే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. -
సొంత ఇల్లు కోరుకుంటున్నారు
న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో గృహాలకు డిమాండ్ బలంగా ఉంటుందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ తెలిపింది. అధికంగా ఉన్న యువత, వారి ఆర్థిక శక్తి సామర్థ్యాల పురోగతి, గృహ రుణాలపై సాపేక్షంగా కొనుగోలుదారులు తక్కువ ఆధారపడటం వంటి అంశాలు ఇందుకు కారణమని సంస్థ ఎండీ విపుల్ రూంగ్తా శుక్రవారం తెలిపారు. రుణం తీసుకోకుండానే మూడింట ఒక వంతు గృహాలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. గత ఆరు నెలల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు కఠినతరం అయినప్పటికీ భారతదేశ గృహ మార్కెట్ బలమైన డిమాండ్ను సాధిస్తోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఈ ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచిందని గుర్తుచేశారు. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 8 శాతానికిపైగా ఎగశాయని తెలిపారు. పెరిగినా, తగ్గినా కొంటారు.. మధ్య, తక్కువ ఆదాయ గృహాలు మాత్రమే కాకుండా ప్రీమియం, అల్ట్రా–ప్రీమియం విభాగంలో కూడా విపరీతమైన డిమాండ్ ఉండబోతోందని విపుల్ అన్నారు. సొంత ఇంటిని కలిగి ఉండాలన్న తపన ప్రజల్లో పెరుగుతోందని వివరించారు. ‘భారతదేశంలో గృహ యజమానుల సగటు వయస్సు 37 సంవత్సరాలు. దేశంలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. కాబట్టి చాలా స్పష్టంగా, తీవ్రమైన డిమాండ్ ఉండబోతోంది. నిర్మాణ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలి. కస్టమర్లు వడ్డీ రేటు తగ్గితేనే ఇల్లు కొనాలని చూడడం లేదు. వడ్డీ పెరిగినంత మాత్రాన కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవట్లేదు. ఇంటి విలువలో రుణ భాగం 68 శాతం మించడం లేదు. అంటే 30–32 శాతం మొత్తాన్ని సొంత నిధులను సమకూరుస్తున్నారు. భారతదేశంలో ఉన్న తనఖాల విలువ దాదాపు రూ.24,66,000 కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో 11 శాతం’ అని ఆయన అన్నారు. -
చనిపోయినా బతికే ఉన్నాడంటూ... ఇంట్లోనే 18 నెలలుగా ఉంచి..
కాన్పూర్: ఒక కుటుంబం కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని చెబుతూ 18 నెలలుగా ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడు ఆదాయపు పన్ను అధికారి విమలేష్గా పోలీసులు పేర్కొన్నారు. ఐతే అతనికి పెట్టి ఉన్న ఆక్సిమీటర్ తప్పుడూ రీడింగ్ చూపించడంతో అతను బతికే ఉన్నాడని కుటుంబం నమ్ముతోంది. విమలేష్ తల్లి ఆ ఆక్సిమీటర్ని చూసి తన కొడుకు బతికే ఉన్నాడని బలంగా నమ్మడంతో కుటుంబ సభ్యులంతా అతడు బతికే ఉన్నాడనుకన్నారు. అందుకే ఆ అధికారి విమలేష్ మృతదేహాన్ని దహనం చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబసభ్యులను విచారించారు. విచారణలో...తల్లిని నమ్మి విమలేష్ మృతదేహాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐతే మృతుడి భార్య మితాలీ దీక్షిత్ మాత్రం చనిపోయినట్లు తనకు తెలుసునని కానీ కుటుంబ సభ్యులంతా బతికే ఉన్నాడని చెప్పడంతో నమ్మానని చెప్పింది. ఆమె తన భర్త కార్యాలయంలో కూడా అతను చనిపోయినట్లు తెలియజేశానని, కానీ కుటుంబసభ్యలు అనారోగ్యంతో ఉన్నట్లు ఒక లేఖను పంపించారని తెలిపింది. అంతేగాదు వారు 18 నెలలుగా చనిపోయిన వ్యక్తి జీతాన్ని కూడా పొందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శరీరానికి ఉన్న ఆక్సిమీటర్ తప్పడు రీడింగ్ చూపిస్తోందని తెలిపారు. ఇక పోలీసులే జోక్యం చేసుకుని కుటుంబంతో బలవంతంగా సదరు మృతుడికి దహన సంస్కారాలు జరిపించారు. అంతేగాదు పోలీసులు కుటుంబం సంప్రదించిన వైద్యులు వివరాలను కూడా సేకరించడమే గాక కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మృతుడు విమలేష్ సోదరుడు దినేష్ మాత్రం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా బలవంతంగా దహన సంస్కారాలు చేసేశారు, ఇప్పుడేమో విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ వాపోతున్నాడు. అతేగాదు సీఎం పోర్టల్లో పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. (చదవండి: పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు) -
పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమంటున్నాడు!
అడిగినంత కట్నం ఇవ్వకుంటే దానిని తిరిగి ఎలా రాబట్టుకోవాలో తనకు బాగా తెలుసట!పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమంటున్నాడు! -
కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది..
అల్లిపురం (విశాఖ దక్షిణ ): చనిపోయాడు అనుకున్న కొడుకు తిరిగి వస్తే ఆ ఆనందం వర్ణణాతీతం. అలాంటి అనుభవం ఒక తండ్రికి కలిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా గ్రామానికి చెందిన శ్యామ్రావ్ లోఖండే (38) మతిస్థిమితం లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. అలా వచ్చిన వ్యక్తి నగరంలో తిరుగుతుండగా అతడిని భీమ్నగర్ ఏయూటీడీ, టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయ వసతి గృహం సిబ్బంది రక్షించి, మెంటల్ కేర్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందజేశారు. చదవండి: కన్నతల్లిని నమ్మించి.. 12 లక్షలు కాజేసి! చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 31న పూర్తి ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయ్యాడు. దీంతో ఆయనకు భీమ్నగర్ షెల్టర్లో ఆశ్రయం కల్పించారు. అతని వివరాలు తెలుసుకున్న శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు స్వగ్రామం తీసుకెళ్లి తండ్రి ప్రవీణ్కు అప్పగించారు. చనిపోయాడనుకున్న శ్యామ్రావ్ తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
Azadi Ka Amrit Mahotsav: హర్ ఘర్ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా
గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు. ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్ షాట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు డ్రోన్ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది. గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్లైన్లో, పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటి పండగ అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి. మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్ సింగ్ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి. నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్లు పెట్టాలి. ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబుల్ కలామ్ ఆజాద్... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్ రూమ్లో కొలువుదీరాలి. కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్’ వాడితే ఆ అనుభూతే వేరు. ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత. ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం. -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్సర్లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ. -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
కొత్త ఇల్లు కొంటున్నారా? అయితే, వర్షంలోనే వెతకండి.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది. చదవండి: దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు తక్కువే! -
బొద్దింకను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. అట్లాంటిది వాటిని పెంచితే రూ.లక్షన్నర!
కాక్రోచ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే దాన్ని చంపేదాకా మనసూరుకోదు. అలాంటిది ఇంటినిండా బొద్దింకలను ఒక నెలపాటు ఉంచడానికి... రెండు వేల డాలర్లు (సుమారు రూ.1,58,283) ఆఫర్ చేసిందో కంపెనీ. అందుకు 2,500మంది అంగీకరించారు కూడా. బొద్దింకలను పెంచమని ప్రోత్సహించ డం ఏంటనుకుంటున్నారా? వాటిని నిర్మూలించడానికి. అయితే పెంచడమెందుకు అంటే శాశ్వత నిర్మూలన ప్రయోగం కోసం. గతవారం నార్త్ కరోలినాకు చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ఒక ప్రకటన విడుదల చేసింది. 30 రోజులపాటు 100 అమెరికన్ బొద్దింకలను ఉంచి పరిశోధించడానికి ఏడు ఇళ్లు కావాలని తెలిపింది. ఆమోదం తెలిపేవాళ్ల వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి లేదా ఇంటి ఓనర్ ఆమోదం ఉన్నా సరిపోతుందని చెప్పింది. అలాగే వాటి నిర్మూలనకు ఎలాంటి పురుగుల మందులు వాడకూడదని, తాము ఇచ్చిన మందులను మాత్రమే ప్రయోగించాలని వివరించింది. వాళ్లు తయారు చేసిన పురుగుల మందు 30 రోజుల్లో ఆ బొద్దింకలను పూర్తిగా చంపలేకపోతే... 30 రోజుల తరువాత సాధారణ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు వారికి రెండు వేల డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా60వేలు ఇస్తామని పేర్కొన్నది. ఎవ్వరూ ఆసక్తి చూపరేమోనని జూలై 31వరకు గడువు విధించింది. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోవడం కంపెనీ వంతయ్యింది. ఎవరూ ఆసక్తిచూపరని తామనుకుంటే... ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలోంచి తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది. -
రెండిళ్లు కొనుగోలు చేసిన నయనతార.. ఇంటీరియర్ డిజైన్కే రూ.25 కోట్లు!
దర్శకుడు విఘ్నేష్శివన్ను వివాహం చేసుకుని ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నయనతార . తాజాగా ఆమె చెన్నై పోయెస్గార్డెన్లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలో పోయెస్ గార్డెన్ అంటే సెలబ్రెటీలకు కేరాఫ్. పోయెస్గార్డెన్లో రజనీకాంత్, జయచిత్ర ఇళ్లతో పాటు జయలలిత నివాసం వేద నిలయం ఎదురుగా ఆమె నెచ్చెలి శశికళ సైతం ఓ భారీ బంగ్లాను కట్టించారు. (చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య) లేడీ సూపర్స్టార్గా పేరుగాంచిన నయనతార కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి పోయెస్గార్డెన్లోనే నివాసం ఉండేందుకు సిద్ధమైంది. నయనతార కొనుగోలు చేసిన ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని సమాచారం. వీటిని బాలీవుడ్ స్టార్స్ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఒక ప్రముఖ సంస్థ రూ.25 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఇంటిలో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్పూల్, నయనతార, విఘ్నేష్శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్తగా నిర్మించనున్న ఇళ్లలోకి నయనతార, విఘ్నేష్శివన్ జంట త్వరలోనే ప్రవేశించనున్నట్లు ప్రచారం. -
యూట్యూబ్ చానెల్ పేరుతో ఇంట్లోకి చొరబడి, షూట్ చేస్తూ..
మైసూరు(బెంగళూరు): యూట్యూబ్ చానెల్ పేరుతో ఇంట్లోకి చొరబడి డబ్బు డిమాండ్ చేసిన ఐదుమందిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నగరంలోని అశోక రోడ్డులో ఈ ఘటన జరిగింది. కర్ణాటక పబ్లిక్ వాయ్స్ న్యూస్ చానెల్స్ (కేవీపీ న్యూస్)కు చెందిన బసవరాజు, అభిలాష, మణి, నవీన్కుమార్, ప్రదీప్లు ఉమర్ షరీఫ్ అనే వ్యక్తి ఇంటికి కారులో వచ్చారు. కెమెరాలతో షూట్ చేస్తూ మీ ఇంటిలో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ జరుగుతోందని ఒకరు, తాము పోలీసులమని మరొకరు అతనిని గద్దించారు. డబ్బు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. ఇంతలో స్థానికులు వారిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు! -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్గా ఉంచేందుకు... హోమ్లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు ఆడపిల్లలు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లిదండ్రులు
సాక్షి, బళ్లారి: పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు చిన్నారులు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్ఫోన్లో రికార్డు చేశారు. బళ్లారిలోని కొత్త బస్టాండుకు వెళ్లి బెంగళూరు బస్సు ఎక్కారు. వారి వెంట పెద్దలు లేకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తున్నట్లు నమ్మబలికారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరులో బస్సు దిగకుండా భయం భయంగా దిక్కులు చూస్తుండటంతో డ్రైవర్, కండక్టర్కు అనుమానం వచ్చి ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో అప్పగించారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి బళ్లారికి తీసుకొని వచ్చారు. బస్సు డ్రైవర్ రవికుమార్, కండక్టర్ నవాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Divya Hagaragi Arrested: దివ్య మొబైల్ ముక్కలు! -
అమ్మకానికి సీతాకోక చిలుక ఇల్లు, సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్న జనం!
సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఆ కలను నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటాం. అదిగో అలా కట్టుకుందే ఈ సీతా కోక చిలుక ఇల్లు. ప్రపంచంలోనే విలక్షణమైన ఇల్లుగా ప్రసిద్ధి చెందిన..ఈ బటర్ ఫ్లై హౌస్ను అమ్మకానికి పెట్టారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశమైన 'గ్రీస్'దేశంలోని వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని ఎవరు నిర్మించారు. ఎప్పుడు నిర్మించారనే విషయాలు వెలుగులోకి రాకున్నా.. ప్రస్తుతం ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 5381 స్కైర్ ఫీట్లో నిర్మాణం వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో 5381 స్కైర్ ఫీట్లో ఇంటి నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి వాల్స్ లేకుండా నిర్మించిన ఈ ఇల్లు ఫ్లోర్ ఫోర్ల్ ఎలివేటర్(లిఫ్ట్)సౌకర్యం ఉంది. సీతాకోక చిలుక ఇన్స్పిరేషన్తో నిర్మించిన ఈ ఇంటికి షేడింగ్, గోప్యత ఉండేలా ఆర్కిటెక్చర్లు డిజైన్ చేశారు. దిగువ అంతస్తులో హోమ్ థియేటర్, మూడు అదనపు బాత్రూమ్లతో మూడు బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. నిజంగా స్మార్ట్ హోమే! స్మార్ట్ హోమ్గా ప్రసిద్ధి చెందిన ఈ బటర్ ఫ్లై హోంలో ఐదు బెడ్ రూమ్లు, నాలుగు బాత్రూంలు, ఇల్లు ఐదు బెడ్రూమ్లు, నాలుగు బాత్రూమ్లు, ప్రైవేట్ బేస్మెంట్ ఉంది. ఈ ప్రైవేట్ బేస్మెంట్ను స్టోరేజ్, డార్క్ రూమ్, పార్కింగ్ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఒక గడపలో నుంచి లోపలికి వెళితే గోడలు, డోర్లను ఏర్పాటు చేస్తూ కిచెన్ , లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉండేలా ఓపెన్ ప్లాన్ లివింగ్ ఏరియా, జియో మెట్రిక్ షేప్లో నిర్మించిన ఇండోర్ పూల్తో ఈ స్మార్ట్ హోమ్ చూపరులను కట్టిపడేస్తుంది. క్యూ కడుతున్నారు! చిత్రంలో చూపించినట్లుగా.. పై నుంచి చూస్తే సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. సీతాకోక చిలుక డిజైన్ వచ్చేలా ఇంటిని నిర్మించేందుకు ఇంటిపై కప్పులు ఓవల్ ఆకారపు హోల్స్తో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ ఇల్లును $6.78 మిలియన్లకు (రూ. 52 కోట్లు) అమ్మకానికి పెట్టినట్లు వెలుగోలోకి వచ్చిన రిపోర్ట్లు పేర్కొన్నాయి. అయితే ప్రపంచంలో విభిన్నంగా సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకునేందుకు స్థానికంగా ఉండే ధనికులతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు క్యూ కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి: షాకింగ్,హైదరాబాద్లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! -
షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..?
న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు 5–7 శాతం పెరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వెల్లడించింది. నిర్మాణ వ్యయం దూసుకెళ్లడంతో ఈ ఏడాది ఇప్పటికే 5–8 శాతం ధరలు అధికం అయ్యాయని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష వర్ధన్ పటోడియా తెలిపారు. బిల్డింగ్ మెటీరియల్పై జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు/మాఫీ, వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ధరల పెరుగుదల ప్రభావంపై క్రెడాయ్ ఇటీవల చేపట్టిన సర్వేలో 1,849 నిర్మాణ సంస్థలు పాలుపంచుకున్నాయి. ‘నిర్మాణంలో వాడే ముడి సరుకుల ధరల నుండి ఉపశమనానికై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్టులను సమయానికి అందించలేమని 39 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు భావిస్తున్నారు. ధరలు ప్రస్తుత స్థాయిల నుండి తగ్గకపోతే గరిష్టంగా ఆరు నెలల వరకు మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణాలను కొనసాగించగలమని 76 శాతం మంది తెలిపారు’ అని సర్వేలో తేలిందని పటోడియా వివరించారు. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
హోమ్ క్రియేషన్స్.. ఇంటీరియర్ డెకరేషన్ టిప్స్
ఇంటిని డిజైన్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో పూసల ఆభరణాలు ఒకటి. రంగురంగుల పూసలతో సాధారణంగా కనిపించే టేబుల్ని అందంగా అలంకరించవచ్చు. కిటికీలో నుంచి గదిలోకి పడే సూర్యకిరణాలకూ హంగులు అద్దవచ్చు. ఇంటీరియర్ డెకరేషన్కు చేర్చే సులువైన మార్గాలు.. టేబుల్ అలంకరణ డైనింగ్ టేబుల్ పైన రంగుల పూసల గొలుసులను అలంకరించవచ్చు. హ్యాండ్ న్యాప్కిన్లకు లేదా గాజు గ్లాస్లకు చుడితే చాలు టేబుల్కి కొత్త హంగు చేరుతుంది. పూసల వేజ్ గ్లాస్ను ఫ్లవర్వేజ్గా తీర్చిదిద్దడంలో పూసలు కూడా దోహదపడతాయి. ఒకే రకరమైన రంగు, ఆకారం, కొలత గల పూసల గొలుసులను చుడితే మనం కోరుకున్న అందమైన వేజ్ కళ్ల ముందుంటుంది. గాజు బాటిళ్లను అల్యూమినియం తీగను చుట్టేటప్పుడు కొన్ని పెద్ద పూసలను కూడా గుచ్చి, హ్యాంగింగ్ వేజ్లను తయారుచేయవచ్చు. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, నెమలి ఈకలను జోడిస్తే పూసల వేజ్ అందం మరింత పెరుగుతుంది. స్వరాలు పలికే కర్టెన్లు పూసల గొలుసులను కర్టెన్లతో పాటు లేదంటే కర్టెన్గా వరసలు వరసలుగా వేలాడదీయడం ద్వారా కూడా ఇంటిని కళాత్మకంగా మార్చవచ్చు. అంతేకాదు లివింగ్రూమ్లో కొంత భాగాన్ని పార్టిషన్గా చేయాలనుకుంటే పూసల గొలుసుల కర్టెన్ను ఉపయోగించవచ్చు. పూసల ముడి పూసల కర్టెన్ది ఒక అందమైతే పూసల గొలుసులను కర్టెన్ రాడ్ల చుట్టూ తిప్పి మరో అందాన్ని తీసుకురావచ్చు. అలాగే ప్లెయిన్ కర్టెన్కు కుచ్చులు పెడుతూ, రంగురంగు పూసల ఓ గట్టి గొలుసును మధ్యలో జత చేర్చితే చాలు ఆ సోకు సింప్లీసూపర్బ్ అనిపిస్తుంది. కిరణాలకు పూసల హంగు కిటికీల హంగును పెంచడానికి కొన్ని పూసల గొలుసులను వేలాడదీయవచ్చు. క్రిస్టల్ పూసల గొలుసును కిటికీ అలంకరణలో భాగం చేయడం వల్ల సూర్యకాంతి నేరుగా పడి, ఆ కాంతి గదికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. కర్టెన్ అంచులకు కుట్టి, పూసలను వేలాడదీసినా బాగుంటుంది. టేబుల్ ల్యాంప్కు జిలుగులు కొన్ని క్రిస్టల్స్, పూసల గొలుసులను గొడుగుగా ఉండే టేబుల్ ల్యాంప్ మీదుగా వేలాడదీయడం ద్వారా వినూత్న సోయగాన్ని ఆస్వాదించవచ్చు. అయితే ల్యాంప్కు తగినట్టుగా పూసల గొలుసులను ఎంచుకోవాలి. పూసల ప్రతిబింబం అద్దాలను మన ప్రతిబింబాన్ని చూసుకోవడానికే కాదు ఇంటి అలంకరణలోనూ ఉపయోగించుకోవచ్చు. గది అందాన్ని ఉత్తేజంగా మార్చడానికి వాల్ మిర్రర్కు పూసల గొలుసును జత చేయవచ్చు. -
దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!
2021లో మొత్తం గృహ అమ్మకాలలో రూ.45 లక్షల వరకు ధర గల చౌక గృహాలకు డిమాండ్ 48 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. అయితే, ఇందుకు విరుద్దంగా రూ.75 లక్షలకు పైగా విలువ గల గృహా అమ్మకాల వాటా 25 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ తెలిపింది. 'రియల్ ఇన్ సైట్ రెసిడెన్షియల్ - వార్షిక రౌండ్-అప్ 2021' పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రాప్ టైగర్ ఎనిమిది ప్రైమ్ హౌసింగ్ మార్కెట్లలో గృహ అమ్మకాలు 2021లో 13 శాతం పెరిగి 1,82,639 యూనిట్ల నుంచి 2,05,936 యూనిట్లకు పెరిగాయి. ప్రాప్ టైగర్ డేటా ప్రకారం, భారతదేశంలోని ఎనిమిది ప్రముఖ హౌసింగ్ మార్కెట్లలో మొత్తం హౌసింగ్ అమ్మకాల్లో 43 శాతం వాటా గల రూ.45 లక్షల విలువ చేసే గృహాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది రూ.45 లక్షలు-రూ.75 లక్షలు ధర గల గృహాల అమ్మకాల వాటా 2020లో ఉన్న 26 శాతం నుంచి 2021లో 27 శాతానికి పెరగగా, రూ.75 లక్షల నుంచి రూ.కోటి పరిధిలో ఉన్న అపార్ట్ మెంట్ల వాటా 9 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. కోటి రూపాయలకు పైగా ఖరీదు గల గృహ వాటా 16 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్'కతా, ఢిల్లీ-ఎన్సీఆర్(గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ మరియు ఫరీదాబాద్), ఎమ్ఎమ్ఆర్(ముంబై, నవీ ముంబై & థానే), పూణే వంటి 8 నగరాలలో గృహాలకు అధిక డిమాండ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2021లో దేశంలో సరసమైన గృహాల ఆకర్షణకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు వల్ల గృహాలకు డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రాప్ టైగర్ అన్నారు. ఆదాయపు పన్ను చట్టం- 1960 సెక్షన్ 80ఈఈఏ కింద రూ.45 లక్షల వరకు విలువ గల గృహాలకు రూ.1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును అందిస్తుంది. అటువంటి రుణగ్రహీత ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎమ్ఎవై) కింద సబ్సిడీని కూడా క్లెయిం చేసుకోవచ్చు. (చదవండి: భారత్ ఇంధన అవసరాలను తీర్చనున్న ఇరాన్..!) -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం
Shanmukh Jaswanth New House Warming Celebrations: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్తోనే బిగ్బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగినా రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షణ్ముక్ హైదరాబాద్లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. చదవండి: నటి, ఎమ్మెల్యే రోజా హోంటూర్.. అచ్చంగా ఇంద్రభవనమే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీంతో షణ్నూకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో జీవితంలో ముందుకు పయనించాలంటూ షణ్నూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవలె దీప్తి సునయనతో బ్రేకప్ అనంతరం కెరీర్పై ఫుల్ ఫోకస్తో ముందుకు వెళుతున్న షణ్నూ త్వరలోనే ఓ వెబ్సిరీస్తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by @software_devlovepers_official -
ఇల్లు అమ్మేసిన బిగ్బీ అమితాబ్ బచ్చన్.. ధర ఎన్ని కోట్లంటే..
Amitabh Bachchan Sells Delhi House Sopaan For 23 Crore: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఇంటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలోని ఆ ఖరీధైన బంగ్లాకు 'సోపాన్' అని పేరు. అందులో అమితాబ్ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ ఉండేవారు. హీరో కావాలని అమితాబ్ ముంబైకి వచ్చేవరకు ఆ ఇంట్లోనే ఉండేవారు. అంతేకాకుండా బచ్చన్ ఫ్యామిలీకి మొట్టమొదటి సొంతిల్లు కూడా అదే. అయితే తాజాగా ఆ ఇంటిని అమితాబ్ అమ్మేశారు. సోపాన్ను నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అవని బడెర్ సుమారు రూ.23 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక బచ్చన్ ఫ్యామిలీకి అవని బడెర్ ఎప్పటి నుంచో తెలుసు. 'సోపాన్'కు దగ్గర్లోనే ఆయన కూడా నివసించేవారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే సోపాన్ను అమ్మినా అమితాబ్కు ముంబైలోని జుహులోనే ఐదు విశాలవంతమైన బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని పేర్లున్న ఈ బంగ్లాలు ఎంతో ఖరీదైనవి. ఇక గతేడాది అంధేరిలో సుమారు రూ. 31 కోట్లు పెట్టి బిగ్బి ఓ డూప్లెక్స్ ఫ్లాట్ని కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక.. తెగ కష్టపడుతున్నానంటూ పోస్ట్
Rashmika Mandanna Is Shifting To New House: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. రీసెంట్గా తెలుగులో పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు తమిళం సహా బాలీవుడ్లో రెండు సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇందులో రష్మిక సామాన్యు ప్యాక్ చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా అనే చర్చ మొదలైంది. నిజానికి గతేడాది ఫిబ్రవరిలోనే రష్మిక ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగానే రష్మిక కొత్త ఇంట్లోకి మారే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇంటి గృహప్రవేశం జరగనున్నట్లు సమాచారం. -
బాలుడి కిడ్నాప్.. సోషల్మీడియా సాయంతో కథ సుఖాంతమైంది!
కొరాపుట్(భువనేశ్వర్): ట్రక్ డైవర్ కిడ్నాప్ చేసిన బాలుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరిన ఘటన అందరినీ ఆనందంలో ముంచెత్తింది. నవరంగపూర్ జిల్లా ఎస్పీ పురుషోత్తం దాస్ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించారు. 2021 అక్టోబర్ 22న నవంరంగ్పూర్ జిల్లా చందాహండి పోలీస్ స్టేషన్ పరిధి ఖపరాది గ్రామంలో ఓ ట్రక్ డ్రైవర్ ప్రదీప్ అనే బాలుడిని అపహరించి, ఎత్తకుపోయాడు. (చదవండి: గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. ) దీనిపై అదేరోజు చందాహండి పోలీస్ స్టేషన్లోకేసు నమెదయ్యింది. బాలుడిని ట్రక్ డ్రైవర్ హర్యనాలోని రేవాడి జిల్లా గొడిబాల్ని జంక్షన్ వద్ద జాతీయ రహదారి–6పై డిసెంబర్ 21న రాత్రి వదలి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న హరున్ధావన్ దాబాకు చేరిన ప్రదీప్ ఉదంతాన్ని దాబా యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారి, నవంరంగ్పూర్ జిల్లాకు చేరింది. దీనిపై ఎస్పీ జోక్యం చేసుకొని, హర్యానాలోని బాలసదన్కు సమాచారం అందించి, సంరక్షించారు. అనంతరం ప్రదీప్ సోదరుడు భుజభల్ని జిల్లా పోలీసుల బృందంతో అక్కడకు పంపించి, నవరంగపూర్ లోని కుంటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, పోలీసులు చేసిన సాయాన్ని మరువలేమని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
వైరల్: యాంకర్ శ్యామల గృహ ప్రవేశం వీడియో
Bigg Boss Syamala New House Warming Video Goes Viral: యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్లలో శ్యామల ఒకరు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్లో యాంకరింగ్తో మెప్పిస్తుంది. ఆడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోననూ యాక్టివ్గా ఉండే శ్యామల తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇటీవలె కొత్త ఇంట్లోకి మారిన ఈ యాంకరమ్మ తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను షేర్చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే అది వైరల్గా మారింది. కమెడియన్ అలీ, యాంకర్ సుమ దంపతులు, తనీష్, గీతా మాధురి సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. -
ఒకసారి మంచాన పడ్డా.. అప్పటి నుంచి అది ప్రారంభించా : విశ్వ
Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral: బిగ్బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న వారిలో నటుడు విశ్వ ఒకరు. బిగ్బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షోతో ఎంతోమందికి చేరువయ్యాడు. టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్ల కంటే స్ట్రాంగ్ అనేలా పేరు తెచ్చుకున్న విశ్వ బిగ్బాస్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయి షాకిచ్చాడు. కానీ బిగ్బాస్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వివిధ రకాల వీడియోలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. తాజాగా తన సొంతింటిని నెటిజన్లకు పరిచయం చేశాడు. అంతేకాకుండా తన ఇంటికి ఎలా రావాలో స్వయంగా కారు నడుపుకుంటూ అడ్రస్ చూపించాడు. ఇక ఇది తన సొంతిల్లు అని, 2017లో దీన్ని నిర్మించుకున్నట్లు తెలిపాడు. ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను వివరించాడు. మరి విశ్వ హోంటూర్పై మీరు కూడా ఓ లుక్కేయండి. -
రావోయి.. మా ఇంటికి
సాక్షి, అమరావతి: ఇంటికి చుట్టాలొచ్చినట్టే.. పర్యాటకులొస్తారు. మన ఇంట్లో తయారు చేసిన భోజనాన్నే తింటారు. ఇందుకు ప్రతిగా నగదు చెల్లిస్తారు. గ్రామీణ పర్యాటకంలో ఈ రకమైన ‘హోమ్ స్టే’ అనేది ట్రెండీ కాన్సెప్్టగా నిలుస్తోంది. వాణిజ్య వసతి గృహాలకు అవకాశం లేని గ్రామాలు, మారుమూల పల్లెల్లో ఇది స్థానికులకు ఉపాధి వనరుగా మారి వారికి ఆరి్థక భరోసానిస్తోంది. సంపూర్ణ పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. అలాగే పర్యాటకులకు హోటళ్లలో ఉండేందుకు అయ్యే ఖర్చులో సగం మాత్రమే అవుతుండటంతో వారు కూడా హోమ్ స్టేపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో చాలా తక్కువగానే అయినా ఈ విధానం కొనసాగుతోంది. కోనసీమ ప్రాంతాల్లో పూర్వీకుల పాత పెంకుటిళ్లను పెద్దల గుర్తుగా కాపాడుకుంటూనే ‘హోమ్ స్టే’ విల్లాలుగా మారుస్తున్నారు. ప్రస్తుతం కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, గ్రామీణులకు ఆరి్థక భరోసానిస్తూ హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ సందర్శనీయ స్థలాల్లో పర్యటించాలనుకునే వారు హోటళ్లు, రిసార్ట్లలో కంటే గ్రామీణుల మధ్య వారి ఇళ్లల్లోనే, స్థానిక ఆహార సంప్రదాయాలు, సాంస్కృతిక జీవనంలో మమేకమవుతున్నారు. ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ వెబ్సైట్లో సైతం హోమ్ స్టే బుకింగ్ను అందుబాటులో ఉంచారు. ఏపీలోనూ ‘హోమ్ స్టే’ విస్తరణకు అధికారుల ప్రణాళికలు కళల పరిశ్రమలు, సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా కళలు, ఆచారాలు, ఆహార సంప్రదాయాలు, భాషలు, వేషధారణ, సాంస్కృతిక జీవనశైలిని దేశీ, విదేశీ పర్యాటకులు ఆస్వాదించొచ్చు. ఇందులో భాగంగా హోమ్ స్టే విధానంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించనున్నారు. వాణిజ్య ఆతిథ్య రంగంలో పాటించే సకల భద్రత ప్రమాణాలను హోమ్ స్టేలోనూ అమలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తిగల ఇళ్ల యజమానులు పర్యాటక శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. పరస్పర సాంస్కృతిక మార్పిడికి అవకాశం హోమ్ స్టే విధానంతో అతిథి, హోస్ట్ పరస్పర సాంస్కృతిక మారి్పడికి అవకాశం ఉంటుంది. వివిధ జాతుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించే వేదికగా గ్రామాలు మారుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా వలసలు తగ్గుతాయి. స్థానికులు స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై బాధ్యత కూడా పెరుగుతుంది. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే.. ఇల్లు సర్దండిలా..
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో గడపడం ఎక్కువైపోయింది. హ్యాపీగా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. ఇంటి వాతావరణం ఆహ్లాదభరితంగా లేకుంటే ఇంటి అందం పాడవటమే కాకుండా మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేయకుండా.. అందంగా సర్దుకోవాలి. (చదవండి: పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ) ► చిన్నారుల ఆట వస్తువులు, రిమోట్ కంట్రోల్, మొబైల్ ఫోన్లు.. ఇలాంటి చిన్న చిన్న వస్తువులను సర్ది అందమైన బుట్టలో వేసేయండి. ఇలా చేస్తే ఇల్లంతా చెల్లాచెదురుగా ఉండదు. రంగు రంగుల బుట్టలతో ఇంటికి కొత్త అందం వస్తుంది. ► పసుపు, నారింజ, ఆలివ్ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటా యి. వీటిని గోడలకు వేసుకుంటే కాంతివంతంగా కనిపిస్తాయి. తెల్లటి రంగు చల్లటి వాతావరణాన్ని అందిస్తుంది కాబట్టి ఎంచక్కా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► కిటికీలు, తలుపులకు కొత్త అందాన్ని తెచ్చేవి పరదాలే. కాబట్టి చక్కటి వాటిని చూసి ఎంపిక చేసుకోవాలి. ఆకుపచ్చటి రంగువి ఎంచుకుంటే ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే అనిపిస్తుంది. అలాగే పరదాల ఎంపిక సమయంలో సోఫా రంగులను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. లేదంటే గది అందం పోతుంది. ► ఎండాకాలంలో ఇంటికి కొత్త కళను తేవాలనుకుంటే వెదురు, కొబ్బరి పీచుతో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి కంటికి చల్లదనంతో పాటు కొత్త లుక్ను ఇస్తాయి. (చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..!) -
ప్రేమ ఉదంతం విషాదాంతం: ప్రియురాలి ఇంట్లో ప్రియుని హత్య
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఓ ప్రేమ ఉదంతం విషాదాంతమైంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ప్రియున్ని ప్రియురాలి తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన గత 28వ తేదీ రాత్రి జరగ్గా, ఆదివారం నిందితున్ని అరెస్టు చేశారు. బెంగళూరులో వినోబానగర ఆటోడ్రైవరు నారాయణ్కు కూతురు ఉంది. తమిళనాడు కు చెందిన నివేశ్ కుమార్ అనే యువకుడు రెండునెలల క్రితం ఇదే ప్రాంతానికి వచ్చి పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు. నారాయణ్ కూతురితో నివేశ్ ప్రేమాయణం ప్రారంభించాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో నారాయణ్ రావడంతో ఇద్దరినీ చూసి పట్టలేని కోపంతో కట్టెతో నివేశ్ తలపై కొట్టడంతో కుప్పకూలిపోయాడు. వేకువజామున ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి విక్టోరియా ఆసుపత్రి వద్ద పెట్టి అక్కడ నుంచి ఉడాయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి ప్రియుని తండ్రి హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు. -
ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం
లండన్: సాటి మనుషి కష్టంలో ఉంటే స్పందించే గుణం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమిస్తారు. జగమంత కుటుంబం వారి సిద్దాంతం. ఈ కోవకు చెందిన దంపతుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. వారిది ఎంత మంచి మనసు అంటే.. మానసిక వికలాంగ పిల్లల కోసం రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. అది కూడా కేవలం వంద రూపాయలకు మాత్రమే. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఇంత తక్కువ ఖరీదు ఎందుకంటే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇది చదవండి యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, అతని భార్య లిజ్, కుమార్తె ఎమిలీతో కలిసి సౌత్ టైన్సైడ్, ఇంగ్లండ్లో నివసిస్తున్నారు. లిజ్.. గ్రేస్ హౌస్ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం, అలాంటి పిల్లలతో ఎలా మసులుకోవాలనే గురించి వారి కుటుంబ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారి కోసం కొన్ని రకాల గేమ్స్ రూపొందించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా చేయడం, ఇతర యాక్టీవిటీలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. (చదవండి: సంచలన కేసు.. ఆ డాక్టర్ వల్లే మా అమ్మ నన్ను లోపంతో కనింది) ఈ క్రమంలో ఓ సారి ఆడమ్, తన భార్య లీజ్ కోసం గ్రేస్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్ని వీల్చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు (12,98,074.18 రూపాయలు) అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తమ కుమార్తె ఎమిలీకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం లేకపోవడం అతడిని కలచి వేసింది. ( ప్రతీకాత్మక చిత్రం) దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్కు ఓ ఆలోచన వచ్చింది. దాని గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఆ దంపతులు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం వంద రూపాయలకే అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్ రూం, కార్ పార్కింగ్, గార్డెన్ సదుపాయలు గల ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు. (చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!) కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇంటిని అమ్మడం కోసం ఆడమ్ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్ చేసి అమ్మసాగారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్కి.. ఇల్లు సొంతమవతుంది అన్నమాట. అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న జనాలు.. టికెట్ కొనడం కోసం ఎగబడ్డారు. అంతేకాక వారి మంచి మనసును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు -
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
జై భీమ్: రాసాకన్ను సతీమణికి ఇల్లు కట్టిస్తా: రాఘవ లారెన్స్
తమిళ సినిమా : రాసాకన్ను సతీమణి పార్వతికి ఇల్లు కట్టిస్తానని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపారు. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. రాసాకన్ను భార్య పార్వతి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేక కడు పేదరికాన్ని అనుభవిస్తోంది. చేయని నేరానికి రాసాకన్ను హత్యకు గురికావడం.. ఆయన సతీమణి పార్వతి దీన పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న రాఘవ లారెన్స్ చలించిపోయారు. ఆమెకు తన సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తానని సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జై భీమ్ చిత్ర యూనిట్కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు.