Indian markets
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్గేర్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్కు చెందిన సోమ్నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్ఫ్లై గంధిమతి, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్(ఫస్ట్క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్వేస్లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్స్టాప్గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్సైకిల్ బ్రాండ్ నార్టన్ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్నకు చెందిన మోటార్సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్లో అడుగుపెట్టింది. గోల్డ్స్టార్ 650 మోడల్తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్ను 1910లో విడుదల చేసింది. -
కరకర @ 50,000 కోట్లు!
కరకరలాడే సేవ్ భుజియా, వేయించిన పల్లీలు, బఠానీలు, మిక్చర్, జంతికలు ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ చిరుతిళ్లను ఇప్పుడు ఐదు, పది రూపాయల ప్యాకెట్లలో భారతీయులు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. పొటాటో చిప్స్ ఇతరత్రా పాశ్చాత్య స్నాక్స్ హవాకు సాంప్రదాయ, బ్రాండెడ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ గండికొడుతున్నాయి. విదేశీ, దేశీ కంపెనీలు మారుమూల ప్రాంతాల జనాలకు సైతం ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్ను అందిస్తూ మార్కెట్ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీయంగా సాల్టెడ్ స్నాక్స్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.50,800 కోట్లకు ఎగబాకాయి. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ స్నాక్స్ వాటా క్రమంగా జోరుందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం స్నాక్స్ మార్కెట్లో సాంప్రదాయ రుచుల వాటా 56 శాతానికి చేరుకోవడం దీనికి నిదర్శనం. ఐదు, పది రూపాయల చిన్న ప్యాకెట్ల రూపంలో రకరకాల దేశీ రుచులన్నీ లభించడంతో పాటు విదేశీ స్నాక్స్ రకాలతో పోలిస్తే కొంత ఎక్కువ పరిమాణం కూడా ఉంటుండటం దేశీ స్నాక్స్ జోరుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘భారతీయులు ఎక్కువగా సాంప్రదాయ రుచులనే ఇష్టపడతారు. ఇప్పుడిది స్నాక్స్ మార్కెట్లో కూడా ప్రతిబింబిస్తోంది’ అని బికనీర్వాలా ఫుడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేశ్ గోయెల్ పేర్కొన్నారు. ఈసంస్థ దేశవ్యాప్తంగా సాంప్రదాయ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు బికానో బ్రాండ్తో స్నాక్స్ ప్యాకెట్లను కూడా విక్రయిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వాటిదే జోరు... మొత్తం దేశీ స్నాక్స్ మార్కెట్లో బంగాళదుంప చిప్స్, కుర్కురే, ఫింగర్ స్టిక్స్ వంటి పాశ్చాత్య స్నాక్స్ వాటా రెండు దశాబ్దాల క్రితం మూడింట రెండొంతుల మేర ఉండేది. దీన్ని కూడా పెప్సీ ఫ్రిటో లేస్, ఐటీసీ ఫుడ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలే శాసిస్తూ వచ్చాయి. ‘గతంలో బడా కంపెనీలు విక్రయించే పాశ్చాత్య స్నాక్స్ ఇంటింటా తిష్ట వేశాయి. ఇప్పుడీ ట్రెండ్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయ స్నాక్స్ తయారీదారులు తమ పంపిణీ వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా పల్లెటూర్లకు కూడా చొచ్చుకుపోతున్నాయి’ అని గోయెల్ చెప్పారు. కొత కొన్నేళ్లుగా సాంప్రదాయ స్నాక్స్ విభాగం భారీగా అమ్మకాలను కొల్లగొడుతోంది. ఇక మార్కెట్ వాటా విషయానికొస్తే, సాల్టెడ్ స్నాక్స్లో హల్దీరామ్స్, పెప్సీ, బాలాజీ, ఐటీసీ, బికాజీ వంటి పెద్ద కంపెనీలకు 60 శాతం మార్కెట్ వాటా ఉండగా.. మిగతా 40 శాతాన్ని చిన్నాచితకా కంపెనీలు, ప్రాంతీయ సంస్థల చేతిలో ఉండటం విశేషం. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ గ్రాములను అందిస్తుండటం, మరిన్ని స్థానిక రుచులతో ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటం వాటికి కలిసొస్తోంది. ‘ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలు సాంప్రదాయ స్నాక్స్లో జోరు పెంచుతుండగా.. ప్రాంతీయంగా పేరొందిన కంపెనీలు సైతం క్రమంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి’ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు బుద్ధ చెబుతున్నారు. ఇలా అందరూ స్థానిక సాంప్రదాయ రుచులను అందించేందుకు పోటీపడుతుండటంతో వాటి అమ్మకాలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తోందని, దీంతో అన్బ్రాండెడ్ సంస్థల నుంచి మార్కెట్ క్రమంగా సంస్థాగత కంపెనీల చేతికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.హల్దీరామ్స్ హవా...ప్రస్తుతం దేశంలో ఏ మారుమూలకెళ్లినా హల్దీరామ్స్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మిక్చర్ పొట్లం, పల్లీల ప్యాకెట్ నుంచి రకరకాల ఉత్తరాది, దక్షిణాది రుచులతో సాంప్రదాయ స్నాక్స్కు పర్యాయపదంగా మారిపోయింది ఇది. హల్దీరామ్స్ దాదాపు 25% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2023–24లో కంపెనీ విక్రయాలు 18% ఎగసి రూ.12,161 కోట్లకు చేరాయి. పెప్సికో స్నాక్స్ అమ్మకాలు 14% పెరిగి రూ. 7,336 కోట్లుగా నమోదయ్యాయి. గుజరాత్కు చెందిన బాలాజీ వేఫర్స్ సేల్స్ 12% వృద్ధితో రూ.5,931 కోట్లకు దూసుకెళ్లడం విశేషం. భారతీయ స్నాక్స్ మార్కెట్ జోరుతో విదేశీ కంపెనీల ఇక్కడ ఫోకస్ పెంచాయి. హల్దీరామ్స్ను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజం బ్లాక్స్టోన్ రంగంలోకి దిగినట్లు టాక్. 51% మెజారిటీ వాటా కోసం బ్లాక్స్టోన్ రూ. 40,000 కోట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం. హల్దీరామ్స్ విలువను రూ.70,000–78,000 కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్ఫామ్పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
60 లక్షల ప్యాసింజర్ వాహనాలు
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు. కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్.. వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్గ్రేడ్లు కొన్నేళ్లుగా ట్రెండ్గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. అత్యంత విఘాతం..సీఏఎఫ్ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. -
భారత్లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి. -
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్లో గెలాక్సీ సిరీస్లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
రెండు దశాబ్దాల్లో 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్ నుంచి గత రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సోర్సింగ్ విభాగం) ఆండ్రియా ఆల్బ్రైట్ తెలిపారు. ఇప్పుడు 2027 నాటికల్లా ఏటా 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. వాల్మార్ట్ గత 25 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వాల్మార్ట్ గ్రోత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమనేది దిగ్గజ సరఫరాదారులతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అలాగే దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థ కోసం కొత్త సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకునేందుకు తోడ్పడగలదని ఆల్బ్రైట్ చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల ఆధునీకరణ, విస్తరణలో తోడ్పడేందుకు ఉద్దేశించిన వాల్మార్ట్ వృద్ధి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 వేల మందికి కంపెనీ శిక్షణనిచి్చనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రోత్ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న వాల్మార్ట్ సీఈవో డగ్ మెక్మిలన్ తెలిపారు. హీరో ఎకోటెక్ తయారు చేసే క్రూయిజర్ సైకిళ్లు, మిసెస్ బెక్టర్స్ ఉత్పత్తులు, వెల్స్పన్ టవళ్లు మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్తో 25 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్ఎం టార్క్తో 120 బీహెచ్పీ, అలాగే 114 ఎన్ఎం టార్క్తో 80 బీహెచ్పీ వర్షన్స్లో తయారైంది. 6 ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్సీ, ఈఎస్పీ, క్రూజ్ కంట్రోల్, 360 లీటర్ల బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్కు భారత్లో అ«దీకృత సంస్థగా ఎక్స్క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్బర్గ్లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
భారత్లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
భారత్కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్టాప్స్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్ను ప్రమోట్ చేస్తున్న యూఎస్కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్స్కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్కు భారత్లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్కు పోటీనిస్తుంది. అయిదు ఎస్యూవీలు: భారత్లో 2030 నాటికి అయిదు ఎస్యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
కవాసాకి కొత్త బైక్ వచ్చేసింది: ధర వింటే షాకవుతారు!
2024 Kawasaki Z900RS: కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్ 900ఆర్ఎస్ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్లో లభిస్తుంది. 2024 మోడల్ బైక్లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్బైక్లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్వేర్లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇంజీన్ 948cc, ఇన్లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ను కలిగి ఉంటి. సిక్స్-స్పీడ్ గేర్బాక్స్తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్ అంచనాలు. -
కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, దిగొస్తున్న పసిడి, వెండి ధరలు
Today August 2nd gold and silver prices: హైదరాబాద్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. శ్రావణ మాసంలో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈనేపథ్యంలో వరుస సెషన్లలో బంగారం కాస్త నెమ్మదిస్తున్నారు.తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 రూపాయలు క్షీణించి రూ. 55,110 గా ఉంది.అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 330 రూపాయలు తగ్గి రూ. 66110గా ఉంది. అటు వెండి ధర కూడా తగ్గింది. కిలోవెండి ధర 700 రూపాయలు పతనమై రూ. 80,300గా ఉంది. ( దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (ఆగస్టు 2) బంగారం ధరలకోసం క్లిక్ చేయండి) దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1 కేజీ వెండి ధర ఢిల్లీ- రూ.77,300 చెన్నై- రూ. 80,300 ముంబై - రూ. 77,300 కోల్కతా - రూ. 78,000 బెంగళూరు - 76,500 ఎంసీఎక్స్ షాక్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం భారత మార్కెట్లో క్షీణించిన పసిడి ధరలు ఆగస్టు 2, బుధవారం బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 182 లేదా 0.31 శాతం స్వల్ప పెరుగుదను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ అమెరికా డాలర్తోపోలిస్తే బుధవారం బంగారంధర పెరిగింది. ట్రెజరీ దిగుబడులు, ఆసియా స్టాక్లు ఫిచ్ అమెరికా ట్రిపుల్-ఎ క్రెడిట్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేయడంతో డాలర్ బలహీన పడింది. దీంతో సురక్షితమైన బులియన్పై ఆసక్తిని పెంచిందని రాయిటర్స్ నివేదించింది. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్కు 1,946.97 డాలర్లగానూ, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,984కి డాలర్లు చేరుకుంది. -
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్బ్యాక్ అప్గ్రేడ్ బోనస్లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్బడ్లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2023 ఆగస్ట్లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఎంజీ చిన్న ఈవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ భారత్లో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 26న కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది. నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2–స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి హంగులు ఉన్నాయి. కామెట్ ఈవీని భారత్లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్ యెప్ ఎస్యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది. -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్ఫారమ్ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్తో పాటు డాష్బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది. (ఇదీ చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) ఒక్క ఛార్జ్తో 150-200 కిలోమీటర్ల రేంజ్తో కామెట్ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్తో అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది. -
దేశీ మార్కెట్లో మరింత వృద్ధిపై లంబోర్గిని దృష్టి
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్ స్టెఫాన్ వింకెల్మాన్ తెలిపారు. ముందుగా హైబ్రిడ్ వాహనాలు.. ఆ తర్వాత పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఇందుకు దోహదపడగలవని ఆయన చెప్పారు. భౌగోళికరాజకీయ పరిస్థితులతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమకు అవసరమయ్యే విడిభాగాలు మొదలైన వాటిని ఇతరత్రా మరిన్ని దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వింకెల్మాన్ చెప్పారు. దీనితో భారతీయ విడిభాగాల సరఫరా సంస్థలకు కూడా వ్యాపార అవకాశాలు లభించగలవని ఆయన తెలిపారు. భారత్లో భారీగా పన్నులు, మౌలికసదుపాయాలపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. వృద్ధికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయని వింకెల్మన్ చెప్పారు. అయితే, వృద్ధి ఎంత స్థాయిలో ఉండొచ్చనేది చెప్పలేనని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు 2021లో కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం 2023లో తొలి హైబ్రిడ్ మోడల్ను (విద్యుత్, ఇంధనంతో నడిచేది) ప్రవేశపెట్టనుంది. 2024 ఆఖరు నాటికి ప్రస్తుతం తమకున్న మోడల్స్ శ్రేణి మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. లంబోర్గిని గత ఏడా ది భారత్లో 92 వాహనాలు విక్రయించింది. అంతక్రితం ఏడాది 2021లో నమోదైన 69 యూనిట్లతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్ఫైటర్ లైన్కు అప్డేట్ వెర్షన్ను విడుదల చేసింది. ఈ సిరీస్లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
అతి మూత్ర సమస్యకు చెక్:ఎంఎస్ఎన్ తొలి జనరిక్ మెడిసిన్ లాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్ వర్షన్ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం, మూత్రాన్ని ఆపుకోలేని సమస్యకు ఈ ఔషధం ద్వారా అందుబాటు ధరలో చికిత్స లభిస్తుందని ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు. దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
Samsung Galaxy S22 5G: భారీ ఆఫర్, ఇక హోలీనే!
సాక్షి,ముంబై: సౌత్కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్ఫోన్పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్లో అమెజాన్లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్లో ఇదే ఎఫర్డ్బుల్ ప్రైస్ డివైస్గా పేరొందింది. గెలాక్సీ ఎస్ 22 5జీ ఫీచర్లు 6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 50+12+10 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3700 mAh బ్యాటరీ -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్షిప్ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
ఏటా ఒక కొత్త హోండా కారు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెట్రోల్, హైబ్రిడ్ పవర్ట్రెయిన్స్లో రూ.10 లక్షలు, ఆపై ధరలో వీటిని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుమురా తెలిపారు. ‘ప్యాసింజర్ వాహన రంగంలో 40 శాతం వాటా రూ.10 లక్షల పైచిలుకు మోడళ్లదే. ఈ విభాగం వాటా మరింత పెరగనుంది. అమేజ్, సిటీ మోడళ్ల టాప్ ట్రిమ్స్ 60 శాతం పైగా వాటా కైవసం చేసుకున్నాయి. విదేశాల్లో విక్రయిస్తున్న మోడళ్లను సైతం ఇక్కడ ప్రవేశపెడతాం. రూ.260 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా సేల్స్ నెట్వర్క్ను పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు. వృద్ధిపై దృష్టిపెట్టాం.. : అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత మోడళ్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని సుమురా చెప్పారు. ‘ఈ ప్రణాళికలో భారత్ కూడా ఉంది. అయితే మౌలిక వసతులనుబట్టి ఒక్కో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అంతర్జాతీయ పోకడలను దృష్టిలో పెట్టుకుని భారత్లో డీజిల్ మోడళ్లను నిలివేశాం. చిప్ కొరత ప్రభావం ఇప్పటికీ కంపెనీపై ఉంది. రాజస్థాన్ ప్లాంటులో ఏటా 1.3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. కొత్త మోడళ్ల రాకతో ప్లాంటు వినియోగం పెరుగుతుంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా 1.8 లక్షల యూనిట్లు. దీనిని 2.2 లక్షల యూనిట్లకు విస్తరించవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలతో రెండేళ్లుగా భారత్లో లాభాలు గడిస్తున్నాం. ఈ ఏడాది రానున్న ఎస్యూవీతో అమ్మకాలు అధికం అవుతాయి’ అని తెలిపారు. కొత్త వెర్షన్స్లో సిటీ.. సిటీ కొత్త వెర్షన్స్ను కంపెనీ గురువారం ప్రవేశపెట్టింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో ఇది తయారైంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ వర్షన్నుబట్టి లీటరుకు 17.8–18.4 కిలోమీటర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ (ఈహెచ్ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి మొదలు. మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సిటీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఈహెచ్ఈవీ నుంచి ఉంటుందని హోండా భావిస్తోంది. -
సూపర్ ఫీచర్లతో హెచ్పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్టాప్లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్టాప్ హెచ్పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్టాప్ 330W ఛార్జింగ్కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
టెక్నో పాప్ 7ప్రో: ఫీచర్లు అదుర్స్! ధర మాత్రం రూ. 7వేల లోపే
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వరుసలో పాప్ 6 ప్రో తరువాత ఇండియాలో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో, ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్లు, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. టెక్నో పాప్ 7ప్రో ఫీచర్లు 6.56 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0 12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ధర,లభ్యత 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ధర 6,799, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 7,299 ఫిబ్రవరి 22 నుండి అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. -
మహీంద్ర ఎక్స్యూవీ400 ధర ఎంతంటే? తొలి 5వేల బుకింగ్లకే!
సాక్షి,ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా ఎక్స్యూవీ 400 భారత మార్కెట్లోకి వచ్చేసింది. మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎక్స్యూవీగా చెబుతున్న ఈ కారును గత ఏడాది సెప్టెంబర్ (2022)లో అధికారికంగా లాంచ్ చేయగా ధరలను మాత్రం తాజాగా ప్రకటించింది. ధరలు మహీంద్రా ఎక్స్యూవీ 400 ధరలు రూ. 15.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఒక వేరియంట్ ధర 16.49 లక్షలు. టాప్ లైన్ XUV400 EL వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు. అయితే ఇవి ప్రారంభ ఆఫర్ ధరలనీ, మొదటి 5,000 బుకింగ్లకు మాత్రమే ఈ రేట్లు చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ కంపెనీ డీలర్షిప్లలోకి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ జనవరి 26న ప్రారంభం. ఎక్స్యువీ 400 ఈఎల్ డెలివరీలు మార్చి 2023 నుంచి ప్రారంభమైతే, దీపావళి సీజన్లో ఎక్స్యువీ 400 ఈసీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మొదటి దశలో 34 నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ఎస్యువీ ప్రయాణంలో మరుపురాని క్షణం ఎక్స్యువీ 400 ఆవిష్కరణ అని మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజె నక్రా తెలిపారు. అత్యున్నత పనితీరు, డిజైన్, స్పేస్,టెక్నాలజీని ఆకర్షణీయమైన ధరలో ఎక్స్యువీ 400 అందిస్తుందన్నారు. మహీంద్రా కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV EC, EL అనే రెండు వేరియంట్లలో లభ్యం. EC వేరియంట్లోని 34.5 kWh లిథియం ఇయాన్బ్యాటరీ , 375 కిమీ పరిధిని, EL వేరియంట్ 39.4 kWh బ్యాటరీ ప్యాక్ను 456 కిమీ పరిధిని అందిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే యొక్క ఐదు రంగుల్లో లభ్యం. అయితే EL వేరియంట్లో ఎగువన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో అందిస్తోంది. -
ఓప్పో 5జీ స్మార్ట్ఫోన్ : ధర రూ. 20వేల లోపు
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ధర, లభ్యత ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ78 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ 6.56 ఇంచుల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ కలర్ఓఎస్ 13 50+ 2 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ , 33 వాట్స్ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
మారుతి లవర్స్కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
గాడ్జెట్ లవర్స్కు గుడ్ న్యూస్, లెనోవో అద్బుతమైన 5జీ ట్యాబ్ వచ్చేసింది!
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర, లభ్యత 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్సైట్తోపాటు, అమెజాన్లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్స్టాప్గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ఆడ్రేనో 619 జీపీయూ 11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్స్క్రీన్ 7700ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది. -
పండుగ పూట పసిడి ప్రియులకు షాక్, రికార్డు ధర
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ మాంద్యం భయాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీయమార్కెట్లో పసిడి ధర రూ. 56,200 దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1,898 డాలర్లు, వెండి ఔన్స్ 23.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందనిహెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ తెలిపింది. తద్వారా ఆగస్టు 2020లో రూ. 56,191 నమోదైన మునుపటి రికార్డును అధిగమించింది. రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ 10 గ్రాముల ధర రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకుంది. ఈ రోజు (జనవరి 13) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220 ఎగిసి రూ. 56,290 స్థాయికి చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం రూ.56,290గా ఉంది. కిలో వెండి ధర 74వేల రూపాయలుగా ఉంది. బెంగళూరులో రూ.56,340కి వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250 గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు) 10 గ్రాములు, దాదాపు 0.50 శాతం రూ. 56,140 పలికింది. బలహీనమైన డాలర్, అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు నెమ్మదించవచ్చనే అంచనాలు పసిడికి బలాన్నిస్తున్నాయి. డిసెంబర్లో యూఎస్ వినియోగదారుల ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్ట వచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
స్టైలిష్ డిజైన్తో టార్క్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్సైకిల్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ - క్రాటోస్ ఎక్స్ని ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్గ్రేడెడ్ వెర్షన్ ఈ-మోటార్సైకిల్ క్రా టోస్ ఆర్(kratos R) పేరిట తీసుకొచ్చింది. వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని టార్క్ కంపెనీ ప్రకటించింది. 2023 రెండో త్రైమాసికంలోఈ మోటార్ సైకిల్ బుకింగ్లు ప్రారంభం. మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి ఉన్నామని TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు. బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీతో స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు. తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అత్యుత్తమ పవర్ట్రెయిన్, టార్క్ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్షిప్లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్లో డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బైక్స్ను బుక్ చేసుకోవచ్చని టార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాటోస్ ఆర్లో రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది. అలాగే ఈ మోటార్ సైకిల్ జెట్ బ్లాక్, వైట్.రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది -
అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250, కేవలం 2 వేలతో
న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్పోలో కొత్త బైక్ను లాంచ్ చేసింది. SR125 సిరీస్లో కీవే ఎస్ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్పో 2023లో ఆవిష్కరించింది. రెట్రో మోడల్ బైక్ ఎస్ఆర్ 250 ప్రారంభ ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 2 వేల రూపాయలతో ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్ఆర్ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్ చేస్తోంది. We are excited to Launch the All-New #SR250 from Keeway. Buckle up to witness a Retro ride with a twist! Priced at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit: https://t.co/TZ4YeuD8Jb or call: 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #Launch #Hungarian pic.twitter.com/TS3Joj6XeH — KeewayIndia (@keeway_india) January 11, 2023 The SR 250 is available in 3 appealing colours! Price starts at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit : https://t.co/TZ4YeuD8Jb or call : 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #SR250 #AutoExpo2023 #AutoExpo #Launch #Hungarian pic.twitter.com/IU6s0KuxJ6 — KeewayIndia (@keeway_india) January 11, 2023 -
ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్, 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ తెలిపింది. రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్తో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. Ready your wishlist, because the #iQOO11 with India’s First 2K E6 AMOLED Display at just ₹51,999*. Sale starts 13th Jan, 12PM exclusively on https://t.co/ZK4Krrdztq & @amazonIN. 24 Hours Early Access* for Prime Members. *T&C Apply#MonsterInside #AmazonSpecials #iQOO11Launch pic.twitter.com/8iGVM3hDBE — iQOO India (@IqooInd) January 10, 2023 p> ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 ఇంచుల 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లే హెచ్డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ 50+8 +13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్ ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,999గా ఉంది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం. ఆల్ఫా, లెజెండ్ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ లభ్యం. ఆఫర్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, 3 వేల రూపాయల దాకా స్పెషల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
రియల్మీ10 వచ్చేసింది.. 5జీ సపోర్ట్ ఉందా? లేదా?
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ఫోన్ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్మీ ఫ్యాన్స్ను నిరాశ పర్చింది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు 6.5అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్&వైట్ పొట్రయిట్ రియర్ డ్యుయల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ ఫస్ట్ సేల్, ఆఫర్, ధర ఈ స్మార్ట్ఫోన్ క్లాష్ వైట్ రష్ బ్లాక్ అనే రెండు రంగులలో లభ్యం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంటుంది. తొలి సేల్, జనవరి 15నుంచి రియల్ మీ, ఫ్లిప్కార్ట్ ఇతర ఆన్లైన్ స్టోర్లలో లభ్యం. రియల్మీ, ఫ్లిప్కార్ట్లో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. -
బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎం04: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్లో బడ్జెట్ ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ మొబైల్గా 10 వేల రూపాయల లోపు ధరలో అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్తోపాటు, 64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్(1 టీబీవరకువిస్తరించుకునే అవకాశం) కూడా శాంసంగ్ ప్రకటించింది. (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఫీచర్లు 6.5ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35 సాక్,ఆండ్రాయిడ్ 12 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ డ్యుయల్ రియర్ కెమెరా: 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెన్సార్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర, లభ్యత మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్లో లభ్యంకానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర రూ. 8,499గా ఉంది. సేల్ ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ ఇండియా ద్వారా ప్రారంభమవుతుంది. (రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్పాట్!ఎలా?) -
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: రియల్మీ 10 ప్రో 5జీ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. రియల్మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్, నెబ్యూలా బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ కూడా మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు 6.72 ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 680నిట్స్ పీక్ స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్ ధరలు, ఆఫర్ రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ 14 నుంచి డిసెంబరు నుంచి ఫస్ట్ సేల్ షురూ అవుతుంది. కాగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. రియల్మీ 10 ప్రో 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.19,999 ధరతో వచ్చింది. డిసెంబరు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా లభ్యంకానుంది. లభిస్తుంది. రియల్మీ అధికారిక వెబ్సైట్లోనూ ఈ మొబైల్ సేల్కు వస్తుంది. -
సరికొత్త స్మార్ట్ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్లో అందుబాటులో ఉంటుంది. క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) స్మార్ట్ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్ 13 జీబీ ర్యామ్తో Helio G99 ప్రాసెసర్ని ఏకైక స్మార్ట్ఫోన్ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) టెక్నో పోవా-4 స్పెసిఫికేషన్లు 6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0 MediaTek Helio G99 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం AI లెన్స్తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 6000ఎంఏహెచ్ బ్యాటరీ -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్మన్ స్ట్రీట్కు అప్గ్రేడెడ్ వెర్షన్గా ఈ ఈఎక్స్ మోడల్ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్తో 124cc సీసీ మోటార్ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్ఫోన్ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
వివో వైఓ2, ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్ఫోన్లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వైఓ2 ఫీచర్లు 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్తో Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ Trendy style and unmatched vibe. Unveiling the new #vivoY02 Buy Now : https://t.co/eDzazkRLla#ItsMyStyle #BuyNow pic.twitter.com/Pziuht03RY — vivo India (@Vivo_India) December 5, 2022 -
టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్: న్యూ లుక్ చూస్తే ఫిదానే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్, కొత్త అప్డేట్స్తో స్పెషల్గా దీన్ని ఆవిష్కరించింది. కొత్త పెరల్ వైట్ కలర్లో వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజీన్, ఫీచర్లు 5 స్పీడ్ గేర్బాక్స్తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుపరిచారు. ఇది 250 ఆర్పీఎం వద్ద 17.39 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్తో కొత్త పెర్ల్ వైట్ కలర్ కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్, బ్రేక్ లివర్లు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్మోడ్స్లో లభ్యం. TVS SmartXonnect కనెక్టివిటీ రేర్ రేడియల్ టైర్ గేర్ షిఫ్ట్ సూచిక సిగ్నేచర్ ఆల్-LED హెడ్ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్ TVS Apache RTR సిరీస్ బైక్స్ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రేసింగ్ వారసత్వం, అనుభవంతో స్పెషల్ ఎడిషన్ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
గంటకు150 కిలోమీటర్లు, ఫాస్టెస్ట్ ఈ-బైక్ ఇదే! ధర ఎంతంటే?
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్లను సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో ఎయిర్స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్పై ప్రయాణించవచ్చు. ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్లో డీఆర్ఎల్ స్ట్రిప్తో పాటు ఎల్ఈడీ హెడ్లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్లు స్మార్ట్ TFT డిస్ప్లేను అందిస్తోంది. -
షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్సీ90, ఎక్స్సీ60, ఎక్స్సీ40 ఉన్నాయి. మోడల్నుబట్టి ధర 1.8 శాతం అధికం కానుంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) సవరించిన ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఎస్90 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, ఎక్స్సీ40 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం తాజా నిర్ణయానికి కారణమని వెల్లడించింది. (షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ఇదీ చదవండి: ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన -
ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: బజాజ్ కంపెనీ దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. యూత్ క్రేజ్కు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి స్పోర్టీ లుక్లో పల్సర్ పీ150 బైక్ను ఆవిష్కరించింది. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్, ఎబోనీ బ్లాక్ రెడ్, కరేబియన్ బ్లూ అనే 5 రంగుల్లో ఈబైక్ అందుబాటులోకి వచ్చింది. ధర: సింగిల్-డిస్క్, సింగిల్ సీట్ కలిగిన బైక్ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) అలాగే ట్విన్-డిస్క్, స్లిట్ సీట్ మోడల్ ధరను రూ.1,19,757 ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది కంపెనీ. ఇంజీన్, ఫీచర్లు 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 8500 ఆర్పీఎమ్ వదర్ద 14.5 హెచ్పీని, 13.5Nm టార్క్ను విడుదల చేస్తుంది ఈ బైకులో యూఎస్బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, గేర్ ఇండికేటర్, సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను తోపాటు,స్ప్లిట్ గ్రాబ్ రైల్, క్లిప్-ఆన్ బార్లు చ స్ప్లిట్ సీట్ సెటప్ డ్యూయల్-డిస్క్ వెర్షన్తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. వెనకాల సీట్ కాస్త హైట్ ఇచ్చి . LED DRLలు , LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ P150 హోండా యునికార్న్, హోండా ఎక్స్-బ్లేడ్ , సుజుకి జిక్సర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
క్రికెట్, సినిమా మోడ్తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!
సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్తో ఈ అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ నవంబర్ 27 నుండి మధ్యాహ్నం నుండి ఫ్లిప్కార్ట్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర 29,999గా ఉంచింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ ఫీచర్లు ఈ టీవీలో తాజా గూగుల్ టీవీ ఓఎస్తోపాటు ఏఐ ప్రాసెసర్తో కూడిన గ్లోప్యానెల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కోర్ GPU, డాల్బీ అట్మోస్ వర్చువలైజేషన్తో వస్తుంది. తమ ఏఐ ప్రాసెసర్ ద్వారా ఓటీటీ కంటెంట్ మరింత మెరుగు పడుతుందనీ, అలాగే అధునాతన క్రికెట్ మోడ్తో వినియోగదారులు ప్రత్యక్ష స్టేడియం అనుభవాన్ని, 100 శాతం బాల్ విజిబిలిటీని పొందుతారనీ, డీజీ సబ్ వూఫర్, సొగసైన ఫ్రేమ్తో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాల్యూమ్ 100 శాతం పెంచినా కూడా తమ టీవీలోని సౌండ్ వైబ్రేట్ అవ్వదని తెలిపింది. 84వాట్ సౌండ్ అవుట్పుట్ను ఇచ్చేలా రెండు స్పీకర్లతో కూడిన ఇన్బిల్ట్ సౌండ్బార్ను ఇందులో జోడించింది. కేవలం రెండు నెలల్లో 46675 యూనిట్లను విక్రయించామనీ, 2023లో రెండు లక్షల టీవీలను విక్రయించాలని భావిస్తున్నామని వీయూ టెక్నాలజీస్ సీఈఓ అండ్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. -
సూపర్ ఫీచర్లతో వివో ఎక్స్90 సిరీస్ వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ తయారీదారు వివో కొత్త సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్80 సిరీస్కు కొనసాగింపుగా వివో ఎక్స్90 సిరీస్ను లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్స్తో, ముఖ్యంగా నాలుగుపవర్ ఫుల్ కెమెరాలతో తీసుకొస్తోంది. వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ+ మూడు వేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. త్వరలోనే భారత మార్కెట్లలో కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ బ్రైట్ రెడ్, బ్లాక్ కలర్లో ఇవి లభ్యం కానుంది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వైబోలో ఫోటోలు, ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో ఎక్స్90 ఫీచర్లు అంచనాలు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 క్వాల్కాం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ 50+50+ 64+48 రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్ 4,700mAh బ్యాటరీ ధర: ఈ రోజు (నవంబరు 22) సాయంత్రం లాంచ్ కానున్న ఈ స్మార్ట్ఫోన్ ధరలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, 800 డాలర్లు, సుమారు రూ. 65,315 ఉంటుందని అంచనా. -
దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్తో ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter Energy) తన తొలి ఎలక్ట్రిక్ బైక్ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్తో మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించింది. ఫీచర్లు ఈ బైక్లో అమర్చిన 10.5 kW ఎలక్ట్రిక్ మోటారు 520 Nm టార్క్ అవుట్పుట్ను అందిస్తుంది. 4-స్పీడ్ గేర్బాక్స్, 5 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని జతచేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్పై 125-150 కిమీల పరిధిని అందజేస్తుందని కంపెనీ చెప్పింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు అని కంపెనీ పేర్కొంది. ఎల్ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్తో స్పోర్టీ స్ట్రీట్ బైక్ డిజైన్న్తో ఆకట్టుకుంటోంది.. ట్యాంక్ ఏరియాలో 5లీటర్ గ్లోవ్బాక్స్ ఉంది, ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఇంకా 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో వస్తుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్లు , మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లకు కూడా మద్దతు ఇస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్లో గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్లో అందుబాటులోకి రానుంది. 2023 మొదటి త్రైమాసికంలో బుకింగ్స్, డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర: ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా. -
ఆల్టోకే10 సీఎన్జీ కారు వచ్చేసింది... అందుబాటు ధరలో
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్లో మరిన్ని సీఎన్జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆల్టో కే10 సీఎన్జీ ఇంజీన్ డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్తో కూడిన ఎయిర్ కండీషనర్తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం పోర్ట్ఫోలియోలో 13 ఎస్- సీఎన్సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్లో ఇంకా సీఎన్జీ వేరియంట్ రాలేదు. -
గుడ్న్యూస్: గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ కమింగ్ సూన్
సాక్షి,ముంబై: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ తన యూజర్లకు తీపి కబురు అందించనుంది. త్వరలోనే గూగుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోనును గూగుల్ తీసుకు రానుంది. గూగుల్ తొలి ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్ను ‘పిక్స్ల్ ఫోల్డ్’ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. దీనిపై గూగుల్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి ఆన్లైన్లో తాజా లీకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రీమియం విభాగంలో గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ను తీసుకొస్తోందని యూట్యూబ్, టిప్స్టర్ ఫ్రంట్ పేజ్ టెక్ జాన్ ప్రాస్సెర్ వెల్లడించారు. 2023, మే నెలలో దీన్ని గూగుల్ విడుదల చేయనుందని పిక్సల్ ఫోల్డ్ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రానుందని తెలపారు. అలాగే పిక్సెల్ 7 ప్రొ మాదిరిగానే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇంకా రియర్ ట్రిపుల్ కెమెరా,బెజెల్స్తో కవర్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా సెన్సార్ కోసం హోల్డ్-పంచ్ పిల్-ఆకారపు కటౌట్తో రానుంది. దీని ధర రూ.1,799 డాలర్లు అంటే సుమారు రూ.1.45 లక్షలుగా ఉండనుంది. -
మైక్రో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈ కారు నవంబరు 16న విడుదల కానుంది. దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ (పర్సనల్ మొబిలిటీ వెహికిల్) ఇండియాలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరించనుంది. EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ అంచనాలు కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఫౌండర్ కల్పిత్ పటేల్ సమచారం ప్రకారం ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా మైక్రో ఎలక్ట్రిక్ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్ 1,157ఎంఎం, హైట్ 1,600 ఎంఎంగానూ, వీల్బేస్ 2,087ఎంఎంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎంగా ఉంటుందట. -
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్...స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ప్రైస్!
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్యూవీలో స్పెషల్ ఎడిషన్ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో జోడించింది. అలాగే ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. (ట్విటర్కు సవాల్: టాప్-...0 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!) అంతేకాదురెండు స్పెషల్ కలర్స్తో (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ను ప్రత్యేక ధరతో,పరిమితి కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇంజీన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది. ఇది 249 hpపవర్ను, 370Nm టార్క్ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్తో అడాప్టివ్ సస్పెన్షన్ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి ఆరు డ్రైవ్ మోడ్స్లో ఇది లభ్యం. సింగిల్ గ్రిల్లే, వర్టికల్, స్ట్రట్స్, పనోరమిక్ గ్లాస్ సన్రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్లైట్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్స్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో ఖరీదైన లెదర్, లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్బ్యాగ్లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది. 755 వాట్స్ అవుట్పుట్తో 3D సౌండ్ ఎఫెక్టస్తో 19 స్పీకర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే సపోర్ట్తో 25.65 సెం.మీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లాంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి. ధరలు: ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్) ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్) ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 66,21,000 (ఎక్స్-షోరూమ్) -
నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ జీ60 5జీ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్కు సిద్ధం. 5జీ నెట్వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం. ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే నోకియా G60 5G స్నాప్డ్రాగన్ 695 5G SoC 120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 4500mAh బ్యాటరీ -
అత్యంత చవకైన లావా బ్లేజ్ 5జీ సేల్: కమింగ్ సూన్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా. గ్రీన్ , బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. లావా 5జీ బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ప్లే డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 12 ఓఎస్ 1600×720 పిక్సెల్ రిజల్యూషన్ 50+2+2 టట్రిపుల్ ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ For those who live in the fast lane. Blaze 5G. Only on Amazon.#ComingSoon #Blaze5G #IndiaJeele5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/MH2OZm0a1t — Lava Mobiles (@LavaMobile) November 3, 2022 -
నోకియా జీ60 5జీ: ఫ్రీ ఇయర్ బడ్స్, పరిచయ ఆఫర్ కూడా
సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్లకు పరిమిత మైన నోకియా తాజాగా 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. నోకియా జీ60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా జీ60 5జీ ధర రూ. 32,999గా నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్గా రూ. 29,999కే అందిస్తోంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్లో నవంబర్ 8 నుండి లభ్యం కానుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ 1080×2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ 50+5+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కిస్బీ’ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే దేశీయంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా. కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట. లాంచింగ్ ముందు ఇండియాలో ప్రత్యేకంగా తీసుకురానున్న కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది. కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్: మరో బడ్జెట్ ఫోన్
సాక్షి,ముంబై: ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్లో భారీ బ్యాటరీతోపాటు, మీడియా టెక్ ప్రాసెసర్, పంచ్ హోల్ సెటప్తో ‘ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే’ స్మార్ట్ఫోన్ను రివీల్ చేసింది. రేసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ నాలుగు రంగుల్లో ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే లభ్యం కానుంది. ఈ ఫోన్ ధర,భ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్పెసిఫికేషన్స్ 6.82అంగుళాల IPS LCD డిస్ప్లే 1640 x 720 పిక్సెల్ల రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ హీలియో జీ 37ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (విస్తరించుకునే అవకాశం) 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 6, 000mAh బ్యాటరీ 18W ఛార్జింగ్ -
ఎఫర్డబుల్ ప్రైస్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు , ఫీచర్లతో గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e) లిస్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో రానున్న ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ చిప్సెట్ 720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 4 జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమరా 5 000mAh బ్యాటరీ -
తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ వచ్చేసింది..సర్ప్రైజ్ ఆఫర్
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్ బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్1 ఎయిర్ను తీసుకురావడం గమనార్హం. రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎస్ 1 ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే లాంచింగ్ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లాంచింగ్ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు. అధునాతన డిజైన్తో అప్డేట్ చేసిన ఎస్1 ఎయిర్ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్తో సహా మూడు రైడింగ్ మోడ్స్లో, అయిదు రంగుల్లో లభించ నున్నాయి. ఏడు అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం. A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 🥳🥳 pic.twitter.com/KmV0DGRs3Z — Ola Electric (@OlaElectric) October 22, 2022 -
వావ్.. 15వేలకే జియో ల్యాప్టాప్, సేల్స్ షురూ
సాక్షి,ముంబై: తక్కువ ధరలు ఇంటర్నెట్సేవలు, ఫీచర్ ఫోన్లు అందించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇపుడిక బడ్జెట్ ధరలో ల్యాప్టాప్ను తీసుకొచ్చింది. ‘జియోబుక్’ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్టాప్ ధర ధర రూ.15,799గా నిర్ణయించింది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఇంకాస్త తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ల్యాప్టాప్కోసం ఎదురుచూస్తున్న సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా జియోబుక్ రూ. 15,000 కంటే తక్కువ ధరకే అందిస్తోంది.(TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన) ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్, 4జీ సిమ్కు సపోర్ట్తో వచ్చిన ఈ ల్యాప్టాప్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. JioOS ఆధారిత జియోబుక్లో థర్డ్ పార్టీ యాప్స్కు యాక్సెస్ ఉంది. జియో తన తొలి ల్యాప్టాప్ ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఆవిష్కరించింది. మొదట రూ.19,500కి ధర నిర్ణయించినా, ప్రస్తుతం ధరను తగ్గించడంతోపాటు బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తోంది. పలు బ్యాంకు కార్డు కొనగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, క్రెడిట్ కార్డ్లపై ఫ్లాట్ 3 వేల తగ్గింపు ఆఫర్, అలాగే క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా కొంత తగ్గింపు ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. జియోబుక్ స్పెసిఫికేషన్స్ 11.6 అంగుళాల డిస్ప్లే 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్ Adreno 610 GPU స్నాప్డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్( 128 జీబీవరకు విస్తరించుకునే అవకాశం 2 మెగాపిక్సెల్తో కూడిన ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్డీఎం పోర్ట్ సపోర్ట్ -
బిగాసస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంత?
హైదరాబాద్: బిగాసస్ సరికొత్త బీజీ డీ15 ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. పూర్తి మెటల్ బాడీతో భారత మార్కెట్ కోసం భారత్లోనే తయారు చేసిన స్కూటర్ ఇదని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్తో 115 కిలోమీటర్లు ప్రయాణించే డీ15 రోజువారీ కమ్యూటింగ్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. 16 అంగుళాల అలాయ్ వీల్స్తో బిగాసస్ నుంచి వచ్చిన తొలి స్కూటర్ ఇదే. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, 20కు పైగా బ్యాటరీ భద్రతా సదుపాయాలు, 77 సెంటీమీటర్ల పొడవైన సీట్, సైడ్ స్టాండ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.99,999. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
రోల్స్ రాయిస్ అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్: షాకింగ్ ధర
న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు. డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్ను యాడ్ చేసింది. అలాగే బానెట్పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు మధ్యలో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందించింది.అలాగే స్ప్లిట్ హెడ్ల్యాంప్ డిజైన్, హెడ్ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. -
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్టాప్ సిరీస్లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్టాప్ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్టాప్ కోసం ప్రీబుకింగ్స్ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్కు అవకాశం ఉంది. జెన్బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్సైట్తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్టాప్, డెస్క్టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
200ఎంపీ కెమెరా, మోటరోలా కొత్త వేరియంట్, భారీ లాంచింగ్ ఆఫర్
సాక్షి,ముంబై: మోటరోలా తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 65,000 గా నిర్ణయించింది. (Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా?) ధర, లాంచింగ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్ సహా, ఇతర ఆన్లైన్స్టోర్లలో రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్గా 56,999 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకూడా లభ్యం. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జీబీ వేరియంట్ను ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియాలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్) మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్స్ 6.67 FHD+ OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్ స్నాప్డ్రాగన్ 8+ Gen1, ఆండ్రాయిడ్ 12 200+50+12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ సెల్ఫీ కెమెరా 4610 mAh బ్యాటరీ 125 వాట్ ఛార్జింగ్ -
మహీంద్రా ఎక్స్యూవీ 300 టర్బో స్టోర్ట్ : ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి
సాక్షి,ముంబై: మహీంద్రా కొత్త టర్బో స్పోర్ట్ ఎక్స్యూవీ 300ని లాంచ్ చేసింది. సాధారణ మోడల్తో విభిన్నంగా ఉండేలా స్పోర్టీ ఎక్స్టీరియర్ ఎలిమెంట్ష్తో మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఎక్స్యూవీ ప్రారంభ ధర రూ.10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). లభిస్తుంది. W6, W8 W8(O) వేరియంట్లలో బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పెర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్ , బ్లేజింగ్ బ్రాంజ్ మోనోటోన్ కలర్స్లో ఇది లభ్యం. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే టర్బో స్పోర్ట్ ఎక్స్యూవీ 300 లభిస్తుంది. ఇంజీన్, ఫీచర్లు 1.2-లీటర్ mStallion TGDi టర్బో పెట్రోల్ ఇంజన్ ఇందులో అందించింది. ఈ ఇంజీన్ 5000 RPM వద్ద 130 PS, 1500-3750 RPM వద్ద 230 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5 సెకన్లలో 0-60 km/hr వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. పియానో బ్లాక్ ఫినిషింగ్లో రెడ్ గ్రిల్ ఇన్సర్ట్లు, ఆల్-బ్లాక్ ORVMలు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, లెథెరెట్ సీట్లు, క్రోమ్-ఫినిష్ పెడల్స్ , డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్స్ వంటి స్పోర్టీ డిజైన్ యాక్సెంట్స్తో వచ్చింది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు & ఆటో హెడ్ల్యాంప్లు, అడాప్టివ్ గైడ్లైన్స్తో వెనుక పార్కింగ్ కెమెరా, 17.78 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, బ్లూసెన్స్ కనెక్ట్, ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్అండ్ ఫోల్డబుల్ ORVMలు, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టీరింగ్ లాంటి ఫీచర్లు దీని సొంతం. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 4 డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్బ్యాగ్లు, ESP విత్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ABS, ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్, ISOFIX సీట్లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్లు ప్రారంభమవుతాయి. బుకింగ్లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్లతో పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0
సాక్షి,ముంబై: పండుగ సీజన్ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్ను రిలీజ్ చేసింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్ బైక్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది. హీరో కనెక్ట్తో తీసుకొచ్చిన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 రైడర్లను కనెక్ట్గా ఉండేలా చేసే స్మార్ట్ మొబిలిటీ బైక్. దీని ద్వారా ఈ వెహికల్ లైవ్ లొకేషన్ను ట్రేస్ చేయవచ్చు. ఇంకా టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్,పిలియన్ గ్రిప్పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తో వస్తోంది. హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్లలో రూ. 1,29,738 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇంజీన్, ఫీచర్లు 163cc ఎయిర్-కూల్డ్ BS-VI కంప్లైంట్ ఇంజన్. ఇది 6500 RPM వద్ద 15.2 PS పవర్ అవుట్పుట్ను అందిస్తుంది.కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్ ,పిలియన్ గ్రిప్పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తోపాటు జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టోప్ల్ అలర్ట్, టో ఎవే అలర్ట్ , అన్ప్లగ్ అలర్ట్లతో సహా రైడర్ వారి వాహనం గురించి అప్డేట్గా ఉంచేలా ఫీచర్లను ఇందులో పొందుపర్చింది. -
టాటా టియాగో ఈవీ వచ్చేసింది: వావ్...తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అత్యంత సరసమైన టియాగో ఈవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తమ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 10వేల మంది వినియోగదారులకు 8.49 (ఎక్స్-షోరూమ్, ఇండియా) లక్షలకు అందించనుంది. XE, XT, XZ+ XZ+ టెక్ అనే నాలుగు ట్రిమ్లలో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్ బుకింగ్లు అక్టోబర్ 1 నుండి అందుబాటులో ఉంటాయి. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ పండుగ సీజన్లో దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EVని టాటా మోటార్స్ సంక్రాంతి కానుకగా వినియోగ దారులకు అందించనుండటం మరో విశేషం.