Kim Jong-un
-
తగ్గేదేలే అంటున్న కిమ్.. ఏఐతో సరికొత్త ప్లాన్
సియోల్: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తమ దేశ సైనిక బలంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు మిస్సైల్స్ను పరీక్షించిన కిమ్.. తాజాగా అత్యాధునిక డ్రోన్ల పని తీరును పర్యవేక్షించారు. ఏఐ సాంకేతికతతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా తయారు చేసినట్టు అక్కడి అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి.అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల డ్రోన్ల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా కృత్రిమ మేధస్సు (AI)తో తయారుచేసిన అత్యాధునిక డ్రోన్ల పరీక్షను ఆయన పర్యవేక్షించారు. భూమిపై, సముద్రంలో వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక నిఘా డ్రోన్ల పరీక్షను కిమ్ పర్యవేక్షించినట్లు నార్త్ కొరియా మీడియా వెల్లడించింది. ఈ సందర్బంగా కిమ్ మాట్లాడుతూ..‘ఆయుధాల ఆధునికీకరణలో మానవరహితమైనవి, కృత్రిమ మేధస్సు సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్ట్లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ‘అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది’ అని కిమ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.Kim Jong Un Tests AI-Equipped DronesNorth Korean leader Kim Jong Un personally observed tests of new reconnaissance and kamikaze drones equipped with artificial intelligence, according to state media KCNA.#NorthKorea #KimJongUn #AI #Drones #MilitaryTech pic.twitter.com/Bh6lFP0031— Cyrus (@Cyrus_In_The_X) March 27, 2025 -
కిమ్ కీలక నిర్ణయం.. విదేశీ టూరిస్టులకు గుడ్న్యూస్
ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరవబోతోంది. పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టిన కిమ్ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.కొన్ని వారాల క్రితం విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించారని.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కిమ్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.ఉత్తర కొరియా నిర్ణయంతో కెనడా, యూకే, న్యూజిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి ఉత్తర కొరియా పర్యాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుకు మళ్లీ విదేశీయులను అనుమతిస్తోంది.ఇదీ చదవండి: USA: ఎలాన్ మస్క్కు బిగ్ షాక్.. -
అన్ని విషయాల్లో మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్ సార్!
-
‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..గత వారం రోజులుగా ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్ రీజియన్లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Watch how Ukraine’s SOF repel North Korean troops assault in russia’s Kursk region.The special forces eliminated 17 DPRK soldiers. One North Korean soldier had set an unsuccessful trap for the rangers of the 6th Regiment and blew himself up with a grenade. pic.twitter.com/nObBOMnusI— SPECIAL OPERATIONS FORCES OF UKRAINE (@SOF_UKR) January 13, 2025మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్యాంగ్ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్ వర్గాలు భావిస్తున్నాయి.‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్వాష్ చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్ రాయిటర్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్యాంగ్కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్ తెలిపాడు.రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్ ఆరోపణ. ఇందులో 3 వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.రష్యానే కాల్చిపారేస్తోందా?ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్ భద్రతా సర్వీస్.. ఎస్బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. Communication between captured North Korean soldiers and Ukrainian investigators continues. We are establishing the facts. We are verifying all the details. The world will learn the full truth about how Russia is exploiting such guys, who grew up in a complete information vacuum,… pic.twitter.com/CWcssQjr94— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 14, 2025‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్కు అప్పగిస్తామని జెలెన్స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
అమెరికా రెచ్చగొడుతోంది.. కిమ్ సంచలన ఆరోపణలు
సియోల్: అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందన్నారు. అలాగే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని చెప్పుకొచ్చారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధంలా మారే వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.కొరియా ద్వీపకల్పం ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలే ఎరుగదు. అమెరికాతో చర్చలు జరిపేందుకు నేను ఎప్పుడో ముందుకు వచ్చాను. చర్చల కోసం నేను చాలా దూరం వెళ్లినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. అమెరికా.. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ మూడు సార్లు భేటీ అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. అనంతరం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. North Korean leader says past diplomacy only confirmed US hostilityNorth Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's"unchangeable" hostility towardPyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo saadi🇲🇦🇵🇸🇺🇸 (@Simo7809957085) November 22, 2024 ఇదిలా ఉండగా.. నార్త్ కొరియా కిమ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ అలర్ట్ అయ్యారు. మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న క్రమంలో నార్త్ కొరియా సైన్యం అలర్ట్గా ఉండాలన్నారు. దీంతో, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. -
ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉ.కొరియా
సియోల్: లక్ష్యాలపైకి దూసుకెళ్లి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. వీటి దాడులను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తరకొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఈ మానవరహిత ఏరియల్ వెహికిల్స్కు ‘ఎక్స్’ ఆకృతిలో రెక్కలు, తోక భాగం ఉన్నాయి. ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను పోలి ఉన్నాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ సైనిక అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేలి్చవేసిన దృశ్యాలను ప్రసారం చేసింది. వివిధ దిశల్లో ఈ డ్రోన్లు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించాయి. వీటి పనితీరు పట్ట కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు
సియోల్: అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీఎంబీ)ను పరీక్షించామని శుక్రవారం ఉత్తరకొరియా ప్రకటించింది. ఇది ప్రచారయావ తప్పితే.. వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఇంతటి భారీస్థాయి క్షిపణి ఉపయుక్తకరంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణుల అభివృద్ధి చేయడంలో సాంకేతిక అడ్డంకులను ఉత్తరకొరియా అధిగమించినట్లు తాజా క్షిపణి పరీక్ష ఎక్కడా రుజువు చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు. గురువారం తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–19 .. ఇదివరకు ఎన్నడూ లేనంత దూరానికి, ఎన్నడూ లేనంత ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారని వెల్లడించింది. రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్ యంగ్–కెయున్ తెలిపారు. ల్యాంచ్పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు ఎనిమిది వేల మంది ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మొహరించిందని అమెరికా వెల్లడించింది. రష్యాలోని కస్క్లో ఉక్రెయిన్ సేనలు పాగా వేయడం తెలిసిందే. కస్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లించడానికి వీలుగా 8 వేల మంది ఉత్తరకొరియా సైనికులను తరలించిందని వివరించింది. -
దక్షిణ కొరియా శత్రు దేశమే, రాజ్యాంగంలో మార్పులు: నార్త్ కొరియా
గత కొద్ది రోజులుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణించడం అనివార్యమైన, న్యాయపరమైన చర్యగా కిమ్ సర్కార్ పేర్కొంది. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగ మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు కిమ్ సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ ఏడాది జనవరిలో కిమ్ దక్షిణ కొరియాను తమ దేశానికి ప్రధాన శత్రువుగా నిర్వచించారు. అధ్యక్షుడు పిలుపునిచ్చిన చట్టపరమైన మార్పులను ప్యోంగ్యాంగ్ మొదటిసారిగా గుర్తించింది.కాగా ఇటీవల దక్షిణ కొరియాను అనుసంఘానం చేసే సరిహద్దులోని రోడ్లను, రైల్వేలను కిమ్ సైన్యం బాంబులతో పేల్చివేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు. -
కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్ కొరియా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్తో కరచాలనం -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్.. రీ, కాంగ్ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది. చదవండి : మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరిక -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్జోంగ్ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
కిమ్ అరాచకం: 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరి.. ఎందుకంటే!
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. -
కిమ్కు పుతిన్ గిఫ్ట్..ఈ సారి ప్రత్యేకంగా..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి 24 మేలిమి జాతి గుర్రాల్ని బహుమతిగా ఇచ్చారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తుంది. అయితే ఉక్రెయిన్పై దాడి చేసేందుకు తమకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం పుతిన్.. కిమ్ జోంగ్ ఉన్ని కోరారు. పుతిన్ విజ్ఞప్తితో వెను వెంటనే కిమ్ జోంగ్ ఉన్ ఆఘమేఘాల మీద రష్యాకు యుద్ధ సామాగ్రిని పంపించారు. అందుకు ప్రతిఫలంగా పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడికి గుర్రాల్ని బహుకరించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ నివేదించింది. ఈ ఏడాది జూన్లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సైనిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్కు కిమ్ గిఫ్ట్గా ఇచ్చారు కిమ్. అందుకు.. రష్యా అధ్యక్షుడు కూడా ఆరుస్ లిమోసిన్ కారును బహుకరించారు.ఆ తర్వాత కిమ్కు 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్కు బహుమతిగా ఇచ్చారు. -
నార్త్ కొరియా: వరద సహాయక చర్యల్లో కిమ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖరీదైన బ్లాక్ లెక్సస్ కారులో వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేశారు. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పోటెత్తిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు కిమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గడిచిన కొన్నిరోజులుగా ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వరదలు వచ్చి వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉత్తరకొరియాలో చైనాకు సరిహద్దులో ఉన్న సినాయ్జూ, యిజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లినపుడు నడములోతు నీటిలో ఉన్న బ్లాక్ లెక్సస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియా ప్రచురించింది. అధ్యక్షుడే దిగివచ్చి నేరుగా వరద సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల సారాంశం. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమవుతోంది. తాజాగా విరుచుకుపడ్డ వరదలు ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటి పారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా. -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్పోర్ట్లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్ను పుతిన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్కు కిమ్ బహూకరించారు. కిమ్కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
ఆంక్షలపై సమష్టి సమరం
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించారు.‘‘ ఉక్రెయిన్ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్ అన్నారు.ఉక్రెయిన్లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ, సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా కొట్టిపారేశాయి. పుతిన్ పర్యటన వేళ ఈ ఆయుధ సాయం, టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్తో ఆగదు: అమెరికా‘ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణు లే ఉక్రెయిన్ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం విదితమే. -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
యుద్ధ ట్యాంక్ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్ర్సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. -
కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే. ఇదీచదవండి..బ్రిటీష్ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి -
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్
ప్యాంగ్యాంగ్ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల వల్లే కిమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘దక్షిణ కొరియాతో కలవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం. మన రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. దక్షిణ కొరియా మన ప్రధాన శత్రువని రాబోయే తరాలకు తెలియజేయాలి. దక్షిణ కొరియాను ఆక్రమించుకునేందుకు మనం ప్రణాళిక రచించాలి. రెండు దేశాల మధ్య ఇక ఎలాంటి సమాచార పంపిణీ ఉండకూడదు. ప్యాంగ్యాంగ్లో ఉన్న కొరియా పునరేకీకరణ ఐకాన్ను ధ్వంసం చేయండి. కొరియా దేశాల పునరేకీకరణ కోసం పని చేస్తున్న సంస్థను మూసేయండి. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని వెంటనే ఆపండి’ అని నార్త్ కొరియా పార్లమెంట్లో కిమ్ ప్రసంగించారు. ఇదీచదవండి.. నౌకలపై దాడులతో ఇంధన సరఫరాపై ప్రభావం -
కిమ్కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్ చేసి..
ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. కొరియన్ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చూపే ప్రతీ అంశాన్ని కిమ్ జోంగ్ ఇల్ నిషేధించారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. ఆ కాలాన్ని దక్షిణ కొరియా చిత్రాలకు గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అప్పట్లో చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలయ్యేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు. ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్బోట్లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్లో జరిగిన వ్యాపార ఒప్పందం అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు. ఉత్తర కొరియాలో రూపొందే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలని కిమ్ జోంగ్ ఇల్ తపించిపోయాడు. చోయ్ యున్ హీ భర్తను కూడా తమ ప్రాంతానికి బలవంతంగా తీసుకువచ్చాడు. అయితే ఆ దర్శకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. ఐదేళ్లపాటు జైలులో ఉంచి వివిధ శిక్షలు విధించారు. నార్త్ కొరియా కోసం సినిమాలు తయాలని ఆదేశించారు. షిన్ జియోంగ్ గ్యున్ ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, తన భార్య చోయ్ యున్ హీ కలసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశామని చెప్పారు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేయాలని, అప్పుడే మా ప్రాణాలు నిలబడతాయని కిమ్ జోంగ్ ఇల్ ఆదేశించారని షిన్ జియోంగ్ గ్యున్ తెలిపారు. అయితే 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ జియోంగ్ గ్యున్లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారికి కిమ్ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే ఆ దంపతులు ఎలాగోలా తప్పించుకుని, అమెరికా చేరుకుని అక్కడ ఆశ్రయం పొందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం.. రష్యా కోసం..
సియోల్: ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ దేశంలోకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, రష్యాకు చెందిన ఓ గ్రూప్ నార్త్ కొరియాలో పర్యటించనున్నారు. ఈ బృందం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఉత్తర కొరియాకు బయలుదేరనుంది. వివరాల ప్రకారం.. పర్యాటకుల విషయంలో ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తమ దేశంలోకి మళ్లీ పర్యాటకులు వచ్చేందుకు తాజాగా నార్త్ కొరియా అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నార్త్ కొరియా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పర్యాటకులకు అనుమతించలేదు. దేశంలోకి రాకుండా కఠిన నిబంధనలను విధించింది. ఇక, తాజాగా పర్యాటకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన టూరిస్టులు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన నార్త్ కొరియాకు వెళ్లనున్నారు. అక్కడ నాలుగు రోజులు పాటు పర్యటించనున్నారు. పలు సిటీల్లోకి ప్రవేశించనున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో తూర్పు రష్యాలో ఒక శిఖరాగ్ర సమావేశం కోసం కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాలలో సహకారం అందించుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. ఉత్తరకొరియాకు చైనా నుంచి కూడా సహకారం అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నార్త్ కొరియాకు జిన్పింగ్ మద్దతుగా నిలిచారు. కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్లను నార్త్ కొరియాకు చైనా పంపించింది. -
North korea: సౌత్ కొరియాకు కిమ్ మళ్లీ వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్జాంగ్ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యమని, అయితే తమ పై ఆ దేశం మిలిటరీ చర్యలకు దిగితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. తమ వద్ద ఉన్న మొత్తం సామర్థ్యం మొత్తం వినియోగించైనా సరే దక్షిణ కొరియాను లేకుండా చేస్తామని కిమ్ అన్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. పరోక్షంగా అణుబాంబులు వేయడానికి కూడా వెనుకాడబోమని కిమ్ వ్యాఖ్యలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో దక్షిణ కొరియాకు సరిహద్దులో ఉన్న సముద్రంలోని ఓ ఐలాండ్లో ఉత్తర కొరియా 200 రౌండ్ల ఆర్టిలరీ బాంబులు వేసింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా అక్కడ ఉంటున్న కొంత మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కిమ్ ఈ ఏడాది జరగనున్న సౌత్కొరియా, అమెరికా సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. రెండు దేశాల్లో తనకు అనుకూలమైన వారు ఎన్నికవుతారని ఆయన ఆశిస్తున్నట్లున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు దక్షిణ కొరియాలో లిబరల్స్ అమెరికాలో తిరిగి ట్రంప్ అధికారంలోకి వస్తారని, వీరు గనుక ఎన్నికైతే తమకు కొంత వరకు మేలు జరుగుతుందని కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..వామ్మో 2023 -
North Koria : కిమ్ 40వ బర్త్ డే వేడుకలు ఎందుకు చేసుకోలేదు..?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కి 40 ఏళ్లు వచ్చాయి. ఆయన తన 40వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోలేదు. దీనికి పలు కారణలున్నాయని తెలుస్తోంది. ఇందులో ముఖ్య కారణం మాత్రం కిమ్ జాంగ్ ఉన్ తల్లేనట. ఎందుకంటే కిమ్ తల్లి జపాన్కు చెందిన మహిళ అవడంతో బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఆమె ఉత్తర కొరియాకు చెందినది కాదనే చర్చ జరుగుతుందని కిమ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే బర్త్డే వేడుకలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన తండ్రి, తాత తరహాలో బర్త్డే రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వడంతో పాటు మిలిటరీ పరేడ్ నిర్వహించేత వయసు తనకు ఇంకా రాలేదని, తాను ఇంకా చిన్నవాడినని ఆయన అనుకుంటుంటారని సమాచారం. ఈ కారణాలతోనే కిమ్ తన బర్త్డే వేడుకలను జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే బర్త్డే రోజు కిమ్ తన కూతురుతో కలిసి ఓ కోళ్ల ఫామ్ను సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఇదీచదవండి..ఎన్నికల్లో విజయం..బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు -
నిన్ను ఆకలి దప్పికలు లేని ఓ కొత్త లోకానికి తీసుకెళ్తా..!
ఈ కొత్త ఏడాదిలో నిన్ను ఆకలి దప్పికలు లేని ఓ కొత్త లోకానికి తీసుకెళ్తా డోంట్ వర్రీ! -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు. ‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది. 2020, అక్టోబర్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు. కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు. భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు. ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం -
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్పై దాడి.! భారత్కు పన్నూ బెదిరింపులు -
ఎక్కువ మందిని కనండి: కిమ్
సియోల్: దేశాన్ని బలోపేతం చేయాలంటే జననాలను పెంచటం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ చెప్పారు. ఆదివారం జరిగిన నేషనల్ మదర్స్ సమావేశంలో కిమ్ ప్రసంగిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు పిలుపునిచ్చారు. జననాల రేటు క్షీణతను అడ్డుకోవడం, చిన్నారుల సంరక్షణ, విద్య అనేవి తల్లుల వల్లే సాధ్యమవుతాయని చెప్పారు. దేశ జనాభా గణాంకాలను ఉత్తరకొరియా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అయితే, అక్కడ గత పదేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోందని పొరుగు దేశం దక్షిణ కొరియా అంటోంది. పిల్లల పెంపకం, చదువు చెప్పించడం వంటివి చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఉత్తర కొరియాలోని చాలా కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కార్మికుల సమీకరణపై ఆధారపడే ఆ దేశానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. -
అమెరికాకు అదిరిపోయే కౌంటరిచ్చిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: అగ్ర రాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అంతరిక్ష హక్కులు, తాము ప్రయోగించిన నిఘా ఉపగ్రహానికి అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా మండిపడినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్రమంలో నార్త్ కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని తాము యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెలిపారు. తమ చట్టబద్ధమైన అంతరిక్ష ఉపగ్రహా కార్యక్రమాలకు సంబంధించిన విధానాలను ఉల్లంఘించడానికి ప్రయత్నస్తే.. తాము కూడా అమెరికా గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేయటం, ప్రతిఘటించడానికి తమదైన వ్యూహాలను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా స్వీయ రక్షణలో భాగంగా అమెరికా స్పేస్ కమాండ్ ప్రతినిధి షెరిల్ క్లింకెల్ మాట్లాడుతూ.. అన్ని డొమైన్లలోని తమ ప్రత్యర్థి దేశాల శక్తి, సామర్థ్యాలను తాము ఎందుర్కొవటంతో పాటు, అవసరమైతే వాటిని నాశనం చేసే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర కోరియా బాలిస్టిక్ టెక్నాలజీ ఉపయోగించి చేపట్టే పలు క్షిపణీ పరీక్షల విషయంలో యూఎన్ తీర్మాణాల పాటించని విషయం తెలిసిందే. అయితే అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాలకు బాలిస్టిక్ క్షిపణలు అభివృద్ధికి మధ్య సాంకేతికత విషయంలో దగ్గరి సంబంధాలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
వైట్హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ రెచ్చగొట్టింది. ఈసారి క్షిపణి పరీక్షతో కాదు.. అంతకు మించిన చర్యతో. అణ్వాయుధ బలగాలను విపరీతంగా పెంచుకునేలా ఏకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంది. తద్వారా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించారు. తద్వారా.. ప్యాంగ్యాంగ్తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను ఆయన తేలికగా తీసుకున్నట్లు అయ్యింది. గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాముల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీపీఆర్కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరోవైపు ఈ చర్యపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది. -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
యుద్ధ విమానాల ప్లాంట్ను సందర్శించిన కిమ్
సియోల్: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జొంగ్ ఉన్ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్స్క్ ఆన్ అముర్లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ ఎస్యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్ విడుదల చేసింది. ఒక ఎస్యూ–35 ఫైటర్ జెట్ ల్యాండ్ అయినప్పుడు కిమ్ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్ సుఖోయ్ ఎస్జే–100 ప్యాసింజర్ విమానాల ప్లాంట్ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. -
ఇప్పుడు పుతిన్కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
రష్యా గడ్డపై కిమ్.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయన మొదటిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్స్క్ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిమ్ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్ జోంగ్ ఉన్ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు. చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా గంటకు 50 కిలోమీటర్ల వేగమే.. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు. -
అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు. రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆయుధమే కీలకం.. పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు. సంతకాన్ని రద్దు చేసుకుంటే! ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు. ప్రతిఫలం అదేనా? రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్లో పుతిన్తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
పుతిన్తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్లో కలుసుకున్నారు. -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్కు వెళ్లి పుతిన్ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
యుద్ధానికి సిద్ధంకండి.. కిమ్ ఆదేశాలు.. ఏ క్షణమైనా..
సియోల్ : ఉత్తర కొరియా సమరశంఖాన్ని పూరించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసినట్టుగా దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా అత్యున్నత స్థాయి మిలటరీ జనరల్ను మార్చారు. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని సైనిక సన్నాహాలు మరింత వేగవంతం చేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఈ నెల 21 నుంచి 24 మధ్య సంయుక్తంగా మిలటరీ విన్యాసాలు చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మిలటరీ జనరల్గా ఉన్న పాక్ సూ ఇల్ స్థానంలో జనరల్ రియాంగ్ గిల్ను నియమి స్తున్నట్టుగా ప్రకటించారు. గతవారంలోనే కిమ్ ఆయుధ ఫ్యాక్తరీని సందర్శించి మరిన్ని క్షిపణులు, శతఘ్నులు, ఇతర ఆయుధాలను తయారు చేయా లని ఆదేశించినట్టుగా తెలిసిందే. -
అణు క్షిపణులతో ఉత్తరకొరియా పరేడ్
సియోల్: ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్లో జరిగిన సైనిక పరేడ్లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్లో ఉన్న కిమ్–2 సంగ్ స్వే్కర్లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్జోంగ్లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు. -
కిమ్తో రష్యా మంత్రి భేటీ
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఉ. కొరియా అధికారిక మీడియా తర్వాత వెల్లడించింది. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్తో రష్యా రక్షణ మంత్రి సమావేశంకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్యాంగ్లో సమావేశమైన సెర్గీ, కిమ్లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్ ఆయుధాల ఎగ్జిబిషన్కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు. -
మళ్లీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
సియోల్: తమ ప్రత్యర్థి దేశమైన దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సాయం అందిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండు షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం బహిర్గతం చేశారు. ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షిపణి ప్రయోగం నిర్వహించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. రాజధాని పాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు 400 కిలోమీటర్లు(248 మైళ్లు) ప్రయాణించి తూర్పు కోస్తా తీరంలో సముద్రంలో పడిపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు. తమ నిరసనను ఉత్తర కొరియాకు తెలియజేశామని చెప్పారు. -
కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..?
ప్యోంగ్ యాంగ్: అమెరికాకు చెందిన సైనికుడు అక్రమంగా నార్త్ కొరియాలోకి చొరబడ్డాడన్న కారణంతో అతడిని బంధించింది అక్కడి సైన్యం. దీంతో నార్త్ కొరియా చెర నుండి అమెరికా సైనికుడు అసలు బయటపడతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అమెరికాకు చెందినవారు 18 మంది నార్త్ కొరియాలో బందీలుగా ఉన్నారు. కానీ అందులో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా రెండు నెలల్లోనే విడుదలయ్యారు. ఎవరీ ట్రావిస్ కింగ్? అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్(23) విస్కాన్సిన్లో అమెరికా దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం 2021 జనవరిలో యూఎస్ ఆర్మీలో చేరిన కింగ్ కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాలో కూడా ఇలాగే అక్రమంగా చొరబడ్డాడు. రెండు నెలల పాటు అక్కడ జైలు జీవితం గడిపిన తర్వాత అతడిని టెక్సాస్ తిరిగి పంపించేయాలని నిర్ణయించాయి దక్షిణకొరియా వర్గాలు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అప్పటికే అమెరికా సైన్యం నుండి బహిష్కరించబడిన ట్రావిస్ కింగ్ వారి నుండి ఎలాగో తప్పించుకుని ఉభయ కొరియాలకు మధ్యలో పన్ముంజోన్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుండి ఉత్తర కొరియా చేరుకొని అక్కడ కోమ్ జోంగ్ బలగాలకు పట్టుబడ్డాడు. అతడు ఎందుకిలా దేశాటన చేస్తున్నాడన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. తిరిగొచ్చేనా? పెంటగాన్ వర్గాలు అసలు ట్రావిస్ నార్త్ కొరియా ఎందుకు వెళ్లాడన్న కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. మరో పక్క ప్యోంగ్ యాంగ్, పెంటగాన్ వర్గాల నుంచి చర్చలకు పిలుపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది. అసలే అమెరికా ఉత్తర కొరియ మధ్య పచ్చగాడి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా సైనికుడిని వారు విడిచి పెడతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ట్రావిస్ కింగ్ తల్లి కూడా తన కుమారుడు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని, వాడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా అమెరికా నుండి 18 మంది నార్త్ కొరియాలోకి అక్రమంగా చొరబడగా వారిలో చార్లెస్ రాబర్ట్ జెన్కిన్స్ మినహాయిస్తే మిగతా వారందరిని రెండు నెలలలోపే తిరిగి పంపించేసింది. చార్లెస్ జెన్కిన్స్ ను మాత్రం 1965 లో అదుపులోకి తీసుకుని 2004లో విడుదల చేసింది. ఇది కూడా చదవండి: తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక -
ఉత్తర కొరియా కవ్వింపు.. మామూలుగా లేదుగా!
సియోల్: పొరుగు దేశం దక్షిణ కొరియా.. అమెరికాతో సంయుక్త సైన్య విన్యాసాల్ని ప్రదర్శించడం ఉత్తర కొరియాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంటుంది. తాజాగా మరోసారి దూకుడు చర్యతో తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీసింది. బుధవారం వేకువ ఝామున శక్తివంతమైన రెండు బాలిస్టిక్ మిస్సైల్స్ను ప్రయోగించింది. ఈ విషయాన్ని అటు జపాన్.. ఇటు దక్షిణ కొరియా సైన్యాలు ధృవీకరించాయి. అమెరికా నుంచి అణ్వాయుధాలతో కూడిన బాలిస్టిక్ మిస్సైల్ సబ్మెరిన్ దక్షిణ కొరియా తీరానికి చేరుకుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇది చోటు చేసుకోగా.. ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఇలా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు క్షిపణులు జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల పడినట్లు తెలుస్తోంది. A day after the inaugural session of U.S- #SouthKorea security dialogue, #NorthKorea fired two short-range #ballisticmissiles into the East Sea today. pic.twitter.com/i8tBsV6xtY — Mirror Now (@MirrorNow) July 19, 2023 తాజా పరిణామంపై దక్షిణ కొరియా భగ్గుమంది. ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని.. పైగా కొరియా ప్రాంతంతో పాటు అంతర్జాతీయ సమాజంలోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందంటూ దక్షిణ కొరియా సంయుక్త దళాల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు అమెరికా స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా దగ్గరుండి గత వారం శక్తివంతమైన వాంగ్సోంగ్-18 క్షిపణి ప్రయోగం పర్యవేక్షించారు. ఈ రెండు క్షిపణలూ.. తీవ్ర నష్టాన్ని కలిగించేవని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా చేసింది. -
ఆ నియంతకు ఖరీదైన మద్యం, సిగరెట్ లేనిదే రోజు గడవదట!
ఉత్తర కొరియా పేరు వినిపించగానే ఎవరికైనా సరే ముందుగా ‘మిసైల్ టెస్ట్’.. తరువాత ఆ దేశ నియంత కిమ్ జోంగ్ పేర్లు గుర్తుకువస్తాయి. తన వింత ప్రవవర్తన, ఆదేశాల కారణంగా కిమ్ జోంగ్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చల్లో కనిపిస్తుంటాడు. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్న్ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక ఏడాది వ్యవధిలో కిమ్జోంగ్ వందల కోట్ల విలువైన మద్యాన్ని తాగుతాడు. కిమ్ జోంగ్ తాగే మద్యానికి సంబంధించి ఒక్కో బాటిల్ విలువ వేల డాలర్లలో ఉంటుంది. ఇతర దేశాలకు ఛాలెంజ్.. ఉత్తర కొరియాలో ఆర్థికపరిస్థితి మందగమనంలో ఉంది. దీనికితోడు దేశ నియంత తరచూ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తూ, ఇతర దేశాలకు ఛాలెంజ్ విసురుతుంటాడు. జపాన్లోనూ ఇటువంటి నియంత పాలనే కొనసాగుందనే వాదనలు వినిపిస్తుంటాయి. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అతను తాగే ఖరీదైన మద్యం, ఖరీదైన సిగరెట్ల వినియోగం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాంసం అతని లగ్జరీ లైఫ్ను ప్రతిబింబిస్తాయి. ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్లు.. ఆమధ్య విదేశీ మీడియాతో మాట్లాడిన బ్రిటన్ మంత్రి ఒకరు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మద్యపాన ప్రియుడని తెలిపారు. ఆయన బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, ఖరీదైన హెన్సీ బ్రాండ్ తాగడాన్ని ఎంతో ఇష్టపడతారన్నారు. వీటికి సంబంధించిన ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్ల వరకూ ఉంటుందన్నారు. ఇంతేకాదు ఆయన అత్యంత ఖరీదైన వైవ్స్ సెంట్ లారెంట్ బ్లాక్ సిగరెట్ తాగుతాన్నారు. ఈ సిగరెట్ బంగారు రేపర్లో చుట్టి ఉంటుందన్నారు. ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు.. కొన్నేళ్ల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిరంగపరిచిన గణాంకాల ప్రకారం 40 ఏళ్ల కిమ్జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో హైక్వాలిటీ మద్యం తాగేందుకు ఏటా 30 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తారు. ఇంతేగాదు భోజన ప్రియుడైన కిమ్ జోంగ్ ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు ఆరగిస్తారు. మద్యం, సిగరెట్ల అలవాటు కారణంగానే అతని బరువు 136 కిలోలకు చేరుకుందని అక్కడి నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
Kim Jong Un: ఓ వైపు ఆహార సంక్షోభం.. కిమ్ విందు, విలాసాలకు కోట్లు!
ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు. రూ. 5 లక్షల విలువ చేసే మద్యం ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు. బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్తో తయారు చేసేది), స్విస్ చీజ్ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!! పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్ కిమ్కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్గా చేసిన ఒకరు పేర్కొన్నారు. స్నేక్ వైన్ యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా నియంత యూఎస్ఏ నుంచి మార్ల్బోరో సిగరెట్లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
ఒంటరిగా మారిన ఉత్తరకొరియా.. కరువు ముంగిట కిమ్ ‘రాజ్యం’
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. 1990ల నాటి కరువు కంటే తీవ్ర పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సుమారు 30 లక్షల మంది ప్రాణాలొదిలారు. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో పరిస్థితి విషమంగా మారింది. సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జనం ఆకలితోచనిపోతున్నట్లు సమాచారం. దేశంలో ఆహార కొరత ఏర్పడిన విషయాన్ని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. మరోవైపు, ప్రభుత్వం క్షిపణులు, అ«ణ్వాయుధాల తయారీకి భారీగా ఖర్చు పెడుతోంది. -
రెండు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన వేళ ఉత్తర కొరియా గురువారం రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఉభయ కొరియాల సరిహద్దుల్లో భారీగా కొనసాగిన అయిదో విడత సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా గుర్రుగా ఉంది. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలపై తాము ఏదో ఒక రీతిలో తప్పక స్పందిస్తామని ఆ దేశ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, గురువారం సాయంత్రం ఆ దేశ రాజధాని ప్రాంతం నుంచి తూర్పు సముద్ర జలాలపైకి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. -
కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరోగ్య పరిస్థితి గురించి మరో కథనం తెరపైకి వచ్చింది. ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్బర్గ్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా హౌజ్లలో కథనాలు పబ్లిష్ అయ్యాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(NIS) రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(నిద్రలేమి)కు సంబంధించి విదేశీ మెడికల్ ఇన్ఫర్మేషన్ను.. ప్రత్యేకించి జోల్పిడెమ్ లాంటి మందులకు సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట. ఎన్ఐఎస్ నివేదిక వివరాలను సౌత్ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ కార్యదర్శి యూ సాంగ్ బూమ్ మీడియాకు వెల్లడించారు. ఇన్సోమ్నియా ఉత్తర కొరియాను కలవరపెడుతోంది. అక్కడి పెద్ద తలకాయ ఆ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం మాకు ఉంది. అంతేకాదు.. దాని ట్రీట్మెంట్, మందుల సమాచారం కోసం విదేశీ వైద్యవిధానాల గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారని తేలింది. వీటితో పాటు తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించిన కొన్ని ఫొటోలను అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మళ్లీ విపరీతంగా బరువు పెరిగినట్లు స్పష్టమైందని బూమ్ తెలిపారు. వీటితో పాటుగా.. విదేశాల నుంచి మల్బరో, డన్హిల్ లాంటి విదేశీ బ్రాండ్ సిగరెట్లను, ఆల్కాహాల్తో పాటు తినే చిరు తిండ్లను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అతిగా మద్యం, ధూమపానం వల్ల కిమ్ ఆరోగ్యం దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 140 కేజీల బరువునకు ఆయన చేరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్లీపింగ్ డిజార్డర్ ఇన్సోమ్నియా ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే 16వ తేదీన ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్లాంటి మందుల్ని సైతం సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది అని సదరు నివేదిక సారాంశాన్ని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. నార్త్ కొరియాలో ఆహార కొరత కారణంగా.. ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు వచ్చిందని, కిమ్ అధికారంలోకి చేపట్టాక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ వస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రజల ఆకలిని పట్టించుకోకుండా.. విలాసాలు, హైప్రొఫైల్ పార్టీలతో కిమ్ కుటుంబం జల్సాలు చేస్తోందన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నిద్ర లేమి ఎంత ప్రమాదకరమంటే.. -
కిమ్కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
కిమ్ దేశంలో దారుణ శిక్షలు.. రెండేళ్ల చిన్నారినీ వదల్లేదు!
ఉత్తరకొరియా అధ్యక్షుడి నిరంకుశ పాలన గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. వివాదాస్పద నిర్ణయాలతో గ్లోబల్ మీడియాలో నిలుస్తుంటారు. భయంకరమైన చట్టాలతో దారుణ శిక్షలకు గురిచేస్తుంటారు. ఇలాంటి ఓ విషయాన్నే అమెరికా నివేదిక వెల్లడించింది. ఆ దేశంలో బైబిల్ కలిగి ఉన్నవారికి మరణశిక్షను విధిస్తున్నారంట. ఆ కుటుంబ సభ్యులను కఠిన శిక్షలకు గురిచేస్తున్నారు. అలా ఓ రెండేళ్ల చిన్నారికి కూడా జీవితఖైదు విధించినట్లు నివేదిక పేర్కొంది. జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది అమెరికా విదేశాంగ శాఖ 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఉత్తరకొరియాలో ఇతర మత విశ్వాసాలను అవలంభించిన వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 70 వేల మంది క్రిస్టియన్స్ జైళ్లలో మగ్గుతున్నారని వెల్లడించింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 2009లో ఓ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. వారందరికీ జీవిత ఖైదు విధించారని నివేదిక వెల్లడించింది. దారుణ వేధింపులు ఆ దేశంలో మతపరమైన శిక్షలు అనువభవిస్తున్న వారందరు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శారీరక హింస, జీవించే హక్కుకు భంగం వాటిల్లడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులతో వారిని వేధిస్తున్నారని నివేదిక వెల్లడిచ్చింది. కొరియా ఫ్యూచర్ అనే లాభాపేక్ష లేని సంస్థ డిసెంబర్ 2021లోనే ఓ నివేదికను విడుదల చేసింది. మతపరమైన స్వేచ్ఛ ఆ దేశంలో అడుగంటిపోయిందని తెలిపింది. మత స్వేచ్ఛను కోరుకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అవయవాల దోపిడి, హత్యలు అత్యాచారం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పేర్కొంది. చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే... -
నియంత కిమ్లా మారిన రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని తీరుపై నెటిజన్లు ఫైర్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై నెటిజన్లు మండిపడ్డారు. లండన్లోని డౌనింగ్ స్ట్రీట్కు వచ్చే సమయంలో సునాక్ కాన్వాయ్ ముందు సెక్యూరిటీ గార్డులు సైకిల్ తొక్కుకుంటూ కన్పించారు. మరికొంత మంది సెక్యూరిటీ ఆయన కారుతో పాటు పరుగులు తీస్తూ డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లారు. రిషి సునాక్ రేంజ్ రోవర్ కారు ముందు సెక్యూరిటీ ఇలా సైకిల్పై రావడం, పరుగులు పెట్టుకుంటూ వెళ్లడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Is this really necessary? 😳 Look at how @RishiSunak gets escorted through London. pic.twitter.com/O6VaiNneyV — Charlotte, The Baroness 💫 (@CharlotteEmmaUK) April 24, 2023 ఈ వీడియో చూసిన నెటిజన్లు సునాక్పై విమర్శలు గుప్పించారు. ఈ సెక్యూరిటీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ సెక్యూరిటీతో పోల్చారు. రిషి సునాక్ కూడా కిమ్లా ప్రవర్తిస్తున్నారని, నియంతలా మారిపోయారని ధ్వజమెత్తారు. మరికొందరేమో కిమ్ జోంగ్ లండన్ వచ్చారా? ఆయన సెక్యూరిటీ ఇక్కడ ఉందేంటి? అని సునాక్ తీరుపై సెటైర్లు వేశారు. 'రిషి సునాక్లా చేసినట్టు గతంలో ఏ ప్రధాని చేయలేదు. పోలీసు బలగాలను వృథా చేస్తున్నారు. ఉత్తర కొరియాను ఫాలో అవడం బాలేదు' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. సునాక్ కాన్వాయ్ ముందు సైకిళ్లపై వచ్చిన సెక్యూరిటీ రోడ్డుపై ఉన్నవారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించింది. దారివ్వండి, తప్పుకోండి అంటూ అరుస్తూ ముందుకు సాగింది. దీంతో వీళ్ల హడావుడి చూసి స్థానికులు అవాక్కయ్యారు. చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు -
North Korea: మరింత ‘అణు’ దూకుడు
సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది. -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
పసికందుల ఆకలి కేకలు ఓవైపు.. విలాసాలు మరోవైపు!
పట్టెడన్నం దొరక్క బక్కచిక్కిపోయి.. డొక్కలు ఎండుకుపోయి ఆకలితో నకనకలాడుతూ పసికందుల దృశ్యాల నడుమ.. పాలబుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా తండ్రి చెయ్యిలో చెయ్యేసి నడయాడుతున్న కిమ్ తనయ దృశ్యాలు మరోవైపు.. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్పై ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ఒకవైపు ప్రజలు దీనావస్థలో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు విలాసవంతమైన జీవనశైలితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు కిమ్ కుటుంబం ప్రయత్నిస్తోంది. నానాటికీ దిగజారిపోతున్న అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పతనం గురించి రేడియో ఫ్రీ ఏషియా.. రహస్యంగా అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో చాలామంది కిమ్, ఆయన కుటుంబం అనుభవిస్తున్న రాజభోగాలపై మండిపడ్డారు. నా కుటుంబం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పూట తిండికి చాలా కష్టంగా గడుస్తోంది. నాకూ పదేళ్ల పాప ఉంది. ఆకలితో నా బిడ్డ అల్లలాడిపోతోంది. కానీ, ఈ దేశ అధ్యక్షుడి కూతురు రంగు రంగుల బట్టలతో నిత్యం టీవీల్లో కనిపిస్తోంది. ఆమె పాల బుగ్గలే చెబుతున్నాయి.. ఆమెకు ఎలాంటి తిండి అందుతుందో!. పైగా ఈగ కూడా వాలకుండా ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. మరి.. మా పిల్లలు ఏం పాపం చేశారు? లక్షల మంది ఉసురు ఊరికే తగలకుండా ఉంటుందా? అంటూ ఆ వ్యక్తి కిమ్కు శాపనార్థాలు పెట్టాడు. ఇదిలా ఉంటే.. మరోవ్యక్తి సైతం కిమ్ కూతురి ప్రస్తావన తెచ్చి విమర్శలు గుప్పించాడు. దేశంలో ఎంతో మంది పిల్లలు తిండి దొరక్క అల్లలాడిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. బక్కచిక్కిపోయిన మా బిడ్డల రూపాలు చాలవా? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. అయినా.. ఇవేం కిమ్కు పట్టవు అంటూ మరో వ్యక్తి విమర్శించాడు. మొత్తం వెయ్యికి పైగా ప్రజల అభిప్రాయాలను.. వాళ్ల గుర్తింపును బయటకు రానీయకుండా జాగ్రత్త పడింది. రాజధాని ప్యాంగ్యాంగ్తో సహా చాలా చోట్ల ఆకలి మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ అంకెలను బయటకు పోకుండా కఠిన వైఖరి అవలంభిస్తోంది కిమ్ ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. కిమ్ గారాల కూతురు కిమ్ జు ఏ గత కొంతకాలంగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. క్షిపణి పరీక్షల దగ్గరి నుంచి రకరకాల ఈవెంట్స్కు ఆమెను వెంటేసుకుని వెళ్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్. దీంతో.. తదుపరి కిమ్ తర్వాత ఆ చిన్నారేనంటూ చర్చ మొదలైంది. అయితే పాలనలో పురుషాధిపత్యం ప్రదర్శించే ఉత్తర కొరియాలో ఆ అవకాశం లేదంటూ కొట్టిపారేస్తున్నారు విశ్లేషకులు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ఏనాడూ కిమ్ కుటుంబ సభ్యుల వివరాలను గురించి బయటి ప్రపంచానికి తెలియజేయలేదు. అయితే సియోల్ నిఘా ఏజెన్సీలు మాత్రం ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు(13, 10, 6 వయసు) ఉన్నారని మాత్రం చెబుతోంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ బీజేపీనే! -
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా గురువారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. టోక్యోలో జపాన్–దక్షిణ కొరియా నేతల శిఖరాగ్ర సమ్మేళనం ప్రారంభానికి ముందు ఉ.కొరియా ఈ దుందుడుకు చర్యకు పాల్పడటం గమనార్హం. ఉత్తరకొరియా ఈ నెలలో జరిపిన మొదటి ఐసీబీఎం ప్రయోగం కాగా, వారం వ్యవధిలో చేపట్టిన మూడో ఆయుధ పరీక్ష ఇది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి గురువారం ఉదయం ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తూర్పువైపు సముద్రజలాల్లో పడిపోయినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. -
అమెరికా, దక్షిణ కొరియాకు కిమ్ సోదరి మాస్ వార్నింగ్
ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తారు. కిమ్ అంటే నియంత పరిపాలన.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. తాజాగా ఆయన సోదరి కూడా తన అన్నకు తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు. తన అన్న బాటలోనే, తాజాగా అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా తప్పు పట్టింది. తమపై దాడికొస్తే గట్టి ప్రతిచర్యలుంటాయని దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా కొన్ని నెలలుగా చేస్తున్న విన్యాసాలను మాపై యుద్ధంగానే భావిస్తాం. వారి ప్రతీ అడుగునూ క్షణక్షణం గమనిస్తూనే ఉంటాం. మాకు న్యాయంగా అనిపించే ఏ చర్యనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. తమను తక్కువ అంచనా వేయొద్దని, పసిఫిక్ మహాసముద్రంలోకి పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించగలమని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. హ్వాసాంగ్ 17 పేరుతో ప్రయోగించిన ఐసీఎంబీ విజయవంతం కావడంతో కిమ్ జోంగ్ ఉన్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏ దేశంపైన అయినా సైనిక చర్యకు దిగేలా ప్రేరేపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా తమను ప్రశ్నించినా, బెదిరింపులకు దిగినా అణ్వాయుధాలతోనే సమాధానం ఇస్తామంటూ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కిమ్ హెచ్చరించారు. -
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
వీడు మామూలోడు కాదు.. నార్త్ కొరియాలో వింత చట్టాలు..
-
'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..'
వాషింగ్టన్: వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియా చర్యలను ఖండించాలని ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో అమెరికా ప్రతిపాదించింది. ప్యాంగ్యాంగ్ను దౌత్యపరమైన సంబంధాలవైపు మళ్లేలా చూడాలని సూచించింది. 15 ఉన్నత దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకర దేశంగా అవతరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై తక్షణే చర్యలు తీసుకోవాలని, కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. భద్రతా మండలి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు కంటే దారుణమని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అయితే చైనా, రష్యా మాత్రం అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఉత్తరకొరియాపై మరింత ఒత్తిడి తెస్తే అది నిర్మాణాత్మకంగా ఉండదని వాదించాయి. గతేడాది మేలో ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి మరిన్ని ఆంక్షాలు విధించాలనుకున్నప్పుడు కూడా ఈ రెండు దేశాలే వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నాయి. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆసియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతాయనే విషయాన్ని ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు గుర్తుంచుకోవాలని లిండా వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ఇటీవల మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అనంతరం ప్యోంగ్యాంగ్ పసిఫిక్ను 'ఫైరింగ్ రేంజ్'గా ఉపయోగించడం ఆమెరికా దళాల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని కిమ్ జోంగ్ ఉన్ సోదరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. అనంతరం మండలిలోని మూడింట రెండొంతుల సభ్య దేశాలు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఖండిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం -
తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..మరో క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్తోనూ విడిగా ఉమ్మడి వైమానికి విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను బహుళ రాకెట్ లాంచర్తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్ ఫీల్డ్ను నిర్వీర్వం చేయగలదని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పసిఫిక్ను ఫైరింగ్ రేంజింగ్ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. ఐతే ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది. పైగా దీన్ని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప ప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు. -
నా కూతురి పేరు మరెవరికీ ఉండొద్దు.. కిమ్ హుకుం..
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే ప్రపంచ దేశాలే కాదు సొంత ప్రజలు కూడా భయపడుతారు. ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి మరి. తాజాగా కిమ్ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఉత్తరకొరియాలో కొంతమంది అమ్మాయిలు, మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. కిమ్ కూతురు 'జు ఏ' పేరు దేశంలో మరెవరికీ ఉండొందట. అలాంటి పేరు ఎవరికి ఉన్నా.. వారు వెంటనే మార్చుకుని వేరే పేరు పెట్టుకోవాలట. 'జు ఏ' అనే పేరుతో ఉన్న మహిళతో పాటు, అదే పేరు పెట్టుకున్న 12 ఏళ్ల చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. వెంటనే పేర్లు మార్చుకోవాలని సూచించింది. జనన ధ్రువీకరణ పత్రం కూడా మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో జు ఏ పేరు ఉన్న వారు మాకేంటీ బాధ.. అనుకుంటున్నారు. గత్యంతరం లేక పేరు మార్చుకుంటున్నారు. కిమ్ కూతురు జు ఏ కొద్ది రోజులగా తండ్రితో పాటు ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో కిమ్ తర్వాత ఉత్తరకొరియాను పాలించబోయేది ఆమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరకొరియాలో ప్రజలు పేర్లు మార్చుకోవాలని అధినేతలు హుకుం జారీ చేయడం ఇది తొలిసారేం కాదు. కిమ్ II- సంగ్ పాలనలో కూడా ప్రజలు ఆయన పేరును పెట్టుకోకూడదనే రూల్ ఉండేది. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టాక కూడా తన పేరుతో పాటు, తన భార్య పేరు సోల్-జు పేరు ఎవరికీ ఉండొద్దని నిబంధన తీసుకొచ్చారు. అప్పటికే ఆ పేరు ఉన్నవారు మార్చుకోవాలని తేల్చిచెప్పారు. చదవండి: బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు.. -
North Korea: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్ను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జాంబీ యూనిట్. కిమ్ సైనిక పరేడ్లో జాంబో యూనిట్ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఈ పరేడ్లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు. కాగా.. కొరియన్ పీపుల్ రివల్యూషన్ ఆర్మీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ బుధవారం ఘనంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పదేళ్ల కూతురు కిమ్ జూ అయే కూడా పాల్గొన్నారు. దీంతో కిమ్ తర్వాతే ఈమే ఉత్తర కొరియాను పాలించేందుకు సన్నద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. చదవండి: యద్ధాన్ని ఆపేలా పుతిన్ని మోదీ ఒప్పించగలారా? -
అట్టహాసంగా ఉత్తర కొరియా సైనిక పరేడ్
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలాన్ని మరోసారి ప్రదర్శించారు. రాజధాని పాంగ్యాంగ్లో బుధవారం రాత్రి సైనిక పరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. అమ్ముల పొదిలోని కీలక ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులకు సైతం ఈ పరేడ్లో చోటుకల్పించారు. కిమ్ జోంగ్ ఉన్తోపాటు ఆయన కుమార్తె కిమ్ జూ అయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పది సంవత్సరాల వయసున్న కిమ్ జూ అయే భవిష్యత్తులో ఉత్తర కొరియా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి. ఆమె కిమ్కు రెండో సంతానమని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తండ్రితోపాటు కనిపించారు. మరిన్ని అణ్వాయుధాలను సొంతం చేసుకోవడానికి కిమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నూతన ఘన–ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా సైనిక పరేడ్లో డజనుకుపైగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రదర్శించారు. పొరుగు దేశమైన దక్షిణ కొరియాతోపాటు అగ్రరాజ్యం అమెరికాతో ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యాధునిక అణ్వాయుధాల తయారీపై కిమ్ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్) -
లాక్డౌన్లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్ గురించి మాత్రం కాదట!
ఉత్తర కొరియాలో ఏ ఘటన అయినా హాట్ టాపిక్గానూ, సంచలనంగానూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు చాలా విభిన్నంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఉత్తర కొరియా వార్తల్లో నిలుస్తుంటోంది. ఇప్పుడు తాజగా మరోసారి లాక్డౌన్ విషయమై వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సుమారు ఐదు రోజులు పూర్తి లాక్డౌన్లో ఉంది. కానీ కరోనా మహమ్మారీ గురించి మాత్రం కాదని తెగేసి చెబుతోంది. తమ ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారని, అందుకు సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధించామని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు ఆదివారం వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతిరోజు శరీర ఉష్ణోగ్రతలు గురించి నివేదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే అక్కడే ప్రజలు ఈ నోటీసులు రాకమునుపే ముందస్తుగా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం విశేషం. ఉత్తరకొరియా ప్రజలకు జారీ చేసిన నోటీసుల్లో ప్రజల్లో చాలమంది తీవ్రమైన జలుబుతో కూడా బాధపడుతున్నట్టు సమాచారం. కానీ కోవిడ్ సంబంధించిన కేసుల గురించి మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. గతేడాదే తొలిసారిగా ఉత్తర కొరియా కోవిడ్ కేసులు గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆగస్టు నాటికే తాము కోవిడ్పై విజయం సాధించామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాలోని శ్రామిక ప్రజలందరూ ఇప్పటికే స్వచ్ఛందంగా నిబంధనలను పాటిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క) -
మద్యానికి బానిసైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్
మద్యానికి బానిసైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ -
మద్యానికి బానిసైన కిమ్.. అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారా?
సియోల్: రోజంతా మద్యం తాగడం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 39వ బర్త్డే జరుపుకున్న కిమ్కు.. వయస్సు మీదపడుతుందనే బెంగ ఎక్కువైనట్లుగా ఉందని దక్షిణకొరియా రాజధాని సియోల్లో ఉంటున్న ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చొయ్ జిన్వూక్ అంటున్నారు. ఒంటరితనంతో బాధపడుతున్న కిమ్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. అనారోగ్య వివరాలు ఎక్కడ బయటకు పొక్కుతాయో అనే భయంతో కిమ్ పర్యటనల సమయంలో సొంత టాయిలెట్ను కూడా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. తాగుడు తగ్గించి, రోజూ సమయం వ్యాయామం చేయాలని భార్య, వైద్యులు సలహాలిచ్చినా పట్టించుకోవడం లేదని మిర్రర్ పత్రిక కథనం పేర్కొంది. -
కిమ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు హెచ్చరికలు జారీ చేశారు. తమ గగనతలంలోకి మరోసారి కిమ్ దేశానికి చెందిన డ్రోన్లు ప్రవేశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అవసరమైతే 2018లో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కిమ్ దేశం హద్దులు మీరొద్దని తేల్చి చెప్పారు. గతవారం ఉత్తరకొరియా డ్రోన్లు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దు దాటి చక్కర్లు కొట్టాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూన్ సుక్.. పొరుగు దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ సైన్యం ఈ విషయంలో వ్యవహిరించిన తీరుపైనా మండిపడ్డారు. డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైన్యం సరైన రీతిలో స్పందించాల్సిందని వ్యాఖ్యానించారు. హద్దు మీరినప్పుడు చూస్తూ ఉరుకోవద్దన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యూన్ సుక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిమ్ దేశం నిబంధనలు ఉల్లంఘిస్తే దీటుగా బదులిస్తున్నారు. చదవండి: రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు -
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
‘కిమ్’ చేసిన పనికి జపాన్లో హై అలర్ట్!
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం. కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! -
అక్కడ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’ అనే పేర్లే పెట్టాలంటా.. లేదంటే?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్ సర్కార్. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’, ‘శాటిలైట్’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. భారీగా జరిమానా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆగ్రహం.. తమ పిల్లల పేర్లను బాంబ్, గన్, శాటిలైట్ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కిమ్ వారసురాలు ఆమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జుయే వయసు కేవలం పదేళ్లు మాత్రమే. తన తోటి వయసు పిల్లల కంటే పొడవుగా పెద్దదానిలా జుయే కనిపిస్తుందని గతంలోనే దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. అంత చిన్న వయసున్న జుయే ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగాలకు హాజరు కావడం విస్మయ పరుస్తోంది. ఆ ప్రయోగాల సమయంలోనే తొలిసారిగా మీడియా కంటపడింది. తాజాగా ఆదివారం కిమ్, తన కుమార్తెతో కలిసి శాస్త్రవేత్తలు, ఇతర అధికారులతో చర్చిస్తున్న ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది. -
కిమ్కి అంత భయమా?.. ట్రంప్ని మించి పోయాడు!
వాషింగ్టన్: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీరు గురించి, ఆయన పాలనా విధానాల గురించి, చివరాఖరికి ఆరోగ్యం గురించి కూడా ప్రపంచం బోలెడంత చర్చించుకుంటోంది. కానీ, ఎందుకనో వ్యక్తిగత విషయాలు మాత్రం పెద్దగా వెలుగులోకి రావు. అంతలా రహస్య జీవనం కొనసాగిస్తోంది ఆయన కుటుంబం. అయితే.. తాజాగా ఆయన తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కిమ్ జోంగ్ ఉన్ తన కూతురితో గత వారం జరిగిన ఓ క్షిపణి పరీక్షకు హాజరు కావడం.. ఆమె చేతి పట్టుకుని కలియదిరగడం.. టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది. అయితే.. ఆమె వివరాలపై ఇప్పుడు న్యూయార్క్ పోస్ట్ కథనం స్పష్టత ఇచ్చే యత్నం చేసింది. ► కిమ్ జోంగ్ కూతురి పేరు జు ఏ. వయసు తొమ్మిదేళ్లు. కాంగ్వాన్ ప్రావిన్స్లోని వోన్సన్ దగ్గర ఓ విలాసవంతమైన విల్లాలో ఆమె ఉంటోంది. ఆ విల్లా.. ప్రపంచంలో అత్యంత లగ్జరీ రిసార్ట్లలో ఒకటిగా పేరున్న మార్-ఎ-లాగో(డొనాల్డ్ ట్రంప్ ఓనర్) తరహాలోనే ఉంటుందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ► ఉత్తర కొరియాలో అత్యంత ధనిక కుటుంబం కిమ్ జోంగ్ ఉన్దే. ఆ దేశవ్యాప్తంగా కిమ్ కుటుంబానికి పదిహేను మాన్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దేశం ఆర్థికంగా చితికిపోయినప్పటికీ.. తన విలాసాల విషయంలో కిమ్ కాంప్రమైజ్ కాడు. ఆహారం దగ్గరి నుంచి ప్రతీ దాంట్లోనూ దర్పం ప్రదర్శిస్తుంటాడు. ► అంతేకాదు.. ఆయా భవనాల్లో భారీ స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, ఫుట్బాల్ మైదానాలు, వాటర్స్లైడ్స్, స్పోర్ట్స్ స్టేడియం.. ఇలా ఎన్నో హంగులు ఉన్నాయని పేర్కొంది. ఇవిగాక.. ► తన కుటుంబం గురించి ఎలాంటి సమాచారం మీడియాకు చిక్కడానికి వీల్లేదనే ఆంక్షలు కఠినంగా అమలు చేసేవాడు. గతంలో తన కుటుంబం వివరాలను దక్షిణ కొరియాకు సమర్పించిన ఇద్దరు అధికారులను.. నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు ఒక ప్రచారం ఉంది. ► బహుశా.. ప్రపంచంలో ఎవరికీ లేనంత గోప్యత కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుటుంబ విషయంలోనే ఉండొచ్చని న్యూయార్క్ పోస్ట్ అభిప్రాయపడింది. ► ఆ కుటుంబ ప్రయాణాలు.. రహస్యంగా జరుగుతాయి. దాదాపుగా అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారానే జరుగుతుందని, ఈ సొరంగాల గుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్వే నెట్వర్క్ మార్గాల్లో కిమ్ సైతం ప్రయాణిస్తుంటారని తెలిపింది. తద్వారా శత్రు సైన్యాల దాడుల నుంచి తప్పించుకోవడంతో పాటు విదేశీ నిఘా సంస్థల రాడార్లకు చిక్కకుండా జాగ్రత్త పడతారని తెలిపింది. ► కిమ్ దేశంలో కెల్లా తానే ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఇందుకోసం సుప్రీం అనే హోదాను అడ్డుపెట్టుకుని.. ప్రజల్ని, ముఖ్యంగా యువతను నియంత్రిస్తూ ముందుకు వెళ్తున్నారు. ► పాశ్చాత్య సంస్కృతి తన దేశంలో మనుగడలో ఉండకూడదనేది కిమ్ ఉద్దేశం. అందుకే అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్లపై నిషేధం విధించారు. కాదని ఉల్లంఘిస్తే.. బానిస శిక్షలు అమలు అవుతుంటాయి. పొరుగున ఉండే దక్షిణ కొరియా కల్చర్ కనీసం.. మచ్చుకు కూడా కనిపించదు!. ► కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి పెద్దగా ప్రదర్శించింది లేదు. ఆయన భార్య రి సోల్ జూ కూడా చాలా అరుదుగా మీడియా కంటపడుతుంటారు. మరోవైపు కిమ్ వారసత్వం బాధ్యతలు పుచ్చుకునేది ఎవరనే చర్చ.. అప్పుడప్పుడు కొరియన్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. సోదరి మాత్రం అధికారికంగానే కీలక పదవిలో ఉంటూ.. నిత్యం మీడియాలో కనిపిస్తూ.. అమెరికా, దక్షిణ కొరియా వ్యతిరేక ప్రకటనలూ జారీ చేస్తుంటుంది. -
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్పై కిమ్ సోదరి ఫైర్
ఇటీవల ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలతో సహా ఐక్యరాజ్యసమతి సెక్యూరిటీ కౌన్సిల్ సైతం ఉత్తర కొరియా తీరుపై మండిపడింది. ఉత్తర కొరియా దూకుడుకి అడ్డుకట్టే వేసే దిశగా పావులు కదిపింది కూడా. ఈ నేపథ్యంలో యూఎన్ఎస్సీ తీసుకున్న విధానాలను విమర్శిస్తూ...ఇది ద్వంద వైఖరి అంటూ కిమ్జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ సెక్యూరిటీ కౌన్సిల్పై నిప్పులు చెరిగింది. దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రమాదకరమైన సైనిక కసరత్తుల విషయంలో యూఎస్ఎస్సీ కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి అంటూ కస్సుమంది. అత్యాశతో ఆయుధాల పెంచుకునే దిశగా చేసిన కసరత్తులు సెక్యూరిటీ కౌన్సిల్కి కనిపంచటం లేదని అన్నారు. భయంతో మొరిగే కుక్కమ మాదిరిగా అమెరికా ప్రవర్తిస్తుందని కిమ్ సోదరి యో జోంగ్ అన్నారు. కేవలం కొరియా ద్వీపకల్పాన్ని సంక్షోభంలోకి నెట్టివేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఇలా చేస్తుందని నిందించారు. కిమ్జోంగ్ ఉన్ ఇటీవలే హ్యాసాంగ్-17 అనే క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసింది. దీన్ని రాక్షస క్షిపణిగా దక్షిణ కొరియా పేర్కొంది. ఈ క్షిపణి 6 వేల కి.మీ ఎత్తులో వెయ్యి కిలోమీటర్లు (620 మైళ్ళు) వరకు దూసుకుపోయిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తరకొరియా మార్చి 24న అత్యంత శక్తివంతమైన అణు పరీక్షల్లో ఒకటైనా ఐసీబీఎం కంటే ఈ క్షిపణి ప్రయోగం కొంచెం తక్కువగా ప్రభావంతమైందని తెలిపింది. అదీగాక ఇంతవరకు ఉత్తరకొరియా ప్రయోగించిన రికార్డు బ్రేకింగ్ క్షిపణుల్లో ఇది సరికొత్తది. అంతేగాదు దక్షిణ కొరియాలను, టోక్యోలను రక్షించడానికి వాషింగ్టన్ తీసుకుంటున్న చర్యలపై ఉత్తరకొరియా, రష్యాలు పదే పదే నిప్పులు గక్కాయి. దక్షిణ కొరియా, అమెరికాలోని విశ్లేషకులు, అధికారులు మాత్రం ఉత్తర కొరియా ఏడవ అణు పరీక్షకి సిద్ధం కానుందని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్) -
తండ్రితో కలిసి క్షిపణి పరీక్షకు హాజరైన కిమ్ కూతురు
తండ్రితో కలిసి క్షిపణి పరీక్షకు హాజరైన కిమ్ కూతురు -
ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్!
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!. కేవలం తమ దర్పం ప్రదర్శించే వ్యవహారాలను మాత్రమే ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ అధికారికంగా ప్రదర్శిస్తుంటుంది. అలాంటిది ఎవరూ ఊహించని రీతిలో ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడి వ్యక్తిగత విషయాల గురించి బయటి ప్రపంచానికి తెలిసి చాలా చాలా తక్కువే. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు తన కూతురిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు!. శుక్రవారం ఉత్తర కొరియా వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ను శుక్రవారం పరీక్షించింది. ఆ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించేందుకు కూతురిని వెంట పెట్టుకుని మరీ వెళ్లాడట కిమ్ జోంగ్ ఉన్. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని మరీ క్షిపణి ప్రయోగ ప్రాంగణం అంతా కలియదిరిగాడు కిమ్. ఈ ఇద్దరూ ప్రయోగ వేదిక వద్ద హల్ చల్ చేసిన ఫొటోలు కొరియా న్యూస్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఆ చిన్నారి పేరును ప్రకటించకపోయినా.. కూతురిని మీడియా ముందుకు, అదీ క్షిపణి ప్రయోగానికి తీసుకురావడం ఆశ్చర్యకరపరిణామని వర్ణించింది కొరియా న్యూస్ ఏజెన్సీ. ఇక.. కిమ్కు ముగ్గురు సంతానం అని, అందులో ఇద్దరు అమ్మాయిలేనని కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. సెప్టెంబర్ నేషనల్ హాలీడే సందర్భంగా పిల్లలతో ఆయన సరదాగా గడపగా.. అందులో కిమ్ పిల్లలు కూడా ఉన్నారంటూ కథనాలు ప్రచారం అయ్యాయి. మరోవైపు కిమ్ వివాహంపై రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కూతురు అయ్యి ఉండకపోవచ్చనే వాదనా వినిపిస్తోంది ఇప్పుడు. So, Kim Jong-un just decided to reveal his daughter for the first time publicly at an ICBM launch??? pic.twitter.com/tiE8gWixAJ — Joseph Dempsey (@JosephHDempsey) November 18, 2022 North Korean state media pictures of Kim Jong Un attending Friday's launch of the Hwasong-17 ICBM: pic.twitter.com/A6DMsifz8h — William Gallo (@GalloVOA) November 18, 2022 -
కిమ్కు సమష్టిగా చెక్ అమెరికా, జపాన్, కొరియా నిర్ణయం
నాంఫెన్ (కంబోడియా): వరసగా క్షిపణి పరీక్షలతో కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి కలసికట్టుగా పని చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కంబోడియాలో జరుగుతున్న తూర్పు ఆసియా సదస్సులో జపాన్ ప్రధాని కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడిగా సమావేశమై ఈ మేరకు చర్చించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు అన్నివిధాలా అండగా ఉండాలని తీర్మానించారు. ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడంపైనా మూడు దేశాలు చర్చించాయి. -
వాళ్ల అండ చూసే కిమ్ రెచ్చిపోతున్నాడు
న్యూయార్క్: అణు ఆయుధాలు.. వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం జపాన్ వైపుగా మధ్యంతర శ్రేణి క్షిపణిని పరీక్షించి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులు తిరగకముందే.. మరో పరీక్షను చేపట్టింది. గురువారం తూర్పు జలాల వైపుగా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది ఉత్తర కొరియా. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ అధికారిక వార్తా సంస్థ యోన్హప్ ధృవీకరించింది. ప్యోంగ్యాంగ్ కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఆరు-ఆరున్నర గంటల మధ్యలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఇక ఉత్తర కొరియా ఇలా గ్యాప్ లేకుండా క్షిపణి పరీక్షలతో చెలరేగిపోవడంపై అగ్రరాజ్యం ఆగ్రహం వెల్లగక్కింది. చైనా, రష్యాల అండ చూసుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడంటూ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్, భద్రతా మండలిలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చైనా, రష్యాల పేర్లను ప్రస్తావించకుండానే.. పరోక్షంగా ఆమె ఈ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న రెండు దేశాలు.. ఉత్తర కొరియాకు రక్షక కవచంలా పని చేస్తున్నాయి. అణు ఆయుధాలు, క్షిపణి పరీక్షలను ఖండిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ కట్టడి ద్వారా ఐరాస ప్రయత్నిస్తుంటే.. ఆ రెండు దేశాలు మాత్రం ఉత్తర కొరియాను ఆంక్షల నుంచి రక్షించే యత్నం చేస్తున్నాయి. ఆ రెండు దేశాల సంరక్షణలోనే ఉత్తర కొరియా ఉంది. వాళ్లను చూసే కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు ఐదేళ్ల తర్వాత జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేపట్టి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది ఉత్తర కొరియా. ఈ నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి స్థానికులు ఖాళీ చేయించారు జపాన్ అధికారులు. అవసరమైతే త్రైపాక్షిక సంబంధాల ద్వారా అమెరికా-జపాన్-దక్షిణ కొరియాలు.. ఈ కవ్వింపు చర్యలను తిప్పి కొడతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు నాలుగు మిస్సైల్స్ను తూర్పు తీర ప్రాంతం వైపు బుధవారం ఉదయం ప్రయోగించాయి. గత వారం.. అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన నావల్ డ్రిల్స్కు ప్రతిగా ఉత్తర కొరియా వరుసగా మిస్సైల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నాడు కిమ్ జోంగ్ ఉన్. ఇదీ చదవండి: నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!? -
మూడు వారాలైంది.. ఫామ్హౌజ్ నుంచి బయటకు రాడా?
అగ్రరాజ్యంపై విసుర్లు, పొరుగు దేశంపై కవ్వింపు చర్యలు, గ్యాప్ లేకుండా క్షిపణుల పరీక్షలు, ప్రజల సంక్షేమం సంగతి పక్కనపెట్టి మరీ వాళ్లను కష్టపెట్టేలా కఠిన చట్టాలు.. ఆ చట్టాల అమలును దగ్గరుండి మరీ చూస్కునే స్వభావం.. ఉత్తరకొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు మాత్రమే సొంతం. అలాంటి కిమ్ 20 రోజులకు పైగా బయట కనిపించడం లేదు. కిమ్ జోంగ్ ఉన్ మీడియా కెమెరాల కంటికి చిక్కి 23 రోజులు అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇన్నేసి రోజులు ఆయన కనిపించకుండా ఉండడం ఇదే. దీంతో కిమ్కు ఏమై ఉంటుందన్న చర్చ తెర మీదకు వచ్చింది. అయితే.. నిత్యం ఏదో ఒక చర్యతో, చేష్టలతో వార్తల్లో నిలిచే కిమ్ జోంగ్ ఉన్.. మూడు వారాలుగా ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిందటివారం సైన్యం నిర్వహించిన క్షిపణి పరీక్షలోనూ, దేశంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతపై సమీక్షలోనూ కనిపించకపోవడంతో.. కిమ్ గైర్హాజరు వెలుగు చూసింది. అయితే కిమ్ ఎక్కడ? అనే చర్చ జోరుగా నడిచింది అక్కడ. ఈ క్రమంలో.. ఉత్తర కొరియాకు ఈశాన్య దిశగా ఉన్న భారీ ఫామ్హౌజ్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రాణతీపితో.. అక్టోబర్, నవంబర్ ఉత్తర కొరియాలో ఫ్లూ సీజన్. కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువ. దీంతో మాస్క్ ధరించడం మళ్లీ తప్పనిసరి చేస్తూ.. కరోనా ఆంక్షలను కూడా అమలులోకి తెచ్చారు అధికారులు. ఈ తరుణంలో రిస్క్ ఉంటుందనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించడం లేదనే సమాచారం అందుతోంది. ఫామ్హౌజ్లో ప్రస్తుతం ఆయన సేదతీరుతున్నట్లు సమాచారం. అయితే.. అక్టోబర్ 10వ తేదీన అధికార పార్టీ 77వ ఆవిర్బావ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉంది. కాబట్టి, కిమ్ జోంగ్ ఉన్ ఆ రోజు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇన్నేళ్లలో ఆయన వార్షికోత్సవాన్ని తప్పింది లేదు. ఒకవేళ.. ఆరోజు కూడా కిమ్ హాజరుకాకపోతే గనుక.. అది అనుమానించాల్సిన విషయమే!. గత ఏడేళ్లలో కిమ్ బయట కనిపించకుండా ఎక్కువ రోజులు ఉంది.. కిందటి ఏడాది అక్టోబర్-నవంబర్ రెండు నెలల్లో 35రోజుల పాటు!. అంతకంటే ముందు 2021 మే నెలలో ఆరోగ్య సంబంధిత కారణాలతో నెలపాటు అజ్ఞాతంలో గడిపారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (NIS) మాత్రం కిమ్కు ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలేవీ తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వానికి నివేదించింది. -
రాణి తుది వీడ్కోలు.. ఆహ్వానం లేనిది వీళ్లకే!
లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే.. రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు. అవును.. ఉక్రెయిన్పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది. భర్త సమాధి పక్కనే.. ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు! -
ఉక్రెయిన్తో యుద్ధం.. కొరియా కిమ్తో చేతులు కలిపిన పుతిన్!
మాస్కో: యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిరకాల మిత్రుడు కిమ్ జోంగ్ ఉన్ సాయం కోరుతున్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్నందుకు పశ్చిమ దేశాలు తమపై ఆంక్షాలు విధించిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈమేరకు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఉత్తర కొరియా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ వంటివి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయాన్ని మాత్రం అమెరికా నిఘావర్గాలు వెల్లడించలేదు. ఆంక్షలు ఉన్నంత కాలం ఉత్తర కొరియా నుంచి రష్యా మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ డ్రోన్లు పనిచేయక ఉక్రెయిన్పై యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను వినియెగిస్తోంది రష్యా సైన్యం. అయితే అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలోనే ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఊహించని నష్టం ఎదురైందని, మానవ రహిత విమానాల సంఖ్య భారీగా తగ్గిందని బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలతో రష్యాకు కొరత ఏర్పడిందని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్కు తమ పరిస్థితి బాగా తెలుసన్నారు. ఐరోపా రాజకీయాల్లో ఆమె కీలకంగా ఉన్నారని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఉంటే రష్యా చర్యలను దీటుగా తిప్పికొట్టవచ్చనే విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత -
కిమ్ జోంగ్ ఉన్కి పుతిన్ లేఖ
Expand Bilateral Ties: రష్యా అథ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా విమోచన దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఆ లేఖలో ఇరు దేశాల ద్వైపాక్షికి సంబంధాలను విస్తరిద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇరుదేశాల ప్రయోజనాల కోసం సన్నిహిత సంబంధాలు ఉంటాయని చెప్పారు. కొరియా ద్వీపకల్పం తోపాటు ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి సహకరిస్తాం అని నొక్కి చెప్పారు. (చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!) -
కిమ్ జోంగ్ ఉన్ హెల్త్ కండిషన్ సీరియస్.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!
North Korea Kim Jong Un.. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటనే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఆయన చర్యలు అందరిని భయాందోళనకు గురిచేస్తాయి. ఒకానొక దశలో అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ కిమ్ అన్నట్టుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తరుణంలో మూడో ప్రపంచ యుద్దం వస్తుందేమోనన్న భావనను తలిపించింది. ఇదిలా ఉండగా.. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కోవిడ్ వ్యాప్తి సమయంలో తన సోదరుడు కిమ్ ‘అధిక జ్వరం’తో బాధపడ్డారని.. ఆ సమయంలో ఆయన పరిస్థితి విషమించిందని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనల కారణంగా కిమ్ జోంగ్ ఉన్.. ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని ఆమె పేర్కొంది. అయితే, కిమ్ ఎప్పుడు కరోనా బారినపడ్డారన్న విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ క్రమంలోనే నార్త్ కొరియాలో కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేసిన సౌత్ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా అధికారులను సర్వనాశనం చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు.. గత కొంత కాలంగా కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అధిక బరువు, ధూమపానం వంటి కారణాలు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై కొన్నేళ్లుగా వదంతులు వ్యాప్తిచెందుతున్నాయి. కాగా కిమ్ కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కిమ్ ఆరోగ్యంపై వార్తలు బయటకు వస్తుంటాయి. Kim Jong Un Claims Victory Over COVID-19; His Sister Blames Seoul For Outbreak https://t.co/e9KxZ21Jle — Finnoexpert (@PophaleSamarth) August 11, 2022 ఇది కూడా చదవండి: లంకలో నిరసనలకు తెర -
ఎనీ టైం యుద్ధానికి రెడీ!... అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్!
ఎప్పుడూ ఏదో ఒక అనుహ్య నిర్ణయంతో వార్తలో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేసి షాక్కి గురిచేశారు. అగ్రరాజ్యంతో తలపడటానికి రెడీ! అంటూ సవాలు విసిరారు. అదీ కూడా ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవం రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కిమ్ ప్రత్యేకత కాబోలు. ఉత్తర కొరియా నాయకుడు కిమి జోంగ్ అమెరికాతో తలపడటానికి తమ దేశం రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశం అమెరికాతో అణు యుద్ధం చేయడానికైనా, సైనికులతో దాడి చేయడానికైనా సిద్ధమే అంటూ సవాలు విసిరాడు. అది కూడ జూలై 27 ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవానికి సంబంధించి 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించినప్పుడే యుద్ధానికి పరోక్షంగా కాలుదువ్వుతున్నట్లు సంకేతం ఇచ్చింది. ఇప్పుడూ అన్నంత పనిచేశాడు కిమ్. ఎప్పటి నుంచే తాము అమెరికా నుంచి అణు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలోనే తమ ఆత్మరక్షణకై ఈ కీలకమైన చారిత్రత్మక పనికి పూనుకోవాల్సి వచ్చిందని కిమ్ చెబుతున్నాడు. తమ సాయుధ బలగాలు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థవంతమైనవని., అణ్వాయుధాల పరంగా కూడా చాలా బలమైనదని.. తక్షణమే ఈ యుద్ధం చేసేందకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు. అంతేకాదు దక్షిణ కొరియాతో అమెరికా చట్టవిరుద్ధమైన శత్రుచర్యలు కొనిసాగిస్తోందని ఆరోపించాడు. పైగా ఉత్తరకొరియాను అమెరికా పెద్ద శత్రువులా చూపించడమే కాకుండా తన చర్యలను సమర్ధించుకుంటోందంటూ కిమ్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. తమ భద్రతకు ముప్పుతెచ్చేలా అమెరికా దక్షిణ కొరియాతో ఉమ్మడి సైనిక విన్యాసాలకు పాల్పడిందని విమర్శించాడు. అమెరికా ద్వంద వైఖరితో దోపిడికి పాల్పడుతుందన్నాడు. ద్వైపాక్షిక సంబందాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందంటూ అమెరికాపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ పరిపాలనపై కూడా ఆరోపణలు చేశాడు. తమను అసమర్థ దేశంగా చూపే ఏ ప్రయత్నానైనా గట్టిగా తిప్పికొట్టడమే కాకుండా నాశనం చేయగలమంటూ కిమ్ గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా... ఇటీవలే ఉత్తర కొరియా హైపర్సోనిక్ క్షిపణులు పరీక్షించడమే కాకుండా ఇది వ్యూహాత్మక అణ్వాయుధాలను తీసుకువెళ్లగలదని చెబుతుండడం గమనార్హం. (చదవండి: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు.. మరో 14 రోజులు సింగపూర్లోనే గొటబయ!) -
ఉత్తర కొరియాలో అంతుచిక్కని రోగం.. కిమ్ కీలక నిర్ణయం
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో అంతుచిక్కని అంటువ్యాధి పంజా విసురుతోంది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులూ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో గత కొన్నిరోజులుగా కొత్త అంటువ్యాధి జనాలను అతలాకుతలం చేస్తోంది. ఆ అంటువ్యాధి ఏంటి? ఇది ఎంత తీవ్రమైందని? లక్షణాలేంటి? అనే విషయాలపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓడరేవు నగరమైన హేజు నుంచి మొదలైన ఈ అంతుచిక్కని అంటువ్యాధితో.. ప్రజలు సతమతం అవుతున్నారు. దీని విజృంభణ ఎలా మొదలైందన్న విషయాన్ని పరిశోధకులు నిర్ధారించలేకపోయారని తెలుస్తోంది. అయితే.. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఎలా సోకింది? బారిన ఎంత మంది పడ్డారు? మరణాలు సంభవించాయా? అనే విషయాల్ని మాత్రం ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించలేదు. భార్య రి సోల్ జూతో కిమ్ మరోవైపు అధ్యక్షుడి కుటుంబం కోటాలో భద్రపరిచిన మందులన్నింటినీ కొత్త అంటువ్యాధి నేపథ్యంలో స్వచ్ఛందంగా జనాలకు ఇచ్చేయమని అధికారులను ఆదేశించారు కిమ్ జోంగ్ ఉన్. గత నెలలో కరోనా విజృంభణ సమయంలోనూ ఆయన ఇదే విధంగా చేశారు. ఇక ఉత్తర కొరియాలో బుధవారం ఒక్కరోజే జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న కేసులు 26,010 వచ్చాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 40,56,000కి చేరింది. మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది. -
ఇదేం ఆనందం కిమ్.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..?
కరోనా వైరస్ వ్యాప్తిలో ఉత్తర కొరియా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సమయంలో కిమ్.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. వివరాల ప్రకారం.. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు. రాజధాని ప్యాంగాంగ్కు సమీపంలోని సునన్ ప్రాంతం నుంచి ఆదివారం నార్త్ కొరియా.. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఒక్కరోజులో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇక, తాజాగా చేపట్టిన ప్రయోగాలతో నార్త్ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా అణు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఇటీవలే అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. దీనికి కౌంటర్ ఇస్తూ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. North Korea launched multiple ballistic missiles into waters off its east coast Sunday, South Korea's military said, a day after Seoul and Washington completed their first joint drills involving a US aircraft carrier in more than four years.#VoiceOfNations pic.twitter.com/Hjx3T1QKof — Voice of Nations (@VoiceOfNations7) June 5, 2022 ఇది కూడా చదవండి: జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. వీడియో -
Kim Jong-un: ఉత్తరకొరియాకు భారీ ఊరట
న్యూయార్క్: ఉత్తర కొరియాకు భారీ ఊరట దక్కింది. అణుసామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగాలు సాగిస్తున్న ఉత్తరకొరియాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో వీగిపోయింది. ఐరాసలోని 15 దేశాల భద్రతా మండలిలో అమెరికా చేసిన ఈ తీర్మానం 13–2 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయడంతో ప్రపంచ దేశాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రష్యా సంగతి ఏమోగానీ.. చైనా బహిరంగంగా ఆంక్షలను(అమెరికా) వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ వస్తున్నాడు కిమ్. ఈ పరీక్షలపై పొరుగు దేశం దక్షిణ కొరియా సహా జపాన్, అమెరికాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ శాంతి స్థాపనకు నార్త్ కొరియాను, నియంతాధ్యక్షుడిని కట్టడి చేయాలని మిగతా దేశాలను కోరుతున్నాయి. కానీ, కిమ్ మాత్రం తాజా పరిణామంతో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. చదవండి: అపర కుబేరుడి కొంప ముంచే పనిలో చైనా -
గురుభక్తి చాటుకున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు
ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ విజృంభణకు కారణం.. అధికారుల నిర్లక్ష్యమే అని గుర్రుగా ఉన్నాడు నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. కరోనా నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. మాస్క్ నిబంధనలను పక్కనపెట్టాడు కిమ్ జోంగ్ ఉన్. ఎందుకంటారా?.. కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే మరణం.. అక్కడి ప్రభుత్వవర్గాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.. అందరి దృష్టి ఆకర్షించింది. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తన గురువుకి నివాళి అర్పించాడు. అంతేకాదు.. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించిన వేళ ఆయన మాత్రం మాస్క్ లేకుండానే గురువుకి గౌరవం ఇచ్చాడు. మే 12న అక్కడ తొలి కరోనా కేసు ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చివరకు కిమ్ కూడా మాస్క్ను వదలలేదు. అలాంటి గురువు శవపేటిక మోసే సమయంలో మాత్రం మాస్క్ను పూర్తిగా పక్కనపెట్టాడు. కిమ్ జోంగ్-2 2011లో చనిపోయిన తర్వాత.. కిమ్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది హ్యోన్ చొల్ హయే. అందుకు గురుభక్తిని అంతగా చాటుకున్నాడు కిమ్. ఇది చూసిన వాళ్లంతా.. కర్కశంగా వ్యవహరించే కిమ్లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా నుంచి వ్యాక్సిన్ సాయం ప్రకటన వెలువడినా.. కిమ్ నుంచి ప్రతి సమాధానం లేకపోవడం గమనార్హం. -
కిమ్కి ఓకే చెప్పిన బైడెన్... ఆయుధ పరీక్షలకు సిద్ధం
Prepared for Weapons Test: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటనలో భాగంలో దక్షిణ కొరియాలోని సీయోల్లో విలేకరుల సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్కి ఒక సందేశాన్ని అందించారు. తాను ఉత్తర కొరియా అణుపరీక్షల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. అంతేకాదు ఉత్తరకొరియా చేసే దేనికైనా తాము సిద్దంగా ఉన్నాం అని చెప్పారు. బైడెన్ ఒకరకంగా తాము అణ్వయుధాపరీక్షలకు సిద్ధమేనని చెప్పకనే చెప్పేశారు. మరోవైపు దకిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు, అణ్వయుధ సామార్థ్యంగల ఆయుధాల కసరత్తులు నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. ఐతే ఉత్తరకొరియా మాత్రం ఈ కరోనా విపత్కర సమయంలో ఆదుకుంటామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్లో నిజం లేదంటూ ఆరోపించింది. ఒక పక్క ఆదుకుంటామంటూనే సెనిక కసరత్తులు, ఆంక్షలు వంటి శత్రువిధానాలు కొనసాగిస్తుందంటూ అమెరికా పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అమెరికా మాత్రం కరోనా వ్యాక్సిన్లు ఉత్తరకొరియాకు సరఫర చేస్తామని ప్రకటించినా ఎలాంటి స్పందన లేదని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పై ఒత్తిడి తెచ్చేలా ఆసియా దేశాలను సమీకరించేందుకు ఈ పర్యటన చేస్తున్నాట్లు బైడెన్ తెలిపారు. ఆ తర్వాత బైడెన్ క్వాడ్ దేశాలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. (చదవండి: ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చిన ప్లవర్వేజ్) -
కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ: బైడెన్
US' Aid Offer To Covid-Stricken North Korea: కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న ఉత్తర కొరియాలోని ప్యోంగ్యాంగ్తోపాటు చైనాకు వ్యాక్సిన్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. తాము త్వరితగతిన ఈ వ్యాక్సిన్లు అందించేందుకు రెడీగా ఉన్నాం అని కూడా తెలిపారు. ఐతే ఉత్తరకొరియా నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. ఈ మేరకు బైడెన్ సియోల్లోని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్తో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఈ వైరస్ని ఎదుర్కొవడంలో ఉత్తరకొరియాకి సాయం చేసేలా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. అంతేకాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిజాయితీగా ఉంటే ఆయన్ని కలిసేందుకు సిద్ధం అని బైడెన్ చెప్పారు. అలాగే ఇరువురు నాయకులు తమతమ దేశాల్లో సైనిక విన్యాసాలను ముమ్మరం చేశామని ప్రకటించడంతో కిమ్కి ఆగ్రహం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు యూన్, బైడెన్ ఇద్దరూ పెట్టుబడులు పెట్టేందుక అంగీకరించడమే కాకుండాసెమీకండక్టర్, బ్యాటరీల వంటి పరిశ్రమల సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి సహకరించడానికి ఒప్పందాలు చేసుకున్నారు. బైడెన్ పర్యటన సందర్భంగా ఐక్యరాజ్యసమతి ఆంక్షలను దిక్కరిస్తూ ఉత్తర కొరియా కవ్వింపుచర్యలకు దిగుతుందంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఒక పక్క ఉత్తరకొరియాలోని ప్యోంగ్యాంగ్లో ఆహార కొరతతో బాధపడుతుంటే కిమ్ మాత్రం మిలటరీని ఆధునికరించే పనిలో ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్కు ఎదురుదెబ్బ.. పుల్ హ్యాపీగా పుతిన్) -
Sakshi Cartoon: బైడెన్కు ఉత్తర కొరియా క్షిపణి భయం
బైడెన్కు ఉత్తర కొరియా క్షిపణి భయం -
కిమ్ను భయపెడుతున్న కరోనా.. ఫుల్ టెన్షన్లో నార్త్ కొరియన్లు
Covid In North Korea.. ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు వరకు నార్త్ కొరియాలో కరోనా వైరస్తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈరోజు వరకు దేశంలో 8,20, 620 మందికి లక్షణాలు ఉండగా 3,24,550 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని మీడియా పేర్కొంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే 15 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. దీంతో అప్రమత్తమైన కిమ్ సర్కార్ దేశంలోని అన్ని ప్రావిన్స్లు, నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించింది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలను సైతం మూసివేయాలని ఆదేశించింది. ఇక, ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు. నార్త్ కొరియన్లు టీకా తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతకుమందు ఉత్తరకొరియాకు డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనాలు టీకాలను అందిస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించారు. దీంతో తాజాగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ఉద్దేశ్యంలేదని అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. గతంలో కోవాగ్జిన్కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. కానీ, ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి -
3 లక్షల మందికి జ్వరం..18 వేల మందికి కరోనా లక్షణాలు!
Covid hits North Korea six people Deand With Fever: ఉత్తరకొరియాలో కరోనా కలకలం తర్వాత తాజగా జ్వరంతో బాధపడుతున్న ఆరుగురు చనిపోయారుని శుక్రవారం ప్రకటించింది. వారిలో ఒక వ్యక్తికి కరోనా పరీకలు చేయగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ పాజిటివ్గా వచ్చింది. ప్రసుత్తం మూడు లక్షల మందికి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే వారిలో సుమారు 18 వేల మంది కరోనాకి సంబంధించిన లక్షణాలను కనిపించినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి 16 వేల మంది చికిత్స పోందుతున్నారని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారనేది స్పష్టం చేయలేదు. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ-వైరస్ కమాండ్ సెంటర్ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా దేశంలో లాక్డౌన్ని అమలు చేశాడు. శాస్త్రీయ చికిత్సా విధానం ద్వారా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేలా బలోపేతం చేయాలంటూ కిమ్ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ఆరోగ్య అధికారులు కూడా జ్వరంతో బాధపడుతున్నవారిని సాధ్యమైనంత వరకు వేరుగా ఉంచి చికిత్స అందించడం ప్రారంభించామని, సత్వరమే ఈ మహమ్మారి నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు సరఫరా చేసే ఆలోచన లేదు కరోనా కలకలంతో టెన్షన్ పడుతున్న ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ప్రణాళికలు ఏమి లేవని యూఎస్ స్పష్టం చేసింది. గతంలో కోవాగ్జిన్కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని తెలిపింది. కానీ ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దుత ఇస్తామని తెలిపింది. (చదవండి: నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్ టైమ్ మాస్కులో కిమ్ జోంగ్ ఉన్) -
ఆస్ట్రేలియాలో ‘కిమ్’ హల్చల్.. అవాక్కైన ప్రధాని
Australia PM's Event Kim Jong Un Lookalike Person: ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వేషధారణలో ఒక వ్యక్తి సందడి చేశాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఈ నెల 21 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. ఆ ప్రచార ర్యాలిలో ప్రధాని మోరిసన్ తనతో కొద్ది స్థానాల తేడాతో ఉన్న స్థానిక సభ్యురాలు గ్లాడిస్ లియు అధీనంలో ఉన్న చిషోల్మ్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. అదీగాక ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పార్టీ సెంటర్ రైట్ లిబరల్ నేషనల్ కోయలిషన్ ప్రస్తుతం ఓపెనియన్ పోలింగ్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కంటే వెనుకబడి ఉంది. ఐతే కిమ్ వేషధారణలో ఉన్న వ్యక్తి మాత్రం ఎన్నికల ప్రచార క్యాంప్ నుంచి మోరిసన్ నిష్క్రమించిన కొద్దిసేపటికే ఎంటరై తనని ఉత్తర కొరియా అధ్యక్షుడ కిమ్జోంగ్ ఉన్ లాగా కనిపించే హువార్డ్ ఎక్స్ అనే నటుడుగా పేర్కొన్నాడు. అంతేగాదు మోరిసన్ లిబరల్ నేషనల్ కూటమికి ఓటు వేస్తే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేసినట్లు అవుతుందంటూ అర్థంపర్థం లేని విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తిని అక్కడ ఉన్న మీడియా బృందం రాజకీయ పార్టీ లేదా ఉద్యమంలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారా అని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రధాన మంత్రికి సంబంధించిన మీడియా బృందం అతన్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రతిస్పందనగా సుప్రీం లీడర్ ఏం చేయాలో మీరు చెప్పరు అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. ఐతే ఆస్ట్రేలియన్ సెనేట్ అభ్యర్థి, చైనీస్ ప్రభుత్వ విమర్శకుడు డ్రూ పావ్లౌ మాట్లాడుతూ.. కిమ్ వేషధారి హోవార్డ్ ఎక్స్ చిషోల్మ్ పర్యటన గురించి తాను గతంలోనే చర్చించానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం కిమ్ వేషధారణలో వచ్చిన ఆ విచిత్రమైన వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. An actor dressed as Kim Jong Un has crashed a Scott Morrison event in Chisholm, Melbourne. #AusVotes2022 pic.twitter.com/EQ9VX0C94g — Ben Westcott (@Ben_Westcott) May 13, 2022 (చదవండి: తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లే సెల్ఫీ పాయింట్లుగా...) -
నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఆందోళనలో కిమ్
ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యాంగ్ యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసు అని నిర్ధారణ అయిన తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్ జోంగ్ ఉన్ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన 24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక, నార్త్ కొరియాలో కోవిడ్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. North Korea claims ‘first ever’ Covid outbreak with hermit kingdom going into lockdown pic.twitter.com/6V7GH30XuB — The Sun (@TheSun) May 13, 2022 ఇది కూడా చదవండి: రణరంగంగా మారిన రావణ లంక.. మంత్రులకు చేదు అనుభవం -
ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం
ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించి వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వార్త ప్రపంచ దేశాలకు కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. కానీ తాజాగా ఆ దేశంలో కూడా కరోనా కేసు నమోదు అయినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తాజాగా గురువారం( మే 11) నాడు తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యోంగ్యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి ఆదివారం నమూనాలు సేకరించారు. గురువారం ఆ ఫలితాలు రావడంతో వారికి ఓమిక్రాన్ వేరియంట్తో సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన తక్షణమే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. అందులో.. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ భూభాగంలోకి కొవిడ్-19 ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని ఉత్తర కొరియా ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన చివరికి తలవంచాల్సి వచ్చింది. ఇటీవల చైనాలో వైరస్ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వర్తకులు, పర్యాటకులను సైతం దేశంలోకి రాకుండా చేసింది. అయినప్పటికీ ఒమిక్రాన్ కొరియాలో ప్రవేశించింది. చదవండి: China: చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో -
Sakshi Cartoon: అణుయుద్ధం తప్పదు-నార్త్ కొరియా
అణుయుద్ధం తప్పదు-నార్త్ కొరియా -
ప్రపంచానికి మరో హెచ్చరిక.. తగ్గేదేలే అంటున్న నార్త్ కొరియా కిమ్
ప్యాంగ్యాంగ్: అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగినట్టుగానే నార్త్ కొరియా బుధవారం మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సమీపంలో ఉన్న సనన్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ దక్షిణకొరియా, అమెరికా, జపాన్లను ఆందోళనకు గురిచేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇదే కావడం విశేషం. మరోవైపు.. అణ్వాయుధాలను మరింత వేగవంతంగా సేకరించనున్నట్లు ఆ పరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత ఇలా క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అణ్వాయుధ పరీక్ష నిర్వహణకు కూడా ఉత్తర కొరియా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరేడ్లో హాసాంగ్-17 ఖండాంతర క్షిపణిని నార్త్ కొరియా ప్రదర్శించింది. దానితో పాటు ప్రదర్శనలో మల్టిపుల్ గెయింట్ రాకెట్ లాంచర్లు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: ట్విటర్ ట్విస్ట్: ట్వీట్తోనే భారీ షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. పైసా వసూల్! -
Sakshi Cartoon: ...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్!
...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్! -
North korea: అణు దాడులు చేస్తాం: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్
సియోల్: అమెరికా సహా అంతర్జాతీయ ఒత్తిడిని బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఘాటైన హెచ్చరికలు చేశారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణు దాడికి సిద్ధమేనని తేల్చి చెప్పారు. అణ్వాయుధ సంపత్తిని మరింతగా పెంచుకుంటామని ప్రతినబూనారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయుధాల పరేడ్ నిర్వహించారు. ఈ ఆయుధ ప్రదర్శనలో దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్ భార్య రి సోల్ జూతో కలిసి పరేడ్ని తిలకించారు. ‘‘యుద్ధాన్ని అరికట్టడమే మా మొదటి లక్ష్యం అయినప్పటికీ, మా దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలగజేస్తే అణ్వాయుధాలతో ఎదురు దాడి చేయడం మా రెండో లక్ష్యమవుతుంది’’అని కిమ్ కుండబద్దలు కొట్టారు. ఈ ఆయుధ పరేడ్లో ఉత్తర కొరియాకి చెందిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–17 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్షిపణి పరిధిలో అమెరికా అంతా ఉందని వార్తలొచ్చాయి. ఇది కూడా చదవండి: అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.. రష్యా వార్నింగ్ -
Kim Jong-un: సర్ప్రైజ్ చేసిన కిమ్
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఎవరూ ఊహించని పని చేశాడు. పొరుగు దేశం దక్షిణ కొరియాతో సరిహద్దులో అల్లకల్లోలం నెలకొన్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జాయ్ఇన్కు మెచ్చుకుంటూ ఓ లేఖ రాశాడు. దాయాది దేశాలుగా ప్రపంచంలో దృష్టిలో పేరుబడ్డ దేశాల మధ్య.. అదీ కిమ్ తరపున ఈ ఘటన జరగడం నిజంగా విశేషమే!. అయితే.. కిమ్ ఈ పని చేయడానికి ఓ కారణం అంటూ ఉంది. మూన్ జాయ్ఇన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ తరుణంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. ఉత్తర కొరియా కిమ్ ప్రశంసా లేఖ పంపించాడు. 2018లో ఈ ఇద్దరి మధ్య మూడు భేటీలు జరిగాయి. ఆ ప్రభావమే సరిహద్దులో మిలిటరీ ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టాయి. కానీ, అమెరికా జోక్యంతో ఆ తర్వాత ఆ ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయి చేరాయి. ఇదిలా ఉండగా.. పదవి నుంచి దిగిపోయాక కూడా కొరియా దేశాల మధ్య చర్చల కోసం మూన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు కిమ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే అంతకుముందు మూన్ నుంచి కిమ్ జోంగ్ ఉన్కు కూడా ఓ లేఖ అందిందని, ప్రతిగానే కిమ్ ఈ లేఖ పంపించాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అస్సలు బాగోలేవు. సరిహద్దులో క్షిపణి పరీక్షలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తేడాలొస్తే.. అణ్వాయుధాలు సైతం ప్రయోగిస్తామని ఉత్తర కొరియా నుంచి సౌత్ కొరియాకు వార్నింగ్లూ వచ్చాయి. అలాంటి వేళ.. ఈ పరస్పర లేఖల ప్రశంసల పర్వం కొనసాగడం గమనార్హం. చదవండి: కిమ్ సంచలన నిర్ణయం -
కొరియా మరో క్షిపణి పరీక్ష
సియోల్: ప్రపంచ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా కొత్తగా డిజైన్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారని తెలిపింది. ఈ ప్రయోగంతో ఫ్రంట్లైన్ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని చెప్పింది. ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ప్రయోగాల్లో ఇది 13వది. చదవండి: North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు -
North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్లో నిలిచిన కిమ్.. మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు. ఇంతకీ ఈసారి ఏం చేశారంటే.. ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి(79).. కిమ్ జోంగ్ ఉన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆమె కోసం పాంగ్యాంగ్లో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ అందజేశారు. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు సైతం ఏర్పాటు చేపించినట్టు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా, అధికారిక పార్టీ కోసం యాంకర్ రీ చున్ హీకి గత 50 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీ చున్.. దేశ అవసరాలకు తగ్గినట్టుగా తన స్వరాన్ని మార్చుకుంటూ యాంకరింగ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సైతం సుపరిచితమే. కేసీఎన్ఏ టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఆమె ‘పింక్ లేడీ’గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేందుకు భావోద్వేగభరితంగా, ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ జరిపే అణు పరీక్షలు వరకు.. ఉత్తర కొరియాకు సంబంధించిన అన్ని కీలక వార్తలను సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆమెకు సేవలను గుర్తించిన కిమ్.. ఇలా బహుమానం అందించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. రీ చున్కు అధికార పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ఆనందం వ్యక్తం చేసిన రీ చున్ హీ.. కిమ్ ఉదారతకు తన కుటుంబ సభ్యులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని ఉద్వేగంగా తెలిపారు. ఇదిలా ఉండగా.. రీ చున్తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న దాదాపు 10వేల మందికి కూడా కిమ్.. విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు. — The International Magazine (@TheIntlMagz) April 14, 2022 -
అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
కొరియా దేశాల మధ్య ఆయుధ సంపత్తి-సత్తా విషయంలో మాటల తుటాలు పేలుతున్నాయి. వాస్తవానికి యుద్ధానికి తాము వ్యతిరేకమని, ఒకవేళ దక్షిణ కొరియా గనుక దాడులకు తెగపడితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు కిమ్ యో జోంగ్. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి అయిన కిమ్ యో జోంగ్.. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యాధునిక క్షిపణులు, అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, అవి నేరుగా లక్ష్యంగా భావిస్తున్న ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాయంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూ వుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కిమ్ యో తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను భారీ తప్పిదంగా పేర్కొన్న కిమ్ యో.. అలాంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అణ్వాయుధాల్ని దక్షిణ కొరియాపై ప్రయోగిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్యాంగ్యాంగ్(నార్త్ కొరియా రాజధాని) యుద్ధానికి వ్యతిరేకం. అలాగే దక్షిణ కొరియాను మేం ప్రధాన శత్రువుగా భావించడం లేదు. మమ్మల్ని కవ్వించనంత వరకు మేం మౌనంగానే ఉంటాం. ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం.. సహించం. సౌత్కొరియా ఆర్మీ ఇంచు సరిహద్దులోకి వచ్చినా పెనువినాశనాన్ని దక్షిణ కొరియా చవిచూడాల్సి వస్తుంది’’ అని మంగళవారం నాటి ప్రకటనలో ఆమె వెల్లడించారు. ఇది మేం జారీ చేసే హెచ్చరిక కాదు. జరగబోయే పరిణామాలకు మా ముందస్తు వివరణ అని స్పష్టం చేశారామె. ఇదిలా ఉండగా.. ఆదివారం సైతం ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించారు కూడా. ప్రమాదకరమైన సైనిక చర్యలకు సైతం సిద్ధమంటూ కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి నుంచి క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తూ అగ్రరాజ్యం సహా పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఉత్తర కొరియా. -
నార్త్ కొరియా కిమ్ సంచలన ప్రకటన.. టెన్షన్లో అమెరికా!
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 11 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా తాజాగా మార్చి 25వ తేదీన అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా, జపాన్ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ మరో సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు. తన సైన్యాన్ని మరింత శక్తివంతం చేసేందుకు అత్యాధునిక క్షిపణులను తయారు చేసి ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా కిమ్.. ఎవరూ ఆపలేని అఖండ సైనిక శక్తి సామార్థ్యాలు కలిగి ఉన్నప్పుడే.. ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడని అన్నారు. అప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులకు, బ్లాక్మెయిల్స్ అన్నింటినీ అదుపులో ఉంచగలడంటూ వ్యాఖ్యలు చేసినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. దీంతో పరోక్షంగా అమెరికాకు కిమ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కిమ్ తమ ఆత్మరక్షణ దళాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. క్షిపణి ప్రయోగాల పట్ల దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ధిక్కరిస్తోందంటూ అమెరికా అభ్యంతరం తెలిపింది. బాల్లిస్టిక్ క్షిపణుల ప్రయోగాలకు ఉత్తర కొరియా పాల్పడుతోందని, ఖండాంతర మిస్సైల్ను టెస్ట్ ఫైర్ చేయడాన్ని క్షమించలేమని జపాన్ పేర్కొంది. కాగా, అణ్వస్త్రాల ప్రయోగాలు, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ఇది వరకే అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు జరిగాయి. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదురకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తరువాత ఉత్తర కొరియాపై అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. -
Sakshi Cartoon: ఉక్రెయిన్ మీద రష్యా దాడిది కాద్సార్! మన మీద కిమ్ ప్రయోగించిన క్షిపణి!
ఉక్రెయిన్ మీద రష్యా దాడిది కాద్సార్! మన మీద కిమ్ ప్రయోగించిన క్షిపణి! -
ఉత్తర కొరియాలో మూవీ.. హీరోగా కిమ్ జోంగ్ ఉన్
Kim Jong Un Guiding An Ballistic Missile: ఉత్తర కొరియా అధ్యక్షుడు అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి క్షిపణిని వినియోగించింది. ఈ మేరకు 2017 నాటి మిసైల్ ప్రయోగాన్నిహాలీవుడ్ మూవీ మాదిరి ఫుటేజ్ని విడుదల చేసింది. అందులో ఒక పాత స్కూల్కి సమీపంలో కిమ్ జోంగ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి 2017 నాటి అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ జెయింట్ హ్వాసాంగ్-17 క్షిపణిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిచింది. ఉత్కంఠభరితమైన సంగీతంలో, ఇద్దరు జనరల్స్ మధ్య కెమరా యాక్షన్ అనగానే స్లో మోషన్లో కిమ్ వచ్చి తన సన్ గ్లాసెస్ని పగలుగొట్టి సైనికుల క్షిపణి ప్రయోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు ఉంటుంది. పైగా ఆ క్షిపణి కౌంట్డౌన్ దృశ్యంలో సైనికులు అగ్ని అని అరుస్తున్నట్లు కనిపించింది. ప్యోంగ్యాంగ్ తన సైనిక సామర్థ్య గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆ వీడియో ఫుటేజ్ ఉంది. దీన్ని వారు ఒక చలన చిత్రంగా రూపొందించి మరీ సంబురాలు చేసుకున్నారు. అదీ కూడా ఖండాంతర క్షిపణిని విజయవంతం అయిన నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ హీరోగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన మూవీ మాదిరి వీడియోని రూపొందించారని సెజోంగ్ ఇన్స్టిట్యూట్లోని సెంటర్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్కు చెందిన చియోంగ్ సియోంగ్-చాంగ్ తెలిపారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ సినీ వీరాభిమాని. ఉత్తర కొరియా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి 1978లో దక్షిణ కొరియా చిత్ర దర్శకుడు నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశించిన ఘనుడు. ఇప్పుడు కూడా ఉత్తరకొరియా చలనచిత్రాల నిర్మాణం కోసం భారీగా వనరులను కేటాయిస్తుంది గానీ సినిమాలన్ని అధికార కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ తీయాల్సిందే. శుక్రవారం విడుదల చేసిన మూవీ మాదిరి క్షిపణి వీడియోలో విదేశీ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఉత్తర కొరియా తమ సినిమాల్లో ఎక్కడైన విదేశీ ప్రభావం కనిపిస్తే కఠినంగా శిక్షిస్తుంది. విదేశీ దుస్తులతో గానీ, విదేశీ చిత్రాలను అనుకరించి గానీ సినిమాలు నిర్మిస్తే శిక్షిస్తుంది. ఏది ఏమైన కిమ్ మాటతప్పి మరీ భారీ ఖండాంతర ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగిచండంతో యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా యూఎన్ భద్రతా మండలి శుక్రవారం ఈ ప్రయోగంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే ఉత్తర కొరియా ఆయుధా ప్రయోగాలపై పలు ఆంక్షలు ఎదుర్కొంటునప్పటికీ వాటన్నింటిన పక్కన పెట్టి మరోసారి తన అత్యుత్సాహాన్ని బయటపెట్టుకుంది. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఉత్తర కొరియా కిమ్ సంబురాలు, వణికిపోతున్న పొరుగు దేశాలు) -
ఐదేళ్ల తర్వాత.. నార్త్ కొరియా అధ్యక్షుడి ఆనందతాండవం
ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడితే.. ఉత్తర కొరియా మాత్రం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. చివరికి తిండి దొరక్కపోవడంతో తినడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు ఆ దేశ నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక సందేశం ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన సంబురాల్లో మునిగిపోయాడు. చిందులేశాడు. అందుకు కారణం జనాల సంతోషం ఏమాత్రం కాదు. ఆర్థిక సంక్షోభం ఏమాత్రం పట్టన్నట్లు.. ఉత్తర కొరియా ఈమధ్యకాలంలో వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళలోనూ.. నార్త్ కొరియా మాత్రం తన ఆయుధ సంపత్తికి మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిందని, అందుకే కిమ్ అంత సంతోషంగా ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఒక ప్రకటన వెలువరించగా.. జపాన్ సైతం ఈ మిస్సైల్ టెస్ట్ను నిర్ధారించింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందో అనే సమాచారం లేదు. కానీ, సదరు ఖండాతర క్షిపణి సుమారు 1,100 కిలోమీటర్లు, గంటకు పైగా ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయిందని తెలుస్తోంది. ఈ క్షిపణి ప్రయోగానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత ఉత్తర కొరియా ఇప్పుడే ప్రయోగించింది. అది సక్సెస్ కావడంతోనే కిమ్ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మునుపెన్నడూ చూడని జోష్తో ఆయన అంతా కలియదిరిగారట. పైగా ఈ నెల 16వ తేదీన ఉత్తర కొరియా ఒక భారీ క్షిపణిని ప్రయోగించగా, అది రాజధాని ప్యాంగ్ యాంగ్ గగనతలంలోనే పేలిపోయి తునాతునకలైంది. ఈ ఫెయిల్యూర్ను అధిగమించేలా.. ప్రస్తుత క్షిపణి సక్సెస్ కావడంతో అధికార వర్గాలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. కిమ్ మాట తప్పాడు లాంగ్ రేంజి మిస్సైళ్లను పరీక్షంచబోమని, అణు పరీక్షలు జరపబోమని 2018లో కిమ్ జాంగ్ ఉన్ మారటోరియం విధించుకున్నారు. అయితే అది 2020లో పటాపంచలైంది. మారటోరియంను తాము ఎక్కువకాలం అమలు చేయలేమని స్పష్టం చేసిన ఉత్తరకొరియా అధినేత మళ్లీ అమెరికాకు, ప్రపంచదేశాలకు సవాళ్లు విసరడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి నిషేధిత జాబితాలో ఉందని, తద్వారా కిమ్ జోంగ్-ఉన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను తప్పాడని విమర్శిస్తోంది దక్షిణ కొరియా. ఇంతకు మించే.. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా హాసంగ్-14 లాంగ్ రేంజి క్షిపణులను రూపొందించింది. ఇవి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. వీటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కానీ, ఈ తరహా భూతల క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే ఇంతకు మించిన రాక్షస మిస్సైల్ను 2017లోనే ఉత్తర కొరియా ప్రయోగించింది. సుమారు 13,000 కిలోమీటర్లకు పైగా రేంజ్లో ప్రయాణించగల ఆ మిస్సైల్స్ గనుక ప్రయోగిస్తే గురి తప్పకుండా అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్థ్యం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నార్త్ కొరియా కిమ్కు స్ట్రాంగ్ వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న కొత్త అధ్యక్షుడు
సియోల్: దక్షిణ కొరియాలో అధ్యక్షుడి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో సౌత్ కొరియాకు పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పోరులో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ ఓటమిని అంగీకరించారు. ఈ సందర్భంగా యూన్ సుక్ మాట్లాడుతూ.. మే నెలలో తాను పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం తన విదేశాంగ విధానం గురించి వెల్లడిస్తూ అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామని కిమ్కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్పై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియావైపు మూన్ జే ఇన్ మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన సుక్ యోల్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఫోన్లో మాట్లాడినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్యోల్కు బైడెన్ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిపింది. -
తగ్గేదేలే అంటున్న నార్త్ కొరియా.. కిమ్ మరో వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉక్రెయిన్-రష్యా యుద్దం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంటే.. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎనిమిది క్షిపణి ప్రయోగాలు చేసిన నార్త్ కొరియా.. తాజాగా శనివారం మరో ప్రయోగం చేసి ఉద్రిక్తతలను పెంచింది. వివరాల ప్రకారం.. ప్రపంచదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తరకొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. అణ్వాయుధాల కట్టడిపై 2019లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. అనంతరం అమెరికా, ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ట్రంప్, కిమ్ మధ్య కొన్ని రోజులు మాటల యుద్దం నడిచింది. ఆ తర్వాత ఉత్తరకొరియా మరింత జోరు పెంచింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పలుమార్లు క్షిపణి ప్రయోగాలను చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా మారిపోయారు. ఈ సంవత్సురంలో ఇప్పటికి తొమ్మిది క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. శనివారం ప్రయోగించిన క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ శాఖ స్పందిస్తూ.. సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు తాము భావిస్తున్నామని చెప్పింది. అంతకు ముందు ఫిబ్రవరి 27వ తేదీన నార్త్ కొరియా ఎనిమిదొవ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మరోవైపు మార్చి 9వ తేదీన(బుధవారం) దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఎన్నికల కోసం ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్లో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న క్రమంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఆందోళనకు గురి చేసింది. -
కిమ్ వార్నింగ్.. మిస్సైల్ ప్రయోగించి టెన్షన్ పెట్టిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఉత్తర కొరియా మరింత ఉద్రిక్తతను పెంచింది. మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి అందరినీ కలవరపాటుకు గురి చేశాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం మరో బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా, జపాన్ సైనిక అధికారులు క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడించారు. జపాన్ సముద్రంలోకి ఈ మిస్సైల్ను ప్రయోగించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా తమ దేశంపై ద్వేషాన్ని పెంచుకున్న కారణంగానే తాము ఈ క్షిపణి పరీక్షలను జరుపుతున్నట్టు ఉత్తర కొరియా అంతకు ముందు ప్రకటించింది. అయితే, నార్త్ కొరియాకు చైనా మిత్ర దేశంలో కావడంతో అక్కడ(చైనాలో) వింటర్ ఒలంపిక్స్ ప్రారంభమైన తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను నిలిపివేసింది. ఇటీవలే ఒలంపిక్స్ ముగియడంతో మళ్లీ పరీక్షలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో కిమ్ ప్రభుత్వం ఏడు రౌండ్ల క్షిపణి ప్రయోగాలు చేపట్టి అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. -
ఉగ్రుడైన ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడంటే..
ప్రపంచం ఫోకస్ అంతా గత కొన్నివారాలుగా ఉక్రెయిన్ పరిణామాలపైనే ఉంటోంది. ఈ తరుణంలో కొరియా దేశాలు ఏం చేస్తున్నాయన్న? ఆసక్తి కొందరిలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో అప్రమత్తమైన ఈ దాయాది దేశాలు తమ తమ అణ్వాయుధాలకు పదును పెట్టుకుంటున్నాయట. ఈ తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరైన ఓ ఈవెంట్కి ఎక్కడో దూరంగా తూటా పేలగా.. కోపంతో కిమ్ జోంగ్ ఉన్ కఠిన శిక్షలు అమలు చేశాడు. డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 16-18 తేదీల మధ్య సౌత్ హాంగ్యోంగ్ ప్రావిన్స్లో మిలిటరీ కమిటీ సమావేశాలు జరిగాయి. అదే టైంలో యోన్పోలోని హమ్జు కౌంటీలోని Greenhouse Farmలో Groundbreaking Ceremony కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ హాజరు కావాల్సి ఉంది. దీంతో 17, 18 తేదీల్లో రెండురోజుల పాటు లాక్డౌన్తో కట్టడి చేసేసింది అక్కడి మిలిటరీ. అంతేకాదు కమ్యూనికేషన్ వ్యవస్థల కట్టడితోపాటు దారులన్నింటిని మూసేసి భద్రతను కట్టుదిట్టం చేసేసింది. సరిగ్గా కిమ్ ఈవెంట్లో పాల్గొంటుండగా.. హమ్జూ కౌంటీ పొరుగునే ఉన్న చోంగ్ప్యోంగ్ కౌంటీ సిన్సాంగ్ స్టేషన్ ఆర్మీ సెక్యూరిటీ విభాగంలో దగ్గర కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కమాండర్ల మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆ ఘర్షణలో ఒకరు.. ఇంకొకరిని కాల్చి చంపేశారు. అదే రోజు సాయంత్రం విషయం బయటకు పొక్కింది. కిమ్ లాంటి సుప్రీం లీడర్ పర్యటిస్తున్న వేళ.. ఇలాంటి ఘటన జరగడంపై నార్త్ కొరియా మిలిటరీ సీరియస్ అయ్యింది. దీంతో సదరు సెక్యూరిటీ బేస్.. స్వీయ విమర్శలతో కూడిన ఓ క్షమాపణ లేఖ రాసి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కిమ్ ఊరుకుంటాడా? వెంటనే ఆ మిలిటరీ బేస్ చీఫ్ను తొలగించి.. ఏడేళ్ల బానిస శిక్షను అమలు చేయాలని ఆదేశించాడు. అంతేకాదు ఈ ఘటనలో జోక్యం చేసుకున్న మరో ఇద్దరు సైనికులను యోంగ్వాంగ్ కౌంటీ పొలాల్లో కూలీలుగా జీవితాంతం బతకాలంటూ శిక్ష విధించాడు. ఇక కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని అదేరోజు రాత్రి అరెస్ట్ చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్లాంటి గొప్ప లీడర్ హాజరైన కార్యక్రమానికి అతి సమీపంలో కాల్పులకు తెగబడినందుకు.. ఉద్రిక్త పరిస్థితులను రేకెత్తించినందుకుగానూ ఆ వ్యక్తికి మరణ శిక్షను విధించారు. ఇలాంటి ఘటనను దాచి పెట్టే ఆస్కారం ఉన్నా.. అధ్యక్షుడి మీద గౌరవంతో బయట పెట్టినందుకు మిలిటరీ కమిటీని పొగడ్తలతో ముంచెత్తింది నార్త్ కొరియా సెంట్రల్ కమిటీ. అక్టోబర్ నెలలో వీలైతే ముందుగానే ఆ వ్యక్తిని కాల్చి చంపడం ఖాయమని డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రచురించింది. -
కిమ్ దురాగతం.. గడ్డకట్టే చలిలో అరగంట సేపు నిలబెట్టి..
North Korea’s Kim Jong-un uses hidden heaters: క్రూరమైన పాలనకు పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడు ఏదోఒక విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే వింతవింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా చేసి వివాదాస్పద నాయకుడిగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా తాజగా కిమ్ దురాగతం మరోసారి బయటపడింది. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి 80వ జయంతి సందర్భంగా సంజియోన్ నగరంలోని ఆరుబయట గడ్డకట్టే చలిలో తన తండ్రి విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో వేలాది ప్రజలను గడ్డకట్టే చలిలో బ్లౌజులు, టోపీలు ధరించకుండా నిలబడి తన తండ్రికి సంబంధించిన ప్రసంగం వినేలా చేశాడు. అయితే జోన్ తన అధికారులతో పాటు కూర్చొన్న డెస్క్ వద్ద హీటర్లు వినియోగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు అక్కడ ఉన్న రెడ్ కార్పెట్ వద్ద ఉన్న వైర్ల గుంపును బట్టి అంచనా వేయొచ్చని మీడియా ప్రతినిధులు అన్నారు. అంతేకాదు కిమ్ ఇంతకుముందు డిసెంబర్ 2019లో కూడా గడ్డకట్టే చలిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడూ కూడా హీటర్ల వినియోగించినట్లు బయటపడింది. 2011లో కిమ్ జోంగ్-ఇల్ మరణానంతరం అధికారం చేపట్టిన కిమ్ జోంగ్-ఉన్ తన దివంగత తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 'డే ఆఫ్ షైనింగ్ స్టార్' కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏది ఏమైన కిమ్ ప్రజలను బాధించేలా తీసుకునే క్రూరమైన చర్యలు కారణంగానే ఆయన తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఏం జరిగిందంటే..?
ప్యాంగ్ యాంగ్ : వింత శిక్షలతో, వివాదాస్పద నిర్ణయాలతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రపంచానికే సవాళ్లను విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్, కిమ్ మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. ఏరోజు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రపంచ దేశాలు వణికిపోయాయి. మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది అన్నంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా కిమ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి వద్ద ప్రతీ ఏడాది కింజోంగిలియా అనే పూల మొక్కలను నాటిస్తారు. ఇలా నాటి మొక్కలను సంరక్షించేందుకు కిమ్.. ఇద్దరు వ్యక్తులకు నియమించాడు. అయితే, ప్రతీ ఏడాది పూలు పూసే మొక్కలు ఈ సంవత్సరం చోటుచేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పూయలేదు. ఈ విషయం కిమ్ దృష్టికి రాగా.. ఇద్దరు తోటమాలీలకు సంచలన శిక్ష విధించారు. ఒకరికి మూడు నెలలు, మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించి వార్తల్లో నిలిచారు. ఈ శిక్షలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ఉత్తర కొరియా కిమ్ కావరం.. మళ్లీ టార్గెట్ అమెరికా!
ఒకవైపు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని.. ఎలా బయటపడేయాలన్న అంశంపై ఫోకస్ పెట్టినట్లు వరుస ప్రకటనలు ఇచ్చుకున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. అయితే అదంతా ఉత్త బిల్డప్ అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వద్దని ప్రపంచమంతా వారిస్తున్న ఉన్న నిధులన్నింటిని అణు క్షిపణి ప్రయోగాలకే కేటాయిస్తూ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. ఈ ఒక్క నెలలోనే ఏడు మిస్సైల్స్ను పరీక్షించగా.. తాజాగా ఉత్తర కొరియా జరిపిన భారీ క్షిపణి ప్రయోగం గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. కారణం.. గత ఐదేళ్లలో నార్త్ కొరియా జరిపిన అత్యంత శక్తివంతమైన క్షిపణి పరీక్ష ఇదే కాబట్టి!. క్షిపణి వార్హెడ్కు ఇన్స్టాల్ చేసిన కెమెరా స్పేస్ నుంచి భూమిని ఫొటోలు తీయగా.. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆ ఫొటోల్ని సైతం సంబురంగా రిలీజ్ చేసింది. అయితే పనిలో పనిగా.. అగ్రరాజ్యాన్ని కవ్వించే విధంగా ప్రకటనలు చేసుకుంది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. అయితే మిడ్ రేంజ్గా ప్రకటించుకున్నప్పటికీ.. ‘వాసాంగ్-12 Hwasong-12 అమెరికా గువాం తీరాన్ని(సుమారు 2,128 మైళ్ల దూరాన్ని) తాకే అవకాశం ఉందని ప్రకటించడం ద్వారా శాంతిచర్చలను పక్కనపడేసి అగ్రరాజ్యంపై కయ్యానికి కాలు దువ్వినట్లయ్యింది. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో పరీక్షలు జరపడం గమనార్హం. అంతర్జాతీయ ఆంక్షలను పట్టించుకోకుండా ప్యోంగ్యాంగ్ మిలిటరీని శక్తివంతం చేసే దిశగా కిమ్ సర్కార్ ప్రయత్నాలు ఉధృతం చేస్తోంది. మరోవైపు పొరుగు దాయాది దేశం దక్షిణ కొరియా.. 2017 సమయంలో ఉత్తర కొరియా తీరు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని చెబుతోంది. త్వరలో న్యూక్లియర్తోపాటు ఖండాంతర మిస్సైల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి వాసాంగ్-12ను 2017లోనే పరీక్షించినప్పుడు.. గువాం రేంజ్కి చేరుతుందని ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఈ తరుణంలో ప్రస్తుతం దాని రేంజ్ మరింత పెరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒక దిక్కు చైనాలో వింటర్ ఒలింపిక్స్, మరోవైపు దక్షిణ కొరియాలో మార్చ్లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కొరియా కవ్వింపులపై అంతర్జాతీయ సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయోగంపై వైట్హౌజ్ నుంచి పూర్తిస్థాయి స్పందన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం -
ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం
సియోల్: అమెరికా, దక్షిణకొరియాలను కవ్వించేందుకు యత్నిస్తున్న ఉత్తరకొరియా ఆదివారం భారీ క్షిపణి ప్రయోగం జరిపింది. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఉత్తరకొరియా ఈ స్థాయి ప్రయోగం జరపడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్క జనవరిలోనే ఈ దేశం ఏడు క్షిపణి పరీక్షలు జరిపినట్లయింది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. ఈ ప్రయోగాన్ని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఖండించాయి. 2017 తర్వాత దీర్ఘస్థాయి క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించడం ఇదే తొలిసారి. ఐరాస విధించిన ఆంక్షలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా మిసైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తమపై విధించిన ఆంక్షలు తొలగించి చర్చలు పునఃప్రారంభించేలా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఈ చర్యలకు పాల్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. సైనిక శిక్షణ, రాజకీయంగా అమెరికాను ఇరుకున పెట్టడం, కొత్త సిస్టమ్స్ ఇంజినీరింగ్ అవసరాలు, విదేశాలకు విక్రయించేలా ప్రచారం కోసం, ఇంజినీరింగ్ సిస్టమ్స్ పరీక్షల కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే దేశ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఈ పరీక్షలని ఉత్తరకొరియా అధినేత కిమ్ ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలపై చర్చకు వెంటనే భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ఇన్ పిలుపునిచ్చారు. పరిస్థితులన్నీ తిరిగి 2017లో ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కిమ్ ఈ చర్యలకు స్వస్తిపలకాలని కోరారు. చర్యను ఖండించిన యూ ఎస్ మాత్రం ఈ చర్య తమకు, తమ మిత్రులకు ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించింది. చైనాలో ఒలంపిక్స్ పూర్తైన తర్వాత ఉత్తరకొరి యా దూకుడు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..
సాంకేతికతలోనూ గోప్యత పాటించే ఉత్తర కొరియాలో హ్యాకర్లు చెలరేగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలను లెక్కలేయకుండా!. చాలా కాలంగా సొంత దేశం, వినోదరంగంపై మాత్రమే ఫోకస్ హ్యాకర్లు.. ఈ మధ్యకాలంలో ప్రపంచం మీద పడ్డారు. 2021 ఒక్క ఏడాదిలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయల్ని) విలువైన డిజిటల్ ఆస్తుల్ని కాజేశారు. వివిధ క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్స్పై ఏడు దాడుల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు బ్లాక్చెయిన్ అనాలసిస్ కంపెనీ ‘చెయినాలైసిస్’ ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను లక్క్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమ దేశంలో హ్యాకర్లు లేరని, అలాంటి వాళ్లు దొరికితే మరణశిక్ష నుంచి తప్పించుకోలేరంటూ స్వయంగా అధ్యక్షుడు కిమ్ పలు సందర్భాల్లో బయటి దేశాలు(ప్రత్యేకించి అమెరికా) చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లజారస్ గ్రూప్’.. నార్త్ కొరియా ఇంటెలిజెన్సీ బ్యూరో వెన్నుదన్నుతోనే నడుస్తోందని అనుమానాలు ఉన్నాయి. తద్వారా వెనకాల నుంచి ప్రొత్సహిస్తూ.. కిమ్ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ గ్రూప్ మీద కఠిన ఆంక్షలు విధించింది. ఇక ఉ.కొరియాలో 2020-2021 మధ్య.. నాలుగు నుంచి ఏడు శాతానికి సైబర్ నేరాలు పెరగ్గా.. దొచుకున్న సొత్తు విలువ సైతం 40 రెట్లు అధికంగా ఉందని చెయినాలైసిస్ చెబుతోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో 1.3 బిలియన్ డాలర్ల డబ్బు, క్రిప్టోకరెన్సీని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నార్త్ కొరియన్ కంప్యూటర్ ప్రోగ్రామర్లపై నేరారోపణ అభియోగాల్ని నమోదు చేసింది. చిన్న చిన్న కంపెనీల దగ్గరి నుంచి హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు లక్క్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్లు అమెరికా న్యాయ విభాగం సైతం నిర్ధారించుకుంది. చదవండి: భారత్లో మెటావర్స్ ద్వారా వెడ్డింగ్ రిసెప్షన్! -
కిమ్ దుందుడుకు చేష్టలు.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. వారం వ్యవధిలో రెండోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిస్సైల్ పరీక్షలపై కిమ్ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి. కేవలం వారం వ్యధిలో రెండుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వమించాడు కిమ్ జోంగ్ ఉన్. స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు.. అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ కోసం తమ నిబద్ధతను చాటుకుంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమతి భద్రత మండలి నియమ, నిబంధనలు ఉల్లంఘించిదని అగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే ఉత్తర కొరియా రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరింది. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. అయితే దేశసంస్కరణల సంగతి ఎలా ఉన్నా.. రక్షణ విభాగంలో తగ్గేదేలే లేదని ప్రకటించుకుంది కిమ్ అధికార విభాగం. చదవండి: మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: అణ్వాయుధాలను తగ్గించు కోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత బుధవారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని అమెరికా సైన్యం పేర్కొంది. సైనిక సంపత్తిని మరింతగా పెంచుకోనున్నట్లు ఉ.కొరియా ఇలా క్షిపణి ప్రయోగాల ద్వారా చెబుతోందని అమెరికా అభిప్రాయపడింది. సైన్యాన్ని పటిష్టవంతం చేస్తామని పార్టీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞచేసిన వారం రోజుల్లోనే ఉత్తర జగాంగ్ ప్రావిన్స్లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం. -
నార్త్ కొరియా.. అన్నమో రామచంద్ర!: కిమ్ జోంగ్ ఉన్
కరోనా కష్టకాలంలోనూ జనాల ఆకలి కంటే అణ్వాయుధాల ప్రదర్శనే ముఖ్యమనుకున్న నియంతాధ్యక్షుడి స్వరం మారింది. మొన్నటిదాకా ఆర్భాటాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టిన కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు పొదుపు మంత్రం వల్లె వేస్తున్నాడు. కరోనా భయంతో తనను తాను బయటి ప్రపంచంతో బంధాలు తెంచుకుని బంధించుకున్న ఉత్తర కొరియాలో ఆహార కొరత ఏ స్థాయిలో ఉందో కిమ్ ప్రసంగం గురించి తెలుసుకుంటే సరిపోతుంది మరి! పదేళ్ల అధికార ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా.. పార్టీ కీలక సమావేశం నిర్వహించాడు కిమ్ జోంగ్ ఉన్. పెరిగిపోతున్న ఆకలి మరణాలు(లక్షల్లో!), ఆహార కొరతను అధిగమించడం, ప్రజలకు పోషకారహారం అందించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగడం విశేషం. మరోవైపు పతనం దిశగా దూసుకెళ్తున్న ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా గాడిలో పెట్టాలని, ఇది జాత్యవసర అంశమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పార్టీ నేతలను.. అధికారులను ప్రసంగించాడు. అంతేకాదు ప్రత్యేకంగా ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఇక ఈ సమావేశంలో ప్రసగించిన కిమ్.. బాగా చిక్కిపోయి కళ తప్పిన ముఖంతో ఉన్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. జీవన ప్రమాణాలే.. 2021లో ఉత్తర కొరియా పౌరులు ఎంతటి తీవ్ర దుస్థితి, సంక్షోభాలు ఎదుర్కొన్నారో తనకు తెలుసని, అందుకే ఆ ఏడాదిని గడ్డు కాలంగా పేర్కొన్నాడు ఉత్తర కొరియా సుప్రీం. 2022ను గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్(జీవన్మరణ పోరాట)గా అభివర్ణించాడు. రాబోయే రోజుల్లో ఆహార, వస్త్ర పరిశ్రమతో పాటు గృహ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించి.. అభివృద్ధి దిశగా కృష్టి చేయాలంటూ అధికారుల్లో మనోధైర్యం నింపాడు. అంతేకాదు మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ప్రధానాంశంగా ముందుకెళ్లాలంటూ అధికారులకు సూచించాడు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల నిధుల కేటాయింపులకు కోతలు విధించినా ఫర్వాలేదని, అంతా పొదుపు పాటించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చడమే ధ్యేయంగా పని చేయాలంటూ పిలుపునిచ్చాడు కిమ్. కారణాలు.. కరోనా సమయంలో ఉత్తర కొరియా ఆహార సంక్షోభం మొదలైంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు చేపట్టకుండా.. న్యూక్లియర్ వెపన్స్ తయారీ ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ ఐక్యరాజ్య సమితి నార్త్ కొరియా అధ్యక్షుడిపై దుమ్మెత్తి పోసింది. కరోనాకు తోడు కరువు, భారీ వర్షాలు, వరదలు.. కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి సంక్షోభం దిశగా పయనించింది. ఈ మొత్తం పరిణామాలతో మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. ఆశ్చర్యకర పరిణామం సుదీర్ఘంగా సాగిన కిమ్ ప్రసంగంలో దేశ సమస్యల ప్రస్తావనే కనిపించింది. గ్రామీణాభివృద్ధి ప్రణాళిక, పోషకాహారం, పిల్లల యూనిఫామ్స్, నాన్-సోషలిస్టిక్ కార్యకలాపాల్ని అణివేయడం తదితర అంశాలపైనే సాగింది. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ చేసే ప్రసంగం ఎలాంటిదైనా సరే.. అందులో అణ్వాయుధాల గురించి, దాయాది దేశాల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. కానీ, తాజా ప్రసంగంలో అమెరికా, దక్షిణ కొరియాల ప్రస్తావన లేకుండానే ముగిసిపోవడం అధికారులను సైతం విస్మయపరిచింది. అణ్వాయుధ సంపత్తి, కవ్వింపు, దాడులు, చర్చలు.. ఇలాంటి అంశాలేవీ లేవు. అయితే కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న అస్థిర సైనిక వాతావరణం కారణంగా.. ప్యోంగ్యాంగ్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని మాత్రం ఒక్క లైన్లో పేర్కొన్నాడు కిమ్. గత సోమవారం మొదలైన 8వ సెంట్రల్ కమిటీ 4వప్లీనరీ మీటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ యధాతధ ప్రసంగం పేరిట కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) పూర్తి కథనం ప్రచురించింది. చదవండి: బఫూన్ అనుకుంటున్నావా?.. కిమ్ జోలికి రావొద్దు బ్రదర్ -
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
సినిమా చూస్తే.. సింపుల్గా ప్రాణాలు పోతాయి అక్కడ ! నచ్చిన బట్టలు, హెయిర్ స్టైల్ చేసుకున్నా.. తీసి జైళ్లో పడేస్తారు. సరదాగా ఏదైనా పని చేస్తే.. బతుకంతా ఏ గనుల్లోనో, పల్లెటూరిలోనో వెట్టిచాకిరీకి అంకితం చేస్తారు. చివరికి సంబురాలు, ఏడుపులపై కూడా నిషేధాజ్ఞాలు. పాపం.. అక్కడి జనాలకు ఏం చేయాలన్నా ఆటంకాలే. అక్కడి చట్టాలు.. అవి తయారు చేసే నియంతాధ్యక్షుడు అలాంటోడు!. ప్రపంచమే ఆయన్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది మరి. కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశ అధ్యక్షుడి పేరు వింటే ఉత్తర కొరియా జనాలకు కంటి మీద కునుకు పట్టదు. ఏ పూట ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. అదే టైంలో సిసలైన ఆ నియంత కొత్త కొత్త నిర్ణయాలనూ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తుంటుంది. కిమ్కు కోపం తెప్పించే పని ఎవరూ చేసినా వాళ్ల పని ఖతం. అలాంటిది ‘ఒక్కడు’ దాయాదిగడ్డపై కిమ్ను ఎగతాళి చేస్తూ పదేళ్లుగా కాలరేగరేసి మరీ బతికేస్తున్నాడు. కిమ్ మిన్ యోంగ్.. వయసు ముప్పై పదుల్లో ఉంటుంది! ఉండేది సియోల్(సౌత్ కొరియా) నగరంలో. బొద్దు రూపంతో నార్త్ కొరియా అధ్యక్షుడికి దూరం పోలికలే ఉంటాయనుకోండి. అయితే అనుకరణ మాత్రం అచ్చంగా ఉంటుంది. దీనికి తోడు కిమ్ హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ను యాజ్ ఇట్ ఈజ్గా దించేస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొరివితో తలగొరుకునే చేష్టలకు పాల్పడుతున్నాడతను. కిమ్ పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ టైంలో కిమ్ మిన్ అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి బతికేవాడు కిమ్ మిన్. కానీ, కిమ్లా ఉన్నాడంటూ.. ఇమిటేట్ చేస్తున్నాడంటూ కొందరు కాంప్లిమెంట్ ఇవ్వంతో.. అప్పటి నుంచి నియంత నేతను అనుకరిస్తూ యూట్యూబ్లో వీడియోలు మొదలుపెట్టాడు. అవి అలాంటి ఇలాంటి వీడియోలు కావు. కిమ్ పరువు తీసిపడేసేలా ఉంటాయి అతను ఎంచుకునే కాన్సెప్ట్లు. మొదట్లో హ్యూమర్గా జనాలు వాటిని ఎంజాయ్ చేశారు. ‘డ్రాగన్ కిమ్’ అంటూ అతగాడికి బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే రాను రాను అవి మరీ ఘోరంగా ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయట. తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రాణ భయం గురించి చెప్పుకొచ్చాడు డ్రాగన్ కిమ్. ఆన్లైన్లో మిన్ యోంగ్కు బెదిరింపులు వస్తున్నాయట. if you mock our Dear Leader, you will be in trouble, like, big trouble!ఇది ఇప్పుడు ఇంటర్నెట్లతో మిన్ యోంగ్ వస్తున్న సందేశాలు. అంతేకాదు అతని చావు ఊహించని రీతిలో ఉంటుందని బెదిరిస్తున్నారట. దీంతో ప్రాణభయంతో అతగాడు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు పోలీసులు నగరం విడిచి వెళ్లకుంటే రక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇతగాడి భద్రత అంశం హాట్ టాపిక్గా మారింది సౌత్ కొరియాలో. కొసమెరుపు.. 2019లో వియత్నాం వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో డ్రాగన్ కిమ్ కూడా అక్కడే ఉన్నాడు. అంతేకాదు వెకిలి వేషాలు వేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆరు రోజులు జైల్లో పెట్టారు. కిమ్ మిన్ మాత్రమే కాదు.. కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు -
నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. తాగొద్దు.. ఉల్లంఘిస్తే ఖతమే!
North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు). ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం. కొత్తేం కాదుగా.. - ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. - క్యాపిటలిస్టిక్ లైఫ్స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్ను బ్యాన్ చేశాడు. - తన స్టయిల్ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. - స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు. చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్! -
నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు
బయటి ప్రపంచంలో కనెక్టివిటీ అంతగా ఉండని ఉత్తర కొరియా గురించి రకరకాల కథనాలు బయటకు వస్తుంటాయి. వాటిలో నిజాల సంగతి ఎలా ఉన్నా.. కిమ్ పాలనలో కొరియన్ పౌరులు గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారనేది మాత్రం వాస్తవం. తాజాగా కిమ్ తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి లెదర్ వ్యాపారులకు, యువతకు అసలు సహించడం లేదు. ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా లెదర్ కోట్లు, జాకెట్లను నిషేధిస్తూ కిమ్ ప్రభుత్వం బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పైగా అధ్యక్షుడు కిమ్ తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇంతకీ ఆఘమేఘాల మీద ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో తెలుసా?. ఈ నెల 21న(నవంబర్) ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ వేసుకున్న లెదర్ జాకెట్ లాంటిదే.. కొందరు యువకులు అలాంటి జాకెట్లే వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్ ఛాయిస్ను అవమానించినట్లే అవుతుందని పేర్కొంది అక్కడి ప్రభుత్వం. అందుకే లెదర్జాకెట్ల నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది కూడా. చైనాకు చెందిన రేడియో ఫ్రీ ఏషియా కథనం ప్రకారం.. 2019లో ఓ కార్యక్రమం సందర్భంగా లెదర్ కోట్ ధరించి కనిపించాడు కిమ్ జోంగ్ ఉన్. అప్పటి నుంచి వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒరిజినల్ లెదర్ ట్రెంచ్ కోట్ల ధర చాలా ఎక్కువ. దీంతో చైనా నుంచి డూప్లికేట్ లెదర్ జాకెట్లు ఎక్కువగా ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యాయి. వాటిని కొరియా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఒరిజినల్ లెదర్ కోట్ల ధర లక్షా డెబ్భై వేల వన్(34 డాలర్లు) కాగా, డూప్లికేట్ జాకెట్ల ధర ఎనభై వేల వన్(16 డాలర్లు)కు అమ్ముడపోయేవి. వన్ అంటే నార్త్ కొరియా కరెన్సీ అయితే తాజా పరిణామంతో లెదర్ జాకెట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. కిమ్ జోంగ్ ఉన్, అతని సోదరి కిమ్ యో జోంగ్ లాంటి అధికారం నడిపించే వాళ్లకు మాత్రమే అలాంటి జాకెట్లు ధరించే అర్హత ఉందని తాజా ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. అది వాళ్లకే హుందాతనమని, కానీ డూప్లికేట్ జాకెట్లతో అధ్యక్షుడిని అనుకరిస్తున్నారని.. కించపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్యాషన్ పోలీసింగ్ పేరుతో ప్యోంగ్సాంగ్ సిటీలో పోలీసులు పాట్రోలింగ్ చేపట్టారు. రోడ్ల మీద జనాల నుంచి అలాంటి జాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లెదర్ వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తోంది. తమ డబ్బుతో కొనుక్కున్న వస్తువులపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. పైగా 2000 సంవత్సరం నుంచే లెదర్ జాకెట్ ఫ్యాషన్ ట్రెండ్ ఉందని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా నిషేధిస్తారని వాదిస్తున్నారు. అయితే కిమ్ ఆ జాకెట్లో కనిపించిన తర్వాతే.. వాటి అమ్మకాలు పెరిగాయన్నది అక్కడి లెదర్ వ్యాపారులు చెప్తున్నమాట. కానీ, తమ పొట్ట కొట్టే కిమ్ ప్రభుత్వ ఆదేశాలపై లెదర్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు. చైనా నుంచే! ఇదిలా ఉంటే కరోనాతో కిందటి ఏడాది జనవరి నుంచి చైనా నుంచి నార్త్ కొరియాకు సరిహద్దులు మూసుకుపోయాయి. అన్ని రకాల వర్తకవాణిజ్యాలు నిలిచిపోయాయి. ఐరాస, అమెరికా ఆంక్షలతో ఈ ఏప్రిల్ నుంచి అక్రమ వర్తకం కూడా ఆగిపోయింది. కానీ, చైనా నుంచి మాత్రం దొంగతనంగా వస్తువులు వెళ్తునే ఉన్నాయి. తాజా పరిణామాల తర్వాత స్వదేశంలో లెదర్ వ్యాపారాలపై కిమ్ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచినప్పటికీ.. చైనా నుంచి దొంగతనంగా దిగుమతి అవుతూనే వస్తోంది. నెలకు నాలుగు వేల వన్లు సంపాదించే ఉత్తర కొరియన్లు.. అధిక ధరల కారణంగా చైనా నుంచి వచ్చే దొంగ సరుకునే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడుతూ కఠిన శిక్షలకు గురవుతున్నారు. చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు -
కిమ్ దుశ్చర్య.. ఆ వెబ్ సిరీస్ చూసినందుకు మరణశిక్ష!
ఎవరు ఎలా పోయినా సరే.. దేశ కఠిన చట్టాలను తన పౌరులు గౌరవించాలన్నది ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశం. అదే దాయాది దక్షిణ కొరియా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి జరగ్గా.. దుశ్చర్యకు పాల్పడ్డాడు కిమ్. దక్షిణ కొరియా నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను చూశాడనే నెపంతో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్ జోంగ్ ఉన్. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది సైన్యం. చైనా సర్వర్ల నుంచి సిరీస్ను డౌన్లోడ్ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్ పెన్డ్రైవ్లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. సిరీస్ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్ ప్రిన్స్పాల్, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్. నార్త్ కొరియా చట్టాల ప్రకారం.. వీళ్లంతా బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో శిక్షాకాలం పాటు కూలీ పనులు చేయాల్సి ఉంటుంది. ‘‘స్క్విడ్ గేమ్ అనేది వినోదం పంచేది కాదు. పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబించే షో. డబ్బు కోసం మనిషి ఉవ్విళ్లూరడం, ప్రాణాల్ని పణంగా పెట్టడం.. ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు. అందుకే మొగ్గలోనే ఈ వ్యవహారాన్ని తుంచేస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం తరపు నుంచి ఓ స్టేట్మెంట్ స్థానికంగా ఓ పత్రికలోనూ ప్రచురితమైంది. ఉత్తర కొరియాలో క్యాపిటలిస్ట్ దేశాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని వీక్షించినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, ఇతరులకు పంపిణీ చేసినా నార్త్ కొరియాలో కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్లో అమెరికా, దక్షిణ కొరియాను ప్రముఖంగా చేర్చింది కిమ్ ప్రభుత్వం. అలా చేస్తే తమ దేశ గౌరవాన్ని దిగజార్చినట్లు, కల్చర్ను కించపరిచినట్లు భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. చదవండి: కిమ్ కొత్త ఎత్తు! కల్చరల్ వార్ ఎందుకంటే.. -
ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు..
రవి చూడని బ్రిటీష్ పాలన గురించి విని ఉంటారు.. కానీ నేటికీ అక్కడి నిరంకుశ పాలనలో అభివృద్ధికి, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నారీ దేశ ప్రజలు. అక్కడ పర్యటించాలన్నా, కనీసం మనసును కదిలించిన ఫొటోలు తీసుకోవలన్నా అడుగడుగునా ఆంక్షలే. ఇలాంటి వాటిని కూడా నిషేధిస్తారా అనే అనుమానం కలుగుతుంది ఇది చదివితే. ఎరిక్ లాఫోర్గ్ ఈ ఫొటోలు తీసినప్పుడు అసలూహించి ఉండడు. కేవలం ఆ ఫొటోలు మూలంగా ఆ దేశం నుంచి శాశ్వతంగా భహిష్కరించబడతాడని. మర్మదేశంగా పేర్కొనే నార్త్ కొరియాకు సంబంధించిన ఫొటోలే అవి. అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించాడట. కిమ్ అనుమతి లేకుండా ఆ దేశానికి సంబంధించి చిన్న చీపురుపుల్ల కూడా ప్రపంచాన్ని చూడదు. అటువంటి అక్కడి పేదరికాన్ని, ప్రజల దుర్భర జీవనాన్ని గురించి ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా! అయినప్పటికీ ఆ ఫొటోలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ మాటల్లోనే.. 2008 నుంచి ఆరు సార్లు ఉత్తర కొరియాను సందర్శించాను. వాళ్లు నా దగ్గరి ఫొటోలు డిలీట్ చేయమన్నప్పుడు, వాటిని సేవ్ చేసి, డిలీట్ చేశాను. థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా!! పోషకాహారలోపంతో బాధపడే ఈ విధమైప పిల్లల ఫొటోలు తీయడం ఉత్తర కొరియాలో నిషేధం. అంతేకాదు పేదరికాన్ని తెలియజేసే ఏ విధమైన ఫొటోలు తీయకూడదు. రాళ్లపై నిద్రపోతున్న ఇతని ఫొటోను కూడా డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అతను మృతి చెందినట్టు కనిపిస్తున్నాడు. ఈ ఫొటో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీన్ని కూడా డిలీట్ చేయమన్నారు. పైగా అమెరికా ఆంక్షల వల్లనే కరెంట్ కోతలని చెప్పారు. పనులకు వెళ్లడానికి గంటల తరబడి సైకిళ్లను తొక్కేవారి ఫొటోలు తీయడం కూడా నిషేధమే. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. నార్త్ కొరియాలో ప్రతీచోట కనిపించే సైనికులకు సంబంధించిన ఫొటోలు అస్సలు తీయకూడదు. మరీ ముఖ్యంగా ఆగిపోయిన బస్సులను తోసే సమయంలో అస్సలు తీయకూడదు. క్రమశిక్షణలేని పిల్లల ఫొటోలు కూడా తీయకూడదు. పేదరికంలో మగ్గుతున్నవారి జీవనవిధానాన్ని ఫొటోల్లో బంధించడం అక్కడి చట్టం ప్రకారం నేరం. వాక్ వే సరిహద్దులను రిపేర్ చేస్తున్న మహిళలు, పిల్లలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు తీయడం కూడా చట్టవిరుద్ధమే. నాయకుల చిత్రాల ముందు నవ్వుతున్నవారి ఫొటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! సైనికులు కనిపించకుండా జంతువుల ఫొటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ప్రతీచోట పోగయ్యే ప్రజలకన్నా సైనికులే 99 శాతం ఉంటారు. తినటానికి గడ్డిని సమకూర్చుకునే నార్త్ కొరియన్ ఫొటోలు తీయకూడదు. ఇది కూడా చట్ట విరుద్ధమే. ప్యోంగ్యాంగ్ రోడ్లపై అరుదుగా కార్లు కనిపిస్తాయి. కార్లు ఓ వైపు వెళ్తున్నారోడ్డు మధ్యలో పిల్లలు ఆడుకుంటారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీయకూడదు. సాంగ్డౌన్లో ఎస్కలేటర్ను చూసి భయపడుతున్న పిల్లలు వీళ్లు. ఈ దేశ ప్రజల్లో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు. మరమ్మత్తులు అవసరమైన ఈ పాత బిల్డింగ్, ఆహారం కోసం చేపలు పట్టే వ్యక్తి, కాలుష్యంతో నిండిన నదిలో స్నానం చేసే వ్యక్తి, గుండీలు ఊడిన వ్యక్తి ఫొటోలు, విశ్రాంతి తీసుకునే సైనికులు, నిరాశ్రయులైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, మురికి దుస్తులతో ఉన్న వ్యక్తుల ఫొటోలు తీయడం అక్కడి చట్టం ప్రకారం నేరం. చాలా మటుకు నార్త్ కొరియా దేశంలో పేరదికమే కనిపిస్తుంది. ఇతర ప్రపంచదేశాలు తమను తక్కువచేసి చూస్తారనే భయం, ఆంధోళన అక్కడి నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంకుశ పాలన పరాకాష్టకు చేరితే ఉత్తర కొరియాలా ఉంటుందనడానికి ఈ ఫొటోలపై ఉన్న నిషేధమే నిదర్శనం. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
తీవ్ర ఆహార సంక్షోభం.. ‘నల్లహంస మాంసం ఎంతో రుచి’
సియోల్: నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కిమ్.. ఆహార సంక్షోభం కారణంగా కొన్నేళ్లపాటు తక్కువ తినాల్సిందిగా జనాలను కోరాడు. ఇక ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కిమ్ ఓ అసాధారణ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదేంటంటే.. ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి విపరీతమైన ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక.. ప్రొటీన్ రిచ్ ఆహారమని ప్రకటించాడు. నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాడు. (చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు) ఇప్పటికే దేశం తూర్పు తీరంలోని క్వాంగ్ఫో డక్ ఫామ్లో, ఉత్తర కొరియా ప్రావిన్స్లోని సౌత్ హమ్గ్యాంగ్లో పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. (చదవండి: వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400) కరోనా మొదలైనప్పుడు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఇంకా అమలు చేస్తోంది. సరిహద్దులను మూసి వేసింది. ప్యాంగ్యాంగ్ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించిది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ఈ ఏడాది 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చదవండి: ప్లీజ్.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్ జాంగ్ ఉన్ -
ప్లీజ్.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్ జాంగ్ ఉన్
సియోల్: కరోనా ఉధృతి కారణంగా సరిహద్దులు మూసివేత, ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో భయంకరమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు కిమ్. ప్రస్తుతం ఉత్తర కొరియాలో డిమాండ్కు తగ్గ రీతిలో ఆహార పదార్థాల సరఫరా లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశనంటున్నాయి. సహజ విపత్తులు, సరైన ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయ పరికరాల కొరత వంటి తదితర కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. (చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్!) ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. దేశంలో ఏర్పడ్డ ఆహార కొరతకు దేశ వ్యవసాయ రంగమే కారణమన్నారు. ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను అందించడంలో దేశ వ్యవసాయ రంగం పూర్తిగా విఫలయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య తీవ్ర ఉద్రిక్తంగా మారింది అని తెలిపారు. గత ఏడాది సంభవించిన టైఫూన్, కరోనావైరస్ మహమ్మారి, భారీ వర్షాలు ఉత్తర కొరియా ఆహార సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. (చదవండి: 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్ ప్రతిజ్ఞ) ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ పార్టీ నేతలతో భేటీ అయి.. ఆహార కొరత గురించి చర్చించారు. ఈ గండం నుంచి గట్టెకాలంటే మరో మూడేళ్లు అనగా 2025 వరకు దేశ ప్రజలు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని కిమ్ సూచించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా 8,60, 000 టన్నుల ఆహార పదార్థాల కొరతతో ఇబ్బంది పడుతుంది. చదవండి: కిమ్ తల వెనుక మిస్టీరియస్ స్పాట్! -
'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్ ప్రతిజ్ఞ
Kim Jong Un vows to build 'invincible' military: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాంగ్యాంగ్లో మంగళవారం జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ షోలో పాల్గొన్న ఆయన 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ.. పొరుగుదేశమైన దక్షిణ కొరియాతో మేము ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు. ఆయుధ సామాగ్రిని కేవలం ఆత్మరక్షణ కోసమే సమకూర్చుకుంటున్నాం. ఎవరితోనూ యుద్ధాలు చేయడానికి కాదు. మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని కిమ్ అన్నారు. చదవండి: (తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195) కొరియా ద్వీపకల్పంలో అస్థిరతకు అమెరికానే కారణమన్న కిమ్.. తన దేశం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఎవరూ సవాలు చేయలేని సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమే అని చెప్పారు. ఉత్తర కొరియా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం మాత్రం తన అణ్వాయుధాలను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను, క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించడం గమనార్హం. -
నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు
North Korea Economic Crisis: ఆకలి రోదనలు.. లక్షల్లో సొంత ప్రజల మరణాలు చూసి కిమ్ జోంగ్ ఉన్ గుండె కరిగిందా?. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించే కర్కోటకుడిగా పేరుబడ్డ నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు.. ఓ మెట్టు దిగాడా? క్షిపణుల ప్రయోగం, అణ్వాయుధాల తయారీతో దాయాదులపై విరుచుకుపడే కిమ్.. ఇప్పుడు స్వరం మార్చాడు. ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఆయన ఇచ్చిన ప్రసంగం.. అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా ఘోరంగా తయారయ్యింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ పతనం ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన పార్టీ వార్షిక సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని కిమ్ నోటి నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి.. స్టేజ్ మీద ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారట. ఈ వ్యాఖ్యల్ని అధికారిక మీడియా హౌజ్ Korean Central News Agency ప్రసారం చేసింది. ముందు ప్రజలు.. తర్వాతే మనం! న్యూక్లియర్ వెపన్స్ తయారీ కారణంగా నార్త్ కొరియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటుపై కరువు, భారీ వర్షాలు, వరదలు.. కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. వీటికి కరోనా తోడవ్వడం, చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కంటే ముందు ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. పార్టీ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై పార్టీ మూకుమ్మడిగా పని చేయాలని పిలుపు ఇచ్చాడు. ‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోందాం. కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ప్రజల సంక్షేమమే మన తొలి ప్రాధాన్యం. మిగతావి తర్వాత. అయితే మీరు చేసే పనులు ప్రజలకు మేలు చేస్తాయా? లేదంటే వాళ్ల హక్కుల్ని కాలరాస్తాయా? అనేది సమీక్షించుకోవాలి. ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించే ప్రసక్తే లేదు’’ అని అధికారులకు హెచ్చరిక జారీ చేశాడాయన. ఆర్భాటాలకు దూరంగా.. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 76వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం రాజధాని ప్యాంగ్ యాంగ్లో జరిగింది. సమావేశానికి ముందు ఆనవాయితీగా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి ఆర్భాటానికి దూరంగా వేడుకలు విశేషం. సాధారణంగా ఎలాంటి సందర్భంలోనైనా.. మిలిటరీ పరేడ్తో తన దర్పాన్ని ప్రపంచానికి ప్రదర్శించుకుంటాడు కిమ్. అలాంటిది సాదాసీదాగా నిర్వహించడం బహుశా ఇదే ప్రప్రథమం. అమెరికా తిట్టిన తర్వాత.. ఇక ఉత్తర కొరియాలో ఇంత దారుణమైన సంక్షోభానికి కిమ్ నియంతృత్వ పాలనే కారణమని అమెరికా తిట్టిపోసింది. ఈ మేరకు గురువారం అమెరికా విదేశాంగ శాఖ.. కిమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలను అక్కడి(నార్త్ కొరియా) ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని.. మారణాయుధాల తయారీకి మళ్లిస్తున్నారంటూ వైట్హౌజ్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆరోపించారు. ఒకవేళ అవసరం సాయం కోరితే నార్త్ కొరియాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి. చదవండి: కిమ్ ఇంట అధికార కుంపటి.. సోదరితో వైరం! -
ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్!
దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు ఆకలి కేకలు, ఇంకోవైపు వ్యక్తిగత అనారోగ్యం .. ఈ కారణాలు నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను బాధ్యతల నుంచి వైదొలిగేలా చేయబోతున్నాయా?. క్షిపణి పరీక్షలు, సామూహిక పరేడ్లతో దర్పం ప్రదర్శిస్తున్న కిమ్.. తన తర్వాతి నాయకత్వ బాధ్యతల విషయంలో మాత్రం కీలక సమాలోచనలు జరుపుతున్నాడా?.. ఉత్తర కొరియా, దాయాది దక్షిణ కొరియా ప్రధాన పత్రికల కథనాలు ‘అవుననే’ ఊహాగానాలకు తెరలేపుతున్నాయి ఇప్పుడు. గత కొంతకాలం కిమ్ జోంగ్ ఉన్(38).. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తూ వస్తున్న నార్త్ కొరియా ప్రభుత్వం.. కిమ్ కీలక చర్చల్లో పాల్గొంటున్న ఫొటోలు, వీడియో ఫుటేజీలను స్థానిక మీడియా ఛానెళ్ల ద్వారా బయటి ప్రపంచానికి విడుదల చేస్తూ వస్తోంది. అయినప్పటికీ సన్నబడిన కిమ్ రూపం ఆధారంగా ఆయన అనారోగ్యం నిజమేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది దక్షిణ కొరియా. కిమ్ గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతోంది. ఈ పరిణామాలతోనే నాయకత్వ మార్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని, ఈ తరుణంలో నార్త్ కొరియాలో రాజకీయ కల్లోలం చెలరేగుతోందని ఇప్పుడు వరుస కథనాలు ప్రచురిస్తోంది. కిమ్ చెల్లికి కీలక పదవి! కిమ్ యో జోంగ్.. కిమ్ జోంగ్ ఉన్కు స్వయానా సోదరి. మొన్నటిదాకా కిమ్కు ప్రధాన సలహాదారుగా ఉందీమె. అయితే ఇప్పుడు ఆమెను నార్త్ కొరియా స్టేట్ ఎఫైర్స్ కమిషన్లో కీలక పదవి దక్కించుకుంది. కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. కమిషన్లో ఇంతకు ముందున్న తొమ్మిది మంది సభ్యుల్ని అర్థాంతరంగా తొలగించింది నార్త్ కొరియా స్టేట్ అసెంబ్లీ. ఇందులో పాక్ పోంగ్ జు, అమెరికాతో గతంలో దౌత్యం కోసం ప్రయత్నించిన చోయి సన్ హుయి కూడా ఉన్నారు. ఇక గురువారం ఎనిమిది మందితో కూడిన లిస్ట్ ప్రకటించగా.. అందులో యంగ్ అండ్ ఓన్లీ ఉమెన్గా చోటు సంపాదించుకుంది కిమ్ యో జోంగ్. ఈమె నియామకానికి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సైతం ఆమోద ముద్ర వేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, దక్షిణ కొరియా మూన్ జాయ్ ఇన్తో కిమ్ జోంగ్ భేటీ అయినప్పుడు కిమ్ యో ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్స్లో హైలెట్ అయ్యింది. ఆటైంలోనే ఆమె అన్న తర్వాతి వారసురాలంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వెంటనే పార్టీ సెంట్రల్ కమిటీకి వైస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఆమెను నియమించడంతో దాదాపుగా ఈ అనుమానాల్ని నిజమని భావించారంతా. అయితే అనూహ్యంగా ఆమెను ఆ పదవి నుంచి తొలగించిన కిమ్, ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచేశాడు. దీంతో ఆమె సైడ్ అయ్యిందని అంతా అనుకున్నారు. తాజాగా 34 ఏళ్ల కిమ్ యో జోంగ్కు స్టేట్ ఎఫైర్స్ లాంటి కీలక విభాగంలో.. అదీ సినియర్ పోస్ట్ కట్టబెట్టడంతో ప్రెసిడెంట్ రేసులో నిలిచినట్లయ్యింది. కిమ్ మాత్రం అతనికే.. అయితే కిమ్ జోంగ్ఉన్ మాత్రం నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఒక ఎడిటోరియల్ను ప్రచురించింది. అంతేకాదు సోదరి కిమ్ యో జోంగ్కు బాధ్యతలు అప్పగించే విషయంలో సుముఖంగా లేడని పేర్కొంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ జూన్లో ‘వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా’ పొలిట్బ్యూరో సభ్యుల ఎంపిక నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు పార్టీ వైస్ ప్రెసిడెంట్ థాయ్ హ్యోంగ్ చోల్ను తర్వాతి అధ్యక్షుడిగా పేర్కొంటూ ఓ కథనం సైతం ప్రచురించింది. కిమ్కు నమ్మినబంటుగా, రాజకీయ సలహాదారుడిగా ఉన్న హ్యోంగ్ చోల్ను.. తర్వాతి అధ్యక్షుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు కిమ్ చేస్తున్నాడని, ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలో పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించినట్లు సౌత్ కొరియాకు చెందిన ది స్ఫై న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. మరోవైపు అడిటింగ్ కమిషనర్ యూ సంగ్ చోల్ పేరు తర్వాత ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు మరో పత్రిక కథనం వెలువరించింది. కిమ్ యో జోంగ్ గ్రూప్ రాజకీయాలకు తెర లేపుతోందని.. అందుకు చెక్ పెట్టేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తున్నాడని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం మొదలైందన్నది మరో కథన సారాంశం. అయితే దక్షిణ కొరియా కథనాల సంగతి పక్కనపెడితే.. వారసత్వ రాజకీయాల వ్యతిరేక నిబంధనను ఉల్లంఘిస్తూ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ కిమ్ సోదరికి కీలక పదవి కట్టబెట్టిందంటూ నార్త్ కొరియాకే చెందిన కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీలో కథనం రావడం ఆసక్తికర చర్చకు దారితీసింది. చదవండి: కిమ్ సోదరి అనూహ్య ప్రకటన -
దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం..
సియోల్: గత వైరి వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహభావంతో ముందుకొస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ శుక్రవారం ప్రకటించారు. ‘అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షల పేరిట మా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న మీ మిత్ర దేశం అమెరికాను కాస్త బుజ్జగించండి. తీవ్ర ఆంక్షలను కాస్తయినా సడలించేలా ఒప్పించండి. ఈ షరతులకు ఒప్పుకుంటే మీతో చర్చలకు సదా సిద్ధం’ అని దక్షిణ కొరియాను ఉద్దేశిస్తూ కిమ్ సోదరి జోంగ్ వ్యాఖ్యానించారు. ఓవైపు ఆరు నెలల తర్వాత మళ్లీ క్షిపణి పరీక్షలకు శ్రీకారం చుట్టిన ఉ.కొరియా.. మరో వైపు శత్రుదేశంతో సమాలోచనలకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ కొరియాలపై ఇకనైనా యుద్ధమేఘాలు తొలగిపోయి శాంతి కపోతాలు ఎగరాలని ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ద.కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ వ్యాఖ్యానించడంతో ఉ.కొరియా తాజాగా స్పందించింది. ‘ఇంతకాలం తీవ్ర ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో రెండు దేశాలకూ ఒనగూరింది శూన్యం. ఇకనైనా నిర్మాణాత్మకమైన చర్చలు మొదలుపెడదాం. మా దేశంతో భేదాభిప్రాయాలను త్యజించి, ద.కొరియా ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలి. బంధాల బలోపేతానికి కృషిచేద్దాం’ అంటూ మూన్ జె ఇన్ను ఉద్దేశిస్తూ కిమ్ సోదరి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. కిమ్ సోదరి మాటల్లోని అంతరార్థాన్ని పూర్తిగా అర్ధంచేసుకున్నాకే ముందుకెళ్తామని ద.కొరియా పేర్కొంది. చదవండి: Bill Gates: అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్గేట్స్...! -
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు
సియోల్: సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో వరుసగా రెండు రోజులు ఉత్తర కొరియా నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కలి్పంచే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. అణు వార్హెడ్లు మోసుకుపోగలదా? ఈ క్షిపణిని ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అభివర్ణించింది. ఇది అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని నిపుణులు చెబుతున్నారు. ‘వ్యూహాత్మక ఆయుధమని ఉత్తర కొరియా చెబుతోందంటే దీనికి అణు వార్హెడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. అయితే వాటిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందో లేదో చెప్పడం కష్టం’ అని అమెరికాకు చెందిన కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సభ్యుడు అంకిత్ పాండా చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా ఇప్పటికే కిమ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు. మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా నిరంతరం అణ్వాయుధాలపైనే దృష్టి సారించి ఇలా పరీక్షలు చేయడం అంతర్జాతీయ సమాజానికి కూడా ముప్పేనని యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రూయిజ్ క్షిపణి ప్రయోగ దృశ్యాలు -
కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. వైరలవుతోన్న వీడియో
-
వైరల్: కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. చివరికి ఏమైందంటే!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాప్తంగా జనాలకు ఇతని పేరు సుపరిచితమే. ఇతను వార్తల్లో నిలిచేది కొన్నిసార్లే అయినా తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. ఇప్పుడు కిమ్ జోంగ్ పేరు మరోసారి వైరలవుతోంది. అయితే ఇందుకు ఓ వ్యక్తి చేసుకున్న హెయిర్ కట్ కారణం. వివరాలు.. ఓ వ్యక్తి సెలూన్లోకి వెళ్లాడు. అక్కడ తనకు ఏ స్టైలిష్ హెయిర్కట్ అవసరం లేదని, కానీ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి హెయిర్ స్టైల్ కావాలని కోరాడు. అయితే ఇది బార్బర్కు సవాల్ లాంటిదే అయినప్పటికీ.. కిమ్ లాంటి హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి అతను ఆ వ్యక్తి జుట్టును అచ్చం కిమ్ జోంగ్ లాగానే మార్చాడు. చదవండి: వైరల్: భల్లుకాల బంతాట.. భలే ఆట అంటున్న నెటిజన్స్ కిమ్ జోంగ్ మాదిరి హెయిర్ కట్ అంతా అయిపోయిన తరువాత దీనికి సంబంధించిన వీడియోను టిక్టాక్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి సెలూన్లో కుర్చీపై కూర్చొని కనిపిస్తాడు. నియంత కిమ్ జోంగ్ ఉన్ లాగా అతను తన జుట్టు కత్తిరింపుతో నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. బార్బర్ని కూడా వీడియో క్లిప్లో కనిపిస్తాడు. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతుంటారు. ‘కిమ్ జోంగ్ ఉన్ స్టైల్ హెయిర్కట్’క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి కొందరు అచ్చు కిమ్లా ఉన్నావని అంటే మరొకరు కిమ్ భారత దేశం ఎప్పుడు వచ్చాడు అంటూ కామెంట్స్ జోడిస్తున్నారు. ఈ వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్ వేషం ధరించి ఉత్తర కొరియాకు వెళ్లాలని, అక్కడ సరిహద్దు గార్డ్స్ను గందరగోళానికి గురిచేయాలని మరొక యూజర్ అన్నారు. బార్బర్ తలుచుకుంటే మామూలు వ్యక్తిని సెలబ్రిటీ చేయగలడంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. -
అసలు చూస్తున్నది కిమ్నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు
పోంగ్యాంగ్: నవశకం నియంతగా పేరు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మళ్లీ బహిరంగ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజుల తర్వాత కనిపించిన కిమ్ శరీరాకృతి మారింది. ఇంతకుముందు బొద్దుగా కనిపించే కిమ్ ఈసారి చాలా సన్నబడి కనిపించాడు. ఒక్కసారిగా అతడి మార్పు చర్చనీయాంశమైంది. చివరిసారి కనిపించినప్పుడు అతడి తలపై ఉన్న ఒక గుర్తు గురించి సర్వత్రా చర్చ జరగ్గా ఇప్పుడు కిమ్ బక్కగా అవ్వడం ఆసక్తికరంగా మారింది. 73వ మిలిటరీ పరేడ్ సందర్భంగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ కపించాడు. గతానికి కన్నా భిన్నంగా చలాకీగా.. హుషారుగా.. నవ్వుతూ కనిపించాడు. ఈ సందర్భంగా అతడి లుక్స్ వైరల్గా మారాయి. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ మాదిరి హెయిర్ స్టైల్లో కనిపించాడు. కొన్ని నెలలుగా ఆయన సన్నబడడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బరువు తగ్గేలా కసరత్తులు చేశారు. సన్నబడిన అనంతరం కనిపించడం ఇదే తొలిసారి. సైనిక పరేడ్లో ఎప్పుడూ లేని విధంగా కిమ్ కనిపించాడు. ఇద్దరు పిల్లలతో కలిసి దరహాసం చేస్తూ ముందుకు కదిలాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా సైనికులకు అభివాదం చేస్తూ ముందుకుసాగాడు. కిమ్ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా ఎప్పుడూ చర్చ సాగుతోంది. 2018లో ఓ టీవీ ఫుటేజ్లో కిమ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. అందుకే అతడి సోదరి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చర్చ నడిచింది. అలా చర్చ జరుగుతున్నప్పుడే కిమ్ అలా మళ్లీ మీడియా ముందుకు ప్రత్యక్షమవుతుంటాడు. కిమ్ ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవాడు. అనంతరం కొన్నిరోజులు బరువు తగ్గాడు. అదే కొనసాగిస్తూ ఇప్పుడు 100కు చేరువయ్యాడని తెలుస్తోంది. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కిమ్ చికిత్స పొందుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో అతడి సోదరి వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా కిమ్ 20 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. -
కిమ్ తల వెనుక మిస్టీరియస్ స్పాట్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) ఆరోగ్యంపై మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ, తర్వాత పెద్ద మచ్చ కనిపించడమే ఇందుకు కారణం. అది మిస్టీరియస్ స్పాట్ అంటూ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. జూలై 24 నుంచి 27 దాకా జరిగిన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ ఉన్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. తర్వాత ఈ బ్యాండేజీ లేదు. దానికింద ఉన్న మచ్చ కనిపించింది. కిమ్కు ఏం జరిగినా, ఆయన ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో బాగా లావుగా కనిపించిన కిమ్ జోంగ్ ఉన్న జూన్లో చాలా సన్నబడ్డారు. ఈ వార్త ఉ.కొరియా శత్రుదేశాల్లో చర్చనీయాంశమైంది. భారీ కాయంతో కంటికి నిండుగా కనిపించే తమ అధినేత బక్క పలుచగా మారడాన్ని చాలామంది ఉత్తర.కొరియన్లు తట్టుకోలేకపోయారట. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారట! కిమ్ ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం అసాధారణ సంకేతాలేవీ లేవని, ఆయన బాగానే ఉన్నారని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీసు చెబుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్కు తల వెనుక భాగంలో టెన్నిస్ బంతి సైజ్లో కణితి ఉండేది. -
కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు సంబంధించిన వీడియో ఒకటి నిన్నంత సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెలిసిందే. వీడియోలో కిమ్ గతంతో పోలిస్తే చిక్కినట్లు కనిపించాడు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనారోగ్య సమస్య వల్లే కిమ్ ఇలా అయ్యాడంటే.. కాదు.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అందుకే ఇలా చిక్కిపోయినట్లు కనిపించాడని మరో వర్గం తెలిపింది. ఏది ఏమైనా కిమ్ బరువు తగ్గడంపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఉత్తర కొరియాలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో తీవ్ర ఆహార కొరత ఎదుర్కుంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆహార కొరత వల్ల కిమ్ ఇలా చిక్కిపోయాడని ఉత్తర కొరియా వాసులు భావిస్తున్నారట. నార్త్ కొరియా అధికారక మీడియా ప్రకారం పేరు తెలియని ప్యాంగ్యాంగ్ వాసి ఒకరు కిమ్ బరువు తగ్గడంపై ఆ దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ‘‘చిక్కిపోయినట్లు ఉన్న గౌరవనీయ ప్రధాన కార్యదర్శి (కిమ్ జాంగ్ ఉన్)ను చూసి మా దేశ ప్రజల గుండె బద్దలయ్యింది’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా కదలికలను గమనించే అమెరికాకు చెందిన 38 నార్త్ కొరియా డైరెక్టర్ జెన్ని టౌన్ మాట్లాడుతూ.. ‘‘కిమ్ బరువు తగ్గడం వెనక ప్రధాన కారణం తెలియదు. అనారోగ్య సమస్యలు లేదా ఫిట్గా మారడం కోసం ఇలా బరువు తగ్గి ఉండవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరత సమస్యపై ప్రజల్లో సానుభూతి పొందడం కోసం కిమ్ ఇలా ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తుంది’’ అన్నారు. మొత్తానికి కిమ్ బరువు తగ్గడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్నమాట. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్