Krishna Vamsi
-
అవునూ.. నాదే తప్పు, క్షమించండి: కృష్ణవంశీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) 2004 జూలై 24 విడుదలైంది. సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్, హనుమాన్ భక్తుడి పాత్రలో అంజిగా నితిన్ మెప్పించారు. అయితే, హీరోయిన్ ఛార్మి(Charmy Kaur) పాత్ర ఈ సినిమాలో బాగాలేదని, అందుకే ప్రేక్షకులు తిప్పికొట్టారని పలు వాదనలు భారీగానే వచ్చాయి. హీరోయిన్ పాత్ర లేకపోయింటే ఈ చిత్రం సూపర్ హిట్ అయి ఉండేదని అప్పట్లోనే చాలామంది కామెంట్లు చేశారు. ఈ సినిమాలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్ కూడా కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. (ఇదీ చదవండి: వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య)శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో ఛార్మిని అలా ఎందుకు చూపించారు అంటూ కృష్ణవంశీని ఒక నెటిజన్ ప్రశ్నించారు. అందుకు ఆయన కూడా రిప్లై ఇచ్చారు. 'తప్పేనండి.. క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు..' అని ఆ తప్పలను ఎప్పటికీ సరిచేయలేమని ఆయన అన్నారు. ఎక్స్ పేజీలో ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని, ఆమె పాత్ర సినిమాను పూర్తిగా తప్పుదోవ పట్టించిందని కృష్ణవంశీపై ఆ సమయంలో బాగానే ట్రోల్ చేశారు. అప్పుడు కూడా తనదే తప్పు అని హుందాగా ఒప్పుకున్న కృష్ణవంశీ ఇప్పుడు మరోసారి క్షమించమని నెటిజన్లను కోరారు.1995లో తొలి సినిమా గులాబితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కృష్ణవంశీ.. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం,మురారి,ఖడ్గం వంటి టాప్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సోషియో ఫాంటసీ కథతో శ్రీ ఆంజనేయం విడుదల కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బాగున్నప్పటికీ ఛార్మి పాత్ర పెద్ద మైనస్గా మారింది. దీంతో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. సుమారు 20 ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. 2023లో చివరిగా రంగమార్తాండ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. Thappenandi.... Apologies.. desperate times desperate measures desperate deeds 🙏🙏 https://t.co/61ZzByYkaz— Krishna Vamsi (@director_kv) February 3, 2025 -
యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు?
ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్ చాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వాట్ నెక్ట్స్? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.ఆ వివరాల్లోకి వెళదాం... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్ ఏంటి? అంటే వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆయన్ని హిట్ వరించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్ పూరి జగన్నాథ్ ్ర΄ాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్బాబు, అల్లు అర్జున్, రామ్చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్కి డేట్స్ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు. మాస్ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సినిమా హిట్ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ (2018) సినిమా నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ని సైతం మార్చుకున్నారు వినాయక్. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్ ప్రయాణం డైరెక్టర్గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కల్యాణ్రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా వంశీ ఓ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్ మైన్ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్లోనా? బాలీవుడ్లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి. దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాదు... హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చాన్స్ ఉందని టాక్. మరి ఆయన నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేది వేచి చూడాలి. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్ రమేశ్. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్’. వెంకటేశ్తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్ రమేశ్. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి.. మెహర్ రమేశ్ నెక్ట్స్ మూవీ ఏంటి? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్పైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్లో ఉంటుందా? బాలీవుడ్లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.– డేరంగుల జగన్ -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
మురారి సీక్వెల్ కావాలంటున్న మహేష్ ఫ్యాన్స్..
-
మురారి రి రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
'అసలేం గుర్తుకురాదు..' పాటలో సౌందర్యను అలా చూపించింది ఆయన కాదట!
అంత:పురం.. 1998లో వచ్చిన సినిమా. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్. ఇళయరాజా సంగీతం అందించిన 'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..' ఎవర్ గ్రీన్ సాంగ్. సింగర్ చిత్ర ఆలపించిన ఈ పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. రెడ్, పర్పుల్, పింక్, ఎల్లో, గ్రీన్.. ఇలా వెంటవెంటనే చీర అనేక రంగుల్లో కనిపిస్తుంది.'ఈ చీర రంగులు మార్చే కాన్సెప్ట్ భలే ఉంది. చాలా కొత్తగానూ ఉంది. అప్పట్లో ఈ ఐడియా ఎలా వచ్చింది సార్?' అని ఓ నెటిజన్.. కృష్ణవంశీని అడిగాడు. ఇందుకు దర్శకుడు స్పందిస్తూ.. అది తమ క్రియేటివిటీ కాదని చెప్పాడు. మూవీ రిలీజ్ తర్వాత జెమిని టీవీ ఎడిటర్ దాన్ని ఇలా మలిచాడని క్లారిటీ ఇచ్చాడు.ఈ సంగతి తెలుసుకున్న జనాలు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలోనే ఎడిట్ చేశారనుకున్నాం.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సౌందర్యను ఇంధ్రదనస్సులా అన్ని రంగు చీరల్లో చూపించాలన్న అతడి ఐడియాను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో అసలేం గుర్తుకు రాదు సినిమా ఒరిజినల్ సాంగ్తో పాటు చీర రంగులు మార్చే వీడియో నెట్టింట వైరలవుతోంది. Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. ,🙏❤️ THQ https://t.co/gLLNeZNE6n— Krishna Vamsi (@director_kv) July 20, 2024 Pedda Mosame Idi 😂😂😂pic.twitter.com/I2060ZEvIg https://t.co/TBsi9z2DxJ— Movies4u Official (@Movies4u_Officl) July 20, 2024 చదవండి: ‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ -
‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్
కృష్ణ వంశీ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై క్లాసిక్ హిట్గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. కృష్ణవంశీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు.మహేశ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడని ఘట్టమనేని అభిమానులు అభినందించారు. మహేశ్ కూడా తను బాగా ఇష్టపడే సినిమాల్లో మురారి ఒకటని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆయన అభిమానులు కూడా తమ హీరో నుంచి మురారి లాంటి మరో క్లాసిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఇక మహేశ్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మురారీ సాంగ్స్ని, ఆ సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.కృష్ణవంశీ సైతం సోషల్ మీడియా వేదికగా మురారి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తున్నాడు. అయితే ఈ రీరిలీజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ‘మురారి’ ప్లాప్ సినిమా అని రాసుకొచ్చాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘హలో అండీ నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావు గారి నుంచి రూ. 55 లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్లో రూ. 1.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రామాణికం అయితే.. అది ఫ్లాప్ చిత్రమా లేదా సూపర్ హిట్టా?’ మీరే నిర్ణయించుకోండి’ అని రిప్లై ఇచ్చాడు. -
సిగరేట్ పెట్టెపై ‘అర్థశతాబ్దపు..’ పాట రాశాడు : కృష్ణవంశీ
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట. ‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని. అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు. -
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మహేశ్బాబుతో సినిమా చేయడం కష్టం: కృష్ణవంశీ
సూపర్స్టార్ మహేశ్బాబు- డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం మురారి. ఈ మూవీ 23 ఏళ్లవుతున్నా ఇప్పటికీ అందులోని పాటలు, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, నంది అవార్డులు అందుకున్నాడు. కానీ ఇంతవరకు మళ్లీ మహేశ్తో సినిమా చేయలేదు. దీంతో ఎక్స్ (ట్విటర్) వేదికగా అభిమానులు మహేశ్తో మరో కుటుంబ కథా చిత్రం చేయండి అని అడిగారు. రాఖీలాంటి సినిమా.. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. మహేశ్ ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నాడండీ.. కాబట్టి తనతో సినిమా చేయడం కష్టం అని రిప్లై ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్తో రాఖీ లాంటి సినిమా మళ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టార్.. కానీ రాఖీలాంటి సినిమా మరొకటి ప్లాన్ చేస్తున్నాను. నిన్నే పెళ్లాడతా సీక్వెల్? ఈసారి ఒక అమ్మాయితో.. కాన్సెప్ట్, సమస్య అంతా వేరుగా ఉంటుంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా తీస్తాను అని రిప్లై ఇచ్చాడు. నాగచైతన్యతో నిన్నే పెళ్లాడతా సీక్వెల్ తీస్తే చూడాలనుందన్న అభిమాని కోరికకు సీక్వెల్ తన వల్ల కాదని చెప్పాడు. నాకంత సీన్ లేదని చేతులు జోడించి రిప్లై ఇచ్చాడు. Mahesh is going to b an international star Andi .. so kastam ... THQ 🙏❤️ https://t.co/A5xbIWVTzn — Krishna Vamsi (@director_kv) February 26, 2024 Sequel I can't Andi .. antha scene ledu Naku 🙏❤️ https://t.co/Y3d4YWEh9n — Krishna Vamsi (@director_kv) February 26, 2024 ఎన్టీఆర్ ఇస్ a great artist Andi .. unique n inimatable ... THQ ❤️🙏 https://t.co/hcOMDG0vEN — Krishna Vamsi (@director_kv) February 26, 2024 ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అండి... కానీ రాఖీ లాంటి సినిమా ఇంకొకటి ప్లాన్ చేస్తున్నా ... ఈ సారి ఒక అమ్మాయి తో ... Different concept different problem but more intensity more power ... Anneee కుదిరితే త్వరలో ... THQ 🙏💕 https://t.co/8SwbawOxjR — Krishna Vamsi (@director_kv) February 26, 2024 చదవండి: గిల్లితే గిల్లించుకోవాలి.. ఆ రౌడీ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే? -
హనుమాన్ కంటే 'శ్రీ ఆంజనేయం' బెటర్.. కృష్ణ వంశీ రియాక్షన్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండటం విశేషం. హనుమాన్ చిత్రం గురించి సోషల్ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ఇంతలో మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. Audience r never wrong .. they didn't like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm — Krishna Vamsi (@director_kv) February 11, 2024 GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq — Krishna Vamsi (@director_kv) February 11, 2024 -
హృదయాన్ని హత్తుకునేలా ‘అలనాటి రామచంద్రుడు’ టీజర్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఆ ప్రేమని చనిపోయింతవరకూ వదులుకోకూడదు’ అనే డైలాగ్ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథని చాలా కొత్తగా, మనసుని హత్తుకునేలా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ‘’ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశారు. కానీ నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’, ‘కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగిరాదు’, ‘చందమామను చేరుకోవడం ఆ పావురానికి గమ్యం అయితే.. నిన్ను చేరుకోవడమే నా గమ్యం ధరణి’ అనే డైలాగ్స్ ప్రేమకథని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. కృష్ణ వంశీ టీజర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ రెడ్డి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. శశాంక్ అందించిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. -
కృష్ణ వంశీ నాకు అన్ని నేర్పించారు..!
-
రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా..?
-
రమ్యే ఆర్డర్ ఇస్తే నేను చేయాల్సిందే : దర్శకుడు కృష్ణ వంశీ
-
కొడుకును రమ్యకృష్ణనే చూసుకుంటుంది
-
ప్రేక్షకులు నా సినిమాలు చూస్తారా..?
-
నాకు ఆ సినిమా నచ్చలేదు.. ఎందుకంటే ?
-
కృష్ణ వంశీ తన మూవీ ఫెయిల్యూర్ గురించి..!
-
సీతారామశాస్త్రి గురించి దర్శకుడు కృష్ణవంశీ గొప్ప మాటలు
-
అప్పట్లో చాలా పొగరుండేది నాకు
-
బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ... చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
-
చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్కు రూ.50 వేలు తీసుకున్నాను. 1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను. తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్. చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్ చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక -
ఆ సినిమా తరువాత నా జీవితం అంత చీకటి అయిపోయింది..
-
ఆ సినిమా తరువాత నా జీవితం అంత చీకటి అయిపోయింది...
-
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీను ఇలా ఎప్పుడైనా చూశారా?
-
అమ్మనాన్నలతో అంతగా కనెక్షన్ లేదు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కృష్ణవంశీ మార్క్ మరోసారి కనిపించిదంటూ సినీ ప్రముఖులు పొడగ్తలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రంగమార్తాండ సక్సెస్ గురించి కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి వస్తున్న ఆదరణ గతంలో చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతంలో నేను చేసిన సినిమాల కంటే రంగమార్తాండ ప్రత్యేకం. చిరంజీవి లాంటి దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. సోసల్ మీడియాలోనూ ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. రిలీజ్కు ముందు అంతగా ప్రచారం చేయకున్నా మంచి కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రంగమార్తాండతో మరోసారి రుజువు అయ్యింది. ఇది 'ఇది మన అమ్మానాన్నల కథ' అని క్యాప్షన్ ఇవ్వడంతో ఆడియెన్స్ మరింత కనెక్ట్ అయ్యారు. అయితే సినిమాకి, నా పర్సనల్ లైఫ్కి చాలా తేడా ఉంది. మా నాన్న చాలాకాలం క్రితమే చనిపోయారు. మా అమ్మ మాత్రం నాతోనే ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను మా పేరెంట్స్తో అంతగా కనెక్టెడ్గా లేను.ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. రియల్ లైఫ్లో బ్యాడ్ సన్ని. ఇంట్లోవాళ్ల విషయానికి వస్తే.. ఎవరితోనూ అంత క్లోజ్గా మాట్లాడను'' అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు. -
బ్రహ్మానందం 20 టేకులు చెప్పినా చేసేవారు: కృష్ణవంశీ
‘‘ప్రతి నటుడిలో విభిన్న కోణాలు ఉంటాయి. వాటిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడం నాకు ఇష్టం. విలన్గా చేస్తున్న చలపతిరావుగారిని ‘నిన్నే పెళ్లాడతా’లో మంచి తండ్రిగా చూపించాను. బ్రహ్మానందంగారిలోని మరో నటుణ్ణి ‘క్షణం క్షణం’లో చూశాను. అందుకే ‘రంగ మార్తాండ’లోని చక్రి పాత్రలో ఆయన్ని ఊహించుకునే ధైర్యం చేశా.. ఆయన పాత్ర అద్భుతంగా వచ్చింది’’ అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్, అనసూయ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ ప్రకాశ్రాజ్కి బాగా నచ్చింది. నన్నా సినిమా చూసి, స్క్రీన్ప్లేలో సాయం చేయమన్నాడు. నాలాంటి రాక్షసుడితోనే కంటతడిపెట్టించిన చిత్రమిది. ఆ తర్వాత నాకు తోచిన మార్పులు ప్రకాశ్రాజ్కి చెబితే.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహిస్తే బాగుంటుంది’ అనడంతో ఓకే అన్నాను. మనుషులపై నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారనే నా నమ్మకాన్ని వారు ‘రంగమార్తాండ’ ద్వారా నిజం చేశారు. 1250కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంగారు ఒక్కో సీన్కి పదీ ఇరవై టేకులు చెప్పినా చేసేవారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంగారి నటన, ఇళయరాజాగారి సంగీతం సినిమాకి హైలైట్. శివాత్మిక, అనసూయ, రాహల్, ఆదర్స్ బెస్ట్ ఇచ్చారు. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ప్లస్సయింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బ్రహ్మానందం. -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
ఎందుకు ఈ సినిమా.. ఎవరు చూస్తారని అడిగా : రమ్యకృష్ణ
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్ చానల్తో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సినిమా ప్రారంభానికి ముందు ‘అసలు ఇలాంటి చిత్రాలను ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన మొండి కదా.. వినిపించుకోకుండా షూటింగ్ని ప్రారంభించారు. ఇందులో నేను పోషించిన పాత్ర కోసం మొదటగా చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో..చివరకు నేను ఆ పాత్ర చేస్తానని ముందుకొచ్చా. కళ్లతోనే నటించాలని చెప్పారు. అలానే నటించాను. నా పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదు. ఎమోషనల్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే.. భావోద్వేగానికి లోనయ్యాం. ప్రతి సీన్ హృదయాలను హత్తుకునేలా తిశాడు. వంశీ కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్ఫుల్గా డిజైన్ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్తో ముందుకెళ్తుంది. ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ. -
నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి:కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి) కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
Rangamarthanda : కృష్ణవంశీ ఫార్ములా బాక్సాపీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ బ్రాండ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. నక్షత్రం మూవీ తర్వాత ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ గా కృష్ణ వంశీ రంగమార్తాండ తెరకెక్కించాడు. నటసామ్రాట్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. కరోనా కి ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న రంగమార్తాండ మార్చి 22న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ ప్రేక్షకులను మెప్పించగలడా అనే సందేహాలు టీటౌన్లో వినిపిస్తున్నాయి. కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ సీన్స్ తోనే ప్రేక్షకులను స్టోరీకి కనెక్ట్ చేయాలని చూస్తాడు కృష్ణ వంశీ. అయితే ప్రజెంట్ ప్రేక్షకుల ట్రెండ్ మారింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాక్షన్ ఉన్న కథల పైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఫ్యామిలీ టైపు మూవీస్ పై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి కృష్ణవంశీ ఈ మూవీతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా రంగమార్తాండ విడుదలైన రోజే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి వారంలో నాని తొలి పాన్ ఇండియా మూవీ దసరా విడుదల కాబోతుంది. ధమ్కీ, దసరాల మధ్య రంగమార్తాండ రిలీజ్ చేయటం కొంచెం రిస్క్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే రంగమార్తాండ సినిమా అనుకున్నంత హైప్ రాలేదు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ షాయరీ కూడా ఆలపించారు. అయినా ఈ మూవీకి ఎలాంటి బజ్ రాలేదు. ఇక కృష్ణ వంశీ రంగమర్తాండ మూవీకి హైప్ తెచ్చేందుకు రకాలు ప్రయత్నాలు చేసినా ... అవి ఎలాంటి బజ్ తీసుకురాలేదు. చివరిగా కృష్ణవంశీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ సినిమా ప్రీమియర్ షో వేసి ప్రమోట్ చేయటంతో...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేసుందుకు స్టెప్ తీసుకుంది. ఇక రంగమార్తాండ ప్రీమియర్ చూసిన సెలబెట్రీస్ నుంచి పాజిటివ్ రివ్యూస్ రావటం ఈ సినిమాకి ప్లస్ గా మారింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణవంశీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. -
స్టార్ డాటర్తో రాహుల్ సిప్లిగంజ్.. వీడియో సాంగ్ విడుదల
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్కు జోడీగా శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. -
సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ దర్శకుడు కృష్ణ వంశీ
-
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్పై వస్తోన్న రూమర్స్పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా : కృష్ణవంశీ
మెగాస్టార్ చిరంజీవి అంటే చిత్రపరిశ్రమలో అందరికి ఇష్టమే. ఎంత ఎదిగిన ఒదిగిన ఉండే వ్యక్తిత్వం ఆయనది . అందుకే సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభిమానిగా మారుతారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఒక్కరు. ఆయనకు మెగాస్టార్ అంటే ఎనలేని ప్రేమ. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను అన్నయ్య(చిరంజీవి)అంటే చాలా ఇష్టమని అంటున్నాడు కృష్ణవంశీ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి, ఆయన తనకు ఇచ్చిన బహుమతి గురించి చెప్పుకొచ్చాడు. ‘చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ అలానే ఉన్నాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. పర్సనల్గాను ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’సినిమాను ఇచ్చాడు. గతంలో మెగాస్టార్తో కలిసి ఓ యాడ్ చేశాను. డబ్బింగ్ సమయంలో ‘అన్నయ్యా.. మీకు బాగా నచ్చిన వ్యక్తికి మీ కారు గిఫ్ట్గా ఇస్తారా?’అని సరదాగా అడిగాను. కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచి కారు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. నేను వద్దని చెప్పాను. నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు.. ఒకవేళ ఇచ్చిన నా దగ్గర అవి ఎక్కువ కాలం ఉండవు’అని చెప్తే.. ‘అన్నయ్యా అని పిలుస్తున్నావు.. మరి ఈ అన్నయ్య గిఫ్ట్ ఇస్తే తీసుకోవా? అని అనడంతో మొహమాటంగానే తీసుకున్నాను. దానితో ఎన్నో సాహసాలు చేశా. ఓ సారి నందిగామ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్..కానీ నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలతో బయపడ్డాను. అన్నయ్య ఇచ్చిన కారు వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను’అని కృష్ణవంశి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. -
కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్!
కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వీటి కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. పేరున్న చాలా మంది దర్శకులు వెస్ సిరీస్లను తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణ వంశీ కన్ను కూడా వెబ్ సిరీస్లపై పడింది. (చదవండి: హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ) త్వరలోనే ఆయన కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో ఓటీటీ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు.‘వచ్చే ఏడాదిలో ఓటీటీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు’అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మరి కృష్ణవంశీ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓటీటీ రంగంలో ఎలాంటి రికార్టు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. -
ఆ సినిమా కోసం చిరంజీవి 'షాయరీ'
Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda: మెగాస్టార్ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. ఒక కవితాత్మకమైన ధోరణిలో చెప్పేది. ఇంతకీ చిరంజీవి షాయరీ ఎందుకు చెప్పారంటే 'రంగ మార్తాండ' చిత్రం కోసం. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలు ఇవన్నీ చెప్పాలంటే.. 30 ఏళ్లకుపైగా నటనానుభవం ఉన్న చిరంజీవి అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారట. ఆ నటుడి తాలుకూ భావోద్వేగాన్ని షాయరీ రూపంలో చెబితే ప్రేక్షకుల మనసులను తాకొచ్చని అనుకున్నారట. ఇప్పటివరకూ చిరంజీవి పలు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ షాయరీ చెప్పలేదు. అందుకే కృష్ణవంశీ షాయరీ గురించి చెప్పగానే చిరంజీవి ఎగ్జయిట్ అయి, ఓకే అన్నారట. (చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్పేయి జీవిత కథ..) ఇటీవలే ఈ షాయరీని రికార్డ్ చేశారని, ఒక రోజులేనే చిరంజీవి చెప్పారని తెలిసింది. 'రంగ మార్తాండ'కు మెగాస్టార్ చెప్పిన ఈ షాయరీ కచ్చితంగా హైలెట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించనున్నారు. (చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్గా పోస్ట్..) -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతి సనన్ చెల్లెలు
మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. తొలి సినిమాతో టాలీవుడ్ బై చెప్పి బాలీవుడ్కు వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది వరస ఆఫర్స్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. రవీతేజ తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపుర్ హీరోయిన్గా ఎంపికైనట్లు తాజాగా మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా దర్శకుడు కృష్ణవంశీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజతో నుపుర్ జోడి కట్టనుంది. చదవండి: తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అంటున్నారు: తాప్సీ ఇదిలా ఉంటే మాస్ మహారాజ రవితేజ వరస హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఖీలాడి మూవీ రిలీజై బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఇదిలా ఉంటే త్వరలోనే రామారావు ఆన్ డ్యూట్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు షూటింగ్ను జరుపుకుంటున్నాయి. ఇవి ఉండగానే రవితేజ పాన్ ఇండిచా చిత్రం టైగర్ నాగేశ్వరరావు పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ Woohoo! The lovely @NupurSanon is now starring in @RaviTeja_offl 's first Pan India film, #TigerNageswaraRao... Directed by #Vamsee and produced by #AbhishekAgarwal. The movie launches on 2 April 2022 in #Hyderabad. Superb news #nupursanon #raviteja #siddharthkannan #sidk pic.twitter.com/Z6gQe5nFmG — Siddharth Kannan (@sidkannan) March 31, 2022 -
ప్రకాశ్ రాజ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ
Director Krishna Vamsi Interesting Comments On Prakash Raj: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రకాశ్ రాజ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచారు. కాగా కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తాజాగా తిరిగి సెట్స్పైకి వచ్చింది. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసిన నితిన్.. దీంతో ప్రకాశ్ రాజ్కు సంబంధించిన ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కృష్ణవంశీ ట్వీటర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాశ్ రాజ్తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న.. స్టన్నింగ్’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా Started the final ANKAM of RANGAMARTHANDA..... Shooting a most emotional climax with my most fav actor NATARAKSHSA prakashraj ... Stunning 💕💕💕💕. pic.twitter.com/n9PRnR5sEH — Krishna Vamsi (@director_kv) January 6, 2022 -
చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలి: ప్రముఖ దర్శకుడు
'గులాబి', 'నిన్నే పెళ్లాడుతా', 'అంతఃపురం', 'ఖడ్గం', 'రాఖీ' వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఈ దర్శకుడు కొంతకాలంగా ఫాంలో లేరు. దీంతో రంగమార్తాండ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడీ డైరెక్టర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'నాగార్జున నా ఫేవరెట్ హీరో.. మెగాస్టార్ చిరంజీవితో రెండు, మూడు సినిమాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి. రంగమార్తాండ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మిగిలే ఉంది. ఈ సినిమాలో కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. అలాగే రమ్యకృష్ణలో కొత్త కోణాన్ని చూస్తారు. రంగమార్తాండ సినిమా షూట్ కంప్లీట్ అవగానే అన్నం సినిమా ప్రీపొడక్షన్ మొదలవుతుంది. తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రంగమార్తాండ థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. మరి ఇది ఓటీటీలోకి వస్తుందా? థియేటర్లో రిలీజ్ అవుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం' అని చెప్పుకొచ్చారు కృష్ణ వంశీ. -
Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారిలా.. ► నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు ఎలా ఉంటారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. రియల్ లైఫ్లో నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే. ► చెన్నైలో మూడు నాలుగేళ్లుగా వివిధ డిపార్ట్మెంట్స్లో రకరకాల పనులు చేస్తున్న నన్ను.. శివ నాగేశ్వరరావు ‘శివ’ సినిమా కోసం రాముగారి వద్ద (రామ్ గోపాల్ వర్మ) అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు. ‘శివ’ సమయంలో నేను, తేజ, శివ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేశాం. ఆ చిత్ర నిర్మాత నాగార్జునగారు అన్నపూర్ణ స్టూడియోలోనే మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు. తెలుగు ‘శివ’, హిందీ ‘శివ’ చిత్రాలకు దాదాపు రెండున్నరేళ్లు స్టూడియోలోనే ఉండి పనిచేశాం. అప్పుడు నా జీవితంలో దగ్గరగా చూసిన పెద్ద స్టార్ (అక్కినేని నాగేశ్వరరావు) కొడుకు, స్టార్ హీరో నాగార్జునగారు. ‘అంతం’ సినిమాకి బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాను. నా పనితీరును గమనించిన నాగార్జునగారు డైరెక్టర్ అవుతావా? ఏదైనా కథ రెడీ చేసుకో అన్నారు. ► ‘అంతం’ సినిమా చిత్రీకరణ ముగిసే సమయంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకి ఓ కథ చెప్పాను. ఇంట్రవెల్ వరకూ విని.. ‘ఈ కథ వద్దులే వంశీ.. రాము(ఆర్జీవీ) సినిమాలాగానే ఉంది ఇది. నీకు ఇండిపెండెంట్ కథ ఉన్నప్పుడు కచ్చితంగా చేద్దాం’ అన్నారు నాగార్జున. నా ‘గులాబీ’ సినిమా అయిపోయిన సమయంలో నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమా చేస్తున్నారు. అప్పటికే నేను రెడీ చేసుకున్న ‘అన్యాయం’ అనే ఓ కథ వినిపిస్తే, ‘బాగుంది.. కానీ ఇంకొంచెం కొత్తగా చేద్దాం’ అన్నారు. ► ‘గులాబీ’ విడుదలయ్యాక నేను, ‘నిధి’ ప్రసాద్, కెమెరామ్యాన్ కలసి వైజాగ్లో లొకేషన్స్ చూడటానికి వెళ్లాం. ఒకతను వచ్చి.. ‘గులాబి’ సినిమాని అచ్చం మీ బాస్లాగా (ఆర్జీవీ) బాగా తీశావ్ అన్నాడు. ‘గులాబి’ చిత్రానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదా? అని అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. వయలెంట్ సినిమా తీస్తే బాస్లా తీశావంటారు.. ఇప్పటి వరకూ బాస్ టచ్ చేయని ఫ్యామిలీ జానర్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని బాస్కి చెబితే ఓకే అన్నారు. నేను ఏ సినిమా చేసినా కథ బాస్కి(ఆర్జీవీ) చెప్పేవాణ్ణి.. ఆయనకు నచ్చితే ఓకే అంటారు.. ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే చెప్పేవారు. ► ఈ చిత్రంలో ‘నా మొగుడు రామ్ప్యారి’ అనే పాటని సుద్దాల అశోక్ తేజగారు బాగా రాశారు. ఆ ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు. ► నాకెప్పుడూ ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడం ఇష్టం. చలపతిరావుగారి ఫార్ములాయే జీవా, బ్రహ్మాజీలకు వాడాను. ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులే కాదు.. స్నేహితులు కూడా అనే కాన్సెప్ట్లో తీసుకున్నాను. చలపతి రావు, చంద్రమోహన్, గిరిబాబు, ఉత్తేజ్ పాత్రలు కూడా బాగా పండాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘సింధూరం’ కథ అనుకున్నా. రాఘవేంద్ర రావుగారు నాపై ఉన్న ఇష్టంతో మందలించారు. ‘ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరూ మనల్ని పట్టించుకోరు. మంచి జానర్ నుంచి ఎందుకు బయటికొస్తున్నావ్.. అందరి హీరోలతోనూ కుటుంబ కథా చిత్రాలు చెయ్’ అన్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ హిట్ అయ్యాక చాలా మంది హీరోలు కూడా కుటుంబం నేపథ్యంలో మాతో కూడా సినిమాలు చేయమని అడిగారు. అయితే నాగార్జునగారు మినహా వేరే హీరోలపై నాకు కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచన రాలేదు. చదవండి: ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు -
ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు: నాగార్జున
కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. శ్రీను, పండు పాత్రలు అలాంటివే. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున అక్కినేని –టబు చేసి పాత్రల పేర్లివి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘హోల్సమ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 4)కి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లతో స్పెషల్ టాక్. నాకు రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ► ఇది చూస్తుంటే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. రాము (రామ్గోపాల్ వర్మ) ప్రొడక్షన్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమాను రిలీజ్కు ముందే చూశాను.. ఆ సినిమా నచ్చి, నా అభిప్రాయాలను రామూతో షేర్ చేసుకున్నాను. ఈ దర్శకుడితో ఓ రొమాంటిక్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని రామూతో అన్నాను. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్.. అతనితో నువ్వు వర్క్ చేస్తే బాగానే ఉంటుందన్నాడు. పైగా నా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన కృష్ణవంశీతో నాకూ పరిచయం ఉంది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ మొదలైంది. కథ ముందే చెబితే పడే గొడవల్ని షూటింగ్కు ముందే పడదామని వంశీకి చెబితే ఓకే అన్నాడు. డైలాగ్స్, ప్లేస్మెంట్స్ ఇలా అన్నింటితో కథ చెప్పాడు. అయితే చివరి 10 నిమిషాలు మినహాయించి కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. ► కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తూ, నిర్మాతగా మారాను. అప్పటివరకు నాన్నగారు, అన్నయ్య సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు రిటైర్ అవ్వడం, పెద్దన్నయ్య సినిమాలు కాస్త తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను. ► అప్పట్లో శ్రీను, పండు (మహాలక్ష్మి) క్యారెక్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. బైక్ రేస్, సముద్రంలో పాట... ఇలా కొత్తగా చూపించాం. ‘గ్రీకువీరుడు..’ పాట వండర్ఫుల్. నాకు మ్యాచో అండ్ రొమాంటిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన పాట ఇది. సాధారణంగా రొమాంటిక్కు మ్యాచో ఇమేజ్ రాదు. రెండూ ఒకే టైమ్లో వర్కౌట్ కావు. కానీ కృష్ణవంశీకి అది సాధ్యం అయ్యింది. కృష్ణవంశీ తక్కువ రోజుల్లోనే షూట్ను కంప్లీట్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. ► సినిమాలోని బైక్ సీక్వెన్స్ను నేను డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దనే చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. పాటల్లో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్గా నిలిచాయి. ► క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం చూపించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘అన్నమయ్య’ షూటింగ్ను స్టార్ట్ చేశా. క్లాస్, మాస్ కన్నా అది ఇంకా డిఫరెంట్. ఇక్కడ టబుతో ‘కన్నుల్లో నీ రూపమే..’ వంటి పాటలు చేసి, ‘అన్నమయ్య’ షూట్లో పాల్గొనడం అంటే.. కాస్త లక్కీయే. తెలుగు ప్రేక్షకులు నన్ను రెండు విధాలుగా చూసేందుకు అంగీకరించారు. అలాగే దర్శకులు నాపై ఉంచిన నమ్మకం కూడా. ‘‘నిన్నే పెళ్లాడతా..’ వంటి రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాను... మీరు ‘అన్నమయ్య’ సినిమా చేయమంటున్నారు. వచ్చి ఒకసారి పాటలు చూడండి’ అని రాఘవేంద్రరావుగారితో అన్నాను. ‘నాకు వదిలెయ్’ అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాకు పనికి రాడు అని టాక్ కూడా వచ్చింది. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్లయింది. ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా నేను చేయగలనని నిరూపించుకోగలిగాను. నా కెరీర్లో ఓ బెంచ్ మార్క్: టబు నా జీవితంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఓ తీయని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. కృష్ణవంశీ మంచి తపన ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు కుటుంబసభ్యుల మధ్య పని చేసినట్లుగా, ఏదో పిక్నిక్కి వెళ్లినట్లుగా అనిపించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నా ఫ్యామిలీని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమాతో పాటు పాటలు కూడా హిట్టే. తన తొలి సినిమాయే అయినా సందీప్ చౌతా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన దర్శకుల్లో వంశీ (కృష్ణవంశీ) మంచి ప్రతిభాశాలి. ∙ఈ చిత్రంలో నాగార్జున చేసిన శ్రీను క్యారెక్టర్ ఫన్నీ, లవ్లీ అండ్ ఎంటర్టైనింగ్. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ సినిమాలో పండు అని పిలుస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్రీను, పండుల మధ్య కెమిస్ట్రీని వంశీ చాలా సహజంగా తీశారు. ఇలాంటి సినిమాలను రీ క్రియేట్ చేయడం కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్... నా కెరీర్లో కూడా. చదవండి: ఓటీటీ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ.. -
మహేష్ కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ సినిమా
హీరో మహేష్బాబు కెరియర్లోనే తొలి బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో #20YearsForMurari హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాతోనే నటి సోనాలి బింద్రే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం..ఇలా ఈ చిత్రంలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాని ఫలితమే బాక్స్ఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురిపించింది. మురారి విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు.. కృస్ణవంశీ ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించాడు. నిజానికి మురారి కథ నిజజీవిత సంఘనల ఆధారంగా తీశారు. ఆంధ్రప్రదేశ్లో ఓ పేరున్న జమీందార్ బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అమ్మవారి ఆగ్రహానికి గురై అతడు చనిపోతాడు. అంతేగాక తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా మరణిస్తారని భావించిన నేపథ్యంలో ఆయన చనిపోతాడా లేదా? ఆ శాపం నుంచి ఎలాంటి విముక్తి పొందుతారు అన్న అంశాలకు ఆధ్యాత్మికత జోడించి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రక్తికట్టించడంలో కృష్ణవంశీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ముందే మహేష్ 3 సినిమాల్లో నటించినా మురారీ మాత్రం ఆయన కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు 23 కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్గా నిలిచిన మురారి సినిమా తన ఆల్ టైం ఫెవరెట్ సినిమా అని మహేష్ భార్య నమ్రత అన్నారు. మురారి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమన్నారు. ఇక మురారి సినిమా పరంగానే కాకుండా, మ్యూజికల్గానూ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్. ముఖ్యంగా 'అలనాటి రాముచంద్రుడి' ....అనే పాట ఇప్పటికీ ప్రతి తెలుగింటి పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్’..!
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్ను తెలుగులో రీమేక్ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్ రాజ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
సింగర్గా మారిన మరో యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తనీష్ తరువాత హీరోగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్లు రాకపోవటంతో ఇటీవల నక్షత్రం సినిమాతో విలన్గా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా తనీష్కు సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ దిమ్మరి అనే సినిమాలో నటిస్తున్నాడు తనీష్. ఇప్పటికే హీరో నుంచి విలన్ గా మారిన తనీష్ ఈ సినిమాతో సింగర్ గా మారుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకుడు. నవీన క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
రానా హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్
వరుసగా ఆసక్తికర సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. మరోక్రేజీ ప్రాజెక్ట్కు సైన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమాలలో నటిస్తున్న రానా ఓ టాలీవుడ్ సీనియర్ దర్శకుడితో సినిమా చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రానా హీరోగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుస పరాజయాల తరువాత తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణవంశీ, కొత్త సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు మాధవన్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
'నక్షత్రం' మూవీ రివ్యూ
టైటిల్ : నక్షత్రం జానర్ : యాక్షన్ మూవీ తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర దర్శకత్వం : కృష్ణవంశీ నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు క్రియేటివ్ డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న కృష్ణవంశీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోతున్నాడు హీరో సందీప్ కిషన్. మెగా హీరోగా మంచి ఫాంలో కనిపించిన సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాల ఎంపికలో తప్పటడుగులతో వరుస ఫ్లాప్ లు చూశాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే నక్షత్రం. మరి నక్షత్రం వీరి కెరీర్ లను గాడిలో పెడుతుందా..? కథ : తాతల కాలం నుంచి పోలీసు కుటుంబం కావటంతో తాను కూడా పోలీస్ కావాలన్న ఆశయంతో కష్టపడుతుంటాడు రామారావు (సందీప్ కిషన్). పోలీసులను ఒక్కమాట అన్నా సహించలేని రామారావు.. అనుకోకుండా ఓ సారి పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ (తనీష్)తో గొడవపడతాడు. పోలీసులను కొట్టాడన్న కోపంతో రాహుల్ తో పాటు అతని స్నేహితుల మీద చేయిచేసుకుంటాడు. దీంతో రామారావు మీద పగ పట్టిన రాహుల్, అతనికి పోలీసు ఉద్యోగం రాకుండా చేస్తాడు. ఇక తనకు పోలీస్ ఉద్యోగం రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ న్యాయాన్ని కాపాడటానికే పోలీసే కానవసరం లేదు.. సమాజం పట్ట బాధ్యత ఉంటే చాలని.. ఉద్యోగం లేకపోయినా.. పోలీసు డ్యూటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా డ్యూటీ చేస్తుండగా క్రిమినల్ ముఖ్తార్ కారులో బాంబులు తీసుకెళ్తూ రామారావుకు దొరుకుతాడు. రామారావును నిజం పోలీసు అనుకున్న ముఖ్తార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో సహా బాంబులు పేలిపోతాయి. ముఖ్తార్ ను కాపాడిన రామారావు వాణ్ని తన ఇంట్లో దాచిపెడతాడు. అయితే ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్ కి అలెగ్జాండర్ కి సంబంధం ఏంటి..? అలెగ్జాండర్ ఏమయ్యాడు.? ఈ గొడవల నుంచి రామారావు ఎలా బయట పడ్డాడు..? అనుకున్నట్టుగా రామారావుకి పోలీసు ఉద్యోగం వచ్చిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎంతో మంది నటులకు ఈ నక్షత్రం కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా. అందుకు తగ్గట్టుగా ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. ముఖ్యంగా హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో యువ నటుడు తనీష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తనదైన స్టైలో మెప్పించే ప్రయత్నం చేశాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ అలరించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తన కెరీర్ కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మరోసారి నిరాశపరిచాడు. తన గత చిత్రాల మాదిరిగా క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలిపి చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. క్లారిటీ లేని క్యారెక్టరైజేన్స్, సీన్స్ తో ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి ఎంటర్ అయినా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకున్నా.. కృష్ణవంశీ గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే నిరాశ తప్పదు. పాటలు పరవాలేదనిపించినా.. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన మెయిన్ స్టోరి మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ, తాజాగా నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేయాలని భావించినా.. అదే రోజు మరో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా రిలీజ్ అవుతుండటంతో ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 28న నక్షత్రం రిలీజ్ అంటూ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న సాయి, సందీప్, కృష్ణ వంశీల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
‘నక్షత్రం’ వర్కింగ్ స్టిల్స్
-
సక్సెస్ అంటే నక్షత్రంలాంటి సినిమా తీయడమే!
దర్శకుడు కృష్ణవంశీ ‘‘ నా సినిమాలు ప్రేక్షకుల్లో చెడు ఆలోచనలను ప్రేరేపించకూడదు. ఒకవేళ అలాంటి సినిమాలు సక్సెస్ అయినా.. ఆ తరహా కాన్సెప్ట్ సినిమాలను నేను తీయను. నా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒకణ్ణి కొట్టాలనిగానీ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనగానీ రాకూడదు. మంచి ఆలోచన కలగాలి’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా సాయిధరమ్తేజ్, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్రాజ్ ముఖ్యపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నక్షత్రం’. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పై ఎస్.వేణుగోపాల్, కె.శ్రీనివాసులు, సజ్జు నిర్మించారు. ఆదివారం హీరో సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఈ నెల చివర్లో సినిమా విడుదల కానుంది. కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘రిలీజియన్ వల్ల క్రియేట్ అయ్యే ఒక సమస్యపై ఓ సామాన్యుని పోరాటమే ‘నక్షత్రం’. సినిమా విడుదలలో జాప్యం జరగడానికి కారణం ప్రధాని మోదీ. నోట్ల రద్దు ప్రభావంతో మా సినిమాను అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. నేను నాలాగే సినిమాలు తీసి హిట్ సాధించాలనుకుంటాను. రిస్క్ లేకుండా సినిమాలు తీయడం అంటే ఏంటో నాకు తెలీదు. నాకు సినిమాలు ఇలాగే తీయడం తెలుసు. విజయాల కోసం, అవార్డుల కోసం సినిమాలు తీయను. అసలు ఆ ఆలోచనే నాకు ఉండదు. సక్సెస్కు విభిన్న రకాల నిర్వచనాలు ఉన్నాయి. నా దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు కాదు. ‘నక్షత్రం’ లాంటి సినిమాను తీయగలగడం సక్సెస్ అనుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారితో సినిమా తీయాలనేది ఓ పదేళ్ళ క్రితం నాటి కల’’ అనారు నిర్మాత వేణు. సందీప్కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను హీరో అవ్వడం ఒకటి. కృష్ణవంశీగారి సినిమాలో హీరో అవ్వడం ఒకటి’’ అన్నారు. ‘‘ఒక స్టూడెంట్లా ఈ చిత్రం సెట్స్కి వచ్చి ఒక టీచర్ దగ్గర ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకున్నాను’’ అని సాయిధరమ్ అన్నారు. రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ఛాయాగ్రాహకుడు శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కట్ చేస్తే... టచ్ చేసి చూడు
‘కంచె’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’... చేసింది మూడు చిత్రాలే అయినా అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మాస్ మహారాజ రవితేజ సరసన నటించే బంపర్ ఆఫర్ వరించిందని ఫిల్మ్నగర్ టాక్. విక్రమ్ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మంచనున్న ‘టచ్ చేసి చూడు’. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా రాశీఖన్నాను ఎంపిక చేయగా, రెండో కథానాయికగా ప్రగ్యాను తీసుకున్నారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్గా లావణ్యా త్రిపాఠి పేరు వినిపించినా.. కట్ చేస్తే.. ఫైనల్గా ఆ అవకాశం ప్రగ్యాకు దక్కిందని సమాచారం. -
తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?
తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన బాలకృష్ణ ఘనవిజయం సాధించాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ప్రతిష్టాత్మక చిత్రం తరువాత చేయబోయే సినిమా కావటంతో అదే జోరును కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే రెండు, మూడు సినిమాలను పరిశీలనలో పెట్టాడు. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంప్రదిస్తున్నారు. ఆయన అంగీకరిస్తేనే రైతు సినిమా ఉంటుందని లేని పక్షంలో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడు. అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసే రవికుమార్, తెలుగులోనూ ఒకటి, రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. పక్కా కమర్షియల్ సినిమాలను అందించటంలో స్పెషలిస్ట్గా పేరున్న రవికుమార్ బాలయ్య బాడీలాంగ్వేజ్కు తగ్గ కథ రెడీ చేశాడట. రైతు సినిమా లేని పక్షంలో రవికుమార్ సినిమానే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. -
అమ్మడికి అవకాశాలే లేవట..!
ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్ స్టార్టింగ్లో కమర్షియల్ సక్సెస్లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయింది. కెరీర్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు ఉన్నా.. వరుస అవకాశాలు మాత్రం పలకరించటం లేదు. తమిళ్లో కాస్త పరవాలేదని పించినా.. టాలీవుడ్లో మాత్రం అమ్మడు ఆశించిన స్ధాయిలో రాణించటం లేదు. జ్యో అచ్యుతానంద తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు టాలీవుడ్లో జోరు చూపిస్తుంటే, రెజీనా మాత్రం కోలీవుడ్ ఆఫర్లతో సరిపెట్టుకుంటోంది. అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో చేస్తున్న సినిమా రెజీనాకు కెరీర్ మీద ఆశలు కల్పిస్తోంది. -
శత్రువుకే ఎదురు నిలిచిన దేశం మనది!
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం ‘ఖడ్గం’. శక్తి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘మేమే ఇండియన్స్..’ పాటతత్వం గురించి కథ-మాటల రచయిత ‘డైమండ్’ రత్నబాబు మాటల్లో.... పల్లవి: సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం (2) నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజూ తన్నుకు చస్తాం (2) నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం అరె ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ కర్మం అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చిన.. చెరగని నవ్వుల ఇంద్రధనుస్సులం మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. అరె మేమే ఇండియన్స్ (2) మన భారతీయుల్లో ప్రతి ఒక్కరూ హరిశ్చంద్రుల్లా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ, అవసరాలు మనతో అబద్ధాలు ఆడిస్తాయి. సర్వమత సమ్మేళనం.. మన భారతీయత. కానీ, ఏవేవో చిన్న కారణాలతో నిత్యం గొడవ పడుతుంటాం. ‘నమ్మితె ప్రాణాలైనా ఇస్తాం..’ ఇది మన మనస్తత్వాలకు దగ్గరగా ఉంటుంది. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిషర్లను నమ్మడం వలనే బానిసలుగా చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించుకున్నాం. కష్టం వస్తే పెగ్గులో కన్నీళ్లు మిక్స్ చేసుకుని మగాళ్లు, సీరియల్స్ చూస్తూ అందులో వాళ్లు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారని మహిళలు లైట్ తీసుకుంటారు. ఆకాశంలో ఇంద్రధనుస్సులా చిరునవ్వుతో తిరిగేస్తుంటాం. సగం తెలియకుండానే మన జీవితం అయిపోతుంది. తెలుసుకోవడానికి ఇంకో సగం జీవితం పూర్తయిపోతుంది. మొత్తం మీద హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే, ప్రపంచ దేశాలు మన భారతీయుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. స్నేహం, నమ్మకం, ముక్కుసూటిగా మాట్లాడడం, కష్టం, సుఖం.. అన్నిటిలో మనలా బతకాలనుకుంటున్నారు. చరణం1: వంద నోటు జేబులో ఉంటె నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచు పోరి ఎదురుగ వస్తే పళ్లికిలిస్తాం ప్రేమా కావాలంటాం.. పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్లైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డ్యాన్సులు చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి ఓటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకు సీటు అప్పచెప్పేస్తాం రూలు ఉంది.. రాంగు ఉంది.. (2) తప్పుకు తిరిగే లౌక్యం ఉంది ॥ఇండియన్స్..॥ ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఈ చరణంలో భావం కనెక్ట్ అవుతుంది. ప్రతినెలా జీతం వచ్చిన మొదటి ఐదు రోజులు షాపింగ్, నచ్చిన ఫుడ్, షికార్లు, సినిమాలు.. రాజభోగమే. చివరి ఐదు రోజుల్లో అప్పులు. ఏవేవో ఆశలు, కలలు.. ప్రేమ, పైసలు రెండూ కావాలి. పరిస్థితులను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాం. కొన్ని సందర్భాల్లో కుల, రాజకీయ, ఆర్థిక ప్రభావంతో మంచి దొంగను ఎన్నుకుంటామనే విషయాన్ని ఇందులో చెప్పాలనుకున్నారు. ఈ చరణం తర్వాత ‘వందేమాతరం..’ అంటూ ఓ ఆలాపన ఉంటుంది. ఇప్పటికీ, ‘వందేమాతరం..’ పాడితే స్కూల్లో ఫస్ట్ బెల్, ‘జన గణ మణ..’ పాడితే లాస్ట్ బెల్ కొడతారని కొందరు విద్యార్థులు భ్రమలో ఉన్నారు. అలా కాకుండా వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించమని ఉపాధ్యాయులను కోరుతున్నాను. చరణం2: కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసూ దేవుడికెందుకు జెండా.. కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటు పిడికిలెత్తి వేయ్ ఒట్టు కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మె ఉంది.. ధైర్యం ఉంది.. (2) తలవంచని తెగపొగరే ఉంది ॥మేమే ఇండియన్స్..॥ దేశ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చరణమిది. ఇండియా-పాక్ సరిహద్దుల్లో ఇటీవల 18 మంది జవాన్లు అమరవీరులయ్యారు. దేశ ప్రజల కోసం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మనమంతా ఎవరి పనులు వారు చేసుకోవడానికి కారణం మన ఆర్మీ. సరిహద్దుల్లో మనకోసం పోరాడుతున్న సైనికులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మనం అందరం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి కారణం వాళ్లు శత్రువుల గుండెల్లో నిద్రపోవడమే. చిన్నప్పుడు స్కూల్లో భవిష్యత్తులో మీరు ఏమవుతారని స్టూడెంట్స్ని టీచర్ అడిగితే... డాక్టర్, టీచర్, ఇంజినీర్.. కాకుండా నేను ఆర్మీకి వెళ్తాననేలా పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. మతాల పేరుతో పార్టీల జెండాలను మోయకుండా మూడు రంగుల మువ్వన్నెల జెండా మోసేలా చేయాలి. నాకున్న ఎమోషన్కి ఆర్మీకి వెళ్లాలనుకున్నా. మా తల్లిదండ్రులు భయపడ్డారు. రచయిత కావాలనే నాన్నగారి కోరికను నేను నెరవేర్చాను. నాకు ఇద్దరు కుమారులు. వారిలో ఎవరో ఒకరు నా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు తండ్రిగా కంటే భారతీయుడిగా గర్విస్తాను. ఇంటర్వ్యూ: సత్య పులగం -
ఇంకా ఉన్నాయి!
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్ను విజయదశమి సందర్భంగా హీరో రామ్చరణ్ విడుదల చేశారు. ఓ హ్యాండ్.. ఆ హ్యాండ్కి పోలీస్ బ్యాండ్.. లుక్తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కృష్ణవంశీ.. ఇలాంటి లుక్స్ ఇంకా ఉన్నాయంటున్నారు. ప్రతిరోజూ ఒక్కో లుక్ చొప్పున మరో తొమ్మిది రోజుల పాటు డిఫరెంట్ లుక్స్ను రామ్చరణ్ విడుదల చేయనున్నారు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ
గతంలో ప్రకటించినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నక్షత్రం చిత్ర టైటిల్ లోగో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్, తన సెట్స్ నుంచి ఈ సినిమా లోగోను రిలీజ్ చేశారు. నక్షత్రం చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో గతంలో రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాను తెరకెక్కించాడు. ఆ స్నేహంతోనే చెర్రీ కృష్ణవంశీ సినిమా లుక్స్ను రిలీజ్ చేసేందుకు అంగీకరించాడు. సందీప్ కిషన్, రెజీనాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పది లుక్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన కృష్ణవంశీ అన్ని లుక్స్ను రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను శ్రీనివాసులు, సజ్జు, వేణుగోపాల్ లు నిర్మిస్తున్నారు. Here is the First Look of #Nakshatram Movie launched by the dashing Mega Power Star #RamCharan! #MoreComingUp #StayTuned@sundeepkishan pic.twitter.com/PQM5y3wxSK— Nakshatram (@Nakshatrammovie) 8 October 2016 -
అబద్ధం ఇవాళ్టి జీవన విధానం!
‘‘మహాత్మా గాంధీ అనగానే నాకు ఒకటి కాదు, ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. ‘సత్యశోధన’లో ఆయన జీవితంలో చేసిన ప్రయోగాలు, ఆ సంఘటనలు, ఆయన జీవితం ఇచ్చిన సందేశం... ఇలా ఎన్నెన్నో! సత్య శోధనలో, నిజాయతీగా బతకాలనే ప్రయత్నంలో ప్రతి రోజూ కనీసం పాతికసార్లయినా మన వ్యక్తిత్వం పరీక్షకు గురవుతూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, సినిమా - ఇలా ఏ రంగమైనా, ఏం చేస్తున్నా ఇది తప్పదు. నేనూ అందుకు మినహాయింపేమీ కాదు. అలాంటి సంద ర్భంలో మన ప్రవర్తన చూసి కొందరు ఎదురై, నాలుగు అక్షింతలు వేయడమూ ఉంటుంది. అందుకే, సత్యశోధనలో ఒక సంఘటన, సందర్భం అని కాదు. కొన్ని గంటలు మాట్లాడగల అంశాలున్నాయి. మహాత్ముడి జీవితం ఇవాళ్టికీ రిలవెంటా అంటే, కచ్చితంగా! కాకపోతే, అది మనుషులకే రిలవెంట్! నేనీ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు కానీ... ఇవాళ మన దేశంలో, మన మధ్య ఇవాళ అసలు సిసలు మనుషులు ఎంతమంది ఉన్నారంటారు! ఎటు చూసినా నాకు జంతువులే ఎక్కువ కనబడుతున్నాయి. ఇవాళ మనలో నీతి, నిజాయతీ, చదువు, విజ్ఞానం, పని చేసే నైపుణ్యం, దేశభక్తి, క్రమశిక్షణ లాంటివి ఉన్నా, లేకపోయినా - మనందరికీ పుష్కలంగా ఉన్నవి మాత్రం మనోభావాలు! మనకున్న పెద్ద ఆస్తి అది! ఎవరు ఏమన్నా, ఏం చేసినా అవి ఎప్పటికప్పుడు దెబ్బ తినేస్తుంటాయి. అదేమిటంటూ మనం మాట్లాడితే, ఎంత ఎక్కువ మాట్లాడితే, అంత ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు. అందుకే, మనందరికీ ఇవాళ అబద్ధమే ఒక వ్యక్తిత్వం అయిపోయింది. హిందూ ధర్మం లాగా అది ఒక జీవన విధానంగా మారిపోయింది. ఇలాంటి పెయిన్తోనే, నాలో ఉన్న ఈ భావాలన్నీ చెప్పడం కోసమే ‘మహాత్మ’ సినిమా తీశాను. ఆ సినిమా చూసి ఎంతమంది ఆలోచనలో పడ్డారో కానీ, నేను, నా నిర్మాత అయితే ఆర్థికంగా మాత్రం నష్టపడ్డాం! కాకపోతే, మళ్ళీ మహాత్ముడి భావాలు కనీసం కొందరికైనా తెలుస్తోంది కదా అన్నదే సంతృప్తి!’’ - కృష్ణవంశీ, ప్రముఖ సినీ దర్శకుడు -
మెగా హీరో బిజీ అవుతున్నాడు
తిక్క సినిమా రిజల్ట్తో నిరాశపరిచిన మెగా హీరో సాయిధరమ్ తేజ్, తిరిగి షూటింగ్లకు రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే లుక్లో కనిపిస్తున్న సాయి, రాబోయే సినిమాల్లో కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇన్నాళ్లు మాస్ లుక్లో కనిపించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాలో స్టైలిష్గా కనిపించేందుకు స్పెషల్గా మేకోవర్ అవుతున్నాడు. ముందుగా ఈ నెల 19 నుంచి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం షూటింగ్లో పాల్గొననున్నాడు సాయి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అతిథి పాత్రలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఈ నెల 25 నుంచి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాను మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్గా నటిస్తున్న సాయి స్టైలిష్ లుక్లో అలరించనున్నాడు. -
నక్షత్రానికి చరణ్ సాయం
రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే లాంటి డీసెంట్ హిట్ తెరకెక్కించిన కృష్ణవంశీ, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా చరణ్ సాయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. తనను ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువ చేసిన కృష్ణ వంశీ కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు చెర్రీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నక్షత్రం సినిమాకు సంబందించిన పది లుక్స్ను రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నక్షత్రం చిత్ర అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ప్రకటించారు. అయితే ఈ లుక్స్ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్గా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. -
కృష్ణవంశీకి 'చిరు' కాల్
మెగాస్టార్ చిరంజీవి.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సర్ప్రైజ్ కాల్ చేశారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. కృష్ణవంశీ తాజా చిత్రం 'నక్షత్రం'లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు తెలుసుకునేందుకే చిరు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. చిత్ర కథ, తేజు పాత్ర గురించి అడిగారట మెగాస్టార్. కథ విన్న తర్వాత బావుందంటూ మెచ్చుకున్నారట. స్వయంగా చిరంజీవి కాల్ చేయడం, కథ తెలుసుకుని బావుందంటూ కితాబునివ్వడంతో కృష్ణవంశీ బోలెడంత ఆనందంలో మునిగిపోయారు. కాగా సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమాకు 'ఖైదీ నెంబరు 150' అనే టైటిల్ను కన్ఫామ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. -
'నక్షత్రం'లో మరో స్టార్
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నక్షత్రం. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు సాయి. తాజాగా ఈ నక్షత్రానికి మరో మెరుపు యాడ్ అయ్యింది. జాతీయ అవార్డ్ సాధించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రగ్యా జైస్వాల్ కూడా నక్షత్రం సినిమాలో నటిస్తోంది. సందీప్ కిషన్కు జోడిగా రెజీనా నటిస్తుండగా ప్రగ్యా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. అంతేకాదు ఈ సినిమాలో సందీప్తో పోరాడే ఓ భారీ యాక్షన్ సీన్లోనూ నటిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఈ సీన్స్ కోసం కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. మరి ఇంత భారీగా రూపొందుతున్న నక్షత్రం అయినా కృష్ణవంశీకి గత వైభవాన్ని తీసుకువస్తుందేమో చూడాలి. -
'నక్షత్రం' విలన్ గా తనీష్?
యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టు 'నక్షత్రం'. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు రోజు రోజుకి ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా గెస్ట్ రోల్లో నటిస్తున్నారని ఇప్పటికే తెలిపిన కృష్ణవంశీ.. విలన్ పాత్ర చిత్రీకరణలో కూడా వైవిధ్యతను చూపించే ప్రయత్నంలో ఉన్నారు. కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్గా కనిపించే అవకాశాలున్నాయట.అయితే అది ఫుల్ లెన్త్ పాత్రా లేక గెస్ట్ అప్పీరియన్స్గానా అనే విషయం కృష్ణవంశీనే తేల్చాల్సి ఉంది. కాజల్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో 'నక్షత్రం' సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో కృష్ణవంశీ తిరిగి సక్సెస్ ట్రాక్ అందుకుంటారని భావిస్తున్నారు. -
మీ గ్రాఫ్ పడిందా?
నాట్ ఫర్ సేల్ అమ్మకం.. అమ్మకం.. అమ్మకం.. సినిమా అంటే... కథ అమ్మాలి. స్క్రీన్ప్లే అమ్మాలి... మాటలు అమ్మాలి. ఫీల్ అమ్మాలి... టేకింగ్ అమ్మాలి. అయ్యో.. మర్చేపోయాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టికెట్లు అమ్మాలి. ‘‘ఇన్ని అమ్మే క్రమంలో డెరైక్టర్ తన ఉనికిని అమ్ముకోవాలా?’’ అని అడుగుతున్నారు కృష్ణవంశీ. ‘గులాబి’ రిలీజై ఈ ఏడాదికి 20 ఏళ్లయింది. ఇప్పుడు చేస్తున్న ‘నక్షత్రం’తో కలిపి మీవి 20 సినిమాలే. లెక్క తక్కువ..? సినిమా నాకు ఉద్యోగం కాదు.. జీవితం కూడా కాదు. నేను సినిమా తీయాలంటే మంచి పాయింట్ దొరకాలి. దొరికేంతవరకూ వెయిట్ చేస్తా. ఆ సినిమాకి ఎంత టైమ్ పడితే అంత తీసుకుంటా. ఎక్కువ డబ్బు సంపాదించాలని, వంద సినిమాలు తీసేయాలనే టార్గెట్ లేదు. చేసే సినిమా నాకు ఆత్మసంతృప్తిని అయినా ఇవ్వాలి లేదా వందలో పది శాతం ప్రేక్షకుల్లో ఒక ఆలోచన, మంచి భావం రేకెత్తించే విధంగా ఉండాలి. ఆత్మసంతృప్తి సరే.. ఆర్థిక సంతృప్తి..? దానికి లిమిట్ ఏంటి? డబ్బు కోసమే అయితే మనసుకి నచ్చని సినిమాలు తీయాల్సొస్తుంది. నిర్మాత కోసం కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. వాటితో సినిమాలు తీయాలంటే నాకు మనస్కరించదు. తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా. మనిషిని సమూలంగా చంపేసే వృత్తి వ్యభిచారం అని నా ఫీలింగ్. డబ్బు కోసం చూసుకుంటే ‘సిందూరం’, ‘అంతఃపురం’, ‘ఖడ్గం’ లాంటి సినిమాలొస్తాయా? నేనెవర్నీ తక్కువ చేయడంలేదు. అందరికంటే నేనే గొప్ప అనడంలేదు. అందరూ ఒక రూట్లో వెళితే ఈ రూట్లో ఎవరు వెళతారు? సెపరేట్ రూట్లో వెళ్లడంవల్ల, నిక్కచ్చిగా ఉండటంవల్లే కొంతమంది నిర్మాతలు మీతో సినిమాలంటే భయపడతారేమో? నేనేం కొట్టి చంపేయను కదా. ఏదైనా స్ట్రైట్గా, ఓపెన్గా మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ కావాలి. దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి గట్స్ లేదా నేను చేస్తున్నది కరెక్ట్ అని నమ్మగలిగే మూర్ఖత్వమైనా ఉండాలి. ‘నేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అది దేవుడైనా సరే’ అని ‘మురారి’లో డైలాగ్ చెప్పించాను. దాన్ని నమ్మాను కాబట్టే ఆ డైలాగ్ రాశాను. అలాంటి నేచర్ ఉన్నప్పుడు నిర్మాతలు భయపడతారనో, విమర్శిస్తారనో నా ఒరిజినాల్టీని చంపేసుకుని, నక్క వినయాలు నటిస్తూ, మాయ చేస్తే అప్పుడు నాకోసం నేను బతికినట్లవ్వదు. ఇతరుల కోసం బతకలేను. మరి... మిమ్మల్ని మాయ చేసిన నిర్మాతలు ఉన్నారా? కొందరు మోసం చేశారు. వాళ్లకు డబ్బులొచ్చినా రాలేద ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు. ఒకడు తన నాలుగైదేళ్ల కూతురు మీద ఒట్టేసి సినిమా చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 కోట్లకు టెండర్ పెట్టాడు. అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ, నా సెంటిమెంట్కి కమిట్ అయ్యాను. నేను రోడ్డు మీద పడలేదు. వాడు బాగుపడి అంబానీ అవ్వలేదు. నాలుగు కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. సరిగ్గా ఉండుంటే ఇంకో మంచి సినిమా చేసేవాణ్ణి. జన్మలో ఇక వాడితో సినిమా చేయను. స్టార్ డెరైక్టర్లు దాదాపు స్టార్ హీరోలతోనే సినిమా తీస్తారు.. ఇప్పుడు మీరు సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నారు.. మీ గ్రాఫ్ పడిందా? సందీప్ది పెరిగిందా? నాకు స్టార్ అయినా నాన్-స్టార్ అయినా ఒకటే. కథకు సూటయ్యేవాళ్లతోనే తీశాను. పేర్లెందుకు కాని కథకు సూట్ కాని వాళ్లతోనూ చేశాను. కానీ, అది చేస్తున్నప్పుడు ‘మనకిది కరెక్ట్ కాదు’ అనిపించింది. నేను రామ్చరణ్తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా? పెరిగానా? తగ్గానా? అని తెలియడంలేదు. నా వరకు నేను ప్రొఫెషనల్గా సక్సెస్ కావడం అంటే ‘చందమామ’, ‘నక్షత్రం’ లాంటి సినిమాలు తీయగలగడం. 60 కోట్లతోనూ సినిమా తీయగలను. 15 కోట్లతోనూ తీస్తాను. 85 లక్షల్లో ‘డేంజర్’ చేశాను. నాకు సినిమా ఇంపార్టెంట్. దానికి పెట్టే పెట్టుబడి, వచ్చే బజ్ నాకు ముఖ్యం కాదు. ఏది పడితే అది కాకుండా ఎలాంటి సినిమా తీస్తున్నామనే విషయంలో దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి కదా? కచ్చితంగా. నాకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, విజిల్స్ ముఖ్యం కాదు. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడి మైండ్లో ఆ సినిమా ఎలా తిరుగుతుందన్నదే ముఖ్యం. నా హీరో రౌడీయో, పోరంబోకో, సిస్టమ్ని లెక్క చేయనివాడో, జేబుదొంగో, హంతకుడో ఉండడు. నా 20 సినిమాల్లో ఒక్క ‘రాఖీ’ సినిమాలోనే హీరో హత్య చేస్తాడు. దానికి రీజన్ ఉంటుంది. ఒకళ్లు మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు మంచి చెప్పాలి. అందుకే ఎంజీఆర్గారు, రజనీకాంత్, కమల్హాసన్ తమ సినిమాల్లో పది మంచి మాటలైనా చెప్పాలని ఇన్సిస్ట్ చేస్తారట. మనం ఎందుకు దాన్ని ఆచరించడంలేదు? నావి ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. కానీ, డెరైక్టర్గా నా టాపిక్ ఫెయిల్ కాలేదు. ఎందుకంటే నేనెప్పుడూ బ్యాడ్ ఫిల్మ్ తీయలేదు. లెక్చరర్స్, ఫాదర్స్, మదర్స్ మీద సెటైర్లు వేస్తూ సినిమాలు తీయలేదు. నా బ్రదర్స్ కోసమో, సిస్టర్ కోసమో, నా కొడుకు కోసమో, బంధువుల కోసమో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలిగా. నాకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. వాణ్ణి వెళ్లి, లెక్చరర్ని చంపేయమని చెప్పలేను కదా. అందుకే చూపించను. బౌండ్ స్క్రిప్ట్తో కాకుండా లొకేషన్లో సీన్లు వండుతారట...? నాతో సినిమా చేసిన హీరోనో, ప్రొడ్యూసరో, టెక్నీషియనో నాతో నేరుగా ఈ మాట అంటే సమాధానం చెబుతా. వాళ్లెవరూ కాదు.. ఎవరో అన్నారనుకుందాం. వాడికి ఏం తెలుసని అంటాడు? బౌండ్ స్క్రిప్ట్తో ఎన్ని సినిమాలు తీస్తున్నారో తెలుసా? అసలు బౌండ్ స్క్రిప్ట్తో తీసిన సినిమాల్లో ఎన్ని ఆడాయో తెలుసా? బౌండ్ స్క్రిప్ట్ అంటే వాడికి తెలుసా? ఆ మాట్లాడేవాడి తాలూకు అర్హత ఏంటి? వాడెవడో తెలిస్తే వాడికి తగ్గట్టుగా సమాధానం చెబుతా. బౌండ్ స్క్రిప్ట్తో తీశారా? అక్కడికక్కడ వండి తీశారా? అనేది ప్రేక్షకుడికి అనవసరం. ప్రేక్షకుడికీ, ఫిల్మ్ మేకర్స్కి ఉండే అనుబంధం టికెట్. వాళ్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవడు పడితే వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి మీదైనా రాళ్లు వేయడం ఈజీ. వాళ్లకి వేరే పనిలేదు. ఏసుక్రీస్తుని, గాంధీ మహాత్ముడిని చంపేసిన ప్రపంచం ఇది. మహాశక్తిని ఆపడానికి ఒక్క పిచ్చోడు చాలు. అలాంటి కోట్లాదిమంది పిచ్చోళ్లు ఉన్న దేశం మనది. నన్ను మాట అనడం వల్ల సంతృప్తి దక్కుతోందంటే నో అబ్జక్షన్. మీతో పనిచేయడానికి మీ డెరైక్షన్ డిపార్ట్మెంట్, ఇతర టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్.. ఎవరు బాగా ఇబ్బంది పడతారు? నాకు తెలిసి నాతో పని చేస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగని చెప్తారు కూడా. నిజమా? అబద్దమా? నాకు తెలీదు. ఛీఫ్ టెక్నీషియన్ ఆఫ్ ది ఫిల్మ్ కాబట్టి.. నా కథ, ఊహలకు తగ్గట్టు పని చేయమని చెప్తాను. ఉదాహరణకు.. ‘మురారి’లో పెళ్లి పాట చివరిది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా చివరి పాట మాంచి మాస్ బీట్ వస్తోంది. హీరో, నిర్మాత, యూనిట్ అందరూ అలాంటి సాంగ్ కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు. దాంతో ‘వేరే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్తో మీకు కావలసిన పాట తీసుకోండి. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి. ఆ సాంగ్ మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తాను. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా.. నాకు ఓకే. నో అబ్జక్షన్ లెటర్ కూడా ఇస్తాను’ అన్నా. ఇంతవరకూ చేసిన తర్వాత అలా ఎలా కుదురుతుందన్నారు. ‘అలాగైతే ఈ పాటే ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆ పాట మన పెళ్లిళ్ల స్ట్రక్చర్ మార్చేసింది. ఆ పాట పెట్టాలనే నా పట్టుదలను పొగ రుబోతుతనం అంటామా? నమ్మకం అంటామా? ఇతరుల మాట వినకుండా, మీరు నమ్మి తీసినవాటిలో ఫెయిలైనవి ఉండే ఉంటాయ్. అప్పుడు మీ ఫీలింగ్? ‘నువ్ చేస్తున్నది పూర్తిగా తప్పు’ అని నేను నిజంగా గౌరవించే వ్యక్తులు ‘శ్రీఆంజనేయం’ తీసేటప్పుడు చెప్పారు. కొందరు ఈ లోకంలో కూడా లేరు. ఆ రోజున్న నా మానసిక స్థితికి ఎక్కలేదు. నేనే కరెక్ట్ అనుకున్నాను. నిర్మాతను కూడా నేనే కావడంతో కష్టనష్టాలు భరిద్దామనుకున్నాను. ‘మీరు చెప్పినట్టు చేసుంటే బాగుండేదేమో’ అని విడుదల తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను. నేను తప్పు ఒప్పుకోవడానికి భయపడను. మీ మనస్తత్వాన్ని మార్చుకోమని రమ్యగారు అనలేదా? యాజ్ ఎ వైఫ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.. ‘ఎందుకిలా? కరెక్ట్ కాదు’ అంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ‘సరేలే.. ఏం చెప్పి నిన్ను మార్చగలం’ అని సెలైంట్ అయిపోతుంది. ‘అది చూసే కదా నువ్వు పడ్డావ్. ఇప్పుడు మారమని ఎందుకు అంటున్నావ్?’ అనడుగుతా (నవ్వుతూ). ఆవిడ ఏంజిల్ అండి. ‘శ్రీఆంజనేయం’కి రమ్యగారి డబ్బులు పెట్టారనే టాక్ ఉంది? ఇప్పటివరకూ తనది ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ‘ఐ డోంట్ కేర్’. తీసుకోలేదు కాబట్టే, మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు టచ్ చేసిన మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా. మీ లవ్స్టోరీ తెలుసుకోవాలని ఉంది.. మా ఇద్దరి మధ్య ఉన్న ఓ అపురూపమైన అందమైన విషయం అది. చెబితే మా స్పేస్ మిస్సవుతుంది. ముందు ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరు పడేశారు? అనేవి పంచుకునే విషయాలు కావు. కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్ (నవ్వుతూ). మీ సినిమాల్లో పెళ్లిళ్లు చాలా అందంగా చూపిస్తారు. కానీ, మీ పెళ్లి చాలా సింపుల్గా చేసుకున్నారు. నా దృష్టిలో పెళ్లి అంటే అంతే. ‘మురారి’ సినిమాలోని పెళ్లిలో కూడా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. నా ఫీలింగ్ అది. అందుకే, నా పెళ్లి కూడా అలా చేసుకున్నాను. నేను, రమ్య పెళ్లికి పిలవడం మొదలుపెడితే.. ఎన్ని ఇండస్ట్రీలను పిలవాలి. ‘నువ్వు, నేను పెళ్లి చేసుకున్న ఫీలింగ్ మనలో కలగాలంటే.. బయట వ్యక్తులు ఎవరూ వద్దు. నీకు బాగా దగ్గరైన, నాకు బాగా దగ్గరైన ఫ్రెండ్స్ని పిలుద్దాం’ అని రమ్యతో చెప్పాను. సీతారామ శాస్త్రి గారు, రాఘవేంద్రరావు గారు, జగపతిబాబు, ప్రకాశ్రాజ్.. ఇలా కొందరి, మా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. సింపుల్ మ్యారేజ్ అంటే రమ్యకృష్ణగారు ఒప్పుకున్నారా? మొదట ‘ఉహూ..’ అంది. తర్వాత లాజిక్ చెప్పాను. పెళ్లికి వచ్చినోళ్లలో 90 శాతం మంది ‘భలేవాణ్ణి పట్టిందిరా రమ్యకృష్ణ అని నిన్ను.. ఏం అమ్మాయిని పట్టాడని నన్ను’ జోకులేస్తారు. ఇంతకు మించి ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారని నీకుందా? అన్నాను. ‘అందరూ ఇదే అనుకుంటారు’ అని చెప్పింది. ‘మరి గ్రాండ్గా ఎందుకు?’ అన్నాను. పిలిచిన తర్వాత అందరికీ మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అని టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే డబ్బులు ఖర్చు. ‘పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అంతా డొనేట్ చేద్దాం. కంఫర్ట్గా పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. నాలుగు గంటలు హోమాలు, పూజలు చేసుకుంటూ, కంగారు లేకుండా, చాలా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం. మీడియాలో మీరూ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, గొడవపడ్డారనీ వార్తలు వస్తుంటాయి. మీ రియాక్షన్? సీరియస్గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి, చదివి వినిపిస్తా. విని, ‘అవునా?’ అని కూల్గా అంటుంది. ఇద్దరూ బయట ఫంక్షన్స్లో పెద్దగా కనిపించరేం? ఫంక్షన్కి వెళ్లాలనుకుంటే ఇద్దరం కలిసే వెళతాం. అంతేగానీ, నువ్ సపరేట్గా వెళ్లు.. నేను సపరేట్గా వెళతా.. అని ఎప్పుడూ అనుకోం. నేనంత అవుట్డోర్ మనిషిని కాదు. కొంచెం షైగా ఉంటాను. భార్యభర్తల అనుబంధం అనేది పది మందికి చూపించే పబ్లిక్ డిస్ప్లే కాదు. మేమిద్దరం జనాలకు భయపడి బతికేవాళ్లం కాదు. ఇద్దరం కలసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో? అనే ప్రస్తావన మా మధ్య ఉండదు. ‘నాకు నువ్వు.. నీకు నేను’ అనుకున్నప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? అనేది అనవసరం. ఓ అబద్దాన్ని సృష్టించి వాడు హ్యాపీగా ఫీలవుతుంటే.. చావనీ అనుకుని వదిలేస్తా. పవన్కల్యాణ్... లాంటి కొందరు అగ్రహీరోలతో మీరు ఎందుకు సినిమాలు చేయలేకపోయారు? అలాంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్టా? పవన్కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్కి సూట్ అయితే, వెళ్లి అడగడానికి రెడీ. ‘నక్షత్రం’ సినిమా విడుదల ఎప్పుడు? దసరాకి విడుదల చేయాలనుకుంటున్నాం. మీకు హిందూ భావజాలం ఎక్కువట? హిందూ మతం దేవుళ్లకు సంబంధించిన అంశం కాదు. ఓ జీవన విధానం. ఎలా బతకాలి? ఎలా బతికితే బాగుంటుంది? తక్కువ సమస్యలు ఉంటాయి? సంతోషంగా ఎలా బతకొచ్చు? అని చెప్పే ఓ జీవన విధానం. ఇస్లాం, క్రిస్టియానిటీ.. ఏ మతం అయినా ఇలా బతకండని చెబుతుంది. చిన్నప్పట్నుంచి హిందూ మతం తాలూకు పరిసరాల్లో పుట్టాను, పెరిగాను కాబట్టి హిందూ భావజాలం నాలో ఉంది. మనం చేయబోయే పనికి మన తాలూకు లేదా బయట నుంచి వచ్చే ఆటంకాలను తట్టుకోవాలంటే ఓ ఫోర్స్ కావాలి. విఘ్నేశ్వరుడికి దణ్ణం పెడితే.. విఘ్నాలు ఉండవనే ధైర్యం వస్తుంది. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. అలాగే డబ్బులు కావాలంటే డబ్బులొచ్చే పని చేయాలి. దాంతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. గాయత్రీ మంత్రంలో ఉండే బీజాక్షరాల్లో ప్రతి అక్షరానికి ఓ వైబ్రేషన్ ఉంది. బాడీలో ప్రకంపనలొస్తాయి. ఎనర్జీ ఫామ్ అవుతుంది. ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. మంత్రం చదవకుండా నాకు ఎనర్జీ, ధైర్యం వచ్చిందని కొంతమంది అంటారు. అందువల్ల, మంత్రం తప్పని నువ్వెలా అంటావ్? నీకు డ్రైవింగ్ వచ్చు, నాకు రాదు. అందుకే డ్రైవర్ హెల్ప్ తీసుకుంటా. అదే దేవుడు అనుకుంటా. అరబు దేశాల్లో పుట్టి ఉంటే ముస్లిం, అమెరికాలోనో, యూరోప్లోనో పుట్టుంటే క్రిస్టియన్ అయ్యేవాణ్ణి. నీ పుట్టుకను బట్టి నీ మతం డిసైడ్ అవుతున్నప్పుడు, ఇది తప్పు, రైట్ అనడానికి నువ్వెవరు? నీ తల్లితండ్రులను కానీ, మతాన్ని కానీ నువ్వు డిసైడ్ చేయలేదు. హిందూ భావజాలాన్ని అంటరానితనంగానో, పాపం కిందో ఫీల్ అవ్వకూడదు. మనం పుట్టి పెరిగిన భావజాలం. ‘ఖడ్గం’లో ఇదే మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇంకొకరిది తప్పు అనడం లేదు. ఇది తప్పు? ఇది రైటు? అని మనం ఎలా అంటాం? ఒక్కో చోట ఒక్కో అలవాటు. కొన్ని వేల సంవత్సరాలుగా సెటిల్ అయిపోయి ఉంది. దాన్ని మార్చాలంటే మళ్లీ మార్టిన్ లూథర్ కింగో, గాంధీగారో వచ్చి చెప్పాలి. మీ అబ్బాయి రిత్విక్ గురించి? బాగా షార్ప్, చార్మింగ్, అల్లరి. మా ఇద్దరి లక్షణాలు సమానంగా వచ్చేశాయి. 4 భాషలు మాట్లాడతాడు. హీరోని చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా? నేను, రమ్య సెల్ఫ్మేడ్. మీరు ఇది అవ్వాలని చెబితే.. అయినవాళ్లం కాదు. మా అబ్బాయి ఓ రోజు ఆస్ట్రోనాట్, ఓ రోజు స్పేస్ మెకానిక్, మరో రోజు కార్ డ్రైవర్, ఇంకో రోజు టెన్నిస్ ప్లేయర్ అంటాడు. ఇంతవరకూ హీరో అవుతానని, దర్శకుడు అవుతానని మాత్రం చెప్పలేదు. డెస్టినీ అనేది ఒకటుంటుంది. ‘వాట్ లైఫ్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్’ అనేది మనకు తెలియదు. - డి.జి. భవాని -
మంచా.. చెడా?
ఖాకీ చొక్కా వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని లాఠీ పట్టుకుని రెజీనా చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదూ! ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కనిపించిన రెజీనా వేరు.. ఇప్పుడు కనిపించనున్న రెజీనా వేరు. ఆమెలోని పవర్ఫుల్ యాంగిల్ని చూపించనున్నారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో రెజీనా పోలీస్గా నటిస్తున్నారు. మంచి పోలీస్గా నటిస్తున్నారా? లేదా చెడ్డ పోలీస్గా నటిస్తున్నారా? అనేది చిత్రం చూసి తెలుసుకోవాలంటున్నారు హీరో సందీప్. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. కథానాయికలను చాలా అందంగా చూపిస్తారని కృష్ణవంశీకి పేరు. అందుకే, ప్రతి కథానాయిక ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. పోలీస్గా రెజీనాను ఎలా చూపిస్తారో? అన్నట్టు.. ‘రొటీన్ లవ్స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’ చిత్రాల తర్వాత సందీప్, రెజీనా కలసి నటిస్తున్న మూడో చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం ఇద్దరికీ ఇది తొలిసారి. -
రైతుగా...
రైతు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోగలమా? ఎవరెంత కష్టపడినా.. ఎన్నెన్ని గొప్ప పనులు చేసినా.. ప్రతి మనిషి ఆకలి తీర్చేది మాత్రం రైతే. మనిషి తినే ప్రతి మెతుకు పండించేది అతనే. మనిషి మనుగడకు ముఖ్య కారణమైన రైతుకు ఈ రోజు ఎదురవుతున్న సమస్యలేంటి? దేశానికి రైతు అవసరం ఎంతుంది? అనే విషయాల సమాహారంతో రూపొందనున్న చిత్రం ‘రైతు’. ఇదే తన 101వ చిత్రమని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత ‘రైతు’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు
ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. Hi guys..much better now,got a few stitches..just an unfortunate accident on Krishna Vamsi sirs set..action sequence..glad it came out well — Sundeep Kishan (@sundeepkishan) 15 June 2016 -
బరువుతో రండి..
బరువుతో రండి అంటున్నారు నటి కాజల్అగర్వాల్. ఏమిటీ బరువు అనగానే పారితోషికం లాంటివేవో అనే నిర్ణయానికి వచ్చేయకండి. బరువుతో అంటే పాపం కాజల్ భావన బరువైన పాత్రలతో రండని. ఎందుకంటే అలాంటి పాత్రలామెను ఇంత వరకూ వరించలేదు.అయినా కాజల్ బాధ పడలేదు తనకు లభించిన అందాలారబోతలతో కూడిన ప్రేమ పాత్రలతో కాలాన్ని నెట్టుకుంటూ వచ్చారు. తెలుగులో ఘన విజయం సాధించిన మగధీర, తమిళంలో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాల్లోనూ కాజల్ హీరోను ప్రేమించడం, పాటలు పాడుకోవడం లాంటి పాత్రలకే పరిమితమయ్యారు. అలా అందాలతోనే నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన ఈ బ్యూటీని పెద్దగా విమర్శలు దరిచేరలేదు. అయితే ఇటీవల హిందీ చిత్రంలో నటించిన ఘాటు లిప్లాక్ సన్నివేశం మాత్రం పెద్ద కలకలానికే దారి తీసింది. అయినా ఆ చిత్రం కాజల్అగర్వాల్ కెరీర్కు ఏమాత్రం ప్లస్ అవలేదు. అదటుంచితే తాజాగా తన సహనటీమణుల నటనా ప్రభావం ఈ అమ్మడికి నిద్ర పట్టనీయడం లేదని సమాచారం. విషయం ఏమిటంటే అనుష్క, నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు కథల్లో లీడ్ పాత్రల్ని పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. తను మాత్రం ఇంకా ప్రేమా, దోమ లాంటి పాత్రల చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో తనకు లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలనే ఆసక్తి కలుగుతోందట. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను పోషించాలని ఆశపడుతున్నారట. ఇటీవల తనకు కథలు చెప్పడానికి వస్తున్న దర్శకులు వినిపించే కథలు పూర్తిగా ఆలకించి చివరికి అందులో హీరోయిన్ పాత్రలు తన స్థాయికి తగ్గట్టుగా లేవు. కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఈ తరహా పాత్రలు బాగుంటాయి. అయినా ఇలాంటి పాత్రలు తాను చాలా చేసేశాను. మళ్లీ మళ్లీ అవే చేయాలంటే బోర్ కొడుతోంది అని అంటున్నారట. అంతే కాదు బరువైన పాత్రల్లో రండి అంటూ చిన్న ఉచిత సలహాను కూడా ఇచ్చేస్తున్నారట. దీంతో అనుష్క, త్రిష లాంటి హీరోయిన్లు కాజల్కు నప్పుతాయా? అంటూ వచ్చిన దర్శకులు గొనుక్కుంటూ తిరుగు ముఖం పడుతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విక్రమ్కు జంటగా గరుడా, జీవా సరసన కవలైవేండామ్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. -
అత్తారిల్లా... బాబోయ్!
అత్తారింట్లో అల్లుళ్లకి రాచమర్యాదలు జరగడం కామన్. కానీ, ఆ అత్తారింట్లో అలాంటివేవీ జరగవ్. ఆ ఇల్లంటే అల్లుడికి హడల్. అసలా ఇంట్లో ఏముంది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో అంజన్ కె. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను హైదరాబాద్లో విడుదల చేశారు. అంజన్ మాట్లాడుతూ- ‘‘రామ్గోపాల్వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. ‘అరుంధతి’ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్లో పాలుపంచుకున్నాను. ఒక మంచి సినిమా తీయాలనే నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ‘అత్తారిల్లు’ చేశాను. కడుపుబ్బా నవ్వించే హారర్ చిత్రమిది. మణిశర్మగారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, డెన్నిస్ నార్టన్ స్వరపరచిన రెండు పాటలు హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు. సాయి రవికుమార్, అతిథీ దాస్, అన్తేశియ చప్రసోవ, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివశంకర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.హెచ్. రెడ్డి, సమర్పణ: అక్షయ్- అశ్విన్, సహ నిర్మాతలు: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి కె.కల్యాణ్. -
మూడోసారి జోడి కడుతున్నారు
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ అవ్వటం కామన్. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఇప్పటికే రెండు ఫ్లాప్లు ఇచ్చిన కాంబినేషన్ను మరోసారి తెర మీదకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమాతో పాటు, రుద్రాక్ష సినిమా కూడా చేజారిపోవటంతో ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్తో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఓ రిస్కీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడట. నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో సందీప్ కిషన్, రెజీనాలు రెండు సినిమాల్లో కలిసి నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. తొలిసారి రొటీన్ లవ్ స్టోరి సినిమాలో కలిసి నటించిన ఈ జంట మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నా సినిమా రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత కొత్త దర్శకుడితో రారా కృష్ణయ్య సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినా తరువాత మాత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. దీంతో ఇదే కాంబినేషన్లో సినిమా చేయటం కృష్ణవంశీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సెంటిమెంట్ను బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి. -
కృష్ణవంశీ నక్షత్రం
చేసే సినిమాలన్నీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు దర్శకుడు కృష్ణవంశీ. వెరైటీ పాత్రలే చేయాలనుకుంటారు హీరో సందీప్ కిషన్. ఇప్పటివరకూ దాదాపు అలాంటి పాత్రలే చేసుకుంటూ వచ్చారాయన. ఇక.. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డెరైక్టర్తో సినిమా అంటే.. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, కొత్త లుక్లో సందీప్ కనిపిస్తారని ఊహించవచ్చు. ఆ ఒక్క చాన్స్ దక్కించేసుకున్నారు సందీప్ కిషన్. బుట్టబొమ్మ క్రియేషన్స్ కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్లో మొదలైంది. సినిమా టైటిల్ ‘నక్షత్రం’. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ- ‘‘పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం’’ అని తెలిపారు. -
పోలీస్ థ్రిల్లర్...
ఫ్లాష్.. ఫ్లాష్.... సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన కృష్ణవంశీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాలకృష్ణ 100వ చిత్రంగా ‘రైతు’ ప్రాజెక్ట్ను రూపొందించే అవకాశం కృష్ణవంశీకి వచ్చినట్లు ఆ మధ్య కృష్ణానగర్ గుప్పుమంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో చారిత్రక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనుకోకుండా తెర మీదకు వచ్చింది. దాంతో, కృష్ణవంశీ సారథ్యంలోని ‘రైతు’ ప్రాజెక్ట్ను తన 101వ సినిమాగా బాలకృష్ణ చేయాలనుకుంటున్నట్లు ఆంతరంగిక వర్గాల కథనం. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ తక్షణమే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దాని గురించి ‘సాక్షి’ ఆరా తీస్తే, ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ‘గోవిందుడు అందరి వాడేలే’ తరువాత కొంతకాలంగా రకరకాల స్క్రిప్ట్లు తయారుచేసుకుంటూ కృష్ణవంశీ బిజీగా గడిపారు. విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యమిస్తూ, వివిధ భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ భారీ చిత్రాన్ని తీయాలని మొదట్లో ఆయన అనుకున్నారు. అయితే, మరింత సమయం పట్టే ఆ కథను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఒక పోలీస్ యాక్షన్ స్టోరీని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఒక యువ పోలీసు అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ బడ్జెట్ వాణిజ్యపంథా చిత్రానికి యువ హీరో సందీప్ కిషన్ను హీరోగా ఎంచుకున్నారు. ఊహించని అనేక ట్విస్టులు, కావలసినంత నాటకీయత, బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలు - ఈ కథలో ఉంటాయట. ‘‘పోలీస్ నేపథ్యంలో చాలా వాస్తవికంగా ఉండే కథ ఇది. చాలా రోజులుగా మదిలో మెదులుతున్న ఈ స్క్రిప్ట్ సందీప్ కిషన్తో అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు, హీరో చాలా ఉత్సాహంగా ఉన్నారు’’ అని ఆంతరంగిక వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణవంశీ పరిచయం చేసిన ఒక హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్ర ధరిస్తున్నారు. మరో హీరోయిన్ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అలాగే, పరభాషకు చెందిన ఒక ప్రముఖ కథానాయకుడు గౌరవపాత్ర ధరించనున్నారు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్కు కావాల్సిన పోలీస్ అనుమతులు, వగైరాల కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ నెల 27 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే షూటింగ్ జరిగే ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం వహించనున్నారు. ఈ హాలీవుడ్ తరహా థ్రిల్లర్ను శరవేగంతో పూర్తిచేసి, ఆగస్టు 15కి కానీ, దసరాకి కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరిన్ని వివరాల కోసం, క్రియేటివ్ దర్శకుడి కొత్త వెండితెర విశ్వరూపం కోసం మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! -
కృష్ణవంశీ, మరో ప్రయత్నం మొదలుపెట్టాడు
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కృష్ణవంశీ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగోలేదు. ముఖ్యంగా మొగుడు, పైసా సినిమాaతో కృష్ణవంశీ క్రియేటివిటీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మంచి వసూళ్లను రాబట్టడంతో కాస్త పరవాలేదనిపించాడు. కానీ అవకాశాల కోసం మాత్రం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఫైనల్గా రుద్రాక్ష పేరుతో ఓ ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ, అయితే ఈ సినిమా చర్చల దశలో ఉండగానే బాలయ్య వందో సినిమా కోసం పిలుపు రావటంతో రుద్రాక్షను పక్కన పెట్టాశాడు. కానీ బాలయ్య సినిమా కూడా ఫైనల్ కాకపోవటంతో రెండు సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణవంశీ ప్రస్తుతం ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కూడా కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమానైనా కృష్ణవంశీ సెట్స్ మీదకు తీసుకువస్తాడేమో చూడాలి. -
అనీల్ ఆశ వదులుకున్నట్టేనా..?
పటాస్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన అనీల్, అదే జోరులో మెగా హీరో సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం సాయి ధరమ్తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పట్టాల మీద ఉండగానే ఓ సీనియర్ హీరోతో భారీ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 99 సినిమాలు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమాను, తనే డైరెక్ట్ చేయాలని ఆశపడ్డాడు యువ దర్శకుడు అనీల్ రావిపూడి. రామారావుగారు అనే టైటిల్తో బాలయ్యకు ఓ లైన్ కూడా వినిపించాడు. బాలకృష్ణకు కూడా లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్తో రమ్మన్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా బాలయ్య తన వందో సినిమా విషయంలో కీలక ప్రకటన చేయటంతో అనీల్ ఆలోచనలో పడ్డాడు. తన వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీలతో ఉంటుందంటూ ప్రకటించాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే సింగీతం శ్రీనివాస్తో ఆదిత్య 369కు సీక్వల్ కూడా ఉంటుందంటూ చాలా రోజులుగా చర్చ జరగుతుంది ఈ రెండు సినిమాలు పూర్తవ్వటానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అంటే ఈ రెండేళ్లలో బాలయ్యతో అనీల్ సినిమా లేనట్టే. మరి ఆ తరువాతైనా అనీల్కు బాలయ్య ఛాన్స్ ఇస్తాడో..? లేదో..? -
'వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీతో'
లయన్ సినిమాతో 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య, తన వందో సినిమాలో విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను తనకు వరుస సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేద్దామని భావించినా బోయపాటి డేట్స్ ఖాళీ లేకపోవటంతో ఇతర దర్శకుల మీద దృష్టిపెట్టాడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369కు సీక్వెల్ ప్లాన్ చేసినా, అది ఈ జనరేషన్ను మెప్పిస్తుందో లేదో అన్న ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు. తాజాగా తన వందో సినిమా కోసం ఇద్దరు దర్శకులు, మంచి కథలతో రెడీగా ఉన్నారని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య, ఈ విషయాన్ని వెల్లడించారు. తన వందో సినిమా కోసం క్రిష్, కృష్ణవంశీ ఇద్దరూ కథలు సిద్ధం చేశారని, అయితే ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయబోయేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లండిచాడు. ఈ ఇద్దరు దర్శకుల శైలి, రెగ్యులర్ సినిమాకు భిన్నమైనది కావటంతో బాలయ్య వందో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. -
రైతు సమస్యలపై బాలకృష్ణ పోరాటం
99 సినిమాలు పూర్తి చేసుకున్ననందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందో సినిమా మీద దృష్టిపెట్టాడు. ఈ సినిమా రేసులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఫైనల్గా సీనియర్ దర్శకుడు కృష్ణవంశీకే ఫిక్స్ అయ్యాడు బాలయ్య. బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం రుద్రాక్ష సినిమాను పక్కన పెట్టి మరీ కథను రెడీ చేసేపనిలో పడ్డాడు కృష్ణవంశీ. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా బాలయ్య వందో సినిమా కృష్ణవంశీతోనే అంటూ టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్. ఈ సినిమా కోసం రైతు, లేదు రైతు రాజ్యం అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. -
బాలయ్య వందో సినిమా ఆయన చేతిలో?
'డిక్టేటర్' హిట్ తర్వాత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య వందో సినిమాకు సంబంధించి ఓ సరికొత్త వార్త హల్ చల్ చేస్తుంది. మొదట్లో 'ఆదిత్య 369' కు సీక్వెల్ 'ఆదిత్య 999' బాలయ్య వందో సినిమాగా రాబోతుందని భావించారు. అయితే అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఆ తర్వాత 100 వ సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉండబోతుందని ప్రచారం జరిగింది. 'సరైనోడు' చిత్రీకరణలో బోయపాటి బిజీ అవడంతో అది కూడా రూమరేనని తేలిపోయింది. ఇక 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఫైనల్ గా ఆ అవకాశం కృష్ణవంశీకి వచ్చిందని సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేయమని బాలయ్య కృష్ణవంశీని పురమాయించినట్లు టాక్. ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్ లో జరుగుతున్న లేపాక్షి సంబరాల్లో బిజీగా ఉండగా, కృష్ణవంశీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డారు. -
బాలయ్య కోసం రుద్రాక్ష పక్కన పెడతాడా..?
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. 99వ సినిమాగా డిక్టేటర్ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా, ఇంతవరకు 100వ సినిమాకు దర్శకుడు మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా, ఎవరితో సినిమా చేస్తున్నదీ మాత్రం బాలయ్య ప్రకటించలేదు. తాజాగా ఈ లిస్ట్లో మరో స్టార్ డైరెక్టర్ వచ్చి చేరాడు. డిక్టేటర్ సినిమా తరువాత బాలయ్య వందో సినిమాగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369కు సీక్వల్ను తెరకెక్కించాలని భావించారు. దాదాపుగా కన్ఫామ్ అయిన ఈ ప్రాజెక్ట్ను ఆఖరి నిమిషంలో బాలకృష్ణ పక్కకు పెట్టాడు. బాలయ్యకు భారీ సక్సెస్లు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ప్లాన్ చేసినా ఇప్పట్లో బోయపాటి డేట్స్ దొరికే పరిస్థితి లేదు. అందుకే పటాస్ ఫేం అనీల్ రావిపూడి, కంచె సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రిష్ల పేర్లు కూడా బాలకృష్ణ వందో సినిమా రేసులో వినిపించాయి. అయితే వీరిలో ఎవరి పేరును అఫీషియల్గా ప్రకటించలేదు. తాజాగా స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య వందో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కృష్ణవంశీ కథకు ఓకే చెప్పిన బాలకృష్ణ.. వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సూచించాడట. మరి ఇప్పటికే రుద్రాక్ష సినిమాను ప్రకటించిన కృష్ణవంశీ, బాలకృష్ణ కోసం ఆ ప్రాజెక్ట్ను పక్కన పెడతాడేమో చూడాలి. -
కృష్ణా ముకుందా మురారి
సినిమా వెనుక స్టోరీ - 33 గోదావరి మధ్యలో ఉంది లాంచీ. టాపు మీద కూర్చున్న కృష్ణవంశీ సిగరెట్ వెలిగించాడు. గట్టిగా దమ్ము పీల్చి, చుట్టూ గోదావరిని పరికించి చూశాడు. ఆహా... ఏమి ప్రశాంతత! సినిమా సినిమాకీ గ్యాప్లో ఇలా గోదావరి జిల్లాలకొచ్చి ఫ్రెండ్స్తో గడపడం తనకి అలవాటు. క్లాప్, స్విచ్ ఆన్... ఇలాంటి మాటలు లేకుండా ఫ్రెండ్స్తో మనసు విప్పి మాట్లాడుతుంటే హాయిగా ఉంది. సడెన్గా సీరియస్ డిస్కషన్. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ... ఇలా ఆ ఫ్యామిలీ అంతా ఆకస్మిక దుర్మరణాలే!‘ఎందుకంటావ్?’ ఆసక్తిగా అడిగాడు కృష్ణవంశీ. ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వ ర్రావు ఒకటే అన్నాడు.. ‘శాపం’. కృష్ణవంశీ భ్రుకుటి ముడిపడింది. శాపమా?! ఫ్రెండ్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంధ్రాలో ఓ ఫేమస్ పర్సన్. పాలేరుని కొట్టడమో, చంపడమో చేశాడు. పాలేరు పెళ్లాం శాపనార్థాలు పెట్టింది. కట్ చేస్తే - అతగాడి పెద్ద కొడుకు పొలానికెళ్లి ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఆ కర్మకాండలు చేసొస్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రెయిన్ గుద్దేసి రెండో కొడుకు పోయాడు. ఇది వినగానే కృష్ణ వంశీ షేకైపోయాడు. ఆ రాత్రి నిద్ర లేదు. ఆ రాత్రే కాదు... చాలా రాత్రిళ్లు నిద్ర రాలేదు. మహేశ్బాబు కోసం ప్రశాంతంగా కథ ఆలోచిస్తున్న టైమ్లో ఏంటీ కలవరం?! నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు నుంచి ఫోన్. ‘‘సార్... మీ పని మీదే ఉన్నా’’ అని కాసేపు ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కృష్ణవంశీ. సూపర్స్టార్ కృష్ణకు కరడు గట్టిన వీరాభిమాని రామలింగేశ్వరరావు. కృష్ణతోనే ‘కిరాయి కోటిగాడు’, ‘కంచు కాగడా’, ‘దొంగోడొచ్చాడు’ లాంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో కృష్ణవంశీ డెరైక్షన్లో సినిమా చేయాలనేది టార్గెట్. కృష్ణవంశీకేమో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. మంచి కథ దొరికినప్పుడు చేస్తానని తప్పించుకోడానికి ప్రయత్నిం చాడు. ఆయన వదల్లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ ఆ పనిలోనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నా మహేశ్ గురించే ఆలోచన. మహేశ్ అందగాడు. బృందావనంలో కృష్ణుడిలాగా ముగ్ధమనో హరంగా ఉంటాడు. తనతో ఎలాంటి సినిమా తీయాలి? ఎస్... దొరికేసింది. బృందావనంలో కృష్ణుడు. ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి సినిమా చేస్తే అదిరి పోతుంది. కానీ ఇంకా చాలా దినుసులు కావాలి. ఈ బృందావనానికి ఆ శాపాన్ని జత చేస్తే?! క్లారిటీ వచ్చేసింది. పద్మాలయా స్టూడియోలో కృష్ణ చాంబర్. కృష్ణవంశీ కథ చెబుతుంటే కృష్ణ, మహేశ్, రామలింగేశ్వరరావు వింటు న్నారు. ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కృష్ణ ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. ‘‘వంశీ! నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ బాగున్నట్టే ఉంది. నువ్వూ, మహేశూ డెసిషన్ తీసుకోండి’’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఇప్పుడు బాల్ మహేశ్ కోర్టులో ఉంది. అతనికేమో కృష్ణ వంశీతో మంచి లవ్స్టోరీ చేద్దామని ఉంది. ఇతనేమో బృందావనం, శాపం అంటు న్నాడు. అలాగని కృష్ణవంశీని వదులుకో లేడు. బాల్ షిఫ్ట్స్ టు రామలింగేశ్వరరావు కోర్ట్. ఆయన కృష్ణవంశీని కన్విన్స్ చేయ డానికి ట్రై చేస్తున్నాడు. కృష్ణవంశీ మొండి వాడు. వినడే! రామలింగేశ్వర్రావూ మొండివాడే! వదలడే! కృష్ణవంశీ ఇంకో కథ చేశాడు. ముగ్గు రమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీ. ‘‘భలే ఉందే’’ అన్నారు కృష్ణ. మహేశ్ కూడా. అప్పుడు పేల్చాడు కృష్ణవంశీ బాంబు. ‘‘ఈ కథతో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు. కానీ ఆ కథతో సినిమా అయితే మాత్రం ఓ ఇరవై, ముప్ఫై ఏళ్లు చరిత్రలో నిలిచిపోతుంది. ఆలోచించుకోండి. కాదూ, కూడదంటే ఈ కథ మీకిచ్చేస్తాను. వేరే డెరైక్టర్తో చేయించుకోండి.’’ మళ్లీ కథ మొదటికొచ్చింది. రామ లింగేశ్వరరావు తలపట్టుకున్నాడు. ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? మహేశ్, కృష్ణవంశీని నమ్మాడు. కృష్ణవంశీ కథను నమ్మాడు. రామలింగే శ్వరరావు ఈ కాంబి నేషన్ను నమ్మాడు. ప్రాజెక్ట్ స్టార్ట అయ్యింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ కోసం భారతం, భాగవతం చదివి కృష్ణతత్త్వాన్ని ఒంటబట్టించు కోవాల్సి వచ్చింది. కృష్ణుడు, యశోద, పాండవులు, దుర్యోధనుడు... ఇలాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ సోషలైజ్ చేసేశాడు. రుక్మిణి, సత్యభామ పాత్రలను కలగలిపి హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాడు. కథ ఫైనల్ అయ్యింది కానీ, క్లైమాక్స్ను ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికో ముడి వీడింది. కానీ చాలా డౌట్లు మిగిలి పోయాయి. అమ్మవారి శాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామా అనేది పెద్ద డౌట్. గురువు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిని కలిశాడు. ఆయన డౌట్లన్నీ తీర్చేశారు. ఇప్పుడు కృష్ణవంశీకి ఫుల్ క్లారిటీ. టైటిల్... ‘కృష్ణా ముకుందా మురారి’ అనుకున్నాడు. ‘మురారి’ అని సింపుల్గా పెడితే బెటర్ కదా’ అన్నాడు రామలింగే శ్వరరావు. సినిమా నిండా ఆర్టిస్టులే ఆర్టిస్టులు. కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి... ఇలా చాలామంది కావాల్సి వచ్చారు. బామ్మ పాత్రకు బెంగళూరు వెళ్లి మరీ ‘షావుకారు’ జానకికి కథ చెప్పారు. 40 రోజుల డేట్లు అంటే కష్టం అందావిడ. ఫైనల్గా మలయాళ నటి సుకుమారి సెలెక్టెడ్. ఇక మహేశ్ పక్కన హీరోయిన్ అంటే క్యూట్గా ఉండాలి. హేమమాలిని కూతురు ఇషా డియోల్ అయితే బావుంటుందనిపించింది. హేమమాలిని దగ్గరికెళ్తే ‘రెమ్యునరేషన్ ఎంతిస్తారు’ అని మొహం మీదే అడిగేసిందావిడ. దాంతో డ్రాప్. సోనాలీబెంద్రే రిఫరెన్స్ వచ్చింది. హైదరా బాద్లో ఫ్రెండ్ పెళ్లికి వచ్చి, కథ విని కాల్షీట్స్ ఇచ్చేసిందామె. ఫుల్ ట్రెడిషనల్ సినిమా ఇది. విలేజ్ అట్మాస్ఫియర్, పండగ హంగుల్లాంటివి కావాలి. ఆర్ట్ డెరైక్టర్ గట్టివాడే ఉండాలి. శ్రీనివాసరాజు సమర్థుడు. కృష్ణవంశీ కథ చెప్పగానే స్కెచ్లు వేసేశాడు. హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు చాలా పెద్దగా ఉండాలి. కేరళ వెళ్లి చూసొచ్చారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులతో అంత దూరం వెళ్తే బడ్జెట్ తడిసి మోపెడ వుతుంది. రామానాయుడు సినీ విలేజ్లో సెట్స్ వేసేస్తే బెటర్. ఇంకా కావాలనుకుంటే రామచంద్రాపురం రాజావారి కోటలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలో ఇంపార్టెంట్ - టెంపుల్ సీన్స్. మూడు తరాల నేపథ్యానికి సంబంధించి సీన్లు అక్కడే తీయాలి. అంటే పురాతనమైనది కావాలి. కర్ణాటకలోని బాదామిలో దొరికింది. ఒకేసారి అక్కడికి వెళ్లి సీన్లు తీయడం కష్టం. నాలుగైదుసార్లు వెళ్లాల్సిందే. ఇదీ తడిసి మోపెడయ్యే వ్యవ హారమే. అందుకే శంషాబాద్ టెంపుల్కి ఫిక్సయ్యారు. ఓ ఏనుగు కావాలి. ఇక్కడ దొరకదు. కేరళ నుంచి దిగుమతి చేసుకో వాల్సిందే. ఇలాంటి సినిమాకి సీనియర్ కెమెరామ్యాన్ కావాలి. కానీ కృష్ణవంశీ ‘మెరుపు’లో ఓ పాట చూసి సి.రామ్ ప్రసాద్కి ఆఫరిచ్చేశాడు. మ్యూజిక్ డెరై క్టర్గా మణిశర్మ బెస్టని ఫీలయ్యారు. ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటలు తక్కువ పనిచేయలేదు. కృష్ణ వంశీకి స్క్రిప్ట్ అంతా మైండ్లోనే ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్. ఆర్టిస్టులు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తు న్నారు. మహేశ్బాబు అయితే క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి’ పాట, వాటర్ ఫైట్ చేశాడు. కృష్ణవంశీ ఏది అడిగినా అరేంజ్ చేయమని ప్రొడక్షన్ టీమ్కి ఆర్డరేశాడు రామలింగేశ్వరరావు. దాంతో కృష్ణవంశీ టెన్షన్ లేకుండా సినిమా కంప్లీట్ చేయగలిగాడు. 2001 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయ్యింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ. కొంత ఎడిట్ చేద్దామంటే కృష్ణవంశీ వినలేదు. తనకి ఒకటే నమ్మకం. ఇలాంటివి మళ్లీ మళ్లీ తీయలేం. మొదట డివైడ్ టాక్ వచ్చినా, సూపర్హిట్ కావడం ఖాయం. ఫిబ్రవరి 16న రిలీజ్. డివైడ్ టాక్. లెంగ్త్ ఎక్కువైందని కంప్లయింట్స్. డిస్ట్రిబ్యూటర్లు కటింగ్స్ మొదలుపెట్టారు. కృష్ణవంశీ కయ్మంటున్నాడు. కృష్ణ సినిమా చూసి కదిలిపోయారు. ‘‘మహేశ్ పర్ఫార్మెన్స్ చూసి గర్వపడుతున్నాను’’... అంటూ స్టేట్మెంట్. మహేశ్ ఫుల్ హ్యాపీ! ‘మురారి’ రిలీజ్ టైమ్కి హిందీ సినిమా ‘శక్తి’ (తెలుగు ‘అంతఃపురం’కి రీమేక్) షూటింగ్ కోసం ఎక్కడో నార్త్లో ఫోన్లు కూడా పనిచేయని చోట ఉన్నాడు కృష్ణవంశీ. వాళ్ల బ్రదర్ రెండ్రోజులు ట్రై చేస్తే, ఫోన్లో దొరికాడు. ‘‘థాంక్స్ రా’’ అన్నాడు కృష్ణవంశీ. ‘‘నేనింకా కంగ్రాట్స్ చెప్పలేదన్నయ్యా!’’ అన్నాడు తమ్ముడు. ‘‘నువ్వు అది చెప్పడానికే ఫోన్ చేశావని నాకు తెలుసు’’ అని నవ్వేశాడు కేవీ. సంకల్పం - ఓ కల్పవృక్షం. మనం బలంగా ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. నమ్మకం - ఓ ఐరావతం. మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది! వెరీ ఇంట్రస్టింగ్ ► క్లైమాక్స్లో కీలకపాత్ర కోసం సీనియర్ నటుడు ఉంటే బాగుంటుందను కున్నారు. ‘దానవీరశూర కర్ణ’లో శకునిగా చేసిన ధూళిపాళ రిటైరైపోయి, గుంటూరుకు సమీపంలో స్థిరపడ్డారు. కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు. ► ‘చెప్పమ్మా చెప్పమ్మా’ పాటలో ముగ్గు సోనాలీ బేంద్రేలా మారే షాట్కి ‘టెర్మి నేటర్’లోని జైలు సీను ఇన్స్పిరేషన్. -
సమంతో రమ్య కృష్ణవంశీయమ్
క్రియేటివ్ డెరైక్టర్ కృష్ణవంశీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? పదహారు నెలల క్రితం రామ్చరణ్తో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత ఆయన వార్తల్లో కనిపించడం లేదేంటి? వీటి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు జవాబు దొరికింది. ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ రూపకల్పనకు కృష్ణవంశీ సర్వం సిద్ధం చేసినట్లు కృష్ణానగర్ కబురు. ఆయన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి, ‘రుద్రాక్ష’ పేరుతో స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నారట! కాంబినేషన్ థండర్... విభిన్నమైన ఈ స్క్రిప్ట్లో సస్పెన్స్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలు - అన్నీ ఉన్నాయని సమాచారం. ఇలా అన్ని అంశాలూ రంగరించిన ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఒక అరుదైన కాంబినేషన్ను కూడా సిద్ధమవుతోంది. చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తమన్నాతో మొదలుపెట్టి అనుష్క దాకా రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఆ పాత్ర హీరోయిన్ సమంతను వరించింది. ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన సమంత తొలిసారిగా కృష్ణవంశీ చిత్ర నాయిక అవుతున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలే ‘బాహుబలి’లో శివగామిగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో సత్యభామగా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర ధరిస్తుండడం! గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చంద్రలేఖ’ లాంటి సినిమాల్లో నటించిన ఆమె, పెళ్ళయ్యాక తన భర్త దర్శకత్వంలో పూర్తి స్థాయి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారట. కృష్ణవంశీ కెరీర్లోకెల్లా భారీ బడ్జెట్తో రూపొందే ఈ చిత్రానికి అలా క్రేజీ కాంబినేషన్ కూడా సెట్ అయింది. విజువల్ వండర్... ఇంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే గ్రౌండ్వర్క్ అంతా పూర్తి అయిందని ఆంతరంగిక వర్గాల సమాచారం. ఈ స్క్రిప్ట్ మీద కృష్ణవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు ఆయన కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే, వాటికి సంబంధించిన నిపుణులతో ఇప్పటికే సంప్రతింపులు జరుగుతున్నాయి. ఇలాంటి హై-టెక్నికల్ సినిమాకు సమర్థుడైన కెమేరా నిపుణుడు అవసరం కాబట్టి, ఆ బాధ్యతను సీనియర్ కెమేరామన్ ఛోటా కె. నాయుడుకు అప్పగిస్తున్నట్లు భోగట్టా. కృష్ణవంశీ - ఛోటా కె.నాయుడుల కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం! ఈ భారీ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, తమిళంలోనూ ఏకకాలంలో నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ‘రుద్రాక్ష’ అనే వర్కింగ్ టైటిల్తో సద్దు చేయకుండా తెర వెనుక పనులన్నీ సాగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే! ఆ మాటెలా ఉన్నా, ఇప్పటికైతే - కృష్ణవంశీ, రమ్యకృష్ణ, సమంత - ఇంతటి అరుదైన క్రేజీ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో వినలేదని కృష్ణానగర్ జనం చెప్పుకొంటున్నారు. ఇంకేం... ఈ ‘సమంతో రమ్య కృష్ణవంశీయమ్’తో ఈ క్రియేటివ్ డెరైక్టర్ మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయిపోయినట్లే! ఆల్ ది బెస్ట్ టు ది క్రేజీ ప్రాజెక్ట్ అండ్ డెరైక్టర్!! -
'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత
రుద్రమదేవి, సైజ్ జీరో వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తరువాత అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడి ఓరియంటెడ్ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది. కృష్ణవంశీ దర్శకత్వంలో హార్రర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రుద్రాక్ష సినిమాలో లీడ్ క్యారెక్టర్కు సమంతను ఎంపిక చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్కతో సినిమా చేస్తే ప్రేక్షకులు రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనతో చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న 'అ.. ఆ..' కూడా లేడీ ఓరియంటెడ్ సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. అదే బాటలో రుద్రాక్ష సినిమాలో కూడా సమంతనే ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
అనుష్కతో కృష్ణవంశీ ప్రయోగం
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన కృష్ణ వంశీ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. చందమామ, గోవిందుడు అందరివాడేలా లాంటి హిట్ సినిమాలు చేసినా, తనస్టామినా ప్రూవ్ చేసుకునే స్థాయి కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. సందేశాత్మక చిత్రాలను కూడా కమర్షియల్ సక్సెస్లుగా మార్చిన ఈ స్టార్ డైరెక్టర్ చాలా కాలం తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చిన కృష్ణవంశీ, గతంలో అంతఃపురం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. జగపతిబాబు, సాయికుమార్ లాంటి నటులు ఉన్నా సినిమా కథ అంతా సౌందర్య చుట్టూ తిరిగేలా రూపొందించి సూపర్ హిట్ సాధించాడు. ఇంత కాలం తరువాత మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు కృష్ణవంశీ. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రుద్రాక్ష అనే టైటిల్ను నిర్ణయించినా, ఆ టైటిల్ ఎవరో రిజిస్టర్ చేయించుకోవటంతో ఇప్పుడు మరో టైటిల్ కోసం ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. -
‘గూడెం’ అంబాసిడర్గా కృష్ణవంశీ
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు సినీ దర్శకుడు కృష్ణవంశీ అంగీకరించారు. ఆయనతో కలసి తాడేపల్లిగూడెం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సినీ హీరో సుమన్ ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అందే సేవలు, ట్రాఫిక్ సమస్యలు, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, చోరీలు, ఘోరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎఫ్ఎం రేడియో ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. జిల్లాకు వచ్చే వీఐపీల వివరాలు, వారి సందేశాలను కూడా ఎఫ్ఎం రేడియో ద్వారా లైవ్ అప్డేట్స్ అందిస్తామన్నారు. ఇందు కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలు వినియోగంలోకి వస్తాయని ఎస్పీ వివరించారు. -
ఫ్లాప్ దర్శకులకు చరణ్ చేయూత
టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న మాట నిజమే.. అయితే అందరి విషయంలో ఈ మాట నిజం కాదు. కరెక్ట్గా కథ చెప్పగలిగితే ఫ్లాప్ దర్శకులతో కూడా పని చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు అలా ఫ్లాప్ డైరెక్టర్స్తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా సాదిస్తున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఈ ఫార్ములా ఫాలో అవుతున్న చెర్రీ మంచి రిజల్టే సాదిస్తున్నాడు. ముఖ్యంగా ఒక ఫ్లాప్ తీసిన దర్శకుడు నెక్ట్స్ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలన్న కసితో చేస్తాడు కనుక చరణ్ కెరీర్లో ఈ ఫార్ములు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్నే ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బద్రినాద్ సినిమాతో తన కెరీర్లో బిగెస్ట్ ఫ్లాప్ను ఫేస్ చేశాడు వినాయక్.. ఈ ఎఫెక్ట్తో వినాయక్ కెరీర్లో లాంగ్ గ్యాప్ తప్పలేదు. అయితే కష్టాల్లో ఉన్న సమయంలో వినాయక్కి సినిమా ఇచ్చి ఆదుకున్నాడు చెర్రీ.. బద్రినాథ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత చరణ్ హీరోగా నాయక్ సినిమా చేశాడు. అప్పటికే చరణ్కు ఉన్న భారీ మాస్ ఇమేజ్తో నాయక్ మంచి విజయం సాధించింది. 40 కోట్లకు పైగా వసూళు చేసి చరణ్తో పాటు వినాయక్ కెరీర్లో కూడా బిగెస్ట్ హిట్గా నిలిచింది. చాలా ఏళ్లుగా హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి రామ్ చరణ్నే నమ్ముకున్నాడు. పైసా, మొగుడు లాంటి వరుస డిజాస్టర్లతో కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో బిగ్ స్టార్తో సినిమా చేస్తే తప్ప కెరీర్ గాడిలో పడదని, యంగ్ హీరోలను పక్కన పెట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే సినిమాను తెరకెక్కించిన కృష్ణవంశీ మంచి సక్సెస్ సాదించాడు. కృష్ణవంశీ మార్క్ ఫ్యామిలీ డ్రామతో పాటు, చెర్రీ మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో పాటు వసూళ్ల పరంగా కూడా సత్తా చాటింది. శ్రీనువైట్ చేసిన అన్ని సినిమాల్లోకి బిగెస్ట్ ఫ్లాప్ ఆగడు.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక్కసారిగా శ్రీనువైట్ల కెరీర్ను డైలామాలో పడేసింది. ఈసినిమా రిజల్ట్ తో ఇక శ్రీనువైట్లకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందా అని భావించారు అంతా. ఇలాంటి సమయంలో కూడా శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఆగడు సినిమా కన్నా ముందే ఇచ్చిన కమిట్ మెంట్ కావటంతో ఆ సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా బ్రూస్లీ సినిమాకు అంగీకరించాడు. తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాడన్న టాక్ వినిపిస్తుంది. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. కిక్ 2 సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేసిన సురేందర్ రెడ్డి చరణ్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త బలంగా వినిపిస్తుంది. తనీ ఒరువన్ రీమేక్ గా తెరకెక్కనున్న కొత్త సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్. -
గురువు బాటలో నడుస్తున్నాడు
గత ఏడాది గోవిందుడు అందరివాడేలే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న కృష్ణవంశీ, ఆ తర్వాత ఇంతవరకు సినిమా మొదలు పెట్టలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ.. గోవిందుడు సినిమాతో మంచి విజయం సాధించినా గత వైభవాన్ని మాత్రం సాధించలేకపోయాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ తాజాగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. తన గురువు రామ్గోపాల్వర్మ స్టైల్లో ఓ హార్రర్ సినిమా చేయాడానికి ప్లాన్ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్టైనర్స్, పేట్రియాటిక్ ఫిలింస్ మాత్రమే చేసిన కృష్ణవంశీ తొలిసారిగా ఓ డిఫరెంట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. సక్సెస్ఫుల్ నిర్మాత దిల్రాజు బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా, టాలీవుడ్ లో ఎక్కువ విజయాలు సాధించిన హారర్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం కథాచర్చల దశలోనే ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
టాలెంటెడ్ డైరెక్టర్స్ చేతిలో సాయి
-
జూలై 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: ధనుష్ (నటుడు); కృష్ణవంశీ (దర్శకుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించినది. కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త. అందువల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. కొందరిలో ఆత్మసాక్షాత్కారం కూడా కలగవచ్చు. ఈ సంవత్సరం వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల వీలయినంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. వీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల న్యాయసంబంధమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో జాగ్రత్త విహ ంచాలి. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఉద్యోగులు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాని, ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా, శ్రద్ధగా చేసుకోవడం మంచిది; లక్కీ నంబర్స్: 1,2,3,5,7,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రే, క్రీమ్, గోల్డెన్; లక్కీ మంత్స్: జులై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవారాలు; సూచనలు: పార్వతీదేవిని ఆరాధించడం, కేతుజపం చేయించడం, ధ్యానం చేసుకోవడం, అనాథలను, వృద్ధులను, వితంతువులకు ఆదరించి, ఆదుకోవడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
విద్యుత్ తీగలకు విద్యార్థి బలి
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం 85నెట్టూరు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే విద్యార్థి రోజులాగే బడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు. ట్రాన్స్ కో, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ భీమలింగప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అయితే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఏఈపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు... సూపర్గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది. దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా. పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు. వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి. ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి. ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు. - సమీర నేలపూడి -
సిరి అరవై... వెన్నెల దొరవై
పదిమందికి నచ్చే పాట రాయాలనుకున్నావు. పదిమంది మెచ్చే పాటగా దేవుడు రాయించాడు. నీ పల్లవికి పల్లకీ కట్టి, నీ చరణాల ధూళిని ఊరేగించి నిన్ను బోయీలుగా మోసిన నీ జగమంత కుటుంబం ఒకే పాట పాడుతోంది నీ పాట చిరకాలం బతకాలని... పాటంత ఆయుష్షు నువ్వు పోసుకోవాలని! మా సిరి నువ్వు. మా వెన్నెల నువ్వు. ఇంగ్లిష్ తేదీల ప్రకారం రేపు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టినరోజు. ఆ సాహితీ తపస్వి రచనల్లో తమకిష్టమైన సినీ గీతాల గురించి... ఆయనతో ప్రయాణించిన పదిమంది దర్శకులు పంచుకున్న ఆత్మీయ అభిప్రాయమాలిక. ఆదిభిక్షువు... వాడినేది కోరేది?... సిరివెన్నెల ‘‘సీతారామశాస్త్రికి అప్పుడే షష్టి పూర్తంటే, ఆశ్చర్యంగా ఉంది. టెలిఫోన్స్లో ఉద్యోగం చేస్తూ, చిక్కనైన కవిత్వం రాస్తూ నా దగ్గరకు వచ్చిన చేంబోలు వారి అబ్బాయి రూపం, స్వరం నాకు ఇప్పటికీ గుర్తే. ‘భరణి’ అని కలం పేరుతో రాస్తుంటే, హాయిగా అమ్మానాన్న పెట్టిన పేరుతోనే పాటలు రాయమన్న సంగతీ గుర్తే. మా ‘సిరివెన్నెల’ సినిమా ఆదిగా శాస్త్రి ఎన్నో ఆణిముత్యాలందించారు. ఆయన రాసిన ప్రతి పాటా నాకు ఇష్టమే. ఏదని చెప్పను? ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది...’ చెప్పనా? ‘అందెల రవమిది పదములదా...’ చెప్పనా? నా సినిమా కాకపోయినా, ‘నేనున్నాను’కు రాసిన ‘ఏ శ్వాసలో చేరితే...’ చెప్పనా? ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? ఇన్ని పాటల పరిమళాలు సినీ సాహిత్యానికి అద్దినందుకు శాస్త్రిని అభినందించనా? ఈ షష్టిపూర్తి వేళ ఆశీర్వదించనా? ఈ పద్మావతీ సీతారాముల కోసం ఆ ఆదిభిక్షువునేది కోరేది... చిరాయురస్తు!’’ - కె. విశ్వనాథ్ దివిని తిరుగు మెరుపులలన సామజ వరగమనా... లాయర్ సుహాసిని ‘‘ప్రతి లైను చివరా ‘సామజవరగమనా’ ఉండేలా ఓ డ్యూయట్ కావాలని సీతారామశాస్త్రిని అడిగితే, చాలా అవలీలగా ఈ పాట రాసిచ్చేశాడు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా బాణీ కట్టారు. ఈ సినిమా పేరు చెబితే అందరికీ ఈ పాటే గుర్తుకొస్తుంది.’’ - వంశీ ముసుగు వేయొద్దు మనసు మీద... ఖడ్గం ‘‘అసలు సీతారామశాస్త్రిగారి పాటల్లో నచ్చింది ఒక్కటి చెప్పమంటే, చాలా చాలా కష్టం. చిటికెలో పది, ఇరవై పాటలు చెప్పగలను నేను. జగమంత కుటుంబం నాది, అలనాటి రామచంద్రుని కన్నింట సాటి, మేఘాలలో తేలిపొమ్మన్నది, జర జర, నువ్వు... నువ్వు... నువ్వే.. నువ్వు... ఇలా చాలా పాటలున్నాయి. అయితే వీటన్నింటిలో నేను బాగా దగ్గరితనం ఫీలయ్యే పాట అంటే మాత్రం ‘ఖడ్గం’లోని ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ పాటే చెప్పాలి. అందులోని ఫిలాసఫీ అంతా నాదే. అసలు మనసుకు ముసుగు వేసుకుని ఎందుకు బతకాలంటూ గొప్ప ఫిలాసఫీని మోడ్రన్ వాయిస్లో చెప్పిన పాట ఇది. అసలు నేనూ, శాస్త్రిగారు కలిస్తే వచ్చే పాటలన్నీ ఇంతే ఓపెన్గా, వయొలెంట్గా, టెర్రిఫిక్గా ఉంటాయి. ఈ పాటల విషయంలో నేను ఆత్మనైతే, ఆయన పరమాత్మ.’’ - కృష్ణవంశీ చిలకా... ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక... శుభలగ్నం ‘‘ప్రతి ఒక్కరి హృదయంలోకి సూటిగా దూసుకెళ్లిపోయి స్థిరపడిపోయిన అద్భుతమైన పాట ఇది. ఆరాటం, పోరాటం, ఆత్రుత... ఇలా మనిషిలో ఉండే రకరకాల భావోద్వేగాలకు, మానసిక పరిస్థితులకు దర్పణం పట్టేలా ఆత్రేయలాగా చిన్న చిన్న పదాలతో సాహిత్యం రాశారు సీతారామశాస్త్రి. అందుకే పాట సెన్సేషనల్ హిట్టయ్యింది... నందీ అవార్డు సాధించింది.’’ - ఎస్వీ కృష్ణారెడ్డి ఏ శ్వాసలో చేరితే... నేనున్నాను ‘‘సిరివెన్నెలగారు ఏ పాట రాసినా, ఆ పాటకు విపరీతమైన రెస్పెక్టు వచ్చేస్తుంది.. వెయిటూ పెరిగిపోతుంది. నా సినిమాలకు చాలా మంచి పాటలు రాసిచ్చారాయన. ‘నేనున్నాను’ కోసం రాసిన ‘ఏ శ్వాసలో చేరితే’ పాట ఎక్స్ట్రార్డినరీ. ఈ పాట తయారీ వెనుక చిన్న కథ ఉంది. సాహిత్యం రాస్తే బాణీ కడతానని కీరవాణిగారు, లేదు లేదు... ముందు బాణీ ఇచ్చేసేయమని శాస్త్రిగారు చాలాసేపు చిన్నపిల్లల్లా వాదులాడుకున్నారు. శాస్త్రిగారు పుస్తకాల బీరువాలో ఆయన రాసిన ‘‘కృష్ణా నిన్ను చేరింది... అష్టాక్షరిగా మారింది... ఎలా ఇంత పెన్నిధి... వెదురు తాను పొందింది...’’ అనే కవిత కనబడింది. ఈ కవిత ప్రేరణతో పాట రాయమని శాస్త్రిగారిని అడిగితే ఈ పాట రాసిచ్చారు. ‘నేనున్నాను’ విజయంలో ఈ పాట పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. కె. విశ్వనాథ్గారి లాంటి మహానుభావుడు ఈ పాట గురించి నన్ను చాలా మెచ్చుకున్నారు.’’ - వి.ఎన్ ఆదిత్య నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... గాయం ‘స్వయంవరం’ సినిమాకి మొదట నేనే దర్శకుణ్ణి. అప్పుడు సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకున్నా. ఆ తర్వాత నేను బయటికొచ్చేశా. సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం తర్వాత నాకు కలగలేదు. ఆయన పాటలన్నీ నా కిష్టమే. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ పాటలు. ‘గాయం’లోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ పాటను మాత్రం లెక్కలేనన్ని సార్లు విన్నా. ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.’’ - చంద్రసిద్ధార్థ్ బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది... శివ ‘‘నేను సిక్త్స్ క్లాస్లో ఉండగా ‘శివ’ రిలీజైంది. ‘బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది..’ పాటకు చాలా బాగా కనెక్ట్ అయిపోయా. పాట అంటేనే తెలీని నాకు అప్పటి నుంచీ పాటతో పరిచయం మొదలైంది. సిరివెన్నెల గారి పాటలతోనే పెరుగుతూ వచ్చా. నేను కాలేజ్ ఏజ్లో ఉండగా వచ్చిన ‘గులాబి’లోని ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ పాట అయితే నా మనసు దోచేసింది. ‘మురారి’లోని పెళ్లి పాట అయితే తెలుగునాట ప్రతి పెళ్లి వీడియోలోనూ కంపల్సరీ అయిపోయింది. ఇలా జీవితంలో ఏ సందర్భం తీసుకున్నా ఆయన పాట ఉండి తీరాల్సిందే. ఆయన మొన్ననే షష్టి పూర్తి ఫంక్షన్ చేసుకున్నారు. కానీ నాకు తెలిసి ఆయనకు పదహారేళ్లే. ‘ఓకే బంగారం’ సినిమాలో ‘మెంటల్ మది’ పాట వింటే ఆయన మది ఎంత యూత్లో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం నేను నాగార్జున-కార్తీలతో తీస్తున్న సినిమాకు అన్ని పాటలూ ఆయనే రాస్తున్నారు.’’ - వంశీ పైడిపల్లి ఎవరో ఒకరు ఎపుడో అపుడు... అంకురం ‘‘గాంధీ ఫిలాసఫీని అద్భుతంగా ఒడిసిపట్టిన పాట ఇది. ఏ ప్రయాణమైనా, ఏ పోరాటమైనా ఒక్క మనిషితోనే మొదలవుతుంది. అది నువ్వే కావాలి... ఆ తర్వాత మిగతా వారంతా నిన్ను అనుసరిస్తారు. ఇలా ఉద్బోధిస్తూ, ఉత్తేజపరుస్తూ ‘ఎవరో ఒకరు...’ పాట రాశారు శాస్త్రి. ఇప్పటికీ, ఎప్పటికీ ఇన్స్పైరింగ్ సాంగ్. నేను డెరైక్ట్ చేసిన ‘శ్రీకారం’లో కూడా ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగాలా?...’ అంటూ మంచి పాట రాశారు.’’ - సి.ఉమా మహేశ్వరరావు ఎందుకే ఇలా గుండె లోపల... సంబరం ‘ఈ పాట కోసం 20 పేజీల నోట్స్ రాసుకు న్నారు. హీరో మనసులోని భావ సంచలనాన్ని అణువణువునా ఈ పాటలో ఆవిష్కరించారు. ‘చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా’ లాంటి గొప్ప వాక్యాలు రాశారు.’’ - దశరథ్ గోపికమ్మ... చాలును లేమ్మా... ముకుంద ‘ముకుంద’లో పాటలన్నీ గురువుగారివే. ముఖ్యంగా ‘గోపికమ్మ’ పాట హైలైట్. ధనుర్మాసంలోని పాశురాలను ఒక పాటలో ఒదిగేటట్టు రాయడం శాస్త్రిగారికే చెల్లింది. ఆయన పాటల్లో నేను ఎక్కువగా వినేది ‘సిరివెన్నెల’లోని ‘ఆది భిక్షువు వాడినేది కోరేది’. - శ్రీకాంత్ అడ్డాల సంభాషణ: పులగం చిన్నారాయణ -
మెకన్నాస్ గోల్డ్... నిజంగా గోల్డ్
అందుకే... అంత బాగుంది! మెకన్నాస్ గోల్డ్ (1969) టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాక తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నా. అట్నుంచి చెన్నై వెళ్లా. ఏదైనా సినిమా చూడాలి. దేవి 70 ఎంఎం ముందు జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంగ్లిష్ సినిమా. పోస్టర్ ఆసక్తికరంగా అనిపించింది. పెద్ద క్యూ. చివరాఖరుకు టికెట్ దొరికింది. స్క్రీన్ నుంచి మూడో వరుస. అంత దగ్గరనుంచీ చూడటంతో మెడ పట్టేసినట్టుగా ఉన్నా, ఆ నొప్పి తెలియలేదు. సినిమాలో అంతలా లీనమైపోయాను. ‘‘ఆహా... ఇది కదా సినిమా అంటే’’ అనే ఫీలింగ్. ఆ సినిమా పేరు ‘మెకన్నాస్ గోల్డ్’... వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఇన్ వరల్డ్ సినిమా. ఇప్పటికి 70 సార్లు చూసుంటానేమో! చూసిన ప్రతిసారీ ఫస్ట్ టైమ్ చూస్తున్న ఫీలింగ్. నాకు తెలిసినంత వరకూ సినీ చరిత్రలో ఇదొక అద్భుతం. మళ్లీ ఎవరూ టచ్ కూడా చేయలేరు. మా గురువు రామ్గోపాల్వర్మ వల్ల ఈ సినిమా ఇంకా బాగా అర్థమైంది. ఆయనతో కలిసి ఈ సినిమా చూస్తున్నపుడు ఇందులోని గొప్పతనం గురించి ఎనలైజ్ చేసి చెప్పారు. ఇందులో ప్రతి కేరెక్టరూ నాకు గుర్తుంది. ప్రతి డైలాగూ గుర్తుంది. చివరకు రీ-రికార్డింగ్ కూడా గుర్తుంది. మీరు నాతోపాటు సినిమా చూస్తే... ప్రతి సీనూ డీటైల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. దాని గ్రేట్నెస్ విశ్లేషించగలను. ఒకసారి సినిమా చూసి నా ఆర్టికల్ చదవండి. లేదా ఈ ఆర్టికల్ చదువుతూ, సినిమా చూడండి. నాతో పాటు మీరు కూడా ‘మెకన్నాస్ గోల్డ్’ నిజంగా గోల్డ్ అని ఒప్పుకుని తీరతారు. రెడీ... స్టార్ట్..! తారాగణం: గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్, టెల్లీ సెవాలస్, కేమిల్లా స్పర్వ్, కీనన్ విన్; దర్శకత్వం: జె. లీ థాంప్సన్ నిర్మాతలు: కార్ల్ ఫోర్మన్, డిమిట్రి టియోరిన్; ఛాయాగ్రహణం: జోసెఫ్ మెక్డోనాల్డ్; సినిమా నిడివి: 128 నిమిషాలు విడుదల: 10-5-1969; నిర్మాణ వ్యయం: 70 లక్షల డాలర్లు ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం డబ్బు. ఈ డబ్బుకు హయ్యెస్ట్ రూపం బంగారం. మనిషి తాలూకు ప్లస్సులూ, మైనస్సులూ అన్నీ డబ్బు దగ్గరే బయటపడిపోతాయి. ఈ సినిమాలో అవన్నీ కనబడతాయి. మెకన్నో అనేవాడు గోల్డ్ కోసం చేసిన సాహస యాత్రే ఈ సినిమా కాన్సెప్ట్. టైటిల్స్ దగ్గర నుంచే మేజిక్ మొదలైపోతుంది. రాబందు పాయింటాఫ్ వ్యూలో ఏరియల్ షాట్. ఇక్కడ రాబందు అనేది క్రూరమైన పక్షి. హయ్యెస్ట్ యాంబిషన్ కలది. ఆకలేస్తే వేటాడేస్తుంది. మనిషిలోని డబ్బు ఆశకు ఇది రిప్రజెంటేషన్ అన్నమాట. మనిషిని పీక్కుతినే రాబందుతో షాట్ ఓపెన్ చేసి, ప్రేక్షకుడి మైండ్ను సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు దర్శకుడు. రాబందు కనుగుడ్లను జూమ్ షాట్లో చూపెడతాడు. 1969లో ఆ షాట్ ఎలా తీశారా అని ఇప్పటికీ సంభ్రమంగా అనిపిస్తుంది. ది ఫిక్షన్. కల్పిత కథ. కానీ నిజమని నమ్మించడానికి, వాయిస్ ఓవర్లో హిస్టరీ చెప్పించాడు దర్శకుడు. అపాచీలంటే అమెరికాలోనే తరతరాలుగా ఉన్నవారు. అమెరికా ఖండాన్ని కొలంబస్ కనిపెట్టకముందే, అపాచీలు అక్కడుండేవారు. వాళ్లు గిరిజనులు. అమెరికన్ గ్రాండ్కానియన్ గురించి సినిమా తీస్తున్నాడు కాబట్టి, అమెరికా చరిత్రతో సినిమాను మొదలుపెట్టాడు. ఆ డెరైక్టర్ ఆలోచనా స్థాయి ఎలా ఉందో చూడండి. ఫస్ట్ సీన్లో హీరో మెకన్నోపై ఒక వృద్ధుడు దాడి చేస్తాడు. అక్కడ కాల్పులు, ప్రతికాల్పులు గమనించండి. ఆరుబయట కొండల మధ్య నిజంగా తుపాకీ పేలితే ఎలాంటి శబ్దాలొస్తాయో, దానికి తగ్గట్టుగా చిత్రీకరించాడు. హీరోయిన్ని విలన్ గ్యాంగ్ దౌర్జన్యంగా ఎత్తుకు వస్తారు కదా. ఆ డైలాగ్స్ వింటే, 1870ల నాటి ఆర్థిక పరిస్థితులు అన్నీ మన కళ్ల ముందు కదలాడతాయి. విలన్ గ్యాంగ్, హీరోని బంధించి ఓ రోప్ బ్రిడ్జ్ మీదుగా తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఈ రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ని రకరకాల భాషల్లో రకరకాల సినిమాల్లో లెక్కలేనన్ని సార్లు చూసుంటారు. అసలు ప్రపంచంలో రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ని తెరపై చూపిన తొలి సినిమా ఇదే. సాహసగాథా చిత్రాల్లో ఒక ఉత్కంఠ తీసుకురావడానికి రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ బాగా ఉపకరిస్తుందని ఈ దర్శకుడు ఆనాడే కనిపెట్టాడు. ఈ సినిమాలో స్టోర్ కీపర్, ప్రీస్ట్, అంధుడు... ఇలా రకరకాల పాత్రలు కనిపిస్తాయి. డబ్బు ఆశ అనేది రకరకాల మనుషుల్లో ఎలా ఉంటుందో ఈ పాత్రల ద్వారా చూపించాడు దర్శకుడు. అడ్వంచరస్ ఫిల్మ్ అయినా హ్యూమన్ రిలేషన్స్తోనే సినిమాను ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చాడు. ప్రతి సన్నివేశంలోనూ ఆశ నిరాశలకూ, మానవత్వానికీ మధ్య దోబూచులాట ఉంటుంది. ప్రతి దృశ్యాన్నీ ఒక ప్రయోజనం కోసం దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ముచ్చటేస్తుంది. ఈ సినిమాలో అన్ని రసాలూ ఉంటాయి. హీరోయిజం, థ్రిల్, యాక్షన్, సెంటిమెంట్, ద్వేషం, అద్భుతం, మూఢ నమ్మకాలు, ప్రాక్టికాలిటీ... ఇలా అన్నీ కనిపిస్తాయి. స్త్రీ పాత్రల మధ్య సహజమైన అసూయ, వ్యామోహాలను బాగా ఒడిసిపట్టాడు. మన చుట్టూ ఉండే సమాజంలోని మనుషులే ప్రతిబింబిస్తారు. అందుకే, సినిమా అంతా ఎడారులు, కొండల్లో నడుస్తున్నా మన చుట్టుపక్కల జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో ధీరోదాత్తుడిలా కాకుండా ఓ మామూలు మనిషిలా అనిపిస్తాడు. అతనికుండే బలహీనతలను కూడా మనకు చెప్పించాడు. ఎక్కడా ఓవర్ బిల్డప్లుండవు. బంగారు నిధి కోసం విలన్ గ్యాంగ్ , హీరో అన్వేషిస్తూ వెళ్తున్న దారిలో ఓ కొలను కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నీళ్లు కనబడిన ఆనందాన్ని అక్కడ న్యూడ్ షాట్స్తో రిప్రజెంట్ చేశారు. విలన్తో పాటు విలన్ గ్యాంగ్లో ఉండే ఇండియన్ గాళ్ కొలనులో నగ్నంగా స్నానం చేయడంలో మనకు వేరే ఫీలింగ్ కనబడదు. అక్కడ అండర్వాటర్ ఫొటోగ్రఫీ అద్భుతం. ఈ సినిమాలోని మరో గొప్పతనం ఏంటంటే - ఒక్క లొకేషనూ రిపీట్ కాదు. ఇప్పట్లోలాగా స్టడీకామ్లు లేవు. అన్నీ పెద్ద సైజ్ కెమెరాలే. అయినా కూడా ఎక్కడా జెర్క్లు లేకుండా గుర్రాల ఛేజ్ తీశారంటే ఎంత శ్రమించి ఉంటారో కదా! హీరోను గుర్రాలతో ఈడ్చుకుంటూ వెళ్లే షాట్స్ చూడండి. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆడియన్స్ డిస్కనెక్ట్ కాకుండా ఎమోషనల్ ఎఫెక్ట్ కోసం వాయిస్ ఓవర్ ప్రక్రియను ఉపయోగించడం నాకు తెలిసి ఇదే ప్రథమం. జాగ్రత్తగా గమనిస్తే, సినిమాలో ఎక్కువ చోట్ల బ్యాక్ ప్రొజెక్షన్ షాట్స్ కనిపిస్తాయి. లొకేషన్ షాట్స్నీ, వాటినీ బాగా మ్యాచ్ చేశారు. సూర్యుడు మన లైఫ్ని ఎప్పుడూ యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. ప్రతీకాత్మకంగా చిత్రమంతా సూర్యుణ్ణీ, రాబందునూ చూపిస్తూనే ఉంటాడు దర్శకుడు. సాహసాలను కూడా విభిన్న కోణాల్లో చూపారు. నేల మీద, వేలాడే బ్రిడ్జి మీద, నీటిలో బల్లకట్టు మీద సాహసాలు చేయించారు. ఈ బల్లకట్టు సాహసకృత్యాలు చూస్తుంటే... మీకు బోలెడన్ని తెలుగు సినిమా క్లైమాక్స్లు గుర్తుకొచ్చేస్తాయి. క్లైమాక్స్కి ముందు సన్నివేశాలు చిత్రీకరించిన తీరుతో కథకు మరింత ఊపు తెచ్చాడు దర్శకుడు. తెల్లవారితే సూర్యుడొస్తాడు. ఆ రాత్రి హీరో, విలన్ గ్యాంగ్ అంతా ఓ చోట బస చేస్తారు. అక్కడి దృశ్యాలను చాలా శక్తిమంతంగా, భావోద్వేగ భరితంగా తీశాడు. దుర్మార్గుడైన విలన్ తాలూకు లక్ష్యాన్ని చూపించాడు. ప్యారిస్లో ఓ గొప్ప మిలియనీర్ కావాలనేది విలన్ ఆశ. మంచివాళ్లకు ఆశలున్నట్టే, చెడ్డవాళ్లకూ ఆశలుంటాయి కదా. దాన్ని డెరైక్టర్ భలేగా సెల్యులాయిడ్పైకి ఎక్కించాడు. ఈ దృశ్యం చూస్తే విలన్ మీద చిన్న జాలి కలుగుతుంది. క్లైమాక్స్లో సూర్యోదయ ఘట్టంలో కొండ తాలూకు పొడవాటి నీడలు నేలపై పరుచుకొనే దృశ్యాలను చాలా అద్భుతంగా తీశాడు. అప్పట్లో ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు కదా. క్లైమాక్స్లో కనిపించే బంగారు నిధి మొత్తం సెట్. రియల్ లొకేషన్లోని దృశ్యానికీ, సెట్కీ మధ్య తేడా తెలియనివ్వకుండా తెలివిగా దృశ్యాలు తీశారు. మనిషి గుండె చప్పుడును ఇక్కడ నేపథ్య సంగీతంగా వాడడం ఎక్స్లెంట్ ఐడియా. చివర్లో కొండ మీద హీరో, విలన్ ఫైట్ చాలా పట్టుగా ఉంటుంది. ‘శివ’లో నాగార్జున, రఘువరన్ల క్లైమాక్స్ ఫైట్కి ఇదే ప్రేరణ. సినిమా అంతా బంగారు నిధి కోసం అన్వేషణే అని మనకు ముందే తెలుసు. కానీ దాని కోసం సాగే సుదీర్ఘ ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా తెరపై చూపడంలో దర్శకుడి మేధ కనబడుతుంది. సైన్స్ని కూడా బాగా వాడుకున్నాడు. గుర్రాలు నీళ్లలో ఈదడం, క్రమబద్ధమైన గుర్రపు డెక్కల శబ్దాలకు కొండచరియలు విరగడం లాంటి సినిమాటిక్ అంశాలను శాస్త్రీయ దృక్కోణం కలగలిపి చూపించాడు. ఈ సినిమా కథ ఒక్కడితో స్టార్ట్ అవుతుంది. ఇద్దరితో ఎండ్ అవుతుంది. మధ్యలో వందలమంది వచ్చి వెళ్లిపోతారు. ఇదో గొప్ప టెక్నిక్. విలన్ జాన్ కొలరాడోగా చేసిన ఒమర్ షరీఫ్ లెజండరీ యాక్టర్. ‘లారెన్స ఆఫ్ అరేబియా’, ‘డాక్టర్ జివాగో’ లాంటి గొప్ప చిత్రాల్లో నటించాడు. హీరో పాత్రధారి గ్రెగరీ పెక్ గొప్ప గొప్ప క్లాసిక్స్ చేశాడు. చిరస్మర ణీయ హారర్ ఫిల్మ్ ‘ఓమెన్’, వరల్డ్ క్లాసిక్ చిత్రం ‘రోమన్ హాలీడే’ చిత్రాల్లో ఆయనే హీరో. ‘మెకన్నాస్ గోల్డ్’ విచిత్రంగా ఫస్ట్ రిలీజ్లో సరిగ్గా ఆడలేదు. తర్వాత తర్వాత ‘వెండితెర ఆణిముత్యం’గా నిలిచిపోయింది. ‘మెకన్నాస్ గోల్డ్’ వచ్చి ఇప్పటికి 46 ఏళ్లవుతోంది. కానీ కాన్సెప్ట్ ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఎంత డెవలప్ అయినా, డబ్బు మీద ఆశలో మార్పు లేదు కదా. ఈ విషయంలో దర్శకుడి ముందుచూపును మెచ్చుకోవాలి. భవిష్యత్తును ముందుగానే దర్శించేవాడే దర్శకుడు కదా. ఇప్పటివరకూ వేల సినిమాలు చూసి ఉంటాం. కానీ సినిమా అంతా హీరో, విలన్ - ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం ఎక్కడా చూసి ఉండం. రామాయణమైనా, మహాభారతమైనా, ఇతర ఏ కావ్యాలను తీసుకున్నా హీరో ఒక చోట ఉంటే, విలన్ మరో చోట ఉంటాడు. ఇలా హీరోని, విలన్ని కలిపి కథ నడపడం గ్రేట్. ‘మెకన్నాస్ గోల్డ్’ షూటింగ్ అంతా జరిపిన ‘గ్రాండ్ కానియన్’ ప్రాంతం అమెరికాలో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. లాస్వేగాస్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అలానే ఉంది. ‘మిషన్ ఇంపాజిబుల్-2’, ‘బ్రోకెన్ యారో’, మన మహేశ్బాబు నటించిన ‘టక్కరి దొంగ’ లాంటి సినిమాలను అక్కడే చిత్రీకరించారు. మైండ్ని, హార్ట్ని, సోల్ని టచ్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందులో ముందు వరుసలో నిలిచే సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే... ఈ సినిమా ఒక అద్భుతం. సినిమాకు ఏమేం శాఖలు అవసరమో, ఎంతవరకూ అవసరమో వాటన్నిటినీ సమగ్రంగా ఉపయోగించుకొని తీసిన సినిమా ఇది. కథ ఎలా చేయాలి? స్క్రీన్ప్లే, డైలాగ్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి? సీన్ మూడ్ ఎలా ఉండాలి?.. ఇలాంటి విషయాల్లో ఈ సినిమా నాకు ఒక డిక్షనరీ లాంటిది. స్టోరీ, స్క్రీన్ప్లే, షార్ప్ డైలాగ్స్, ఫ్రేమ్స్, షాట్స్, మ్యూజిక్, ఇంటరాక్షన్స్, ఎలిమెంట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మూడ్, ఎడిటింగ్, లొకేషన్స్, కాస్టింగ్... ఇలా ప్రతి సీన్ నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ‘సెవెన్ సమురాయ్’ ఐడియాతో మన హిందీ చిత్రం ‘షోలే’ తీసినా, దాని మేకింగ్కి ఇన్స్పిరేషన్ మాత్రం ఇదే. నేను ఎప్పటికైనా ‘మెకన్నాస్ గోల్డ్’ ప్రేరణతో అద్భుతమైన అడ్వంచరస్ సినిమా తీస్తా. అలాగని దీన్ని కాపీ కొట్టను. కేవలం మెకానిజాన్ని వాడుకుంటా... అంతే! ఈ సినిమా చూడండి... మీకూ ఏదో ఒక ప్రేరణ కలగకపోతే నన్ను అడగండి! సాహస గాథలకు స్ఫూర్తి శిఖరం సామాజిక కథాంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకునిగా జె. లీ థామ్సన్ ఫేమస్. కేవలం ఒక తరహా చిత్రాలే కాకుండా వినోద ప్రధానంగా, సంగీత ప్రధానంగా సాగే చిత్రాలు తీసిన ఘనత ఆయనది. ‘మర్డర్ వితవుట్ క్రైమ్’ (1950) ఆయన తొలి చిత్రం. అక్కణ్ణుంచి 1989వరకు ఏడాదికి పది చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. చివరి చిత్రం ‘కింజైట్: ఫర్బిడెన్ సబ్జెక్ట్స్’. దాంతో రిటైర్ అయ్యారాయన. థామ్సన్ 2002లో కన్నుమూసినా, ‘ది గన్స్ ఆఫ్ నావరోన్’, ‘టైగర్ బే’, ‘ఐస్ కోల్డ్ ఇన్ అలెక్స్’, ‘మెకన్నాస్ గోల్డ్’ తదితర చిత్రాలతో చిరంజీవిగా నిలిచిపోయారు. (సంభాషణ: పులగం చిన్నారాయణ) -
కక్షకట్టే.. కృష్ణవంశీని చంపేశారు
విజయవాడ : విజయవాడ భవానీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం అదృశ్యమైన 9వ తరగతి విద్యార్థి కృష్ణవంశీ... అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ మృతితో భవానీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూ కళ్ల ముందే ఉండే బిడ్డ కానరానిలోకాలకు వెళ్లడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదంటూ రోదిస్తున్నారు. తమ బిడ్డను ఎవరో కక్ష కట్టే చంపారని ఆరోపిస్తున్నారు. బాగా చదువుతాడనే అక్కసుతో తన కుమారుడిని చంపేశారని కృష్ణవంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యం... పట్టించుకోని పోలీసులు
విజయవాడ: నగరంలోని పాతబస్తీ సితార సెంటర్ వద్ద విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యమయ్యాడని అతడి తల్లిదండ్రులు మంగళవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లిన కృష్ణవంశీ ఆపై ఇంటికీ తిరిగి రాలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళనతో తెలిపారు. నగరంలోని జీఎన్ఆర్ఎంసీ పాఠశాలలో కృష్ణవంశీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడని అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. -
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్రాజ్
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్రాజ్ నిర్మాతగా మారుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు, నిర్మాత, దర్శకుడు అంటూ పలు రంగాల్లో తనదైన శైలిలో చిత్రాలు చేస్తున్న ప్రకాష్రాజ్ ఇటీవల హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొం దించిన ఉన్ సమయిల్ అరైయిల్ చిత్రం కన్నడంలో మంచి విజయం సాధించినా, తమిళం, తెలుగు భాషల్లో నిరాశపరచింది. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న ప్రకాష్రాజ్ నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నటి రమ్యకృష్ణ భర్త అయిన కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నూతన జంట హీరో హీరోయిన్లుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్. కృష్ణవంశీకి ప్రకాష్రాజ్ అంటే చాలా అభిమానం. ఆయన చిత్రాల్లో ప్రకాష్రాజ్ పాత్రలు చాలా ప్రధానంగా ఉంటాయి. ఆ అభిమానంతోనే ప్రకాష్రాజ్ తన చిత్రానికి దర్శకుడిగా కృష్ణవంశీని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?
ఒకేసారి రెండు ఆసక్తికరమైన వార్తలు.చిరంజీవి తన 150వ సినిమా కోసం మెగాఫోన్ పట్టనున్నారట. అలాగే ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ను పవన్ కల్యాణ్ తనే సొంతంగా డెరైక్ట్ చేసుకోబోతున్నారట. ఈ రెండు వార్తలూ ప్రస్తుతం ఫిలిమ్నగర్లో హాట్ టాపిక్గా నిలిచాయి. ఇంతకూ ఈ వార్తలు నిజమేనా? మొదట చిరంజీవి సినిమా విషయానికొద్దాం. ‘శంకర్దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయడం, దాంతో సినిమాలకు ఏడేళ్లు ఆయన దూరం కావడం, మళ్లీ ఇటీవలే ఆయన తన 150వ సినిమాకు సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టడం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా ఈ 150వ సినిమా మీదే. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. మునుపటి స్థాయిలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకుని సన్నబడ్డారు కూడా. మరో పక్క కథల వేటలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతవరకూ ఏదీ ఓకే కాలేదట. చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తారని ప్రచారం జరిగినా, చిరంజీవి మనసులో మాత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఉంది. ఆ మధ్య బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు. 2015లో తాను మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ 150వ సినిమాను వీవీ వినాయక్ డెరైక్ట్ చేస్తారని చాలా కాలంగా వార్త వినిపిస్తోంది. మధ్య మధ్యలో కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినవచ్చిన వార్త ఏమిటంటే - చిరంజీవి తానే సొంతంగా ఈ సినిమా డెరైక్ట్ చేయనున్నారట. అయితే ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తే తప్ప, ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. తీయబోయే సినిమాకు ఇప్పటికీ కథ ఓకే కాలేదు... కథ నిర్ణయం కాకుండా చిరంజీవి డెరైక్షన్ చేస్తారని చెప్పడం తొందరపాటే అవుతుందని కొంతమంది సినీ పెద్దలు చెబుతున్నారు. అయితే డిసెంబరు నాటికి ఈ సినిమా ప్రాజెక్ట్ విషయంలో ఓ స్పష్టత వస్తుందంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ విషయానికొస్తే - ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం చాలా నెలల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, ఈలోగా హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్గా రూపొందుతోన్న ‘గోపాల... గోపాల’కు పవన్ కమిట్ కావడంతో ‘గబ్బర్సింగ్-2’ వెనక్కు వెళ్లిపోయింది. త్వరలోనే ప్రారంభం అని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ, ఇంతవరకూ షూటింగ్ మొదలు కానే కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ని తానే డెరైక్ట్ చేయాలని పవన్కల్యాణ్ నిశ్చయించుకున్నట్టు ఫిలిమ్నగర్ సమాచారం. పవన్ ఇంతకుముందు ‘జానీ’ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ సినిమా వాణిజ్యపరంగా విఫలమైనా, పవన్లో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించింది. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ మెగా ఫోన్ పట్టనున్నారన్న వార్త తెలుగు చిత్రపరిశ్రమలో హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజానిజాల గురించి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు! -
గణేశ్ని చాలామంది భయపెట్టారు
- కృష్ణవంశీ ‘‘ప్రస్తుతం మాస్, కామెడీ.. అంటూ విచిత్రమైన ధోరణిలోనే ఎక్కువ శాతం సినిమాలుంటున్నాయి. పైగా కెరీర్పరంగా ఈ మధ్య చాలా దిగువ స్థాయిలో ఉన్న నాలాంటి దర్శకుడు ఈ కథ చెబితే చేయడానికి గట్స్ కావాలి. మొదట్నుంచీ చివరి వరకు చరణ్కు ఈ కథపై నమ్మకం తగ్గలేదు’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. రామ్చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విజయోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడు, ‘మనం మంచి సినిమా చేయాలి, ఇలాంటి చిత్రాలకు పరుచూరి బ్రదర్స్ ఉంటే బాగుంటుంది’ అని అన్నయ్య (చిరంజీవి) అన్నారు. ఆయన సలహా మేరకు పరుచూరి బ్రదర్స్తో వర్క్ చేశాం. ఏ చిత్రానికైనా నిర్మాత సహకారం లేకపోతే సరిగ్గా చేయలేం. ఈ సినిమాకు చరణ్ తర్వాత హీరో బండ్ల గణేశే. నాతో సినిమా అన్న తర్వాత గణేశ్ని చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు. కానీ, దేనికీ భయపడకుండా, సినిమాకు ఏది అవసరమో అది సమకూర్చారు. ఇక, ఈ చిత్రంలోని ‘రా రాకుమారా..’ పాట గురించైతే ‘మీరీ పాట కాజల్ కోసమే తీశారు. తనకు 11 షాట్స్.. నాకు 2 షాట్సా’ అంటూ చరణ్ సరదాగా చిన్నపాటి అలక కూడా ప్రదర్శించాడు’’ అని చెప్పారు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకి లిటిల్ బాస్ (రామ్చరణ్) ఇచ్చిన సహకారం మరువలేనిది. కృష్ణవంశీ మన తెలుగువాడు కావడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తే సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. ఇందులో ప్రకాశ్రాజ్ స్థానంలో వేరే నటుణ్ణి ఊహించలేం’’ అన్నారు. ఈ వేడుకలో శ్రీకాంత్, పరుచూరి బ్రదర్స్, కోట శ్రీనివాసరావు, కాజల్ అగర్వాల్, సమీర్ ఆదర్స్ తదితరులు మాట్లాడారు. -
విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ
చెన్నై: తన సినిమాలపై వచ్చే విమర్శలను గౌరవిస్తానని క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ప్రేక్షకులు విమర్శలు పట్టించుకోరని, వారికి నచ్చితే సినిమా చూస్తారని చెప్పారు. తాను తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశానని కృష్ణవంశీ చెప్పారు. యాక్షన్ హీరో రామ్చరణ్ ను కుటుంబ కథా చిత్రంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ముందు కొంచెం భయపడ్డానని వెల్లడించారు. కొత్త అవతారంలో రామ్చరణ్ ను ప్రేక్షకులు ఆదరించడంతో తన అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు. -
ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే!
హైదరాబాద్: గోవిందుడు అందరివాడేలే చిత్రం ఆ విధంగా రూపొందించిన క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదేనని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్చాట్లో బండ్ల గణేష్తోపాటు హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్ - కాజల్ మూడవసారి జంటగా నటించారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ మూవీ నిర్మాణంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఆ ముగ్గురు రామ్ చరణ్ - కృష్ణవంశీ - పరుచూరి వెంకటేశ్వర రావు అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి సినిమా రావలసిన అవసరం ఉందని కృష్ణ వంశీ చెప్పినట్లు తెలిపారు.ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.తెలుగు చిత్రం పరిశ్రమకు ఆయన ఓ వరం అన్నారు. ఫ్యామిలీ డ్రామా, కుటుంబ బంధాలు - అనుబంధాలతోపాటు పల్లెటూరి నేపధ్యంలో చిత్రం నిర్మించడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉండి సహకరించినట్లు తెలిపారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి-పవన్ కల్యాణ్- రామ్ చరణ్లతో చిత్రం నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ఆ రకమైన ఆలోచన మరీ ఎక్కువ ఆశైపోతుందని గణేష్ అన్నారు. చిరంజీవి 150వ సినిమా నిర్మిస్తారా? అగి అడగగా, అటువంటి అవకాశం లేదని చెప్పారు. అయితే ప్రయత్నిస్తానని అన్నారు. గ్రామీణ వాతావరణంలో, కుటుంబ నేపథ్యంలో ఇటువంటి చిత్రాలు రూపొందించడంలో కృష్ణవంశీది అందెవేసి చేయని శ్రీకాంత్ అన్నారు. ఆయన కూడా పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు. ** -
స్విట్జర్లండ్ వస్తానని నాన్నకు లేఖ రాశా!
తాను స్విట్జర్లాండ్ చూడాలనుకున్నప్పుడు నాన్నకు ఎలా చెప్పాలో తెలియలేదని, అందుకే ఆ విషయాన్ని ఒక లేఖలా రాసి ఆయన టేబుల్ మీద పెట్టేశానని 'గోవిందుడు అందరివాడేలే' హీరో రాంచరణ్ చెప్పాడు. విజయదశమి సందర్భంగా హీరో రాంచరణ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్లను దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం అన్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. తనకు అమ్మదగ్గరే ఎక్కువ చనువని, అయితే పెద్ద పెద్ద విషయాలకు మాత్రం నాన్నను అడగాల్సి వచ్చినప్పుడు ఆయనకు లెటర్లు రాసేవాడినని చెర్రీ తెలిపాడు. ఇంద్ర సినిమాలోని 'దాయి దాయి దామ్మా' పాట షూటింగ్ స్విట్జర్లండ్లో చేశారని, అప్పట్లో తనకు ఆ దేశం చూడాలని చాలా ముచ్చటగా ఉండేదని అన్నాడు. దాంతో నతకు సెలవులు మొదలైపోయాయని, స్నేహితులంతా కూడా ఊళ్లు వెళ్లిపోయారని, మీరు ఏమీ అనుకోకపోతే మీదోపాటు స్విట్జర్లండ్ వస్తానంటూ ఓ లేఖ రాశానన్నాడు. చివర్లో నాన్నా.. నో అని మాత్రం చెప్పద్దు ప్లీజ్ అని రాసినట్లు కూడా చెర్రీ వివరించాడు. దాన్ని ఆయన టేబుల్ మీద పెట్టేసినట్లు తెలిపాడు. దాంతో నాన్న నవ్వేసి, వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ అమ్మతో చెప్పారని, అలా స్విట్జర్లండ్ వెళ్లానని చెప్పాడు. -
రమ్యకృష్ణ విషయంలో అస్సలు వంక పెట్టడానికి లేదు!
పరికిణీలూ పూలజడలూ... పట్టుచీరలూ ఏడువారాల నగలూ... ముంగిట్లో ముత్యాల ముగ్గులూ... పెరట్లో ధాన్యాల రాశులూ... అరిసెలూ సున్నుండలూ కజ్జికాయలూ... ఓర చూపులూ దోర నవ్వులూ చిలిపి ముద్దులూ.. ఆక్రోశాలూ.. ఉక్రోషాలూ.. తగాదాలూ తప్పిదాలూ... కృష్ణవంశీ సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే! పండగకు అమ్మమ్మగారి ఊరెళ్లినట్టుగా... ఇంట్లో ఐదు రోజుల పెళ్లి జరిగినట్టుగా... కృష్ణవంశీ సినిమా చూస్తుంటే ఏదో సంబరం..! ఇక్కడ సక్సెస్లూ, ఫెయిల్యూర్లూ పక్కన పెట్టండి. మన మూలాల్ని మనకు గుర్తు చేయడమే కృష్ణవంశీ చేసే పని. గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ... తను మాత్రం బ్యాడ్ హజ్బెండ్ని, బ్యాడ్ ఫాదర్ని అని చెబుతున్నారు. ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ కబుర్లతో పాటు కెరీర్ అచ్చట్లు... ఫ్యామిలీ ముచ్చట్లు మనసు విప్పి ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్నే అటూ ఇటూ మార్చి ‘గోవిందుడు ఆందరివాడేలే’గా తీశారని కామెంట్... కృష్ణవంశీ: ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుంటే తప్పేంటి? ఇవాళ్టి రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలో ఎవరూ ఎవర్నీ కలుపుకొని పోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. అందుకే ఇలాంటి సినిమాల అవసరం ఉంది. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు విసరడాలు.. ఇంకెంత కాలం చెప్పండి? మన సెన్సిబిల్టీకి తగ్గ సినిమా తీయాలని ఇది తీశాను. అది నచ్చింది కాబట్టే, ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ సినిమాలంటే ఒక మనవడో, మనవరాలో కుటుంబాన్ని కలపడానికి ట్రై చేయడం.. ఇదేనా.. వేరే కథలు రావా? వాస్తవానికి అప్పటి ‘దేవుడు చేసిన మనుషులు’, ఆత్మబంధువు’, ‘సంబరాల రాంబాబు’, ‘వారసుడొచ్చాడు’... ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కుటుంబాన్ని కలిపే కథలే కదా. అన్ని కథలనూ అందరూ ఇష్టపడి చూశారుగా. ఇన్ని సినిమాలున్నప్పుడు మళ్లీ అవే చేయడం ఎందుకు? మన కథలన్నీ రామాయణ, భారతాల నుంచే పుడుతున్నాయి. ఎవరేం చేసినా, వాటి చుట్టూనే తిరగాలి. తప్పదు. అయినా నేనేం ఇది కొత్త కథ అనడం లేదు. కాకపోతే.. ‘గోవిందుడు..’ సినిమా కథ వేరు.. ఆ కథలు వేరు. అచ్చ తెలుగు సంప్రదాయాలతో సినిమా తీశారు సరే.. మరి హీరోయిన్ కాజల్ అగర్వాల్తో మందు కొట్టించే సన్నివేశం చేయడం అవసరమా? సమాజంలో ఎవరూ చేయడంలేదా. ఉన్నదే చూపించా. ఏం మగవాళ్లు మందు తాగొచ్చు కానీ, ఆడవాళ్లు తాగకూడదా? మగ, ఆడ సమానం అని హక్కులు మాట్లాడుతుంటారు కదా. మగవాళ్లు పెట్టిన ఆంక్షల ప్రకారం స్త్రీ బతకాలా? సినిమా గురించి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఆడవాళ్లు మందు తాగడాన్ని మీరు హర్షిస్తారా? తప్పకుండా.. ఎందుకంటే అలవాట్లనేవి వారి వ్యక్తిగతం. పురుషాధిక్య ప్రపంచంలో ఆలోచనలన్నీ పురుషుడి పక్షానే ఉంటున్నాయి. నా దృష్టిలో స్త్రీ అంటే ఏంటో చెప్పనా.. ‘స్త్రీలు నాకన్నా తక్కువ అని నేననుకోను.. నాకన్నా పై మెట్టు మీద ఉన్న జాతికి చెందినవారు’ అనుకుంటాను. పదిమందికి నష్టం కలిగించని దేన్నయినా నేను ఆమోదిస్తాను. ‘‘కృష్ణవంశీతో ఇప్పుడు సినిమా అంటే నటన నేర్పిస్తాడు.. నేను అందుకు రెడీగా లేను’’ అని చిరంజీవిగారు బహిరంగంగా పేర్కొనడం పట్ల మీ ఫీలింగ్? అది ఆయన గొప్పతనం. ఆయనకు తెలియని యాక్టింగా? ది బెస్ట్ నుంచి ది వరస్ట్ అనదగ్గ దర్శకులందరితోనూ ఆయన చేశారు. ఆయన డైనమిజమ్, లైవ్లీనెస్, ఎమోషన్ అన్నీ ఇష్టం. గత తరానికి మహానటుడు ఎన్టీఆర్ ఓ నిఘంటువు అయితే.. ఈ తరానికి చిరంజీవి టెక్ట్స్బుక్. ఆయన నా గురించి అలా అన్నారంటే అదంతా ఆయన అభిమానం. ఈ చిత్ర ఆడియో వేడుకలో మీరు ఎమోషనల్ అయ్యారేం? మూడేళ్లుగా ఎదురైన అనుభవాలు, చూసిన పరిస్థితులు, నాతో కొందరు ప్రవర్తించిన విధానం, సినిమాలను సరిగ్గా తీయలేకపోయినందుకు పడిన బాధ.. ఇలా కొన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో సడన్గా అన్నయ్య (చిరంజీవి)లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, చరణ్ లాంటి హీరో... నన్ను నమ్మి కథ పూర్తిగా వినకుండానే ‘సినిమా చేసేస్తాం’ అన్నారు. అప్పుడు భావోద్వేగానికి గురవడం సహజం కదా! ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలకు అతీతంగా స్పందించడం మీకు అలవాటై ఉంటుంది. అలాంటిది ఏవో కొన్ని సినిమాలు ఆడకపోతే ఎమోషనల్ కావడమా? ‘సిందూరం’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పక్కనపెడదాం. వంద శాతం క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఉన్న చిత్రం అది. కానీ, గత రెండు, మూడేళ్లల్లో నేను తీసిన సినిమాల్లో నేననుకున్నది తెరపై పూర్తిగా తీయలేకపోయాను. నేననుకున్నది స్క్రీన్ మీద పెట్టలేకపోయాను. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘పైసా’ని తీసుకుందాం. మూడు నెలల్లో పూర్తి చేసిన ఆ చిత్రం విడుదలకు రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నేననుకున్నది తీయలేకపోవడానికి కారణం.. నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. జనరల్గా ‘మేం అనుకున్నది తీయలేకపోయాం’ అని అప్కమింగ్ డెరైక్టర్లు అంటుంటారు. మీలాంటి దర్శకులు ఇలా అనడమా? నాలాంటి దర్శకులకే ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే, నేను రెగ్యులర్ సక్సెస్ఫుల్ ఫార్ములాలో సినిమాలు తీసే డెరైక్టర్ని కాదు. ఓ కొత్త జానర్లో తీస్తాను. సో.. నిర్మాతను, ఆరిస్టులను కన్విన్స్ చేయడం కష్టం. ఇప్పుడు ‘గోవిందుడు..’ సక్సెస్ అయ్యింది కాబట్టి, తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమానే చేద్దాం అంటారు. కానీ, నేనందుకు విరుద్ధం. వాళ్ల మైండ్సెట్ని దీన్నుంచి నా జానర్లోకి తీసుకెళ్లడానికి కష్టం అవుతుంది. కొత్త జానర్లో సినిమాలు చేసే హీరోలు లేరంటారా? ఇండియాలో ఆమిర్ఖాన్ తప్ప ఎవరున్నారు. ఒక్క ఆమిర్ఖాన్ ఎంతమందిని శాటిస్ఫై చేస్తాడు. అయినా హీరోలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, వాళ్లు కనెక్ట్ కాని కథలో ఎలా ఇమిడిపోగలుగుతారు? ఆమిర్ఖాన్నే తీసుకుందాం. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రం తీసిన దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ‘స్వదేశ్’ కథతో ఆమిర్ఖాన్ని కలిస్తే, ‘నాకు కనెక్ట్ కావడం లేదు’ అని సింపుల్గా చెప్పేశాడు. ‘రోబో’ కథను షారుక్ ఖాన్కి శంకర్ చెబితే, ‘నా వల్ల కాదు’ అన్నాడు. డెరైక్టర్లను హీరోలు నమ్మకపోవడం ఎక్కువయ్యిందంటారా? అంత ఆలోచించలేదు నేను. ఏ హీరో అయినా కథకు కనెక్ట్ కాకపోతే, పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? కనెక్ట్ కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. పోనీ.. డెరైక్టర్ చెప్పిందల్లా చేసుకుపోవడానికి ఆ హీరో ‘రోబో’ ఏం కాదు కదా! గత ఐదేళ్లనే తీసుకుందాం.. హీరో పేరు మీదే 50, 60 కోట్లూ బిజినెస్ అవుతోంది. అన్నీ హీరో పేరు మీదే ఆధారపడుతున్నప్పుడు అతను జాగ్రత్తపడటంలో తప్పేంటి? గుళ్లో రాముడి విగ్రహం ఉందనుకోండి.. రాముడి గురించి ఆలోచిస్తారు తప్ప, దాన్ని చెక్కినవాడి గురించి మీరు ఆలోచిస్తారా? అంటే.. హీరో వర్షిప్ అనేది కరెక్టేనంటారా? ప్రపంచంలో ఏ భాషకు చెందిన పరిశ్రమను తీసుకున్నా.. హీరో వర్షిప్ కచ్చితంగా ఉంది. హాలీవుడ్ సినిమా ‘రాంబో’ని తీసుకుందాం. ఆ చిత్రదర్శకుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు? హీరో ఎవరు అంటే.. టకీమని చెప్పేస్తారు. సో.. ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా హీరోను అప్రోచ్ కావాల్సిందేనా.. హీరోలు తమంతట తాము రారా? అలా ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పుడు నేనెవర్నీ నాకు అవకాశం ఇవ్వండని అడగను. కానీ, నా దగ్గరున్న కథకు ఏ హీరో యాప్ట్ అనిపిస్తే.. వాళ్లను అడుగుతాను. నేను అడగకుండా వాళ్లంతట వాళ్లు ఎందుకు వచ్చి అడగాలి? అసలు ఎవరైనా ఎందుకు అడుగుతారు? మీ సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ వస్తోంది? అనుకోకుండా వచ్చిన గ్యాప్ అది. ఇక ఆ దశ అయిపోయింది. గ్యాప్ లేకుండా చేస్తా. ఆ దశ పోయిందని బలంగా నమ్ముతున్నారా? ‘మురారి’ తీశాను. సంకల్పం అనేది ఆ చిత్రంలోని ప్రధానాంశం. నిజంగా కూడా నాది అదే మైండ్ సెట్. నేను అయిపోయానని ప్రపంచం ముద్ర వేసినప్పుడు నేనే తిరిగొచ్చాను. నేనే చిరంజీవిగారిని, చరణ్ని కలిసి, కన్విన్స్ చేశాను. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి’ అని ‘గోవిందుడు..’లో చెప్పాను. నిజజీవితానికి కూడా అదే వర్తిస్తుంది. నేను ఇంట్లో కూచుంటే ఎవరు పిలుస్తారు. మన ప్రయత్నం ఉంటేనే ఎదుటివాళ్లకి ‘ఇతని దగ్గర ఏదో ఉంది’ అనిపిస్తుంది. మీరెప్పుడూ ఎవరి దగ్గరా అవకాశాలు అడిగినట్లు లేరే? అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగాలి. అందుకే అన్నయ్యను కలిశాను. ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్నుంచి అన్నయ్య ఇంటి తలుపులు నా కోసం తెరిచి ఉన్నాయి. అందుకే వెళ్లి కలిశాను. ఎక్కాల్సిన గడపే ఎక్కా! ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు? నిర్మాణం నా వల్ల కాదు. నేను డబ్బు మనిషిని కాదు కాబట్టి, నిర్మాణం నాకు సూట్ కాదు. కొంతమంది దర్శకులతో పోల్చితే దర్శకుడిగా కూడా మీ సంపాదన తక్కువేనేమో? నాకు సరిపోయేంత డబ్బు ఉంది. ఒకవేళ అది సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలంటే మా ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది (నవ్వుతూ). మనిషికి సరిపోయేంత డబ్బు అంటే... ఎంత? ఒక మంచి ఇల్లు, ఏసీ రూము, తిరగడానికి కారు, అందులో పుష్కలంగా పెట్రోల్ పోయించగలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండు సార్లు విహార యాత్రకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్ఫోన్ బిల్లు, మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్తోమత... ఇంతకు మించి ఏం ఉన్నా... వాడు ఆ ఇంటికి వాచ్మేన్ కిందే లెక్క. పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, దాన్ని మెయిన్టైన్ చేయడానికి పనిమనుషులను పెట్టుకోవాలి. వాళ్లు పనులు చేసుకుని బయటికెళుతుంటే.. ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్.. లోపలి నుంచి ఎవరైనా బయటికొస్తే టెన్షన్.. ఇక సుఖం ఏం ఉంటుంది. భక్తి బాటలో వెళుతున్నట్లున్నారు. వయసు తెచ్చిన మార్పా? వయసా? నాకు వయసు పైబడిందని అనుకోవడం లేదు. అయినా మనకు పదేళ్ల వయసులో కరెక్ట్ అనిపించినది తర్వాత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల వయసులో చేసినది ముప్ఫయ్ ఏళ్లల్లో తప్పనిపించొచ్చు. అనుభవం నేర్పే పాఠాల దారిలోనే మనసు వెళుతుంది. ఇలాంటి మార్పుని ‘మాట మార్చడం’ అంటారేమో? నేను మాట మార్చలేదు. నా విధానం మారిందని చెబుతున్నా. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనుక్కుంటాం. ఓ ఏడాది తర్వాత అది పాతదైపోతుంది. దాన్ని మార్చేసి, కొత్త చొక్కా కొనుక్కుంటాం కదా. ఇదే బాగుంది కదా అని వేసుకోం కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం. వాటికి ఒకటి, రెండేళ్లప్పుడు నిద్రపోవడాన్ని ‘తాచ్’ అనేవాడు. ఇప్పుడా మాటను మేం సరదాగా అంటే, నవ్వేస్తాడు. ఇప్పుడు నిద్ర అంటాడు. ఇంకొన్నాళ్ల తర్వాత స్లీప్ అంటాడేమో. అంటే.. మాట మార్చాడని అనలేం కదా! ఎప్పుడూ ఒకే మాట మాట్లాడం కదా. జ్ఞానం పెరిగేకొద్దీమాట తీరు మారుతుంది. కానీ, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మాట మార్చితే అది తప్పు. మీ సినిమాల్లో మన అరిసెలు, సున్నుండలు అన్నీ చూపిస్తారు. పర్సనల్గా మీకెలాంటి ఫుడ్ ఇష్టం? నాకు సున్నుండలు ఇష్టం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారింట్లో పులిహోర ఇష్టం. రమ్యకృష్ణ చైనీస్ వంటకాలు తిందామంటుంది. సో.. దాన్నీ ఇష్టపడతాను. నాకు పప్పుచారు, ఆవకాయ ఇష్టం. అవి ఉంటే ఇష్టంగా తింటాను. అవి లేకపోతే నాకేదైనా ఒకటే! మన సంస్కృతి, సంప్రదాయాలపై మీరు విపరీతమైన అభిమానం చూపిస్తారు.. ఎందుకని? మన నేటివిటీ మీద మనకే ప్రేమ లేకపోతే వేరేవాళ్లకి ఎందుకుంటుంది? మన మూలాలను వెతుక్కోవాల్సి వస్తోంది. అవి గుర్తు చేయడం కోసమే సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు భాష చచ్చిపోతోందని కొంతమంది ఆంగ్లంలో బాధపడిపోతుంటారు. దానివల్ల లాభమేంటి? ఆరోగ్యం విషయంలో మీరెంత శ్రద్ధగా ఉంటారు? నాకు శ్రద్ధ లేదు. మా ఇద్దరికీ కలిపి రమ్యకు ఉంది. ఆరు నెలలకోసారి జనరల్ చెకప్స్ అంటూ చంపేస్తుంది. ఏం టెస్టులు అని విసుక్కుంటే గొడవ చేసేస్తుంది. నాకు సంబంధించి చాలా విషయాలు తనే చూసుకుంటుంది. అంత జాగ్రత్తగా ఉండే రమ్యగారు మిమ్మల్ని సిగరెట్లు మానేయమని ఎప్పుడూ అనలేదా? ఎందుకు చెప్పదు. ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తుంది. నా బాధ్యత నేను చేయాలి కదా... (నవ్వు) మీరు తీసే సినిమాల్లో అందమైన కుటుంబాలు ఉంటాయి.. మరి.. మీ తోడబుట్టినవాళ్ల గురించి? ఓ తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ హ్యాపీ. నేను ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. యాక్చువల్గా చాలా బ్యాడ్ ఫ్యామిలీ మేన్ని. ఉన్నమాట చెప్పాలంటే.. నాకు సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి ఉండదు. అదేంటి.. మీరు కానిది మీరు తెరపై ఎలా ఆవిష్కరించగలుగుతున్నారు? హ్యుమన్ ఎమోషన్స్ అనేది బయటికి చెప్పలేను కానీ.. లోపల ఉందేమో.. నేను కానిది తీస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు. నేనేం రాక్షసుణ్ణి కాదు. పక్కా ఎమోషనల్ పర్సన్ను. ఫైనల్గా.. మీ తదుపరి చిత్రం గురించి? ఏమీ నిర్ణయించుకోలేదు. ఓ రెండు నెలలు పూర్తిగా రిలాక్స్ అయ్యి, తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. - డి.జి. భవాని మీరు చాలా సింపుల్గా కనిపిస్తారు.. బ్రాండెడ్ దుస్తులు వాడరా? నా డ్రెస్సులన్నీ మా ఆవిడే కొంటుంది. నన్ను ఆవిడెలా చూడాలనుకుంటుందో అలాంటి బట్టలు కొంటుంది. వాటిలో నాకు సౌకర్యవంతంగా ఉన్నవాటిని తొడుక్కుంటా. రమ్యకృష్ణగారి కోసం మీరేమీ షాపింగ్ చేయరా? లేదు. రమ్యకు నేను ఇచ్చిన అతి విలువైన బహుమతులు రెండున్నాయి. అవి ‘కృష్ణవంశీ, బేబో’. మా అబ్బాయి పేరు ఋత్విక్. మేం ముద్దుగా బేబో అని పిలుస్తాం. అసలు మొగుడుగా నువ్వు నాకేమీ ఇవ్వవా? అని రమ్య అడిగితే, ‘కృష్ణవంశీ’ని ఇచ్చాను కదా అంటుంటాను. రమ్య చాలా గ్రేట్. సింపుల్ పర్సన్. బేబో ఏం చదువుతున్నాడు? నాలుగో తరగతి. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని చూశాడా? వాడికి రామ్చరణ్ అంటే ఇష్టం. ‘మగధీర’ను లెక్కలేనన్ని సార్లు చూశాడు. ఆ డీవీడీ అరిగిపోయింది కూడా. ‘గోవిందుడు..’ చూశాడు. వాడికి బాగా నచ్చింది. భర్తగా, తండ్రిగా మీరెంతవరకు బెస్ట్? నేను చాలా బ్యాడ్ హజ్బండ్ని.. బ్యాడ్ ఫాదర్ని. మరి.. మిమ్మల్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణగారు మీరు ‘బ్యాడ్’ అంటే భరిస్తారా? ఒకవేళ అందుకే ఇష్టపడిందేమో (నవ్వుతూ). నేను బ్యాడ్ కాబట్టే, తను బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్గా ఉంటుందేమో. కుటుంబాన్ని చూసుకునే విషయంలో రమ్య చాలా చాలా బెస్ట్. అస్సలు వంక పెట్టడానికి లేదు. రమ్యకృష్ణ, బేబో చెన్నయ్లో ఉంటున్నట్లున్నారు? నేను కూడా చెన్నయ్లోనే ఉంటున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళుతుంటారా? తప్పనిసరిగా వెళతాం. అది కూడా రమ్యే ప్లాన్ చేస్తుంది. ఫలానా చోటకి వెళతాం అని చెబుతుంది. ఇక, టికెట్లు బుక్ చేయడానికి, సూట్కేసులు మోయడానికి నేను రెడీ అయిపోతా (నవ్వుతూ). -
'గోవిందుడు'కు మరో పాట....
ఈ మధ్య కాలంలో సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఓ పాటనో లేక ఓ ఫైట్నో జత చేయటం కామన్గా మారిపోయింది. తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా చేరింది. ఆ సినిమాలో మరో పాటను జత చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. దాంతో చిత్ర యూనిట్ దసరా పండుగకు సెలవు కూడా తీసుకోకుండా ఆ పాటను చిత్రీకరించటంలో నిమగ్నమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం విడుదలయిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఈ పాట చిత్రీకరణ కోసం దసరా పండుగ రోజు కూడా పని చేస్తున్నాడు. పాట పూర్తయ్యేవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని డిసైడ్ అయినట్లు రామ్ చరణ్ తెలిపాడు. ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో కోసం యూఎస్ వెళ్లాలనుకున్నా సమయం లేకపోవటంతో వెళ్లలేకపోయినట్లు చెర్రీ పేర్కొన్నాడు. ఈ దసరాను సెట్లోనే జరుపుకుంటున్నట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్కు జంటగా కాజల్ నటించింది. శ్రీకాంత్, కమలినీ మరో జంటగా తెరపై సందడి చేయగా, సీనియర్ నటుడు రామ్ చరణ్కు తాతయ్య పాత్రలో కనిపించాడు. మరి కొత్తగా జత చేయబోయే పాట సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి. -
సినిమా రివ్యూ: గోవిందుడు అందరివాడేలే
నటీనటులు: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలిని ముఖర్జీ, రావు రమేశ్, కోట శ్రీనివాసరావు సంగీతం: యువన్ శంకర్ రాజా కెమెరా: సమీర్ రెడ్డి నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: కృష్ణవంశీ వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్, సరియైన సక్సెస్ కోసం చూస్తున్న దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్ రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం అక్టోబర్ 1 తేదిన (బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేరిందా?, క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి ఈ చిత్రం గత వైభావాన్ని తీసుకువచ్చిందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం! ఊరు బాగుండాలని కోరుకునే బాలరాజు(ప్రకాశ్ రాజ్)కు చంద్రశేఖర్ (రహమాన్) బంగారం(శ్రీకాంత్) ఇద్దరు కొడుకులుంటారు. తన పెద్ద కుమారుడ్ని వైద్యుడిని చేసి తాను కట్టించే ఆస్పత్రి ద్వారా గ్రామానికి సేవలందించాలని బాలరాజు కోరుకుంటారు. అయితే ఊహించని విధంగా పెద్ద కుమారుడు తన కోరికను తిరస్కరిస్కరించడంతో బాలరాజు షాక్ గురువుతాడు. దాంతో బాలరాజు, చంద్రశేఖర్ లు విడిపోతారు. తండ్రికి దూరమై విదేశాల్లో స్థిరపడిన చంద్రశేఖర్ కి అభిరామ్(రామ్ చరణ్), ఓ కూతరు ఉంటుంది. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చంద్రశేఖర్ ఓ కారణంతో కుటుంబానికి దూరమయ్యాని చింతిస్తాడు. తండ్రి బాధను తెలుసుకున్న అభిరామ్ తన తాత బాలరాజు వద్దకు చేరుకుని ఏం చేశాడు? కుటుంబాన్ని కలుపడానికి చేసిన ప్రయత్నంలో ఎలాంటి సమస్యుల ఎదురయ్యాయి? సమస్యల్ని ఎలా అధిగమించాడు. తండ్రిని, తాతను, కుటుంబాన్ని కలుపడానికి అభిరామ్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? ఈ క్రమంలో తన మరదలు సత్య(కాజల్) ప్రేమను ఎలా దక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానమే 'గోవిందుడు అందరివాడేలే' ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీ ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్ ఫోటోగ్రఫి కృష్ణవంశీ డైరెక్షన్ మైనస్ పాయింట్స్: సంగీతం రొటీన్ కథ, క్లైమాక్స్ మాస్, యాక్షన్ చిత్రాల విజయాలతో జోరు మీదున్న రాంచరణ్ ఈ చిత్రంలో కుటుంబాన్ని కలిపే మనవడి పాత్రను పోషించాడు. రామ్ చరణ్ ఇమేజ్ తగినట్టుగా సాంగ్స్, ఫైట్స్ తో అదనంగా భావోద్వేగాలను పలికించే అభిరామ్ పాత్రను పోషించాడు. దసరా పండగ పురస్కరించుకుని వచ్చిన ఈ చిత్రంలో అభిమానుల్ని మెప్పించడానికి అభిరామ్ గా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. మరదలిగా 'సత్య' పాత్రలో కనిపించిన కాజల్, రామ్ చరణ్ ల మధ్య కెమిస్ట్రీ పడింది. రామ్ చరణ్ తో రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలకే పరిమితం కాకుండా, శృంగార సన్నివేశాల్లో కాజల్ కొంత అడ్వాన్స్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కూడా కాజల్ తన వంతుగా ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక ఈ చిత్రంలో బంగారం పాత్రలో శ్రీకాంత్ కొంత నెగిటివ్ షేడ్ ఉన్న కారెక్టర్ ను పోషించాడు. బాధ్యత తెలియని కుమారుడిగా జూదం, మద్యానికి బానిసైన వ్యక్తిగా తన మార్కును ప్రదర్శించాడు. ఇక కమిలిని ముఖర్జి, జయసుధ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. బాలరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్ మరోసారి విజృంభించాడు. కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా అందరి బాగు కోసం తపన పడే పాత్రలో జీవించాడు. ఈ చిత్ర భారాన్నంత తన నటనతో ప్రకాశ్ రాజ్ భుజాన వేసుకున్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. మరోసారి ప్రకాశ్ రాజ్ ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో అప్పుడప్పుడు వచ్చే విలన్ పాత్రల్లో రావు రమేశ్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో వారు చేయాల్సింది ఏమిలేకపోయింది. సాంకేతిక నిపుణుల పనితీరు: జోర్డాన్ తో ఇతర అందమైన లోకేషన్లను తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి రాణించారు. ఈ చిత్రంలో భారీ సంఖ్యలో ఉన్న ఆర్టిస్టుల మూడ్ ను ఫ్రేమ్ లో బంధించడంలో సమీర్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్ర ఆడియోలో ఆకట్టుకోలేకపోయిన పాటల్ని తెరపైన చిత్రీకరించడంలో సమీర్ తన పనితనాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బండ్ల గణేష్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్: ఆడియోలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ చిత్రంలో సిట్వువేషనల్ గా వచ్చే పాటలు తెరపై ఆలరించాయి. పాటలు అంతగా క్యాచీగా లేకపోవడం కొంత ప్రేక్షకుల్ని నిరుత్సహపరిచే అంశమని చెప్పవచ్చు. నీలిరంగు చీరలోన, బావగారి చూపే పాటలు సందర్భోచితంగా బాగున్నాయి. రాంచరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అభిమానులను ఉత్సాహపరిచేవిధంగా తెరకెక్కించారు. కృష్ణవంశీ దర్శకత్వం: చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న కృష్ణవంశీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో కూడా తన మార్కును వదలకుండా... ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపిస్తుంది. సీతారామయ్య మనవరాలు, కలిసుందారాం చిత్ర కథలను దాదాపు పోలివుండే 'గోవిందుడు అందరివాడేలే' తన స్టైల్లో మురారీ, నిన్నే పెళ్లాడుతా లాంటి చిత్రాల శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణవంశీ స్టైల్ భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, విభేదాలు, మనస్పర్ధలు లాంటి అంశాలతో తెరపై మరోసారి తెలుగుదనం ఉట్టిపడేలా రూపొందించడంలో కృష్ణవంశీ సఫలమయ్యారు. ముగింపు: దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' సూపర్, డూపర్ హిట్ అనే టాక్ బయటికి చెప్పలేకపోయినా.. తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే పాత చిత్రాల కథకే మళ్లీ కొత్త రంగులద్దారనే విమర్శలు ఓ వైపు ఉన్నా.. సెలవు దినాల్లో అభిమానులు, ప్రేక్షకులకు పైసా వసూలు చేసే చిత్రంగా 'గోవిందుడ్ని తీర్చి దిద్దారు. -రాజబాబు అనుముల -
'గోవిందుడు అందరివాడేలే' వర్కింగ్ స్టిల్స్
-
నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను : చిరంజీవి
‘‘ ‘సినిమా రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి వెళ్లారు కదా... మీకు బాధ అనిపించడం లేదా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నిజానికి నాకు ఆ బాధ లేదు. దానికి కారణం చరణ్. నేను అనుకున్నదానికంటే తాను మంచి స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు చరణ్ని తెరపై చూస్తుంటే... నన్ను నేను చూసుకుంటున్నట్లుంటుంది. పాత్ర కోసం ఎంత కష్టానికైనా తాను నెరవడు. ఒళ్లు హూనం చేసుకొని ఇంటికొస్తాడు. కానీ... ఎక్కడా కష్టపడ్డట్టు కనిపించడు. ‘అంత కష్టపడతావ్. బాధ అని కూడా అనవేంట్రా...’ అని వాళ్ల అమ్మ అడిగితే... ‘నాన్న పడిన కష్టంతో పోల్చుకుంటే నాదీ ఓ కష్టమా’ అంటాడు. నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను’’ అని చిరంజీవి అన్నారు. రామ్చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయిక. శ్రీకాంత్, కమలినీముఖర్జీ, ప్రకాశ్రాజ్, జయసుధ కీలక పాత్రధారులు. యువన్శంకర్రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సోమవారం హైదరాబాద్లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. చిరంజీవి మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని నాకూ ఉండేది. కానీ... నటీనటుల నుంచి నటన రాబట్టడంలో ఆయన దిట్ట. ఇన్ని సినిమాలు చేశాక, ఆయనకు నచ్చేట్టు నటించడానికి నేను ఆయన ముందు తలవంచడం ఇష్టం లేక చేయలేదు. నాకు ఒక ‘విజేత’ సినిమాలా చరణ్కి ‘గోవిందుడు అందరివాడేలే’ నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని చెప్పారు. ‘పవర్స్టార్... పవర్స్టార్’ అని అభిమానులు చేస్తున్న నినాదాలకు బ్రేక్ వేస్తూ -‘‘ ‘గోవిందుడు అందరివాడేలే’ 150వ రోజుల వేడుకకు కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా!’ అని చిరంజీవి అన్నారు. చరణ్ మాట్లాడుతూ -‘‘నేను ఎన్ని హిట్ సాంగ్స్లో నటించినా.... ఈ సినిమాలోని ‘నీలిరంగు చీరలో’ పాట అన్నింటికంటే బెస్ట్. సుద్దాల అశోక్తేజగారు గొప్పగా ఆ పాట రాశారు’’ అని తెలిపారు. చరణ్ చిత్రసీమలో జగదేకవీరునిగా ఎదగాలని కె.రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితం చిరంజీవిగారు ఇండస్ట్రీకి రాకుంటే... పవన్కల్యాణ్, చరణ్, బన్నీలను తెరకు పరిచయం చేయకుంటే... తెలుగు సినిమా పరిస్థితిని ఊహించలేమనీ బండ్ల గణేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, పరుచూరి బ్రదర్స్, కె.ఎస్.రామారావు, వరుణ్తేజ్, సాయిధరమ్తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు మారాడా?
ఊహాగానాలుగానీ, పుకార్లు గానీ సినిమా రంగంలో వచ్చినన్ని ఇంకెక్కడా రావు. 'ఆలు లేదు సూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం' అన్నట్లు సినిమా గురించి ప్రకటనే చేయలేదు. అప్పుడే దర్శకుడిని కూడా మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత ప్రచారం జరగడానికి అతనేమీ సాదాసీదా హీరో కాదు. అందుకే అంత ప్రచారం. తెలుగు సినిమా అభిమానులతోపాటు టాలీవుడ్ కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఆ హీరో కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులన్నీ మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసమే. చిరు సినిమా నటనకు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత ఆయన రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఇప్పుడు అక్కడ అంత బిజీ లేకపోవడంతో ఆయన దృష్టి మళ్లీ నటనవైపు మళ్లింది. దాంతో తన 150వ చిత్ర కథ కోసం కసరత్తు చేస్తున్నారు. మంచి కథ ఇస్తే కోటీ రూపాయలు ఇస్తానని సినిమా రచయితలకు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. తన సినీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత గల చిత్రంగా దీనిని రూపొందించడానికి ఆయన కృషి చేస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఈ సినిమా ఉండాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. ఈ మూవీకి ఠాగూర్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చిన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని వినిపించింది. ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్ మరో క్రియేటివ్ డైరెక్టర్కి దక్కే అవకాశం ఉందని అంటూన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో చిరంజీవి సినిమానే హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తన తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' దర్శకుడు కృష్ణ వంశీకి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. ''గోవిందుడు అందరివాడేలే చిత్రం సూపర్ హిట్ కొట్టు నాన్నతో 150 చిత్రం పట్టు'' అని కృష్ణ వంశీతో రామ్ చరణ్ అన్నట్లు వినిపిస్తోంది. కృష్ణ వంశీ కూడా ఎంతోపట్టుదలతో గోవిందుడు అందరి వాడేలే చిత్రాన్ని సూపర్ హిట్ కొట్టే విధంగా రూపొందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా సమయం దొరికిన ప్రతిసారి ఆయన మెగాస్టార్ను పొగడ్తలతో ముంచేస్తున్నారని కూడా వినవస్తోంది. అయితే కృష్ణ వంశీ కూడా అంత తక్కువేమీ కాదు. స్క్రీన్ప్లే నడపడంలో దిట్ట. ఏదిఏమైనా ఈ పరిస్థితులలో కృష్ణ వంశీకి 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఓ పెద్ద పరీక్షే. ఇక చిరంజీవి 150వ సినిమా విశేషాలు ఆయన పుట్టిన రోజు ఈ నెల 22న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. - శిసూర్య -
గోవిందుడు అందరి వాడేలే న్యూ మూవీ స్టిల్స్
-
ఆ మూర్ఖత్వంతోనే...చిరంజీవి సినిమా చేయలేకపోయా : కృష్ణవంశీ
‘‘ప్రేక్షకులకు 50 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సినిమా తీస్తున్నాను. నేను పొగరుతోనో, కొవ్వుతోనో ఈ మాట చెప్పడం లేదు. నమ్మకంతో చెబుతున్నాను’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఆయన దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం - ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ - ‘‘నేను ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కానీ.... నాకెవడు అవకాశం ఇచ్చేది? అనేంత మూర్ఖత్వంతో ఉండేవాణ్ణి. ఆ మూర్ఖత్వంతోనే... చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వచ్చినా చేయలేకపోయా. ఒకానొక దశలో నా కెరీర్ డైలమాలో పడిపోయింది. అలాంటి సమయంలో నాకు అవకాశం ఇచ్చాడు చరణ్. ‘గోవిందుడు అందరివాడేలే’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. ఇక ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. బిహేవ్ చేశారు. ఇళయరాజాగారబ్బాయి యువన్, చిరంజీవిగారబ్బాయి చరణ్లతో కలిసి పనిచేసిన తొలి దర్శకుణ్ణి బహుశా నేనే. ఇళయరాజాగారు మేస్ట్రో అయితే, యువన్శంకర్రాజా మాస్టర్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు’’ అని చెప్పారు. ‘‘‘మగధీర’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అనే కన్ఫ్యూజన్లో ఉన్న టైమ్లో ఓ సారి కృష్ణవంశీ కనిపించారు. ‘సార్.. మనం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం’ అనడిగాను. బహుశా కృష్ణవంశీకి ఇది గుర్తు లేదనుకుంటా. అప్పుడాయన నా వంక ఓ చిన్నపిల్లాణ్ణి చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లకైనా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెబుతున్నాను... కృష్ణవంశీ తెలుగు సినిమాకు ఆస్తి. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కాజల్ అగర్వాల్తో మూడు సినిమాలు చేశాను. గడచిన మూడు సినిమాల్లో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపించింది. సాంకేతికంగా ఈ సినిమా ఓ వండర్’’అని రామ్చరణ్ చెప్పారు. ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల ప్రచార చిత్రాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ‘గోవిందుడు...’ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఎక్కడికో పోతున్న విలువలు గుర్తొచ్చాయి. తెలుగు సినిమా స్టామినాను తెలియజెప్పే సినిమా ఇదని కచ్చితంగా చెప్పగలను. డబ్బు కోసం కాదు కథలోని ఆత్మ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. మారిపోతున్న మానవతా విలువలకు ప్రతిరూపంగా ఈ సినిమా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, సమీర్, కాదంబరీ కిరణ్ తదితరులు మాట్లాడారు. -
కాజల్ నువ్వు ఏమనుకోనంటే...
హైదరాబాద్: 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో కాజల్ బాగా చేసిందని హీరో రామ్చరణ్ కితాబిచ్చారు. ఆమె కెరీర్ లో ఇదే బెస్ట్ అని కూడా అన్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో టీజర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ... 'కాజల్ నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను. ఈ సినిమాలోనే నువ్వు బెస్ట్ గా చేశావు' అంటూ పొడిగారు. ఈ సినిమా కోసం కాజల్ చాలా కష్టపడిందని తెలిపారు. షూటింగ్ కంటే జిమ్ లోనే ఎక్కువసేపు గడిపిందని వెల్లడించారు. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన కమలీ ముఖర్జీపై కూడా చరణ్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్, గోదావరి సినిమాలు చూసి కమలీ ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అందరికీ నచ్చుతుందని చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణవంశీతో సినిమా చేయాలని నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తాను ఈ సినిమా చేయకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ తనకు దూరమయ్యేవారని చరణ్ అన్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' అందరికీ నచ్చే మంచి సినిమా అవుతుందని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరావు, గణేష్, కాజల్, కమిలీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. -
గోవిందుడు ఆడియో టీజర్ విడుదల
-
మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది
‘‘హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా నేను హీరోగా ఫీలవ్వలేదు. ఒక సాధారణ నటునిగానే ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ప్రత్యేక పాత్రలు పోషిస్తుంటే నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నటనను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’’ అన్నారు నరేశ్. దాదాపు ఇరవై ఏళ్ల పాటు కథానాయకునిగా వెలిగిన ఆయన... ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నరేశ్ విలేకరులతో ముచ్చటించారు.నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు: నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. 2014 నాకు మంచి ఫలితాలనిస్తోంది. ‘దృశ్యం’ నాకు మంచి పేరు తెస్తోంది. సందీప్ కిషన్ హీరోగా కన్మణి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే నితిన్-కరుణాకరన్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నా. ‘లక్ష్మీ రావె మా ఇంటికి’లో కూడా నాది మంచి పాత్ర. అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నా సినిమా కెరీర్ చాలా వరకూ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావడం పునర్జన్మ వచ్చినట్లయ్యింది. నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు. టైమ్ కూడా కలిసి రావాలి. మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది.మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు: త్వరలోనే మా అబ్బాయి నవీన్ హీరోగా పరిచయం కానున్నాడు. కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకత్వంలో అడ్డాల చంటి ఆ సినిమా నిర్మిస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కృష్ణ వంశీ
-
రామ్ చరణ్ కొత్త సినిమాపై వదంతులు
రామ్ చరణ్ కొత్త చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' నిర్మాణం పూర్తి కాలేదు. షూటింగ్ జరుగుతూనే ఉంది. అప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అంటూ వదంతులు వ్యాపించాయి. విడుదలకు చాలా సమయం ఉన్నది. అయినా రామ్ చరణ్ ఈ తాజా సినిమా ప్రాజెక్ట్కు అప్పుడే ఫ్లాప్ టాక్ వెంటాడుతోంది. మేకింగ్ స్టిల్స్ గురించి ఎవరు నోరు విప్పినా, ఫిల్మ్ నగర్ గాసిప్స్ విన్నా సరే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి చాలా విషయాలే బయటకు వచ్చాయి. నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు కృష్ణ వంశీలతో హీరో రామ్ చరణ్కు అస్సలు పొసగడం లేదని సమాచారం. కథను మళ్ళీ మార్చాలంటూ చరణ్ డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మినగర్ వర్గాల టాక్. మల్టీస్టారర్గా మరో నటుడిని తీసుకోవాలని చరణ్ కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇలా సినిమా యూనిట్పై ఒత్తిడి పెరుగుతోందని చరణ్పై విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. అంతేగాక ఆ టార్చర్కు తట్టుకోలేక కృష్ణవంశీ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కూడా ప్రచారం నడిచింది. హీరో విక్టరీ వెంకటేష్ తాజా వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలపట్ల ఆసక్తి చూపే తన వద్దకి చాలా కథలు వస్తున్నాయని, కానీ ఏవీ తనకి నచ్చడం లేదని వెంకటేష్ చెప్పారు. గోవిందుడు అందరివాడేలే కథతో కృష్ణవంశీ తన వద్దకు వచ్చిన విషయాన్ని కూడా వెంకీ ప్రస్తావించాడు. అంటే, కథ నచ్చకే తానూ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్చరణ్ తేజ సినీరంగ ప్రవేశం చేసి ఏడేళ్లు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఇన్ని సినిమాలు విజయం సాధించడం తండ్రి చిరంజీవి అభిమానుల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించినట్లు భావిస్తున్నారు. విడుదలకు ముందే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంపై ఫ్లాప్ అంటూ ప్రచారం జరుగుతుందంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ - చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానులకు చాలా ఆశలు ఉన్నాయి. దర్శకుడు కృష్ణ వంశీ సామాన్యుడు కాదు. కథ, కథనంలో కొత్తదనం చూపించగల దిట్ట. వీరి కలయికలో వస్తున్న చిత్రం చూడకుండా ఇలా పుకార్లు వ్యాపించడం ఏమిటి? ఇందులో చరణ్ ఇంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా కొత్త గెటప్లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటు, బూటులో కనిపించిన చరణ్ పల్లెటూరి చిన్నవాడి గెటప్లో కనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఎలా? కుటుంబ సంబంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో వినోదాత్మకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రధాన పాత్రలలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, తమిళ నటుడు రాజ్కిరణ్ నటిస్తున్నారు. - సూర్యభరత్ -
నా గెటప్ గమ్మత్తుగా ఉంది!
విదేశాల నుంచి దిగిన ఆ కుర్రాడికి మట్టి విలువ తెలీదు. కానీ మనిషి విలువ తెలుసు. మనసుల్ని చదవడం తెలుసు. తెగిన బంధాలను కలపడం తెలుసు. అందుకే... దూరమైన తనవారందర్నీ ఒక్కటి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. చివరకు ఆ కుటుంబం పాలిటి గోవిందుడయ్యాడు. కృష్ణవంశీ-రామ్చరణ్ల ‘గోవిందుడు అందరివాడేలే’ కథ సింపుల్గా ఇదే. ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలకే పరిమితమైన రామ్చరణ్... తొలిసారి పూర్తిస్థాయి కుటుంబ కథలో నటిస్తున్నారు. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ.. చిత్రాల తరహాలో కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేశ్ దర్శకుడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ని ఆగస్ట్ 1 నుంచి లండన్లో జరుపనున్నారు. యువన్ శంకర్రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ 22కు రెండు రోజుల ముందు విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేశ్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 1న దసరా కానుకగా ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల కానుంది. ఈ సినిమా గురించి చరణ్ చెబుతూ -‘‘నా కెరీర్లో దసరా కానుకగా విడుదల కాబోతున్న తొలి సినిమా ఇది. అందుకే... ఆత్రుతగా ఉంది. ఇటీవలే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూశాను. నాతో సహా ప్రతి ఆర్టిస్టూ అందంగా కనిపించారు. ఆ క్రెడిట్ మొత్తం మా కెమెరామేన్ సమీర్రెడ్డిదే. మొన్ననే కృష్ణవంశీ ఓ పాటను చిత్రీకరించారు. ఆ పాటలో నా గెటప్ గమ్మత్తుగా ఉంది. కృష్ణవంశీ నాతో ఓ ఫన్నీ గెటప్ వేయించారు. చూడ్డానికే చాలా భిన్నంగా ఉంది. నా కెరీర్లో ఓ మెమరబుల్ సినిమాగా ఇది నిలుస్తుంది’’ అన్నారు. కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, నిర్మాణం: పరమేశ్వరా ఆర్ట్స్. -
గోవిందుడు అందరివాడేలే మూవీ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
గోవిందుడు అందరివాడేలే మూవీ వర్కింగ్ స్టిల్స్
-
క్రియేటివ్ కృష్ణవంశీకి మెగా తలనొప్పి!!
ఎందరో టాలీవుడ్ స్టార్లకు సరికొత్త ఇమేజ్ ఇప్పించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీకి ఇప్పుడు 'మెగా' తలనొప్పి పట్టుకుందని వినికిడి. నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుతో మురారి, రవితేజకు హీరో ఇమేజి తెచ్చిపెట్టిన సిందూరం.. ఇలా అనేక విజయవంతమైన సినిమాలను తన ఖాతాలోంచి ఇప్పించిన కృష్ణవంశీ.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కుమారుడు రాం చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆయనకు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతూ.. కంటిమీద కునుకు పట్టకుండా కష్టపెడుదట. టాలీవుడ్లో ఫ్యామిలీ మూవీలు తెరకెక్కించడంలో కృష్ణ వంశీ దారే వేరు. ఆయన రాం చరణ్తో తీస్తున్న గోవిందుడు అందరివాడే అనే ఫ్యామిలీ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సహజంగానే దాన్ని తీసుకెళ్లి చిరంజీవికి చూపించాడు కృష్ణవంశీ. కానీ, ఆ రషెస్ చూసిన మెగాస్టార్కు అది నచ్చకపోవడంతో ఏకంగా స్టార్కాస్టింగ్ మార్చి మళ్లీ షూటింగ్ చెయ్యాలని ఆదేశించాడట. సాధారణంగా అయితే కృష్ణవంశీ చాలా సహజంగా తన చిత్రాలను తెరకెక్కిస్తారు. హీరో ఇమేజితో ఏమాత్రం సంబంధం లేకుండా కథనే హీరోగా చేసుకుని తన సినిమాలు తీస్తుంటాడు. కానీ ఈసారి మెగా జోక్యం వల్ల ఇప్పుడు కథలో కూడా మార్పులు చేయాల్సి రావడంతో ఆయన మార్కు ఫ్లేవర్ సినిమాలో కనపడుతుందో లేదోనని అభిమానులు తలపట్టుకుంటున్నారు. ఇదే టెన్షన్తో కృష్ణవంశీ ఆరోగ్యం కూడా పాడైందని వినిపిస్తోంది. -
టెన్షన్ పడుతున్న కృష్ణ వంశీ
-
నవ్విస్తూ... కవ్విస్తూ... లవ్విస్తూ
కృష్ణవంశీ సినిమా అంటేనే ఓ ఫెస్టివల్ మూడ్ని తలపిస్తుంది. కామెడీకి కామెడీ... రొమాన్స్కి రొమాన్స్... సెంటిమెంట్కి సెంటిమెంట్. నవరసాల్ని అందంగా సమ్మిళితం చేసి సుందరంగా సినిమాను తీర్చి దిద్దుతారాయన. రామ్చరణ్తో కృష్ణవంశీ చేస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ ఇదే తరహాలో ఉంటుందంటున్నారు నిర్మాత బండ్ల గణేశ్. రామచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, జయసుధ ముఖ్య జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరో కీలకమైన జోడీగా కనిపించనున్నారు. ఈ సినిమా విశేషాలను బండ్ల గణేశ్ వివరిస్తూ -‘‘కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్స్ చేశాం. జూన్ 5 నుంచి హైదరాబాద్లోని రామానాయుడు సినీ విలేజ్లో జరిపే షెడ్యూల్లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాం. అనంతరం లండన్లో షూటింగ్ చేస్తాం. రామ్చరణ్, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్ల మధ్య నడిచే సన్నివేశాలు ఆద్యంతం నవ్విస్తాయి. రామ్చరణ్, కాజల్ మధ్య రొమాన్స్ చాలా లవ్లీగా ఉంటుంది. ఇటీవలే సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా మూడు పాటలు రికార్డ్ చేశారు’’ అన్నారు. -
తెగిన బంధాలకు ముడి...
చిరుత, రచ్చ, నాయక్, ఎవడు... యాక్షన్ సినిమాలు. ‘మగధీర’... ఫాంటసీ చిత్రం. ఆరంజ్... ప్రేమకథా చిత్రం. ఇక మిగిలింది కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యమే. అది కూడా చేస్తే భిన్న రకాల సినిమాలు చేసిన క్రెడిట్ కొట్టేస్తారు చరణ్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. మానవ సంబంధాలను జనరంజకంగా తెరకెక్కించే కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నానక్రామ్గూడాలోని రామానాయుడు సినీ విలేజ్లో శరవేగంగా జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, రాజ్కిరణ్, కమలినీ ముఖర్జీ తదితర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ. అలాగే... కొన్ని పోరాట సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తారు. వారం క్రితం మొదలైన ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు జరుగుతుంది. తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఇందులో చరణ్ బాబాయ్గా శ్రీకాంత్, తాతగా రాజ్కిరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ తండ్రిగా ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు. తెగిన బంధాలను మళ్లీ ముడివేసి, కుటుంబంలో ఆనందాన్ని నింపే పాత్రలో ఇందులో చరణ్ నటిస్తున్నారు. మెగా అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వస్తోందని యూనిట్ సభ్యుల సమాచారం. దసరాగా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్రాజా, కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్. -
గోవిందుడు అందరి వాడేలే మూవీ స్టిల్స్
-
కుటుంబాన్ని ఒక్కటి చేసే విజేత!
కృష్ణంవంశీ సినిమాల్లో కుటుంబ సన్నివేశాలంటే... సందడి సందడిగా ఉంటాయి. ప్రస్తుతం రామ్చరణ్తో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రానిది కూడా కుటుంబ నేపథ్యమే. ఈ సినిమా షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీముఖర్జీలపై కథకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, పచ్చదనాన్ని పట్టుచీరలా చుట్టుకున్న పొల్లాచ్చి లొకేషన్ అందాలు ఈ కథకు ఆభరణంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 26 వరకూ అక్కడే జరిగే ఈ షెడ్యూల్లో... కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ యాక్షన్ కథాంశాలతో మెరిపించిన చరణ్... ఈ సినిమాలో ‘దూరాలు మనుషులకే కానీ... మనసులకు కాదు’ అని కుటుంబానికి తెలియజెబుతూ... తెగిన బంధాలను ఒక్కటి చేసే విజేతగా కనిపిస్తారని సమాచారం. ఈ నెలాఖరులో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ని విడుదల చేయనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కథకు తగ్గ టైటిల్ను త్వరలోనే ఖరారు చేయనున్నారు. -
క్లాస్ లుక్లో కనిపించబోతున్న రామ్ చరణ్
-
ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే!
కృష్ణవంశీ సినిమాలే కాదు. ఆయన మాటలు కూడా ఎడ్యుకేట్ చేసేలా ఉంటాయి. ప్రేక్షకుల అంతరంగాలే ఆయనకు కథావస్తువులు. ప్రేమ, నక్సలిజం, ఫ్యాక్షనిజం, టైజం, కుటుంబం, ఫాంటసీ, దేశభక్తి... కాదేదీ కృష్ణవంశీ కథాంశానికి అనర్హం. ఫార్ములాకి అతీతంగా వెళ్లి జనాన్ని మెప్పించగలిగే స్టామినా కృష్ణవంశీ సొంతం. ‘పైసా’ సినిమా విషయంలో ఆయన చేసింది అదే. భూమిపై పుట్టిన ప్రతి వాడి బలహీనత ‘పైసా’. దాన్ని ఆసరాగా తీసుకొని ఓ సినిమా తీసేశారు. వెండితెర అనే అద్దంపై సగటు ప్రేక్షకునికి ప్రతిరూపంగా తన హీరోని నిలబెట్టి విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఆ ఆనందంలోనే సోమవారం హైదరాబాద్లో పాత్రికేయులతో ముచ్చటించారు కృష్ణవంశీ. ‘పైసా’ కథ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ప్రస్తుతం సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఓ ఫార్ములాని నమ్ముకొని సినిమాలు తీసేస్తున్నారు. ఒకరిద్దరు దర్శకులు తప్ప అందరి పరిస్థితి ఇదే. అలా కాకుండా ఏదైనా కొత్తగా వెళ్లాలనిపించింది. ఆ ఆలోచనకు రూపమే ‘పైసా’. ఈ సినిమా చిత్రీకరణ విషయంలోనూ కొత్తగానే ఆలోచించాను. స్క్రీన్ప్లే అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. కథ డిమాండ్ మేరకు సన్నివేశాలను పుట్టించడం. ప్రస్తుత చిత్రాల్లో రన్ అవుతోంది ఈ పద్ధతే. రెండో పద్ధతి... ప్రేక్షకుల స్పందనను ముందే ఊహించి సన్నివేశాలను తీర్చిదిద్దడం. ‘పైసా’ విషయంలో నేను అవలంబించింది అదే. ఈ కథలో హీరోకి కోటి రూపాయలు చాలు. కానీ... తనకి తెలీకుండానే... తన పక్క యాభై కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా... కాసేపటికైనా ఆ విషయం హీరోకు తెలుస్తుంది. కానీ ఎలా తెలుస్తుంది? ప్రేక్షకుడికి విపరీతమైన క్యూరియాసిటీ పెంచే అంశం ఇది. సాధారణంగా నేను థియేటర్లలో సినిమా చూడను. కానీ, ఈ సినిమా చూశా. ఆ సన్నివేశాల్లో ఒకటే విజిల్స్, కేకలు. అంటే... వాళ్లు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కోటి రూపాయల కోసం చూసేవాడికి యాభై కోట్లు దొరికితే వాడి మైండ్సెట్ ఎలా ఉంటుంది? ఆ డబ్బుని నొక్కేస్తాడా? లేక ప్రభుత్వపరం చేస్తాడా? ఈ నేపథ్యంలో హీరో పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే డబ్బు ఎన్నిచోట్ల ఎన్ని విధాలుగా పరావర్తనం చెందుతుందో ఇందులో చూపించాం. రాజకీయం, వ్యభిచారం, దుబాయ్ షేక్ల పెళ్లిళ్ల వ్యవహారం, దొంగనోట్లు, హవాలా... ఇలా అన్నింటినీ టచ్ చేశాం. అయితే క్రియాశీల రాజకీయాల జోలికి పోలేదు. తొలిరోజు టాక్ డివైడ్గా ఉంటుందని తెలుసు. ఎందుకంటే నా తొలి సినిమా ‘గులాబి’ నుంచి జరుగుతోంది అదే. అదే ఈ సినిమాక్కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం అందరూ ఆదరిస్తున్నారు. సీనియర్ దర్శకునిగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పేమైనా గమనించారా? టీజర్స్ చూసి.. ఒక కథను మైండ్లో డిజైన్ చేసేసుకొని థియేటర్కి వస్తున్నారు. వారి ఊహలకు దగ్గరగా ఉంటే ‘హిట్’ అనేస్తున్నారు. ఊహలకు భిన్నంగా ఉంటే ఫట్టుమనిపిస్తున్నారు. ప్రస్తుతం చాలా సినిమాలు అందుకే దెబ్బతింటున్నాయి. ప్రేక్షకుల్లో ‘హీరో వర్షిప్’ ఎక్కువైపోయింది. ఇది నిజంగా బాధా కరమైన విషయమే. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే... అనాదిగా ఇక్కడి ప్రజలు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. రాజులు పరిపాలిస్తున్న కాలంలో వాళ్లను దైవాంశ సంభూతులుగా చూసి కొలిచారు. తర్వాత తురుష్కులు ఏలుతున్న కాలంలో వాళ్లను నవాబులుగా కొనియాడారు. బ్రిటిషర్లు పరిపాలించిన కాలంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నడుస్తోంది ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకున్నా... జరుగుతోంది రాచరికమే. వ్యక్తిపూజ జనానికి అలవాటైపోయింది. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. అందుకు సినీరంగం మినహాయింపేం కాదు. పోస్టర్ చూసి ఇది మా హీరో సినిమా, మా కులపోడి సినిమా అనే మైండ్సెట్తో సినిమాలకు వెళుతున్నారు. అలాంటి ప్రేక్షకులుంటే మంచి సినిమాలు ఎలా వస్తాయి. అన్ని రకాలుగా సమాజం విషపూరితం అయిపోయింది. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీ మాటల్లో సామాజిక స్పృహ బాగా వినిపిస్తుంది. మరి మీ సినిమాల్లో అది ఏ మేరకు కనిపిస్తుందంటారు? సినిమా అనేది నా జీవితం, నా ఉద్యోగం. జీవితాన్ని, ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకుంటాం. సినిమా కూడా నాకంతే. ప్రజల బలహీనతల్ని ఆసరాగా తీసుకొని బాధ్యతారహితంగా నేను సినిమాలు తీయలేదు. తీయను కూడా. నా సినిమాల ద్వారా ఎంతో కొంత మంచి చెప్పడానికే ప్రయత్నిస్తా. మీ హీరోల్లో కాస్త నెగిటివ్ షేడ్స్ కనిపిస్తుంటాయి? ఈ రోజున తెలుగు సినిమా హీరో అంటే... క్రిమినల్, దొంగ, పోరంబోకు, పోకిరి, ఎందుకూ పనికిరానివాడు. శేఖర్కమ్ముల, క్రిష్ లాంటి దర్శకుల చిత్రాల్లోనే హీరో అనేవాడు కాస్త బాధ్యతాయుతమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఇదే పరిస్థితి. తెరపై వందల మందిని ఊచకోత కోస్తాడు. వాడిపై ఒక్క కేసు కూడా ఉండదు. కానీ నా హీరో అలా ఉండడు. మిగిలిన సినిమాల్లో హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమబుద్ధుడే. వాడిలో ఏదో ఒక కొత్తకోణం ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఓ నెగిటివ్ యాంగిల్ ఉన్నట్లు నా హీరోలో కూడా కనిపిస్తుంది. అంతేతప్ప ఆ యాంగిల్లోనే మొత్తం కనిపించడు. నా దృష్టిలో హీరో అనేవాడికి ఒక అంతఃసంఘర్షణ ఉండాలి. తను చేసే ప్రతి పనికీ ఓ పర్పస్ ఉండాలి. మణిరత్నం, రామ్గోపాల్వర్మ చిత్రాల్లో హీరోలు అలాగే ఉంటారు. వాళ్లనే నేనూ ఫాలో అవుతా. ‘పైసా’ తర్వాత మళ్లీ ఫామ్లోకొచ్చానని అనుకుంటున్నారా? నేను ఫామ్లో లేకుండా ఎప్పుడూ లేను. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనే వాటిని నమ్మను. సినిమా ఫెయిల్ అయితే... నా వర్క్ ఫెయిల్ అయ్యిందని భావిస్తాను కానీ... నేను ఫెయిల్ అయినట్లు ఫీలవ్వను. ఎందుకంటే... సినిమా అనేది నా ఒక్కడి కృషి కాదు. సమష్టి కృషి. సినిమా జయాపజయాలపై అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రేమకథల్ని వదిలిపెట్టేశారే? ప్రేమపట్ల నాకున్న దృక్కోణం వేరు. నేటి సినిమాల్లో చూపిస్తున్న ప్రేమను నమ్మను. ఫాల్స్ ఎమోషన్లనే ప్రేమగా చూపించేస్తున్నారు. నేనలా తీయలేను. అందుకే ప్రేమకథలకు కామా పెట్టా. అయితే, త్వరలో నానుంచి ఓ మంచి ప్రేమకథ వస్తుంది. హిందీలో వచ్చిన ‘లవ్ ఆజ్కల్’ నాకు ఇష్టమైన ప్రేమకథ. రామ్చరణ్తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది? పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా గొప్ప సినిమా అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ముందే కనిపిస్తున్నాయి. ఇందులో రామ్చరణ్ తాతగా తమిళ నటుడు రాజ్కిరణ్ నటిస్తున్నాడు. బాబాయ్గా శ్రీకాంత్ చేస్తున్నాడు. ఇక తండ్రి పాత్రకు ఓ అగ్ర హీరో ‘ఓకే’ అయ్యే అవకాశాలున్నాయి. మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’ ఎప్పుడు తీస్తారు? చనిపోయేలోపు తప్పకుండా తీస్తా. ఎందుకంటే... నేటి సమాజానికి ఆ సినిమా అవసరం. -
నాని, వంశీల పైసా
-
పైసా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది - కృష్ణవంశీ
‘‘చాలాకాలం తర్వాత థియేటర్కెళ్లి సినిమా చూశాను. ప్రతి సన్నివేశానికీ జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. చూసిన చాలామంది ‘మీకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందంటున్నారు’’ అని కృష్ణవంశీ అన్నారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘పైసా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్మీట్ హైదరాబాద్లో జరిగింది. కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా విషయంలో దర్శకునిగా పూర్తి సంతృప్తితో ఉన్నాను. రెగ్యులర్ ఫార్మెట్లో వెళ్లకుండా కొత్తగా ట్రై చేసి తీసిన సినిమా ఇది. మెల్లమెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ, స్పీడ్గా ఆదరిస్తున్నారు. డెఫినెట్గా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘ఇంటర్వెల్ ముందు చార్మినార్ నేపథ్యంలో నానిపై తీసిన సన్నివేశానికి మంచి స్పందన వస్తోంది. మూడే టేకుల్లో ఆ సీన్ తీశాను. అలాగే డబ్బు దొరికిన సన్నివేశంలో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. రాజారవీంద్ర కేరక్టర్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం, హైదరాబాదీ ఆర్టిస్టులు ఆర్కే, తబర్, లోబోల నటన ఈ చిత్రానికి హైలైట్స్’’ అని కృష్ణవంశీ చెప్పారు. ప్రస్తుతం రామ్చరణ్తో ‘మురారి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని, ఆ సినిమా తర్వాత తాను, నాని కలిసి ఓ సమకాలీన చిత్రం తీస్తామని, దాంట్లో నానినే హీరో అని కృష్ణవంశీ తెలిపారు. విడుదలలో జాప్యం జరిగినా ‘పైసా’కు మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, ఇందులోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని నాని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో విజయయాత్ర కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు స్పందన చూస్తుంటే... చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. కృష్ణవంశీ టేకింగ్, నాని యాక్టింగ్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి’’ అని తెలిపారు. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న ‘సరదా’ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని, అలాగే మంచు మనోజ్ హీరోగా తాను నిర్మించనున్న ‘సన్నాఫ్ పెదరాయుడు’ చిత్రం వచ్చే నెలలో సెట్స్కెళుతుందని, ఓ అగ్రహీరోతో హరీష్శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని రమేష్ పుప్పాల చెప్పారు. ఇంకా రాజారవీంద్ర, ఆర్కే, తబర్, సాయికార్తీక్ కూడా మాట్లాడారు. -
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్చరణ్
కృష్ణవంశీతో పనిచేయాలన్న రామ్చరణ్ కల నెరవేరుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం చాలా నిరాడంబరంగా మొదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై రామ్చరణ్ క్లాప్ ఇవ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. ఫైనాన్షియర్ సత్యరంగయ్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘రామ్చరణ్కి ఇది వైవిధ్యమైన సినిమా అవుతుంది. చక్కటి కుటుంబ బంధాలు, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా కృష్ణవంశీ అద్భుతంగా కథ సిద్ధం చేశారు. తమిళ నటుడు రాజ్కిరణ్ కీలకపాత్ర చేస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూడు రోజులూ హైదరాబాద్లో చిత్రీకరణ చేసి, తర్వాత 40 రోజుల పాటు రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచ్చిల్లో షెడ్యూల్ చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్రెడ్డి. -
పైసా మూవీ ప్రెస్ మీట్
-
ఒకేసారి కోటి రూపాయలు దొరికితే..!?
‘‘దేవుని 11వ అవతారం ‘పైసా’ అని చెప్పే సినిమా ఇది. ప్రస్తుతం పైసా చుట్టే భూమి తిరుగుతోంది. డబ్బు వల్ల సంబంధాలు తెగుతాయి. అలాగే బలపడతాయి. మనుషుల మానసిక స్థితిగతుల్ని శాసించేది డబ్బు మాత్రమే. ‘పైసా’లో ఈ విషయాలన్నింటినీ చర్చించాం’’ అని కృష్ణవంశీ చెప్పారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పుప్పాల రమేష్ నిర్మించిన చిత్రం ‘పైసా’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘పాతబస్తీలోని ఓ బట్టలషాపులో షేర్వానీ మోడల్గా ఇందులో నాని కనిస్తాడు. ఇందులో తన పేరు ‘ప్రక్యాష్’. పేరులోనే క్యాష్ ఉందన్నమాట. డబ్బుని అమితంగా ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తికి ఒకేసారి కోటి రూపాయలు దొరికితే.. అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎంతవరకు నీతిగా ఉంటాడు? అనేది సింపుల్గా నాని కేరక్టరైజేషన్. విడుదల తేదీని ముందు పెట్టుకుని ఇన్నాళ్లూ షూటింగులు చేశాను. కానీ... ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నా కెరీర్లో ఇదో అనుభవం’’ అని తెలిపారు. ‘‘నాకు ఇష్టమైన దర్శకుడు కృష్ణవంశీతో పనిచేయడం గొప్ప అనుభూతి. ఇందులో నేను కొత్తగా ఉంటాను. పాటలు విడుదలైన 5 నెలలకు విడుదలై ‘ఈగ’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా అంతకంటే ఎక్కువ డిలే అయ్యింది కాబట్టి ‘ఈగ’ కంటే పెద్ద హిట్ కావాలి’’ అని నాని ఆకాంక్షించారు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైందని నిర్మాత చెప్పారు. కేథరిన్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్కే, తబర్ కూడా మాట్లాడారు. -
గోవిందుడు అందరి వాడేలే?
ఇప్పటివరకూ మాస్ మసాలా కథలతో చెలరేగిపోయిన చరణ్... తన పంథాకి కామా పెట్టి, కాస్తంత కూల్గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా చల్లని పైరగాలి లాంటిదేనని సమాచారం. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే అందమైన కుటుంబకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట కృష్ణవంశీ. అందుకే... కథకు తగ్గట్టుగా ఈ సినిమాకు ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు సమాచారం. అచ్చమైన తెలుగుదనం మొత్తం ఈ పేరులో ఉంది కదూ. దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకొచ్చేయొచ్చు. కుటుంబాల్లోని ఆప్యాయతల్ని, అనురాగాల్ని తెరకెక్కించడంలో కృష్ణవంశీ దిట్ట. మురారి, చందమామ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఆ స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని వినికిడి. మూడు తరాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. సీనియర్ తమిళ నటుడు రాజ్కిరణ్ ఇందులో చరణ్కి తాతగా నటిస్తుండగా, బాబాయ్గా శ్రీకాంత్ కనిపిస్తారు. చరణ్ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాగా ఈ మల్టీస్టారర్ని నిర్మించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కళాకారుల్లో ప్రతిభను రాబట్టుకోవడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు. మరి ఈ సినిమా ద్వారా చరణ్ని నటుడిగా ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో చూడాలి. -
కృష్ణవంశీ చిత్రానికి ఏర్పాట్లు షురూ!
‘ఎవడు’ సినిమా విజయంతో మంచి ఉత్సాహం మీద ఉన్న రామ్చరణ్, నెక్ట్స్ కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇమేజ్ని కాకుండా హీరోలోని ఆర్టిస్టిక్ యాంగిల్పై ప్రత్యేకంగా ఫోకస్ చేసే సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీతో పని చేయాలని చరణ్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. కృష్ణవంశీ శక్తిమంతమైన కథ సిద్ధం చేయడంతో సినిమా వెంటనే పట్టాలెక్కేస్తోంది. ఫిబ్రవరి 6న చిత్రీకరణ మొదలు కానుంది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లోని రామానాయుడు సినీవిలేజ్లో సెట్వర్క్ కూడా మొదలు పెడుతున్నారు. బండ్ల గణేష్ భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. మగధీర, నాయక్ తర్వాత వీరి కాంబినేషన్లో ఇది మూడో చిత్రం. కమలినీ ముఖర్జీ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఎస్.ఎస్.తమన్ స్వరాలందిస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఇది. చరణ్ కెరీర్లోనే నంబర్వన్గా నిలిచేలా ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తీర్చిదిద్దబోతున్నారు’’ అని తెలిపారు. -
అమ్మంటే ప్రాణం..
నా ప్రతీ బండిపైనా, సెల్ఫోన్లో ఆమే కనిపిస్తుంది షూటింగ్కు, బయటికి వెళ్లినా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా తల్లిదండ్రుల ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యా పెళ్లయ్యాక తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేయొద్దు నిత్య జీవితంలోని సంఘటనలకు ప్రతిరూపాలే సినిమాలు పర్సనాలిటీకి తగ్గట్టుగా లేదని ‘వర్మ’ నా పేరు మార్చారు సిటీ శివారులో అనాథాశ్రమం స్థాపిస్తా నటుడు లక్ష్మీనారాయణ గుప్తా అలియాస్ టార్జాన్ మధ్యతరగతి కుటుంబం మాది. సొంతూరు పరిగి మండలం రాపోల్. అమ్మ వీరమణి, నాన్న రాములు గుప్తా. ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ప్రాథమిక విద్య ఊర్లోని సర్కారు బడిలోనే సాగింది. ఏడో తరగతి వరకు పోల్కంపల్లిలోని యూపీ పాఠశాలో, ఆ తర్వాత పరిగి ఉన్నత పాఠశాలలో టెన్త్ పూర్తి చేశా. అప్పట్లో రవా ణా సౌకర్యంలో లేకపోవడంతో ఏడోతరగతి వరకు రోజుకు ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లే వాడిని. టెన్త్వరకు సైకిల్పై వెళ్లా. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఊర్లోని పొలం, ఇల్లు అమ్ముకుని సిటీకి వచ్చేశాం. నగరానికి వచ్చాక ఇంటర్మీడియట్లో చేరినప్పటికీ చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయా. ఈ క్రమంలోనే ట్రాన్స్పోర్ట్లో పనికి కుదిరా. కొన్నిరోజులు అలా కాలంగడిపా. వీరయ్య నాటకంతో... మా ఊరి సమీపంలోని పోల్కంపల్లిలో వీరయ్య అనే రంగస్థల నటుడు బ్రహ్మంగారి నాటకం వేశారు. వరుసగా ఐదు రోజులపాటు ఆ నాటకం సాగింది. తొలిరోజు వెళ్లినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. దీంతో మిగతా నాలుగు రోజులు.. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లా. దాంతో నాటకాలపై మరింత ఆసక్తి పెరిగింది. నర్సింగ్ అనే స్నేహితుడు నన్ను సినిమావైపు దారి మళ్లించాడు. రామ్గోపాల్ వర్మ దగ్గరికి తీసుకెళ్లి వదిలేశాడు. దాంతో వర్మగారు నాకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి తన తొలి సినిమా శివలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత గాయం సినిమాలో.. అలా నా సినిమా కెరీర్ సక్సెస్ఫుల్గా మొదలైంది. తెలుగు, తమిళం తదితర భాషల్లో సుమారు 150 సినిమాల్లో నటించా. పేరు మారిందిలా.. నా అసలు పేరు లక్ష్మీనారాయణ గుప్తా. మొదటిసారి రామ్గోపాల్ వర్మను కలిసినప్పుడు ఏం పేరు అని అడి గారు. దాంతో నా పేరు ఫలానా అని చెబితే.. నన్ను ఆపాదమస్తకం చూసి.. పేరు బాలేదయ్యా. నీ పర్సనాలిటీకి సూట్ కావట్లేదు. టార్జాన్ అని మార్చుకో అన్నారు. దాం తో ఆరోజు నుంచి నాపేరు టార్జాన్గా మారిపోయింది. రోజూ కొత్తదనమే సినిమా నటులకు రోజూ కొత్తగానే ఉంటుంది. ఒక్కో డెరైక్టర్ ఒక్కో తరహాలో నటనను కోరుకుంటారు. సినిమా మొత్తం వాళ్ల ఆలోచన తీరు, స్క్రిప్ట్పైనే ఆధారపడి ఉంటుంది. సో.. వాళ్లు చేయమన్న తరహాలో నటించాలి. దీంతో నేను ఇలా ఉంటా.. అలా ఉంటా.. అని చెప్పలేం. ఇరవై ఏళ్లకుపైగా సినిమా రంగంలో ఉన్నా. రామ్గోపాల్ వర్మ నాకు గురువు. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, అమ్మరాజశేఖర్, వంశీ తదితర పెద్ద దర్శకులందరి దగ్గరా పనిచేశా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఈ కొత్తదనం చాలా ఆనందంగా ఉంటుంది. కళాకారుడి గొప్పతనం ఇదే నేను రెగ్యులర్గా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటా. మూడేళ్ల క్రితం అహోబిలం ఆలయానికి వెళ్లా. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. కలెక్టర్తో సహా పలువురు అధికారులు అక్కడే ఉన్నారు. నేను మా ఫ్యామిలీతో వెళ్లా. నన్ను గుర్తుపట్టిన అ ర్చకులు కలెక్టర్ దగ్గరినుంచి నా దగ్గరికి వచ్చారు. మర్యాద గా పలకరించారు. దీంతో కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి అ ర్చకులతో అడిగాడట నా గురించి. తర్వాత తెలిసింది. అధికారులు, ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ గౌరవం కళాకారులకు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కరంగానూ ఉంటుంది. ప్రశాంతంగా షాపింగ్కు వెళ్లలేం.. హో టల్లో చాయ్ తాగలేం.. ఇలాంటి ఇబ్బందులుంటాయి. వాళ్లను చూస్తే బాధనిపిస్తుంది సినిమా పరిశ్రమ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ అవకాశాల్ని అందిపుచ్చుకుని, పొదుపు మంత్రం పాటించిన వాళ్లు బాగానే ఉంటారు. జల్సాలకు పోయి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఇబ్బందులు తప్పవు. పరిశ్రమకు జూనియర్ ఆర్టిస్టులు చాలా అవసరం. అయితే చాలామంది జూనియర్ ఆర్టిస్టులకు షూటింగ్ ఉన్న రోజే తిండి.. లేకుంటే పస్తులే. అవకాశం కోసం దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు.. పస్తులున్న విషయాన్ని విన్నవించి ప్రా ధేయపడతారు. అలాంటి సందర్భాలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. తగిన గుర్తింపు లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం. నిజ జీవిత సంఘటనల ఆధారంగానే.. సమాజంపై సినిమాల ప్రభావం ఉంటుంది. అయితే సమాజాన్ని సినిమాలు చెడగొడుతున్నాయనుకోవద్దు. నిజ జీవితంలోని ఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తారు. కాబట్టి వాటిని వేరే రకంగా చూడకూడదు. అమ్మ ఆశీస్సులు తప్పనిసరి మా అమ్మంటే నాకు ప్రాణం. ప్రతి పనికి ముందు అమ్మను తలుచుకుంటా. అంతెందుకు ప్రతి బండిపైనా.. సెల్ఫోన్లో.. ఇలా అన్ని చోట్లా అమ్మే కనిపిస్తుంది. అమ్మా, నాన్న ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యా. రోజూ ఇంట్లోం చి షూటింగ్కో, బయటికో వెళ్లేటప్పుడు అమ్మ ఆశీస్సులు తీసుకుంటా. ఓసారి చెన్నైలో షూటింగ్ వెళ్లేటప్పుడు ఫ్లైట్ టైం అవుతోందని హడావుడి చేయడంతో బట్టలు సర్దుకుని బయలుదేరా. ట్యాంక్బండ్ వరకు వచ్చేశా. కానీ నాలో ఏదో తెలియని ఆందోళన.. ఏదో మర్చిపోయాననే ఫీలింగ్. బాగా ఆలోచిస్తున్నా.. అమ్మ ఆశీస్సులు మర్చిపోయా. వెంటనే బండి వెనక్కి తిప్పమని డ్రైవర్కు చెప్పా. ఫ్లైట్ టైం అయిపోతుందని డ్రైవర్ వారించినా వినలేదు. ఇంటికి వెళ్లి అమ్మ ఆశీస్సులు తీసుకుని తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయలుదేరా. విచిత్రం ఏమిటంటే.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ గంట లేటుగా వచ్చింది. ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతా.. సినిమాలు ఎక్కువగా చూస్తా. నచ్చిన చిత్రం పోకిరి, శ్రీఆంజనేయం. ఆధ్యాత్మిక గ్రంథాలు, రమణ మహర్షి పుస్తకాలు చదువుతుంటాను. నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకుంటా. రోజుకు 4 కి.మీ. రన్నింగ్, రెండు గంటలు జిమ్, గంట పాటు మెడిటేషన్ చేస్తా. భార్య ఉమారాణి గృహిణి. కూతురు ఆశ్విత, కుమారుడు విక్రమ్. ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి.. జన్మనిచ్చి.. పెంచి.. తెలివి వచ్చేవరకు పోషించిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. పెళ్లైన మరుసటి రోజునుంచి వేరు కాపురాలు పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సాకినందుకు వాళ్లకిచ్చే గౌరవం ఇదేనా. చాలాచోట్ల ఈ సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ వార్తలు చదివినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది. డబ్బు పోతే తిరిగి వస్తుంది. కానీ అమ్మ, నాన్నలు రారు. అందుకే తల్లిదండ్రులను బాగా చూసుకోండి. నేను యువతకిచ్చే సందేశం ఇదే. వైఎస్ రియల్ సీఎం.. ఊటీలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నా. అక్కడికి 108 అంబులెన్స్ వచ్చి ఆగింది. ఈ వాహనం ఇక్కడికెలా వచ్చిందని డ్రైవర్ను అడిగా. వెంటనే డ్రైవర్ ‘అరె భాయీ.. ఇది ఆంధ్ర సీఎం రాజశేఖరరెడ్డి పెట్టిన 108కు కాపీ’అని ఠక్కున చెప్పేశాడు. అప్పుడనిపించింది వైఎస్ గొప్పదనం. ఇంకో విషయం ఏమిటంటే.. సిటీలో వేల మంది సొంతింటి కల సాకారం చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ ఒక అద్భుత పథకం. ఇవన్నీ ఇప్పటివరకున్న సీఎంలకు సాధ్యం కాలేదు. అందుకే వైఎస్ఆర్ ఈజ్ గ్రేట్. ఆశ్రమం నెలకొల్పుతా.. నాకు డబ్బు ఆశ లేదు. అవకాశాలు వచ్చినన్ని రోజులు సద్వినియోగం చేసుకుంటా. అయితే సిటీ శివారులో ఒక ఆశ్రమం నెలకొల్పాలనేది నా కోరిక. తప్పకుండా ఏర్పాటు చేస్తా. వృద్ధులకు బుక్కెడు బువ్వపెట్టి ఆశ్రయం కల్పిస్తా. -
చరణ్కి అన్నయ్యను కాదు... బాబాయ్నే
‘‘చరణ్కి నేను అన్నయ్యను కాదు. బాబాయ్నే’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. రామ్చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రంలో రామ్చరణ్ అన్నయ్యగా శ్రీకాంత్ నటించనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ -‘‘నేను ఇందులో చరణ్కి బాబాయ్గా నటిస్తున్నాను. యంగ్ బాబాయ్ని అన్నమాట. కృష్ణవంశీ ఓ అద్భుతమైన కథాంశాన్ని సిద్ధం చేశారు. కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించే అన్ని అంశాలూ ఉన్న కథ ఇది. కృష్ణవంశీ మార్కు వినోదం పుష్కలంగా ఉంటుంది. చరణ్ కెరీర్లో కచ్చితంగా ప్రామిసింగ్ హిట్ అవుతుంది’’ అని చెప్పారు. -
ఈ నెలలోనే స్టార్ట్ కెమెరా!
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్చరణ్ నటించనున్న సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుంది. బండ్ల గణేష్ నిర్మాత. నాయికగా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఇందులో శ్రీకాంత్ కూడా మరో హీరోగా చేస్తున్నారు. ప్రస్తుతం స్కిప్ట్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. గ్రామీణ, నగర నేపథ్యాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. -
ముచ్చటగా మూడోసారి...
రామ్చరణ్తో కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘మగధీర’, ‘నాయక్’ ఏ స్థాయి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న చిత్రంలో చరణ్కు జోడీగా తొలుత తమన్నాని ఎంపిక చేశారు. అయితే ఆమె ‘బాహుబలి’, ‘ఆగడు’ సినిమాలతో ఫుల్బిజీగా ఉండడంతో, ఆ అవకాశం కాజల్కు దక్కింది. ‘బాద్షా’ తర్వాత కాజల్ తెలుగులో ఏ సినిమా కమిట్ కాలేదు. ఆ లెక్కన చాలా విరామం తర్వాత కాజల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే. కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ ఇంతకుముందు ‘చందమామ’ చేశారు. ఆ చిత్రంతోనే ఆమె కెరీర్కు బ్రేకొచ్చింది. ఈ కొత్త సినిమా చిత్రీకరణ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. ఇందులో చరణ్తో పాటు శ్రీకాంత్ కూడా నటించనున్నారు. మొదట ఆ పాత్ర వెంకటేష్ చేస్తారని ప్రచారం జరిగింది. -
మళ్లీ రచ్చ చేస్తుందట
ఫస్ట్లుక్లోనే ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన జంట రామ్చరణ్, తమన్నా. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ఈ జంట చేసిన ‘రచ్చ’ అంతా ఇంతా కాదు. ‘వానా వానా వెల్లువాయె’ పాటలో వీరిద్దరూ కనబరిచిన కెమిస్ట్రీని యువతరం తేలిగ్గా మరిచిపోగలరా! ఇప్పుడు వీరిద్దరి గురించి చర్చ దేనికనుకుంటున్నారా! మళ్లీ త్వరలోనే ఈ జంట వెండితెరపై సాక్షాత్కరించనుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించనున్న సినిమాలో చరణ్కు జోడీగా తమన్నాను ఖరారు చేసినట్లు తెలిసింది. చరణ్ పక్కన కొత్త నాయిక ఉంటుందని మొదట్లో వార్తలొచ్చాయి. చివరకు బంతి తమన్నా కోర్టుకు రాగానే... ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పేశారు. జనవరి 23 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. లొకేషన్ల ఎంపిక కోసం ఇటీవలే కృష్ణవంశీ, బండ్ల గణేష్ కలిసి పొలాచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సిఉంది. -
‘పైసా’ వసూల్కి రెడీ
మనకు దశావతారాల గురించి బాగా తెలుసు. మరి పదకొండో అవతారం గురించి తెలుసా? కృష్ణవంశీ చెబుతోన్న పదకొండో అవతారం డబ్బు. ‘డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు’, ‘పైసా మే పరమాత్మ హై’లాంటి సూక్తులన్నీ డబ్బు గురించి పుట్టినవే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ‘పైసా’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. నాని, కేథరిన్ ఇందులో హీరో హీరోయిన్లు. రమేష్ పుప్పాల నిర్మాత. ఈ నెల మూడోవారంలో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ, నాని కెరీర్ల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. సాయికార్తీక్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కచ్చితంగా ఈ పైసా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్కుమార్రాయ్, రచన: కెకె బినోజ్, శ్రీనివాసరెడ్డి, పాత్రికేయ. -
కృష్ణవంశీ దర్శకత్వంలో?
ఒక్కోసారి అగ్ర హీరోల పక్కన అవకాశమొచ్చినా చేయలేని పరిస్థితి మన కథానాయికలది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్లో ఇలాంటి పరిస్థితినే త్రిష ఎదుర్కొన్నారు. నిజానికి త్రిష, వెంకటేష్ హిట్ కాంబినేషన్. కానీ ఆ సినిమాలో మాత్రం ఆమె నటించడానికి ససేమిరా అన్నారు. దానికి కారణం మహేష్. అతడు, సైనికుడు చిత్రాలతో మహేష్కు కూడా తను మంచి జోడీ అనిపించుకుంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి అదే మహేష్కి వదినగా కనిపిస్తే నిజంగా అది ఆమెకు డామేజే కదా. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితినే నయనతార కూడా ఎదుర్కొంటున్నారని ఫిలింనగర్ టాక్. సీనియర్ హీరోలైన రజనీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో జతకట్టి వారికి సరైన జోడీ అనిపించుకున్నారు నయన. కానీ ఈ మధ్య ఈ మలయాళ మందారం మైండ్ సెట్లో మార్పొచ్చిందట. సీనియర్ హీరోల పక్కన నటిస్తే... తనను కూడా సీనియర్స్ లిస్ట్లో వేసేస్తారని, అందుకని ఇక నుంచి యువ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నయన భావించారని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. అందుకు తగ్గట్టే... ఆర్య, అజిత్, ఉదయనిధి స్టాలిన్, గోపిచంద్ లాంటి యంగ్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇప్పుడు అనుకోకుండా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ వరించిందని వినికిడి. వెంకటేష్, చరణ్ కలిసి ఓ మల్టీస్టారర్లో నటించనున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో చరణ్కు జోడీగా కాజల్ అగర్వాల్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. వెంకటేష్ సరసన నయనతారను నటింపజేయాలని కృష్ణవంశీ భావిస్తున్నారట. ప్రస్తుతం నయనతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. పైగా ఇందులో రామ్చరణ్కి బాబాయ్గా వెంకటేష్ నటిస్తున్నారని వినికిడి. మరి యువహీరోలకే ప్రాధాన్యత ఇస్తున్న నయన.. చరణ్కి పిన్నిగా నటించడానికి అంగీకరిస్తారా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పారితోషికం కంటే.. పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నయనకు పేరుంది. మరి ఆ పేరును ఆమె నిలబెట్టుకుంటుందో? లేదో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. -
వెంకటేష్, రామ్చరణ్లతో కృష్ణవంశీ సినిమా?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ పుణ్యమా అని నిదానంగా టాలీవుడ్లో కూడా మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ప్రస్తుతం ‘మనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు వెంకటేష్, రామ్ కలిసి ‘మసాలా’ నూరే పనిలో ఉన్నారు. ఓ విధంగా ఈ ట్రెండ్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వెంకటేష్ అందరికంటే ముందున్నారని చెప్పాలి. త్వరలో వెంకటేష్... రామ్చరణ్తో కూడా కలిసి నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని, బండ్ల గణేష్ నిర్మాత అని ఫిలింనగర్ సమాచారమ్. ఇందులో చరణ్కి బాబాయ్గా వెంకటేష్ నటిస్తారని వినికిడి. ఇందులో కీలకమైన పాత్రను సూపర్స్టార్ కృష్ణతో చేయించాలనుకున్నారని, అయితే కృష్ణ నటనకు స్వస్తి పలికి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మరో సీనియర్ నటుణ్ణి ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అలాగే ఇందులో మరో పాత్రను నాగబాబుతో చేయించాలను కుంటున్నారు. మూడు తరాలకు సంబంధించిన కథగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని వినికిడి. గతంలో అక్కినేని ఫ్యామిలీతో ‘త్రయం’ పేరుతో ఓ చిత్రం చేయాలనుకున్నారు కృష్ణవంశీ. కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. మరి ఇది ఆ కథేనా? లేక వేరే కథా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. -
ఒక్కో సినిమాకు ఒక్కో గురువు
నాకు చిన్నప్పట్నుంచీ చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అందుకే స్కూల్, కాలేజీకి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. కాబట్టి.. నా గురువుల గురించి చెప్పాలంటే నా దర్శకుల గురించే చెప్పాలి. నా ఒక్కో సినిమా దర్శకుడు నాకో గురువులాంటివారు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో టీచర్ అన్నట్లుగా ఒక్కో సినిమాకి ఒక్కో గురువుని సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన చేతి వేళ్లు ఒకలా ఉండవన్నట్లుగానే విభిన్న మనస్తత్వాలున్న గురువులతో పని చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎక్కువ ప్రభావితం చేసిన గురువంటే కృష్ణవంశీగారే. ఆయన అనుభవం ఉన్న దర్శకుడు. ఆ అనుభవం నాకెంతో ఉపయోగపడింది. అందరి దర్శకులతో ఎక్కువ సమయం గడిపే వీలుండదు. కానీ కృష్ణవంశీగారితో ఆ అవకాశం దొరికింది. దాంతో తన అనుభవాలన్నీ చెప్పేవారు. ఆ అనుభవాలన్నీ నాకు మంచి పాఠాలుగా నిలిచాయి. - నాని -
కృష్ణవంశీ దర్శకత్వంలో చెర్రీ?
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్చరణ్ నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిలిమ్నగర్ వర్గాలు. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని రెండేళ్ల నుంచే వార్తలు ఊరిస్తున్నాయి. అయితే రకరకాల కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ కాస్తా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ ఓ కొలిక్కి వచ్చిందన్నది సమాచారం. కృష్ణవంశీ చెప్పిన కథ చరణ్ని బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే పచ్చజెండా ఊపారని తెలిసింది. చరణ్కి వ్యక్తిగతంగా కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభపై అపారమైన గౌరవం. ఆయన ఆర్టిస్టుల్ని డీల్ చేసే విధానం, హీరోల్ని న్యూ లుక్లో ప్రెజెంట్ చేసే శైలి తనకిష్టమని చరణ్ ఓ సందర్భంలో చెప్పారు. అందుకే చరణ్, కృష్ణవంశీ ప్రాజెక్ట్ని వెంటనే ఓకే చేశారని తెలిసింది. చరణ్ ఇమ్మీడియట్గా చేయబోయే సినిమా ఇదే అవుతుందట. కృష్ణవంశీ కూడా ఈ కథపై భారీ కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, బండ్ల గణేష్ల్లో ఎవరో ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉన్నదని సమాచారం.