netizens
-
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్స్టాగ్రామ్లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్లైన్తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టతతన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
గోవాలో ఏం జరుగుతోంది?.. సీఎం రియాక్షన్ ఇదే!
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే.. ఈసారి ఇయర్ ఎండ్లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన. ‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.నిజంగానే పడిపోయిందా?చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు2024 నవంబర్నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.*ఓహెర్లాడో గణాంకాల ప్రకారంఒక్కడితో మొదలై.. గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు. చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య -
ఫుడ్ డెలివరీ యాప్పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్ను ప్రచారం చేయడానికి బిల్బోర్డ్లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..
ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.OMG this is so sweet.I am glad you took the criticism constructively, I had to delete the tweet after a call from yiur team because I thought they are unhappy with the harsh words.— Sushant Mehta (@SkyBarrister) December 1, 2024 -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్స్టాలో చిట్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
సమంత చిట్చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
ద్రోహం తలపెట్టినా చూస్తూ ఉండిపోవాలా?
సాక్షి, అమరావతి: ఆనాడు పిల్లనిచ్చి.. పదవులిచ్చి.. పార్టీ నీడనిచ్చిన మామ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల సొంత అన్న జగన్కే ద్రోహం తలపెట్టారు. స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న అన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తూ, ఆయన బెయిల్ రద్దుకు శత్రువులతో కలిసి కుట్రలు చేస్తున్నారు.పెళ్లయిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన పదేళ్ల అనంతరం కూడా చెల్లికి ఆస్తులిచ్చేంత సహృదయం ఉన్న జగన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఈ కుతంత్రాలను రక్తి కట్టించడం కోసం మీడియా ముందు దొంగ ఏడుపులతో డ్రామాలాడుతున్నారు. ఇదేనా వైఎస్సార్ బిడ్డ నైజం. ఇలాగేనా ఆ మహానేత కుమార్తె నడుచుకోవాల్సిన విధానం... అంటూ షర్మిలపై సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ పోస్టులతో దుమ్మెత్తి పోస్తున్నారు. వాటి సారాంశం ఇలా ఉంది.. భారతి పేరు ఉంది.. మీ పేరు లేదంటే ఏంటి అర్థం? ‘వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే... నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. అలా అయితే భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా’ అని అంటున్న షర్మిలకు భారతి పేరు ఈడీ కేసుల్లో ఉందనే విషయం తెలియదా? మరి షర్మిల పేరు ఎందుకు లేదు. అంటే ఆ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైనా తమ ఆస్తులకు వేరే వాళ్ల పేర్లు పెట్టుకుంటుంటే పోనీలే పేరు పెట్టుకుంటే ఏముందిలే అని ఊరుకుంటారా.? అవి జగన్ ఆస్తులు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టుకున్నా దివంగత వైఎస్సార్ అభ్యంతరం చెప్పలేదనేది నిజం కాదా? చిన్నాన్నను అంత మాట మీరనొచ్చా? సొంత చిన్నాన్న అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయని, నా బిడ్డలు నీ ముందు పెరగలేదా... అని సుబ్బారెడ్డిని ప్రశ్నించిన షర్మిల అదే చిన్నాన్నను జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని అనడం సమంజసమా. ఆయనపై అంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద మాట ఎలా అనగలిగారు షర్మిలమ్మా.? చిన్నాన్న కాబట్టే, మొదటి నుంచీ జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్నారు కాబట్టే సుబ్బారెడ్డి వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక ఆయనను నిందించడమేనా మీ సంస్కారం. పైగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను పరీక్షించడం కోసం, వాళ్ల గురించి విజయమ్మకు తెలియడం కోసం లేఖలో వారి పేర్లు ప్రస్తావించారా? ఇప్పుడు మీరు వారిద్దరి గురించి విజయమ్మకు కొత్తగా చెప్పాలా..? విజయమ్మ క్షోభకు కారణం మీరే కదా? ‘సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. పురిటిలోనే చంపేయాల్సింది అని ఆ తల్లి అనడం లేదని, ఇది చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను’ అని విజయమ్మ ఏడుస్తోందని చెప్పుకొస్తున్నారు షర్మిల. విజయమ్మ ఈ మాటలు అన్నారో లేదో షర్మిలకే తెలియాలి. అయితే నిజానికి విజయమ్మను ఇంతటి క్షోభకు గురిచేస్తున్నది మాత్రం షర్మిలేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆస్తుల కోసం షర్మిల పట్టుబట్టి తల్లిని, కొడుకుని వేరు చేయాలని ప్రయత్నిస్తుండటం విజయమ్మకు కడుపుకోత కాదా? కుమారుడి ప్రతి కష్టంలోనూ, ప్రతి విజయంలోనూ తోడున్న విజయమ్మను కూడా మీ కుట్రలకు వాడుకుంటారా..? బహుశా ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందా అని విజయమ్మ బాధపడుతూ ఉండి ఉంటారు. ఒకసారి చేస్తే సరేగాని ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చేయడం షర్మిలకే చెల్లింది. చంద్రబాబును కాపాడాలనుకున్న ప్రతిసారీ ప్రెస్మీట్ పెట్టడం... కన్నీళ్లు పెట్టేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయింది. ప్రజలపై రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేస్తే రాని కన్నీరు, వాస్తవాలను ఒప్పుకోలేక వస్తున్నాయంటేనే అర్థం అవుతోంది ఆమెకు ప్రజల మీద ఎంత ప్రేమో.. విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు, కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనేగా ఈ ఏడుపు డైవర్షన్లు? నిజమే.. జగన్ లాంటి అన్న ఎవరుంటారు? ఏ అన్న అయినా... చెల్లికి గిఫ్ట్ అంటే ఏ బంగారమో, చీరనో ఇస్తారని, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా? నా హక్కు కాబట్టే నాకు ఇస్తామన్నారని షర్మిల అంటున్నారు. నిజమే ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న రోజులివి. అలాంటి కలికాలంలోనూ చెల్లిలికి తన సొంత ఆస్తి నుంచి, కష్టార్జితం నుంచి వాటా ఇస్తాననే అన్న బహుశా ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరేమో. అది కూడా ఆమెకు పెళ్లి జరిగిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన 10 ఏళ్లు అయిపోయాక అంటే నిజంగా చెల్లిలి మీద ఎంత ప్రేముంటే ఇంతటి నిర్ణయం తీసుకుంటారు..? పైగా అడగకుండానే ఎంవోయూ రాసిచ్చారని మీరే అంటున్నారంటే, అంత చిత్తశుద్ధి ఉన్న అన్న ఇంకెవరుంటారు. మీ లేఖను టీడీపీ విడుదల చేయడమేమిటి? ఐదేళ్లు ఎంవోయూ చేతిలో ఉన్నా ఏ మీడియాకు విడుదల చేయని షర్మిల.. అన్నకు రాసిన లేఖను మాత్రం టీడీపీ అధికారికంగా ఎలా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ లేఖ, ఆమె కాకుండా టీడీపీ అధికారికంగా ఎలా బయటపెడుతుంది. అంటే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటేనని మీరే చెప్పినట్టు కాదా.? మీరు చేస్తున్నది ఏమిటి...? జగన్ సొంత లబ్ధి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారంటున్నారే మరి మీరు చేస్తున్నదేమిటి. మీ లబ్ధి కోసం, మీరు మోస్తున్న చంద్రబాబు లబ్ధి కోసం సొంత అన్న బెయిల్ను రద్దు చేయించి జైలుకు పంపాలనుకోవడం లేదా? ఇందుకోసం మీరు మీ తల్లి విజయమ్మను వాడుకోవడం లేదా..? దీన్నేమనాలి? మీరేం త్యాగాలు చేశారు? వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడానికి మీ త్యాగాలు, కష్టమే కారణమా షర్మిల. మీరు పదేళ్లలో అన్న ఇచ్చిన రూ.200 కోట్లు తీసుకున్నారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తులతో వ్యాపారాలు చేసుకున్నారు. అదేనా మీ త్యాగం? అన్నంటే ప్రాణం అంటూనే అన్న చేసిన సాయాన్ని మర్చిపోయి కుట్రలు చేయడమేనా మీ నైజం? మీరు సంపాదించుకున్న ఆస్తుల్లో జగన్ వాటా అడిగితే మీకెలా ఉంటుంది?. -
దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ రష్మి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.‘మైనర్పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.ఆ వీడియోలో ఏముందంటే..రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు. Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice Pls do not use this interview now and mislead audience This interview was taken way before 2020 Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024 -
నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్!
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది.తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనసూయ ట్వీట్లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024 -
'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అలరించాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ 14న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.అయితే విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఈ మూవీ రైట్స్ను దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం రూ.8 కోట్లకే అమ్మినట్లు పోస్ట్ చేసింది. అది కూడా జీఎస్టీతో కలిపి అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన శైలిలో నెటిజన్కు ఇచ్చిపడేశాడు.'గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్లో పెట్టొద్దు. మెకానికి రాకీ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి విక్రయాలు జరగలేదు. మీరు కాస్తా వాస్తవాలను తెలుసుకోండి. ఇదంతా ఓ టీమ్ కెరీర్కు సంబంధించింది' అంటూ నెటిజన్కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Donkey egg em kadhu . With gst anta 😂 tea shop muchatlu theeskochi tweeter lo pettodhu priyaji. #mechanicrocky was never sold yet ! Get facts right . Its teams career— VishwakSen (@VishwakSenActor) June 12, 2024 -
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్ను ట్రోల్ చేశాడు. టెన్నిస్బాల్తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్లోని ఉదయపూర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
పవన్కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
విజయ్ సింపతీ డైలాగులు.. నేనూ తెలంగాణ బిడ్డనే అన్న అనసూయ
గతేడాది విమానం చిత్రంతో అలరించిన అనసూయ.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ టాలీవుడ్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ను మరో రేంజ్కు తీసుకెళ్లాయి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు అనసూయ తనదైన స్టైల్లో స్పందించింది. మీకు, నాకు ఎలాంటి రిలేషన్ లేదంటూనే కాస్తా వ్యంగ్యంగానే ఇచ్చిపడేసింది. ఇంతకీ అసలేం జరిగింది? అనసూయ ఎందుకు రియాక్ట్ అయిందో మీరు కూడా చూసేయండి. అనసూయ తన ట్వీట్లో రాస్తూ.. 'ఎందుకు కార్తీక్ అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని మా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ, నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు, వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు.. ఇప్పుడు లేదు.. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి. మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయోమో?.. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీరు అంతా మంచే జరగాలి అండి.' అంటూ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందేంటే.. తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనసూయ, విజయ్ ఫ్యాన్స్కు కోల్డ్ వార్ కాగా.. గతంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి తనకు మధ్య జరిగిన ట్విటర్ వార్పై కూడా అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. గతంలో విమానం సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. నాకు పీఆర్ టీమ్ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా.. ట్వీట్స్ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా.. గతంలోనే అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. Yenduku Karthik garu astamaanam nannu laagutaaru.. evaru em mafia chestunnaro nenu yeppudo cheppi cheppi odilesanu.. anavasaranga nene hype istunnanani na vaallu antunte nijamenemo ani odilesanu..nenu kuda telangana biddane.. kaani naaku sympathy akkarledu.. naku naa meeda… https://t.co/JhIdIBBM32 — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2024 -
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్టాపిక్గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్కు చెందిన రాయల్ ఓక్ వాచ్ను తన బ్లాక్బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోన్న సాంగ్..ప్రముఖ వ్యాపారవేత్త ఫిదా!
ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు సంగీత ప్రియులకు పండగే. చిన్న జానపద పాటల నుంచి సినిమాల పాటల వరకు కనెక్ట్ అవుతారు. భాషతో సంబంధం లేకుండా కాలు కదిపేస్తారు. అలా గతంలో చాలా సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఉపేశాయి. తాజాగా ఉత్తరాఖండ్కు చెందిన ఓ సాంగ్ నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సాంగ్కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 'గులాబీ షరారా' అనే ఉత్తరాఖండ్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ సింగర్ ఇందర్ ఆర్య రూపొందించిన మెలోడీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక సైతం ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్కు చెందిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోందని.. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. పాఠశాల పిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్స్ రీల్స్ను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. అయితే ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజై నాలుగు నెలలైనా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. Here it is my Daughter Adyaa Raj is practicing with the same song. pic.twitter.com/lcqiRstUgY — Raj Nayak (@RajNaya50858983) December 26, 2023 Sir such is the craze that my wife and sil(twin sisters) danced to it in Rishikesh. pic.twitter.com/vJSPZHaQ3H — Joy Sanyal,MD, DM, (@JoySanyal74) December 26, 2023 This Uttarakhandi song has gone viral. I hope you enjoy its beat as much as I do! pic.twitter.com/uEvMDvKTOE — Harsh Goenka (@hvgoenka) December 26, 2023 -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
నెటిజన్కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్పుత్పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. (ఇది చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్తో నిర్వహించిన చిట్చాట్లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్తేజ్తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్. కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్
హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆకట్టుకునే కళ్లతో పాటు అంద,చందాలతో తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటుంది. తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య’సందర్భంగా అనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్!
ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది. ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది. ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్బాటిల్కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
టీడీపీ చీప్ ట్రిక్స్.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ క్రైమ్ జరిగినా వైఎస్సార్సీపీ మీద నెట్టేయడమే పనిగా పచ్చ మీడియా, ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ తీరును ఎండగడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్నారు. ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు క్షీణించిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో కుట్రలకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ తీరుపై నెటిజన్లు వ్యగ్యంగా పోస్టులు పెడుతూ దుమ్మెతిపోస్తున్నారు.. ►కర్నూలులో కుక్క కరిచి వ్యక్తికి గాయాలు.. ఆ కుక్క వైసీపీ నాయకుడిది అని అనుమానం.. ►నంద్యాలలో నాలుగు పచ్చని చెట్లను నరికేసిన వ్యక్తులు.. ఆ వ్యక్తులు వైసీపీ వారిగా అనుమానం.. ►చిత్తూరు అత్తను చంపిన అల్లుడు.. అల్లుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►కడపలో ఒకే కాన్పులో నలుగురు కవలను జన్మనిచ్చిన టీడీపీ నేత.. ఇది వైసీపీ నాయకుల కుట్రగా అనుమానం.. ►గుంటూరులో ఓ అమ్మాయిని లేపుకెళ్లిన యువకుడు.. ఆ యువకుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►ఒంగోలులో బర్రెను ఢీకొన్న లారీ.. లారీ ఓనర్ వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►నెల్లూరులో ఓ ఇంట్లో దొంగతానికీ పాల్పడ్డ దొంగలు.. దొంగలు వైసీపీ వారిగా అనుమానం.. ►విజయవాడలో కొట్టుకున్న రౌడీమూకలు.. వైసీపీ మూకలుగా అనుమానం.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టీడీపీ కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపింది. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. -
మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!
తమిళసినిమా: ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతీహాసన్. ఈమె జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. విశ్వనటుడు కమల్హాసన్ వారసురాలు అయిన ఈమె హిందీ చిత్రంతో కథానాయకిగా నట జీవితాన్ని ప్రారంభించి ఆపై తెలుగు, తమిళం అంటూ తన స్థాయిని విస్తరించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో శ్రుతీహాసన్ లక్కీ హీరోయిన్. దాదాపు అక్కడ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్కు జంటగా సలార్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలో తిరిగి రావడానికి ముస్తాబవుతుంది. కాగా శ్రుతీహాసన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్ని సామెత మాదిరి శ్రుతీహాసన్ సినీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ తోచింది వారు రాస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు. (చదవండి: కోలీవుడ్ సూపర్స్టార్ ఎవరు?) ఇవి కూడా ఎవరూ ఎలాంటి ప్రశ్న వేసినా చాలా బోల్డ్గా బదులిస్తుంటారు తన బాయ్ఫ్రెండ్తో కూడా బహిరంగంగా తిరిగే నటి శ్రుతీహాసన్. ఎందుకంటే ఈమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. తమ తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అలాగని వారికి గౌరవానికి తలవంపులు తెచ్చే ఎలాంటి పనిని తాను చేయనని చెబుతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తరుచూ అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటించే శ్రుతీహాసన్ ఇటీవల ఇన్స్ట్రాగామ్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చి వారిని ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా? అన్న ప్రశ్న లేదు తాను మద్యం తాగాను, మాదకద్రవ్యాలు కూడా తీసుకోను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాను జీవితాన్ని హుందాగా గడిపే నటినని స్పష్టం చేసింది. దటీజ్ శ్రుతిహాసన్ అని మరోసారి నిరూపించుకున్నారు. -
పబ్లిక్లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్పై బిగ్ బాస్ హౌస్లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్లో రన్నరప్గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
ఆ డ్రెస్ ఆవుపేడతో తయారు చేశారా? నటిపై విమర్శలు
విభిన్నమైన దుస్తులు ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. హిందీలో ఓ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ.. బిగ్బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమస్ అయింది. ఆ తర్వాత విచిత్రమైన డ్రెస్సులు ధరిస్తూ.. సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. ముంబైలో ఉర్ఫీ ఏ ప్రాంతానికి వెళ్లినా కెమెరాల కన్ను ఆమె వైపు తిరుగుతాయి. దానికి కారణం ఆమె ధరించిన డ్రెస్సే. ఒంటి నిండా దుస్తులు ధరించడం ఆమెకు అస్సలు నచ్చదు. తాజాగా ఉర్ఫీ ధరించిన డ్రెస్ ఒక్కటి నెట్టింట వైరల్ అవుతోంది. చెట్టు బెరడుతో తయారు చేసిన డ్రెస్ వేసుకొని ఫోటో షూట్ చేసింది ఉర్ఫీ. ఈ అవుట్ఫిట్ తయారు చేసే క్రమంలో ఏ చెట్టుకు హానీ కలగలేదని చెప్పింది. ఉర్ఫీ తాజా ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ.. ‘నువ్వు ధరించిన ఆ డ్రెస్ ఆవు పేడతో తయారు చేసినట్లు ఉంది. ప్రతిదీ ట్రెండ్ అవుతుందని ఊహించుకోకు’ అని విమర్శిస్తున్నారు. (చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్) గతంలోనూ ఉర్ఫీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఓ సారి నెమలి డ్రెస్ అంటూ నెమలి డ్రెస్ అంటూ అర్ధనగ్నంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే ఓ సారి చూయింగ్ డ్రెస్ అంటూ నమిలి ఊసిన చూయింగ్ గమ్లను శరీరానికి అంటించుకొని ఫోటో షూట్ చేసింది. ఇలా ఫ్యాషన్ పేరుతో ఒక్కోసారి ఒక్కో వెరైటీ దుస్తులు ధరిస్తూ పరువు తీస్తుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
షారుక్ ఖాన్పై నెటిజన్స్ ఫైర్!
-
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
ముందు తిన్నగా ఆడటం నేర్చుకో...తర్వాత ప్రయోగాలు చేద్దువు
-
సమంత సింపతీ డ్రామా....?
-
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్గా మారింది. అయితే ఈ టీజర్పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్బీ ఫన్నీ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఖాతాల బ్లూటిక్ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్ చర్యతో షాక్ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్ మాకు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్గా మారింది. (ఇదీ చదవండి: Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్ను తిరిగి ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా? అంటూ బిగ్బీ ఫన్నీగా ట్విట్ చేశారు. దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) " సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్బీ స్టయిల్లోనే మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ట్విటర్ బ్లూటిక్ పోయిందని ట్వీట్ చేశారు. T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ?? — Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023 My account says subscription will end on 17th March 2024, yet it says canceled. I have paid for a year. Why does it stand canceled @TwitterBlue ??? pic.twitter.com/1BZpOm10aY — KhushbuSundar (@khushsundar) April 21, 2023 సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్ వదిలిపెట్టలేదు. బాలీవుడ్ స్టార్లు షారూఖ్ఖాన్, సల్మాన్ఖాన్, నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో బ్లూటిక్ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్లు సమంత, అలియా భట్ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్తోపాటు పలు మీడియా సంస్థలు కూడా బ్లూటిక్ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 -
మయాంక్ అగర్వాల్ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
చెప్పిందే చేశా: డోజీ లోగోపై మస్క్ వివరణ, నెటిజన్ల మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ అనూహ్యంగా లోగోను మార్చడం పెద్ద దుమారాన్ని లేపింది. ట్విటర్కు ఇప్పటిదాకా ఉన్న బ్లూ బర్డ్ లోగోను స్థానంలో అకస్మాత్తుగా వచ్చిన ‘డోజీ ’ లోగోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు లోగో ఇలా మార్చాడో లేదో మస్క్ మద్దతున్న క్రిప్టో కరెన్సీ Dogecoin దాదాపు 30 శాతం పెరిగింది. దీంతో ట్విటర్లో నాన్స్టాప్ మీమ్స్తో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే క్లాసిక్ బర్డ్లోగోమార్చడంపై ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాగ్దానం చేసినట్టుగానే అంటూ ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడగడాన్ని మనం గమనించావచ్చు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అంతేకాదు పనిలో పనిగా ఇక ఆపండి అబ్బాయిలూ అంటూ మీడియాపై సెటైర్లు కూడా వేశాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో అయినఎలాన్ మస్క్ గత ఏడాది నవంబర్లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ను కొనుగోలు చేశాడు. కొత్త బాస్గా ట్విటర్.2లో అనేక కీలక మార్పులతో వార్తల్లో నిలిచాడు మస్క్. సీఈవో సహా ఇతర కీలక ఎగ్జిక్యూటివ్లను తొలగింపు మొదలు, ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజు దాకా ప్రతీ మార్పుతో తనదైన శైలిని చాటుకుంటున్నాడు మస్క్. జపాన్ జాతికి చెందిన ‘షిబా ఇనూ’ అనే కుక్క ఫొటోనే డోజీగా పిలుస్తుంటారు. 2013 లో మొదటి సారి డోజీకాయిన్ క్రిప్టో కరెన్సీకి డోజీని లోగోగా క్రియేట్ చే'సిన సంగతి తెలిసిందే. Twitter logo be like 💢#TwitterLogo #DOGE #Twitter #ElonMusk #Dogecoin #DogecoinToTheMoon #Memes pic.twitter.com/smS3uoeWwM — Vinny Bhardwaj (@vinnybhardwaj_) April 4, 2023 I wish the media would stop flattering me all time … it’s a bit much guys ☺️ — Elon Musk (@elonmusk) April 3, 2023 -
Viral Video: రైల్వే స్టేషన్లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరూ చూసినా ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, స్నాప్చాట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్తో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అర్థవంతమైన, ప్రజలకు అవసరమైన కంటెంట్ను అందించి ఫేమస్ అవుతుంటే మరికొందరు జనాల దృష్టిని ఆకర్షించేందకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చిచేష్టలు, అర్థంపర్థం లేని డ్యాన్స్లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి కోవకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సీమా కనోజియా అనే యువతి రైల్వే స్టేషన్లో డ్యాన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఇందులో యువతి రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఆ అబ్ లౌత్ చలే’ సినిమాలోని ‘మేరా దిల్ తేరా దీవానా’ అనే పాటకు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్లో పాటకు సంబంధం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు ఎవరిని ఆకట్టులేకపోకపోయాయి. అయినా యువతి అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా డ్యాన్స్ చేయడం కొసమెరుపు. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. యువతి బిత్తర స్టెప్పులపై నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఆమె డ్యాన్స్ను ట్రోల్చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిస్తున్న ఈమెలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికాగా సదరు యువతికి ఇన్స్టాలో 3లక్షలకు పైగా ష్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. అయితే యువతి ఇలాంటి వీడియోలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు, లోకల్ రైలు, రోడ్డు ఎలా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) -
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా..
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేద్సార్! -
ప్రధాని మోదీకి జైకొడుతున్న చైనా నెటిజన్లు.. అమెరికా మ్యాగజైన్ వెల్లడి
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. -
అసిస్టెంట్తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్..నెటిజన్స్ ఫైర్
సినిమా నటులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏదైనా మంచి చేస్తే భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే కూడా అదే స్థాయిలో ట్రోల్స్ చేస్తారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్కి వెళ్తే నడక నుంచి మాట వరకు ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ చిన్న తప్పు చేసినా నెటిజన్స్ ఆడేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్ తన అసిస్టెంట్తో చెప్పులు విప్పించుకొని వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భూమి ఫెడ్నేకర్ తాజాగా ఓ ఈవెంట్కి వెళ్లింది. అక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా స్టేజ్ ఎక్కారు. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్పై రావాలని పిలిచారు. దీంతో ఆమె చెప్పులు విప్పి అక్కడికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోయింది. దీంతో పక్కకు వచ్చి అసిస్టెంట్కి సైగ చేయగా..అతను వచ్చి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్ పైకి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. అసిస్టెంట్తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది భూమి ఫెడ్నేకర్. . మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. -
యంగ్ నటిపై దారుణమైన ట్రోల్స్.. చివరికి ఏం చేసిందంటే?
బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారీ ముద్దుల కూతురు పాలక్ తివారి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ఇన్స్టాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకున్నారు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాలక్ తివారీ తాజాగా ఇన్స్టాలో కాస్తా బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఇవీ చూసిన కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరేమో మీరు చాలా అందంగా ఉన్నారంటూ పోస్ట్ చేయగా.. మరికొందరు మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీంతో నెటిజన్స్ చేసిన పనికి పాలక్ తివారీ కొపమొచ్చింది. వెంటనే కామెంట్స్ను ఆఫ్ చేసేసింది. విషయమేమిటంటే పాలక్ తివారీ తాజాగా తన ఇన్స్టాలో కొన్ని హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరలయ్యాయి. వాటిని చూసిన కొందరు యూజర్లు అందంగా ఉన్నావంటూ పొగడగా.. మరికొందరు మాత్రం దారుణంగా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె కొంతసేపటికే కామెంట్స్ను ఆఫ్ చేసింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాగా.. బిజ్లీ బిజ్లీ మ్యూజిక్ వీడియోతో ఫేమ్ సంపాదించకుంది పాలక్ తివారీ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
ఆ వీడియో ఇలాంటి టైంలో షేర్ చేస్తారా?.. యంగ్ డైరెక్టర్పై నెటిజన్ ఫైర్!
హైదరాబాద్లో బాలుడిని వీధికుక్కలు చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనకుండా ఉండలేరు. అలాగే ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ యంగ్ డైరెక్టర్పై విమర్శలు గుప్పించారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మెుదలైంది. ఆ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం ఆ నెటిజన్కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియోను పంచుకున్నారు సాయిరాజేష్. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా. చాలా సున్నితమైన ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు.' అని ఆ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ రాజేశ్కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే సమాజంలో కనిపించకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే కొందరేమో సాయిరాజేశ్ను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ నెటిజన్కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. డైరెక్టర్ సాయి కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. For people who cannot see such things please unselect this setting instead of making noise pic.twitter.com/7bLoSaArrc — Atom (@Gautam54938900) February 21, 2023 -
కొత్త సీఈవో అంటూ మస్క్ ట్వీట్: ‘ఇక ఇదే ఆఖరు’ చెత్త ఫోటోలపై యూజర్లు ఫైర్
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్టయిలిష్గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్లో క్రేజీ లుక్స్తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విటర్లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్మస్క్ అనే హ్యాష్ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. pic.twitter.com/iZUukCVrl5 — Elon Musk (@elonmusk) February 14, 2023 -
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
'అలా అయితే సింగిల్గానే మిగిలిపోతావ్'.. హీరోపై నెటిజన్ కామెంట్ వైరల్
'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా తన అభిమానులతో ఆస్క్ కిరణ్ అబ్బవరం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు హీరో సమాధానమిచ్చారు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ నెటిజన్ ప్రశ్నకు హీరో ఆశ్చర్యానికి గురయ్యారు. 'అన్న నీ పెళ్లి ఎప్పుడు? మేసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఎప్పటికీ సింగల్గానే మిగిలిపోతావ్' అంటూ ప్రశ్నించాడు. దీనికి హీరో స్పందిస్తూ.. 'ఎంత మాట అనేశావ్ తమ్ముడు' అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత నెటిజన్ల్ అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధామిచ్చారు. Entha mata annav thammudu 😒 https://t.co/u6CEmJLX2P — Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 6, 2023 -
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ ధర వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొమ్మిది మంది ప్రయాణానికి టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు. నెటిజన్లు కూడా ఈ టిక్కెట్ని చూసి ఫిదా అవుతూ.. తెగ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..పాకిస్తాన్ నుంచి భారత్కు వెళ్లే ఓ పాత టిక్కెట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇది 1947 ఏళ్ల నాటి టిక్కెట్. అంటే దాదాపు 76 ఏళ్ల క్రితం నాటిది. ఈ టిక్కెట్ చూస్తే ఒక కుటుంబం పాకిస్తాన్లోని రావల్పిండి నుంచి అమృత్సర్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ టిక్కెట్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1947లో సుమారు తొమ్మిది మంది రావల్పండి నుంచి అమృత్సర్ వెళ్లేందుకు కొనుగోలు చేసిన టిక్కెట్ అది. ఆ టిక్కెట్ ధర సరిగ్గా 36 రూపాయాల తొమ్మిది అణాలు. బహుశా ఆ కుటుంబం భారత్కి వలస వచ్చింది కాబోలు. ఐతే నెటిజన్లను మాత్రం ఈ టిక్కెట్ బాగా ఆకర్షించింది. గతం తాలుకా జ్ఞాపకం అని "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ మెచ్చుకుంటున్నారు. అదీగాక 76 ఏళ్ల క్రితం నాటి టిక్కెట్ చెక్కు చెదరకుండా ఉండటం చాలా గ్రేట్ అంటు పొగడ్తల జల్లు కురిపించారు. మరోక నెటిజన్ తన వద్ద 1949లో కొన్న ఉషా కుట్టు మిషన్ రసీదు నా వద్ద ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెబుతున్నాడు. అంతేగాదు ఈ టిక్కెట్ ధర ఆ సమయంలో ఖరీదైనదేనదేనని, ఎందుకంటే ఆరోజుల్లో సగటే లేబర్ చార్జీలు 15 పైసలు మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఈ టిక్కెట్ ఖరీదు ప్రకారం పాక్లోని రావల్పిండి నుంచి అమృత్సర్కి ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే అత్యంత ఖరీదేనని తేల్చేశారు నెటిజన్లు. (చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!) -
‘ట్విటర్ యూజర్లకు కోపం తెప్పిస్తుంది’.. విచిత్రమైన ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్!
ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా వైరల్గా మారుతుంది. ఇటీవల ట్విటర్ని హస్తగతం చేసుకున్నప్పటి ఆ సంస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మస్క్ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ ట్విటర్ సీఈఓ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారి హల్ చల్ చేస్తోంది. ఏది బెటర్.. మస్క్ ట్వీట్ ఎలాన్ మస్క్ రూటే సెపరేటు.. ఇది ఆయన చేసే పనులను చూస్తే అర్థమవుతుంది. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్గా ఉంటారు మస్క్. అంతేందుకు కొన్న సందర్భాల్లో తను తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ట్వీట్ రూపంలో నెటిజన్లను అడుగుతుంటారు. తాజాగా ఆయన ట్విటర్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు. Instagram makes people depressed & Twitter makes people angry. Which is better? — Elon Musk (@elonmusk) January 15, 2023 అందులో "ఇన్స్టాగ్రామ్ ప్రజలను నిరాశకు గురిచేస్తుంది.. మరోవైపు, ట్విట్టర్ ప్రజలకు కోపం తెప్పిస్తుంది. ఈ రెంటిలో ఏది బెటర్ అని అడిగారు. అయితే మస్క్ ఈ రకంగా ట్వీట్ ఎందుకు చేశారో తెలియదు. కానీ దీని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇన్స్టాగ్రామ్ కంటే ట్విటర్ బెటర్ అని చెప్పేదగినవి చాలానే ఉన్నాయి. ట్విటర్లో ఎటువంటి ఫిల్టర్లు లేనందున ఇది బాగుంటుందన్నారు. ప్రజలు ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చని’ ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు ట్విటర్లో ఉన్న అల్గారిథమ్స్ను సరిచేయాలని కోరగా. .. ప్రస్తుతం ఈ విషయంలో మీరు గతం కంటె మెరుగ్గా ఫీల్ అవతారని నెటిజన్ రిప్లైకి మస్క్ స్పందించారు. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు
సాక్షి, అమరావతి: జనాదరణ పోయింది. పిలిచినా సభలకు రావటం లేదు. దీంతో ఒకరోజు ఇరుకు సందుల్లోనే సభ పెట్టబోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ సాహసానికి.. పాపం 8 మంది అమాయకులు బలైపోయారు. జనం రద్దీ బాగా కనిపించే డ్రోన్షాట్ల కోసం ఇరుకు రోడ్లోకి వాహనాన్ని పోనిచ్చి... అక్కడ చంద్రబాబు మాట్లాడబోగా, అప్పటికే ఉన్న జనం వెనక్కివెళ్లే తొందర్లో ఒకరిపై ఒకరు పడి... పాపం ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాన్ని రప్పించడానికి వారికి కానుకల ఆశ చూపించారు చంద్రబాబు. విలువైన చీర, ఇతర సరుకులు ఇస్తామని నమ్మబలికి టోకెన్లు పంచి మరీ వేల మందిని రప్పించారు. కానీ చౌకబారు చీరలతో నాసిరకం కానుకలిచ్చారు. అది కూడా టోకెన్లున్న వారందరికీ ఇవ్వకపోవటంతో అక్కడా తోపులాట తప్పలేదు. పాపం.. మరో ముగ్గురు బలైపోయారు. ఎలాగైనా తమకు జనాదరణ తగ్గలేదని చూపించడానికి చంద్రబాబు ముఠా ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా మరో దుస్సాహసానికి దిగింది. చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను ఈ ముఠా వైరల్ చేసింది. ‘కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా’ అనే నినాదాలతో విపరీతంగా జనం కనిపిస్తున్న ఆ ఫొటోలను కొన్ని ఎల్లో చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ ఫొటోలను షేర్ చేస్తూ శివాలెత్తిపోయింది. బాబును ప్రభుత్వం ఎంతలా అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారంటూ కామెంట్లు కూడా ఊదరగొట్టేశారు. కానీ నిజమేంటో తెలుసా? ఆ ఫొటోలు కుప్పంలోనివి కాదు. అసలు చంద్రబాబుకే కాదు.. ఈ రాష్ట్రానికే సంబంధం లేని ఫొటోలు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందిన సిద్ధేశ్వర స్వామి సోమవారం మరణించగా.. ఆయన అంతిమ యాత్రకు దాదాపు 2 లక్షల మంది భక్తులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. లింగాయత్ సంప్రదాయానికి చెందిన సిద్ధేశ్వర స్వామి.. దశాబ్దాల పాటు సమాజానికి విశేష సేవలు అందించి కర్ణాటక వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందటంతో జనం తండోపతండాలుగా వచ్చారు. భక్తుల్లో చాలామంది పసుపు రంగు దుస్తులు ధరించి ఉండటం.. వాహనానికి కూడా పసుపు రంగు ఉండటంతో ఇది తమకు సరిగ్గా మ్యాచ్ అవుతుందనుకున్న టీడీపీ వర్గాలు.. ఆ ఫొటోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి తమ బాబు సభకు వచ్చిన జనం అంటూ వైరల్ చేసేశాయి. ఏకి పారేసిన నెటిజన్లు.. ఆ ఫొటోల లోగుట్టును నెటిజన్లు క్షణాల్లోనే పట్టేశారు. ఆ ఫొటోలు కుప్పంలో చంద్రబాబు పర్యటనవి కావంటూ నిజాన్ని నిగ్గు తేల్చారు. చుట్టుపక్కల పరిసరాలు, ఆ ఫొటోల్లో ఉన్న ప్రజల ఆహార్యాన్ని గుర్తించిన ప్రజలే.. ఇవి ఫేక్ అంటూ ఎండగట్టే సరికి పచ్చ గ్యాంగ్కు దిమ్మ తిరిగిపోయింది. ‘బాబు మరీ ఇంత ఫేకా’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. నిజానికి 1989 నుంచీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం స్థానంలో ఇపుడు టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న తరుణంలో మూడు రోజుల పర్యటనకు గాను చంద్రబాబు బుధవారం కుప్పంలో అడుగుపెట్టారు. బాబు వస్తున్నారని వారం పది రోజులుగా ఎంత ప్రచారం చేసినా, అక్కడి ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించ లేదు. దీంతో ఫొటోల మార్ఫింగ్కు దిగారు టీడీపీ ఘనులు. అయినా జనం వచ్చేది నాయకులు చేసే మంచిని చూసి. మరి చంద్రబాబు ఏం చేశారని వస్తారు?. -
పఠాన్ డిజాస్టర్ అయ్యిందిగా..! నెటిజన్ విమర్శకు షారుక్ స్ట్రాంగ్ కౌంటర్
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్ రో' సాంగ్పై పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఇటీవల సెన్సార్ బోర్డు సైతం ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, పాటల విజువల్స్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో మార్పులు చేసి మళ్లీ యూ/ఏ సర్టిఫికెట్ కోసం రావాలని మూవీ టీంకు సూచించింది. చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్ ప్రస్తుతం పఠాన్ టీం సెన్సార్ సూచన మేరకు చిత్రంలో మార్పులు చేసే పనిలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా షారుక్ ట్విటర్ వేదికగా ఆస్క్ఎస్ఆర్కే(ASKSRK) లైవ్చాట్ నిర్వహించాడు. తాను ట్విటర్లోకి వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ షారుక్పై వ్యతిరేకత బయటపెట్టాడు. ‘ఇప్పటికే పఠాన్ డిజాస్టర్ అయింది. ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అంటూ విమర్శించాడు. ‘బెటా పెద్ద వాళ్లతో అలా మాట్లాడకూడదు’ అంటూ సదరు నెటిజన్కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు షారుక్. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం ఇక మరో నెటిజన్ దీపికా గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడగ్గా.. ‘తను చాలా స్వీట్’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ ‘సర్ మీరు కశ్మీర్కు చెందిన ముస్లిం కదా. మీ పేరు వెనుక ఖాన్ అని ఎందుకు ఉంది? అని ప్రశ్నించాడు. దీనికి షారుక్ ‘ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే. కుటుంబాన్ని బట్టి మనకు పేరు రాదు. మనం చేసే పనుల బట్టే మనకు పేరు, గౌరవం వస్తుంది. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి’ అని చెప్పాడు. కాగా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జాన్ అబ్రహం విలన్గా కనిపించనున్నాడు. Beta badhon se aise baat nahi karte!! https://t.co/G5xPYBdUCK — Shah Rukh Khan (@iamsrk) January 4, 2023 She is so nice it’s unbelievable… https://t.co/M8p3QsXtW6 — Shah Rukh Khan (@iamsrk) January 4, 2023 -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్పోర్ట్లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
Zomato: కస్టమర్లకు జొమాటో రిక్వెస్ట్
వైరల్: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్లలో.. ఆర్డర్ చేసేటప్పుడు కొందరు తమ టేస్టులకు తగ్గట్లుగా రెస్టారెంట్లకు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎక్స్ట్రా స్పైసీగా ఉండాలనో, ఉప్పు తక్కువగా ఉండాలనో లేదంటే ఇంకేదైనా సూచనను తమ అవసరాలకు అనుగుణంగా జత చేస్తుంటారు. అందుకే కస్టమర్లకు తగ్గట్లే.. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో కాలమ్స్ను పెడుతుంటాయి ఆయా యాప్లు. అయితే.. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో సర్వసాధారణంగా మారిపోయిన ఓ కుకింగ్ సూచనను దయచేసి చేయొద్దంటూ ట్వీట్ చేసింది. అదే.. ‘‘భయ్యా.. ఫుడ్ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’’ అని. దయచేసి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఈ సందేశాన్ని జత చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది జొమాటో. అయితే జొమాటో రిక్వెస్ట్గా చేసిన ఈ ట్వీట్కు నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ సూచన కాలమ్ ఎందుకని, ఏం రాయాలనే కస్టమర్లకు స్వేచ్ఛ ఉండదా?అని జొమాటోని ఏకిపడేస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కంపెనీలు సేవలు అందించాలే తప్ప.. వాళ్లకు అడ్డు చెప్పడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. guys please stop writing “bhaiya accha banana” as cooking instructions 🤦♂️ — zomato (@zomato) December 22, 2022 -
‘నేను భారత్లో ఎప్పటికీ నెం.1 కాలేను’.. ఆనంద్ మహీంద్రా రిప్లైకి నెటిజన్లు ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విటర్లో యాక్టివ్గా పలు అంశాలపై స్పందిస్తూ వాటిని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే! ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని సాధించిన సందర్భంగా తన ట్విట్టర్లో ఈ అంశంపై నవంబర్ 10న ఒక ట్వీట్ చేశారు. అందులో.. తనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితో ఓ నెటిజన్ మాత్రం మహీంద్రాను ఓ ప్రశ్న అడిగాడు. అందులో.. "భారత్లో ప్రస్తుతం అత్యంత ధనవంతుల్లో మీరు 73వ స్థానంలో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు మొదటి స్థానానికి(నెం.1) చేరుకుంటారు (ఏక్ కబ్ ఆవోగే?) అని ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “నిజం ఏమిటంటే నేను భారత్లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదని బదలిచ్చాడు. దీంతో ఇక నెటిజన్లు మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్ 25 వేల కంటే ఎక్కువ లైక్లతో పాటు, వెయ్యికి పైగా రీట్వీట్లు అందుకుంది. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 सच तो ये है कि सबसे अमीर कभी नहीं बनूँगा। क्योंकि ये कभी मेरी ख़्वाहिश ही ना थी… https://t.co/fpRrIf39Z6 — anand mahindra (@anandmahindra) December 11, 2022 చదవండి టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
రిషబ్ పంత్ పై నెటిజన్ల ఆగ్రహం
-
సుందర్ను చూసి నేర్చుకో పంత్.. ఇంకా జట్టులో అవసరమా?
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంత్.. ఇప్పుడు వన్డే సిరీస్ను నిరాశాజనక ఆట తీరుతో మొదలుపెట్టాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డేలో 23 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఫెర్గూసన్ వేసిన 33 ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన పంత్.. రెండో బంతికి మళ్లీ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఇక వన్డే సిరీస్లోనూ అదే ఆటతీరును కనబరిచిన పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి నీవు మారవా పంత్ అంటూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్బాల్ క్రికెట్కు పంత్ సరిపోడాని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. "ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్ చేసి నేర్చుకో పంత్' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ధావన్, అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఇక న్యూజిలాండ్తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. అఖరిలో వాషింగ్టన్ సుందర్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: Ind Vs NZ: శ్రేయస్ అద్భుత ఇన్నింగ్స్.. అదరగొట్టిన ధావన్, గిల్! వాషీ మెరుపులు.. సంజూ ఓకే! I am telling you again and again Rishabh Pant is Not a White Ball Cricketer. #RishabhPant #TeamIndia pic.twitter.com/ERMtvWEdpj — @iSubhashChandra🏴 82* (@PunjabKings_Fan) November 25, 2022 #SanjuSamson #JusticeForSanjuSamson #RishabhPant BCCI give 66 matches for pant just for trails bcci give to pant 200 another t20..? pic.twitter.com/jW0wq9Yxv3 — Arvind (@arvi489) November 21, 2022 -
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్లైన్కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్ఫాంలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం. ఎక్కువ రేటింగ్, పాజిటివ్ రివ్యూలు ఉన్నవాటిని మరో ఆలోచన లేకుండా ముందుకు పోతాం. అయితే జొమాటో తన ప్లాట్ఫాంలో నెగిటివ్ రివ్యూలను డిలీట్ చేసిందట. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఒక మహిళా యూజర్ ఫిర్యాదు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన దిశా సంఘ్వీ కోరమంగళలోని ఓ రెస్టారెంట్ కెళ్లి భోజనం చేశారు. అయితే ఆతర్వాత తనకు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందంటూ జొమాటోలో రివ్యూ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి అనుభవం కేవలం తన ఒక్కదానికి మాత్రమే పరిమితం కాలేదని ఆరోపించారు. తన సహోద్యోగి కూడా ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యాడని, గత కొన్ని నెలల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న అనేక మంది తన దృష్టికి వచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ రివ్యూని తొలగించడం వివాదాన్ని రేపింది. (Bharti Airtel:అదరగొట్టిన భారతి ఎయిర్టెల్) తన రివ్యూని జొమాటో తొలగించడంపై దిశా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కంపెనీ తొలగించిన తన రివ్యూ స్క్రీన్షాట్ను ట్విటర్లో ఆదివారం షేర్ చేశారు. అలాగే తన రివ్యూను తొలగిస్తూ జొమాటో అలర్ట్ ఇమెయిల్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సరైన ప్లాట్ఫారమ్ కాదని జొమాటో ఇమెయిల్లో పేర్కొంది. ప్లాట్ఫారమ్లో వచ్చిన రివ్యూ తనిఖీలో భాగంగా కంటెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గమనించామని అందుకే ఆ రివ్యూని తొలగించామని వివరణ ఇచ్చినట్టు ఇందులో ఉంది. దీంతో కొన్ని గంటల్లోనే ఆమె ట్వీట్ వైరల్గా మారింది. వేల కొద్దీ లైక్లు వందల కొద్దీ రీట్వీట్లు , కామెంట్ల వెల్లు వెత్తింది. ఇక తప్పక జొమాటో స్పందించింది. ఫోన్ నంబర్ / ఆర్డర్ ఐడీని ప్రైవేట్ మెసేజ్ ద్వారా షేర్ చేయాలని ఈ విషయాన్ని వెంటనే పరిష్కరిస్తాంటూ జొమాటో రిప్లై ఇచ్చింది. అయితే ఇంటర్నెట్ వినియోగదారులు కంపెనీ చెబుతున్నకంటెంట్ మార్గదర్శకాలపై మండిపడుతున్నారు. తమ అనుభవాన్ని షేర్ చేస్తే 'దుర్వినియోగం' అంటున్నారు. ఇక కమెంట్స్ ఆప్షన్ దేనికి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించారు."హలో జొమాటో! నేను చూడాలనుకుంటున్నది సరిగ్గా ఇలాంటి రివ్యూనే. ఆహారం యావరేజ్గా ఉంటే, అది కేవలం ప్రయత్నించి దాటవేయడం మాత్రమే. కానీ ఆ ఆహారం నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగితే, అది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన విషయం. సమాధానం చెప్పాలి అని మరొకరు రాశారు. "హే జొమాటో, అసలు మీ నిబంధనల్లోనే ఏదో తీవ్రమైన లోపం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలనే రిపోర్ట్ చేయాలి. వినియోగదారులకు అవగాహన కలగాలి. ఇది అన్యాయమైతే సదరు విక్రేతను ప్రతిస్పందించనివ్వండి" అని మరొకరు వ్యాఖ్యానించారు.వెంటనే జొమాటో లిస్టింగ్లోంచి ఆ రెస్టారెంట్ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. A recent visit to a restaurant in Koramangala, B'lore left my colleague and me with a severe case of food poisoning. I wrote a review on @zomato and while doing so, found that many people had a similar experience in the last few months. Zomato took down the review citing this👏🏻 pic.twitter.com/O3V1lbpzN9 — Disha Sanghvi (@DishaRSanghvi) October 30, 2022 its funny when @zomato doesn't take down the restaurant listing based on the health code violation or get that inspected. Instead -- they take down your listing — swati poddar (@swatipoddar) October 30, 2022 @zomato does not care of a restaurant causes frequent food poisoning. This is an anti-consumer stance . As a customer I want to know if a restaurant has minimal hygiene standards. Censoring hygiene related reviews makes Zomato’s review system meaningless. https://t.co/ZmvkymoYy9 — MooseMan (@moosemaniam) October 30, 2022 -
ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మీమ్స్, సెటైర్లతో ట్విటర్ను కొనుగోలు చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్పై దుమ్మెత్తి పోస్తున్నారు. నెలకు 20 డాలర్లు (రూ.1600కుపై మాటే) చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీని బదులు నెలకు 1600 సిప్ (సిస్టంఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒకరు మండిపడ్డారు. బ్లూటిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. (ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు) Blue Tick folks now be like “I will give it up, I never asked for it, yeh koi certificate nahi hai.” 😂 — Shiv Aroor (@ShivAroor) October 31, 2022 Now opening a SIP of Rs 1600 pm which I saved by not having a blue tick. — Gabbbar (@GabbbarSingh) October 31, 2022 I’ve got your Blue Tick right here pic.twitter.com/hlCOzOumwe — cosmic jester (@cosmicjester) October 31, 2022 కాగా బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు తరువాత సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్ చేతికి రాగానే సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కీలక ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్ సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రణాళిల్లోఉన్నట్టు పలు నివేదికలుకోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలను మస్క్ తిరస్కరించినప్పటికీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. సరికొత్తగా బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్ చేసింది. నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. -
పవన్ నోట పూటకో మాట!
మరో ఉద్యమం రాదా? ‘కేవలం రాజధాని (అమరావతి) చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఇంకో ఉద్యమం రాదా?’ – 2018లో గుంటూరు జిల్లాలో పవన్కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకీ గర్జన..? ‘విశాఖలో ఎందుకీ గర్జన? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? వలసలు ఆపలేకపోయినందుకా? రుషికొండను ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మిస్తున్నందుకా? వైఫల్యాలు దాచేసి కులాల మధ్య చిచ్చు రేపినందుకా? విద్యుత్ చార్జీలు భారీగా పెంచినందుకా?’ – తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు సాక్షి, అమరావతి: కేవలం అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశ్నలు కురిపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ గర్జన సభపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు వైరల్ అవుతున్నాయి. పవన్ మాట ఎందుకు మారుస్తున్నారంటూ పలువురు రీ ట్వీట్ చేశారు. మీపై ఏమి ప్రభావం చూపాయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. 15 నుంచి పవన్ విశాఖ పర్యటన పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 15, 16, 17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
హీరోయిన్ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్
కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్ చేసిన ఈశ్వరన్ ఆమెను నిరాశ పరిచింది. అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్లో నటి నిధి అగర్వాల్కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది. ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా నిధి అగర్వాల్ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్ బదులిస్తూ నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది. -
టాయిలెట్లో భోజనాలు
సహరన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు! సహరన్పూర్లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది. అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్ను బ్లాక్ లిస్ట్లో ఉంచింది. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. 300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది. -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్తో అనవసరమైన ఖర్చు. సింపుల్గా ఎఫెక్టివ్గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112 -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి. ‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!) పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు. -
గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
-
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్పాక్కు ఉన్నట్టుగా త్రెడ్స్ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్గా ఏడేళ్ల బాలుడు
ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం. ఇంట్లో పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదానికి గురై మంచనా పడితే ఆ బాధ వర్ణనాతీతం. కష్టాల్లో చేయందించే మానవ లోకంలో..అదే కష్టాలను చూస్తే కను చూపు తిప్పుకునే వాళ్లూ ఉన్నారు. అందుకే బడికెళ్లే ఏడేళ్ల బాలుడు డెలివరీ బాయ్గా మారాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. అమ్మా..నాన్న..ఓ అబ్బాయి. అమ్మ చిన్నా చితాకా పనులు చేస్తుంటే.. నాన్న డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే వాడు. అన్యోన్యమైన అనుబంధాలున్న ఆ పచ్చని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో..ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీనితోడు ఆర్ధిక ఇబ్బందులు. ఓ వైపు నాన్న ట్రీట్మెంట్. ఆ పసి హృదయం తల్లడిల్లింది. అయితేనేం ఆ బాలుడు కుంగిపోలేదు. నాన్న వైద్యం, పోషణ కోసం కుటుంబ బారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం స్కూల్కు వెళ్లడం, సాయంత్రం 6గంటల నుంచి 11గంటల వరకు ఫుడ్ ఆర్డర్లు అందించే జొమాటో డెలివరీ బాయ్గా మారాడు. This 7 year boy is doing his father job as his father met with an accident the boy go to school in the morning and after 6 he work as a delivery boy for @zomato we need to motivate the energy of this boy and help his father to get into feet #zomato pic.twitter.com/5KqBv6OVVG — RAHUL MITTAL (@therahulmittal) August 1, 2022 ఈ తరుణంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న రాహుల్ మిట్టల్ అనే యువకుడు ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. రాహుల్కు ఆ ఫుడ్ను అందించేందుకు సైకిల్పై ఆ బాలుడి రావడం.. అతడి గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురైతే తన తండ్రి ప్రొఫైల్ మీద డెలివరీలు అందిస్తున్నట్లు చెప్పాడు. ఆ సంభాషణను రాహుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్గా మారడంతో నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్పందించిన జొమాటో కష్టకాలంలో డెలివరీ బాయ్స్కు అండగా ఉంటామని మరోసారి నిరూపించింది జొమాటో. కొద్ది నెలల క్రితం మద్యం మత్తులో కానిస్టేబుల్ జిలే సింగ్ చేసిన తప్పిదానికి జొమాటో డెలివరీ బాయ్ సలీల్ త్రిపాఠి మరణించాడు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసిన జొమాటో అండగా నిలిచింది. ఆర్ధిక సాయం చేసింది. ఇప్పుడు చిన్న వయస్సులో కుటుంబ బారాన్ని మోస్తున్న ఏడేళ్ల బాలుడికి సాయం చేసేందుకు సిద్ధమైంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న బాలుడి వీడియోపై జొమాటో స్పందించింది. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరింది. -
Viral Video:ఆనంద్ మహీంద్రా మరో సూపర్ వీడియో, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్గా ఉంటూ ఎన్నో ఇన్నోవేటివ్ కథనాలను, వీడియోలను పంచుకునే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైంది. అందమైంది. ఈ 'ప్రిమిటివ్' మెకానికల్ డివైస్ అద్బుతంగా, అందంగా ఉంది. సస్టైనబుల్, సమర్ధవంతమైంది మాత్రమే కాదు. కదులుతున్న శిల్పంలా ఉంది అంటూ ఆయన కమెంట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. లైక్లు,కమెంట్లు వెల్లువలా వస్తున్నాయి. దీంతో వావ్.. వండర్ ఫుల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. గ్రామాల్లో పొలాల్లోని నీటిని తోడే యంత్రంలాగా, మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే దంపుడు సాధనం లాగా, పక్కనే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేసేందుకుపయోగించేలా ఉన్న ఈ టెక్నిక్ చూసి యూజర్లు ఫిదా అవుతున్నారు. ‘‘నాకు డిజైనింగ్లో పెద్దగా నైపుణ్యం లేదు.. కానీ ఇది మాత్రం సూపర్ అని చెప్పగలను సార్. బరువు, మోషన్ కంట్రోలింగ్లో చాలా నైపుణ్యం ఉంది ఇందులో. అంతేకాదు ఈ వీడియోలోని మహిళఫోకస్, ప్లో మెచ్చుకోదగింది అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. వావ్.. పొలాల్లోకి నీటిని పంప్ చేయడానికి ఉపయోగించే చాలా పురాతనమైన పద్దతి ఇది. నా బాల్యాన్ని గుర్తుచేశారు. థ్యాంక్యూ సర్. ఇది చూసినందుకు సంతోషంగా ఉందని మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది ఈ డివైస్. ఒకవైపు హైడ్రాలిక్ పవర్, మరోవైపు వాటర్ పంపింగ్.. అలాగే మహిళ ఒడ్లు లాంటివేవో దంచుతోంది. ఈ టెక్నాలజీ అదిరిపోయిందంటూ అబ్బురపడు తున్నారు. అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. यह उपकरण कुशल भी है और खूबसूरत भी। In an age where we’re surrounded by electronic gadgetry, this ‘primitive’ mechanical device is not just efficient & sustainable but also stunningly beautiful. Not just a machine but a mobile sculpture… pic.twitter.com/JzhDmYriCw — anand mahindra (@anandmahindra) July 28, 2022 -
వైరల్ వీడియో: రంగులు మార్చే పక్షిని చూశారా!
పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్ హమ్మింగ్ బర్డ్ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ పిట్టల ఈకల్లో ప్యాన్ కేక్ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్ బర్డ్ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు. The stunning colors of the Anna's hummingbird are iridescence caused by light scattering from nanoscale structures within their feathers.pic.twitter.com/BZzXuFnHag — Wonder of Science (@wonderofscience) July 21, 2022 -
Viral Video: అలియా భట్కు కవలలు? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ranbir Kapoor Says He Having Twins With Alia Bhatt: బాలీవుడ్ లవర్ బాయ్ రణ్బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్బీర్తో యాంకర్ సరదాగా ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్లో 'రెండు నిజాలు, ఒక అబద్ధం' చెప్పాల్సిందిగా రణ్బీర్ను ఆ యాంకర్ కోరారు. ఈ గేమ్లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్బీర్ కపూర్. యాంకర్ అడిగిన ప్రశ్నకు 'నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను' అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్బీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. తన భార్య అలియా భట్తో కలిసి బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్బీర్ నటిస్తున్న విషయం తెలుసు కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది. మిగతా రెండు విషయాలకొస్తే నిజంగా అలియా భట్కు ట్విన్స్ పుట్టనున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రణ్బీర్ సుధీర్ఘ విరామం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే రణ్బీర్ సినిమా కెరీర్కు రెండేళ్లు గ్యాప్ (2018లో చివరి సినిమా విడుదలైంది) వచ్చింది. దీంతో మరోసారి నిజంగా గ్యాప్ తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'అతను తండ్రి కాబోతున్నాడు. విరామం తీసుకునే అవకాశం ఉంది' అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికి అసలైన సమాధానం దొరకాలంటే అలియా భట్ డెలివరీ దాకా ఆగాల్సిందే. -
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియోకు నితిన్ 'వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ సింక్' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t — nithiin (@actor_nithiin) July 12, 2022